Flyover
-
Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్: అతి వేగం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం ప్రగలపల్లి గ్రామానికి చెందిన బంటు రాజ్కుమార్(20), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన అటికెటి సిద్దార్ధ(21) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆదివారం రాత్రి వీరు ఓయూ హాస్టల్ నుంచి బైక్పై విద్యానగర్ వెళుతుండగా అడిక్మెట్ ఫ్లైఓవర్పై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అది మా జాగా.. మేమే నిర్మిస్తాం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లలో విప్రో జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాల అంచనా వ్యయం రూ.837 కోట్లుగా చెప్పి..నాలుగో ప్యాకేజీలో భాగంగా ఈ మూడింటికీ కలిపి టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ విప్రో జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి మాత్రం టెండర్లు పిలవకుండా పెండింగ్లో ఉంచి మిగతా రెండు జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వాటి నిర్మాణ అంచనా వ్యయం రూ.650 కోట్లు. విప్రో జంక్షన్ వద్ద టెండరు పిలవకపోవడానికి కారణం ఆ మార్గంలో మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ఒకే పిల్లర్పై మెట్రో మార్గం, జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్ను డబుల్ డెక్కర్గా నిర్మించాలని భావించారు. ఆ మేరకు జరిగిన జీహెచ్ఎంసీ, రైల్వే అధికారుల సమావేశంలో డబుల్ డెక్కర్ నిర్మాణానికి రైల్వే నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. దాంతోపాటు మెట్రో మార్గం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని రైల్వేతో సమన్వయం కుదరదని జీహెచ్ఎంసీ కూడా భావించింది. అంతే కాకుండా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్లు లేకుండా సిగ్నల్ ఫ్రీగా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది. మెట్రో రైలు స్టేషన్ జంక్షన్లోనే ఉంటుంది. ఇలా వివిధ అంశాల్లో వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకొని ఆ ఫ్లై ఓవర్కు టెండర్ పిలవలేదు. అది మా జాగా.. మేమే నిర్మిస్తాంమరోవైపు, విప్రో జంక్షన్ స్థలం తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు చెందినది కావడంతో తమ స్థలంలో అవసరమైన ఫ్లై ఓవర్ను తామే నిర్మిస్తాం సదరు కార్పొరేషన్ అధికారులు జీహెచ్ఎంసీకి తెలిపినట్లు సమాచారం. దీంతో ఇక విప్రో జంక్షన్లో ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ విరమించుకుంది. మిగతా మార్గాల్లో డౌటే ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లోనూ డబుల్ డెక్కర్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జీహెచ్ఎంసీ కొత్తగా నిర్మించబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రో రైలు మార్గాలున్నట్లయితే ఫ్లై ఓవర్ల పై వరుసలో మెట్రో రైలు మార్గానికి అనుగుణంగా పిల్లర్లు నిరి్మంచాలని భావించారు. ఎత్తయిన పిల్లర్లు నిర్మించి డబుల్ డెక్కర్గా రెండు నిర్మాణాలు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే విప్రో జంక్షన్ వద్ద కూడా సిద్ధమైనప్పటికీ, ప్రభుత్వశాఖలు వేటికవిగా అందుకు విభేదించడంతో జీహెచ్ఎంసీ విరమించుకుంది. మియాపూర్ –పటాన్న్చెరు మార్గంలో ఆలి్వ¯Œన్ క్రాస్రోడ్, మదీనగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్,ఇక్రిశాట్ల మార్గాల్లో, నాగోల్– ఎయిర్పోర్ట్ మార్గంలో ఎల్బీనగర్, కర్మ¯న్Œ ఘాట్, ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో మెట్రో రైలు రానుంది. ఆ మార్గాల్లో జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చేచోట డబుల్డెక్కర్లుగా డబుల్ డెక్కర్లు నిరి్మంచేందుకు ఆలోచనలు చేసినప్పటికీ, తాజా పరిస్థితులతో డైలమాలో పడ్డాయి. ⇒ నాగోల్– ఎయిర్పోర్టు మార్గంలో మెట్రో మార్గంలో జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లు వచ్చే ప్రాంతాలు ⇒ టీకేఆర్ కాలేజ్,గాయత్రినగర్, మందమల్లమ్మ జంక్షన్లు ⇒ ఒమర్ హోటల్– సోయబ్హోటల్ (వయా మెట్రో ఫంక్షన్హాల్) ⇒ బండ్లగూడ– ఎరక్రుంట క్రాస్రోడ్స్ ⇒ మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్. ⇒ మియాపూర్ క్రాస్రోడ్– ఆలి్వన్ క్రాస్రోడ్ మార్గంలో మదీనగూడ గంగారం వద్ద. -
హైదరాబాద్ సిటీలో మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పనుల్లో భాగంగా రెండు జంక్షన్ల వద్ద నాలుగు ఫ్లై ఓవర్లు.. రెండు అండర్పాస్లు.. రెండు రహదారుల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం జీహెచ్ఎంసీ (GHMC) జాతీయ స్థాయి టెండర్లను పిలిచింది. ఈ పనుల నిర్మాణ వ్యయం దాదాపు రూ. 650 కోట్లు. టెండర్ల దాఖలుకు చివరి తేదీ వచ్చే నెల 9. గ్రేటర్ నగరంలో సిగ్నల్ ఫ్రీ (Signal Free) ప్రయాణం కోసం ఇప్పటికే ఎన్నో ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు (Underpass) తదితర వసతులు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మించేందుకు సిద్ధమైన ప్రభుత్వం దాదాపు రూ.2,400 కోట్ల మేర పనులు చేపట్టాల్సిందిగా ఇటీవల జీహెచ్ఎంసీని ఆదేశించింది.అందుకనుగుణంగా ఇప్పటికే కేబీఆర్ పార్కు (KBR Park) పరిసరాల్లో కొన్ని స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, ఫాక్స్ సాగర్ నాలా వద్ద ఫ్లై ఓవర్ పనులకు టెండర్లు ఆహ్వానించిన జీహెచ్ఎంసీ.. తాజాగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ల వద్ద మరికొన్ని ఫ్లై ఓవర్లు, అండర్పాస్లకు టెండర్లు ఆహ్వానించింది. వీటితో పాటు సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు 215 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ, అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్ రోడ్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులకు టెండర్లు పిలిచింది. జీహెచ్ఎంసీ నుంచి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ పనుల్ని రెండేళ్లలో పూర్తి చేయాల్సిందిగా టెండరు నిబంధనల్లో పేర్కొంది. పనులు పూర్తయ్యాక రెండేళ్లపాటు అవసరాన్ని బట్టి మరమ్మతులు వంటివి చేయాల్సి ఉంటుంది. తాజాగా టెండర్లు పిలిచిన పనులు ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద.. → ఐఎస్బీ నుంచి డీఎల్ఎఫ్ రోడ్ వరకు రెండు వైపులా ప్రయాణానికి మొదటి వరుస ఫ్లై ఓవర్. నాలుగు లేన్లు. క్యారేజ్ వే వెడల్పు 7.5 మీటర్లు. → ఐఎస్బీ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు రెండో వరుసలో మరో ఫ్లై ఓవర్. మూడు లేన్లుగా ప్రయాణం. క్యారేజ్వే వెడల్పు 11 మీటర్లు. → డీఎల్ఎఫ్ నుంచి బీహెచ్ఈఎల్ రోడ్ వైపు వెళ్లేందుకు రెండో వరుసలో మూడు లేన్ల ఫ్లై ఓవర్. క్యారేజ్వే వెడల్పు 11 మీటర్లు. → గచ్చిబౌలి నుంచి బీహెచ్ఈఎల్ వరకు రెండు వైపులా ప్రయాణానికి ఆరు లేన్లతో అండర్ పాస్. 11 మీటర్ల క్యారేజ్వే. వరద నీరు పోయే మార్గాలతో పాటు 2 లక్షల నీటి సామర్థ్యంతో సంప్ నిర్మాణం. ఖాజాగూడ జంక్షన్ వద్ద.. → నానక్రామ్గూడ – టోలిచౌకి రోడ్ వరకు మూడు లేన్లతో ఫ్లై ఓవర్. క్యారేజ్వే 9.5 మీటర్లు. → టోలిచౌకి రోడ్– బయోడైవర్సిటీ వరకు మూడు లేన్లతో అండర్పాస్. క్యారేజ్వే 11 మీటర్లు. రెండు వైపులా ఫుట్పాత్లతో పాటు వాటి కింద డక్ట్ నిర్మాణం. వరదనీరు పోయే మార్గాలతో పాటు సంప్ నిర్మాణం. → ఈ పనులతో పాటు ఆయా జంక్షన్ల వద్ద రోడ్ల పునరుద్ధరణ, ఫుట్పాత్లు, లైటింగ్, ఇతరత్రా సదుపాయాలతో ఆధునికీకరణ. సైబరాబాద్ సీపీ కార్యాలయం – గచ్చిబౌలి జంక్షన్ వరకు, అంజయ్యనగర్ –రాంకీ టవర్ రోడ్ వరకు రోడ్లను వెడల్పు చేసి సాఫీగా ప్రయాణం సాగేలా ఆధునికీకరించాలి. ఇదివరకే టెండర్లు పిలిచిన పనులుప్యాకేజీ – 1 కింద రూ. 580 కోట్ల అంచనా వ్యయంతో.. → జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ వద్ద అండర్పాస్. → జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ వరకు మొదటి వరుస ఫ్లై ఓవర్. → యూసుఫ్గూడ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 వరకు రెండో వరుస ఫ్లై ఓవర్. → కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్ వద్ద జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ వరకు అండర్పాస్. → బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్ వరకు ఫ్లై ఓవర్. → ముగ్ధ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రన్స్ రోడ్ నుంచి పంజగుట్ట రోడ్ వరకు అండర్పాస్. ప్యాకేజీ–2 కింద.. రూ. 510 కోట్ల అంచనా వ్యయంతో.. → రోడ్ నంబర్–45 జంక్షన్ వద్ద ఫిల్మ్నగర్ రోడ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్ వరకు అండర్పాస్. → జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 వరకు ఫ్లై ఓవర్. → ఫిల్మ్నగర్ జంక్షన్ వద్ద మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వరకు అండర్పాస్. → ఫిల్మ్నగర్ రోడ్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు ఫ్లై ఓవర్. → మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద కేన్సర్ హాస్పిటల్ రోడ్ నుంచి ఫిల్మ్నగర్ రోడ్ వరకు అండర్పాస్. → ఫిల్మ్నగర్ రోడ్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వరకు ఫ్లై ఓవర్. → కేన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు అండర్పాస్. → మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వరకు ఫ్లై ఓవర్.→ ఆయా ఫ్లై ఓవర్ల నిర్మాణాలు పూర్తయితే కోర్ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పశ్చిమం వైపు.. ఐటీ కారిడార్లకు రాకపోకలు చేసేవారికి సమయం, వ్యయ ప్రయాసలు తప్పుతాయని అధికారులు పేర్కొన్నారు. -
Amberpet flyover: ట్రాఫిక్ కష్టాలు తీరాయ్!
హైదరాబాద్: అంబర్పేట ఫ్లైఓవర్(Amberpet flyoverAmberpet flyover) బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడింది. ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ట్రాఫిక్ కష్టాలు చెక్ పెట్టినట్టయింది. ఏడేళ్ల క్రితం వరంగల్ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించడంతో నిత్యం వేలాది వాహనదారులు అంబర్పేట మీదుగా వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాల వారు చాదర్ఘట్ వెళ్లడానికి అంబర్పేట శ్రీరమణ చౌరస్తా మీదుగా వాహనాలను మళ్లించుకుని అలీకేఫ్, గోల్నాక కొత్త బ్రిడ్జి మీదుగా కాచిగూడ కబేళా, చాదర్ఘాట్కు చేరుకునే వారు. ట్రాఫిక్ కష్టాలతో పాటు అరగంట సమయం వృథా అయ్యేది. అలాగే దిల్సుక్నగర్ నుంచి ఛే నంబర్ చౌరస్తా మీదుగా శివం, నల్లకుంట వారు వెళ్లే వారు సైతం గోల్నాక మీదుగా చిన్న చిన్న గల్లీల్లో నుంచి అతికష్టం మీద చేరుకోవాల్సి వచ్చేది. చాదర్ఘాట్ నుంచి ఉప్పల్ వెళ్లే వారు నల్లకుంట శంకర్మఠం, విద్యానగర్, తార్నాక మీదుగా వెళ్లాల్సివచ్చేది. కాగా.. అంబర్పేట ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో వేలాది వాహనదారులు ఎంతో ఉపశమనం పొందారు. బుధవారం ఉదయం నుంచి వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించారు. ఇక కింద పనుల్లో వేగం.. ఫ్లైఓవర్ పై నుంచి వాహనాలను అనుమతించడంతో కింద ట్రాఫిక్ తగ్గింది. దీంతో ఫ్లైఓవర్సర్వీసు పెండింగ్ పనుల్లో వేగం పెంచేందుకు అవకాశం ఉంది. రెండు వైపులా సరీ్వసు రోడ్డు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. అలాగే కొన్ని సున్నిత అంశాలు సైతం ముడిపడి ఉండడంతో సర్వీసు రోడ్డు సమస్యగా మారింది. ఇకపై కింద నుంచి వాహనాల రద్దీ తగ్గడంతో జరుగుతున్న పనుల్లో వేగం పెరిగే ఆవకాశం ఉంది. -
ముస్తాబు అయిన హైదరాబాద్ (ఫొటోలు)
-
ఆర్టిస్టిక్ .. ప్రేమ్..ఫ్రేమ్..
నగర రహదారుల్లోని గోడలు, అండర్ పాస్ వంతెనలు, ఫ్లై ఓవర్లు అద్భుతమైన చిత్రాలకు వేదికగా నిలుస్తున్నాయి. వాహన చోదకులు, పాదచారులు, అటుగా వెళ్లే ప్రయాణికులను ఈ గోడ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. సుమారు రెండు లక్షల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో పలు చిత్రాలకు ప్రాణం పోసిన యువ కళాకారుడు ప్రేమ్ ఇస్రమ్ ఫ్రేమ్స్ నగరానికి కొత్త సొబగులు అద్దుతున్నాయి. ములుగు జిల్లా గిరిజన తాండా నేపథ్యంలో ఈ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి చిత్రాలు నలుగురికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. రంగు రంగుల చిత్రాలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భాగ్యనగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు ఫైన్ ఆర్ట్స్ కళాకారులు గోడలపై తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీని కోసం దాదాపు 149 కోట్ల నిధులతో రోడ్లు, కూడళ్లు, వీధులను ప్రత్యేకంగా, అత్యంత సుందరంగా మారుస్తున్నారు. నగరానికి తలమానికమైన హైటెక్ సిటీ, కొండాపూర్, ఇతర ప్రధాన రహదారులు అందమైన పెయింటింగ్స్తో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి జోన్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లు, స్ట్రీట్ ఆర్ట్లో ఓ యువకుడి కళాత్మకత కృషి దాగి ఉంది. మాసబ్ ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్యూ వేదికగా ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన ప్రేమ్ ఇస్రమ్ (27) కొన్ని ఫ్లై ఓవర్లకు అత్యాధునిక టెక్నాలజీని ప్రతిబింబించే రంగుల చిత్రాలతో హంగులను అద్దాడు.నాలుగు ఫ్లై ఓవర్లు.. హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి మార్గంలోని ఫ్లై ఓవర్పై సాఫ్ట్వేర్ టెక్నాలజీ, అధునాతన సాంకేతికత, ఈ తరం అధునాతన ఆలోచనలు ప్రతిబింబించే చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. దీనికి సమీపంలోని అయ్యప్ప సొసైటీ – 100 ఫీట్ రోడ్ అండర్ పాస్లో ‘బజార్స్ ఆఫ్ హైదరాబాద్’ థీమ్తో వేసిన పెయింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటన్నింటినీ తన బృందం (15 నుంచి 20 మంది)తో పూర్తి చేశానని, వీరందరూ కూడా తనతో చదువుకున్న జూనియర్స్, ఆర్ట్ ఫ్రెండ్స్ అని ప్రేమ్ తెలిపారు. ఒక ఫ్లై ఓవర్పూర్తి చేయడమే కష్టతరమైన నేపథ్యంలో దాదాపు 2 లక్షల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో నాలుగు ఫ్లై ఓవర్లు కళాత్మకంగా సుందరీకరించానని పేర్కొన్నాడు. కొత్తగూడ అండర్పాస్లో ఇండియన్ ఆర్మీ లైఫ్స్టోరీని, అదే ప్రాంతంలోని ఫ్లై ఓవర్పై అడ్వెంచర్, ట్రావెలింగ్కు సంబంధించిన పెయింటింగ్స్ వేశానని వివరించారు.హాబీగా మొదలై.. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని నార్లపూర్ అనే మారుమూల గ్రామం మాది. చిన్నప్పుడు ఆర్ట్ పై పెరిగిన మక్కువ ఈ ప్రయాణానికి కారణం. చిన్నతనంలో సమీపంలోని రోడ్లపై చాక్పీస్తో పెద్ద పెద్ద బొమ్మలు వేసి సంతోషపడే వాడిని. అదే హాబీగా మారి నగరాన్ని అందంగా మార్చే స్థాయికి రావడం ఆనందంగా ఉంది. సాధారణంగా ఆయిల్ పెయింటింగ్ పోట్రేట్స్ వేయడంలో అనుభవజు్ఞడిని.. గతంలో నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా చారిత్రాత్మక అంశాలతో స్ట్రీట్ ఆర్ట్ వేశాను. నగరంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో నా మూలాలైన ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై వేసిన పెయింటింగ్స్తో ‘వేరియస్ ఇంప్రెషన్స్’ అనే ప్రత్యేక ప్రదర్శన చేశాను. – ప్రేమ్ ఇస్రమ్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి -
కారులో షార్ట్ సర్క్యూట్: Uppal
-
రసూల్పురా ఫ్లై ఓవర్ డిజైన్.. మారున్..
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పథకం కింద ఫ్లై ఓవర్లు, రహదారులు తదితర పనులకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లకు పైగా పరిపాలన అనుమతులు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే రూపొందించిన డిజైన్లను మార్చాలని భావిస్తున్నారు. అలా.. ఆల్విన్ జంక్షన్, జేఎన్టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పునకు ఇప్పటికే కన్సల్టెంట్లను ఆహా్వనించిన అధికారులు తాజాగా రసూల్పురా ఫ్లై ఓవర్/అండర్పాస్ డిజైన్లను కూడా మార్చేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యామ్నాయ డిజైన్ అవసరం.. మెట్రో రెండోదశ దృష్టిలో ఉంచుకొని ఆల్విన్, జేఎన్టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పుకు సిద్ధమైన అధికారులు బేగంపేట సమీపంలోని రసూల్పురా ఫ్లై ఓవర్ /అండర్పాస్ నిర్మాణానికి డిఫెన్స్ భూములు సేకరించాల్సి ఉందన్నారు. ఎక్కువ భూ ములు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు సుముఖంగా లేకపోవడంతో భూసేకరణ వీలైనంత తగ్గించేందుకు కొత్త డిజైన్ల కోసం కన్సల్టెంట్లను ఆహా్వనించినట్లు పేర్కొన్నారు. ఈ టెండరు పొందే కన్సల్టెంట్స్ ఇప్పటికే ఉన్న డిజైన్ను పరిశీలించి, ప్రత్యా మ్నాయ డిజైన్ను రూపొందించాల్సి ఉంటుంది. రూ.105 కోట్లు మంజూరు.. ⇒ ఈ ఫ్లై ఓవర్/అండర్పాస్ పనులకు ప్రభుత్వం రూ. 105 కోట్లు మంజూరు చేయడంతో పని ప్రారంభించేందుకు పరిస్థితుల్ని అధ్యయనం చేసిన అధికారులు ప్రత్నామ్నాయ డిజైన్తో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ రిపోర్ట్ కోసం (పీపీఆర్) కన్సల్టెంట్లను ఆహా్వనించారు. తక్కువ భూసేకరణతో పాటు ప్రజల భద్రత, సేవల పెంపుదల కొత్త డిజైన్ ప్రధాన లక్ష్యం. సేకరించాల్సిన ఆస్తుల సరిహద్దులతోపాటు యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి అంశాలను కూడా బేరీజు వేసి, ఉన్న డిజైన్ కంటే మెరుగైన డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది. ⇒ సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, మెట్రో రైలు, బీఆర్టీఎస్, సీటీఎస్ మాస్టర్ప్లాన్లను కూడా దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ప్రాజెక్టు వ్యయం తగ్గేందుకు కూడా తగిన మార్గాలుంటే సూచించాలి. ఇంకా, మేజర్ జంక్షన్లు, బాటిల్నెక్స్, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికల వంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. రాబోయే ఇరవయ్యేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ఫ్రీగా ప్రయాణం సజావుగా సాగేందుకు శాశ్వత పరిష్కారంగా కొత్త డిజైన్ ప్లాన్ ఉండాలి. -
హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్
-
December 31: ఫ్లైఓవర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈసారి కొత్త సంవత్సరాన్ని శాంతి భద్రతల నడుమ జరపాలని తగిన భద్రతా చర్యలు చేపడుతున్నారు. బైక్ రేసులు, అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉండటంతో నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలకు ఫ్లై ఓవర్ల మీదకు అనుమతి ఉండదు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రం తగిన ఆధారాలు చూపిస్తే పీవీఎన్ఆర్ ఫ్లై ఓవర్ మీదికి అనుమతి ఇస్తారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని రాచకొండ కమిషనర్ సు«దీర్ బాబు సూచించారు. ఔట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజేలకు అనుమతి లేదన్నారు. ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని, ఈవెంట్లలోకి పరిమితికి మించి ప్రేక్షకులను అనుమతించకూడదని ఆయన పేర్కొన్నారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి షీ టీమ్ బృందాలు విధుల్లో ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తనిఖీలు చేస్తామని చెప్పారు. నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు. నిర్దేశిత సమయంలోపే మూసేయాలి.. ⇒పబ్లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయం లోపు మూసి వేయాలని, మైనర్ యువతకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని సుధీర్ బాబు హెచ్చరించారు. వాహనాల పార్కింగ్కు సరైన ఏర్పాట్లు చేయాలన్నారు. నగర శివార్లలోని ఫాంహౌస్లలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు నిబంధనలకు లోబడి ఉండాలని, ఎటువంటి డ్రగ్స్ వినియోగం జరగకూడదని, మహిళలతో అసభ్యకర డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
జూబ్లీహిల్స్ రోడ్నెం. 45లో బెంగాల్ టైగర్ చూసారా..? (ఫొటోలు)
-
కుంచె గీసిన చిత్రం..
నగరంలోని పలు కూడళ్లు రంగులద్దుకుంటున్నాయి. విభిన్న కళాకృతులతో ఫ్లై ఓవర్ పిల్లర్లు, అండర్ పాస్ గోడలు కలర్ ఫుల్ పెయింటింగ్స్తో కళకళలాడుతున్నాయి. ఒక్కో సెంటర్కు ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత రెండు నెలలుగా కళాకారులు తమ ప్రతిభతో ఎంతో అందమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు. ఆ దారిన పోయే ప్రయాణికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడయాడినట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో కళాకారులతో పాటు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి వరకూ.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ.. హైటెక్ సిటీ నుంచి ఉప్పల్ సచివాలయం వరకూ.. ఇలా ఎటు చూసినా వంతెనల పిల్లలర్ల మీద, వంతెనల గోడలపైనా ఇటీవల కాలంలో కొత్త సొబగులద్దుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత వాల్ పెయింటింగ్స్తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణలోకి దిగారు. ప్రతి ఫ్లై ఓవర్ వంతెన, అండర్ పాస్ గోడలు, పిల్లర్లకు అందమైన ఆకృతుల్లో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఒక్కో సెంటర్లో ఒక్కో రకమైన థీమ్తో చిత్రాలు వేస్తున్నారు. ఎల్బీ నగర్ కూడలిలో వంతెన పిల్లర్లకు ఓ వైపు సంప్రదాయ నృత్యాలు, మైరో వైపు పాప్ డ్యాన్సర్స్ చిత్రాలు తీర్చిదిద్దారు. ఫ్లెక్సీ ప్రింటింగ్తో ముప్పు..ఒకప్పుడు ఆర్టిస్టులకు చేతినిండా పని ఉండేది. దీంతో బ్యానర్లపై రాతలు రాయడం, గోడలపై చిత్రాలు వేయడం, రాజకీయ, సినీ ప్రముఖుల కటౌట్లను సిద్ధం చేయడం, వివిధ సందర్భాల్లో ఆరి్టస్టులకు చేతినిండా పని దొరికేది. దీంతో గతంలో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చు, వేగంగా పని పూర్తవుతుండడంతో పలువురు దీనిపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెయింటింగ్ ఆరి్టస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, ఉపాధి మార్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.36 ఏళ్లుగా ఇదే వృత్తి..1988లో ఆరి్టస్టుగా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రభుత్వం వాల్ పెయింటింగ్స్కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కళాకారులకు పని దొరుకుతుంది. రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకమైన పెయింటింగ్స్ వేయాలని సూచిస్తే వాటినే చిత్రిస్తున్నాం. ఈ పని ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. పదేళ్ల క్రితం వరకూ చేతినిండా పని ఉండేది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చిన తరువాత నెలలో కొన్ని రోజులు పనిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – అశోక్, కళాకారుడు, హయత్నగర్ఆరు నెలలు పని కలి్పంచాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించినట్లు సంవత్సరంలో కళాకారులకు కనీసం ఆరు నెలలు పనికల్పించే విధంగా చట్టం చేయాలి. ఒకప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే సమాజంలో డిమాండ్ ఉండేది. ఫ్లెక్సీలు వచ్చాక క్రమంగా పని తగ్గుతోంది. పదో తరగతి చదివి ఆరి్టస్టుగా స్థిరపడ్డాను. ఇప్పుడు నెలలో 20 రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే కళాకారులను ఆదుకుని జీవనోపాధి చూపించాలి. – సత్యం, కళాకారుడు, హయత్నగర్ -
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్.. విశేషాలివే
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులన్నీ ఈ నెల 30 వరకు పూర్తి చేసి డిసెంబర్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. ఆరాంఘర్, శాస్త్రీపురం, కాలాపత్తర్, దారుల్ ఉల్ ఉలూం, శివరాంపల్లి, హసన్నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. బెంగళూర్ జాతీయ రహదారితో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వారికి సౌకర్యంగా మారనుంది. ఇప్పటి వరకు బాటిల్ నెక్ రోడ్డుతో ఇబ్బందులకు గురైన స్థానిక బస్తీల ప్రజలతో పాటు దూర ప్రాంతాల వారికి ఈ ఫ్లై ఓవర్ ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఎస్ఆర్డీపీ కింద.. నగరంలో ఇప్పటి వరకు 2– 7 కిలో మీటర్ల పొడవుతో షేక్పేట్ ఫ్లై ఓవర్ను నిర్మించారు. 4.04 కిలో మీటర్ల అతి పెద్ద ఫ్లైఓవర్ పాతబస్తీలో నిర్మాణమైంది. వచ్చే నెల మొదటి వారంలో వాహనదారులకు దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ కమిషనర్ కె.ఇలంబర్తితో పాటు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఈ నెల 26న ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. చదవండి: కాలిపోయిన కలల సౌధం.. రెండు రోజుల క్రితమే గృహప్రవేశం.. అంతలోనే ఇలాసర్వీస్ రోడ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంకా 17 కట్టడాలను తొలగించాల్సి ఉందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్ఈ దత్తు పంతు తదితరులు కమిషనర్కు వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నను కమిషనర్ ఆదేశించారు. 2023 మార్చి నాటికే పూర్తి కావాల్సింది.. జూ పార్కు నుంచి ఆరాంఘర్ వరకు రూ.736 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) కింద దాదాపు 4.04 కిలో మీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. 2021లో పనులు చేపట్టారు. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉండగా.. నత్తనడకన సాగడంతో ఈ ఏడాది నవంబర్ వరకూ కొనసాగాయి. ఇంకా 2 డౌన్ ర్యాంపులతో పాటు 2 అప్ ర్యాంపులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో మొత్తం 163 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకోవడానికి రూ.336 కోట్లు ఖర్చు చేయగా.. మిగిలిన నిధులతో ఆరు లేన్ల మేర ఫ్లైఓవర్ను నిర్మించారు. -
KBR Park Flyovers: స్పీడ్ పెరిగింది..
బంజారాహిల్స్: ట్రాఫిక్ కష్టాలు లేకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్సిటీ, గచ్చిబౌలి వైపు రయ్ రయ్మంటూ వాహనాలు దూసుకెళ్లేందుకే ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిరి్మంచేందుకు పచ్చజెండా ఊపిని విషయం విదితమే. ఇప్పటికే ఎక్కడెక్కడ అండర్పాస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు అనే విషయాలపై ప్రాజెక్టŠస్ అధికారులు భారీ మ్యాప్లు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఆ మ్యాప్ల ఆధారంగా ఇప్పుడు జలమండలి, అర్బన్ బయో డైవర్సిటీ, జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు చేస్తున్నారు. జలమండలి, యూబీడీ అధికారులు సర్వే పూర్తయిన తర్వాత పనులు ఎప్పుడు మొదలవుతాయనే విషయంలో ఓ క్లారిటీ రానుంది. ఇక్కడ ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలకు పుల్స్టాప్ పెట్టినట్లు అవుతుంది. ఆరు జంక్షన్లలో పైప్లైన్లపై... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 మీదుగా సాగే ఈ అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు నిరి్మంచే ప్రాంతాల్లో ఇప్పటికే భారీ మంచినీటి పైప్లైన్లతో పాటు మరికొన్ని చోట్ల సీవరేజి లైన్లు ఉన్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ వచ్చే ఆరు జంక్షన్లలో ఎక్కడెక్కడ ఏఏ లైన్లు ఉన్నాయో వాటిని సర్వే చేసే పనిలో జలమండలి జీఎం హరి శంకర్ ఆయా సెక్షన్ల మేనేజర్లు, ఇంజనీర్లతో సమీక్షిస్తున్నారు. ఈ జంక్షన్ల ప్రాంతంలో 1200, 1000, 900 ఎంఎం ఎంఎస్ వ్యాసార్థంలో భారీ మంచినీటి పైప్లైన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని ఆయా జంక్షన్ల నుంచి పక్కకు తప్పించేందుకు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి తోడు వెంకటగిరి నుంచి తట్టికాన వాటర్ సెక్షన్కు నీళ్లు పంపింగ్ చేసే భారీ పైప్లైన్ వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. మ్యాప్ల ఆధారంగా ఇక్కడున్న మంచినీటి భారీ లైన్లు ఏ విధంగా ఎటు వైపు మారిస్తే బాగుంటుంది అనే అంశంపై ఇప్పటికే అధికారులు పలుమార్లు క్షేత్ర స్థాయిలో సైతం పర్యటించి నివేదికలను ఉన్నతాధికారులకు అందించారు. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్సిగ్నల్ వస్తే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. -
ఫ్లైఓవర్పై వోల్వో బస్సు బీభత్సం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఫ్లైఓవర్పై మంగళవారం(ఆగస్టు13)వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. వోల్వో బస్సు అదుపుతప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వోల్వో బస్సు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం?
ప్రత్యక్ష నరకం మీరెప్పుడైనా చవిచూశారా? అయితే.. ఉప్పల్– నారపల్లి రహదారిలో ప్రయాణించండి నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆరేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు తిప్పలు పడుతూనే ఉన్నారు. వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్– నారపల్లి మధ్య 6.2 కిలో మీటర్ల మేర చేపట్టిన కారిడార్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిత్యం నరకాన్ని అనుభవించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుమ్మూ ధూళి.. బురద.. కంకర తేలి గుంతలు ఏర్పడి.. వానొస్తే రోడ్డుపై కుంటలను తలపిస్తున్నాయి. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుర్గతి పట్టింది. ఆరేళ్లుగా ఈ దురావస్థతోనే ప్రజలు కాలం వెళ్లబుచ్చుతుండటం శాపంలా పరిణమించింది. ఎంతటి దయనీయ పరిస్థితి దాపురించిందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ బాధితులు. ఇప్పటికైనా ఏళ్లుగా పడుతున్న నరకం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకొంటున్నారు. ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలో మీటర్ల మేర 148 పిల్లర్లతో ఫ్లై ఓవర్ పనులకు అప్పటి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.625 కోట్లు. 2018 జులైలో ప్రారంభమైన పనులు 2020 జూన్లో పూర్తి కావాలి. కానీ.. పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 6.2 కి.మీ మేర రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రహదారిలో నిమిషానికి దాదాపు 960 నుంచి 1000 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉప్పల్ కూడా ఒకటి. దీంతో రోడ్డు సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలున్నాయి. అభివృద్ధి శరవేగం.. ఇటు అధ్వానం..ఉప్పల్ నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వర్తక, వాణిజ్య దుకాణాలు రోడ్డు వెడల్పు పనులతో తీవ్రంగా నష్టపోయాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా 450 షాపులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంతో రోడ్డు సరిగా లేని కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల జాబితాల్లో ఉప్పల్ మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు మెట్రో రైలు.. మినీ శిల్పారామం, స్కైవాక్ వంతెన, ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఇలా ఎటు చూసినా అన్నివిధాలా ఉప్పల్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో జాప్యంతో ఇక్కడి ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు ఆరేళ్లుగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి అనేక అడ్డంకులు రావడంతో పనులు నిలిచి పోయాయి. దీంతో ఇక్కడి ప్రజలకు ఎదురు చూపులే మిగిలాయి. కాంట్రాక్టు రద్దు చేశారా? ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కాంట్రాక్టును గాయత్రీ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకున్న విషయం విదితమే. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం కారణంగా సదరు సంస్థ గడువులోగా పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించింది. మరో సంస్థకు మిగిలిన పనులను అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.బిజినెస్ నిల్.. వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ మార్గంలో స్టేషనరీ, వస్త్ర, వాణిజ్య షాపులు, పూజా సామగ్రి, కిరాణా, ఆటోమొబైల్, ఫర్నిచర్, స్వీట్ దుకాణాలు, హోటళ్లు తదితర అనేక వ్యాపారాలు మనుగడ పొందుతున్నాయి. కాగా.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా దుమ్మూ ధూళితో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. రోడ్లు వేయక పోవడం, విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచక పోవడంతో వందలాది మంది వ్యాపారులు అవస్థలు పడుతున్నట్లు వర్తక సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరేళ్లుగా వ్యాపారాలు నిల్.. కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్లు లేక దుమ్ము కొట్టుకుపోవడంతో గిరాకీ లేక అవస్థలు పడుతున్నాం. 90 శాతం గిరాకులు దెబ్బతిన్నాయి. వ్యాపారులమంతా తీవ్రంగా నష్టపోయాం. – శేఖర్ సింగ్, ఉప్పల్ వర్తక సంఘం ప్రతినిధి రోడ్డుపైకి రావాలంటే సాహసం చేయాల్సిందే.. ఉప్పల్ రోడ్డు మీదకు రావాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. ఏళ్లుగా పాడైపోయిన రోడ్ల మీద వాహనం నడిపి ఆరోగ్యం పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. స్కూల్ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – శ్రీనివాస్ గౌడ్, స్కూల్ కరస్పాండెంట్గత ప్రభుత్వ అశ్రద్ధతోనే.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్లనే రోడ్డు ఎటూ కాకుండా పోయింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. కాని పారీ్టలను దృష్టిలో పెట్టుకుని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలి. – మేకల శివారెడ్డి, ఉప్పల్ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ -
ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలు
ఖైరతాబాద్: స్నేహితుడిని సొంత ఊరిలో వదిలిపెట్టి సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్కు ద్విచక్ర వాహనాలపై వస్తుండగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్పైకి రాగానే ముందు ఉన్న యాక్టీవా డివైడర్కు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్పేటలో నివాసముండే సోఫియాన్ అహ్మద్(20), మహ్మద్ సమీ, సయ్యద్ సైఫ్ ముగ్గురు యాక్టివా వాహనంపై, మరో ద్విచక్రవాహనంపై సయ్యద్ నుమాన్, మహ్మద్ అహ్మద్ అలీ, మూడో వాహనంపై మహ్మద్ తాహెర్ అలీ, ఆదిల్ కలిసి సోమవారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో మెదక్లో ఉండే ఆదిల్ను దింపడానికి వెళ్లారు. అతడిని అక్కడ దింపి అక్కడే సరదాగా గడిపి తిరిగి రాత్రి 10.30 గంటలకు నగరానికి బయల్దేరారు. అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో వీరి ముగ్గురి ద్విచక్రవాహనాలు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ మధ్యలోకి రాగానే సోఫియాన్ అహ్మద్ నడుపుతున్న యాక్టీవా ఢివైడర్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో డివైడర్ మధ్యలో ఉన్న పూలకుండీ బలంగా సోఫియాన్ అహ్మద్కు తగిలింది. యాక్టివాపై ఉన్న ముగ్గురు కిందపడిపోయారు. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోఫియాన్ అహ్మద్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన సోఫియాన్ అహ్మద్ పాన్షాపు నిర్వహిస్తుండగా వీరిలో మరో ఇద్దరు చదువుకుంటున్నారు. అర్ధరాత్రి వర్షంతో పాటు వాహనం స్పీడ్గా ఉండటం వల్లే అదుపు తప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సయ్యద్ సైఫ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సందీప్రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్పై ఆదివారం ద్విచక్రవాహనంపై స్పీడ్గా వెళ్తూ అదుపుతప్పి ఫుట్పాత్ను ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే అదే ఫ్లై ఓవర్పై మరో ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడం అందరినీ కలిచివేసింది. -
HYD: రాయదుర్గంలో హిట్ అండ్ రన్..! వ్యక్తి మృతి
సాక్షి,హైదరాబాద్: రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై సోమవారం(జులై 15) హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసున్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఎక్సెల్ వాహనంపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కాకినాడకు చెందిన సోము సుబ్బు (35) గా పోలీసులు గుర్తించారు. సుబ్బు టీవీఎస్ ఎక్స్ఎల్పై టిఫిన్స్ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 5:30గంటలకు ఇంటి నుంచి బయలు దేరిన సుబ్బు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అతడి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే ఏదైనా వాహనం ఢీ కొట్టిందా లేదంటే సెల్ఫ్ స్కిడ్ అయి పడ్డాడా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: కేబీఆర్ చుట్టూ 6 ఫ్లై ఓవర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి చేపట్టిన ఎస్సార్డీపీ లో భాగంగా గత ప్రభుత్వం చేయలేకపోయిన కొన్ని పనుల్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా సదుపాయాలకు అధిక ప్రాధాన్యమిచి్చంది. హెచ్ఎండీఏ పరిధి వరకు ట్రాఫిక్ చిక్కులు లేని సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం దాదాపు రూ.25 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ఆ పనుల్ని ఐదు ఫేజ్ల్లో చేయాలని భావించింది. అందులో భాగంగా తొలిదశలో కేబీఆర్ పార్కు కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కుల్లేకుండా చేసేందుకు ఆరు పనులకు దాదాపు రూ.586 కోట్ల అంచనాతో ప్రణాళిక రూపొందించింది. అయితే.. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి, ఎదురైన ఆటంకాలతో మెజార్టీ పనుల్ని వాయిదా వేసింది. ఆయా ఫేజ్ల్లోని పనులు మారిపోయాయి. ఐదు ఫేజ్లు సైతం మారిపోయాయి. అయినా ఐదు ఫేజ్ల్లో పేర్కొన్న పనుల్లో చాలా పనుల్ని ఆ ప్రభుత్వం పూర్తిచేసింది. ⇒ అప్పుడు ఫేజ్–1లో భాగంగా కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్, ఫిల్మ్నగర్ జంక్షన్, రోడ్ నెంబర్ 45 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్–కేబీఆర్పార్కు ఎంట్రన్స్, రోడ్నెంబర్ 45– దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలనుకున్నారు. కానీ.. వీటిలో రోడ్నెంబర్ 45– దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్ కారిడార్ మాత్రమే పూర్తయింది. మిగతావి పూర్తికాలేదు. అందుకు కారణం కేబీఆర్ పార్కు ఎకో సెన్సిటివ్ జోన్లో ఉండటం, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కావాల్సి ఉండటంతో పాటు పర్యావేరణ వేత్తల అభ్యంతరాలు వంటి వాటితో ఆ పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు హైకోర్టులోనూ కేసులున్నట్లు సమాచారం. 1. జూబ్లీ చెక్పోస్ట్ 2. రోడ్ నెంబర్– 45 3. ఎల్వీ ప్రసాద్ 4. బసవతారకం కేన్సర్ హాస్పిటల్ 5.మహారాజా అగ్రసేన్ 6. ఫిల్మ్నగర్ .. వీటిలో బసవతారకం కేన్సర్ హాస్పిటల్ వద్ద తొలుత ప్రతిపాదనలున్నప్పటికీ, అనంతరం తొలగించారు. తిరిగి ఇప్పుడు మళ్లీ అక్కడ కూడా ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ⇒ ఫ్లై ఓవర్లతో పాటు అండర్పాస్లు సైతం నిర్మించనున్నారు. ట్రాఫిక్ ఫ్రీ కోసం చేపట్టే పనులకు ఎక్కువ నిధులు ఖర్చు కాకుండా ఉండేందుకు అండర్పాస్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సిటీ హార్ట్గా .. కేబీఆర్ పార్కు అనేది నగరానికి హార్ట్లా ఉండటంతో పాటు సంపన్న వర్గాలు, సినీతారలు, రాజకీయ ప్రముఖులు, తదితర వీఐపీలు నిత్యం సంచరించే ప్రాంతం కావడంతో సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి రాగానే ఆ జంక్షన్పై దృష్టి సారించినట్లు తెలిసింది. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులకు సైతం అభ్యంతరాలు ఉండవనే ధీమాతో ప్రభుత్వం ఉంది.సీఎం రేవంత్ చొరవతో..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేబీఆర్ చుట్టూ ఆగిపోయిన ప్రాజెక్టుల్ని చేపట్టే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఆయన వద్దే ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి దిగువ ప్రాంతాల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు సంబంధించి కన్సల్టెంట్ సేవల్ని జీహెచ్ఎంసీ కోరుతోంది. త్రీడీ డిజైన్లో వాటిని అందజేయాల్సిందిగా తెలిపింది. అంటే ప్రస్తుతం ఆయా జంక్షన్లలో పరిస్థితులు, ట్రాఫిక్ రద్దీ, ఫ్లై ఓవర్లు పూర్తయితే ఎలా ఉంటాయి.. ట్రాఫిక్ చిక్కులు ఎలా తగ్గుతాయి.. సిగ్నల్ ఫ్రీగా ఎలా సదుపాయంగా ఉంటుంది అనే అంశాల్ని యానియేషన్ ద్వారా ప్రదర్శించాల్సి ఉంటుంది. -
Right to Walk.. ఇంకెప్పుడు..?
గ్రేటర్ సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న పాలకులు నగరం మధ్యలో ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి పనులపై దృష్టి పెడుతున్నా, కాలినడకన వెళ్లే వారికి అవసరమైన మేరకు ఫుట్పాత్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ)ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రధాన రహదారుల్లో సాఫీగా కొద్ది దూరం కూడా నడవలేక.. ఒకవైపు నుంచి మరో వైపు రోడ్డు దాటలేక పాదచారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. చాలాచోట్ల ఫుట్పాత్లు లేక, ఉన్న ఫుట్పాత్లు చాలా ప్రాంతాల్లో ఆక్రమణకు గురికావడంతో పాదచారులు విధిలేని పరిస్థితు ల్లో రోడ్లపైనే నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. కిక్కిరిసిన జంక్షన్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించేవారు కూడా రయ్ మంటూ దూసుకుపోయే వాహనాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఎఫ్ఓబీలు ఉన్నా చాలాచోట్ల లిఫ్ట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయి.ఈ కారణంగా పాదచారులు ఎఫ్ఓబీలు ఉపయోగించకుండా ట్రాఫిక్ మధ్యలోనే రోడ్లు దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఏడాది నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 123 మంది మృత్యువాత పడగా అనేకమంది గాయాల పాలవడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కి.మీ పొడవైన రోడ్లు ఉండగా ఫుట్పాత్లు కేవలం 817 కిలోమీటర్లకే పరిమితం కావడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది.10% కూడా లేని ఫుట్పాత్లుజీహెచ్ఎంసీ పరిధిలో బీటీ, సీసీ, ఇతరత్రా రోడ్లన్నీ కలిపి మొత్తం 9,013 కిలోమీటర్ల రహదారులుండగా, వాటిల్లో ఫుట్పాత్లు లేదా వాక్వేలు కలిపి కనీసం 10 శాతం కూడా లేవు. ఉన్న ఫుట్పాత్లు దుకాణదారులు తమ అమ్మకపు సామగ్రిని ఉంచడానికి, వాహనాల పార్కింగ్కు, టీకొట్లు, తోçపుడు బండ్లు, ఇతరత్రా చిన్న వ్యాపారాల నిర్వహణకు పనికి వస్తున్నాయే తప్ప ప్రజలు నడవడానికి అనువుగా ఉండటం లేదు. ప్రభుత్వ సంస్థలు సైతం పబ్లిక్ టాయ్లెట్లు, ట్రాన్స్ఫార్మర్లు, రూ.5 భోజన కేంద్రాలు వంటివి ఫుట్పాత్లపైనే ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా కొందరు ఇసుక, ఇటుక, కంకర వంటి వాటిని సైతం ఫుట్పాత్లపైనే ఉంచి వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని రోడ్లకు ఫుట్పాత్లుండాలిఅన్ని రహదారుల వెంబడి ఫుట్పాత్లను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించి, అవి ప్రజలు నడిచేందుకు మాత్రమే ఉపయోగపడేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జీహెచ్ఎంసీలో ఈవీడీఎం విభాగం ప్రారంభమైన తొలినాళ్లలో ఆరేళ్ల క్రితం ‘రైట్ టూ వాక్’ పేరిట 20 వేలకు పైగా ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించింది. చిన్నాచితకా వ్యాపారులను వాటిపై నుంచి తరలించారు. తొలగింపు సమయంలో ఫుట్పాత్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తామని పేర్కొన్నారు. కానీ కొత్తగా నిర్మించలేదు సరికదా.. కొన్నాళ్లకే ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ వ్యాపారాలు వెలిశాయి.జీహెచ్ఎంసీలో రోడ్లు.. పుట్పాత్లు ఇలా (కి.మీ.లలో)⇒ మొత్తం రోడ్లు 9,013⇒ సీసీ రోడ్లు 6,167⇒ బీటీరోడ్లు 2,846⇒ ఫుట్పాత్లు 817ఫుట్పాత్ల పరిస్థితి అలా ఉంచితే.. ఒక వైపు నుంచి మరో వైపు రోడ్డు దాటి వెళ్లాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బిజీ రోడ్లలో ఆగకుండా దూసుకొచ్చే వాహనాలతో ఒక్క అడుగు ముందుకు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. బిక్కుబిక్కుమంటూ వచ్చే వాహనాల వైపు చేతిని అడ్డంగా పెడుతూ బతుకుజీవుడా అనుకుంటూ రోడ్లు దాటుతున్నవారు నిత్యం కనిపిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు.ఎవరో ఒకరు తోడులేందే వారు రోడ్డు దాటలేని పరిస్థితి ఉంటోంది. పాదచారులు రోడ్లు దాటేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, పెలికాన్ సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కోట్ల రూపాయలు ఖర్చవడం తప్ప అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. నగరంలో ఉన్న అనేక ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా ఉంటున్నాయి. పాదచారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కొంత తోడవుతోంది. చాలాచోట్ల లిఫ్ట్లు పని చేయడం లేదు. కొన్నిచోట్ల పనిచేస్తున్నా పాదచారులు వాటిని ఉపయోగించడం లేదు. అధికార యంత్రాంగం మాత్రం ప్రజలకు ఉపయోగపడుతున్నదీ, లేనిదీ పరిశీలించకుండానే కొత్తవి నిర్మించేందుకు పూనుకుంటోంది. ఉన్నవి ఉపయోగపడేలా చేసే దిశగా చర్యలు చేపట్టడం లేదు.ఎన్ని ఉన్నా ఏం లాభం?జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నేషనల్ హైవే, టీజీఐఐసీ సంస్థలు ఏర్పాటు చేసిన ఎఫ్ఓబీలు పాతవి 23 ఉండగా, కొత్తగా పనులు చేపట్టిన వాటిల్లో 12 పూర్తయ్యాయి. మరో ఐదు పురోగతిలో ఉన్నాయి. ఎఫ్ఓబీలు ఎక్కువ ఎత్తులో ఉండటంతో చాలామంది వాటిని వినియోగించుకోవడం లేదు. వయోవృద్ధులు శారీరక సమస్యలున్న వారు అసలు ఎక్కలేక పోతున్నారు. ఎక్కగలిగే శక్తి ఉన్నవారు సైతం వాటిని ఎక్కి నడిచి దిగే కంటే ఎలాగోలా రోడ్డు దాటేయొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటివి ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఏర్పాటు చేయడంతో ఊరుకోకుండా ప్రజలు వాటిని వినియోగించేలా చూడాలని, ఎలా వినియోగించాలో తెలియని వారి కోసం నిర్వహణ సిబ్బందిని నియమించాలని అంటున్నారు.ఫుట్పాత్లు ఉండాల్సింది ఇలా (మీటర్లలో..)⇒ దుకాణాల ముందు 3.5 4.5⇒ బస్టాప్లు 3.00⇒ వాణిజ్య ప్రాంతాల్లో.. 4.00⇒ ఇతర ప్రాంతాల్లో.. 2.5(నగరంలో 0.60 మీటర్ల నుంచి 3 మీటర్ల లోపే ఉన్నాయి. ఎక్కువగా మీటరు నుంచి మీటరున్నర వరకే ఉన్నాయి) రోడ్డుపైకి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలికోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎఫ్ఓబీలను ప్రజలు వినియోగించుకోవాలి. కొందరు రోడ్డు పైనుంచే వెళ్తూ ప్రమా దకరమైనప్పటికీ సెంట్రల్ మీడియన్లను సైతం ఎక్కి దిగుతున్నారు. ఈ పరిస్థితి నివారణకు బ్రిడ్జికి అటూ ఇటూ కనీసం వంద మీటర్ల వరకు ప్రజలు రోడ్డు మీదకు వెళ్లేందుకు వీల్లేకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. – ఆర్. శ్రీధర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, రిటైర్డ్ ఈఎన్సీ, జీహెచ్ఎంసీఆ వ్యవస్థతో బ్రిడ్జీలు ఏర్పాటు చేయొచ్చుఫుట్పాత్లు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఫుట్పాత్లు లేని ప్రాంతాల్లో రోడ్డు చివరి లైన్లో టూ టయర్ సిస్టమ్తో బ్రిడ్జిలాంటి ఏర్పాటు చేయవచ్చు. 2 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసే ఈ బ్రిడ్జి పైనుంచి పాదచారులు వెళ్లేలా, టూ, త్రీవీలర్లు కిందనుంచి వెళ్లేలా నిర్మాణాలు చేయొచ్చు. అలాగే రోడ్డు దాటేందుకు జాకింగ్ కాన్సెప్ట్తో మీటర్ రేడియస్తో టన్నెల్ లాంటి నిర్మాణం చేయొచ్చు. గతంలో ఓ పోలీసు ఉన్నతాధికారి హయాంలో ఇలాంటి ఆలోచనలు జరిగాయి. ఆయన మారడంతో అది అటకెక్కింది. – ప్రొఫెసర్ లక్ష్మణరావు, జేఎన్టీయూఎక్కువ ఎత్తు అవసరం లేదునగరంలో ఏర్పాటు చేసిన ఎఫ్ఓబీలు చాలా ఎత్తులో ఉన్నందువల్ల ఎవరూ ఎక్కడం లేదు. కాబట్టి ఎత్తు కాస్త తగ్గించాలి. మెట్రో స్టేషన్లలో మాదిరిగా లిఫ్టులు, ఎక్సలేటర్లు ఉంటే అవసరమైన వారు వినియోగిస్తారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద ఎఫ్ఓబీ ఉన్నప్పటికీ లిఫ్టు పనిచేయక ఎక్కడం లేదు. పాదచారులు ఎక్కువగా రోడ్లు దాటే ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్క్రాసింగ్కు వీలుగా సిగ్నల్ లైట్లు పెట్టడం మాత్రమే కాకుండా వాహనాలు కచ్చితంగా ఆగేలా చూడాలి. పాదచారుల క్రాసింగ్ ఏరియా అని తెలిసేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలి. పాదచారులకు సహాయకులుగా పోలీసులు లేదా ఇతర సిబ్బందిని నియమించాలి. దీనివల్ల కొందరికి ఉపాధి కూడా లభిస్తుంది. – డా. దొంతి నరసింహారెడ్డి, సామాజికవేత్తపేరుకే పెలికాన్ సిగ్నల్స్బిజీ రోడ్డును దాటాలనుకునే పాదచారుల కోసం నగరంలోని 70కి పైగా ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పాదచారి ఎవరైనా రోడ్డు దాటాలనుకున్నప్పుడు పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలో ఉండే స్విచ్ను నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు రెడ్ సిగ్నల్ పడి కొన్ని సెకన్ల తర్వాత రోడ్డుకిరువైపులా రాకపోకలు సాగించే వాహనాలు నిర్ణీత సమయం ఆగిపోతాయి. అప్పుడు పాదచారులు రోడ్డు దాటాల్సి ఉంటుంది.ఒక్కసారి బటన్ నొక్కిన తర్వాత.. పదే పదే నొక్కినా పని చేయకుండా కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఎవరైనా కూడా వెంట వెంటనే నొక్కడానికి అవకాశం ఉండదన్న మాట. అయితే బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వద్ద, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఈ పెలికాన్ సిగ్నల్స్ కేవలం అలంకారంగానే ఉన్నాయి. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ సిగ్నల్స్ కొన్ని ప్రాంతాల్లో పనిచేయడం లేదు. అసలు వీటిని ఎలా వినియోగించాలో కూడా ప్రజలకు తెలియదని, అధికారులు ఈ విషయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.లిఫ్ట్ ఉన్నా వేస్ట్ ఎర్రగడ్డ ప్రధాన రహదారిలోని మోడల్ కాలనీ కమాన్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సరిగా నిర్వహించడం లేదు. లిఫ్ట్ సౌకర్యం ఉన్నా అది ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు పని చేయదో తెలియదు. నాలాంటి సీనియర్ సిటిజన్లు మెట్లు ఎక్కి వెళ్లలేకపోతున్నాం. ఎఫ్ఓబీ సమీపంలో చెత్తాచెదారం నిండి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. –జేఎస్టీ శాయి, మోడల్ కాలనీ, సనత్నగర్.నిబంధనల పాటింపు తప్పనిసరి చేయాలిపాదచారులకు సైతం కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం పెడస్ట్రియన్ క్రాసింగ్స్లో, నిర్దేశించిన విధంగానే రోడ్డు దాటాలి. అలా చేయకపోవడం ఉల్లంఘన కిందికే వస్తుంది. నేను గతంలో చెన్నై వెళ్లిన ప్పుడు ఓ విషయం గమనించా. అప్పట్లో అక్కడి సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండేది. దీంతో పాదచారులు రోడ్డు దాటడానికి వీలుగా అండర్ పాస్ ఏర్పాటు చేశారు.అయితే తొలినాళ్లలో దీన్ని వినియోగించకుండా రోడ్డు పైనుంచే దాటుతుండ టంతో ప్రమాదాలు కొన సాగాయి. దీంతో ఆ అండర్ పాస్ వద్ద ఓ కాని స్టేబుల్ను ఏర్పాటు చేశారు. ఎవరైనా అండర్ పాస్ కాకుండా రోడ్డు పైనుంచి క్రాస్ చేస్తే కానిస్టేబుల్ పట్టుకునేవారు. అక్కడి కక్కడే రూ.5 జరిమానా విధించి వసూలు చేసే వారు. దీంతో పాటు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అండర్ పాస్ వినియోగం పెరిగింది. ఇలాంటి విధానాలు హైదారాబాద్లోనూ అమల్లోకి తీసుకురావాలి. – కేవీకే రెడ్డి, ట్రాఫిక్ నిపుణుడునగరంలో ఎఫ్ఓబీలున్న ప్రాంతాలుపాతవి: అనుటెక్స్ (సైనిక్పురి), హెచ్పీ పెట్రోల్బంక్ (రామంతాపూర్), నేషనల్ పోలీస్ అకాడమీ (రాజేంద్రనగర్), గగన్పహాడ్, మహవీర్ హాస్పిటల్, ఎన్ఎండీసీ (మాసాబ్ట్యాంక్), ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్బండ్), గ్రీన్ల్యాండ్స్ గెస్ట్హౌస్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ముఫకంజా కాలేజ్ (బంజారాహిల్స్), భారతీయ విద్యాభవన్ స్కూల్ (ఫిల్మ్నగర్), వెల్స్ ఫార్గో (ఖాజాగూడ), ఐఎస్బీ, ఐటీసీ కోహినూర్, మియాపూర్ క్రాస్రోడ్స్, ఆల్విన్ క్రాస్రోడ్స్ (మదీనగూడ), మలేసియన్ టౌన్షిప్, కేపీహెచ్బీ–4 ఫేజ్, కళామందిర్ (కేపీహెచ్బీ కాలనీ), ఐడీపీఎల్, మెట్టుగూడ, రైల్నిలయం, హైదరాబాద్ పబ్లిక్స్కూల్ (బేగంపేట).కొత్తవి: బాలానగర్, చెన్నెయ్ షాపింగ్ మాల్ (మదీనగూడ), మియాపూర్, ఈఎస్ఐ హాస్పిటల్(ఎర్రగడ్డ), హైదరాబాద్ సెంట్రల్ మాల్, నేరేడ్మెట్ బస్టాప్, సెయింట్ ఆన్స్ స్కూల్(సికింద్రాబాద్), తార్నాక, స్వప్న థియేటర్ (రాజేంద్రనగర్), ఒమర్ హోటల్, రంగభుజంగ థియేటర్, మూసాపేట క్రాస్రోడ్స్. -
ఎర్రటి ఎండలో చల్లని హృదయం
భయానకమైన ఎండలో పెద్ద ఏసీ మెషిన్తో ఫ్లైఓవర్ దాటడానికి ఆపసో΄ాలు పడుతున్న రిక్షా కార్మికుడిని చూసిన ఒక మహిళ బాధపడింది. అయితే ఆమె బాధ పడి ఊరుకోలేదు. అతడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్లింది. రిక్షాను నెట్టుతూ అతడు ఫ్లై ఓవర్ దాటేలా సహాయపడింది. ఆ తరువాత లంచ్బాక్స్, వాటర్ బాటిల్ అతడికి ఇచ్చింది. తలపై కప్పుకోవడానికి టవల్ కూడా ఇచ్చింది. దారిన ΄ోయేవాళ్లెవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ‘ఎక్స్’లో ΄ోస్ట్ చేశారు. ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది.‘ఎక్కడో ఒకచోట కష్టపడుతున్న వ్యక్తుల్ని చూస్తుంటాం. బాధ అనిపిస్తుందిగానీ, నేను మాత్రం ఏం చేయగలను అని సర్దిచెప్పుకుంటాం. అయితే మన వంతుగా వారికి కొద్దో గొ΄్పో సహాయపడగలిగితే అది గొప్ప సంతృప్తిని ఇస్తుంది’ అంటూ ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. -
రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్ శిలా ఫలకం ధ్వంసం
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడుతున్నారు. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా ఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చివేశారు. టీడీపీ శ్రేణులు ధ్వంసం చేసిన శిలా ఫలకాన్ని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంతో మందితో పోరాడి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టామని.. అలజడి సృష్టించడం వల్ల ఉపయోగం లేదన్నారు.‘‘రాజమండ్రి ప్రశాంతమైన నగరం. ప్లైఓవర్ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు శిలాఫలకంపై నా పేరు మాత్రమే కాదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పేర్లు కూడా ఉన్నాయి. శిలాఫలం ధ్వంసం చేసినా ప్రజల మనసుల్లో మా పేరు తొలగించలేరు. అలజడి సృష్టించటం వల్ల ఉపయోగం లేదు. అభివృద్ధి కోసం పాటుపడాలి’’ మార్గాని భరత్ హితవు పలికారు. -
బైరామల్ గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, మంత్రులు, మేయర్ (ఫొటోలు)
-
ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి తరలిస్తుండగా కిందపడ్డ దరఖాస్తులు
-
కొండయ్య పాలెం వంతెనకు ముత్తా గోపాలకృష్ణ పేరు..
-
కృష్ణా తీరాన.. అభివృద్ధి పతాక
ఓబుల్రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి ప్రతినిధి, విజయవాడ విజయవాడ.. ఇప్పుడు పేరెన్నికగన్న నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటోంది. ఓ వైపు ఫ్లైఓవర్లు.. మరోవైపు బైపాస్ రహదారుల నిర్మాణంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వాణిజ్యపరంగా పేరెన్నికగన్న ఈ నగరంలో కేవలం నాలుగేళ్లలోనే ఊహించని అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిత్యం కృష్ణానది వరదనీటి ప్రవాహం వల్ల ముంపుతో బాధ పడుతున్న నగరవాసులకు రక్షణ గోడతో పూర్తి స్థాయి ఉపశమనం లభించింది. వరద వస్తే చాలు.. తట్టా బుట్టా చేత పట్టుకుని ఎగువ ప్రాంతానికి పరుగులు తీసే దుస్థితి తప్పింది. నగర నడిబొడ్డున ఠీవీగా నిలిచిన అంబేడ్కర్ విగ్రహం.. అభివృద్ధి అంటే ఇదీ.. అన్నట్లు మనందరికీ చూపిస్తోంది. మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రూపు రేఖలు మారిపోయాయి. బెజవాడకు మణిహారం ఫ్లైఓవర్లు.... నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా కొత్తగా నిర్మించిన జంట ఫ్లైఓవర్లు బెజవాడకు మణిహారంగా నిలుస్తున్నాయి. జెంజి సర్కిల్–1 ఫ్లైఓవర్ 48 స్పాన్లతో 1.470 మీటర్ల వెడల్పుతో(అప్రోచ్రోడ్డు సహా) 2.27 కిలోమీటర్ల పొడవుతో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించారు. ► రెండోఫ్లైఓవర్ ఏడాదిన్నరలో పూర్తి చేయాలన్నది టార్గెట్. కానీ ఏడాదిలోనే అది అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 1.703 కిమీలు, స్పాన్లు 55, వెడల్పు 12.5 మీటర్లు. నిర్మాణానికి అయిన ఖర్చు రూ.96 కోట్లు. ► దీంతో పాటు బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ వెస్ట్, ఈస్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు పనులకు అడ్డంకిగా నిలిచిన భూసేకరణ సమస్య పరిష్కారమైంది. పశ్చిమం వైపు 2.47 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సర్వీస్రోడ్డుకు రూ. 25కోట్లు ఖర్చు చేస్తున్నారు. తూర్పువైపు పెండింగ్లో ఉన్న 860మీటర్ల సర్వీస్రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ► బెంజి సర్కిల్నుంచి పోరంకి వరకు 6 కిలోమీటర్ల మేర డ్రైనేజీ పనులు రూ. 15కోట్లతో చేపడుతున్నారు. ఇంకా గుణదల ఫ్లైఓవర్, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ పనులకు మార్గం సుగమం అవుతోంది. ► గన్నవరం విమానాశ్రయం వద్ద హాఫ్ ఫ్లైఓవర్ను రూ. 23.77 కోట్లతో నిర్మించారు. హైదరాబాద్ హైవే నిర్మాణానికి అవరోధంగా నిలిచిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, అసంపూర్తి పనులను రూ17కోట్లతో చేపట్టారు. ► గ్రీన్ ఫీల్డ్ హైవే(విజయవాడ–ఖమ్మం)కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. కనకదుర్గ ఫ్లైఓవర్కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను ఈ మధ్యనే ప్రారంభించారు. బైపాస్లతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ నగరానికి వచ్చే వాహనాలకు ఇక ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వెస్ట్, ఈస్ట్ బైపాస్ నిర్మాణాలు ఉపకరించనున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించి 30 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల రహదారి(చిన్న అవుటపల్లి నుంచి– గొల్లపూడి)ని రూ1148 కోట్లతో 2021 ఫిబ్రవరిలో ప్రారంభించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. ► గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17.88కి.మీ పొడవున రహదారి పనులు, కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన పనులు వేగంగా సాగుతున్నాయి. విజయవాడ తూర్పు వైపు నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డుకు దాదాపు పూర్తి కావచ్చింది. ► కృష్ణా జిల్లా పొట్టి పాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 49.3 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కృష్ణానదిపైన 3.750 కిలోమీటర్ల పొడవుతో ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీనికోసం రూ4607.80కోట్లు వెచ్చించనున్నారు. ముంపు నుంచి ఉపశమనం నగరంలోని కృష్ణానదీతీరవాసులు ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యనుంచి ఉపశమనం కలిగించారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్Š వరకూ రక్షణగోడ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వారధినుంచి పద్మావతి ఘాట్ నుంచి రక్షణ గోడ పనులు సాగుతున్నాయి. మొదటి దశలో రూ.93,22 కోట్లు, రెండో దశలో రూ. 180.24 కోట్లు, మూడో దశలో రూ. 120.81 కోట్లు కలిపి మొత్తమ్మీద రూ394.27 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ వెంబడి రెండు దశల్లో రూ.33.39కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు జరగనున్నాయి. గ్రీనరీ, పార్కులు, వాకింగ్, సైకిల్ ట్రాక్తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాలువలపై రూ. 31కోట్లతో ఏడు వంతెనలు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిమస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. అందాల వాడగా తీర్చిదిద్దాం బెజవాడను అందాల వాడగా తీర్చిదిద్దాం. నగరంలో జలకాలుష్యం తగ్గించేందుకు మూడు ప్ర«ధాన కాలువలను శుభ్రం చేశాం. కెనాల్ బండ్స్ను సుందరీకరించాం, ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చేశాం. విజయవాడలో రోడ్లు, గ్రీనరీ, పార్కులను అభివృధ్ది చేశాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించాం నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించేలా ఫ్లైఓవర్లు నిర్మించాం. జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాం. నగరంలో రోడ్లు, పచ్చదనం చేపట్టాం. కృష్ణానది వెంబడి రక్షణ గోడ నిర్మించాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. – ఎస్.ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా నగరాభివృద్ధిపై మహానేత చెరగని ముద్ర విజయవాడ నగర అభివృద్ధిపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. పేదలకు జేఎన్యూఆర్ఎం కింద గృహాలు నిర్మించి అందజేశారు. నగర శివారులో వైఎస్సార్ కాలనీ నిర్మించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చనమోలు వెంకట్రావు పేరుతో మిల్క్ ప్రాజెక్టు వద్ద ఫ్లై ఓవర్ నిర్మించారు. రైల్వే స్టేషన్ రోడ్డు, గుణదల పడవల రేవును కలుపుతూ 6 కిలో మీటర్ల మేర బీఆర్టీఎస్ రోడ్డు నిర్మించారు. అజిత్సింగ్ నగర్ బుడమేరు వరద నివారణకు కట్ట నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో... ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇళ్లు పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడతలో 1.07లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 14,995 ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు చేశారు. కాల్వ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో , రోడ్ల పక్కన ఆవాసం ఉంటున్న వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయించారు. పటేల్ నగర్ ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, నేతాజీ కాలనీ, రాధానగర్, రాజీవ్నగర్, వడ్డెర కాలనీ, నందా వారి కండ్రిక ప్రాంతాల్లో గతంలో కార్పొరేషన్ 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్ చేశారు. టీడీపీలో గ్రాఫిక్స్తోనే సరి... టీడీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిపై శీత కన్నేసింది. అమరావతి రాజధాని పేరుతో గ్రాఫిక్స్తోనే ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసింది. విజయవాడకు సంబంధించి ప్రధాన ఫ్లై ఓవర్లు, రోడ్లు, ట్రాఫిక్ సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ హయాంలో ప్రారంభమైప కనకదుర్గ ఫ్లై ఓవర్ç పూర్తి చేయకుండా కాలం వెళ్లదీసింది. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తి చేయాలనిగానీ, నగరానికి నలువైపుల నుంచి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రోడ్లను జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలన్న ఆలోచనే చేయలేదు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్తో ప్రజల కళ్లకు గంతలు కట్టారు. ఈవెంట్లతో పబ్బం గడుపుకున్నారు. గత టీడీపీ హయాంలో అభివృద్ధి పేరుతో మాయ చేసిన వైనాన్ని, ఈ ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, వెస్ట్, ఈస్ట్ బైపాస్, నగరంలో రోడ్లు, కాల్వల ప్రక్షాళన, పచ్చదనం వంటి పనులు చేపట్టిన తీరు చూసి నిజమైన అభివృద్ధి అంటే ఇది అని చర్చించుకుంటున్నారు. సరికొత్తగా ఇంద్రకీలాద్రి ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రారం¿ోత్సవాలు, కొత్తవాటికి శంకుస్థాపన చేశారు. కనకదుర్గానగర్ గోశాల వద్ద రూ. 216.05 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ. 23.145కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభించారు. ఆధ్యాత్మిక విహారం కృష్ణా నదిలో జల విహారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలోని అలయాలు, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్ టూరిజంకు రూపకల్పన చేశారు. కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జలవిహారం చేస్తూ 82 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయటం ద్వారా ఎనిమిది ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ సంస్థ చర్యలు తీసుకొంటోంది. ఇందుకోసం దుర్గఘాట్నుంచి అమరావతి వరకు ఐదు ప్రదేశాలను కలుపుతూ ఓ సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ముక్త్యాల నుంచి అమరావతికి నాలుగు ప్రదేశాలను కలుపుతూ ఇంకో సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. పిల్లలకోసం ఆట పరికరాలు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, ఓపెన్గేమ్స్, ఎడ్వంచర్ గేమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపాదనలు ఇలా... రెండు యాంత్రీకరణ బోట్లు కొనుగోలుకు : రూ.22 కోట్లు ఏడు ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, సౌకర్యాలకోసం : రూ. 24 కోట్లు రూఫ్ టాప్ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ల కోసం: రూ.4 కోట్లు మొత్తం అయ్యే ఖర్చు : రూ .50 కోట్లు -
HYD: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిపై ముసారాంబాగ్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నందున ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అంబర్పేట్ నుంచి మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ మీదుగా మలక్పేట టీవీ టవర్ వైపు వెళ్లే అన్ని సాధారణ వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులను అలీ కేఫ్ ఎక్స్ రోడ్ వద్ద జిందాతిలిస్మత్, గోల్నాక న్యూ బ్రిడ్జ్ హైటెక్ ఫంక్షన్ హాల్, అఫ్జల్నగర్ వైపు మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కుడి మలుపు తిరిగి పిస్తా హౌస్, మూసారాంబాగ్ జంక్షన్ వైపు వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లి సహకరించాలని పోలీసులు కోరారు. చదవండి: పీవీని ‘భారత రత్న’తో గౌరవించాలి: కేటీఆర్ -
కుంగిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ పై స్పందించిన L అండ్ T కంపెనీ
-
విశాఖలో 12 ఫ్లైఓవర్ల నిర్మాణంపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి అధికారులను కోరారు. విశాఖ ట్రాఫిక్ నియంత్రణ అంశంపై సీఐఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరంలో విపరీతంగా పెరిగిన సరకు రవాణా, ప్రజారవాణా వాహనాల క్రమబద్ధీకరణపై దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని కోరారు. విశాఖపట్నం–భోగాపురం ఆరులేన్ల రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి కొంతమేర తగ్గుతుందని చెప్పారు. షీలానగర్–సబ్బవరం రోడ్డు పూర్తయితే నగరంపై ట్రాఫిక్ ప్రభావం తగ్గుతుందని చెప్పారు. విశాఖ నగరం మీదుగా వెళ్లే హైవే–16పై వివిధ ప్రాంతాల్లో 12 ఫ్లై ఓవర్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ప్రధాన జంక్షన్లలో వ్యాపారులకు ప్రత్యామ్నాయస్థలాలు చూపి, జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరారు. అగనంపూడి టోల్గేట్ అంశంపై అవసరమైతే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామన్నారు. ఎన్ఏడీ, హనుమంతవాక జంక్షన్ల విస్తరణకు, నగరంలో ట్రక్ పార్కింగ్తో పాటు బస్ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి వీలుపడదని, అర్థచంద్రాకారంలోనైనా రింగ్రోడ్డు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నరసింహనగర్లో కొండ తొలిచి అక్కడినుంచి హెల్త్ సిటీలో ఉన్న బీఎస్సార్ బీఆర్టీఎస్ టన్నెల్ నిర్మించే అంశమూ పరిశీలనలో ఉందన్నారు. నగరంలో ట్రాక్టర్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయన్నారు. విశాఖ నుంచి పాలన కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం దసరా నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలని భావించామని, కానీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. పరిపాలన రాజధాని వసతులపై సీఎం వైఎస్ జగన్ వేసిన కమిటీ డిపార్ట్మెంట్ భవనాలు ఫైనలైజ్ చేసేవరకు సీఎం రావడం ఆలస్యమవుతుందన్నారు. టీడీపీ నేతలు చెబుతున్నట్టుగా తాము దొడ్డిదారిన వైజాగ్ రావల్సిన అవసరం లేదన్నారు. రైట్గా, రాయల్గా విశాఖకు వచ్చి ఇక్కడినుంచే తమ నాయకుడు పరిపాలన అందిస్తారని తెలిపారు. సమావేశంలో మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కోలా గురువులు, దామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
HYD: హైస్పీడ్లో కారు బీభత్సం.. సినిమా రేంజ్లో టైర్లు ఊడిపోయి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్వేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఉన్న కారు సినిమా రేంజ్లో డివైడర్ను ఢీకొట్టి.. అనంతరం మరో కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు రెండు వీల్స్ ఊడిపోయి గాల్లోకి ఎగిరి కిందపడ్డాయి. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్లోని పీవీ ఎక్స్ప్రెస్వేపై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజూమన హైస్పీడ్లో ఉన్న కారు.. 198వ పిల్లర్ వద్ద డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం, మరో కారును కూడా సదరు కారు ఢీకొట్టింది. ఈ సందర్బంగా కారు రెండు టైర్లు ఉడిపోయి.. ఒక్కసారిగా గాల్లోకి లేచి కిందకు ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, మైనర్లు ఈ కారు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్? -
ఇకనుండి తిరుపతి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు
-
శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది: సీఎం జగన్
-
శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ను ప్రారంభించిన సీఎం జగన్..
-
రేపే సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా శ్రీనివాస సేతు ప్రారంభం
-
ఫ్లై ఓవర్ పై.. అదుపుతప్పిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: మితి మీరిన వేగంతో ఫ్లై ఓవర్ రెయిలింగ్ను ఢీ కొట్టి కింద పడటంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, కల్వాల గ్రామానికి చెందిన విగ్నేష్(24) శ్రీరాంనగర్లో ఉంటూ డ్రైవింగ్ యాప్లో రైడర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితుడు మనీష్కు తెలియకుండా అతడి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకుని బయటికి వచ్చాడు. కొండాపూర్ ఫ్లై ఓవర్ మీదుగా వెళుతుండగా అతివేగం కారణంగా బైక్ అదుపుతప్పి కుడివైపు రెయిలింగ్ను ఢీ కొట్టి ఆగిపోగా విగ్నేష్ ఎగిరి బొటానికల్ గార్డెన్ జంక్షన్లో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. విగ్నేష్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Indira Park to RTC X Road : నేడు దక్షిణ భారతదేశంలోనే తొలి అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి ప్రారంభం (ఫొటోలు)
-
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్
కంటోన్మెంట్ (హైదరాబాద్): ఎనిమిదేళ్లుగా పెండింగ్లో ఉన్న స్కైవేల ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. కీలకమైన స్థల సేకరణకు వీలుగా ఆర్మీ అంగీకారం తెలుపడంతో రాజీవ్ రహదారి, నాగ్పూర్ హైవే మార్గాల్లో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. స్కైవేలకు ఆర్మీ స్థలాలు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టాల్సిందిగా స్థానిక మిలటరీ అధికారులు (ఎల్ఎంఏ), కంటోన్మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. 2017లోనే చేపట్టిన జాయింట్ సర్వేలో కొన్ని మార్పులు, చేర్పులతో తుది నివేదికను రూపొందించారు. రక్షణ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ప్రతిపాదిత రోడ్ల విస్తరణకు ఆర్మీ, కంటోన్మెంట్ 158 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. ప్రైవేటు స్థలాలు దీనికి అదనం. ఇక ప్రతిపాదిత మార్గాల్లో ప్రస్తుత రోడ్లను 60 మీటర్ల (196 అడుగులు)కు విస్తరించనున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికే ఏఓసీ మార్గంలో రోడ్ల మూసివేత అంశం కొనసాగుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరాక ఈ ప్రాజెక్టును చేపట్టడంతో పాటు, సెక్రెటేరియట్ను కంటోన్మెంట్లో ఏర్పాటు చేయాలని భావించింది. ప్రతిపాదిత సెక్రెటేరియట్ తూర్పు ద్వారం గుండా నేరుగా హకీంపేట వరకు రాజీవ్ రహాదారి మీదుగా, పడమర ద్వారం గుండా సుచిత్ర వరకు మేడ్చల్ హైవే మీదుగా రెండు స్కైవేలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా సూత్రప్రాయ అంగీకారం తెలుపడంతో పాటు ఆర్మీ, కంటోన్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జాయింట్ సర్వే కూడా పూర్తి చేశారు. ఈ మేరకు సెక్రెటేరియట్ కోసం 60 ఎకరాలు, స్కైవేలకు 90 ఎకరాల ఆర్మీ, కంటోన్మెంట్ స్థలాలు ఇవ్వాల్సి ఉంటుందని లెక్కతే ల్చారు. అయితే విలువైన స్థలాలను కోల్పోతున్న నేపథ్యంలో కంటోన్మెంట్కు ఏటా రూ.31 కోట్ల చొప్పున సర్వీసు చార్జీ చెల్లించాలని ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. సెక్రెటేరియట్ నిర్మాణ ప్రతిపాదనను కూడా విరమించుకుని, పాతభవనం తొలగించి నిర్మించారు. 90 కాదు..158 ఎకరాలు వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) కింద రాజీవ్ రహదారి, నాగ్పూర్ హైవే (ఎన్హెచ్–44) మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఈ మార్గాల్లో రోడ్డును 150 అడుగుల మేరకు విస్తరించాలని నిర్ణయించారు. తాజాగా ఈ స్కైవేలను మెట్రో కోసం కూడా వినియోగించుకోవాల ని నిర్ణయించారు. దీంతో రెండు మార్గాలను సుమారు 200 అడుగుల మేర విస్తరించనున్నారు. దీంతో గతంలో 90 ఎకరాల ఆర్మీ, కంటోన్మెంట్ స్థలం మాత్రమే అవసరం కాగా, ప్రస్తుతం 158 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఈ ప్రతిపాదనకు ఆర్మీకూడా అంగీకరించడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయ్యింది. 70 శాతం దుకాణాలు బంద్ ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి స్థల సేకరణ చేపడితే కంటోన్మెంట్లో 70 శాతం కమర్షియల్ నిర్మాణాలు కనుమరు గు కానున్నాయి. ముఖ్యంగా రాజీవ్ రహ దారి మార్గంలో సికింద్రాబాద్ క్లబ్ నుంచి అల్వాల్ వరకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు కొన్నిచోట్ల 10 మీటర్ల నుంచి, గరిష్టంగా 30 మీటర్ల వరకు మాత్రమే ఉంది. తాజాగా ఈ రోడ్డును 60 మీటర్లకు విస్తరిస్తే రోడ్డుకు ఇరువైపులా వ్యాపార కేంద్రాలు దాదాపుగా తొలగించాల్సి వస్తుంది. ప్యారడైజ్– బోయిన్పల్లి మార్గంలోనూ కొన్ని వ్యాపార కేంద్రాలు రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సి వస్తుంది. -
తిరుపతి: శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణంలో అపశృతి
-
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై స్పోర్ట్స్ బైక్ ప్రమాదం.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. మితి మీరిన వేగంతో బైక్పై వెళ్తూ అదుపు తప్పి రెయిలింగ్ను ఢీకొట్టి ఫ్లై ఓవర్పై నుంచి పడి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ఫ్లైఓవర్పైనున్న డివైడర్ను ఢీకొన్నారు. దీంతో ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్ మీదకు పడిపోయారు. కాగా, మెదక్ జిల్లా కకునూరుపల్లికి చెందిన బండి మధు(26), సూర్యాపేట జిల్లాకు చెందిన మచ్చగిరి (24) గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ టెక్నీషియన్లుగా పనిచేస్తూ మధురానగర్లో నివాసం ఉంటున్నారు. వీరు బైకుపై ఆస్పత్రికి బయలుదేరారు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై షాగౌస్ సమీపంలో ఫ్లై వర్పై కుడి వైపు రెయిలింగ్కు ఢీ కొట్టడంతో ఫ్లై ఓవర్ నుంచి కింద పడ్డారు. కాగా, తీవ్ర గాయాలతో మధు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో గిరి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. టిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలంటే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు అటు వైపు వెళ్లారో అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఇది కూడా చదవండి: టమాటా దొంగలు అరెస్ట్ -
యాక్సిడెంట్ను చూడబోతే.. 9 మంది మృతి
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. సర్కేజ్-గాంధీనగర్ హైవేపై ఉన్న ఇస్కాన్ వంతెనపై జరిగిన డబుల్ యాక్సిడెంట్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి దాటాక ఓ థార్ వాహనాన్ని ఓ డంపర్ ట్రక్కు వెనకాల నుంచి ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో జనం గుమిగూడి ఆ యాక్సిడెంట్ను చూస్తున్నారు. ఆ సమయంలో ఓ జాగ్వార్ కారు జనాల మీదకు దూసుకెళ్లింది. ISKCON bridge Accidentలో గాయపడ్డ వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తొమ్మది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే.. జాగ్వార్ కారు మితిమీరిన వేగంతో దూసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. Scary live visual, Speeding Jaguar rams into a crowd gathered around a truck-car accident in #Ahmedabad, killing 9 people, many injured. pic.twitter.com/QwCPy1lSPG — Nikhil Choudhary (@NikhilCh_) July 20, 2023 ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం, గాయపడిన వాళ్లకు రూ. 50వేల సాయం రాష్ట్రప్రభుత్వం తరపున అందిస్తున్నట్లు ప్రకటించారు. కారులో ఉంది ప్రముఖుడైన ప్రజ్నేష్ పటేల్ కుమారుడని తాత్యా పటేల్ అని తెలుస్తోంది. ఘటన తర్వాత కొందరు ఆ యువకుడిని చితకబాదిన దృశ్యాలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. #WATCH | #Ahmedabad car crash: Car driver being thrashed by locals pic.twitter.com/QGXjTMkABq — TOI Ahmedabad (@TOIAhmedabad) July 20, 2023 -
Hyderabad : ఎల్బీనగర్లో కుప్పకూలిన ఫ్లైఓవర్ (ఫొటోలు)
-
ఎల్బీనగర్ ఫైఓవర్ ప్రమాదం.. గాయపడిన వారిని పరామర్శించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి యోగక్షేమలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సంబంధిత వార్త: HYD: కుప్పకూలిన ఫ్లైఓవర్.. నలుగురి పరిస్థితి విషమం జరిగిన ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్, ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన అంశాలపైన జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే కఠిన చర్యలు సైతం తీసుకుంటామన్నారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పురపాలక శాఖ అరవింద్ కుమార్, ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. చదవండి: సర్పంచ్ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం.. -
ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డులో కూలిపోయిన ఫ్లైఓవర్
-
HYD: కుప్పకూలిన ఫ్లైఓవర్.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ వద్ద సాగర్ రింగ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మంగళవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది గాయపడగా వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక, ప్రమాదంలో గాయపడిన వారిని యూపీ, బీహార్ వాసులుగా గుర్తించారు. అయితే ఫ్లైఓవర్ అర్ధరాత్రి కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిదని అధికారులు తెలిపారు. పగలు సమయంలో ప్రమాదం జరిగి ఉంటే తీవ్ర ప్రమాదంగా మారి ఉండేది. ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బైరామల్గూడ ఫ్లైఓవర్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. ప్రమాదంపై ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, ఫ్లైఓవర్ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: నెలాఖరున బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం -
శరవేగంగా తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పనులు
-
విషాదం: ఫ్లైఓవర్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మౌలాలి ఫ్లైఓవర్ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ఆమె మృతిచెందింది. వివరాల ప్రకారం.. గౌతమ్ నగర్కు చెందిన సుజి(37) ఆదివారం మౌలాలి ఫ్లైఓవర్ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సదరు మహిళ ఆత్మహత్యాయత్నం గమనించిన స్థానికులు ఆమెను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నట్లు మల్కాజిగిరి సీఐ రవికుమార్ తెలిపారు. ఆమె మృతికి గల కారణాల గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
-
Hyderabad: ఫ్లైఓవర్ల మూసివేత.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..
సాక్షి, సిటీబ్యూరో: జగ్నే కీ రాత్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నగరంలోని ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు సోమవారం ప్రకటించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ప్రత్యామ్నాయాలు లేని గ్రీన్ల్యాండ్స్, లంగర్హౌస్ ఫ్లైఓవర్లు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే మినహా మిగిలినవి మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) కూడా ఆ సమయంలో మూసేస్తున్నట్లు ప్రకటించారు. వాహన చోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా 90102 03626లో సంప్రదించాలని సుధీర్బాబు సూచించారు. -
ఫ్లై ఓవర్ల కింద క్రీడా వేదికలు.. ఆలోచన బాగుందన్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఫ్లై ఓవర్ల కింద ఖాళీ స్థలంలో మొక్కలు పెంచడం, వాహనాల పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తుంటారు. అయితే నవీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా ఆలోచించి.. ఫ్లైఓవర్ కింద బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ధనుంజయ్ అనే యువకుడు ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఇది అద్భుతమైన ఆలోచన.. నవీ ముంబైలో ఫ్లై ఓవర్ల కింద ఆట స్థలాలను నిర్మించినట్లు అన్ని పట్టణాల్లోని ఫ్లై ఓవర్ల కింద ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీ పట్టణాల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అని అతడు ట్వీట్ చేశాడు ఈ ట్వీట్పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది మంచి ఆలోచన అని మంత్రి సైతం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ విధానాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్కు సూచించారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి తరహా క్రీడా వేదికలను అందుబాటులోకి తీసుకురావొచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. Let’s get this done in a few places in Hyderabad @arvindkumar_ias Looks like a nice idea https://t.co/o0CVTaYxqb — KTR (@KTRBRS) March 27, 2023 -
ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రోరైల్ సేవలను ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరిస్తాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను అనుసంధానిస్తాం. అంతేకాదు ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోరైల్ను నిర్మిస్తాం’ అని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ఎల్బీనగర్ చౌరస్తా నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ను శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా రూ.658 కోట్లతో 12 ప్రాజెక్టులు చేపడితే.. ఇప్పటివరకు తొమ్మిది ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని కేటీఆర్ చెప్పారు. బైరామల్గూడలో పెండింగ్లో ఉన్న మూడు ప్రాజెక్టులను కూడా సెపె్టంబర్లోపు పూర్తి చేస్తామని.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళతామని పేర్కొన్నారు. గతంలో ఎల్బీనగర్ చౌరస్తా దాటాలంటే కనీసం పది పదిహేను నిమిషాలు పట్టేదని.. ఇప్పుడా సమస్య తీరిందని చెప్పారు. పేదలకు పట్టాలిస్తాం.. హైదరాబాద్లో ఏడాదిన్నర కాలంలో వెయ్యి పడకల సామర్థ్యంతో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక 118 జీవో కింద దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెలాఖరులోగా పట్టాలు పంపిణీ చేస్తామని.. ఈ జీవో పరిధిలోకి రాని కాలనీలను కూడా త్వరలో దీని పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. జీవోలు 58, 59 కింద ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 1.28 లక్షల మందికి నివాస పట్టాలు ఇచ్చామని.. మిగతా పేదలకు కూడా పట్టాలిచ్చే బాధ్యత తమదేనని ప్రకటించారు. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీల కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఎల్బీనగర్ బీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు ఒకవైపు ఫ్లైఓవర్ను ప్రారంభించి, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలోనే.. మరోవైపు పార్టీ లో అంతర్గత వర్గపోరు బయటపడింది. బీఆర్ఎస్కు చెందిన చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వర్గీయులు రమణారెడ్డిపై దాడికి యత్నించగా ఆయన, ఆయన వర్గీయులు పరుగులు తీశారు. చివరికి పోలీసులు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమం అనంతరం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన ముద్దగోని రామ్మోహన్గౌడ్, రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవిరెడ్డి సుదీర్రెడ్డి కాంగ్రెస్లో గెలిచి, బీఆర్ఎస్లో చేరాక.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. పా ర్టీ లోని అసలైన ఉద్యమకారులు, సీనియర్లపై ఎమ్మెల్యే పెయిడ్ ఆరి్టస్టులు, గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎల్బీనగర్ జంక్షన్కు శ్రీకాంతాచారి పేరు ఎల్బీనగర్ జంక్షన్కు తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని.. ఫ్లైఓవర్కు మాల్ మైసమ్మ పేరు పెడతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హైదరాబాద్లో ఫ్లైఓవర్లే కాకుండా ప్రజారవాణా బాగా మెరుగుపడాల్సి ఉందన్నారు. -
ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ప్రారంభం...డ్రోన్ విజువల్స్
-
శరవేగంగా శ్రీనివాస సేతు నిర్మాణం పనులు
-
ట్రాఫిక్ దిగ్బంధంలో విరించి చౌరస్తా.. అదే సమస్యకు పరిష్కారం..
సాక్షి, బంజారాహిల్స్: అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించరు... పాదచారులు రోడ్డు దాటేందుకు వంతెనలు ఉండవు.. ఇష్టానుసారంగా కూడళ్లలో రాకపోకలు... ఫలితంగా వాహనదారులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు. గంటల తరబడి కూడళ్లలో సిగ్నళ్ల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగించే బంజారాహిల్స్ రోడ్ నెం. 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తాలో గడిచిన నాలుగు దశాబ్ధాలుగా ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి స్థానికులకు విముక్తి లభించడం లేదు. అదే రోడ్డు.. అదే చౌరస్తా... ఏ మాత్రం విస్తరణకు నోచుకోని ఈ కూడలిలో వాహనదారులే కాదు రోడ్డు దాటేందుకు పాదచారులు అవస్థలు పడుతున్నారు. మాసబ్ ట్యాంకు వైపు నుంచి పోలీస్ మెస్ చౌరస్తా, 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తా దాటి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు, కేర్ ఆస్పత్రి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ఇరుకైన రోడ్డుతో పాటు అడుగడుగునా పాదచారులు రోడ్డుదాటుతుండటంతో వాహనాల రాకపోకలు ముందుకు సాగడం లేదు. కేర్ ఆస్పత్రి వైపు నుంచి మాసబ్ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెం. 12, రోడ్ నెం. 13 వైపు వెళ్లే వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తుంది. వాహనాలు కేర్ ఆస్పత్రి నుంచి మొదలుకొని 1/12 చౌరస్తా వరకు స్తంభించిపోయి మాసబ్ట్యాంకు వైపు వెళ్ళడమే గగనంగా మారుతోంది. పరిష్కారమిదీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 1/12 విరించి చౌరస్తాలో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే అందుకు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. ఈ చౌరస్తాలో తప్పనిసరిగా ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు పాదచారుల వంతెన కూడా అవసరం. పింఛన్ ఆఫీస్ వైపు నుంచి దారి మూసివేత... మాసబ్ట్యాంకు వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు వెళ్లే మలుపు వద్ద శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉండగా ఈ ఆలయం వెనుక నుంచి పింఛన్ ఆఫీస్ గేటు లోపల గతంలో ఓ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోడ్డు అందుబాటులోకి వస్తుందనుకునేలోగా కొందరు అడ్డుపడటంతో ఈ దారిని బండరాళ్లు వేసి మూసివేశారు. గత పదేళ్లుగా ఈ సమస్యను పట్టించుకునే వారే లేరు. గుడి వెనుక దారి ఏర్పాటు చేస్తే మాసబ్ ట్యాంక్ వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు వెళ్లేవారు తేలికగా ఫ్రీ లెఫ్ట్లో ముందుకు సాగుతారు. దీని వల్ల చాలా వరకు ఈ కూడలిపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ప్రణాళికలేవీ..? మాసబ్ ట్యాంకు వైపు నుంచి పోలీస్ మెస్ చౌరస్తా, 1/12 చౌరస్తాల మీదుగా కేర్ ఆస్పత్రి దాకా ఓ ఫ్లై ఓవర్ నిర్మించాలనే ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ రోడ్డు విస్తరణ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫుట్పాత్లు కూడా అందుబాటులో లేవు. గజిబిజి ట్రాఫిక్ మధ్య అక్రమ పార్కింగ్లు పెద్ద సమస్యగా మారాయి. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. -
హైదరాబాద్లోని ఈ రూట్లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో నేటి నుంచి(జనవరి 30) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అంబర్పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నట్లు తెలిపారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్రోడ్స్,. 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్ఘాట్కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. 6 నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. -
ఫ్లైఓవర్ పైనుంచి కరెన్సీ నోట్లు.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. కేఆర్ మార్కెట్ ప్రాంతంలోని ఫ్లైఓవర్ పై నుంచి కరెన్సీ నోట్లు వెదజల్లాడు. దీంతో వీటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఫలితంగా కేఆర్ మార్కెట్ సిగ్నల్ వద్ద వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కోటు ధరించి ఫ్లై ఓవర్పైకి వెళ్లిన ఈ యువకుడు ఓ సంచిలో రూ.10 నోట్లు తీసుకెళ్లాడు. అనంతరం వాటిని పైనుంచి కిందకు విసిరేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు అతడి కోసం పైకి వెళ్లగా అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అతడ్ని కాసేపటికే మళ్లీ పట్టుకున్నారు. యువకుడి మతిస్తిమితం సరిగ్గా లేనట్లుందని పోలీసులు చెప్పారు. #Bizarre in #Bengaluru#Traffic came to halt on #Sirsi Circle #flyover and the road below it (#KRMarket) after a well-dressed youth went about throwing currency notes. Who was he and why did he do it is not known. @NammaBengaluroo @WFRising @TOIBengaluru @peakbengaluru pic.twitter.com/zXB6mndKm6 — Rakesh Prakash (@rakeshprakash1) January 24, 2023 చదవండి: మరో వివాదంలో డేరా బాబా.. తల్వార్తో కేక్ కట్టింగ్.. వీడియో వైరల్.. -
100% క్లీన్సిటీగా హైదరాబాద్
గచ్చిబౌలి (హైదరాబాద్): వంద శాతం మురుగు నీటి శుద్ధి చేసిన నగరంగా కొద్ది నెలల్లోనే హైదరాబాద్ నిలవనుందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలా దేశంలోనే మొదటి నగరంగా చరిత్రలో నిలిచిపోనుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతోపాటు ఏడెనిమిది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వంద శాతం మురుగునీటి శుద్ధీకరణకు రూ.3,866 కోట్ల నిధులను కేటాయించామన్నారు. 31 కొత్త ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్, మే నాటికి ఎస్టీపీల పనులు పూర్తవుతాయని, 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్ నిలవనుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో రూ.263 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్తగూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్పాస్ను కొత్త సంవత్సరం కానుకగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్లో జీవన ప్రమాణాలు పెంచి విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. వెయ్యి కోట్లతో నాలాల విస్తరణ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ)లో భాగంగా వెయ్యి కోట్లతో నాలాల విస్తరణ చేపడతామని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్తో దేశంలో ఏ నగరంలో జరగనంత మౌలిక వసతుల విస్తరణ హైదరాబాద్లో జరుగుతోందన్నారు. వేగంగా విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా ఎన్నో ప్రాజెక్ట్లు చేపడుతున్నామని, అందులో ముఖ్యమైనది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) అని చెప్పారు. దీని ద్వారా చేపట్టిన 34 ప్రాజెక్ట్లను ఇప్పటికే ప్రారంభించామని, ఈ సంవత్సరంలో మరో 11 ప్రాజెక్ట్లను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్కు వచ్చిన కొత్తవారు ఇక్కడి అభివృద్ధిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, రెండు మూడేళ్లలో పెద్దఎత్తున మార్పులు వచ్చాయని సోషల్ మీడియాలో చెబుతుంటే సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి–సంక్షేమం అనే ద్విముఖ లక్ష్యంతో విస్తృతమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. విద్య–ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇతర పట్టణాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్కు వలస వస్తున్నారని, అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పనుల్ని వేగంగా పూర్తిచేస్తున్న ఇంజినీర్ల కృషిని గుర్తించిన కేటీఆర్ కొత్తగూడ ఫ్లై ఓవర్ను ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షించిన జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) వెంకటరమణచే రిబ్బన్ కట్ చేయించడం విశేషం. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేయర్ విజయ లక్ష్మీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. -
కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
కొత్త సంవత్సరం కానుక.. కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి.. సిగ్నల్ లేని ప్రయాణానికి మార్గం సుగమమం చేసేందుకు మరో ఫ్లైఓవర్ కొత్త సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్పాస్లను మునిసిపల్ ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఆదివారం ప్రారంభించారు. దీనిద్వారా ఆల్విన్కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసేందుకు మార్గం సుగమమైంది. ఫ్లై ఓవర్ వివరాలు.. ► రూ.263.09 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం ► ఫ్లై ఓవర్తోపాటు 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్పాస్ ► ఫ్లైఓవర్ పొడవు దాదాపు 3 కి.మీ. ► 2, 3, 4, 5 లేన్లుగా గ్రేడ్ సెపరేటర్గా నిర్మాణం ► ఎస్సార్డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో ఇది 18వ ఫ్లైఓవర్ ► ప్రత్యేక ఆకర్షణగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు ఉపయోగాలు.. ► గచ్చిబౌలి వైపు నుంచి ఆలి్వన్కాలనీ జంక్షన్ వైపు వన్వే ఫ్లైఓవర్గా ఇది అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు, మసీద్బండ, బొటానికల్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలు ఫ్లైఓవర్ పైకి వెళ్తాయి. మాదాపూర్ లేదా హఫీజ్పేట్ వైపు వెళ్లవచ్చు. హఫీజ్పేట్ నుంచి వచ్చే గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలు అండర్ పాస్ ద్వారా వెళ్తాయి. దీంతో శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. ► కొండాపూర్, మాదాపూర్, కొత్తగూడ, హఫీజ్పేట్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు చేయవచ్చు. ► కొత్తగూడ, కొండాపూర్ బొటానికల్ గార్డెన్ జంక్షన్లలో వాహనదారులకు ఊరట. ► ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం. ► మాదాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలివైపు వెళ్లే వారు ఇక సులభంగా రాకపోకలు సాగించే అవకాశం. ► గచ్చిబౌలి కూడలి నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆలి్వన్కాలనీ, మాదాపూర్ ప్రాంతాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ► ట్రాఫిక్ సమస్య, సమయం, వాహనాల ఇంధనం ఖర్చు తగ్గుతాయి. ఏర్పాట్ల పరిశీలన.. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, డీఈ భరద్వాజ్, ఏఈ పరమేష్, ఏఈ శివకృష్ణ, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నవీన్, బోస్, నాయకులు శ్రీనివాస్యాదవ్, నర్సింహ్మసాగర్,ఖాజా, రామకృష్ణ ఆంజనేయులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. చదవండి: అతివలకు భరోసా.. హైదరాబాద్లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు -
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలు.. ఇవి అస్సలు మరవద్దు!
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ పార్టీ విషయంలో సభ్యత, భద్రత మరువద్దని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని చెప్తున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తరవాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలివి.. కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. ►వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ►ఇళ్లు, అపార్ట్మెంట్స్లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. ►యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. ►నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. పోలీసులు నెక్లెస్రోడ్, కేబీఆర్ పార్క్రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. చదవండి: New Year Celebrations: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో .. ►ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గలలో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్పేట్, మైండ్స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్పాస్లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
హైదరాబాద్ వాసుల్లో న్యూ ఇయర్ జోష్.. ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు బంద్..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు పూర్తిస్థాయిలో జరగనున్నాయి. యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలు కుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. తక్కువ ధరలో ఎంట్రీ.. నగరవాసుల నుంచి స్పందన ఎలా ఉంటుందో అనే భావనతో చాలా వరకూ న్యూ ఇయర్ ఈవెంట్లకు ధరలను కొంతవరకు అందుబాటులోనే నిర్ణయించారు. సూపర్ సోనిక్ టేకోవర్ పేరుతో నోవోటెల్ నిర్వహిస్తున్న ఈవెంట్కి రూ.999 ఆపై ధరలోనే ఎంట్రీ ఫీజు నిర్ణయించగా... తాజ్ డెక్కన్ ఎ నైట్ ఇన్ ప్యారిస్.. థీమ్ ఈవెంట్ కు బుకింగ్ ధర రూ. 1200తో ప్రారంభించింది. పార్క్ హైదరాబాద్లో న్యూ ఇయర్ పారీ్టకి రూ.2,499 ధర నిర్ణయించారు. పార్టీ యానిమల్స్కు కేరాఫ్ లాంటి ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్లో ది ప్రిజ్మ్ సర్కస్ ఈవెంట్కు రూ.4వేల నుంచి ధర నిర్ణయించారు. ఓపెన్ ఆడిటోరియంలలో నిర్వహిస్తున్న చాలా ఈవెంట్లకు రూ.1000కు సమీపంలోనే ధరలు ఉన్నాయి. తరలివస్తున్న సంగీతం... నోవోటెల్లో ఆర్టిస్ట్ ఎమ్కెషిÙఫ్ట్... (ఎమ్కెఎస్హెచ్ఎఫ్టీ) పేరొందిన లైవ్బ్యాండ్తో కలిసి నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నో పాజ్ పారీట్ల డిజెషాన్, ఆర్యన్ గాలా, రికాయాలు పాల్గొంటున్నారు. ఓం కన్వెన్షన్ దర్శన్ రావల్తో వేడుక ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు పాప్/సినీ గాయకుడు రామ్ మిరియాల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో థండర్ స్టైక్ పార్క్ పాటలతో అలరించనున్నారు. కంట్రీక్లబ్లో నిర్వహిస్తున్న ఈవెంట్లో డిజె ఆసిఫ్ ఇక్బాల్, గాయని అలీషా చినాయ్, అభిజిత్ సావంత్, బాంబే వైకింగ్స్, సినీతార స్నేహగుప్తా తదితరులు పాల్గొంటున్నారు. గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ మస్కిరాడె మిస్టరీ పార్టీ, ఏషియన్ ఫీస్టా థీమ్ పార్టీని నిర్వహిస్తోంది. డిజె షరాన్, అమీర్లు అతిథులను ఉత్సాహపరచనున్నారు. వండర్లాలో.. సన్బర్న్.. కొన్నేళ్లుగా నగరంలో అతిపెద్ద పార్టీ ఈవెంట్గా పేరొందిన సన్బర్న్ తిరిగొచ్చింది. సన్బర్న్ రీలోడ్ ఈవెంట్ నగరశివార్లలోని వండర్ లా అమ్యూజ్మెంట్ పార్క్లో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి నిర్వహిస్తున్నామని.. ఇందులో ఇటాలియన్ సెన్సేషన్ జియాన్ నోబిలీ, డైనమిక్ డీజె ఈడీఎం సంగీతానికి పేరొందిన జెఫిర్టోన్ – టీ–మ్యాటర్స్తో పాటుగా డీజె వివాన్లు అతిధుల్ని అలరిస్తారని నిర్వాహకులు వివరించారు. మందుబాబులూ.. పారాహుషార్ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పే వేళ.. డ్రంకెన్ డ్రైవ్లు చేపట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టనున్నారు. బార్లు, పబ్లు, వినోద కేంద్రాలు ఉండే వాణిజ్య ప్రాంతాల్లోని మార్గాలలో ట్రై కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టారు. ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ల నేతృత్వంలోని బృందాలు 31న రోజంతా విధులు నిర్వర్తిస్తారు. బ్రీత్ అనలైజర్లు, బారికేడ్లు ఇతరత్రా ఉపకరణాలను సిద్ధం చేశారు. మహిళా డ్రైవర్లు, మద్యం తాగిన మహిళలను తనిఖీలు చేస్తున్న సమయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి డీడీ చెకింగ్ కోసం ఎక్కువ సంఖ్యలో మహిళా ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు విధులు కేటాయించామని ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు బంద్.. ► 31 రాత్రి నుంచి జనవరి 1న తెల్లవారు జాము వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే, ఔటర్ రింగ్ రోడ్డులతో పాటు ఫ్లైఓవర్లు మూసివేసే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్, సరైన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తేనే ఆయా రోడ్లలో అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. ► మద్యం మత్తులో వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్, బైక్లపై విన్యాసాలు చేసినా, మైనర్లు డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్లు మూడు నెలలు లేదా శాశ్వతంగా రద్దు చేస్తారని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
సైబర్ సిటీలో సాఫీ జర్నీ.. నయా సాల్ కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన కొత్తగూడ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త సంవత్సర కానుకగా జన వరి మొదటి వారంలో మంత్రి కె.తారక రామా రావు ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. దాదాపు రూ.263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈప్రాజెక్టు వినియోగంలోకి వచ్చాక పరిసర కాలనీల్లోని వారితోపాటు ఆ మార్గాల్లో ప్రయాణించేవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తక్కువ దూరంలో ఉన్న బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కుల నుంచి సాఫీగా వెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఈ జంక్షన్ల పరిసరాల్లోనే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలుండటం తెలిసిందే. సదరు కంపెనీల్లోని ఉద్యోగుల రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి. మియాపూర్ దాకా మంచి కనెక్టివిటీ.. ఈ ఫ్లై ఓవర్ వల్ల గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. మియాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ పరిసర ప్రాంతాల వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో 100 శాతం ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంతో పాటు కొండాపూర్ జంక్షన్ లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుందని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 3 కిలో మీటర్ల పొడవుతో చేపట్టిన ఫ్లై ఓవర్తో పాటు 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్ను కూడా చేపట్టి పూర్తి చేశారు. ఫ్లై ఓవర్ ఇలా.. మెయిన్ ఫ్లై ఓవర్ ఎస్ఎల్ఎన్ టెర్మినస్ నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు.. బొటా నికల్ గార్డెన్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్వరకు..అక్కడి నుంచి కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ వరకు. పొడవు 2.21 కి.మీ. ∙మజీద్బండ రోడ్వైపు నుంచి వచ్చేవారి కోసం బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు 2 లేన్లతో అప్ర్యాంప్ 401మీటర్లు. ∙కొత్తగూడ జంక్షన్ నుంచి హైటెక్సిటీ వైపు 3 లేన్లతో డౌన్ ర్యాంప్ 383 మీటర్లు. ∙అన్నీ వెరసి దాదాపు 3 కి.మీ.ల పొడవు. హఫీజ్పేట నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు కొత్తగూడ జంక్షన్వద్ద 3లేన్ల అండర్పాస్.దీనిపొడవు 470 మీటర్లు. -
వన్యప్రాణులకు అభయం.. మొదటి ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా?
పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మంత్రమిదే. వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాం. అభివృద్ధి కార్యకలాపాల్లో ముందడుగు వేస్తూనే వన్యప్రాణుల్ని కాపాడడం కోసం అటవీ ప్రాంతాల నుంచి వెళ్లే ఎక్స్ప్రెస్వేలను ఎకో వంతెనలతో తీర్చిదిద్దుతున్నారు. ఆ వంతెనల కథాకమామిషు చూద్దాం.. మహారాష్ట్రలో నాగపూర్, ముంబై మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన బాలాసాహెబ్ ఠాక్రే సమృద్ధి మహా మార్గ్ (ఎక్స్ప్రెస్వే) మొదటి దశ ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంది. మన దేశంలో నిర్మించిన పూర్తి స్థాయి తొలి ఎకో వంతెన ఇది. రోడ్లపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వచ్చే వన్యప్రాణులకి ఎలాంటి హాని కలగకుండా ఈ ఎక్స్ప్రెస్ వే మార్గం పచ్చగా, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేలా నిర్మించారు. దారిన పోయే జంతువులు, వన్యప్రాణులు నిర్భయంగా సంచరించడానికి తొమ్మిది గ్రీన్ వంతెనలు (ప్లై ఓవర్ తరహా నిర్మాణాలు), మరో 17 అండర్ పాపెస్ నిర్మించారు. మొత్తం 701 కి.మీ. పొడవైన ఈ ఎక్స్ప్రెస్ తొలిదశలో 520 కి.మీ. పూర్తి చేసుకుంది. ఈ వంతెనతో ప్రయాణికులు వన్యమృగాల భయం లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించవచ్చు. మరో వైపు అవి తిరగడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ ఎక్స్ప్రెస్ వే పొడవున సంచరించే చిరుత పులులు రహదారులపైకి రాకుండా ఫెన్సింగ్ నిర్మిస్తారు. మహారాష్ట్రలో 10 జిల్లాల మీదుగా సాగే ఈ వంతెన నిర్మాణం రెండో దశ కూడా పూర్తయితే నాగపూర్, ముంబైల మధ్య 16 గంటలు పట్టే ప్రయాణ సమయం 8 గంటలు పడుతుంది. ఏమిటీ వన్యప్రాణుల వంతెనలు? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వన్యప్రాణుల రాకపోకలు సాగించడమే లక్ష్యంగా నిర్మించే వంతెనల్ని ఎకో వంతెనలు, వన్యప్రాణుల వంతెనలు అని పిలుస్తారు. అటవీ ప్రాంతాల్లో నిర్మించే హైవేలపై వాహనాలకు అడ్డంగా పడి జంతువులు ప్రాణాలు పోకుండా ఉండడం కోసం కూడా ఈ వంతెనల్ని నిర్మిస్తున్నారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో ఎకో వంతెనల నిర్మాణం సాగుతోంది. ఎకో వంతెనలు ఎన్ని రకాలు ? ఈ ఎకో వంతెనలు మూడు రకాలున్నాయి. చిన్న చిన్న పాలిచ్చే జంతువుల్ని కాపాడడం కోసం ఉద్దేశించిన కల్వర్టులు. వీటికే ఆంఫిబియాన్ వంతెనలని పిలుస్తారు. ఇక రెండో రకం కానోపి బ్రిడ్జెస్. కోతులు, ఉడతలు వంటి చెట్లపై నివసించే వాటిని రక్షించడానికి సులభంగా రాకపోకలు సాగించడానికి చెక్కలతో ఈ వంతెనల్ని నిర్మిస్తారు. ఇక కాంక్రీట్తో నిర్మించే అండర్పాసెస్, ఓవర్ పాస్ టన్నెల్స్. పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించడం కోసం వీటిని నిర్మిస్తారు. ఈ ఎకో వంతెనల నిర్మాణం సాగించడానికి ముందు ఆయా దేశాలకు చెందిన పర్యావరణ పరిరక్షకులు వాటిని నిర్మించే ప్రాంతం, సైజుని అధ్యయనం చేస్తారు. ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చిన తర్వాతే వీటి నిర్మాణం సాగుతుంది. మొదటి వంతెన ఎక్కడ ? ఫ్రాన్స్లో 1950 సంవత్సరంలో ఈ ఎకో వంతెనల నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత స్కాట్ల్యాండ్, బ్రిటన్ వంటి దేశాలు వీటి నిర్మాణంపై మక్కువ చూపించాయి. మొత్తమ్మీద యూరప్ దేశాల్లో ఈ ఎకో బ్రిడ్జీల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ జంతువులు మరణిస్తూ ఉండడంతో మన దేశంలో ఉత్తరాఖండ్లోని కలాధుంగి–నైనిటాల్ హైవే మధ్య రామ్నగర్ ఫారెస్ట్ డివిజన్లో చెట్లపై తిరుగాడే జంతువుల కోసం 90 అడుగుల పొడవైన వంతెన నిర్మించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రాఫిక్ చిక్కులకు చెక్.. శిల్పా లేఔట్ ఫ్లై ఓవర్ నేడు ప్రారంభం
-
Hyderabad: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. ఐటీ కారిడార్లో ఇక రయ్ రయ్!
సాక్షి, హైదరాబాద్: ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు తప్పించడంతో పాటు జూబ్లీహిల్స్ మీదుగా ఓఆర్ఆర్ వెళ్లేందుకు ఎంతో అనువైన శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్ను శుక్రవారం మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్నంబర్ 45 నుంచి ఐకియా మీదుగా ఈ కొత్త ఫ్లై ఓవర్ ద్వారా నేరుగా ఓఆర్ఆర్కు.. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికీ ఈజీగా చేరుకోవచ్చు. దీనిద్వారా గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. గచ్చిబౌలి జంక్షన్లో రద్దీ సమయంలో పదివేల వాహనాలు (పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ నాలెడ్జి సెంటర్(హెచ్కేసీ), పరిసరాల్లోని ఐటీ కంపెనీలకు ఎంతో సదుపాయం. హైటెక్ సిటీ, హెచ్కేసీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల మధ్య మంచి కనెక్టివిటీతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు (పంజగుట్ట), ఔటర్ రింగ్రోడ్డుకు(గచ్చిబౌలి) కూడా ఇది మంచి కనెక్టివిటీ అని అధికారులు తెలిపారు. చదవండి: హైదరాబాద్లో లగ్జరీ వాహనాల క్రేజ్.. రోడ్లపై రూ.కోటి నుంచి రూ.7 కోట్ల ఖరీదైన కార్లు గడచిన ఆరేళ్లలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ పూర్తిచేసిన 17వ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు వ్యయం.. భూసేకరణ, టీడీఆర్లతో సహా రూ.466 కోట్లు. ఫ్లై ఓవర్ పొడవు 2,810 మీటర్లు. నాలుగు లేన్లు.. రెండువైపులా ప్రయాణించవచ్చు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Cyberabad Traffic Police: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి
-
నాగోల్ లో ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్
-
నాగోల్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద రూ. 143 కోట్లతో 990 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. దీంతో నాగోల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నామన్నారు. నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. లేదంటే బెంగళూరు తరహాలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎఎస్సార్డీపీ కార్యక్రమాన్ని తీసుకుమని.. రూ. 8వేల52 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం 32 ప్రాజెక్టులు పూర్తికగా 16 ఫ్లై ఓవర్లు ఉన్నాయన్నారు. ‘హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు అవి తగ్గిపోయాయి. ఎల్బీనగర్ నియోజకవర్గలో 700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశాం. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం. ఎల్బీనగర్ ప్రాంతంలో 600 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశాం. భవిష్యత్తు తరాలకు మెరుగైన వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రాజకీయాలు ఎన్నికల అప్పుడు చేద్దాం. ఇప్పుడు అభివృద్ధి పై ఫోకస్ చేద్దాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. As the #NagoleFlyover is all set for inauguration by @TSMAUDOnline Minister Sri @KTRTRS today, here's a quick recap of all Road over Bridges (RoBs) & Road under Bridges (RuBs) that #Telangana Govt. has built in #Hyderabad in last 8 years.#SRDP #HappeningHyderabad@TelanganaCMO pic.twitter.com/KyIH67gybQ — Telangana Digital Media Wing (@DigitalMediaTS) October 26, 2022 తీరనున్న ట్రాఫిక్ కష్ట్రాలు రెండు వైపుల ప్రయాణించేలా ఉన్న ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ సర్వాంగ సుందరంగా తీర్చదిద్దింది. ఒక్కోవైపు మూడు లేన్లతో ఉన్న ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కావడంతోపాటు నాగోల్ చౌరస్తా వద్ద, బండ్లగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు 75 శాతం పరిష్కారం కానున్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ల మీదుగా ఉప్పల్ వరకు వచ్చేవారు ఈ ఫ్లైఓవర్తో సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇది 16వ ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ ద్వారా పూర్తయిన పనుల్లో ఇది 16వ ఫ్లైఓవర్. ఇప్పటికే 15 ఫ్లైఓవర్లతోపాటు 5 అండర్పాస్లు, 7 ఆర్ఓబీ/ఆర్యూబీలు, దుర్గంచెరువు కేబుల్బ్రిడ్జి, పంజగుట్ట స్టీల్బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ పరిసరాల్లోని నాలుగు జంక్షన్లలో రూ. 448 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. సులభ ప్రయాణం.. 2015 సర్వే మేరకు నాగోలు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు 7,535 వాహనాలు(పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 12,648కి చేరుకోనుందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.దేవానంద్ తెలిపారు. సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం వల్ల వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఎస్సార్డీపీ అధికారులు కె. రమేష్ బాబు, రోహిణి, జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు నాగోలు ప్లైఓవర్ను పరిశీలించారు. -
నాగోలు ఫ్లై ఓవర్.. ఎల్బీనగర్– సికింద్రాబాద్ మధ్య ఇక రయ్రయ్
సాక్షి, హైదరాబాద్/నాగోలు: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన పనుల్లో మరో ఫ్లై ఓవర్ నేటినుంచి అందుబాటులోకి రానుంది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఒక్కోవైపు మూడు లేన్లతో ఉన్న ఈ ఫ్లైఓవర్ వినియోగంతో ఎల్బీనగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కావడంతోపాటు నాగోల్ చౌరస్తా వద్ద, బండ్లగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు 75 శాతం పరిష్కారం కానున్నాయని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ల మీదుగా ఉప్పల్ వరకు వచ్చేవారు ఈ ఫ్లైఓవర్తో సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇది 16వ ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ ద్వారా పూర్తయిన పనుల్లో ఇది 16వ ఫ్లైఓవర్. ఇప్పటికే 15 ఫ్లైఓవర్లతోపాటు 5 అండర్పాస్లు, 7 ఆర్ఓబీ/ఆర్యూబీలు, దుర్గంచెరువు కేబుల్బ్రిడ్జి, పంజగుట్ట స్టీల్బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ పరిసరాల్లోని నాలుగు జంక్షన్లలో రూ. 448 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మాణమైన నాగోల్ ఫ్లైఓవర్ ఇవ్వాళటి నుండి అందుబాటులోకి వస్తుంది. ఆరు లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు ఉంది. @TSMAUDOnline @GHMCOnline pic.twitter.com/a4S5UsKti4 — KTR (@KTRTRS) October 26, 2022 సులభ ప్రయాణం.. 2015 సర్వే మేరకు నాగోలు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు 7,535 వాహనాలు(పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 12,648కి చేరుకోనుందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.దేవానంద్ తెలిపారు. సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం వల్ల వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఎస్సార్డీపీ అధికారులు కె. రమేష్ బాబు, రోహిణి, జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు నాగోలు ప్లైఓవర్ను పరిశీలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాగోల్ ఫ్లై ఓవర్ రెడీ.. ఇక రయ్ రయ్ (ఫోటోలు)
-
నెల్లూరు హరనాథపురం జంక్షన్ లో ఫ్లైఓవర్ నిర్మాణం
-
YV Subba Reddy: తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు
సాక్షి, తిరుపతి: తిరుపతి శ్రీనివాససేతు రెండో దశ ఫ్లైఓవర్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.684కోట్లతో శ్రీనివాససేతు నిర్మాణంను చేపట్టినట్లు తెలిపారు. త్వరితగతిన మూడో దశ ఫ్లైఓవర్ పనులను కూడా పూర్తి చేసి జనవరి నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (దేవరగట్టు: భారీ వర్షంలో బన్నీ ఉత్సవం.. 50 మందికిపైగా గాయాలు!) -
అభివృద్ధి తెలియని నేతలకు విమర్శించే అర్హత లేదు: అనిల్కుమార్
సాక్షి, నెల్లూరు: రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిని సంక్రాంతి పండుగకు ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు ఆలస్యం అయ్యాయి. ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తోంది. అక్టోబర్ 10న పెన్నా నదిలో మరో వంతెనకు శంకుస్థాపన చేయబోతున్నాం. ఐదేళ్ల పాలనలో టీడీపీ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసింది శూన్యం. అభివృద్ధి తెలియని నేతలకు విమర్శించే స్థాయి లేదు అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చదవండి: (ఆ విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరాం: మంత్రి అమర్నాథ్) -
ఆధునిక టెక్నాలజీతో.. కొత్త ఫ్లైఓవర్
అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పటి వరకు మహానగరాల్లోనే నిర్మించిన విధంగా నెల్లూరు నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే నగరంలో వెంకటేశ్వరపురం, ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి ప్రాంతాల్లో మూడు ఫ్లై ఓవర్లు ఉన్నాయి. తాజాగా మినీబైపాస్లో హరనాథపురం సర్కిల్లో నాల్గో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఫ్లై ఓవర్ గతంలో నిర్మించిన మూడింటి కంటే సెంటర్ స్పాన్లు ప్రీ్రస్టెస్ గడ్డర్లు టెక్నాలజీతో విభిన్నమైందిగా చెప్పుకోవచ్చు. నెల్లూరు (బారకాసు): నగరంలోని ముత్తుకూరురోడ్డులో రామలింగాపురం కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మార్గంలో నాలుగు వైపులా వాహనాల రాకపోకలను రెండు రోజుల నుంచి నిలిపివేసి పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే కీలకమైన పిల్లర్ల నిర్మాణం పూర్తికావడంతో గడ్డర్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధానంగా ఫ్లై ఓవర్కు రెండు వైపులా ఎర్త్ వర్క్ పనులు ముమ్మరం చేశారు. నెల్లూరు నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా జనాభా సంఖ్య కూడా పెరగడంతో పాటు వాహనాల రాకపోకలు అధికమవుతున్నాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడం కారణంగా వాహనదారులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని గుర్తించిన నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం చొరవ తీసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రభుత్వం కేంద్రం నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణం మంజూరు చేయించి అవసరమైన నిధులు కూడా విడుదల చేయించింది. కరోనాతో పనులు ఆలస్యం 2020 ఆగస్టులో రూ.41.88 కోట్ల అంచనాలతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణ పనులు 2022 ఆగస్టు కల్లా పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా అడుగులు ముందుకేశారు. అయితే ఓవైపు కరోనా, మరో వైపు వర్షాలు కారణంగా నిర్మాణ పనులు నెమ్మదిగా జరిగే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను జరిగేలా తగు చర్యలు తీసుకున్నారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పనులను పూర్తి చేసేందుకు మరో ఆరో నెలలు పొడిగింపునకు అనుమతి ఇచ్చింది. 2023 ఫిబ్రవరి కల్లా పూర్తి చేసేలా ఇటు అధికారులకు, అటు కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పూర్తికి మరో ఐదు నెలలు గడువు ఉన్నప్పటికీ అధికారులు మరో మూడు నెలల్లోపు పూర్తి చేయాలనే ప్రయత్నంతో పనుల్లో వేగాన్ని పెంచారు. ఆధునిక టెక్నాలజీతో.. రామలింగాపురం కూడలిలో జరుగుతున్న ఫ్లై ఓవర్ మొట్టమొదటి సారిగా మహానగరాల్లో నిర్మించిన ఆధునిక టెక్నాలజీ తరహాలో నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇటువంటి టెక్నాలజీతో ఫ్లై ఓవర్ వంతెనల నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లై ఓవర్ టెక్నాలజీతో మహానగరాలైన హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లోనే జరిగాయి. ఈ వంతెన పొడవు 810 మీటర్లు. 10 పిల్లర్లు ఆధారంతో వంతెనను నిర్మిస్తున్నారు. ఒక పిల్లర్కు మరో పిల్లర్కు మధ్యలో (సెంటర్ స్పాన్) భీమ్లను డయాఫ్రంభీమ్లో అమర్చుతున్నారు. ఈ సెంటర్ స్పాన్లు ప్రీ్రస్టెస్ గడ్డర్లు టెక్నాలజీతో 9 అడుగుల ఎత్తు, 100 అడుగుల పొడవుతో ఏర్పాటు చేయడం విశేషం. ఈ వంతెన నిర్మాణం పూర్తితో త్వరలో ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. త్వరతగతిన పూర్తికి చర్యలు నగరంలోని రామలింగాపురం సెంటర్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ త్వరతిగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. 2023 ఫిబ్రవరి కల్లా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనత త్వరగా మరో మూడు నెలల్లో పూర్తి చేసేలా పనులు వేగవంతంగా జరిపిస్తున్నాం. త్వరతిగతిన వంతెన నిర్మాణం పూర్తికి మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. – అనిల్కుమార్రెడ్డి, డీఈఈ, ఎన్హెచ్ విభాగం, ఏపీ ఆర్అండ్బీ శాఖ -
Srikakulam: సిక్కోలు నగరానికి న్యూలుక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా విశిష్టతలు చిత్తరువుల రూపంలో కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి. గోడలపై గీసిన చిత్రాలు ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తున్నాయి. అందమైన కుడ్య చిత్రాలు నగరానికి కొత్తశోభను తీసుకొస్తున్నాయి. పరిసరాలు అందంగా ఉంటే ఆ అనుభూతే వేరు. సిక్కోలు నగరంలో ఇప్పుడదే కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లోని పలు కూడళ్లు, ఫ్లైవోవర్లు, వంతెనలు, ప్రభుత్వ ప్రాంగణాల గోడలపై రంగులతో అద్దుతున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా కనబడుతున్నాయి. నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా శ్రీకాకుళంలో కుడ్య చిత్రాలను వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా రంగులతో వేస్తున్న ఈ చిత్రాలు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల జోరుగా పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై వోవర్లు, వంతెనలు, సెంట్రల్ డివైడర్లు, పార్కులు, పాఠశాలు/కళాశాలల ప్రహరీలు, ప్రభుత్వభవనాల కాంపౌడ్స్కు జిల్లా, నగర చరిత్రను తెలియ జేసే కుడ్యచిత్రాలను ప్రత్యేక రంగులతో వేస్తున్నారు. నగరంలో 23 ప్రదేశాల్లో ఈ రకంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అరసవల్లి, వంశధార, నాగావళి, మన జాతీయతను తెలియజేసే పెయింటింగ్స్ వేస్తున్నారు. రూ.1.43 కోట్లతో ఈ పనుల్ని చేపడుతున్నారు. శరవేగంగా పనులు జరిగేలా కమిషనర్ ఓబులేసు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా రాజీ పడకుండా, దగ్గరుండి పెయింటింగ్స్ వేయించే పనిలో నిమగ్నమయ్యారు. (క్లిక్: డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు) -
ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయండి
అంబర్పేట: అంబర్పేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం గడువులోపు పూర్తయ్యేలా ఆయా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అధికారులకు సూచించారు. అంబర్పేటలోని గోల్నాక నుంచి ఛే నంబర్ చౌరస్తా మీదుగా ముఖ్రమ్ హోటల్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులపై మంగళవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఫ్లైఓవర్ కోసం చేపట్టిన స్థల సేకరణ పూర్తిస్థాయిలో సేకరించారా అని ప్రశ్నించారు. నిర్మాణం సందర్భంగా పైప్లైన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ తొలగించే క్రమంలో స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నాణ్యత ప్రమాణాలతో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. త్వరలో పూర్తిస్థాయి సమీక్ష సమావేశాన్ని చేపడతానని ఆయన అధికారులకు తెలిపారు. కార్పొరేటర్లు పద్మ వెంకట్రెడ్డి, ఉమా రమేష్ యాదవ్, అమృత, బీజేపీ నేతలు గౌతమ్రావు, వెంకట్రెడ్డి, అజయ్కుమార్, వనం రమేష్, చిట్టి శ్రీధర్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా.. కారణం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్కు కొనసాగింపుగా నిర్మించిన ఎక్స్టెన్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది. మంగళవారం ఉదయం మంత్రి కేటీఆర్ ఫ్లోవర్ను ప్రారంభించాల్సి ఉండగా.. ఓపెనింగ్ను ఈనెల 27కు వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు, లిక్కర్ స్కామ్కు సంబంధించి బీజేపీ కార్యకర్తల ఆందోళన, పాతబస్తీలో ఉద్రిక్తత నేపథ్యంలో కేటీఆర్ పర్యటనను అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట జంక్షన్ వద్ద ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుంది. చాంద్రాయణగుట్ట జంక్షన్ నుంచి వివిధ మార్గాలవైపు వెళ్లేవారికి ఎంతో సదుపాయం కలగనుంది. జంక్షన్ వద్ద వేచిఉండే సమయం తగ్గడంతోపాటు ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గనున్నాయి. ఫ్లైఓవర్ కింద పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారింది. ఫిల్లర్ల నడుమ చక్కటి గార్డెనింగ్ను ఏర్పాటు చేశారు. పాత, కొత్త ఫ్లై ఓవర్ల అనుసంధానం కారణంగా పాత ఫ్లై ఓవర్ను సైతం మూసేయ్యడంతో ఇన్నాళ్ల పాటు ఇబ్బందులకు గురైన వాహహనదారులకు ఇక ఊరట లభించనుంది. ఇప్పటి వరకు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ దిగగానే సంతోష్నగర్ వైపు రోడ్డు ఇరుకుగా (ఒకవైపు దర్గా, మరోవైపు దేవాలయం, దర్గా) ఉండి వాహనాల వేగం తగ్గి ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించేది. దీనికి తోడు కందికల్ గేట్ నుంచి చాంద్రాయణగుట్ట పాత పోలీస్స్టేషన్ రహదారి సిగ్నల్ కూడా ఇక్కడే ఉండడంతో సమస్య మరింత జటిలమైంది. ఈ సమస్య పరిష్కారానికి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రతిపాదనతో ఎక్స్టెన్షన్ ఫ్లై ఓవర్ను నిర్మించారు. దీంతో మొత్తం ఫ్లై ఓవర్ 980 మీటర్లకు చేరుకుంది. చదవండి: Breaking: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు 14 రోజుల రిమాండ్ ఫ్లై ఓవర్ ఎక్స్టెన్షన్ పొడవు: 674 మీటర్లు వెడల్పు: 16.61 మీటర్లు లేన్లు: 4, ప్రయాణం: రెండు వైపులా పాతబస్తీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ పాతబస్తీ అభివృద్ధి కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్లైవర్ల నిర్మాణాలు చేపట్టారు. 2005– 2007మధ్య కాలంలో మలక్పేట, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్లను నిర్మించారు. వీటితో పాటు ఉప్పుగూడ, కందికల్ రైల్వేగేట్ల వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి 2007 నవంబర్లో శంకుస్థాపన చేశారు. ఇందులో ఒకటి ఆర్ఓబీ, మరొకటి ఆర్యూబీ. ఇవే కాకుండా పాతబస్తీలో ప్రస్తుతం బహదూర్పురా, ఫిసల్బండ ప్రాంతాల్లోనూ రెండు ఫ్లై ఓవర్లు ఇటీవలే వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఫలక్నుమా, డబిర్పురాలలో రైల్వే వంతెనలు కూడా ఉన్నాయి. వాహనదారుల కష్టాలు తప్పాయి.. చాంద్రాయణగుట్టలో వాహనదారుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఫ్లై ఓవర్ నిర్మాణ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారు. చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. – ఫహద్ బిన్ అబ్దాద్, ఉప్పుగూడ కార్పొరేటర్ ట్రాఫిక్ సమస్య దూరం.. టీఆర్ఎస్ సర్కార్ నగరంలో ట్రాఫిక్ సమస్యను దూరం చేసేలా వంతెనలను నిర్మిస్తుండడం సంతోషకరం. ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుండటంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాదు. ముఖ్యంగా కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనదారుల ఇబ్బందులు తొలగుతాయి. – శ్రీనివాస్ గౌడ్, కందికల్ గేట్ ఎస్సార్డీపీ ఫలాలు.. నగరంలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి చేపట్టిన 41 ఎస్సార్డీపీ పనుల్లో చాంద్రాయణగుట్ట ఎక్స్టెన్షన్ ఫ్లైవర్తో 30 పనులు పూర్తయ్యాయి. మిగతా 11 పనులు పురోగతిలో ఉన్నాయి. వీటిల్లో నాగోల్ ఫ్లై ఓవర్ మరో రెండునెలల్లో అందుబాటులోకి రానుంది. శిల్పా లేఔట్, కొండాపూర్ ఫ్లై ఓవర్లు సైతం ఈ సంవత్సరంలో పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులున్నారు. ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు ఇప్పటి వరకు ఏడు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఆరాంఘర్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ వరకు అతి పొడవైన ఫ్లైవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. -
భార్య పుట్టింటికి వెళ్లిందనే..
మణికొండ: మద్యం తాగొద్దన్నందుకు భార్యను తిట్టడంతో, ఆమె పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికిలోనై నార్సింగి ఫ్లై ఓవర్పై నుంచి ఔటర్రింగ్ రోడ్డుపైకి దూకి భీమప్ప(25) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా, మద్దురు మండలం, చింతల్దిన్నె గ్రామానికి చెందిన బీమప్ప, సత్తమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిరువురు నార్సింగిలో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భీమప్ప రోజు మద్యం తాగి వచ్చి భార్యను వేదిస్తున్నాడు. దాంతో విసిగిపోయిన ఆమె సోమవారం రాత్రి నార్సింగిలోనే ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లింది. మర్నాడు అక్కడి నుంచి కిషన్నగర్లోని తల్లి ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికిలోనైన భీమప్ప మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య ) -
ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
మణికొండ: ప్లైఓవర్పై నుంచి ఔటర్రింగ్ రోడ్డుపైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నారాయణపేట్ జిల్లా, మద్డూరు మండలం, చింతల్పేట్ గ్రామానికి చెందిన భీమప్ప(30) గత కొంత కాలంగా నార్సింగి మున్సిపల్ కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అతను స్థానిక ఫ్లై ఓవర్పై నుంచి ఔటర్ రింగ్రోడ్డుపైకి దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రాణాలు తీసిన వేగం) -
తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు.. ఇవి గమనించండి!
సాక్షి, తిరుపతి: నగరంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపై శ్రీనివాస సేతు ప్రాజెక్టు పనుల నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ వైపునకు వచ్చే వాహనాలు, వెళ్లే వాహనాలను తాత్కాలికంగా మళ్లిస్తున్నామన్నారు. ఈ మార్పు శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. బెంగళూరు, చిత్తూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామానుజపల్లి చెక్పోస్ట్ వద్ద నుంచి శ్రీపద్మావతి మహిళా యునివర్సిటీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండుకు చేరుకోవచ్చు. చంద్రగిరి టౌన్, చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోవచ్చు . మదనపల్లి, పీలేరు, రాయచోటి, అనంతపురం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు చెర్లోపల్లి సర్కిల్, బాలాజి కాలనీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయి. చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోవచ్చు. లైట్ మోటార్ వాహనాలు: బస్టాండ్ నుంచి రేణిగుంటకు.. రామానుజం సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్ వైపు వెళ్లాలంటే డీబీఆర్ హాస్పిటల్ మీదుగా హీరో హోండా షోరూమ్ వద్ద రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటుకొని వెళ్లవచ్చు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉన్నట్లు గుర్తించగలరు. పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు: రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్, తిరుచానూర్ ఫ్లై ఓవర్, ఆర్సీపురం జంక్షన్, ఎమ్మార్పల్లి పోలీసు స్టేషన్, అన్నమయ్య సర్కిల్, వెస్ట్ చర్చ్, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయి. హైదరాబాద్, కర్నూల్, కడప వాహనాలు కరకంబాడి మీదుగా బస్టాండు చేసుకోవచ్చు. నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చెన్నై నుంచి వచ్చే వాహనాలు రేణిగుంట రమణవిలాస్ సర్కిల్ మీదుగా కరకంబాడి, మంగళం లీలామహల్ మీదుగా వెళ్లచ్చు. లేకుంటే, గాజులమండ్యం జంక్షన్, ఆర్సీ పురం జంక్షన్, రామానుజపల్లి చెక్ పోస్ట్, మహిళా యునివర్సిటీ, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండ్ చేరుకోవచ్చు. అత్యవసర వాహనాలు ట్రాఫిక్ మళ్లింపు కారణంగా అంబులెన్స్, మెడికల్, ప్రభుత్వ వాహనాలకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ సహకరించాలి. అలాగే ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు, విద్యాసంస్థలు తమ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం అనువైన మార్గాన్ని ఎంచుకొని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. (క్లిక్: హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి) -
తక్షణమే పూర్తి చేయాలి.. సీఎం జగన్ ఆదేశాలు
-
ఫోటోలు: కూకట్పల్లిలో కొత్తగా ప్రారంభమైన ఫ్లైఓవర్ ఎలా ఉందో చూశారా..
-
ఇక కూకట్పల్లి ట్రాఫిక్ ఫ్రీ.. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు
Kaithalapur Flyover: నిత్యం రణగొణధ్వనులతో పారిశ్రామిక ప్రాంతం అట్టుడికేది. అదేస్థాయిలో అరగంటలోనే ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ రద్దీతో నిండి వాహనాల ధ్వనులతో రెండు దశాబ్ధాలుగా కూకట్పల్లి ప్రజలు పడ్డ వేదన ఇంతా అంతా కాదు. ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పనిచేస్తామని గతంలో అందరూ ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చినప్పటికీ ఎవరూ ఆచరణలో పెట్టకపోవడం గమనార్హం. కానీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభివృద్ధినే ఎజెండాగా మార్చుకోవడంతో పాటు ట్రాఫిక్ ఫ్రీ కూకట్పల్లిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఆయన సర్వ ప్రయత్నాలు చేశారు. ఆఖరికి అధిష్టానంతో ఎదురొడ్డి పోరాడి ప్రజల సమస్యలను తీర్చేందుకు నిలబడటం విశేషం. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు.. ► గత ఏడేళ్లలో సుమారు 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టగా అంతకు మించి నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. ► ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఆయన తొక్కని గడప లేదు. అన్ని శాఖల అధికారులు, మంత్రులను కలిసి తన విన్నపాన్ని తెలిపారు. దీంతో ప్రభుత్వం బాలానగర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటి నుంచి అదే పనిగా నిర్మాణం పూర్తయ్యేంత వరకు రాత్రింబవళ్లు అక్కడే ఉండి బాలానగర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ► బ్రిడ్జి నిర్మాణంతో నగరంలోని బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఫతేనగర్, కూకట్పల్లి, మూసాపేట, చందానగర్, మియాపూర్, బొల్లారం ప్రాంతాల్లో నివాసం ఉండే లక్షలాది మంది ప్రజలకు ఉపశమనం కలిగింది. ► అదే విధంగా ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నిజాంపేట, ప్రగతినగర్ల నుంచి జేఎన్టీయూ మీదుగా విధులకు వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం హైటెక్ సిటీ స్పైనల్ రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంతో ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊపిరి తీసుకున్నారు. ► ఇదిలా ఉండగా కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారి గంటల పాటు ట్రాఫిక్ నిలిచి సిలికాన్ వ్యాలీ సిటీగా పేరొందిన మాదాపూర్కు ప్రధాన రహదారి అయిన హైటెక్ సిటీ బ్రిడ్జి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయడం విశేషం. ► ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఆ ప్రాంతం ఎంతో అందాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ఊరట కలిగించింది. నాలుగో బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు.. ► బాలానగర్, మూసాపేట ప్రాంతాలకు కొంగుబంగారంగా నిలిచే నాలుగో బ్రిడ్జి నిర్మాణ కై త్లాపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం మంగళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ► ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాన్ని తలపించే మూసాపేట కైత్లాపూర్ ప్రాంతంలో ఈ బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు వేసినట్లైంది. ► గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలను హైటెక్ సిటీ కి నేరుగా వెళ్లే రహదారి ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చాయి. ► కూకట్పల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు ఎమ్మెల్యే కృష్ణారావు అంశాల వారీగా సమస్యలను పరిశీలించి వాటిపై అధ్యయనం చేసి తన హయాంలోనే నాలుగు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం విశేషం. ► కైత్లాపూర్ బ్రిడ్జి నిర్మాణంతో కూకట్పల్లి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకోనుంది. -
రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల పనులు తక్షణం పూర్తిచేయాలి: సీఎం జగన్
-
దమ్ముంటే నా మీద కేసులు పెట్టండి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకొచ్చి యువత కడుపు కొడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆవేదనతో వారు ఆందోళన చేస్తుంటే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో నూతనంగా అందుబాటులోకి వచ్చిన కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. మొత్తం రూ.86 కోట్లతో ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో హైటెక్ సిటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇది హైదరాబాద్ 30వ ఫ్లైఓవర్ అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇంకో 17 ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయని ఈ ఏడాదిలో మరో 6 అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐడీపీఎల్ నుంచి రోడ్లు వేస్తుంటే కేసులు పెట్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారంట. కిషన్ రెడ్డికి దమ్ముంటే మున్సిపల్ మంత్రినైన నా మీద కేసు పెట్టండి. చిన్నా చితక అధికారులను బెదిరించొద్దు. మీకు చేతనైతే రోడ్లు, ఫ్లై ఓవర్లు కట్టండి అంతే కాని అభివృద్ధి అడ్డుకోకండిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కేటీఆర్ కోరారు. చదవండి: (తెలంగాణకు పట్టణ కళ) కిషన్ రెడ్డి మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉండి అగ్నిపథ్లో చేరితే డ్రైవర్లు, బట్టలు ఉతికే స్కిల్స్ వస్తాయి అంటున్నారు. ఈ మాత్రం దానికి దేశ యువత మిలిటరీలో చేరాలా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 'బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్ వస్తారు అని అంటున్నారు. ఏ మొహం పెట్టుకుని హైదరాబాద్కు వస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా వేల కోట్ల రూపాయల పనులు శంకుస్థాపన చేశారని చెప్తారు అందులో ఎంత నిజముందో తెలియదు. హైదరాబాద్కు టూరిస్టులు వస్తారు పోతారు. మన కేసీఆర్ ఇక్కడే ఉంటారు. వచ్చే టూరిస్టులు ఏం తెచ్చారో ఏం ఇచ్చారో చెప్పాలని' మంత్రి కేటీఆర్ కోరారు. -
వాటిని పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోండి: సీఎం జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ మేరకు పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్లో ఉండకూడదు. అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకొని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఫలితాలు కనిపించాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తిచేయడమే కాకుండా, గుంతలు లేకుండా రోడ్లను తీర్చిదిద్దాలి. నివర్ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోవాలి. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. కార్పొరేషన్లు, మున్పిపాల్టీల్లో జులై 15 కల్లా గుంతలు పూడ్చాలి. జూలై 20న ఫొటో గ్యాలరీలు పెట్టాలి. పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధంచేయాలి’ అని అధికారులకు స్పష్టం చేశారు. కుట్రలు పన్నుతున్నారు.. ‘రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయి. అయినా సడలి సంకల్పంతో అడుగులు వేస్తూ సడలని సంకల్పంతో ముందుకుసాగుతున్నాం. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా కూడా నిధులకు లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలేకుండా చూసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తిచేస్తున్నాం’ అని సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. -
కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
హైఫై ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ పనుల్లో మరో ప్రత్యేకత!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా చేపట్టిన వివిధ పనుల్లో పలు ప్రత్యేకతలు చూపింది. అసాధ్యమనుకున్న కేబుల్ స్టే బ్రిడ్జి వంటి పనులతో పాటు వివిధ ఫ్లైఓవర్లలో అడపాదడపా ప్రత్యేకతలు చూపుతున్నారు. నగరంలో ఇప్పటి వరకు లేని అధునాతన సాంకేతిక విధానాలు అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా మైండ్స్పేస్ దగ్గరి శిల్పా లే అవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా స్టీల్ పోర్టల్ ఫ్రేమ్స్ అమరుస్తున్నారు. ఏమిటీ ప్రత్యేకత? ►ఫ్లైఓవర్ల మార్గాల్లో మలుపులు, మూలలు వంటివి వచ్చే ప్రాంతాల్లో పోర్టల్ ఫ్రేమ్స్ను వాడతారు. మెట్రో రైలు మార్గాల్లోనూ పలు ప్రాంతాల్లో ఇలాంటి పోర్టల్ ఫ్రేమ్స్ వినియోగించినట్లు ఇంజినీర్లు తెలిపారు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్కు పోర్టల్ ఫ్రేమ్స్ అవసరమైన మూడు చోట్ల కాంక్రీట్ పోర్టల్ ఫ్రేమ్స్ బదులు స్టీల్ ఫ్రేమ్స్ను వాడుతున్నారు. స్టీల్ పోర్టల్ ఫ్రేమ్స్ వాడటం నగరంలో ఇదే మొదటిసారని, 23 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పు కలిగిన మొదటి స్టీల్ పోర్టల్ ఫ్రేమ్ను కాంట్రాక్టు ఏజెన్సీ విజయవంతంగా అమర్చిందని పనులు పర్యవేక్షిస్తున్న సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటరమణ తెలిపారు. ► మీనాక్షి టవర్స్ పరిసరాల్లో ఈ ఫ్లైఓవర్ మార్గంలో మొత్తం మూడు పోర్టల్స్ అవసరం. ఈ సంవత్సరం దీపావళి కానుకగా ఈ ఫ్లై ఓవర్ను వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫ్లైఓవర్ మార్గంలో రద్దీ సమయంలో వాహనాలు గంటకు 1464 పీసీయూ కాగా, 2040 నాటికి ఇది 5194 పీసీయూకు చేరుతుందని అంచనా. నాలుగు వరుసల్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్పై రెండు వైపులా ప్రయాణం చేయవచ్చు. కొండాపూర్ వైపు నుంచి ఓఆర్ఆర్వైపు వెళ్లే ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్పై రెండో వరసలో భూమి నుంచి 18 మీటర్ల ఎత్తులో 64 మీటర్ల పొడవైన 3 స్టీల్ గర్డర్లను ఏర్పాటు చేయడం తెలిసిందే. (క్లిక్: 111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?) -
LB Nagar: కామినేని ఫ్లైఓవర్ల కింద పార్కు
సాక్షి, హైదరాబాద్: నడక మార్గాలు, ఫౌంటెన్లు, శిల్పాలు, కూర్చునే బెంచీలు, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక స్థలాలు, కెఫ్టేరియా.. ఇలా వివిధ సదుపాయాలతో ఆక్సిజన్ను అందించే పచ్చని మొక్కలతో ప్రత్యేక పార్కు త్వరలో నగర ప్రజలకు కనువిందు చేయనుంది. ఇన్ని సదుపాయాలు కలిగిన పార్కు బహిరంగ ప్రదేశంలో కాకుండా రెండు ఫ్లైఓవర్ల కింద ఏర్పాటవుతుండటమే విశేషం. ఇప్పటికే షేక్పేట, బహదూర్పురా ఫ్లైఓవర్ల కింద సైతం పచ్చదనం ఉన్నప్పటికీ దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఇన్ని సదుపాయాలతో కూడిన అతిపెద్ద ఉద్యానవనం ఇదే కానుంది. ఎల్బీనగర్ జోన్లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సివిల్ ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న ఈ ప్రాంతంలో యాంఫీథియేటర్ సైతం రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్న్యూస్) దాదాపు కోటి రూపాయల వ్యయమవుతున్న ఈ పార్కుకు ఆక్సిజన్ పార్కుగా నామకరణం చేయనున్నారు. పరిసరాల్లో నివసించే ప్రజలకే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ మార్గంలో ప్రయాణించే వారికి సైతం పచ్చదనంతో కనువిందు చేయడంతోపాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించనుంది. ఖాళీ ప్రదేశాలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం(యూబీడీ) డిజైన్ చేసిన ఈ ఆలోచన.. ఫ్లైఓవర్ల కింద పూర్తిస్థాయి పార్కు రాష్ట్రంలో ఇదే ప్రథమం. (క్లిక్: ఆర్టీసీకి ఆర్డరిస్తే మీ ఇంటికే బంగినపల్లి) -
ఫ్లైఓవర్లు రాకముందు.. వచ్చాకా..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద వేల కోట్ల పనులు చేసి పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా తెస్తున్నారు. ఇంతకీ వీటివల్ల ప్రజలకు కలిగిన సదుపాయాలేమిటి? మారిన పరిస్థితులేమిటి? ఒనగూరిన ఆర్థిక ప్రయోజనాలేమిటి? వంటి వాటితోపాటు ఇతరత్రా అంశాల అధ్యయనానికి ప్రభుత్వం సిద్ధమైంది. సిగ్నల్ఫ్రీ ప్రయాణం వల్ల కేవలం ట్రాఫిక్ చిక్కులు తప్పడమే కాదని పర్యావరణ పరంగా వాయు కాలుష్యం, ఇంధన కాలుష్యం తగ్గుతుందని, వాహనాల నిర్వహణ ఖర్చులతోపాటు కాలుష్యం తగ్గడం వల్ల ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలు కూడా తగ్గుతాయని, తద్వారా జీవనప్రమాణాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. రూ.వేల కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్లను కేవలం ప్రయాణ మార్గాలుగా మాత్రమే చూడరాదని, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. వాటన్నింటినీ సర్వేద్వారా శాస్త్రీయంగా వెల్లడించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాకముందు.. వచ్చాకా.. ఎస్సార్డీపీ కింద ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్పాస్లు, జంక్షన్ల అభివృద్ధి వంటి ఎన్నో పనులు చేపట్టారు. వాటిని పూర్తిచేసేందుకు మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో, శ్మశానవాటికల వద్ద సైతం పనులు చేయాల్సి వచ్చింది. మరోవైపు భూసేకరణ సమస్యలు సరేసరి. యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి కష్టాలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తూ పూర్తిచేస్తున్న పనుల వల్ల ఇతరత్రా విధానాలుగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటి గురించి అందరికీ తెలియాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకుగాను ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా పరిగణిస్తూ సదరు జోన్లలో ఫ్లై ఓవర్లు రాకముందు.. వచ్చాక స్థానికుల పరిస్థితులు, ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి కలిగిన సదుపాయాలు, పెరిగిన దుకాణాలు, వ్యాపారాలు, తొలగిన ట్రాఫిక్ చిక్కులు, సాధ్యమైన సాఫీ ప్రయాణం ఇలా వివిధ అంశాలతో జాతీయస్థాయి కన్సల్టెన్సీ సంస్థతో సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది. దాదాపు 9 మాసాల్లో ఈ సర్వే పూర్తి చేసి నివేదికను వెలువరించనున్నట్లు జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాల్లో పెరిగిన మొబిలిటీ, తగ్గిన ప్రయాణ సమయం, రహదారి భద్రత తదితర అంశాలు కూడా అధ్యయనంలో వెల్లడిస్తారని పేర్కొన్నారు. ప్రయాణికులతోపాటు విద్య, వైద్యం, బ్యాంకింగ్,మార్కెటింగ్, తదితర రంగాల్లోని వారి అనుభవాలు సైతం పరిగణనలోకి తీసుకొని వారికి కలిగిన ప్రయోజనాలు సైతం నివేదికలో పొందుపరచనున్నారు. ఈ ప్రాంతాల్లో అధ్యయనం.. నగరంలో ఇప్పటికే పూర్తయిన బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు ఫ్లై ఓవర్లు, మైండ్స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్, అండర్పాస్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్పాస్, కూకట్పల్లి రాజీవ్గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ రోడ్నంబర్ 45 ఫ్లైఓవర్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, షేక్పేట ఓయూకాలనీ ఫ్లైఓవర్, చింతల్కుంట అండర్పాస్, కామినేని దగ్గరి రెండు ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్ రెండు ఫ్లైఓవర్లు, అండర్పాస్, బైరామల్గూడ రెండు ఫ్లైఓవర్లు, బహదూర్పురా ఫ్లైఓవర్, ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్లు, పంజగుట్ట స్టీల్బ్రిడ్జిలు ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో పూర్తికానున్న నాగోల్ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్ ఫ్లైఓవర్లు, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ తదితర ఫ్లైఓవర్లు ఆర్ఓబీలు, ఆర్యూబీల వల్ల ప్రయోజనాల్ని సైతం నివేదికలో పొందుపరచనున్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించినప్పటికీ ఎస్సార్డీపీలో భాగంగా దానివల్ల కలిగిన ప్రయోజనాలనూ పొందుపరచనున్నారు. (చదవండి: ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు) -
ఖైరతాబాద్ ఫ్లైఓవర్పై కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్పై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారులోని యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకుని, కారు సీజ్ చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావటంతో డ్రైవర్తో పాటు పక్కన కూర్చున్న యువకులు సురక్షితంగా బయటపడ్డారు. -
అయేషా చెప్తున్న అందమైన కథ (ఫోటోలు)
-
Hyderabad:ఈ రోజు రాత్రి ఫ్లైఓవర్లు బంద్.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: జగ్నేకీ రాత్గా పిలిచే షబ్బే బరాత్ నేపథ్యంలో నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసేవేయనున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము వరకు గ్రీన్ ల్యాండ్స్, లంగర్హోస్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మినహా మిగిలినవి మూసి ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. -
కుంగిన సైదాబాద్–సంతోష్నగర్ ప్రధాన రహదారి
సాక్షి, సంతోష్నగర్: సైదాబాద్–సంతోష్నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐ.ఎస్.సదన్ చౌరస్తా నుంచి సంతోష్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో పిల్లర్ల కోసం గోతులు తీసి అలాగే వదిలేశారు. దీంతో భూమి కుంగిపోవడంతో రోడ్డుపై భారీగా గుంత ఏర్పడింది. అప్రమత్తమైన స్థానికులు ట్రాఫిక్ను నియంత్రించారు. ఫలక్నుమా ట్రాఫిక్ పోలీసులతో సంతోష్నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతను మట్టితో పూడ్చివేశారు. చదవండి: ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ? -
జూబ్లీహిల్స్లో మరో వంతెన
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి, నానక్రాంగూడ, రాయదుర్గం, షేక్పేట వైపు వెళ్లేవారికి ఇప్పుడున్న జూబ్లీహిల్స్ రోడ్ నెం.45, రోడ్ నెం.78, ఫిలింనగర్ కొత్త చెరువు రోడ్డు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ రోడ్లపై భారీగా వాహనాలు తరలి వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో సంబంధిత అధికారులు జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులకు మరో అనువైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.51లో ఈ వంతెన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ►షేక్పేట మల్కంచెరువు వద్ద షేక్పేట ఫ్లైఓవర్ కింద జూబ్లీహిల్స్ రోడ్ నెం.51 ఈ బ్రిడ్జి రోడ్డును అనుసంధానం చేస్తున్నారు. ►లెదర్ పార్కు రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.45కు కనెక్ట్ చేస్తున్న ఈ రహదారి వంతెన నిర్మాణానికి రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ►290 మీటర్ల మేర నిర్మాణం జరుపుకుంటున్న ఈ బ్రిడ్జిపై నాలుగు లైన్ల బై డైరెక్షనల్ రోడ్డును నిర్మించడం జరుగుతున్నది. ►ప్రస్తుతం షేక్పేట వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.45కు విస్పర్వ్యాలీ మహాప్రస్థానం మీదుగా రావాల్సి ఉండేది. ఇది ఐదు కిలోమీటర్ల దూరం ఉండగా ఇప్పుడు కొత్తగా వేస్తున్న జూబ్లీహిల్స్ రోడ్ నెం.51 లింకు రోడ్డుతో ఈ దూరం 3.5 కిలోమీటర్లకు తగ్గనుంది. ►మరో వారం, పది రోజుల్లో ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ బ్రిడ్జి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?
సాక్షి, బెంగళూరు: ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా 775 కోట్ల రూపాయల ఖర్చు పదేళ్లకే వృథా అయ్యేలా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల ఓ వంతెన మట్టిలో కలిసిపోయేలా ఉంది. రాజధాని బెంగళూరు నగరం నుంచి సుమారు 20 జిల్లాలకు వెళ్లే మార్గంలో ఎంతో ప్రధానభూమిక పోషిస్తున్న గోరుగుంటపాళ్య ఫ్లై ఓవర్ వంతెన దశాబ్దానికే పాడైపోయింది. సుమారు 56 రోజుల మరమ్మతుల తర్వాత పెద్ద పెద్ద వాహనాలను కాదని, చిన్న వాహనాలకే అనుమతిస్తున్నారు. బెంగళూరు నుంచి తుమకూరు వెళ్లే మార్గంలో గోరుగుంటపాళ్య నుంచి నాగసంద్ర వరకు ఉండే వంతెనను పడగొట్టాలని బెంగళూరులోని ఐఐఎస్సీ విద్యాసంస్థ నిపుణులు సూచిస్తున్నారు. 2010లో రూ.775.70 కోట్ల ఖర్చుతో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ 5 కిలోమీటర్ల వంతెనను వంతెన నిర్మించారు. చదవండి: (సైన్యం ఆధునికీకరణ సరే! నిధులెక్కడ?) డిసెంబరు నుంచి సమస్యలు మొదలు.. వంతెన కింది భాగంలో ఉన్న 102, 103 నంబరు పిల్లర్ల వద్ద కేబుల్ కట్ కావడంతో సమస్య తలెత్తింది. ఈ క్రమంలో గత డిసెంబరు 25వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలను నిషేధించారు. ఎన్హెచ్ఏఐ మరమ్మతులు చేపట్టింది. వంతెన పొడవునా కేబుల్ను అమర్చాల్సి రావడంతో మరమ్మతులు రెండువారాలకు బదులు సుమారు రెండు నెలల పాటు కొనసాగాయి. ఇటీవలే పూర్తి చేశాక నిపుణులు తనిఖీలు చేస్తే ... వంతెన మొత్తం పాడైపోయేందుకు సిద్ధంగా ఉందని గమనించారు. దీంతో ఫ్లై ఓవర్ను నేలమట్టం చేయాల్సిందేనని తేల్చారు. దీంతో కొత్త వంతెన కోసం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ కూడా రాసినట్లు సీఎం బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో వివరించారు. వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆటోలు, బైక్లకే అనుమతి.. రెండు పిల్లర్లకు మరమ్మతుల తర్వాత వంతెనను గత బుధవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి తెచ్చారు. బైక్లు, ఆటోలు, కార్లు, మినీ లారీలు వంటి చిన్న వాహనాలను మాత్రమే అనుమతించారు. భారీ వాహనాలు వెళ్లరాదని, వంతెన ప్రమాదకర స్థితిలో ఉందని బోర్డు పెట్టారు. వంతెన బాగున్న రోజుల్లో రోజు సుమారు 60 వేల వాహనాలు సంచరించేవి. మరమ్మతులు, మళ్లీ ఆంక్షల వల్ల వంతెన కింద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. కిలోమీటరు ప్రయాణానికి గంటల కొద్దీ పడుతోంది. ఈ కష్టాలకు ఎవరు కారణమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 (ఫోటోలు)
-
కేంద్రం తరపున ఏపీకి కిషన్ రెడ్డి హామీ
-
51 ప్రాజెక్టులకు ముందడుగు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గురువారం శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు. మీ దార్శనికత, ముందుచూపు ఈ దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా చోటు దక్కించుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్స్ కార్యక్రమం మీరు చేస్తున్న అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయిలా చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మీరు రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖలను అత్యంత నేర్పరితనంతో, వేగవంతంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. పెరిగిన జాతీయ రహదారుల పొడవు మీ హయాంలో రహదారుల నిర్మాణం 2014లో రోజుకు 12 కిలోమీటర్ల స్ధాయి నుంచి ప్రస్తుతం మన మాట్లాడుకుంటున్నట్టు 37 కిలోమీటర్ల స్ధాయికి చేరుకుంది. మా రాష్ట్రంలో మీ సమర్ధవంతమైన పనుల వల్ల జాతీయరహదారుల పొడవు 2014లో ఉన్న 4193 కిలోమీటర్ల నుంచి 95 శాతం గ్రోత్ రేటుతో నేడు 8163 కిలోమీటర్లకు చేరింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 51 ప్రాజెక్టులు ముందడుగు కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మొత్తం 51 ప్రాజెక్టులకు సంబంధించి ముందడుగులు పడుతున్నాయి. ఇందులో రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించిన 741 కిలోమీటర్ల పొడవైన 30 రహదారుల పనులకు శంకుస్ధాపనతో పాటు, ఇప్పటికే రూ.11,157 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మరో 21 రహదారులను ఇవాళ ప్రారంభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీ గారికి, ప్రత్యేకించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద రద్దీను దృష్టిలో ఉంచుకుని మరో ఫ్లైఓవర్ నిర్మించాలని 2019 ఆగష్టులో నేను విజ్ఞప్తి చేశాను. ఆ మేరకు మంత్రి గడ్కరీ వెంటనే మంజూరు చేసి, 2020లోనే నిర్ణయం తీసుకుని,ఆ పై నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసి.. ఆ ఫ్లైఓవర్ను కూడా గౌరవ కేంద్రమంత్రి ప్రారంభిస్తుండటం చాలా సంతోషం. గతంలో ఇదే విజయవాడలో 2019లో మనం అధికారంలోకి వచ్చేనాటికి కూడా పూర్తికాని బెంజ్ సర్కిల్లోని తూర్పున ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గడ్కరీ సహకారంతో వాయువేగంతో పూర్తి చేయగలిగామని సంతోషంగా చెపుతున్నాం. రూ.10,600 కోట్లతో పనులు రాష్ట్రంలో జాతీయరహదారుల విస్తరణ, అభివృద్ది, నిర్మాణంలో వీటి అన్నింటికి సంబంధించి అత్యంత చొరవతో మన ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. భూసేకరణతో పాటు ఎక్కడ ఏ సమస్య కూడా తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ... రహదారుల నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాం. ఇదే సందర్భంలో మరో విషయం కూడా చెప్పాలి. రాష్ట్రంలోని మిగిలిన రహదారులు అంటే.. జాతీయరహదారులు కాకుండా మిగిలిన రహదారులకు సంబంధించిన పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా అడుగులు ముందుకేస్తోంది. ఇందుకోసం మనం రూ.10,600 కోట్లు కేటాయించాం. ఇప్పుడే ఆర్ అండ్ బి కార్యదర్శి కృష్ణబాబు ఆ రూ.10,600 కోట్లకు సంబంధించిన పనుల వివరాలన్నీ చెప్పారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కనెక్టవిటీ ప్రతి మండల కేంద్రం నుంచి కూడా జిల్లా కేంద్రం వరకు రెండు లైన్ల రోడ్లుగా మారుస్తూ... దాదాపుగా రూ.6,400 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. పూర్తిగా రోడ్లన్నీ కూడా రిపేర్లు, మెయింటైనెన్స్ చేయడం కోసం మాత్రమే మరో రూ.2300 ఖర్చు చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న ప్రతి రోడ్డు పూర్తి చేసేందుకు మరో రూ.1700 కోట్లు ఖర్చుతో కలిపి రూ.10,600 కోట్లకు సంబంధించిన రహదారి పనులకు శ్రీకారం చుట్టాం. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇక రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున మీరు చేసిన మంచి పనులన్నింటికీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి రాజకీయాలు లేకుండా ప్రజల మందుర మీకు మా సంతోషాన్ని, కృతజ్ఞతలూ తెలియజేస్తున్నాను. ఇవాళ మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని విజ్ఞప్తి చేస్తూ.. మీ ఆమోదం కోసం కొన్ని ప్రతిపాదనలను మీ ముందు ఉంచుతున్నాను. మరికొన్ని ప్రతిపాదనలు విశాఖతీరంలో విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి– భోగాపురం ఎయిర్పోర్టు వరకు రహదారి నిర్మాణం. రుషికొండ, భీమిలి కొండలను, సముద్ర తీరాన్ని తాకుతూ పర్యాటక రంగానికే వన్నె తెచ్చే విధంగా .. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కనెక్ట్ చేసే విధంగా నేషనల్ హైవే 60ను కలుపూతూ 6 లేన్ల రహదారి చాలా అవసరం అని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే విజయవాడ తూర్పున బైపాస్... కృష్ణానదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అవసరం. నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ బైపాస్ చాలా అవసరం అవుతుంది. మీరు వెస్ట్రన్ బైపాస్కు శాంక్షన్ ఇచ్చారు, ఈస్ట్రన్ బైపాస్కు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాన జాతీయ రహదారులు నగరం గుండా వెళ్తుండడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటికీ కూడా ఈ రెండు బైపాస్లు పరిష్కారమార్గాలవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ రహదారులుగా.. అలాగే వైఎస్సార్ కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టికల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారి.. వీటన్నింటినీ కూడా జాతీయ రహదారులగా గుర్తించి అభివృద్ది చేయాలని మనసారా కోరుతున్నాను. నిండుమనస్సుతో మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే తెలుగువారైన మన కిషన్ రెడ్డి గారు కూడా.. మన రాష్ట్ర అభివృద్ది కొరకు నాలుగడుగులు ఎప్పుడూ ముందుకు వేస్తూనే ఉన్నారు. ఆయన కూడా మరింత చొరవ చూపాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా.. ఈ ప్రతిపాదనలన్నింటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయరహదారుల శాఖకు పంపించాం. గడ్కరీ దయచేసి వీటన్నింటినీ పరిశీలించి, పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మరోవైపు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటీవలే రాష్ట్ర రహదారులపై ఆర్ఓబీల నిర్మాణాలకు సంబంధించి కేంద్రం అడిగిన 20 ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దీనికి సంబంధించి కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నాం. వీటన్నింటితో పాటు మంచి చేస్తున్న మంచి వారికి ఎప్పుడూ మంచి జరగాలని ఆశిస్తూ.. కోరుకుంటూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, కె నారాయణస్వామి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
నితిన్ గడ్కరికి సీఎం వైఎస్ జగన్ మర్చిపోలేని సన్మానం
-
రోడ్ల నిర్మాణాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
విజయవాడ: బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభోత్సవం
-
Live Blog: విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభోత్సవం
-
విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు ఇలా..
సాక్షి, విజయవాడ: బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్–2 ప్రారంభోత్సవం, ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ గురువారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ టి.కె.రాణా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారన్నారు. అనంతరం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో నాయకుల ప్రసంగం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాహన రాకపోకలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంక్షలు ముగిసే వరకు నూతన ఫ్లై ఓవర్పై, బందరు రోడ్డులో ఎలాంటి వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. వాహనదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. మళ్లింపులు ఇలా.. ►చెన్నై నుంచి విశాఖపట్నంకు వెళ్లే లారీలు, భారీ వాహనాలు ఒంగోలు, త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. ►చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే లారీలు, భారీ వాహనాలు మేదరమెట్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి, నకిరేకల్ మీదుగా వెళ్లాలన్నారు. ►ఏలూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే లారీలు, భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. ►గుంటూరు నుంచి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్లే కార్లు, ఇతర వాహనాలను కనకదుర్గ వారధి పైకి అనుమతించమన్నారు. ఈ వాహనాలు ప్రకాశం బ్యారేజీ మీదుగా నగరానికి చేరుకుని అక్కడ నుంచి హైవే పై హైదరాబాద్, ఏలూరు రోడ్డు నుంచి రామవరప్పాడు మీదుగా విశాఖపట్నంకు చేరుకోవాలన్నారు. ►ఏలూరు నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్కు వచ్చే వాహనాలు రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, పోలీస్ కంట్రోల్ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. ►పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి మచిలీపట్నం వెళ్లే వాహనాలు ఏలూరు రోడ్డు, రామవరప్పాడు రింగ్, ఎనికేపాడు, తాడిగడప 100 అడుగుల రోడ్డు మీదుగా వెళ్లాలన్నారు. ►బెంజిసర్కిల్ నుంచి బందర్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే సిటీ బస్సులను రమేష్ హాస్పిటల్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్, పోలీస్ కంట్రోల్ రూం రూట్కు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ►నూతన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా కోరారు. -
గురువారం బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
-
తిరుపతి నగరానికి మణిహారంగా నిలువనున్నశ్రీనివాస సేతు ఫ్లైఓవర్
-
షేక్పేట్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం, ఒకరి దుర్మరణం
సాక్షి హైదరాబాద్: షేక్పేట్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఫై ఓవర్పై వేగంగా వస్తున్న కారు బైక్ను డీ కొట్టింది. దీంతో వాహనదారుడు ప్లై ఓవర్ పై నుండి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
ఆధ్యాత్మిక గిరిలో శ్రీనివాస సేతు వెలుగులు!
-
సాహోరే.. వారధులు! పాతబస్తీకే మణిహారాలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఐటీ కారిడార్లున్న, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లు.. ఐటీ తదితర సంస్థలున్న ఉప్పల్ జోన్, కోర్సిటీలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్లలో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లైఓవర్లు, అండర్పాస్లు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతమైన చార్మినార్ జోన్వైపు దృష్టి సారించింది. ఇటీవలే డాక్టర్ అబ్దుల్కలాం ఫ్లై ఓవర్ వినియోగంలోకి రాగా.. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు నుంచి కోర్సిటీలోకి రాకపోకలు సాగించేవారికి ఉపకరించే రెండు ఫ్లైఓవర్లు త్వరలో పూర్తి కానున్నాయి. వీటిలో ఆరాంఘర్– జూపార్క్ ఫ్లై ఓవర్ వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు నిర్మించిన అన్ని ఫ్లై ఓవర్లకంటే పెద్దది. ఇటీవలే ప్రారంభమైన షేక్పేట ఫ్లై ఓవర్ (పొడవు 2.71 కి.మీ.) కంటే కూడా ఇదే పెద్దది. దీని పొడవు దాదాపు 4 కి.మీ. బహదూర్పురా జంక్షన్ వద్ద మరో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఈ రెండూ వినియోగంలోకి వస్తే విమానాశ్రయం వెళ్లే వారితోపాటు మహబూబ్నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి, జూపార్క్ సందర్శకులకు, పాతబస్తీ ప్రజలకు సమయం కలిసి వస్తుంది. రెండింటికీ అయ్యే ఖర్చు దాదాపు రూ. 706 కోట్లు. సీఎస్ సోమేశ్కుమార్ తనిఖీ ► రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణాల్ని వేగవంతం చేసి, నిర్ణీత వ్యవధి కంటే ముందే పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బహదూర్పురా జంక్షన్లోని నిర్మాణ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ► ఆరాంఘర్– జూపార్కు ఫ్లై ఓవర్ పనుల్ని కూడా వీలైనంత త్వరితంగా పూర్తిచేయాలనగా వచ్చే సంవత్సరం మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆస్తుల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని సీఎస్ దృష్టికి తేగా.. ఫ్లై ఓవర్ మౌలిక డిజైనింగ్కు అంతరాయం కలుగకుండా సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తుల్లో కొన్నింటిని మినహాయించాల్సిందిగా సూచించారు. ► సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. బహదూర్పురా జంక్షన్ ఫ్లై ఓవర్ ► అంచనా వ్యయం: రూ.69 కోట్లు ► పొడవు: 690 మీటర్లు ► లేన్లు: 6(రెండు వైపులా ప్రయాణం) ► వెడల్పు: 24 మీటర్లు ► ఇరవయ్యేళ్లకు పెరిగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. బహదూర్పురా జంక్షన్ వద్ద ప్రస్తుతమున్న ట్రాఫిక్ చిక్కులు ఉండవు. సిగ్నల్ ఫ్రీగా సాగిపోవచ్చు. ► దాదాపు 70 శాతం పనులు పూర్తయిన ఈ ఫ్లైఓవర్ ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది. ఆరాంఘర్– జూపార్కు ఫ్లైఓవర్ ► అంచనా వ్యయం: రూ.636.80 కోట్లు ► పొడవు: 4.04 కి.మీ. ► లేన్లు: 6 (రెండు వైపులా ప్రయాణం) ► వెడల్పు: 24 మీటర్లు ► 2037 నాటికి రద్దీ సమయంలో 5210 వాహనాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు. ► ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న ట్రాఫిక్ సిగ్నళ్లు తాడ్బన్, దానమ్మహట్స్, హసన్నగర్ జంక్షన్ల వద్ద ఎక్కడా ఆగకుండా నేరుగా రయ్మని వెళ్లిపోవచ్చు. ► తద్వారా ప్రయాణ సమయం తగ్గడంతోపాటు లూబ్రికెంట్స్, ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు కాలుష్యం తగ్గి, ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. వచ్చే సంవత్సరం దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
షేక్పేట ఫ్లై ఓవర్ను ప్రారంభించిన:మంత్రి కేటీఆర్
-
Year End 2021: గ్రేటర్లో హై.. ఫ్లై!
సాక్షి, హైదరాబాద్: ఎవరేమనుకున్నా.. ఎవరేం చెప్పినా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు నగర రూపురేఖల్నే మార్చివేశాయి. ముఖ్యంగా ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) కింద చేపట్టిన పనులు ఎలాంటి నిధుల కొరత లేకుండా జరగడమే అందుకు కారణం. నిధుల లేమితో పనులు కుంటుపడవద్దనే తలంపుతో ప్రభుత్వం ఎస్సార్డీపీని ఏర్పాటుచేసి.. బాండ్లతో నిధులు సమకూరేలా చేయడమే కాక బ్యాంకు లోన్లకు అనుమతిచ్చింది. దీంతో జరిగే పనుల కనుగుణంగా బిల్లుల చెల్లింపులు జరుగుతుండటంతో పనులు వడివడిగా సాగుతున్నాయి. దీనివల్ల జీహెచ్ఎంసీకి ఎంతో ఆర్థిక భారం పెరిగినా.. కళ్లముందరి ఫ్లై ఓవర్ల వల్ల ప్రజల ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా నిర్మించారనే ఆరోపణలున్నా రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీతో మున్ముందు వాటి ఉపయోగం తెలుస్తుదంటున్న వారూ ఉన్నారు. దశల వారీగా చేపట్టిన పనుల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని రూ. 4500 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇతర విభాగాలవి కూడా కలిపితే వాటి విలువ రూ.6 వేల కోట్లు. అన్ని విభాగాలవీ వెరసి దాదాపు రూ. 2 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. పురోగతిలో ఉన్నవి.. ► బొటానికల్ గార్డెన్,కొత్తగూడ– కొండాపూర్ జంక్షన్ వద్ద: సెప్టెంబర్ 2022 ► శిల్పా లేఔట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్తో సహ 120 అడుగుల వెడల్పుతో రోడ్డు: సెప్టెంబర్ 2022, ఫేజ్ 1 పూర్తవుతుందని అంచనా. ► ఖైతలాపూర్ ఆర్ఓబీ(హైటెక్సిటీ– బోరబండ రైల్వేస్టేషన్ల మధ్య): కోర్టు వివాదం పరిష్కారమైతే మార్చి 2022లో పూర్తి. ► ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్: మార్చి 2022 ► బైరామల్ గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్: డిసెంబర్ 2022 ► బైరామల్గూడ కుడి, ఎడమ వైపులా రెండు లూప్లు, రెండో వరుసలో ఫ్లై ఓవర్: డిసెంబర్ 2022. ► నాగోల్ ఫ్లై ఓవర్ : జూన్ 2022 ► ఎల్బీనగర్ కుడివైపు అండర్పాస్: ఫిబ్రవరి 2022 ► పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్బ్రిడ్జి: జనవరి 2022 ► తుకారాంగేట్ వద్ద ఆర్యూబీ: ఫిబ్రవరి 2022 ► ఇందిరాపార్కు–వీఎస్టీ, రామ్నగర్–బాగ్లింగంపల్లి ఫ్లై ఓవర్లు: డిసెంబర్ 2022, 1వ ఫేజ్ ► ఉప్పల్ జంక్షన్ ఫ్లై ఓవర్: డిసెంబర్ 2023 ► బహదూర్పురా జంక్షన్ ఫ్లైఓవర్: మార్చి 2022 ► చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ పొడిగింపు: జూన్ 2022 ► నల్గొండ క్రాస్రోడ్స్– ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ ఫ్లైఓవర్: అక్టోబర్ 2022 ► ఫలక్నుమా ఫ్లైఓవర్కు సమాంతర ఫ్లైఓవర్: సెప్టెంబర్ 2022 ► శాస్త్రిపురం వద్ద ఆర్ఓబీ: జూలై 2023 ► ఆరాంఘర్నుంచి జూపార్క్ వరకు ఫ్లైఓవర్ మార్చి 2023లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ► ఇవి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని పనులు కాగా, గ్రేటర్ పరిధిలో ఇతర విభాగాల ఆధ్వర్యంలో పూర్తయిన, జరగుతున్న పనులిలా ఉన్నాయి. ► పూర్తయిన పనులు: ఓఆర్ఆర్–మెదక్ సెక్షన్ వరకు రహదారుల విస్తరణ.. అప్గ్రేడేషన్ పనులు, బాలానగర్ క్రాస్రోడ్స్ ఫ్లైఓవర్, ఆనంద్బాగ్ ఆర్యూబీ. పూర్తి కావాల్సిన పనులు: అంబర్పేట చేనెంబర్ క్రాస్రోడ్స్ ఫ్లైఓవర్(రూ.369.19 కోట్లు),ఆరాంఘర్– శంషాబాద్ సెక్షన్ ఫ్లైఓవర్(రూ.488 కోట్లు), ఉప్పల్– సీపీఆర్ఐ (రూ.821కోట్లు). ► అన్ని విభాగాల్లో వెరసి పురోగతిలో ఉన్న పనుల అంచనా వ్యయం దాదాపు రూ. 6 వేల కోట్లు. పూర్తయిన పనులివీ.. ఫ్లైఓవర్లు మైండ్స్పేస్, రాజీవ్గాంధీ విగ్రహం(కూకట్పల్లి), బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు, రోడ్నెంబర్ 45–దుర్గంచెరువు కేబుల్బ్రిడ్జిని కలుపుతూ, కామినేని హాస్పిటల్ వద్ద రెండు వైపులా రెండు, ఎల్బీనగర్ వద్ద ఎడమవైపు, బైరామల్గూడ వద్ద కుడివైపు, పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్బ్రిడ్జితో, ఒవైసీ జంక్షన్లో అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్ పూర్తయ్యాయి. ఇక షేక్పేటఫ్లై ఓవర్ నిర్మాణం కూడా పూర్తయింది. కొత్త సంవత్సర కానుకగా అందుబాటులోకి రానుంది. ► దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికే తలమానికంగా నిలుస్తోంది. అండర్పాస్లు.. అయ్యప్పసొసైటీ జంక్షన్, మైండ్స్పేస్,చింతల్కుంట చెక్పోస్ట్ జంక్షన్,ఎల్బీనగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు. ఆర్యూబీ/ఆర్ఓబీలు.. హైటెక్సిటీ రైల్వే స్టేషన్, ఉత్తమ్నగర్, ఉప్పుగూడల వద్ద ఆర్యూబీలు, లాలాపేట ఆర్ఓబీ పునరుద్ధరణ. -
Flyover: అబ్దుల్ కలామ్ ఫ్లై ఓవర్ ప్రారంభం
-
‘సీటీ’జనులకు గుడ్న్యూస్... 1.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. హెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఓవైసీ జంక్షన్ టు మిధానీ జంక్షన్’ ఫ్లై ఓవర్ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ఉదయం ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు. కేటీఆర్తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్కి అరుదైన గౌరవం ఇస్తూ ఫ్లై ఓవర్కు ఆయన పేరును నామకరణం చేశారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఫ్లైఓవర్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులతో పాటు శ్రీశైలం, బెంగళూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. నగరవాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే రూ.80 కోట్ల వ్యయంతో 1.365 కిలో మీటర్ల పొడవున 12 మీటర్ల వెడల్పుతో మూడు లైన్ల రహదారిగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. చదవండి: (Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!) -
Hyderabad: ఒవైసీ-మిధాని జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
-
జీహెచ్ఎంసీ పరిధిలో ఇది అతి పెద్ద ఫ్లైఓవర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు లేన్లతో అత్యంత పొడవైన (2.71 కి.మీ) షేక్పేట ఫ్లైఓవర్, ఒవైసీ– మిధాని ఫ్లైఓవర్ (1.3 కి.మీ) వారంలో ప్రారంభం కానున్నాయి. నగరంలో దాదాపు 11.5 కి.మీ. పొడవైన పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే నాలుగు లేన్లది కాగా, ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్లలో షేక్పేటది అత్యంత పొడవైనదిగా రికార్డుకెక్కనుంది. నాలుగు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే ఈ ఫ్లైఓవర్ ఔటర్ రింగ్రోడ్డు– ఇన్నర్ రింగ్రోడ్డును కలిపే వారధిగానూ మారనుంది. వివరాలిలా ఉన్నాయి. ట్రాఫిక్ ఇక్కట్లుండవ్.. ఇంధన వ్యయం తగ్గుతుంది.. రెండు ఫ్లై ఓవర్లు వినియోగంలోకి వస్తే ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గడంతోపాటు తద్వారా ఇంధన వ్యయం, ప్రయాణ సమయం తగ్గుతాయి. జంక్షన్ల వద్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. ఎస్సార్డీపీ కింద ఈ రెండు ఫ్లై ఓవర్లతో సహా ఇప్పటి వరకు రూ. 2వేల కోట్ల విలువైన 22 పనులు పూర్తయినట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం రెండు ఫ్లై ఓవర్లను పరిశీలించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పురోగతిలో ఉన్న రూ.6 కోట్ల విలువైన 25 పనుల్ని వచ్చే సంవత్సరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయిన రెండు ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవం దాదాపు వారం రోజుల్లో జరిగే అవకాశముందన్నారు. (చదవండి: తెలంగాణ: కీలక దశకు చేరుకున్న ఉద్యోగుల విభజన) షేక్పేట ఫ్లైఓవర్.. (గెలాక్సీ థియేటర్ నుంచి మల్కంచెరువు వరకు) సెవెన్టూంబ్స్, ఫిల్మ్నగర్ మెయిన్రోడ్డు, ఓయూకాలనీ, విస్పర్వ్యాలీ టీ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే ఈ భారీ ఫ్లైఓవర్ వల్ల నానల్నగర్ నుంచి ఖాజాగూడ, అక్కడి నుంచి ఔటర్ రింగ్రోడ్డు వరకు దాదాపు 11 కి.మీ మేర సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. కోర్సిటీ నుంచి హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల వైపు రాకపోకలు సాగించేవారికి దీని వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇన్నర్ రింగ్రోడ్డు (రేతిబౌలి) నుంచి ఔటర్ రింగ్రోడ్డు (గచ్చిబౌలి) వరకు లక్డికాపూల్, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి మార్గాల్లో ప్రయాణించే దాదాపు 4 లక్షల వాహనాలకు భారీ ఊరట. బయోడైవర్సిటీ జంక్షన్– జేఎన్టీయూ జంక్షన్ మార్గానికి అనుసంధానంగానూ ఉన్న ఈ ఫ్లైఓవర్ వల్ల దాదాపు 17 కి.మీ మేర (లక్డీకాపూల్–జేఎన్టీయూ జంక్షన్) సాఫీ ప్రయాణం సాధ్యమని ఈ ప్రాజెక్ట్ పనులు పర్యవేక్షించిన ఎస్ఈ వెంకటరమణ పేర్కొన్నారు. ఒవైసీ– మిధాని జంక్షన్ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వస్తే మిధాని జంక్షన్ వైపు నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్లే వారికి ఎంతో సదుపాయం. మిధాని, ఒవైసీ జంక్షన్ల వద్ద ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయి. ముఖ్యంగా డీఆర్డీఓ, డీఆర్డీఏ, ఏఎస్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో ఇబ్బందులుండవన్నారు. క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ పానెల్స్ వంటి పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వాడినట్లు, దీని వల్ల ఎంతో సమయం కలిసి రావడంతోపాటు మ్యాన్పవర్ తగ్గిందని, పని ప్రదేశంలో ప్రమాదాల రిస్క్ తగ్గిందని పనులు పర్యవేక్షించిన ఎస్ఈ దత్తుపంత్ తెలిపారు. దేశంలో ఇలాంటి టెక్నాలజీ హైదరాబాద్లోనే తొలిసారి వినియోగించగా, పాతబస్తీలో ఇదే ప్రథమమన్నారు. ఈ మార్గంలో రద్దీ సమయంలో ప్రస్తుత ట్రాఫిక్: గంటకు 11,241 పీసీయూ. (చదవండి: ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్) -
రయ్యిరయ్యిమంటూ..
-
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలకు చెక్
-
బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్పై ట్రయల్ రన్ సక్సెస్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ బెంజి సర్కిల్ వద్ద నిర్మించిన రెండో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీంతో అధికారులు శనివారం ఫ్లైఓవర్పై నుంచి వాహనాలను వదిలి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. రామవరప్పాడు వైపు వెళ్లే వాహనాలు స్క్రూబ్రిడ్జి వద్ద ఫ్లైఓవర్పైకి వెళ్లి వినాయక థియేటర్ సమీపంలో జాతీయ రహదారిపైకి దిగుతాయి. బెంజి సర్కిల్తోపాటు నిర్మలా కాన్వెంట్ జంక్షన్, రమేష్ ఆస్పత్రి జంక్షన్లను కలుపుతూ రూ.90 కోట్ల ఖర్చుతో రెండో ఫ్లైఓవర్ను నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మొదటి ఫ్లైఓవర్ కంటే రెండో ఫ్లైఓవర్ ఏడాదిలోపే నిర్మాణ పనులను పూర్తి చేసుకోవడం విశేషం. మొదటి ఫ్లైఓవర్ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై నాలుగేళ్లకు కానీ పూర్తి కాలేదు. కాగా, ప్రస్తుతం బెంజి సర్కిల్, నిర్మలా కాన్వెంట్, రమేష్ ఆస్పత్రి జంక్షన్ల వద్ద ఓవైపే ఫ్లైఓవర్ ఉండటంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం రెండో ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. -
బాబోయ్..ఇదేం రోడ్డు? వెళ్లాలంటేనే దడ పుడుతోంది!
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ నుంచి నారపల్లికి వయా ఉప్పల్ డిపో మీదుగా రోడ్డు ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. గుంతలమయమైన రోడ్లు..దుమ్ము ధూళితో కళ్లల్లో మంటలు, తరుచుగా ప్రమాదాలతో ఈ రహదారి టెర్రర్గా మారింది. వరంగల్ జాతీయ రహదారి కూడా అయిన ఈ మార్గంలో 2018 జులైలో...రూ.717 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 130 పిల్లర్లు మాత్రమే నిర్మించారు. చదవండి: Hyderabad: వాళ్ల కష్టాలు తీరనున్నాయి.. ఆ ప్రాంతానికి మహర్దశ 2020 జూన్లోనే ఫ్లైఓవర్ మొత్తం పనులు పూర్తవ్వాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల ఇప్పటికి కేవలం 35 శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీంతో 6.2 కిలోమీటర్ల మేర ఇరువైపులా రహదారి ప్రమాదభరితంగా మారింది. ఇటీవలి వర్షాలకు పరిస్థితి మరీ దిగజారింది. ఏదైనా భారీ వాహనం వెళ్తుంటే..దాని వెనుక వెళ్లే వాహనదారులకు అసలు రోడ్డే కన్పించడం లేదు. అంతగా దుమ్ము..ధూళితో పొగ కమ్ముకుంటోంది. యాదాద్రి వెళ్లాలన్నా, భువనగిరి, వరంగల్, భూపాలపట్నం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది మంది నరక యాతన అనుభవిస్తున్నారు. చదవండి: మొక్కల కన్నా ముస్లింలు హీనమా? ఉప్పల్ చెరువు కట్ట మీద దుమ్ముకొట్టుకు పోతున్న వరంగల్ జాతీయ రహదారి లేని రోగాలు వస్తాయి.. బీబీనగర్లో వెంచర్ నడుస్తున్నందున నేను ప్రతి రోజు ఉప్పల్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కారు డోరు వేసుకున్నా దుమ్ము వదలడం లేదు. దీంతో దగ్గు వస్తోంది. జబ్బు చేసినట్లుగా ఉంటోంది. వీటికి తోడు పెద్ద పెద్ద గుంతల కారణంగా వాహనాలు పాడవుతున్నాయి. ఈ తిప్పలు ఎన్నాళ్లుంటాయో ఏమో మరి. – మేకల దయాసాగర్ రెడ్డి, వ్యాపారి, ఉప్పల్ గుంతలు..మట్టికుప్పలుబాబోయ్..ఇదేం రోడ్డు? ఉప్పల్ నుంచి నారపల్లి వరకు వెళ్లాలంటేనే దడ పుడుతోంది. ఎక్కడ చూసినా గుంతలు..మట్టికుప్పలు..దుమ్ము ధూళితో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఎవ్వరికి ఫిర్యాదు చేసినా తమ పరిధి కానే కాదంటున్నారు. – పూస అశోక్ కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
బైక్ స్టంట్స్ చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు
-
దుర్గగుడి ఫ్లైఓవర్పై ఆకతాయిల ఆగడాలు
-
అదే వంతెనపై మరో ఘోరం
బొమ్మనహళ్లి(బెంగళూరు): సుమారు నెల కిందట బెంగళూరులోని బొమ్మనహళ్లి– ఎలక్ట్రానిక్ సిటీ వంతెన పైన నిలిపి ఉన్న బుల్లెట్ బైక్ను కారు ఢీకొని టెక్కీ జంట కిందకు పడి దుర్మరణం పాలైన సంగతి మరువక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ఇదే వంతెనపై ఆదివారం రాత్రి బీఎంటీసీ బస్సు ఒక బైక్ను ఢీకొట్టడంతో ప్రభాకర్ (25) అతని స్నేహితురాలు సహాన (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఇద్దరూ దావణగెరెకు చెందినవారు కాగా బెంగళూరులో ఐటీ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ బైక్ మీద ఎలక్ట్రానిక్ సిటీ మొదటి స్టేజ్ నుంచి రెండవ స్టేజ్కు వెళ్లడానికి వంతెన మీద ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వెనుక ఉంచి వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్సు బైక్ను ఢీకొట్టగా ఇద్దరూ కిందపడిపోయారు. వారిపై బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలతో క్షణాల్లో మృతి చెందారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వచ్చి మృతదేహాలను అక్కడి నుంచి తరలించి కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన బీఎంటీసీ బస్సు డ్రైవర్ను అరెస్టు చేశారు. వంతెన పైన బైక్ను యూటర్న్ చేస్తున్న సమయంలో బస్సు ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎప్పుడూ లేనివిధంగా ఈ వంతెనపై యాక్సిడెంట్లలో టెక్కీ జంటలు మరణిస్తుండడం నగరంలో కలకలం రేపుతోంది. చదవండి: VIDEO: ఇలా ఖాళీ చేయగానే.. అలా కుప్పకూలింది -
టూవీలర్పై వెళ్తున్న వ్యక్తులపై పిడుగుపాటు.. ఇద్దరు మృతి
మంచిర్యాల(ఆదిలాబాద్): మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్ బ్రిడ్జ్పై వర్షంలో టూవీలర్పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఒకే కుటుంబంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: Tragedy: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి -
ముంబైలో కుప్పకూలిన నిర్మాణంలోని ఫ్లైఓవర్
-
తప్పిన ప్రమాదం.. రెయిలింగ్ను ఢీకొట్టిన బస్సు
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో తృటిలో బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ బ్రేకులు వేయడంతో బస్సు గాలిలో వేలాడుతూ ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. కాగా, పోలీసులు ట్రాఫిక్ను అదుపు చేస్తున్నారు. బస్సు కింద పడుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించేదని అధికారులు తెలిపారు. అనంతపురం నుంచి కర్నూలుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: 'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో -
కుప్పకూలిన ఫ్లై ఓవర్: ఒకరు మృతి
చెన్నై: తమిళనాడులోని మధురైలో ఫ్లై ఓవర్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లోని ఫ్లైఓవర్ ఒక భాగం కూలిపోయింది శనివారం అకస్మాత్తుగా కూప్పకూలింది ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్నరక్షణ సిబ్బంది సహాయక చర్యల్ని చేపట్టాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారో తెలుసుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. Tamil Nadu: A portion of an under-construction flyover collapses in Madurai; fire and rescue personnel on the spot pic.twitter.com/QNzXXgDNhb — ANI (@ANI) August 28, 2021 -
Hyderabad: వాళ్ల కష్టాలు తీరనున్నాయి.. ఆ ప్రాంతానికి మహర్దశ
సాక్షి, ఉప్పల్( హైదరాబాద్): ఉప్పల్ సర్కిల్లో మరిన్ని ప్లై ఓవర్లకు జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం అధికారులు శ్రీకారం చుట్టారు. భవిషత్లో రానున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ముందస్తుగా మరో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతి పాదనలను అధికారులు సిద్ధం చేశారు. దాదాపుగా రూ.311 కోట్లతో ఈ ప్రాజెక్టు సిద్ధమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. స్కైవేకు ఇరువైపుల రెండు వంతెనలతో పాటు, మెట్రోరైల్ వంతెనకు రెండు వైపుల మరో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దాదాపు రూ.658 కోట్లతో.. ► ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న స్కై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) పనులు కొనసాగుతున్న విషయం విధీతమే. ► ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు 6.4 కిలో మీటర్ల పొడవుతో దాదాపు రూ. 658 కోట్లతో నిర్మిస్తున్నారు. ► భవిషత్లో వరంగల్ నుంచి ఇటు సికింద్రాబాద్ మరో పక్క ఎల్బినగర్ వైపు, ఇంకోపక్క రామంతాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కేంద్రీకృతమయ్యే ట్రాఫిక్ను అధిగమించేందుకు ఈ వంతెనలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చక చకా పనులు.. ► ఎలివేటెడ్ కారిడార్ ముగింపు ప్రాంతం నుంచి రామంతాపూర్ క్రికెట్ స్టేడియం రోడ్డు వద్ద తిరిగి ఉప్పల్ పారిశ్రామిక వాడ మోడ్రన్ బేకరీ చౌరస్తా నుంచి ఉప్పల్ వరకు రోడ్డుకు ఇరువైపుల రెండు ప్లై ఓవర్లును నిర్మించనున్నారు. ► మరో వైపు ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల గేటు నుంచి నాగోల్ రోడ్డు ఉప్పల్ మెట్రోస్టేషన్ రాజ్యలక్ష్మి థియేటర్ వరకు అటు నుంచి నాగోల్ రోడ్డు నుంచి హబ్సిగూడ వైపు సర్వే ఆఫ్ ఇండియా గేట్ వరకు మొత్తం నాలుగు ప్లైఓవర్లను నిర్మించనున్నారు. ► ఇందుకు సంబంధించిన రోడ్డు వెడల్పు పనులను కూడా ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు చకా చకా ప్రారంభించారు. ► హబ్సిగూడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా నాగోల్ రోడ్డు రాజ్యలక్ష్మి థియేటర్ వరకు 1.5 కిలో మీటర్ల పొడవున ప్రస్తుతం 30 మీటర్ల రోడ్డు ఉండగా దానిని 60 మీటర్ల వరకు పొడగించనున్నారు. ► రోడ్డు వెడల్పులో భాగంగా 25 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతుండగా అందులో 6 ప్రభుత్వ ప్రాపర్టీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రింగ్ రోడ్డుపై భారం తగ్గించడమే లక్ష్యం.. వరంగల్ జాతీయ రహదారి వైపు నుంచి స్కైవే పైగా వచ్చే ట్రాఫిక్ ఉప్పల్ జంక్షన్ వద్దకు రాగానే తిరిగి ట్రాఫిక్ సమస్య తలెత్తే ప్రమాదముంది. అటు వైపు నుంచి హబ్సిగూడ, రామంతాపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్ తీవ్రరూపం దాల్చకముందే రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ఉప్పల్ సర్కిల్ ప్రాంతంలో నాలుగు సమాంతర ఫ్లై ఓవర్లను నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాం. ప్రతిపాదనలు పూర్తవ్వగానే పనులను ప్రారంభిస్తాం. – రవీందర్ రాజు, ఎస్ఈ, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం నాగోల్ వైపు 60 మీటర్ల రోడ్డు.. ఉప్పల్ చౌరస్తా మీదుగా నాగోల్ వైపు 60 మీటర్ల రోడ్డును వెడల్పు చేయనున్నాం. మొదటి దశగా ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ నుంచి రింగ్ రోడ్డు మీదుగా రాజ్యలక్ష్మి థియేటర్ వరకు అక్కడి నుంచి హబ్సిగూడ వైపు సర్వే ఆఫ్ ఇండియా గేటు వరకు రోడ్డుకు ఇరువైపుల రోడ్డు వెడల్పుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రోడ్డు వెడల్పులో నష్టపోయే 25 ఆస్తులను గుర్తించాం. – శ్రావణి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, ఉప్పల్ -
అభివృద్ధి పథంలో ఆర్మీ భూములు!
న్యూఢిల్లీ: రక్షణ శాఖ భూముల విధానంలో (డిఫెన్స్ ల్యాండ్ పాలసీ) కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రక్షణ శాఖకు చెందిన భూములను ఇతర అవసరాలకు మళ్లించేందుకు సిద్ధమైంది. ప్రజా ప్రాజెక్టులు, సైనికేతర అవసరాల నిమిత్తం ఇకపై రక్షణ శాఖ భూములను సేకరించవచ్చు. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. అయితే, సేకరించిన భూమికి ప్రతిఫలంగా సైనిక దళాలకు అంతే విలువ కలిగిన భూమిని మరోచోట ఇవ్వాలి. ఈక్వల్ వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్–ఈవీఐ లేదా మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటిషర్లు భారత్లో తొలిసారిగా 1765లో పశ్చిమ బెంగాల్లోని బారక్పూర్లో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ భూములను సైనికేతర అవసరాలకు ఉపయోగించకుండా అప్పటి నుంచి నిషేధం కొనసాగుతోంది. కంటోన్మెంట్లలోని బంగ్లాలు, క్వార్టర్లను సైన్యంతో సంబంధం లేని వారికి విక్రయించడం లేదా వారు ఆక్రమించడం చెల్లదంటూ 1801లో అప్పటి ఈస్టిండియా కంపెనీ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ తర్వాత దాదాపు 200 ఏళ్ల తర్వాత దేశంలో రక్షణ భూముల విధానంలో సంస్కరణలు తేవడం ఇదే మొదటిసారి. కంటోన్మెంట్ జోన్లలో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కంటోన్మెంట్ బిల్లు–2020ని తీసుకొచ్చింది. ఈ ఏడాది ఇందులో కొన్ని మార్పులు చేసింది. మెట్రో రైళ్లు, రోడ్లు, ఫ్లైఓవర్లు, రైల్వే వంటి పబ్లిక్ ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ నుంచి భూములను సేకరించవచ్చని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అయితే, సేకరించిన భూమికి గాను సమాన విలువ కలిగిన భూమిని ఇవ్వడం గానీ లేదా మార్కెట్ ధర చెల్లించడం గానీ చేయాలని పేర్కొన్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి పూర్తయిన తర్వాతే భూమిని బదలాయించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కంటోన్మెంట్లలోని భూమి విలువను స్థానిక సైనిక ఆథారిటీ నేతృత్వంలోని కమిటీ నిర్ధారిస్తుంది. కంటోన్మెంట్ల వెలుపల గల భూమి విలువను జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) ఖరారు చేస్తారు. దేశంలో ప్రధాన నగరాల్లో కీలకమైన ప్రాంతాల్లో రక్షణ శాఖ భూములున్నాయి. పబ్లిక్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆయా భూములు కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. -
ఫ్లై ఓవర్ల కింద స్మార్ట్ పార్కింగ్.. ప్రస్తుతానికి వీరికే అవకాశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పార్కింగ్ అవస్థల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా వివిధ పేర్లతో ఆయా ప్రాంతాల్లో కొత్త పార్కింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి తెస్తామని నేతలు ప్రకటిస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఓవైపు ప్రజలకు సదుపాయంతో పాటు మరోవైపు ఉన్న స్థలాన్నే సద్వినియోగం చేసుకొని జీహెచ్ఎంసీకి ఆదాయం కూడా సమకూరేలా స్మార్ట్పార్కింగ్ త్వరలో అందుబాటులోకి రానుంది. గ్లోబల్సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్లో అందుబాటులోకి రానున్న స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్తో గందరగోళం ఉండదు. వేచి ఉండాల్సిన పరిస్థితులుండవు. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు సౌకర్య వంతంగా ఉంటుంది. వీరి కోసం కొన్ని స్లాట్స్ రిజర్వుగా ఉంటాయి. యాప్లోనే ముందస్తుగా స్లాట్ బుకింగ్ అవకాశం ఉండటంతో దూరం నుంచి వచ్చేవారికి సదుపాయం. ఆన్లైన్ పేమెంట్ విధానంతో ‘చిల్లర’ గొడవలుండవు. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్లోని సుజనా ఫోరం మాల్ ఎదుట ఫ్లైఓవర్ కింద వాహనాలు పార్కింగ్ చేస్తుండటాన్ని గుర్తించిన అధికారులు.. ఆ స్థలంలోనే స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే స్మార్ట్ పార్కింగ్. పీపీపీ విధానంలో పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభోత్సవం జరగనుంది. ప్రత్యేకతలివీ.. పార్కింగ్ ప్రదేశంలోనే అయినా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా పార్కింగ్ చేయడం కుదరదు. పార్కింగ్ ప్రదేశానికి గేట్వేతో పాటు బొల్లార్డ్స్, సెన్సార్లు ఉండటంతో నిరీ్ణత ప్రదేశంలోనే పార్కింగ్ చేస్తారు. వాహనం వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు స్కానింగ్ జరుగుతుంది. వాహనం పోతుందనే.. దొంగల భయం ఉండదు. వాహనాల రాకపోకలకు సంబంధించిన వివరాలు ఏడాది వరకు క్లౌడ్ స్టోరేజిలో ఉంటాయి. జీహెచ్ఎంసీకి ఆదాయం లభిస్తుంది. సిస్టమేటిక్ పార్కింగ్తో రద్దీ సమయాల్లో రోడ్లపై ట్రాఫిక్జామ్ తగ్గుతుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో çపర్యావరణ పరంగా మేలు. పైలట్ ప్రాజెక్టుగా దీని అనుభవంతో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో పాటు అన్నింటినీ అనుసంధానం చేసే వ్యవస్థ ఏర్పాటుకు ఆలోచనలున్నాయి. -
ఫ్లై ఓవర్ ప్రమాదంపై విచారణ
అనకాపల్లి/అనకాపల్లి టౌన్: అనకాపల్లి పట్టణ సమీపంలో జాతీయ రహదారిపైన నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బీమ్లు కూలిపోయిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలతోపాటు పలు వర్గాల నుంచి డిమాండ్లు రావడంతో పోలీసులు బుధవారం సుమోటోగా కేసు నమోదుచేశారు. సైట్ ఇన్చార్జి ఈశ్వరరావు, జీఎం నాగేంద్రకుమార్, దిలీప్ బిల్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు ఆర్వీఎస్. మూర్తి, శ్రీనివాసరావులతో కూడిన బృందం బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ప్రమాదానికి గల కారణాలపై ఈ బృందం నివేదిక ఇవ్వనుంది. కాగా ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ దిలీప్ బిల్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీపై మృతుడు సతీష్ కుమార్ బావమరిది శశి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని బుధవారం నేషనల్ హైవే అథారిటీ పీడీ శివకుమార్ సందర్శించారు. -
అనకాపల్లి ఫ్లైఓవర్ దుర్ఘటనపై నేషనల్ హైవే అథారిటీ విచారణ
-
అనకాపల్లి ఫ్లైఓవర్ దుర్ఘటన: నేషనల్ హైవే అథారిటీ విచారణ
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి ఫ్లైఓవర్ దుర్ఘటనపై నేషనల్ హైవే అథారిటీ విచారణ చేపట్టింది. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 15 బీముల అమరిక, 2 బీములు జారిపడటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఎన్హెచ్ఏఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. మృతులు సతీష్కుమార్, సుశాంత్ మహంతిల మృతదేహాలను వారి కుటుంబానికి అప్పగించారు. కాగా, జాతీయ రహదారుల విస్తరణ, అనుసంధాన ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో చేపడుతున్న ఫ్లైఓవర్ బీమ్లు జారిపడడంతో మంగళవారం ఇద్దరు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల మేరకు అనకాపల్లి నుంచి విశాఖకు వెళ్లే మార్గంలో జలగలమదుం జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ పైభాగంలో అమర్చిన బీమ్లు ఒక్కసారిగా జారి అదే సమయంలో విశాఖ వైపు వెళ్తున్న ఒక కారు, ఆయిల్ ట్యాంకర్పై పడ్డాయి. -
విశాఖలో కుప్పకూలిన నిర్మాణం లో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్
-
అనకాపల్లి: కూలిన ఫ్లైఓవర్ పిల్లర్.. కారు, ట్యాంకర్ ధ్వంసం
-
అనకాపల్లి: కూలిన ఫ్లైఓవర్ పిల్లర్.. కారు, ట్యాంకర్ ధ్వంసం
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హైవే వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్ కూలింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు అక్కడ ఓ కారు, ట్యాంకర్ ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లర్ భాగాలు వీటి మీద పడటంతో అవి పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. విచారకర అంశం ఏంటంటే ప్రమాదం సమయంలో కారులో ఉన్న దంపతుల్దిదరు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఈ హైవే విస్తరణ పనులు కొనసాగతున్నాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో విశాఖ శ్రీహరిపురంకు చెందిన సతీష్ కుమార్, సుశాంత్ మహంతిలు మృతి చెందారు. కారులో వెనక కూర్చున్న మృతుల భార్యలు సునీత, లక్ష్మిలను స్థానికులు కాపాడారు. ఇక వీరిలో సునీత గర్భిణీ. బాధితులంగా అనకాపల్లి శ్రీ నూకాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ రెండు కుటుంబాలు ఉపాధి రీత్యా శ్రీహరిపురంలో నివాసం ఉంటున్నారు. -
బాలానగర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్: ప్రత్యేక ఆకర్షణగా శివమ్మ..
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారో తెలుసా.. మంత్రి కేటీఆర్ ఓ కూలీ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయించారు. ఆమెనే వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ. గత రేండేళ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ఆమె పాలు పంచుకుంది. శివమ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవర్ను ప్రారంభించుకోవడంతో కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శివమ్మ. కాగా. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: బాలానగర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
బాలానగర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్ను నిర్మించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కూకట్పల్లి-సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు. 2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.387 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి, 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. -
హైదరాబాద్లో మరో 2 ఫ్లై ఓవర్లు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిల మీదుగా ఐటీ కారిడార్లలోకి ఈజీగా వెళ్తున్నవారికి.. తిరిగి వచ్చే సమయంలో రోడ్నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ల వద్ద వేగానికి కళ్లెం పడుతోంది. సిగ్నల్స్ వద్ద ఆగాల్సి వస్తోంది. అక్కడి వరకు రయ్యిమని ఎక్కడా ఆగకుండా దూసుకువచ్చిన వారికి.. రోడ్డు ఇరుకుగా మారడం, సిగ్నల్స్ పడటంతో ఎక్కువ సేపు ఆగాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నివారించేందుకు రోడ్ నెంబర్ 45 జంక్షన్ వద్ద, జూబ్లీచెక్పోస్ట్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఎస్పార్డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం) లో భాగంగా వీటిని నిర్మించనున్నారు. ఇవీ ఫ్లై ఓవర్లు.. రోడ్నెంబర్ 45 జంక్షన్వద్ద 400 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్, అనంతరం కొంత దూరం వెళ్లాక మరో ఫ్లై ఓవర్ జూబ్లీచెక్పోస్ట్ సమీపంలో ప్రారంభం అవుతుంది. దాదాపు కిలోమీటరు పొడవుండే ఆ ఫ్లైఓవర్ మీదుగా ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి జంక్షన్ వరకు సాఫీగా సాగిపోవచ్చు. ఒకే మార్గంలో, రెండు లేన్లుగా నిర్మించనున్న ఈ రెండు ఫ్లై ఓవర్ల అంచనా వ్యయం దాదాపు రూ.72 కోట్లు. వీటిల్లో రోడ్నెంబర్ 45 జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ను మొదటి వరుసలో నిర్మించనుండగా, జూబ్లీచెక్పోస్ట్ వద్ద ప్లై ఓవర్ను రెండో వరుసలో నిర్మించనున్నారు. -
ఊపందుకున్న గరుడ వారధి నిర్మాణ పనులు
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి ‘స్మార్ట్’ సిటీ వైపు శరవేగంగా దూసుకుపోతోంది. ఒక్కొక్కటిగా పూర్తవుతున్న అభివృద్ధి పనులతో చూడముచ్చటగా తయారవుతోంది. ‘గరుడ’ వేగంతో దూసుకుపోతున్న ‘వారధి’ నగరానికే తలమానికంగా నిలవనుంది. ఇప్పటికే 48 శాతం పూర్తయిన ఈ వారధిని మరో ఏడాదిలో ప్రారంభించేలా ముఖ్యమంత్రి చొరవ చూపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, తిరుపతి తుడా: స్మార్ట్సిటీలో భాగంగా చేపట్టిన గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2019లో ప్రారంభమైన ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారయంత్రాంగం భావించింది. కరోనా కారణంగా ఏడాదిన్నరగా నిర్మాణ పనుల్లో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి టీటీడీ నిధుల విడుదలకు చొరవ తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రగతికి దారిది! గరుడ వారధి నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ఇప్పటికే నిర్ణయించిన 171 పిల్లర్లు నిర్మించారు. కరకంబాడి రోడ్డు నుంచి నంది సర్కిల్కు వెళ్లే రెండో అంతస్తు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికాచ్చాయి. ప్రకాశం పార్కు నుంచి శ్రీనివాసం వరకు వారధిపై సెగ్మెంట్లను పూర్తిగా ఏర్పాటు చేశారు. పిల్లర్లకు ప్రయోగాత్మకంగా కలంకారీ చిత్రాలు, అన్నమయ్య పెయింటింగ్స్, దశావతారాల విగ్రహాలతో రంగులు అద్దుతున్నారు. ప్రకాశం పార్కు సమీపంలో డివైడర్ మధ్యలో మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఇదే ప్రాంతంలో విశాలమైన ఫుట్పాత్ను నిర్మిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రామానుజ సర్కిల్ ప్రాంతాల్లో పిల్లర్ల ఏర్పాటు పూర్తిచేశారు. సెగ్మెంట్ల ఏర్పాటు శరవేగంగా చేపడుతున్నారు. ఫ్లై ఓవర్ కింద భాగం పూర్తిగా రంగులు వేసేలా చర్యలు చేపట్టారు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే వాహనాలను శ్రీనివాసం వద్ద ఫ్రీలెఫ్ట్ చేస్తున్నారు. బస్టాండ్ నుంచి అలిపిరికి వెళ్లే వాహనాలను కొర్లగుంట సమీపంలో ఫ్లై ఓవర్లో కలిసేలా చర్యలు చేపట్టారు. -
ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
ఖైరతాబాద్: ఖైరతాబాద్ ఫ్లై ఓవర్పై నుంచి లేక్వ్యూ పార్క్లో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంఘటన సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... జీడిమెట్ల పరిధిలోని సూరారంలో నివాసముండే కోమటి చందన(20) పీజీ పూర్తిచేసింది. రెండేళ్ల క్రితం స్థానికంగా ఉండే బి.నరే‹Ùను ప్రేమ వివాహం చేసుకుంది. ఆదివారం జీడిమెట్లలో బస్సు ఎక్కి ఖైరతాబాద్ చౌరస్తాలో ఉదయం 9.30 గంటలకు దిగింది. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా ట్యాంక్బండ్ వైపునకు నడుచుకుంటూ వెళ్తూ ఫ్లై ఓవర్ మధ్యలోకి వెళ్లగానే ఫ్లై ఓవర్ ఫుట్పాత్పైకి ఎక్కి పక్కనే ఉన్న లేక్వ్యూ పార్క్లో దూకింది. ఈ సంఘటను చూసిన స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను హుటాహుటిన సోమాజిగూడలోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. పైనుంచి దూకడంతో కుడి కాలు ప్రాక్చర్కాగా, వెన్నెముకకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే ఆమె తన వల్ల ఎవరూ సంతోషంగా లేరని భావించి... తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది
-
పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్స్కు ఏర్పాటు చేసిన డెకరేషన్స్ సామాగ్రికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. నల్లని పొగ కమ్మేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు. అగ్నిప్రమాదంతో పంజాగుట్ట వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. చదవండి : (పెళ్లి విషయం దాచిపెట్టి ప్రేమ నాటకం.. దాంతో) ('అమృత్ మహోత్సవ్'కు ప్రధాని మోదీ శ్రీకారం) -
కూకట్పల్లిలో ‘స్మార్ట్’ పార్కింగ్, గంటకు రూ.10 మాత్రమే!
కేపీహెచ్బీకాలనీ: విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న భాగ్యనగరంలో పార్కింగ్ ఓ సవాల్గా మారింది. ముఖ్యంగా షాపింగ్ మాళ్లు కొలువుదీరిన ప్రాంతాల్లోనైతే పార్కింగ్ కోసం పరేషాన్ కావాల్సిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య సైతం ఉత్పన్నమై అటు వాహన చోదకులతో పాటు ట్రాఫిక్ పోలీసులకూ తలనొప్పిగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల కారణంగా పార్కింగ్ సమస్య గుదిబండగా మారిన దృష్ట్యా ‘స్మార్ట్’ పార్కింగ్ దిశగా జీహెచ్ఎంసీ ముందడుగు వేసింది. ఒకప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం అంటే ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం నిరి్మంచేవారు. కానీ.. నేడు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆధునిక సాంకేతికతకు అద్దం పట్టడంతో పాటు ఆధునిక హంగులకు నిలయంగా మారింది. రద్దీకి చిరునామైనా కూకట్పల్లి హౌసింగ్బోర్డు ఫోరం మాల్ ఎదురుగా ఫ్లైఓవర్ కింద నగరంలోనే మొదటిసారిగా చేపట్టిన సెన్సార్ బేస్డ్ స్మార్ట్ పార్కింగ్ కేంద్రమే ఇందుకు నిదర్శనం. ► దాదాపుగా రూ. 48 లక్షలతో ఏర్పాటు చేసిన సెన్సార్ బేస్డ్ స్మార్ట్ పార్కింగ్లో 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. ► అక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే ముందుగా ప్రత్యేకంగా రూపొందించి యాప్ ద్వారా పార్కింగ్ వసతి కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ► నేరుగా స్మార్ట్ పార్కింగ్ కేంద్రానికి వెళ్లినా స్లాట్ ఖాళీగా ఉంటేనే అనుమతి లభిస్తోంది. ► పార్కింగ్ కేంద్రం వద్దకు వెళ్లగానే ముందుగానే యాప్లో పొందుబర్చిన వివరాల ఆధారంగా వాహన నెంబర్ను సెన్సార్ స్కానర్లు ఆటోమేటిక్గా స్కాన్ చేస్తాయి. ► కేటాయించిన పార్కింగ్ గడిలో వాహనాన్ని పార్క్ చేసినప్పటి నుంచి మళ్లీ వాహనం తీసుకెళ్లే సమయాన్ని ఆటోమేటిక్గా సెన్సార్ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ గణించి గంటకు రూ.10ల చొప్పున చెల్లించాలని సూచిస్తుంది. ఆ మేరకు చెల్లింపు పూర్తి కాగానే వాహనంతో బయటకు వెళ్లేందుకు గేటు ఓపెన్ అవుతుంది. ► ఇందులో మహిళలతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక స్లాట్లను సైతం ఏర్పాటు చేశారు. ► ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి నిర్వహణ బాధ్యతల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ► స్మార్ట్ పార్కింగ్ కేంద్రానికి ఎదురుగానే ఫోరం సుజనామాల్, పక్క వీధిలో డీ–మార్ట్ వంటి షాపింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా గంటకు రూ.10 చొప్పున స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని వాహనదారులు ఏ మేరకు వినియోగించుకుంటారనేది సందేహంగానే ఉంది. ► షాపింగ్ మాల్స్లో మొదటి అరగంట ఉచిత పార్కింగ్ అవకాశం ఉండడంతో పాటు ఏదైనా షాపింగ్ చేసినా బిల్లు చూపిస్తే మిగతా సమయానికి పార్కింగ్ ఉచితంగానే లభిస్తుంది. ► ఈ నేపథ్యంలో స్మార్ట్ పార్కింగ్ కేంద్రంలో గంటకు రూ.10కి బదులు 2, 3 గంటలకు రూ.10 చొప్పున వసూలు చేస్తే ఉపయోగం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► మరో వైపు ప్లైఓవర్ బ్రిడ్జి పిల్లర్లపై వేయించిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. -
హైదరాబాద్: నేటి రాత్రి ఫ్లైఓవర్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: జగ్నేకీ రాత్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నగరంలోని ఫ్లైఓవర్లను గురువారం అర్ధరాత్రి నుంచి మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కొత్వాల్ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇవి అమలులో ఉంటాయి. గ్రీన్ల్యాండ్స్, లంగర్హౌస్ ఫ్లైఓవర్లతో పాటు పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. మరోవైపు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం పబ్లిక్ గార్డెన్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటి నేపథ్యంలో ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజ్ ఐలాండ్, ఛాపెల్ రోడ్ టీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, బషీర్బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంపుల నుంచి వాహనాలను మళ్లిస్తారు. -
అవసరమైతే మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తాం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆర్కె బీచ్ నుంచి భోగాపురం వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆయన సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..ఫ్లై ఓవర్ బ్యూటిఫికేషన్ వర్క్స్ పూర్తి చేశాకే ప్రారంభిస్తామని, అవసరమైతే మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేశామని గుర్తుచేశారు. విశాఖలో మరిన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం, డీపీఆర్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రుషికొండ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఆస్తి పన్ను విషయంలో 15శాతానికి మించి పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 350గజాలు ఉన్నవారికి రూ. 50 మాత్రమే పెరుగుతుందని తెలిపారు. బ్యాంకులుపై చెత్త వేసిన ఘటనపై కమిటీ వేశామని, దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివారస్రావు మాట్లాడుతూ.. విశాఖలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, విశాఖ పరిపాలన రాజధాని, టూరిజం హబ్గా మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. -
దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభం ఫొటోలు
-
ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
-
బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
-
బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
సాక్షి, విజయవాడ : నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు శుక్రవారం వర్చువల్ కార్యక్రమం ద్వారా ఫ్లైఓవర్ను ప్రారంభించారు. అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్లు జాతికి అంకితం ఇచ్చారు. కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900 పని దినాలలో ఫ్లైఓవర్ పూర్తయింది. ఫ్లై ఓవర్ను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్రంలో అనుకూల పరిస్థితులున్నాయి. ఏపీ రహదారుల సమస్యలపై త్వరలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం అవుతాం. రాయలసీమలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల’’ని అన్నారు. -
నేడు విజయవాడలో రెండు ఫ్లైఓవర్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ బెజవాడకు తలమానికంగా నిలిచే బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.15,591.9 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. భవానీపురం నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా వాహనాల రాకపోకలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ అత్యంత సాంకేతిక విలువలతో రూ.501 కోట్లతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ నగరానికి మకుటంలా నిలుస్తుందన్నారు. (దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు) ►రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ►ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే: సోము సాక్షి, అమరావతి: దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2.6 కి.మీ పొడవుతో వంపులు తిరుగుతూ ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్ దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.