Green Energy
-
శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బయటకు
న్యూఢిల్లీ: శ్రీలంకలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం టారిఫ్లను పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ తలపెట్టిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) వైదొలిగింది. అయితే, శ్రీలంకలో పెట్టుబడులకు తమ సంస్థ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ప్రభుత్వం కోరుకుంటే తప్పకుండా కలిసి పని చేస్తామని సంస్థ తెలిపింది.వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంకలోని మన్నార్, పూనెరిన్ ప్రాంతాల్లో దాదాపు 740 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏజీఈఎల్ 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంది. 2026 మధ్య నాటికి ఇవి పూర్తి కావాలి. అయితే, వీటితో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటూ పర్యావరణవేత్తల ఆందోళనలు చేపట్టి, లీగల్ కేసులు వేయడంతో ఈ ప్రాజెక్టులకు ప్రారంభం నుంచే అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక గత ప్రభుత్వం ప్రతిపాదిత అదానీ విండ్ పవర్ ప్లాంటు నుంచి యూనిట్కు 0.0826 డాలర్ల ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు రేటును యూనిట్కు 0.06 స్థాయికి తగ్గించేలా టారిఫ్లను పునఃసమీక్షించాలని జనవరిలో నిర్ణయించింది. ఇది ఆమోదయోగ్యమైన ధర కాకపోవడంతో ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాలని ఏజీఈఎల్ నిర్ణయం తీసుకుంది. అయితే, అదానీ గ్రూప్ 700 మిలియన్ డాలర్లతో కొలంబోలో తలపెట్టిన పోర్టు అభివృద్ధి పనులు యథాప్రకారం సాగనున్నాయి. ఇదీ చదవండి: హోండా, నిస్సాన్ పొత్తు లేనట్టే!యూపీఎమ్కు టీసీఎస్ సేవలుఐటీ ట్రాన్స్ఫార్మేషన్లో ఏఐ మద్దతున్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఫిన్లాండ్ సంస్థ యూపీఎమ్తో ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది. 11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్ యూరోల టర్నోవర్ను కలిగి ఉంది. యూపీఎమ్ వృద్ధికి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్) విలువను వెల్లడించలేదు. యూపీఎమ్ ఎంటర్ప్రైజ్ ఐటీ వేల్యూ చైన్ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది. -
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు గ్లోబల్ హబ్గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇంధన సంస్కరణలు కూడా సుస్థిర అభివృద్ధికి ఒక ఉదాహరణ అని తెలిపారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా రెండవ రోజు మంగళవారం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై ఆయన ప్రసంగించారు. 1999లో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సాహసోపేతమైన విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయం సాధించానని చెప్పుకొచ్చారు. నాడు దేశం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కోవడంతో పరిశ్రమలు మూసి వేయాల్సి వచ్చిందన్నారు. సుస్థిర లక్ష్యాలను సాధించేందుకు మిషన్ మూడ్ విధానంతో ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చాలనేది తన ఉద్దేశం అని చెప్పారు.2030 నాటికి 500 మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్ను, 500 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇంధన రంగంలో 115 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ఆకర్షించామన్నారు. భారతదేశ పునరుత్పాదక ఇంధన ఆశయాలను వేగంగా సాధించేలా జాయింట్ వెంచర్గా నెలకొల్పుతున్న 21 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ఇటీవల ప్రధాన మంత్రి విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారని చెప్పారు. ఏపీలో అదనంగా బయో ఫ్యూయల్ రంగంలో రిలయన్స్ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోందని అన్నారు. కాస్ట్ ఆప్టిమైజేషన్, పర్యావరణ సమతుల్యతపై దృష్టి పెట్టి గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూయల్ మార్కెట్లకు ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా చేస్తున్నామని, కాకినాడ వంటి పటిష్ట ఓడరేవుల ద్వారా ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని, పారిశ్రామిక వేత్తలకు, ఇంధన వ్యయాలను మరింత తగ్గించేలా నిరంతర పరిశోధనలు, అభివృద్ధికి తమ మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలనే విద్యుత్ ఉత్పత్తిదారులుగా చేసేలా రూఫ్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి నెట్ జీరో లక్ష్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఏ దేశమెళ్లినా ఏపీ పారిశ్రామిక వేత్తలే ఉంటున్నారన్నారు. మానవ వనరుల లభ్యత ఏపీకి ప్లస్ పాయింట్ అని, భారతీయ పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహద పడుతున్నారని చెప్పారు.2028 నుంచి భారత యుగం ప్రారంభమవుతుందని చెప్పారు. భారతదేశం అందించిన సేంద్రియ వ్యవసాయం ప్రపంచ సమాజానికి ఒక వరం అని చెప్పారు. పీ4 మోడల్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యాన్ని ఇటు పాలనలోనూ తీసుకువచ్చామని చెప్పారు. హరిత పారిశ్రామికీకరణ, డీప్టెక్ ఇన్నోవేషన్, సమ్మిళిత నాయకత్వంపై దృష్టి సారించామని చెప్పారు. పేదరికం, సమాజంలో అసమానతలను రూపు మాపడానికి కార్పొరేట్ సంస్థలు బాధ్యత తీసుకోవాలని కోరారు. -
గ్రీన్ హైడ్రోజన్కు రెడ్ కార్పెట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్(Green Energy), అనుబంధ ఉత్పత్తుల (డెరివేటివ్స్) పరిశ్రమ లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. ఎలక్ట్రోలైజర్ ఆధా రిత గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల ప్లాంట్లను స్థాపించే డెవలపర్లకు ఎలక్ట్రోలైజర్ స్టాక్ ప్లాంట్, పరికరాలపై 30 శాతం పెట్టుబడి రాయితీని అందించనుంది. ప్రతి మెగావాట్కి/ 1,400 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యానికి రూ.కోటి చొప్పున రూ.30 కోట్ల గరిష్ట పరిమితికి లోబడి ఒక్కో ప్లాంట్కు పెట్టుబడి రాయితీ ఇస్తామని ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025’(Green Energy Policy 2025) ప్రభుత్వం హామీ ఇచ్చింది. ‘ఇంటిగ్రేటెడ్’ ప్రాజెక్టులకూ సబ్సిడీలు..ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ (బయోజనిక్ కార్బన్తో సహా) పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పాలసీలో ప్రాధాన్యతనిచ్చింది. ప్లాంట్, పరికరాల (ఎలక్ట్రోలైజర్తో సహా) వ్యయంలో 30 శాతాన్ని పెట్టుబడి రాయితీగా అందించనుంది. గ్రీన్ అమోనియా ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.1.85 కోట్లు, గ్రీన్ మిథనాల్ ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.2.25 కోట్ల గరిష్ట పరిమితికి లోబడి సబ్సిడీలు ఇస్తుంది.గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లలో వినియోగించే ఎలక్ట్రోలైజర్ పరికరాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తయారీ పరిశ్రమల స్థాపనకు పెట్టే పెట్టుబడులపై 25 శాతాన్ని రాయితీగా ప్రభుత్వం అందించనుంది. కనీసం 500 మెగావాట్ల వార్షిక ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన తొలి 5 ప్లాంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ హైడ్రోజన్/డెరివేటివ్స్, ఎలక్టోల్రైజర్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పరిశ్రమలకు వర్తించే కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు..⇒ రాష్ట్రంలో జరిపే గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలపై 100 శాతం ఎస్జీఎస్టీని 5 ఏళ్ల పాటు రీయింబర్స్ చేస్తారు. ⇒ ఎలక్టోల్రైజర్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలపై ఏడేళ్ల పాటు 100 శాతం ఎస్జీఎస్టీ తిరిగి చెల్లిస్తారు. ⇒ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలకు 10 ఏళ్ల పాటు, ఎలక్ట్రోలైజర్ పరిశ్రమలకు 5 ఏళ్ల పాటు 100 శాతం విద్యుత్ పన్ను మాఫీ. ⇒ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు రాష్ట్ర డిస్కంల నుంచి కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్కు రూ.3 చొప్పున 20 ఏళ్ల పాటు విద్యుత్ బిల్లులను తిరిగి చెల్లిస్తారు. ఎలక్టోల్రైజర్ పరిశ్రమలకు ఐదేళ్ల పాటు యూనిట్ విద్యుత్పై రూపాయి చొప్పున ఈ రాయితీ వర్తిస్తుంది. ⇒ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమల ఏర్పాటుకు కొనుగోలు చేసే స్థలాలకు 100 శాతం స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఎలక్ట్రోలైజర్, హైడ్రోజన్ ఫ్యూయల్ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు⇒ రూ.2 లక్షల పరిమితికి లోబడి 50 శాతం వరకు క్వాలిటీ సర్టిఫికేషన్ చార్జీలను ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ⇒ పేటెంట్ ఫైలింగ్ చార్జీల్లో 50 శాతాన్ని రూ.2 లక్షల పరిమితికి లోబడి చెల్లిస్తారు. ⇒ మహిళలు ఏర్పాటుచేసే ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు రూ.10 లక్షల పరిమితికి లోబడి అదనంగా 10 శాతం వరకు పెట్టుబడి రాయితీ ఇస్తారు. ⇒ గ్రీన్ హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి 30 శాతం పెట్టుబడి రాయితీలను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇది తొలి 10 యూనిట్లకు మాత్రమే.గ్రీన్ హైడ్రోజన్ అంటే ?గ్రీన్ హైడ్రోజన్ స్వచ్ఛమైన ఇంధన వనరు. సౌర విద్యుత్ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టుతారు. కాలుష్య రహిత సౌర, ఇతర పునరుత్పాదక విద్యుత్ను ఉపయోగించి ఇలా తయారు చేసిన హైడ్రోజన్ను గ్రీన్ హైడ్రోజన్ అంటారు. వాహనాలతో పాటు ఎరువులు, ఉక్కు, సిమెంట్ వంటి భారీ పరిశ్రమల్లో వినియోగిస్తున్న సాంప్రదాయ ఇంధనాలకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్ను వినియోగిస్తే ‘నెట్ జీరో’ కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని అందుకోవచ్చని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సౌర, పవన విద్యుత్తో గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసుకుని అవసరమైనప్పుడు ఇంధనంగా వాడుకోవచ్చు. -
పెట్టుబడులు రూ.1.98 లక్షల కోట్లు..ఉద్యోగాలు 1.14 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుఎల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ (బ్యాటరీ స్టోరేజీ+ పంప్డ్ స్టోరేజీ) ప్రాజెక్టులు, జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ వంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటును భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం (కాంట్రాక్టెడ్ కెపాసిటీ) 10,095.20 మెగావాట్లు ఉండగా, 2029–30 నాటికి సుమారు 20,000 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని జత చేసి మొత్తం 31,400 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించింది.2034–35 నాటికి అదనంగా మరో 18,100 మెగావాట్ల సామర్థ్యాన్ని జత చేసి మొత్తం సామర్థ్యాన్ని 49,500 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం వచ్చే పదేళ్లలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.14 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2025ని రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదించింది. పదేళ్లపాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. బిడ్డింగ్ ద్వారా డెవలపర్లకు ఆహ్వనం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం, జియో థర్మల్, మినీ హైడల్, వేస్ట్ టూ ఎనర్జీ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్కు అనుసంధానం చేసి, ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్ను కొనుగోలు చేయనున్నాయి. చౌకగా లీజుకు సర్కారీ భూములు.. డెవలపర్లకు ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ఇస్తారు. బిడ్డింగ్లో గెలిచిన సంస్థకు మార్కెట్ రేటులో 10 శాతం లీజు రేటుగా నిర్ణయిచి భూములను కేటాయిస్తారు. అనంతరం ప్రతి రెండేళ్లకోసారి 5 శాతం లీజు ధరను ప్రభుత్వం పెంచనుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పంద (పీపీఏ) జరిగాక జిల్లా కలెక్టర్లతో లీజు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కరెంటు ప్రైవేటుకూ అమ్ముకోవచ్చు డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ అమ్ముకోవచ్చు. సొంత అవసరాలకూ వాడుకోవచ్చు. ఎకరాకు రూ.లక్ష ధరతో ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం 25 ఏళ్లు లేదా ప్రాజెక్టు జీవిత కాలానికి స్థలాలను కేటాయిస్తుంది. ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత సబ్ స్టేషన్ పరిధిలో కొత్త విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఎంత సామర్థ్యం లభ్యత ఉందో.. ఆ మేరకు మాత్రమే అనుమతిస్తారు. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత లభించనుంది. సౌర, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లను రెండేళ్లలో, పవన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వీటి ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయించనున్నారు. మహిళా సంఘాలతో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపన 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) నుంచి ఆసక్తి వ్యక్తీకరణను డిస్కంలు విడతలవారీగా ఆహ్వనించనున్నాయి. వారి నుంచి నిరీ్ణత ధరకు విద్యుత్ను డిస్కంలు కొనుగోలు చేస్తాయి. భారీ ప్రోత్సాహకాలు.. ⇒ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే భూములకు నాలా కన్వర్షన్ నుంచి మినహాయింపు. ⇒ టీజీ–ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులను సత్వరం జారీ చేస్తారు. ⇒ పారిశ్రామిక హోదా కల్పించి రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద అందించే అన్ని రకాల ప్రోత్సాహకాలను వర్తింపుజేస్తారు. ⇒ప్రతి మెగావాట్కు 4 ఎకరాలు చొప్పున భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. ⇒ భూముల కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ 100 శాతం తిరిగి చెల్లిస్తారు. ⇒వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. ⇒ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ చెల్లింపుల నుంచి మినహాయింపు ఇస్తారు. ఇతర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లుఅందుతాయి. జెన్కో, ట్రాన్స్కో సాంకేతిక సహకారం అందిస్తాయి. ⇒ పీసీబీ నుంచి ఎన్ఓసీ మినహాయింపు. ⇒ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సౌర, పవన విద్యుత్ వాడుకుంటే 8 ఏళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు కల్పిస్తారు. ⇒ పీఎస్పీ ప్రాజెక్టులకు నీటి సుంకాన్ని తిరిగి చెల్లిస్తారు. డిస్కంలకు విద్యుత్ విక్రయిస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు ⇒ సూపర్వైజేషన్ చార్జీల మినహాయింపు. ⇒ ఇతర సౌర, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ, ఇతర ప్రాజెక్టులకు 50 శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. ⇒ ఎస్హెచ్జీలు/గ్రామ సమాఖ్యలు ఏర్పాటు చేసే సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత గృహాలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ స్కూల్స్, కార్యాలయాలపై ఏర్పాటు చేసే రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టులకు 100 శాతం స్టేట్ జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. పీఎస్పీ ప్రాజెక్టులకు 45 ఏళ్ల లీజుకు స్థలాలు పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను 45 ఏళ్ల లీజుకు కేటాయిస్తారు. వీటి స్థాపన కోసం ప్రైవేటు డెవలపర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. 6 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి. 45 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. పీఎస్పీ విద్యుత్లో 80 శాతం తొలి హక్కు రాష్ట్రమే కలిగి ఉంటుంది. హైబ్రిడ్ పవర్కు ప్రాధాన్యత.. ఒకే ప్రాంతంలో సౌర+పవన, పవన+ఫ్లోటింగ్ సోలార్, విండ్+ స్టోరేజీ, హైబ్రిడ్+స్టోరేజీ వంటి పునరుత్పాదక ఇంధన స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ పాలసీ ద్వారా ప్రోత్సహించనున్నారు. -
20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పాదకతను ప్రోత్సహించి భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి త్వరలో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ(Green Energy Policy) ప్రకటించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. కాలుష్య కారక థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ(Green energy) ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రం కూడా ఆ దిశలో అడుగులు వేస్తోందని చెప్పారు. రాష్ట్రం 11,399 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పత్తితో దేశంలో ముందంజలో ఉండగా, 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచడమే పాలసీ లక్ష్యమన్నారు. శుక్రవారం హెచ్ఐసీసీలో పారిశ్రామిక, వ్యాపార, ఇతర రంగాల భాగస్వాములతో నిర్వహించిన సదస్సులో భట్టి మాట్లాడారు. అనంతరం వివరాలను వెల్లడించారు. భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ ‘సాంకేతిక, ఫార్మా, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల అభివృద్ధికి రాష్ట్రం కేంద్రంగా ఆవిర్భవించింది. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు అధిక విద్యుత్ డిమాండ్(Electricity Demand) కు దోహదపడతాయి. 2024–25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడగా, 2029–30 నాటికి 24,215 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా’అని భట్టి చెప్పారు. భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ‘పునరుత్పాదక విద్యుత్ రంగం(electricity sector) లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం 7,889 మెగావాట్ల సౌర విద్యుత్, 2,518 మెగావాట్ల జల విద్యుత్, 771 మెగావాట్ల డి్రస్టిబ్యూటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ, 128 మెగావాట్ల పవన విద్యుత్ సహా 221 మెగావాట్ల ఇతర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. పాలసీలో భాగంగా సౌర విద్యుత్తో పాటు ఫ్లోటింగ్ సోలార్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులు తీసుకొస్తాం. ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తాం..’అని భట్టి తెలిపారు.రాష్ట్రంలో ఈ ఏడాది కూడా విద్యుత్ చార్జీల(electricity charge) ను పెంచబోమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ, కె.వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఇందనంగా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నామని భట్టి చెప్పారు. ఆ్రస్టేలియా– ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఐఐటీలో రెండురోజుల వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పరిశోధన, సంబంధిత సైన్స్ ఆధారిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వైఎస్సార్ నాయకత్వంలోనే హైదరాబాద్ ఐఐటీకి పునాదులు పడ్డాయని, ఐఐటీలు దేశ నిర్మాణానికి వేదికలని చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణిలో పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టుపై హైదరాబాద్ ఐఐటీ ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. సింగరేణి డైరెక్టర్ బలరామ్ నాయక్, ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి ఎంఓయూపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఆ్రస్టేలియా కాన్సులేట్ జనరల్ (బెంగళూరు) హిల్లరీ మెక్గేచి, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీ దినేష్ మహోర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ హైడ్రోజన్.. గేమ్ చేంజర్!
హైడ్రోజన్ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ చేంజర్గా అభివరి్ణస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్, థెర్మాక్స్ వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ దన్ను... గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్ను అవాడా గ్రూప్ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్ ఉత్పత్తికి తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్ వినీత్ మిట్టల్ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్ లెరి్నంగ్ను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. కంపెనీ ఒడిశాలోని గోపాల్పూర్లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్స్పన్ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్ హైడ్రోజన్ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్తో పాటు బ్యాటరీల్లో స్టోర్ చేసిన విద్యుత్ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్ తయారీ, విక్రయం, సరీ్వస్ కోసం థర్మాక్స్ బ్రిటన్కు చెందిన సెరెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్ ఎల్రక్టాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్ భండారీ వెల్లడించారు.అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలుదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్) నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 10 బిలియన్ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్ హైడ్రోజన్ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. గ్రే హైడ్రోజన్: హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్ మీథేన్ రిఫారి్మంగ్ (ఎస్ఎంఆర్) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అదానీపై లంచం ఆరోపణల్లేవు!
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, కంపెనీ బోర్డు సీనియర్ డైరెక్టర్ వినీత్జైన్పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. ‘‘న్యూయార్క్ కోర్టులో గత వారం అమెరికా న్యాయ శాఖ (యూఎస్ డీఓజే) దాఖలు చేసిన అభియోగ పత్రంలో, యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ (ఎఫ్సీపీఏ/అవినీతి నిరోధక) చట్టం నిబంధనలను ఉల్లంఘించే కుట్రకు పాల్పడినట్టు వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ లేదా వినీత్జైన్పై అభియోగాలు మోపలేదు’’అని స్టాక్ ఎక్సే్ఛంజ్లకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం కింద మోసం, కుట్ర, ఉద్దేశపూర్వక కుట్ర ఆరోపణలే మోపినట్టు తెలిపింది. ఈ అభియోగాలకు చట్టం పరిధిలో శిక్షలు లంచం కంటే చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీల చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చట్ట ఉల్లంఘన దిశగా అదానీ గ్రీన్ ఎనర్జీకి సాయం అందించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరో సివిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు ఏజీఈఎల్ వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం 1933, సెక్యూరిటీస్ చట్టం 1934లోని పలు సెక్షన్లను వీరు ఉల్లంఘించారని.. ఏజీఈఎల్ సైతం ఇవే చట్ట ఉల్లంఘనలకు పాల్పడేందుకు సాయం లేదా ప్రోత్సాహం అందించినట్టు సివిల్ కేసులో అభియోగాలు మోపినట్టు వెల్లడించింది. ఏజీఈఎల్ సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను దక్కించుకునేందుకు వీలుగా భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారంటూ అదానీ తదితరులపై కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని, ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ఇప్పటికే వివరణ ఇచ్చింది.అదరగొట్టిన అదానీ షేర్లు...అమెరికా లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడంతో అదానీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అదానీ టోటల్ గ్యాస్ 20%, అదానీ పవర్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10% లాభపడ్డాయి. ఈ షేర్లన్నీ ఇంట్రాడేలో అప్పర్సర్క్యూట్ తాకాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 12%, ఎన్డీటీవీ 9%, అదానీ విల్మార్ 8%, అదానీ పోర్ట్స్ 6%, సంఘీ ఇండస్ట్రీస్ 5%, అంబుజా సిమెంట్స్ 4.50%, ఏసీసీ 4% పెరిగాయి. పదకొండు కంపెనీల షేర్లూ రాణించడంతో ఒక్కరోజులో అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.24 లక్షల కోట్లు పెరిగింది. -
గ్రీన్ ఎనర్జీ లక్ష్యం 50,500 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని మరో దశాబ్ద కాలంలో 50,500 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రాష్ట్రం 10,095 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగి ఉండగా, 2034–35 నాటికి మరో 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు, జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈమేరకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. లీజుకు చౌకగా సర్కారీ స్థలాలు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్కు అనుసంధానం చేసి వాటితో వచ్చే విద్యుత్ను కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇవ్వనున్నారు. సర్కారు స్థలాలను నామమాత్రపు అద్దెతో ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. బిడ్డింగ్ విజేతలకు మార్కెట్ రేటులో 10శాతం లీజు రేటుతో భూములను కేటాయించనుంది. టీజీ–ఐపాస్ ద్వారా డెవలపర్లకు అన్ని అనుమతులు సత్వరంగా జారీ కానున్నాయి. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సొంత అవసరాలకూ సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వీలుంటుంది. జలాశయాలపై ఫ్లోటింగ్ ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ప్రభుత్వం ప్రోత్సహించనుంది. జలాశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ విధానంలో కేటాయించనుంది. ఇందుకుగాను నీటిపారుదల శాఖకు డిస్కంలు విద్యుత్లో వాటా/ నామమాత్రపు అద్దెను చెల్లిస్తాయి. = రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజులు సౌరవిద్యుదుత్పత్తికి అనుకూలత ఉంటుంది. దేశంలో బలంగా గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ 5500 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. = రాష్ట్రంలోని సబ్స్టేషన్ల వారీగా సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు ఎక్కడ అవకాశం ఉందో వెల్లడిస్తూ డిస్కంలు ప్రకటన జారీచేయనున్నాయి. ఆ మేరకు సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. ప్రోత్సాహకాలివీ.. –పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. భూవినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు. –డిస్కంలకు విద్యుత్ విక్రయించే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నారు. –సూపరై్వజింగ్ చార్జీల మినహాయింపు. –ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే యంత్రాలు, పరికరాలకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. –భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. మెగావాట్ ప్రాజెక్టుకు 4 ఎకరాల వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. – ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్ల స్థాపనను ప్రోత్సహించనున్నారు. –పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను నామమాత్రపు లీజు ధరతో 45 ఏళ్ల కాలానికి ప్రభుత్వం కేటాయించనుంది. -
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్లో భారీ ఆర్డర్
దేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ ఇందులో భాగంగా ఎలక్ట్రోలైజర్ల కోసం కోసం జాన్ కాకెరిల్ హైడ్రోజన్ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత భారీ ఎలక్ట్రోలైజర్ ఆర్డర్.1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్లతో ఉత్పత్తి చేసే తొలి మిలియన్-టన్నుల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్లాంట్లో ఏర్పాటు చేస్తున్న దీని కోసం ఏఎం గ్రీన్ గత ఆగస్ట్లో తుది పెట్టుబడి నిర్ణయాన్ని (FID) సాధించింది. ఈ ప్లాంట్ 2026 ద్వితీయార్థంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. రెండు దశల్లో సరఫరా అయ్యే 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్లతో గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసి గ్రీన్ అమ్మోనియాగా మారుస్తారు.ఒప్పందంలో భాగంగా జాన్ కాకెరిల్ హైడ్రోజన్ సంస్థ మొదటి దశలో 640 మెగా వాట్ల సామర్థ్యం గల అధునాతన ఒత్తిడితో కూడిన ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్లను సరఫరా చేస్తుంది. అలాగే ఇరు సంస్థలు కాకినాడలో దేశపు అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని (ఏటా 2 గిగావాట్ల ఉత్పత్తి) అభివృద్ధి చేయనున్నాయి. తద్వారా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యానికి దోహదపడనున్నాయి. ఈ ప్లాంట్ రెండో దశలొ 640మెగా వాట్ల ఎలక్ట్రోలైజర్లను ఏఎం గ్రీన్ కాకినాడ ప్రాజెక్టుకు సరఫరా చేస్తుంది. ఏఎం గ్రీన్ గురించి.. హైదరాబాద్కు చెందిన గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఏఎం గ్రీన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ఇంధన మార్పిడి పరిష్కారాలను అందించే దేశంలోని ప్రముఖ సంస్థలలో ఒకటి. ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో సరికొత్త సాంకేతికతలు, మార్గాలను అన్వేషించడంలో కృషి చేస్తోంది. -
2030 నాటికి రూ.32 లక్షల కోట్లు అవసరం
భారత్ తన లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో దాదాపు రూ.32 లక్షల కోట్లు అవసరమవుతాయని ఐఆర్ఈడీఏ ఛైర్మన్ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. 23వ ఇండియా పవర్ ఫోరమ్ 2024లో పాల్గొని ఆయన మాట్లాడారు. రుణదాతలు కస్టమర్ల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సకాలంలో ఆర్థిక అవసరాలు తీర్చేలా ప్రణాళికలు ఉండాలని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పునరుత్పాదక ఇంధన రంగంలో ఎలాంటి హానికర ఉద్గారాలు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం 2030 నాటికి ఈ రంగంలో సుమారు రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది. ఇందుకోసం రుణదాతలు కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టాలి. భవిష్యత్తులో దేశీయ విద్యుత్ అవసరాలు తీర్చే ఈ రంగంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరాలంటే ఈ విభాగం కీలకంగా మారనుంది. ఈ రంగంలో మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, ఆఫ్షోర్ విండ్(సముద్ర అలల సాయంతో విద్యుత్ ఉత్పత్తి), ఇ-మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక సాంకేతికతలకు రానున్న రోజుల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం -
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యా న్ని నిర్దేశించుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు తెలంగా ణలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్ల డించారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడారు. భట్టికి రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధి కారులు తకహసి, అండో, కాత్సునో, తనాక తకా షీ తదితరులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఎంతో ఉందని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విడిగా కానీ ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యానికి భట్టి విక్రమార్క పిలుపుని చ్చారు. భారతదేశంలో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాలు వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రోహ్మ్ సంస్థ తెలిపింది. సాయంత్రం క్విటో నగరానికి సమీపంలో ఉన్న పానసోనిక్ కంపెనీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రికి ఆ కంపెనీ ప్రెసిడెంట్ నబి నకానీషి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి వివరించారు. తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని భారతదేశంలోనూ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తెలంగాణలో పానసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని, ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు. భట్టికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు క్విటో నగరానికి సమీపంలో ఉన్న టోజీ బౌద్ధ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులు గురువారం ఉదయం సందర్శించారు. వారికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ పర్యటనలో భట్టితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
భారత్..డేటా సంపన్న దేశం: అంబానీ
మలిదశ వృద్ధి ప్రయాణానికి రిలయన్స్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. 2016లో జియో 4జీ టెలికం సేవలను ప్రారంభించడం ద్వారా భారత్ను డేటా పరంగా సంపన్న దేశంగా మార్చినట్టు కంపెనీ వార్షిక నివేదికలో అంబానీ పేర్కొన్నారు. జియో ద్వారా దాదాపు దేశంలోని ప్రతి ఇంటికీ అధిక వేగంతో కూడిన 4జీ డేటాను అందుబాటు ధరలకు అందిస్తున్నట్టు చెప్పారు.ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అంతర్జాతీయ అనిశ్చితులున్నా ప్రపంచంలో భారత్ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. వేగంగా వృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగ అవసరాలను తీర్చే స్థాయిలో రిలయన్స్ రిటైల్ ఉంది. 100 బిలియన్ డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) విలువ కలిగిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో బడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నార’ని చెప్పారు.ఇదీ చదవండి: ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్ అంబానీ!గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‘2035 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదలే(నెట్ జీరో) లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు వీలుగా జామ్నగర్లో దీరూభాయి అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల తయారీకి సంబంధించి రిలయన్స్ సమగ్ర కేంద్రంగా ఉంటుంది. వయకామ్ 18, స్టార్ ఇండియా వ్యాపారాల విలీనంతో జాయింట్ వెంచర్ టెలివిజన్, డిజిటల్ స్ట్రీమింగ్లో అగ్రగామిగా అవతరిస్తున్నాం’ అని ముఖేశ్ అన్నారు. -
అదానీ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: హరిత ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే కీలక భాగాల తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై, ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై వచ్చే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేయనుంది. సోలార్ పార్కులను నిరి్మంచడం నుంచి హరిత హైడ్రోజన్, పవన విద్యుత్ టర్బైన్లు మొదలైన వాటికోసం ఎలక్ట్రోలైజర్లను తయారు చేయడం వరకు భారీ ప్లాంట్లను గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాలు తెలిపారు. ఇంధన పరివర్తన, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో లక్షల కోట్ల (ట్రిలియన్ల) డాలర్లకు వ్యాపార అవకాశా లు ఉన్నాయని, ఇవి భారత్ రూపురేఖలను దేశీయంగానూ, అంతర్జాతీయంగాను మార్చేయగలవన్నారు. అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన మార్కెట్ 2023లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా ఇది 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని, అటుపైన 2050 వరకు ప్రతి పదేళ్లకు రెట్టింపు కానుందని అదానీ చెప్పారు. భారత్ నిర్దేశించుకున్నట్లుగా 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలు సాధించాలంటే ఏటా 150 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు అవసరమన్నారు. -
ఏపీ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు అంతర్జాతీయ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఉన్న ఏఎం గ్రీన్ (గతంలో గ్రీన్కో జీరోసీ) సంస్థకు చెందిన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. యూరప్కు చెందిన పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహక సంస్థ సర్టిఫ్హై నుంచి ప్రీ-సర్టిఫికేషన్ పొందింది.పునరుత్పాదక ఇంధనాల కోసం కఠినమైన యూరోపియన్ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫ్హై ఈయూ పునరుత్పాదక ఇంధనాలు నాన్-బయోలాజికల్ ఆరిజిన్ (ఆర్ఎఫ్ఎన్బీఓ) ప్రీ-సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ ప్రాజెక్టుగా ఏఎం గ్రీన్ నిలిచింది. ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైంది.కార్బన్ రహిత ఇంధన వనరులను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేయడానికి ఏఎం గ్రీన్ నిబద్ధతను ప్రీ-సర్టిఫికేషన్ నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగాలను డీకార్బోనేట్ చేయడానికి కీలకమైన ఈ దశలో రవాణా, పరిశ్రమలో సుస్థిరత కోసం ఈయూ నియంత్రణ ప్రమాణాలను చేరుకోవడానికి కంపెనీ సంసిద్ధతను ఈ ప్రీ-సర్టిఫికేషన్ ధ్రువీకరిస్తుంది. లాభదాయకమైన ఈయూ ఆర్ఎఫ్ఎన్బీఓ మార్కెట్ను సమర్థవంతంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.సర్టిఫ్హై ప్రీ-సర్టిఫికేషన్ ప్రాముఖ్యతను ఏఎం గ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి నొక్కి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఏఎం గ్రీన్ పాత్రను పునరుద్ఘాటించారు. 2030 నాటికి కాకినాడలో ఏడాదికి 10 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.మహేష్ కొల్లి, ఏఎం గ్రీన్ అధ్యక్షుడు -
మరింత చేరువగా గ్రీన్ ఎనర్జీ
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఈఆర్సీ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు, విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, చార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను ఏపీఈఆర్సీ ‘నియంత్రణ’ పేరుతో రూపొందించింది. గతేడాది డ్రాఫ్ట్ రూపంలో తీసుకువచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న ఏపీఈఆర్సీ... వీటికి ఆమోదం తెలిపింది. దేశంలో 2070కి కర్భన ఉద్గారాలను నెట్జీరో స్థాయికి తీసుకురావాలని, ఇందుకోసం 2030కి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పాలన్న కేంద్రం లక్ష్యానికి కూడా ఈ నిబంధనలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ పేర్కొంది. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ను ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లు, డిస్కంలకు ఈ ‘నియంత్రణ’ వర్తిస్తుంది.ఇవీ నిబంధనలు... » గ్రీన్ ఎనర్జీ నూతన నిబంధనల ప్రకారం ఓపెన్ యాక్సెస్ను పొందడానికి దివాలా తీసిన, డిస్కంలకు రెండు నెలలు కంటే ఎక్కువకాలం బకాయిలు ఉన్న, అనధికారికంగా విద్యుత్ వినియోగం, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్లో ఉన్న సంస్థలకు అర్హత లేదు. » అర్హులైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ను మంజూరు చేయడానికి (ఏపీఎస్ఎల్డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. » దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం ఏపీ ట్రాన్స్కో నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్కు అన్ని దరఖాస్తులు నేరుగా రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి.» సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్కు సంబంధించిన మొత్తం çసమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలు(జనరేటర్ల)కు కనెక్టివిటీ మంజూరు చేస్తారు.» ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, ఉత్తత్పి సంస్థలు, ఒప్పందాలు, ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్ను పొందడం కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాల్లో పేర్కొన్న విధంగానే చార్జీలు వర్తిస్తాయి.» గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్ చార్జీలు, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్చార్జీలు, స్టాండ్బై చార్జీలు, బ్యాంకింగ్, రియాక్టివ్ ఎనర్జీ చార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు.» 2032 డిసెంబర్ లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్ట్ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్చార్జ్ వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యస్థ కాలవ్యవధిలో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ.లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. బ్యాంకింగ్ నెలవారీ బిల్లింగ్ సైకిల్ ఆధారంగా ఉండాలి. -
ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో సన్నాహాలు
ముంబై: పీఎస్యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల ఎంపికను చేపట్టినట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా పునరుత్పాదక రంగ కంపెనీ రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తద్వారా 2022లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ తదుపరి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరతీయనుంది. నిధులను సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తదితర భవిష్యత్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలకు పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఐపీవో కోసం ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ను షార్ట్లిస్ట్ చేసింది. -
పునరుత్పాదక విద్యుత్లో అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు
న్యూఢిల్లీ: దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా తమ సంస్థ నిలి్చందని అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) తెలిపింది. గుజరాత్లోని ఖావ్డా సోలార్ పార్క్లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు ద్వారా దీన్ని సాధించినట్లు సంస్థ వివరించింది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్ఫోలియోలో 7,393 మెగావాట్ల సౌర విద్యుత్, 1,401 మెగావాట్ల పవన విద్యుత్, 2,140 మెగావాట్ల విండ్–సోలార్ హైబ్రిడ్ ప్లాంట్లు (మొత్తం 10,934 మెగావాట్ల ) ఉన్నాయి. 2030 నాటికల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది. -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణహిత ఇంధనం (గ్రీన్ ఎనర్జీ) ఉత్పత్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తుండటంతో దిగ్గజ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా రిలయన్స్ గ్రూప్ సుమారు రూ.1,920 కోట్ల పెట్టుబడితో 15 చోట్ల కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి దశలో 8 యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ వ్యర్థాలు.. వరిగడ్డి, వేరుశెనగ పొట్టు, జొన్న కంకులు, ఖాళీ కొబ్బరి బొండాలు, చెరకు పిప్పి, మునిసిపాలిటీల నుంచి రోజూ వచ్చే వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తారు. ఈ 15 యూనిట్ల ద్వారా పూర్తిగా పర్యావరణహితమైన గ్యాస్ను ఉత్పత్తి చేయడమే కాకుండా సేంద్రియ ఎరువులను కూడా తయారుచేయొచ్చు. ఇప్పటివరకు ఈ వ్యర్థాలను తరలించే అవకాశం లేకపోవడంతో రైతులు పొలాల్లోనే వాటిని తగులబెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం వెలువడుతోంది.. నేలసారం కూడా తగ్గిపోతోంది. ఇప్పుడు ఇలా కాకుండా నేరుగా రైతుల నుంచే రిలయన్స్ ఈ వ్యర్థాలను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ప్రతి యూనిట్కు కనీసం ఐదు కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వ్యర్థాల కొనుగోలు చేయడం ద్వారా కనీసం 70 వేల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా. ప్రతి రైతుకు అదనంగా రూ.6,250 చొప్పున ఏటా రైతులకు రూ.45 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించనుంది. అంతేకాకుండా ఈ సీబీజీ యూనిట్లకు అనుబంధంగా మరో రూ.1,000 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని రిలయన్స్ అధికారులు వెల్లడించారు. తగ్గనున్న కర్బన ఉద్గారాలు, దిగుమతులు.. దేశవ్యాప్తంగా రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న 100 సీబీజీ యూనిట్లకు ఏటా 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు అవసరమవుతాయని అంచనా. తద్వారా 2.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. ఈ యూనిట్ల ద్వారా సీబీజీనే కాకుండా 2.5 మిలియన్ టన్నుల సేంద్రియ ఎరువులు కూడా ఉత్పత్తవుతాయి. అంతేకాకుండా ఏటా ఏడు మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతులు తగ్గడం ద్వారా విదేశీమారక నిల్వలు పెరగనున్నాయి. వాటికి ప్రత్యామ్నాయంగా సీబీజీ.. రానున్న కాలంలో ఎల్ఎన్జీ (లిక్విడ్ నేచురల్ గ్యాస్), సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)లకు ప్రత్యామ్నాయంగా సీబీజీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్, అదానీ వంటి సంస్థలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. రిలయన్స్ అనుబంధ కంపెనీ.. రిలయన్స్ బయోఎనర్జీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 100 సీబీజీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ 100 యూనిట్లలో 15 యూనిట్లు ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు కానున్నాయి. సుమారు రూ.130 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో యూనిట్ ఉంటుంది. తొలి దశలో భాగంగా కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద 2, విజయవాడ పరిటాల వద్ద, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒకటి చొప్పున ఏర్పాటు చేయనుంది. తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభమైన ఈ 8 యూనిట్లు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. రెండో దశలో మరో ఏడు యూనిట్లను 2026 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం ఈ 15 యూనిట్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో యూనిట్ ద్వారా ఏటా 7,000 టన్నుల సీబీజీ, 34,300 టన్నుల సేంద్రియ ఎరువులు ఉత్పత్తి కానున్నాయి. -
పెట్టుబడులకు 'ఎనర్జీ'
సీఎంతో సీఐఐ ప్రతినిధులు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ అధ్యక్షుడు శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన పలు పరిశ్రమల సీఈవోలు బుధవారం దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబులతో భేటీ అయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధి కోసం తీసుకునే అన్నిరకాల నిర్ణయాలకు సీఐఐ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) 54వ వార్షిక సదస్సులో భాగంగా.. రెండో రోజు బుధవారం పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం.. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించి, ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. మొత్తంగా రూ.37,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరినట్టు, కీలక ప్రకటనలు వెలువడినట్టు తెలిపింది. సీఎంవో తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్–డిఫెన్స్ విభాగం సీఈఓ ఆశిశ్ రాజ్వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. గ్రీన్ ఎనర్జీ.. స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్.. అదానీ గ్రూప్తో ఒప్పందాల్లో భాగంగా రూ.5వేల కోట్ల పెట్టుబడితో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు గ్రీన్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. అనుబంధ సంస్థ అదానీ కొనెక్స్ మరో రూ.5వేల కోట్లతో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ క్యాంపస్ను చందన్పల్లిలో ఏర్పాటు చేస్తుంది. ఇక అంబుజా సిమెంట్స్ సంస్థ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యమున్న సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ను రూ.1,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాల ఏర్పాటుకు రూ.1,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతలో నైపుణ్యాలు (స్కిల్స్) పెంపొందించేందుకు త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రేవంత్తో భేటీ సందర్భంగా అదానీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ► తెలంగాణలో రూ.9వేల కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ ‘జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ’ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ‘జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ’తో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 1,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్తో సీఎం రేవంత్ చర్చించారు. ► రాష్ట్రంలో రూ.8వేల కోట్ల పెట్టుబడితో 12.5 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్ ఫర్ అవర్) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధన, అభివృద్ధి కేంద్రంతోపాటు, గిగాస్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం ఏర్పాటవుతుంది. ప్రాజెక్ట్ మొదటి దశలో 6వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొదటి దశలో 2.5 గిగావాట్ల సామర్థ్యముండే సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి.. రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. ► డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్ తెలంగాణలో రూ.5,200 కోట్లతో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీలతో సీఎం రేవంత్ భేటీలో రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. హైదరాబాద్లో 10 మెగావాట్ల నెట్వర్కింగ్–హెవీ డేటా సెంటర్లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా రూ.4,000 కోట్లకుపైగా పెట్టుబడులతో భవిష్యత్తులో గ్రీన్ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. ► రాష్ట్రంలో ఆయిల్పామ్ మిషన్లో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఖమ్మంలో దేశంలోనే మొట్టమొదటి ఆయిల్పామ్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త సీడ్ గార్డెన్ ద్వారా ఏటా 70లక్షల మొక్కలను సరఫరా చేయడం ద్వారా పది లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును చేపట్టవచ్చని పేర్కొంది. దీంతోపాటు రూ.వెయ్యి కోట్లతో కెమికల్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తామని గోద్రెజ్ సంస్థ ప్రకటించింది. నైపుణ్య శిక్షణ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, పాడి పరిశ్రమ విస్తరణ వంటి అంశాలపైనా గోద్రెజ్ సీఎండీ నాదిర్ గోద్రెజ్తో సీఎం చర్చించారు. ► రాష్ట్రంలోని మల్లాపూర్లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ఆరాజెన్ లైఫ్ సైన్సెస్’ సంస్థ రూ.2వేల కోట్ల పెట్టుబడులు, 1,500 మందికి కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యకలాపాలను విస్తరించనుంది. సీఎం రేవంత్తో ఆరాజెన్ సీఈఓ మణి కంటిపూడి భేటీ సందర్భంగా దీనిపై ఒప్పందం కుదిరింది. ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్గా మారనుందని ఆ సంస్థ పేర్కొంది. ► దావోస్ రెండోరోజు పర్యటనలో భాగంగా రేవంత్ బుధవారం హెయిన్కెన్ ఇంటర్నేషనల్ సీఈఓ డాల్ఫ్ వాన్డెన్ బ్రింక్, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషబ్ ప్రేమ్జీ తదితరులతోనూ భేటీ అయ్యారు. వరంగల్లో ఐటీ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి రిషబ్ ప్రేమ్జీతో చర్చించారు. ఈ భేటీల్లో ఐటీ–పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ ఎనర్జీపై అదానీ దృష్టి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పర్యావరణహిత(గ్రీన్) ఇంధనం(ఎనర్జీ)కి మరింత ప్రాధాన్యత ఇస్తోంది. 2030కల్లా 45 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా అదానీ కుటుంబం రూ. 9,350 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధపడుతోంది. గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఈఎల్) ప్రమోటర్ కుటుంబీకులతోపాటు ఆర్డౌర్ ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ లిమిటెడ్, అదానీ ప్రాపర్టిస్ ప్రయివేట్ లిమిటెడ్కు మొత్తం 6.31 కోట్ల వారంట్లను జారీ చేయనుంది. ఒక్కో వారంట్ను రూ. 1,480.75 ధరలో కేటాయించేందుకు కంపెనీ బోర్డు తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనున్నట్లు అదానీ గ్రీన్ పేర్కొంది. తాజా పెట్టుబడుల కారణంగా కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 3.83 శాతం వాటా లభించనుంది. వచ్చే ఏడాది 1.2 బిలియన్ డాలర్ల విలువైన బాండ్ల గడువు తీరనుంది. ఇప్పటికే వీటి చెల్లింపులు లేదా రీఫైనాన్సింగ్కు కంపెనీ ప్రణాళికలు వేసింది. 19.8 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకి అదానీ గ్రీన్ ఇప్పటికే ఒప్పందాన్ని పీపీఏ కుదుర్చుకుంది. ప్రమోటర్ పెట్టుబడుల వార్తలతో అదానీ గ్రీన్ షేరు బీఎస్ఈలో 4.3 శాతం ఎగసి రూ. 1,600 వద్ద ముగిసింది. -
నాలుగు సంస్థల ఏర్పాటులో అదానీ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా నాలుగు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ టూ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ త్రీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ వీటిలో ఉన్నాయి. పవన, సౌర, ఇతరత్రా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం తదితర లావాదేవీల కోసం ఈ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. -
జపాన్ సంస్థలతో సెంబ్కార్ప్ జట్టు
న్యూఢిల్లీ: హరిత విద్యుత్ శక్తి విభాగంలో స్థానం పటిష్టం చేసుకునే దిశగా సింగపూర్కి చెందిన సెంబ్కార్ప్ ఇండస్ట్రీస్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారత్లో హరిత అమ్మోనియాను ఉత్పత్తి చేసేందుకు జపాన్కు చెందిన రెండు సంస్థలతో చేతులు కలిపింది. దీనికి సంబంధించి సోజిజ్ కార్ప్, క్యుషు ఎలక్ట్రిక్ పవర్తో తమ అనుబంధ సంస్థ సెంబ్కార్ప్ గ్రీన్ హైడ్రోజన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ ఒప్పందం ప్రకారం జపాన్కు ఎగుమతి చేసే లక్ష్యంతో భారత్లో హరిత అమోనియాను ఉత్పత్తి చేసే అవకాశాలను పరిసీలించనున్నట్లు సెంబ్కార్ప్ వివరించింది. 2030 నాటికి జపాన్ 3 మిలియన్ టన్నుల అమోనియాను దిగుమతి చేసుకోనుంది. సోజిజ్ సంస్థ ఎనర్జీ ట్రేడింగ్, పెట్టుబడుల వ్యాపార దిగ్గజం కాగా క్యుషు ఎలక్ట్రిక్ ప్రధానంగా జపాన్లోని క్యుషు ప్రాంతానికి విద్యుత్ అందిస్తోంది. -
‘హరిత ఇంధనం’లో ఏపీ బెస్ట్
సాక్షి, అమరావతి: భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరుల్ని సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుల్ని స్థాపించేలా పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020ని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగున్నరేళ్లలో పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్థాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 8,998.323 మెగావాట్లకు చేరినట్టు న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీ ఏపీ) తన అధికారిక వెబ్సైట్ ద్వారా తాజాగా వెల్లడించింది. పునరుత్పాదక విద్యుత్తో ఉపాధి ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్కు ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, 3 వేల మెగావాట్ల సోలార్, 550 మెగావాట్ల విండ్ పవర్ చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ను వచ్చే 30 ఏళ్లపాటు కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 8,025 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్కు సంబంధించి సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్కు సంబంధించి పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. వీటిద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరో 2 వేల మందికి ఎన్హెచ్పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి. భారీగా పెరిగిన సామర్థ్యం నెడ్క్యాప్ లెక్కల ప్రకారం.. 2019లో రెండు మెగావాట్లు, 2021లో 4.20 మెగావాట్ల చొప్పున కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పవన విద్యుత్ పెరిగింది. సౌర విద్యుత్ విషయానికి వస్తే.. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం పెరిగింది. చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు చొప్పున కొత్తగా వచ్చాయి. మునిసిపాలిటీల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులు 2021లో గుంటూరులో 15 మెగావాట్లు, 2022లో విశాఖలో 15 మెగావాట్లు సామర్థ్యంతో ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ చర్యల ద్వారా పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీ దూసుకుపోతోంది. -
అందరికీ అందుబాటులోకి స్వచ్ఛ ఇంధనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అందరికీ కాలుష్యం లేని స్వచ్ఛ ఇంధనం అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించి, వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, ఛార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ 2023 పేరుతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ను తయారు చేసింది. ఈ నెల 21 నుంచి నూతన మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తేవాలని, దాని కోసం 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022లో నిబంధనలు జారీ చేసింది. వాటిని అనుసరించి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, వినియోగదారులు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 181 (1) ప్రకారం నడుచుకోవడానికి రాష్ట్ర కమీషన్లు చట్ట ప్రకారం నిబంధనలను రూపొందించవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజా డ్రాఫ్డ్ను తీసుకువచ్చినట్లు ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ నియంత్రణ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తును ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లు (సరఫరా వ్యవస్థలు), విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వర్తిస్తుంది. కొత్త నిబంధనలివీ.. ♦ గ్రీన్ ఎనర్జీ నిబంధనల ప్రకారం.. దివాలా తీసిన సంస్థలు, డిస్కంలకు రెండు నెలల కంటే ఎక్కువ కాలం బకాయిలు ఉన్న సంస్థలు, అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న సంస్థలు, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్లో ఉన్న సంస్థలకు ఓపెన్ యాక్సెస్ను పొందడానికి అర్హత లేదు.అరు్హలైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ను మంజూరు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్ (ఏపీఎస్ఎల్డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ♦ దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ(ఏపీ ట్రాన్స్కో) నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులన్నీ నేరుగా సంబంధిత రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి. ♦ సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ♦ అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ జనరేటర్లకు కనెక్టివిటీ మంజూరు చేస్తారు ♦వినియోగదారులు, జనరేటర్ల మధ్య ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు యధావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్ను కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాలలో పేర్కొన్న విధంగానే ఛార్జీలు వర్తిస్తాయి. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు, స్టాండ్బై ఛార్జీలు, బ్యాంకింగ్ ఛార్జీలు, రియాక్టివ్ ఎనర్జీ ఛార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు. అయితే ఇవన్నీ అందరికీ వర్తించవు. ఉదాహరణకు 2032 డిసెంబర్లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్ట్ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్ఛార్జి వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ. 1 లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. ♦ రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ వినియోగదారులకు వార్షిక ప్రాతిపదికన గ్రీన్ సర్టిఫికేట్ అందించాలి. ఓపెన్ యాక్సెస్ అంటే.. విద్యుత్తు వినియోగదారులు ఎవరైనా వారికి నచ్చిన పునరుత్పాదక ఉత్పత్తి సంస్థ నుంచి నేరుగా కరెంటును పొందే వెసులుబాటు. ఇందుకు ఈ వినియోగదారులు నోడల్ ఏజెన్సీ అనుమతి పొంది తగిన చార్జీలు చెల్లించి ఈ విద్యుత్తును పొందవచ్చు. -
కొత్త దారి రైతుబిడ్డ
‘ఇక వ్యవసాయం చేయవద్దు అనుకుంటాను. కాని చేయక తప్పేది కాదు. దీనివల్ల తలపై అప్పులు తప్ప నాకు జరిగిన మేలు లేదు. అయినా సరే భూమి నాకు అమ్మతో సమానం’ అన్నాడు మహారాష్ట్రలోని ఒక రైతు. ‘లాభనష్టాల సంగతి పక్కన పెడితే, ఒక్కరోజు పొలం వైపు వెళ్లక పోయినా నాకు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది’ అంటాడు రాజస్థాన్లోని ఒక రైతు. మన దేశంలో రైతుకు, భూమికి మధ్య ఆత్మీయ బంధం ఉంది. ఆ బంధాన్ని బలోపేతం చేయడానికి కెనడా నుంచి వచ్చిన షర్మిల జైన్ తన లక్ష్యసాధనలో విజయం సాధించింది... రైతుల ఆత్మహత్యలతో వ్యవసాయరంగం కల్లోలంగా ఉన్న కాలం అది. ఆ సమయంలో షర్మిలజైన్ కెనడాలో నివాసం ఉంది. స్వదేశంలో రైతుల ఆత్మహత్యల గురించి చదివిన తరువాత ఆమె మనసు మనసులో లేదు. ఎన్నో ఆలోచనలు తనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా?’ అని ఆమె ఆలోచించింది. ఆ సమయానికి కదిలిపోయి మరోరోజుకు మామూలై పోయే వ్యక్తి కాదు షర్మిల. కనిపించే సమస్య వెనకాల కనిపించని సమస్యలను అధ్యయనం చేయడానికి రంగంలోకి దిగింది. అంతేకాదు, రైతుల కోసం కెనడాను వదిలి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ‘నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలుసా? భావోద్వేగాలపై తీసుకునే నిర్ణయాలు బెడిసికొడతాయి. తీరిగ్గా ఆలోచించు. వెళ్లడం సులభమేకాని ఇక్కడికి మళ్లీ రావడం అంత సులభమేమీ కాదు’ అన్నారు సన్నిహితులు.బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పింది షర్మిల. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన షర్మిలకు రైతుజీవితం కొత్తేమీ కాదు. వారికి సంబంధించి తాను చిన్నప్పుడు విన్న సమస్యలే ఇప్పుడు కూడా వినాల్సి వస్తుంది. మరాఠీ మీడియం స్కూల్లో చదువుకున్న షర్మిల స్నేహితులలో చాలామంది రైతు బిడ్డలే. ఆ కుటుంబాల ఆర్థి«క కష్టాలతోపాటు గృహహింసకు సంబంధించిన విషయాలను తరచుగా వినేది. ఆ సమయంలోనే లాయర్ కావాలని అనుకుంది. కెనడా నుంచి భారత్కు తిరిగి వచ్చిన షర్మిల క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలోని ఎన్నో పల్లెలు తిరిగింది. ఇంటింటికి వెళ్లి రైతులతో మాట్లాడింది. వారితోపాటు పొలానికి వెళ్లింది. ‘ఇలా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి రాసుకోవడం, తరువాత కనిపించకపోవడం మామూలే. అయితే షర్మిలజీ కళ్లలో నిజాయితీ కనిపించింది. ఆమె మా కోసం ఏదో చేయగలదు అనే ఆశ కలిగింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు చౌహాన్ అనే రైతు. వ్యవసాయ సంబంధిత అంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి... ఇంగ్లాండ్లో ఎన్విరాన్మెంటల్ లా, అగ్రికల్చరల్ లా లో మాస్టర్స్ చేసింది షర్మిల. రెండు సంవత్సరాల కాలంలో ఎంతోమంది రైతులతో, వ్యవసాయరంగ నిపుణులతో మాట్లాడిన తరువాత ‘గ్రీన్ ఎనర్జీ ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. చెరువులను పునరుద్ధరించడం, నవీన వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేయడం, చిరుధాన్యాలు పండించడంపై అవగాహన కలిగించడం... మొదలైనవి ఈ ఫౌండేషన్ లక్ష్యాలు. తొలిసారిగా మహారాష్ట్రలోని బుచ్కెవాడి గ్రామంలో నాబార్డ్ గ్రాంట్తో వాటర్ మేనేజ్మెంట్ ప్రోగాం చేపట్టారు. నిరంతరం నీటిఎద్దడితో సతమతం అవుతున్న ఆ గ్రామం వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా బాగు పడింది. వేసవి సమయంలోనూ నీటి కష్టాలు రాని పరిస్థితి వచ్చింది. రాజస్థాన్లోని దుంగర్పుర్ గ్రామంలోని రైతులకు నీటి అవసరం ఎక్కువగా లేని పంటల గురించి అవగాహన కలిగించారు. ‘గ్రీన్ ఎనర్జీ మా ఊరిలో అడుగు పెట్టకపోతే వ్యవసాయానికి శాశ్వతంగా దూరం అయ్యేవాళ్లం. గ్రీన్ఎనర్జీ కార్యక్రమాల ద్వారా అనేక రకాలుగా లబ్ధిపొందాం. ఇప్పుడు కూరగాయలు కూడా పండిస్తున్నాం. గతంలో పంటలు పండనప్పుడు నా భర్త కూలిపనుల కోసం పట్నం వెళ్లేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు’ అంటుంది దీప్తి అనే మహిళా రైతు. షర్మిల తన తండ్రి నుంచి రెండు విలువైన మాటలు విన్నది. ఒకటి... చిరుధాన్యాల ప్రాముఖ్యత. రెండు... కార్పోరేట్ కంపెనీల సామాజిక బాధ్యత. ఇప్పుడు బాగా వినిపిస్తున్న సీఎస్ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఆరోజుల్లోనే విన్నది షర్మిల. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల కోసం, చిరుధాన్యాలను పండించే రైతులకు సహాయపడడానికి ‘గుడ్ మామ్’ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టింది షర్మిల జైన్. ‘గుడ్ మామ్’ ద్వారా మిల్లెట్ నూడుల్స్ నుంచి హెర్బ్ స్టిక్స్ వరకు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాలపై ఆసక్తి వేలం వెర్రిగా మారకుండా, దాన్ని ఇతరులు సొమ్ము చేసుకోకుండా ఉండడానికి ‘గుడ్ మామ్’ ద్వారా ‘ఏది అబద్ధం?’ ‘ఏది నిజం’ అంటూ అవగాహన కలిగిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అయిదు రాష్ట్రాలలో వేలాదిమంది రైతులకు వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, కెపాసిటీ–బిల్డింగ్ ప్రోగామ్స్ ద్వారా సహాయపడుతున్నాం. చిరుధాన్యాలు, కూరగాయలు పండించడంపై అవగాహన కలిగిస్తున్నాం. చిరుధాన్యాలు అనే పేరు పెద్దగా వినిపించని కాలంలోనే వాటి ప్రాముఖ్యత గురించి ప్రచారం చేశాం. – షర్మిల జైన్ -
45 గిగావాట్లు లక్ష్యం! అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రణాళిక
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ పునరుత్పాదక ఇంధన సంస్థ 2030 నాటికి 45 గిగావాట్ల (జీడబ్ల్యూ)పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్గారాలను తగ్గించి, భారత్ తన కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతు సహాయ సహకారాలను అందించాలని సంస్థ భావిస్తున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వర్గాలు తెలిపాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 8,316 మెగావాట్ల (8.3 జీడబ్ల్యూ) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రస్తుతం కలిగి ఉంది. మరో 12,118 మెగావాట్ల సామర్థ్యం నిర్మాణ దశలో ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ప్రతి సంవత్సరం సౌర, పవన శక్తి నుంచి 3 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారయి. ఫ్రెంచ్ ఎనర్జీ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో 19.7 శాతం వాటాను కలిగి ఉంది. ఇటీవల యూఎస్ పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ కంపెనీలో 6.8 శాతం వాటాను, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మరో 2.8 శాతం వాటాను కొలుగోలు చేశాయి. -
అదానీ గ్రీన్ నిధుల సమీకరణకు సై
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. షేర్ల విక్రయం ద్వారా రూ. 12,300 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచి్చనట్లు గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్) మార్గంలో నిధులను సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. కంపెనీ విస్తరణ ప్రణాళికలకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇటీవల గ్రూప్లోని మరో రెండు కంపెనీలు సైతం నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. క్విప్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ. 8,500 కోట్లు చొప్పున సమకూర్చుకోనున్నట్లు ఇప్పటికే తెలియజేశాయి. ప్రధానంగా యూరప్, మధ్యప్రాచ్యం నుంచి ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నివేదిక వెలువడిన తదుపరి అదానీ గ్రూప్ కంపెనీలు పెట్టుబడుల సమీకరణ, కొత్త ప్రాజెక్టులతో విస్తరణకు తెరతీశాయి. హిండెన్బర్గ్ ఆరోపణలను తోసిపుచి్చన గ్రూప్ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మరింత పెంచేందుకు వీలుగా ముందస్తు రుణ చెల్లింపులకు ప్రాధాన్యమిస్తున్న విషయం విదితమే. -
100 కిలోవాట్ ఉంటే ‘ఓపెన్’ కరెంట్
సాక్షి, హైదరాబాద్: బహిరంగ విపణి (ఓపెన్ యాక్సెస్) నుంచి నేరుగా గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లకు ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఒకే విద్యుత్ సబ్ డివిజన్ (రెవెన్యూ డివిజన్తో సమానం) పరిధిలో ఒకటి/అంతకు మించిన సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు కలిగిన సాధారణ విద్యుత్ వినియోగదారులు ఎవరైనా ఇకపై ఓపెన్ యాక్సెస్ విధానంలో సౌర/పవన/పంప్డ్ స్టోరేజీ విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే సదరు వినియోగదారుకు విద్యుత్ కనెక్షన్ల కాంట్రాక్ట్ లోడ్/శాంక్షన్డ్ లోడ్ కలిపి కనీసం 100 కిలోవాట్లు, ఆపైన ఉండాలి. సొంత విద్యుత్ ప్లాంట్లు కలిగిన భారీ పరిశ్రమల వంటి కాప్టివ్ విద్యుత్ వినియోగదారులైతే.. ఓపెన్ యాక్సెస్లో ఎలాంటి పరిమితులు లేకుండా గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మేరకు ‘ది ఎలక్ట్రిసిటీ (ప్రమోటింగ్ గ్రీన్ ఎనర్జీ త్రూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్) రెండో సవరణ నిబంధనలు–2023’ను అమల్లోకి తెస్తూ కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఇప్పటివరకు 1000 కిలోవాట్స్ (ఒక మెగావాట్తో సమానం), ఆపై లోడ్ కలిగినవారు మాత్రమే ఓపెన్ యాక్సెస్లో విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. డిస్కంల టారిఫ్తో పోల్చితే ఓపెన్ యాక్సెస్లో తక్కువ ధరకు విద్యుత్ లభ్యత ఉన్నప్పుడు.. భారీ పరిశ్రమలు ఆ విద్యుత్ను కొంటూ బిల్లుల భారం తగ్గించుకుంటున్నాయి. ఇకపై ఈ అవకాశం 100 కిలోవాట్ల లోడ్ కలిగిన వినియోగదారులకు సైతం లభించనుంది. చిన్న పరిశ్రమలకు ప్రయోజనం! ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ రంగ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (ఎస్పీడీసీఎల్ / ఎన్పీడీసీఎల్) నుంచే చాలావరకు వినియోగదా రులకు విద్యుత్ సరఫరా అవుతోంది. హెచ్టీ విద్యుత్ కనెక్షన్లు కలిగిన భారీ పరిశ్రమలు మాత్రమే ఇప్పటివరకు ఓపెన్ యాక్సెస్లో బయటి నుంచి విద్యుత్ కొనుక్కుంటున్నాయి. ఇలా ఓపెన్ యాక్సెస్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలు ప్రతి యూనిట్పై 50 పైసల వరకు అదనపు సర్చార్జి వసూలు చేస్తున్నాయి. ఇకపై 100 కిలోవాట్లు, ఆపై లోడ్ కలిగిన వినియోగదారులు దేశంలో ఎక్కడి నుంచైనా గ్రీన్ ఎనర్జీని ఓపెన్ యాక్సెస్ విధానంలో కొనుగోలు చేసుకోవచ్చు. సాధారణ గృహ విద్యుత్ వినియోగదారుల శాంక్షన్డ్/కాంట్రాక్ట్ లోడ్ 10 కిలో వాట్ల లోపే ఉంటుంది. 100 కిలోవాట్ లోడ్ కలిగి ఉన్న భారీ నివాస భవనాలు, వాణిజ్య, పారిశ్రామి క వినియోగదారులకు కొత్త విధానంతో ప్రయోజ నం ఉండనుంది. ఇక 2032 డిసెంబర్ నాటికి నిర్మా ణం పూర్తి చేసుకోనున్న సముద్ర తీర పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనే వినియోగదారులపై అదనపు సర్చార్జి విధించవద్ద ని కేంద్రం తాజా నిబంధనల్లో స్పష్టం చేసింది. -
లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 4 రెట్లుపైగా ఎగసి రూ. 507 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 121 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు రెట్టింపై రూ. 2988 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,587 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 973 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 100 శాతం వృద్ధికాగా.. 2021–22లో రూ. 489 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు మొత్తం ఆదాయం రూ. 5,548 కోట్ల నుంచి రూ. 8,633 కోట్లకు జంప్ చేసింది. ఇంధన విక్రయాలు 58 శాతం పుంజుకుని 14,880 మిలియ న్ యూనిట్లకు చేరాయి. సామర్థ్య విస్తరణ ఇందుకు సహకరించింది. గతేడాది 2,676 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. వినీత్ ఎస్.జైన్ 2023 మే 11 నుంచి ఎండీగా కొనసాగనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకూ సీఈవో, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం బలపడి రూ. 977 వద్ద ముగిసింది. అదానీ గ్యాస్ లాభంలో వృద్ధి పట్టణాల్లో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ సేవలు అందించే అదానీ టోటల్ గ్యాస్, మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.98 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన రూ.81 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి చెందింది. విక్రయాల పరిమాణం 2 శాతం పెరిగి 193 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్లుగా ఉంది. కొత్తగా 126 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో మొత్తం సీఎన్జీ స్టేషన్ల సంఖ్య 460కు చేరుకుంది. పైపుల ద్వారా గ్యాస్ అందించే కనెక్షన్ల సంఖ్య 1.24 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు 7.04 లక్షలకు చేరాయి. పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లు 7,435కు పెరిగాయి. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.4,683 కోట్ల ఆదాయంపై రూ.546 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
అదానీ పవర్పై ఎక్స్ఛేంజీల కన్ను
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా అదానీ పవర్ కౌంటర్ను స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ చర్యల(ఏఎస్ఎం) మార్గదర్శకాలలోకి తీసుకువచ్చాయి. వెరసి ఈ నెల 23 నుంచి అదానీ పవర్ స్వల్పకాలిక ఏఎస్ఎం మార్గదర్శకాల తొలి దశ జాబితాలోకి చేరింది. ఈ అంశాన్ని రెండు ఎక్సే్ఛంజీలు విడిగా పేర్కొన్నాయి. సోమవారమే అదానీ గ్రూప్లోని అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీ స్టాక్స్ను ఎక్సే్ఛంజీలు దీర్ఘకాలిక ఏఎస్ఎం రెండో దశ నుంచి స్టేజ్–1కు బదిలీ చేశాయి. ఇక ఈ నెల 8న అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మర్లను స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 17 నుంచి వీటిని స్వల్పకాలిక ఏఎస్ఎం నుంచి తప్పించాయి. ఏఎస్ఎం పరిధిలోకి చేర్చేందుకు గరిష్ట, కనిష్ట వ్యత్యాసాలు, క్లయింట్ల దృష్టి, సర్క్యూట్ బ్రేకర్లను తాకడం, పీఈ నిష్పత్తి తదితర అంశాలను స్టాక్ ఎక్సే్ఛంజీలు పరిగణించే విషయం విదితమే. స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన స్టాక్లో ఓపెన్ పొజిషన్లకు 50 శాతం లేదా ప్రస్తుత మార్జిన్ ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. గరిష్టంగా 100 శాతం మార్జిన్ రేటు పరిమితి ఉంటుంది. -
వృద్ధి బాటలో బయోమాస్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశంలో బయోమాస్ మార్కెట్ రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధిని చూడనుంది. 2030–31 నాటికి ఈ మార్కెట్ రూ.32,000 కోట్లను చేరుకోనుందని 1లాటైస్ నివేదిక తెలియజేసింది. ప్రభుత్వ పథకాల మద్దతుకుతోడు, అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ కంపెనీల పెట్టుబడులు ఈ మార్కెట్ వృద్ధికి సాయపడతాయని తెలిపింది. బయోమాస్ కోజనరేషన్ ప్రాజెక్టుకు మద్దతుగా కొత్త పథకాల ఆవిష్కరణతో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పాటి బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వీలు కలుగుతుందని అంచనా వేసింది. ‘‘భారత్లో వ్యాపార సంస్థలకు శుద్ధ, నమ్మకమైన విద్యుత్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో బయోమాస్ కీలక వనరుగా విద్యుత్ డిమాండ్ను అందుకోవడంలో ముఖ్య పాత్ర పోషించనుంది. భారత్లో ప్రస్తుతం బయోమాస్ ఉత్పత్తి సామర్థ్యం 10.2 గిగావాట్లుగా ఉంది. ఇది 2031 మార్చి నాటికి రూ.32,000 కోట్లకు విస్తరిస్తుంది’’అని 1లాటైస్ డైరెక్టర్ అభిషేక్ మైటి పేర్కొన్నారు. బయోమాస్ ఎనర్జీ విభాగంలో పెట్టుబడులు, సహకారం రూపంలో సంస్థలకు అవకాశాలు ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ పెట్టుబడుల రాకతో పర్యావరణ అనుకూల విద్యుత్ను సంస్థలు ఆఫర్ చేయగలవని, నెట్ జీరో లక్ష్యాల సాధనకు ఉపయోగకరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. బయోమాస్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 4 శాతం చొప్పున పెరుగుతూ 2021–22 నాటికి 10 గిగావాట్లకు చేరుకున్నట్టు తెలిపింది. -
ఎస్బీఐకి అదానీ అదనపు షేర్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వద్ద అదానీ గ్రూప్ తాజాగా అదనపు షేర్లను తనఖాలో ఉంచింది. జాబితాలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ చేరాయి. బ్యాంకుకు చెందిన ఎస్బీఐ క్యాప్ ట్రస్టీవద్ద దాదాపు 75 లక్షల షేర్లను అదానీ పోర్ట్స్, 60 లక్షల షేర్లను అదానీ గ్రీన్, 13 లక్షల షేర్లను అదానీ ట్రాన్స్మిషన్ ప్లెడ్జ్ చేశాయి. దీంతో ఎస్బీఐ క్యాప్ ట్రస్టీవద్ద అదానీ పోర్ట్స్ ఈక్విటీలో మొత్తం 1 శాతం, అదానీ గ్రీన్ నుంచి 1.06 శాతం, అదానీ ట్రాన్స్మిషన్కు చెందిన 0.55 శాతం వాటాను తనఖాలో ఉంచినట్లు తెలుస్తోంది. 30 కోట్ల డాలర్ల లెటర్ ఆఫ్ క్రెడిట్లో భాగంగా అదనపు షేర్లను అదానీ గ్రూప్ ఎస్బీఐ క్యాప్వద్ద ఉంచినట్లు ఎక్సే్ఛంజీల ఫైలింగ్ వెల్లడించింది. తద్వారా ఆస్ట్రేలియాలోని కార్మిచేల్ కోల్ మైనింగ్ ప్రాజెక్టు కోసం ఎస్బీఐ చెల్లింపుల గ్యారంటీని ఇచ్చినట్లు తెలుస్తోంది. -
భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే
కర్నూలు(రాజ్విహార్): భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని గుమ్మితంతండా వద్ద ఏర్పాటుచేస్తున్న 5,230 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును ఆయన సోమవారం పరిశీలించారు. సజ్జల మాట్లాడుతూ ఒకే యూనిట్ నుంచి సోలార్(సూర్యరశ్మి), విండ్(గాలి మరల ద్వారా), హైడల్(నీటి) ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3 వేల మెగా వాట్లు, విండ్ పవర్ 550 మెగా వాట్లు, హైడల్ పవర్ 1,680 మెగా వాట్లు, మొత్తం 5,230 మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేసి, నేషనల్ గ్రిడ్కు అనుసంధానం చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 23వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించిందని, ఇందులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని గ్రీన్కో ప్రతినిధులతో అన్నారు. వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, బీవై రామయ్య పాల్గొన్నారు. -
ఎస్జేవీఎన్ గ్రీన్కు రుణాలు
న్యూఢిల్లీ: పీఎస్యూ కంపెనీ ఎస్జేవీఎన్ గ్రీన్ ఎనర్జీకి రుణాలందించేందుకు ఇండియన్ రెనువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా రాజస్తాన్లోని బికనీర్లో కంపెనీ ఏర్పాటు చేయనున్న 1,000 మెగవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు రూ. 4,445 కోట్ల రుణాలను సమకూర్చనుంది. ఇది ఎస్జేవీఎన్ లిమిటెడ్కు అనుబంధ సంస్థకాగా.. రుణ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఐఆర్ఈడీఏ డీజీఎం ప్రదీప్త కుమార్ రాయ్, సీఈవో ఎస్ఎల్ శర్మ పేర్కొన్నారు. ఎస్జేవీఎన్ సీఎండీ నంద్ లాల్ శర్మ, ఐఆర్ఈడీఏ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ సమక్షంలో సంస్థ చరిత్రలోనే గరిష్ట రుణ విడుదలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
విమర్శలకు ఆస్కారం ఇవ్వొద్దు
సాక్షి, అమరావతి: విమర్శలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. లేని అవినీతిని ఉన్నట్లుగా సృష్టిస్తూ ఎల్లో మీడియా వికృతరాతలు రాస్తూ దుష్ఫ్రచారం చేస్తోందంటూ ఆక్షేపించారు. మంగళవారం తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం సమకాలీన రాజకీయ పరిణామాలపై ఆయన మంత్రులతో చర్చించారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకమైన పారిశ్రామిక విధానాలను అనుసరిస్తుండటం వల్లే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అత్యంత పారదర్శకంగా చేపడుతున్నామని.. కానీ సన్నిహితులకే ఎనర్జీ ప్రాజెక్టులను కట్టబెడుతున్నట్లు ఎల్లో మీడియా వికృత ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికే ఇలా దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించి.. దుష్టచతుష్టయం దుష్ఫ్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని మార్గ నిర్దేశం చేశారు. ఎల్లో మీడియా వికృత చేష్టల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు ఉద్బోధించారు. చేసిన మంచిని ప్రజలకు వివరించి.. వారి సమస్యలు విని.. వాటిని పరిష్కరించి.. ప్రజల ఆశీర్వాదం పొందడానికి చేపట్టిన బృహత్తర కార్యక్రమమే గడప గడపకూ మన ప్రభుత్వమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మీ నియోజకవర్గాల్లో మరింత ప్రభావవంతంగా నిర్వహించడంతోపాటు మీ జిల్లా.. మీరు ఇన్చార్జ్ మంత్రిగా వ్యవహరించే జిల్లాలోనూ ఆ కార్యక్రమాన్ని మరింత ప్రభావ వంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 8వ తరగతి చదవుతున్న పిల్లలకు ఈనెల 21న ట్యాబ్లు, బైజూస్ ఈ–కంటెంట్ను అందజేసే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ను రూ.2,750కి పెంచుతున్న తరుణంలో జనవరి 1 నుంచి 7 వరకు నిర్వహించే వారోత్సవాల్లో పాల్గొని, పెన్షన్ పెంపు మంజూరు పత్రాలను అందజేసి, వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పారు. -
సెంబ్కార్ప్ చేతికి వెక్టార్ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: సింగపూర్ లిస్టెడ్ కంపెనీ సెంబ్కార్ప్ ఇండస్ట్రీస్ తాజాగా వెక్టర్ గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ. 2,780 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. దీనితో సెంబ్కార్ప్ భారత్లో పునరుత్పాదక విద్యుత్ విభాగంలో తమ సామర్థ్యాలను 3 గిగావాట్లకు (జీడబ్ల్యూ) పెంచుకోనుంది. భారత్లో రెన్యువబుల్స్ పోర్ట్ఫోలియోను పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నామని సెంబ్కార్ప్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ వాంగ్ కిమ్ ఇన్ తెలిపారు. తమ భారత విభాగంలో పవన విద్యుదుత్పత్తికి అనుబంధంగా సౌర విద్యుదుత్పత్తి వాటాను గణనీయంగా పెంచుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని సంస్థ సీఈవో (దక్షిణాసియా) విపుల్ తులి తెలిపారు. వెక్టార్ గ్రీన్తో కలిపితే స్థూలంగా సెంబ్కార్ప్ రెన్యువబుల్స్ పోర్ట్ఫోలియోలో 1 గిగావాట్ సోలార్ అసెట్లు, 2 గిగావాట్ల పవన విద్యుత్ అసెట్లు (ఇప్పటికే ఇన్స్టాల్ అయినవి, అభివృద్ధి చేస్తున వాటితో కలిపి) ఉంటాయని ఆయన వివరించారు. 2023 తొలి త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా. గ్రూప్ స్థాయిలో సెంబ్కార్ప్ స్థూల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం 8.5 గిగావాట్లకు చేరనుంది. 2025 నాటికల్లా దీన్ని 10 గిగావాట్లకు పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. 13 రాష్ట్రాల్లో వెక్టార్ గ్రీన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ఇండియా నిర్వహణలోని ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2 ఆధ్వర్యంలో వెక్టార్ గ్రీన్ ఎనర్జీ స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో 519 మెగావాట్ల సామర్థ్యంతో కార్యకలాపాలు ఉన్నాయి. 64 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. అలాగే మరో 1 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి పెట్టుబడులతో సిద్ధంగా ఉంది. టోరెంట్ పవర్ కూడా వెక్టార్ గ్రీన్ ఎనర్జీ కోసం పోటీపడినప్పటికీ అంతిమంగా సెంబ్కార్ప్ దక్కించుకుంది. -
కొప్పర్తిలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్.. 30,000 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద 225 ఎకరాల్లో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకు ఏపీఐఐసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకోసం ఆసక్తిగల రాష్ట్రాల నుంచి బిడ్లను ఆహ్వానించింది. సుమారు రూ.445 కోట్ల పెట్టుబడితో 225 ఎకరాల్లో ఈ జోన్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ నారాయణ భరత్గుప్తా ‘సాక్షి’కి వెల్లడించారు. నిజానికి.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన్నవరం వద్ద ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంతో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్కు 753.85 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఈ ప్రాజెక్టును ఎవ్వరూ పట్టించుకోకపోవడం, మారిన రాజకీయ పరిస్థితులతో ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ప్రయోజనం కాదంటూ రెండు సంస్థలు ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రీన్ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుండటమే కాకుండా రూ.1.26 లక్షల కోట్లతో భారీ ఇంధన ప్రాజెక్టులను చేపట్టారు. ఈ అవకాశాలను వినియోగించుకుంటూ సౌర, పవన విద్యుత్ రంగాలకు చెందిన విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ను కొప్పర్తిలో ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలను పంపింది. మొత్తం రూ.445 కోట్ల అంచనా వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు వ్యయం చేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ ఈ జోన్ను సాధించుకునేందుకు నీరు, విద్యుత్ను చౌకగా అందించడమే కాకుండా అనేక రాయితీలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 30,000 మందికి ఉపాధి ఇక ఈ తయారీ జోన్ రాష్ట్రానికొస్తే పెట్టుబడులు, ఉపాధితోపాటు కీలకమైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కొప్పర్తిలో ఏర్పాటయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. విద్యుత్ ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద సుమారు రూ.24,000 కోట్ల బడ్జెట్ను ఈ రంగానికి కేటాయించింది. కొప్పర్తిలో ఈ తయారీ రంగ జోన్ ద్వారా సుమారు రూ.3,500 కోట్ల పెట్టబడులు రావడంతోపాటు ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, సెంటర్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశముంది. ఇక్కడే 1,186 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు ప్రతిపాదనలను కూడా కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అలాగే, కాకినాడ వద్ద ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ సాధించుకున్న రాష్ట్రం ఈ రెండు పార్కులను ఇతర రాష్ట్రాలతో పోటీపడి చేజిక్కించుకుంటుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తంచేస్తున్నారు. -
65 శాతం పర్యావరణ అనుకూల విద్యుత్
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి తన మొత్తం విద్యుదుత్పత్తిలో 65 శాతాన్ని శిలాజేతర ఇంధనాల నుంచే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 90 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ప్రస్తుతం ఈ సామర్థ్యం 20 గిగావాట్లుగా ఉన్నట్టు చెప్పారు. 15–20 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు తెలిపారు. పీఎల్ఐ పథకం కింద మరో 40 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు కానున్నట్టు చెప్పారు. అధిక సామర్థ్యం కలిగిన సోలార్ ఎక్విప్మెంట్ తయారీకి మళ్లాలని పరిశ్రమకు సూచించారు. మన దేశంలో ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 170 గిగా వాట్లకు చేరుకుందని, మరో 80 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు చెప్పారు. ‘‘2030 నాటికి 50 శాతం పర్యావరణ అనుకూల ఇంధన విద్యుత్ సాధిస్తామని హామీ ఇచ్చాం. కానీ, దానికంటే ఎక్కువే సాధిస్తాం. 2030 నాటికి 65 శాతం కంటే ఎక్కువ సామర్థ్యం పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచి ఉంటుంది. 2030 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను 33 శాతం తగ్గిస్తామని చెప్పాం. ఇప్పటికే 30 శాతం తగ్గించే స్థాయికి చేరుకున్నాం. కనుక 2030 నాటికి 45 శాతం తగ్గింపు లక్ష్యాన్ని సాధిస్తాం’’అని మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. -
Andhra Pradesh: దేశీయ బొగ్గు.. తగ్గొద్దు
సాక్షి, అమరావతి: విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే బొగ్గు సమకూర్చుకునేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా సులియారీ, మహానది కోల్ బ్లాక్స్ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని, వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జగనన్న కాలనీలు పూర్తయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంధన శాఖపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. ఇంధన శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీటర్లపై విస్తృత అవగాహన.. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేలా అత్యంత మెరుగైన వ్యవస్థను తేవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మీటర్ల ఏర్పాటు వల్ల్ల కలిగే ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలని సూచించారు. ‘మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంట్ అవసరమో తెలుస్తుంది. దీనివల్ల సరిపడా విద్యుత్ను పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది. వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి. వినియోగించుకున్న విద్యుత్కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఆ డబ్బు అక్కడ నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలకు చేరుతుంది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు రైతులకు జవాబుదారీగా ఉంటాయి. మోటార్లు కాలిపోయినా, నాణ్యమైన కరెంట్ సరఫరా కాకపోయినా డిస్కంలను రైతులు ప్రశ్నించగలుగుతారు. ఈ వివరాలన్నింటిపైనా వారికి నిరంతరం అవగాహన కల్పించాలి’ అని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు ద్వారా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందని, దీనివల్ల చాలా విద్యుత్ ఆదా అయిందనే వివరాలతో సమగ్ర లేఖ ద్వారా విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 16.63 లక్షల మంది రైతుల అంగీకారం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతులు అంగీకరించారని అధికారులు తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్ వాడుతున్న ఘటనలను దాదాపుగా అడ్డుకోగలుగుతున్నామన్నారు. ట్రాన్స్ఫార్మర్ పాడైన 24 గంటల్లోపే కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని, గత 90 రోజుల్లో 99.5 శాతం ట్రాన్స్ఫార్మర్లను 24 గంటల్లోపే రీప్లేస్ చేశామని వివరించారు. అయితే ఇది నూటికి నూరుశాతం జరగాలని సీఎం జగన్ ఆదేశించారు. సాంకేతికతతో ముందడుగు.. విద్యుత్ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో ధరలు తదితర అంశాలపై స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ)లో డేటా అనలిటిక్స్ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందన్నారు. కచ్చితమైన డిమాండ్ను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వినియోగిస్తున్నామని, దీనివల్ల గతంలో 4 నుంచి 5 శాతం ఉన్న మీన్ యావరేజ్ పర్సంటేజ్ ఎర్రర్ (ఎంఓపీఈ) 2 శాతానికి తగ్గిందని వెల్లడించారు. అందుబాటులోకి కొత్త యూనిట్లు.. పోలవరంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే టర్బైన్ మోడల్ టెస్ట్ ముగిసిందని, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. పవర్ హౌస్లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. అప్పర్ సీలేరులో 1,350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ పూర్తైందని, టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి వచ్చిందని, ఈ ప్రాజెక్టును ఈ నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ థర్మల్ పవర్ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్ను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ రెండు యూనిట్లను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు. పంప్డ్ స్టోరేజీతో రాష్ట్రానికిæ ప్రయోజనం.. పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి చాలా ప్రయోజనాలున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ప్రాజెక్టులకు భూములిచ్చిన వారికి, అసైన్డ్ భూములున్న వారికి కూడా ఏడాదికి ఎకరాకు రూ.30 వేల చొప్పున ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలం ఈ ప్రయోజనాలు అందుతాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున ఈ ధర పెరుగుతుంది. భూములిచ్చే రైతులకు గరిష్ట ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టాం’ అని సీఎం తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి భారీ ప్రతిపాదనలు.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలు అందాయని, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులను నెలకొల్పనున్నట్లు రెన్యూ కంపెనీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం విశాఖపట్నం, కాకినాడ పోర్టులకు సమీపంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించారని తెలిపారు. ఎన్టీపీసీ నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. విశాఖ జిల్లా పూడిమడక సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ ఇ– మెథనాల్, గ్రీన్ అమ్మోనియా, ఆఫ్ షోర్ విండ్ పవర్, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ కేంద్రాలపై రూ.95 వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వచ్చిన ప్రతిపాదనల గురించి అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్, ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్, డిస్కమ్ల సీఎండీలు కె.సంతోషరావు, జె. పద్మా జనార్ధనరెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ విస్తరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన విభాగంలో కార్యకలాపాలు మరింత విస్తరించింది. తాజాగా పూర్తి అనుబంధ సంస్థ అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ఫోర్ లిమిటెడ్ ద్వారా మూడు అనుబంధ సంస్థల ఏర్పాటుకు తెరతీసింది. పునరుత్పాదక ఇంధన బిజినెస్ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్కు ఇవి అనుబంధ సంస్థలుగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. వీటి ద్వారా ప్రధానంగా పవన విద్యుత్, సౌర విద్యుత్సహా వివిధ పునరుత్పాదక ఇంధన మార్గాల ద్వారా విద్యుత్ ప్రసారం, అభివృద్ధి, పంపిణీ, విక్రయం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమై రూ. 2,088 వద్ద ముగిసింది. -
అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్లు, తాత్కాలిక అనుమతులిచ్చిన శ్రీలంక!
దేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీకి శ్రీలంక ప్రభుత్వం తాత్కాలిక అనుమతులిచ్చింది. దీంతో అదానీ సంస్థ ప్రాజెక్ట్ల నిర్మాణాల నిమిత్తం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది గతేడాది అక్టోబర్లో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ శ్రీలంక తీర ప్రాంతాలైన మన్నార్, జాఫ్నా, కిలినోచీలో పర్యటించారు. అనంతరం నాటి ప్రధాని గోటబయ రాజపక్సతో పెట్టుబడులపై చర్చించారు. రెండు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై శ్రీలంక ప్రభుత్వం, అదానీ గ్రూపు ఒక ఎంవోయూ కుదుర్చుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 286 మెగావాట్లు, 234 మెగావాట్ల రెండు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ల కోసం అదానీ గ్రీన్ ఎనర్జీకి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాత్కాలిక అనుమతినిచ్చినట్లు శ్రీలంక విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర ప్రకటించారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై చర్చించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ), సస్టైనబుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో సమావేశమైనట్లు విజేశేకర ట్వీట్లో తెలిపారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మన్నార్ జిల్లా, కిలినుచ్చి జిల్లాలోని పూనేరిన్లలో ప్రారంభం కానున్నట్లు చెప్పారు. 'పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు సీఈబీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కాంచన విజేశేఖర భేటీ అయ్యారు. భేటీ అనంతరం మన్నార్లో 286 మెగావాట్లు, పూనేరిన్లో 234 మెగావాట్ల ఇంధన ప్రాజెక్ట్ల కోసంఅదానీ గ్రీన్ ఎనర్జీకి తాత్కాలిక అనుమతులు జారీ చేసినట్లు విజేశేఖర తెలిపారు. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేలా గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టుకునే అవకాశాన్ని అదానీ గ్రూప్కు కల్పించినట్లు పేర్కొన్నారు. -
ఏపీ @ గ్రీన్ ‘పవర్’
సాక్షి, అమరావతి: ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఇటు కాలుష్య రహితమైన విద్యుదుత్పత్తి.. అటు అన్నదాతలకు ఆర్థిక లాభం.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. భౌగోళిక పరిస్థితుల అనుకూలత కారణంగా రాష్ట్రంలో 30 వేల మెగావాట్లకు పైగా పవన్, సౌర విద్యుత్తు లాంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలున్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. ఉదాహరణకు ప్రకాశం, పశ్చిమ కృష్ణా, రాయలసీమ తదితర చోట్ల సేద్యానికి అంతగా అనుకూలం కానివి, నీటి వసతి లేని భూములను వినియోగించుకోనున్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం భూములిచ్చేందుకు ముందుకొస్తే ఎకరానికి ఏటా రూ.30,000 చొప్పున లీజు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కంపెనీలను సంప్రదించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం సుబాబుల్, జామాయిల్ తదితరాలను సాగు చేస్తున్న రైతులకు పెద్దగా కౌలు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులను నివారించే లక్ష్యంతో గ్రామాలకు వెళ్లి రైతులకు లభించే ఆర్థిక ప్రయోజనాలను వివరించి వారంతా అందుకు అంగీకరిస్తే భూమి సమీకరిస్తారు. ఇందుకు దాదాపు 90 వేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఒకపక్క రైతులకు స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా లాభం చేకూరడంతోపాటు స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రతి 3 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఒక ఉద్యోగం చొప్పున అందుబాటులోకి రానుంది. తద్వారా అన్నదాతలు బాగుపడటంతోపాటు ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకోనుంది. ఎస్ఐపీబీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.15,376 కోట్లతో అదానీ అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో టెక్స్టైల్ పార్క్ అభివృద్ధితో పాటు మల్లవల్లిలో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్, తిరుపతిలో నోవాటెల్ ఫైవ్ స్టార్ హోటల్, కొప్పర్తి వద్ద పంక్చుయేట్ గార్మెంట్స్ యూనిట్కు ఎస్ఐపీబీ ఆమోదముద్ర వేసింది. నాలుగు చోట్ల.. 4 వేల మందికి అదానీ ఉపాధి దావోస్లో జరిగిన ఆర్థిక సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు అదానీ గ్రీన్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టును ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. సుమారు రూ.15,376 కోట్ల పెట్టుబడితో 3,700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు అదానీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేయనుంది. మొత్తం నాలుగు దశల్లో నాలుగు చోట్ల పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. వైఎస్సార్ జిల్లాలో 1,000 మెగావాట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుకుట్టి వద్ద 1,200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1,000 మెగావాట్లు, సత్యసాయి జిల్లాలోని పెద్దకోట్ల చిత్రావతి వద్ద 500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. 2022–23లో రూ.1,349 కోట్లు, 2023–24లో రూ.6,984 కోట్లు, 2024–25లో రూ.5,188 కోట్లు, 2025–26లో రూ.1,855 కోట్ల చొప్పున వ్యయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4 వేలమందికి ఉపాధి లభించనుంది. కొప్పర్తిలో టెక్స్టైల్ పార్క్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి చిరునామాగా మారిన కొప్పర్తిలో టెక్స్టైల్ రంగంలోనూ భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం సుమారు 1200 ఎకరాల్లో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, అపరెల్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా గరిష్ట సంఖ్యలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అప్పరెల్ పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. సరకు రవాణా వేగంగా జరిగేలా ఈ ప్రాంతాన్ని రైల్వేలైన్లతో అనుసంధానించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతోపాటు వైఎస్సార్ జిల్లా పులివెందులలో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ) రూ.50 కోట్లతో స్థాపించే గార్మెంట్స్ తయారీ పరిశ్రమకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇదే కంపెనీ కొప్పర్తిలో రూ.50 కోట్లతో నెలకొల్పే మరో యూనిట్కూ ఆమోదం లభించింది. ఈ రెండు యూనిట్ల ద్వారా మొత్తం 4,200 మందికి ఉపాధి లభించనుంది. తిరుపతిలో ఫైవ్స్టార్ హోటల్ తిరుపతిలో వీవీపీఎల్ సంస్థ నోవాటెల్ బ్రాండ్ కింద ఏర్పాటు చేయనున్న ఫైవ్ స్టార్ హోటల్కు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.126.48 కోట్లతో ఏర్పాటయ్యే ఈ హోటల్ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 2,700 మందికి ఉపాధి లభించనుంది. కృష్ణా జిల్లా మల్లవల్లి ఫుడ్పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పే రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కొప్పర్తికి రైల్వే లైన్! ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల ఉత్పత్తుల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఎలక్ట్రానిక్స్. పర్యాటక– ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలున్నాయని చెప్పారు. ‘కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు విరివిగా వస్తున్నాయి. మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను రప్పించాలి. ఈ పరిశ్రమలకు అవసరమైన సామగ్రి, ఉత్పత్తులను సులభంగా తరలించేందుకు వీలుగా కొప్పర్తిలో రైల్వే లైన్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల కొప్పర్తి ప్రాంతంలో దాదాపు 6 వేల ఎకరాల్లో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతోపాటు ఇండస్ట్రియల్ నోడ్స్ను రైల్వేలతో అనుసంధానం చేయడం అత్యంత కీలకం, ప్రతి నోడ్ను రైల్వేలైన్లతో అనుసంధానించేలా కృషి చేయాలి. తద్వారా పరిశ్రమలకు మంచి జరుగుతుంది. రవాణా సులభతరం అవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలి’ అని సమావేశంలో సీఎం సూచించారు. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు ఎస్ఐపీబీ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో రైతులకు మేలు రాష్ట్రంలో 30 వేల మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల రైతులు, రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందన్నారు. దీనికోసం సుమారు 90 వేల ఎకరాలు అవసరం అవుతాయన్నారు. ప్రతి ఎకరాకు రైతుకు ఏటా కనీసం రూ.30 వేలు లీజు కింద ఆదాయం నేరుగా వస్తుందని తెలిపారు. వర్షాభావ ప్రాంతాల్లో స్థిరమైన ఆదాయం రావడం వల్ల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. సుబాబుల్, జామాయిల్ సాగు చేస్తున్న రైతులకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆ భూములను గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా స్థిరమైన ఆదాయం పొందేందుకు చక్కటి అవకాశం దక్కుతుందన్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించి రైతులకు మేలు జరిగేలా చర్యలను చేపట్టాలని ఆదేశించారు. -
గ్రీన్ ఎనర్జీ.. ఏపీ ఒక దిక్సూచి కాబోతుంది: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామన్నారు. ప్రపంచస్థాయి వేదికలపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర ప్రగతిని ఫోకస్ చేశామన్నారు. ఐదు రోజుల సదస్సుకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. చదవండి: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి గీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీలో దేశానికి ఏపీని ఆదర్శంగా మారుస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీ ఒక దిక్సూచి కాబోతుందన్నారు. 30 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. -
ఐవోసి మాస్టర్ ప్లాన్.. అంబానీ, అదానీలకు పోటీగా..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఇంజనీరింగ్, మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ, పునరుత్పాదక ఇంధన రంగంలోని రెన్యూ పవర్.. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో గ్రీన్ హైడ్రోజన్ తయారీపై భారీ ప్రణాళికలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపునకు ఈ జాయింట్ వెంచర్ గట్టీ పోటీనివ్వనుంది. సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధికి గాను ఒప్పందంపై ఈ మూడు సంస్థలు సంతకాలు చేశాయి. అలాగే, ఐవోసీ, ఎల్అండ్టీ విడిగా మరో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అవి గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారు చేయనున్నాయి. ఐవోసీ–ఎల్అండ్టీ–రెన్యూపవర్ ఐవోసీకి చెందిన మధుర, పానిపట్ రిఫైనరీల వద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో అవి పేర్కొన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన పునరుత్పాదక ఇంధనాన్ని రెన్యూ పవర్ సరఫరా చేసే అవకాశం ఉంది. ‘‘మూడు సంస్థల మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటు వల్ల.. ప్రాజెక్టుల డిజైన్, నిర్మాణంలో ఎల్అండ్టీకి ఉన్న అనుభవం, పెట్రోలియం రిఫైనరీలో ఐవోసీకి ఉన్న అనుభవం, ఇంధన చైన్ పట్ల అవగాహన, పునరుత్పాదక ఇంధనంలో రెన్యూపవర్కు ఉన్న అనుభవం కలసివస్తాయి’’ అని ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి: గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం -
గడ్కారీ వినూత్న నిర్ణయం.. ఆ వాహానంలో పార్లమెంటుకు రాక
పెట్రోల్ డీజిల్లకు ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడాలంటూ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ. తాజాగా తన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్లో పార్లమెంటుకు చేరుకున్నారు. పర్యావరణ సహిత ఇంధనాల వాడకం పెంచడాలనే అవగాహన కల్పించడంతో పాటు ఇటీవల మంత్రి ప్రారంభించిన హైడ్రోజన్ ఫ్యూయల్ కారుని పైలట్ ప్రాజెక్టుగా ఇంటి నుంచి పార్లమెంటు వరకు నడిపించారు. ఒక్కసారి ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్ నింపితే 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కిలోమీటరు దూరానికి కేవలం రెండు రూపాయలే ఖర్చు వస్తుంది. ఈ హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారుని మిరాయ్ పేరుతో టయోటా తయారు చేసింది. Koo App Union Minister Shri @nitin.gadkari ji visited Parliament House by Hydrogen based Fuel Cell Electric Vehicle (FCEV) today. Demonstrating the car powered by ‘Green Hydrogen’, Shri Gadkari ji emphasised the need to spread awareness about Hydrogen, FCEV technology and its benefits to support hydrogen-based society for India. View attached media content - Office Of Nitin Gadkari (@OfficeOfNG) 30 Mar 2022 -
గాలి పటాలతో కరెంటు ఉత్పత్తి..
-
పెట్రోల్పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు
సాంకేతికత, గ్రీన్ ఫ్యుయల్ రంగంలో వేగంగా వస్తోన్న మార్పులతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయని కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే రెండేళ్లలో పెట్రోల్తో నడిచే వాహనాల ధరల స్థాయికి ఈవీ వాహనాల ధరలు వస్తాయని నితిన్ గడ్కరీ లోక్సభలో ప్రస్తావించారు. తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ ఇంధనానికి మారవలసిన అవసరాన్ని ఆయన ఎత్తిచూపారు. హైడ్రోజన్ ఇంధనం త్వరలోనే వాస్తవికత అవుతుందని, కాలుష్య స్థాయిలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీలందరూ హైడ్రోజన్ టెక్నాలజీతో నడిచే వాహనాలను వాడాలని కోరారు. అంతేకాకుండా మురుగు నీటిని గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి తమ జిల్లాల్లో చొరవ తీసుకోవాలని తెలిపారు. దీంతో భవిష్యత్తులో చౌకైన ఇంధన ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఉంటుందని ఆయన చెప్పారు. లిథియం-ఐయాన్ బ్యాటరీల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. జింక్-ఐయాన్, అల్యూమినియం-ఐయాన్, సోడియం-ఐయాన్ బ్యాటరీల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇదే జరిగితే పెట్రోల్పై ప్రస్తుతం రూ.100 ఖర్చు చేస్తోన్న వారు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో రూ.10 మాత్రమే చెల్లించే రోజులు త్వరలోనే రానున్నాయని పేర్కొన్నారు. దాంతో పాటుగా ఇండియన్ రోడ్లపై కూడా ఆసక్తి కర వ్యాఖ్యలను చేశారు. భారత్ రోడ్లు సూపర్..! అమెరికన్ రోడ్ల కంటే భారత్లోని రోడ్లు అత్యద్భుతంగా ఉన్నాయంటూ గడ్కరీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జరిగే రోడ్ల నిర్మాణంపై కూడా ప్రస్తావించారు. ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వేను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ-అమృత్ సర్ మార్గం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది అని అన్నారు. అలాగే, కొత్తగా నిర్మిస్తున్న మార్గం వల్ల ఢిల్లీ నుంచి అమృత్ సర్ చేరుకోవడానికి 4 గంటల సమయం మాత్రమే పడుతుందని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న రోడ్డుతో శ్రీనగర్ నుంచి ముంబై చేరుకోవడానికి 20 గంటల సమయం పడుతుందని గడ్కరీ చెప్పారు. చదవండి: వాహనదారులకు గుడ్న్యూస్.. ఇక 60 కిలోమీటర్ల వరకు నో టోల్! -
అదానీ దూకుడు.. అసలు తగ్గేలా లేడే !
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) రూ.2,188 కోట్లు సమీకరించింది. విదేశీ సంస్థలైన బీఎన్పీ పారిబస్, కో–ఆపరేటివ్ రబోబ్యాంక్ యూఏ, ఇంటెసా సావోపాలో ఎస్పీఏ, ఎంయూఎఫ్జీ బ్యాంక్, సొసైటీ జనరాలే, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ నుంచి ఈ నిధులను పొందినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ మొత్తాన్ని రాజస్తాన్లో ఏర్పాటు చేస్తున్న 450 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుకు వెచి్చస్తారు. తాజా డీల్తో కలిపి ఏజీఈఎల్ రూ.12,464 కోట్ల నిధులను అందుకుంది. 2030 నాటికి 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఇది సుమారు 14 గిగావాట్లు ఉంది. చదవండి: బెజోస్ మస్క్ అదానీ ముందు దిగదుడుపే! -
పెరగనున్న పెట్రోల్ రేట్లు.. గ్రీన్ ఫైనాన్సింగ్పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడులతో ఒక్కసారిగా ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గట్టుగా త్వరలోనే పెట్రోలు, డీజిలు రేట్లు పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నయంగా గ్రీన్ ఎనర్జీపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ ఫైనాన్స్ వృద్ధి, భవిష్యత్ ఎకానమీ అవసరాలు నెరవేర్చడంపై మంగళవారం నిర్వహించిన వెబినార్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఫైనాన్సింగ్లో వినూత్న విధానాలను అవలంభించాలని ప్రధాని ఆర్థిక సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేలా వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరారు. వృద్ధి చెం దుతున్న ఆర్థిక వ్యవస్థ తక్షణ, భవిష్యత్ అవసరాలు నెరవేర్చడంలో ఇవి ఎంతో కీలకాంశాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫైనాన్సింగ్ను ఆయన ప్రస్తావించారు. 2070 నాటికి నిర్దేశించుకున్న పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి (నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్) గ్రీన్ ఫైనాన్సింగ్ తక్షణ అవసరం ఎంతో ఉందన్నారు. ఈ దిశలో పర్యావర ణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టుల విస్తరణకు రుణ సంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రధాని ప్రస్తావించిన ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.. - సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు విజయవంతం కావడం అనే అంశం ఈ రంగాలకు ఫైనాన్సింగ్ను బలోపేతం చేయడంపై ఆధారపడి ఉంటుంది. - ఫిన్టెక్, అగ్రిటెక్, మెడిటెక్, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాలలో దేశం ముందుకు సాగే వరకు దేశంలో నాల్గవ పారిశ్రామిక విప్లవం సాధ్యం కాదు. - నిర్మాణం, స్టార్టప్లు, డ్రోన్లు, అంతరిక్షం, జియో–స్పేసియల్ డేటా వంటి 8 నుంచి 10 రంగాలకు ప్రత్యేక గుర్తింపు అవసరం. ఆయా రంగాల్లో పురోగతి ద్వారానే భారత్ టాప్–3లో ఉండగలుగుతుంది. ఈ రంగాల పురోగతికి ఆర్థిక సంస్థల రుణ మద్దతు ఎంతో అవసరం. - స్టార్టప్లకు రుణ దాతలకు ఆయా అంశాలకు సంబంధించి భవిష్యత్తు గురించిన లోతైన అవగాహన అవసరం. అలాంటప్పుడే స్టార్టప్ల కార్యకలాపాల విస్తరణ, ఆవిష్కరణలు, కొత్త మార్కెట్ల కోసం అన్వేషణ జరుగుతుంది. - ఆరోగ్య రంగంలో కృషి, పెట్టుబడి అంశాలను పరిశీలిస్తే, వైద్య విద్యకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి మరిన్ని వైద్య సంస్థలను కలిగి ఉండటం చాలా కీలకం. - బ్యాంకులు ఎగుమతిదారులకు ప్రాధాన్యతా ప్రాతిపదికన నిధులు అందజేస్తే ఈ రంగం మరింత బలోపేతం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం విజవంతానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. - సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతో అవసరం. ఎవరైనా సహజ వ్యవసాయంలో కొత్త పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారంటే, అతనికి ఏ విధంగా సహకరించాలో ఆర్థిక సంస్థలు ఆలోచించాలి. - 2022–23 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేయడానికి బ్యూరోక్రాట్స్ ’క్రియాశీల కార్యాచరణ’తో ముందుకు రావాలి. చదవండి: ప్రైవేటీకరణపై ప్రధాని కీలక సమావేశం -
గ్రీన్ ఎనర్జీ కారిడార్–2కు పచ్చజెండా
న్యూఢిల్లీ: గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) ఫేస్–2 ప్రాజెక్టును ఏడు రాష్ట్రాల పరిధిలో అమలు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పరిధిలో గ్రీన్ ఎనర్జీ కారిడార్–2 ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. 20 గిగావాట్ల పునరుత్పాదక (రెన్యువబుల్ ఎనర్జీ) ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే విద్యుత్ సరఫరాకు వీలుగా, గ్రిడ్ ఇంటిగ్రేషన్ కోసం 10,750 సర్క్యూట్ కిలోమీటర్ల మేర ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించనున్నారు. అంచనా వ్యయం రూ.12,031 కోట్లు. కేబినెట్ సమావేశం అనంతరం ఈ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఐదేళ్లలో అమలు.. 2021–22 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య గ్రీన్ కారిడార్ రెండో దశను అమలు చేస్తామని మంత్రి ఠాకూర్ చెప్పారు. మొదటి దశ పనులు 80 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని, మొదటి దశ కోసం రూ.10,142 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. గ్రీన్ కారిడార్–2 ప్రతిపాదిత రూ.12,031 కోట్లలో 33 శాతాన్ని (రూ.3,970 కోట్లు) కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాల మధ్య పంపిణీ చార్జీలను కేంద్ర ప్రభుత్వ సాయంతో సర్దుబాటు చేసుకోవచ్చని.. దీంతో వ్యయాలు తగ్గుతాయన్నారు. ప్రభుత్వ సాయం అంతిమ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. 2030 నాటికి 450 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి ఈ పథకం మద్దతుగా నిలవనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఈ ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం భావిస్తోంది. గ్రీన్ కారిడార్–1 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల పరిధిలో ఏర్పాటవుతోంది. 24 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సరఫరాకు ఇది సాయపడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి ఇది పూర్తికానుంది. మొదటి దశ కింద ఈ రాష్ట్రాల్లో 9,700 కిలోమీటర్ల మేర సరఫరా లైన్లు అందుబాటులోకి వస్తాయి. -
గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం
గ్రీన్ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడతామంటూ భవిష్యత్ ప్రణాళిక ప్రకటించిన రిలయన్స్ సంస్థ అందుకు తగ్గట్టుగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జామ్నగర్ దగ్గర గిగా ఫ్యాక్టరీ పనులు కొనసాగిస్తూనే మరోవైపు గ్రీన్ టెక్నాలజీలో వివిధ సంస్థలతో జట్టు కడుతోంది రిలయన్స్. సోడియం ఐయాన్ బ్యాటరీ టెక్నాలజీలో ప్రపంచంలోనే పేరెన్నికగల ఫారడియన్ కంపెనీని రియలన్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో వంద శాతం వాటాలను కొనుగోలు చేసినట్టు రిలయన్స్ ప్రకటించింది. యూకేలోని ఆక్స్ఫర్డ్, షేక్ఫీల్డ్ బేస్డ్గా వ్యాపారం నిర్వహిస్తున్న ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ 100 మిలియన్ పౌండ్లుగా ఉంది. కాగా మరో 25 మిలియన్ పౌండ్లను ఫారడియన్ కంపెనీ విస్తరణ, ఆర్ అండ్ డీ కోసం రిలయన్స్ కేటాయించనుంది. బ్యాటరీ తయారీలో వినియోగించే కోబాల్ట్, కాపర్, లిథియం, కాపర్, గ్రాఫైట్లతో పోల్చితే సోడియం ఉపయోగించడం సులువు. భూమిపై సోడియం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి బ్యాటరీ తయారీ ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. అంతేకాదు సోడియం ఐయాన్ బ్యాటరీలు త్వరగా ఛార్జ్ అవుతాయి. న్యూ ఎనర్జీకి సంబంధించి మేము నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరడానికి ఫారడియన్ టేకోవర్ ఎంతగానో ఉపకరిస్తుందని రియలన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ఫారడియన్ దగ్గరున్న టెక్నాలజీని మరింత వేగంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. ఫారడియన్ని రిలయన్స్ టేకోవర్ చేయడం మంచి పరిణామం అని ఆ సంస్థ సీఈవో జేమ్స్ క్విన్ అన్నారు. -
దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! నితిన్ గడ్కరీ క్లారిటీ!
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ నేడు జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనల రిజిస్ట్రేషలు నిలిపివేయడం లేదని, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ వాహనాలను కొనుగోలు చేయడానికి అమ్మకాలను ప్రోత్సాహిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే, విమానయాన ఇంధనంలో 50 శాతం ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున ఈవీల అమ్మకాలు పెరిగాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. "మేము ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను" అని గడ్కరీ అన్నారు. దేశంలో 250 పైగా స్టార్టప్లు ఎలక్ట్రిక్-వాహనాల అభివృద్ది కోసం పనిచేస్తున్నాయని, దీంతో ఈవీల తయారీ ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తు అని పేర్కొన్న ఆయన.. వచ్చే నెలలో ఒక హైడ్రోజన్ కారు కొనబోతున్నట్లు కూడా నితిన్ గడ్కరీ తెలిపారు. 2019లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి 2025 నాటికి ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల వాడకాన్ని నిషేదించే ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. (చదవండి: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు హెచ్చరిక..!) అయితే, ఆటో మొబైల్ కంపెనీలు ఈ ప్రతిపాదనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగంపై నిషేధం వల్ల గ్రీన్ ఎనర్జి వాహనాల అమ్మకాలు పెరగవని పేర్కొన్నాయి. 2030 నాటికి అనేక దేశాలు ఐసీఈ వాహనాలను నీషేదిస్తుండటంతో.. భారత్ మాత్రం ప్రస్తుతానికి ఆ వైపు ఆలోచనలు ఏవి చేయడం లేదని ఆయన తెలిపారు. అయితే, వివిధ ప్రోత్సాహకాలు, పథకాలను అందించడం ద్వారా ఆటోమొబైల్స్ అమ్మకాల్లో గ్రీన్ ఎనర్జి వాహనాల శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 విధానం కింద సబ్సిడీలను అందిస్తున్నప్పటికీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ప్రయోజనాలను అందించడంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. (చదవండి: లక్కీఛాన్స్ ! ఫ్రీగా విమాన టిక్కెట్లు పొందే అవకాశం) -
ఈ లక్ష్యం కఠినమే!
అనూహ్యం... అపూర్వం. గ్లాస్గోలో ‘పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 26వ సదస్సు’ (కాప్–26)లో భారత ప్రధాని మోదీ చెప్పిన మాటలు, చేసిన బాసలను అభివర్ణించడానికి ఇలాంటి పదాలే సరిపోతాయి. శిలాజేతర ఇంధనశక్తి సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడం... పునరుద్ధరణీయ వనరుల నుంచే 50 శాతం విద్యుత్ అవసరాలను తీర్చుకోవడం... కర్బన ఉద్గారాలను వంద కోట్ల టన్నులు తగ్గించడం... ఒక యూనిట్ విద్యుదుత్పత్తికి ఎన్ని గ్రాముల కార్బన్డయాక్సైడ్ విడుదలవుతోందనే ‘కర్బన తీవ్రత’ లెక్కను 45 శాతం కన్నా తక్కువకు తీసుకురావడం... ఈ లక్ష్యాలను ఎనిమిదేళ్ళలో 2030 నాటికి చేరుకొంటామని ప్రపంచ వేదికపై మోదీ భారీ వాగ్దానం చేశారు. దేశంలో విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులకు దీటుగా అంతే మొత్తంలో పర్యావరణం నుంచి కర్బన ఉద్గారాలను తొలగించి, నికరంగా చెల్లుకు చెల్లు అనేది తుది లక్ష్యం. ఆ ‘నెట్ జీరో’ (కర్బన తటస్థత) లక్ష్యాన్ని సైతం 2070 నాటికి సాధిస్తామన్నారు. పర్యావరణ హితైషిగా భారత్ పెట్టుకున్న ఈ లక్ష్యాలన్నీ ఆహ్వానించదగ్గవే. అయితే, వీటిని చేరే వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడున్న ప్రశ్న. నిజానికి, 2050 నాటి కల్లా కర్బన తటస్థతను సా«ధించేలా దేశాల నుంచి మాట తీసుకోవాలన్నది ప్రయత్నం. అంతకన్నా ఇరవై ఏళ్ళు ఆలస్యంగా 2070 గడువును పెట్టుకోవడం మిగతా ప్రపంచానికి నిరాశాజనకమే. అయితే, కఠోరమైన ప్రభుత్వ, రాజకీయ శ్రమతో తప్ప, అతి తక్కువ గడువులో అందుకోవడానికి వీల్లేని అనేక భారీ లక్ష్యాలను ఇలా ఉన్నట్టుండి భారత భుజస్కంధాల మీదకు మోదీ ఎత్తుకోవడం ఎవరూ ఊహించని విషయం. నిజానికి, ఆ మధ్య భారత్కు వచ్చి, చర్చించిన పాశ్చాత్య పర్యావరణవాదులకు ఇలాంటి లక్ష్యాలపై మన సర్కారు ఎలాంటి హామీ ఇవ్వలేదు. గత నెలే తుది గడువు అయినా సరికొత్త ‘జాతీయ నిర్ధారిత భాగస్వామ్యాల’ (ఎన్డీసీల)నూ మనం పేర్కొనలేదు. గ్లాస్గో సదస్సుకు కొద్ది గంటల ముందే రోమ్లో ముగిసిన ‘జి–20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులోనూ మన దేశం పర్యావరణ మార్పుపై కొత్త బాసలూ చేయలేదు. పైపెచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు నిధులిచ్చి సాంకేతికతను బదలాయించాలనీ, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో భారత్కు సభ్యత్వమిచ్చే దాకా శిలాజేతర ఇంధనాలకు మారలేమనీ, బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలకు స్వస్తి పలకలేమనీ ‘జి–20’లో భారత సన్నాహాలన్నీ చూసిన కేంద్రమంత్రే కుండబద్దలు కొట్టారు. అలాంటిది కొన్ని గంటల తేడాలో భారత పర్యావరణ లక్ష్యాలపై గ్లాస్గోలో మోదీ ఇచ్చిన కొత్త హామీల ట్విస్టు అనూహ్యం. ఆశ్చర్యకరం. జనాభా రీత్యా ప్రపంచంలో 17 శాతం ఉన్న భారత్, మానవాళి మొత్తం ఉద్గారాల్లో 6.8 శాతానికి కారణం. లెక్క వేస్తే మన దేశ కర్బన ఉద్గారాలు 246 కోట్ల టన్నులు. వచ్చే 2030 నాటికి ఇది 400 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా. మరి, తాజా వాగ్దానం మేరకు 100 కోట్ల టన్నుల ఉద్గారాలను తగ్గించాలంటే, ఆషామాషీ కాదు. అటవీ పెంపకం మార్గాన్ని ఎంచుకుంటే – ఒక చెట్టు తన వందేళ్ళ జీవితకాలంలో ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. వంద టన్నుల కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోవాలంటే– ఎకరానికి 500 చెట్లు లెక్కన చూసినా, 20 లక్షల ఎకరాల్లో, అంటే ఏటేటా దాదాపు త్రిపుర రాష్ట్రమంత విస్తీర్ణంలో అడవులను పెంచాలి. లేదంటే, ఆటోమోటివ్ రంగంలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలి. స్టీలు లాంటి రంగాల్లో హైడ్రోజన్ లాంటి శుద్ధ ఇంధనాల వైపు మళ్ళాలి. ఇవన్నీ అంత త్వరగా సాధ్యమా అన్నది విశ్లేషకుల ప్రశ్న. భారత విద్యుత్ అవసరాల్లో ప్రస్తుతం 12 శాతమే పునరుద్ధరణీయ ఇంధనాలు తీరుస్తున్నాయి. దాన్ని కేవలం 8 ఏళ్ళలో 50 శాతానికి పెంచడం భగీరథ ప్రయత్నమే. అలాగే, 2070 నాటికి నెట్ జీరో కోసం మధ్యలో ఏదో ఒక ఏడాదిని గరిష్ఠ వత్సరంగా తీసుకొంటే అక్కడ నుంచి ఉద్గారాలను తగ్గించుకుంటూ రావాలి. మచ్చుకు 2040ని పీక్ ఇయర్గా ఎంచుకుంటే, 0.1 శాతమే ఉన్న ఎలక్ట్రిక్ కార్ల వాటా 2040 నాటికి 75 శాతానికి పెరగాల్సి ఉంటుంది. ఇలా బోలెడు లెక్కలు. నిజానికి, ఇతర ప్రధానదేశాలకు భిన్నంగా ఇటీవలి దాకా నెట్ జీరో లక్ష్యాన్ని భారత్ ప్రకటించనే లేదు. ఇప్పుడిలా ఉన్నట్టుండి ప్రకటన చేసిందంటే, దౌత్యపరమైన ఒత్తిళ్ళు పని చేసి ఉండవచ్చు. అయితే, 2050 కల్లా అభివృద్ధి చెందిన దేశాలు నెట్ జీరోకు కట్టుబడి ఉంటేనే, తానూ తన హామీకి కట్టుబడతానని భారత్ మెలిక పెట్టి ఉండాల్సిందని నిపుణుల మాట. ఎందుకనో మన పాలకులు ఆ పని చేయలేదు. మరోపక్క, వర్ధమాన ద్వీపదేశాలు పర్యావరణానికి ఏమంత హాని చేయకపోయినా, భూతాపోన్నతితో భారీగా దెబ్బతింటాయి కాబట్టి, వనరుల కల్పనతో వాటిని ఆదుకోవడానికి ‘ఐరిస్’ పేరిట భారత్ కొత్త పథకం ప్రకటించింది. పర్యావరణ అనుకూల జీవనశైలి, ప్రపంచ సౌరశక్తి గ్రిడ్ ఆవశ్యకత అంటూ ‘ఒక సూర్యుడు– ఒకటే ప్రపంచం – ఒకటే గ్రిడ్’ లాంటి భారత ప్రధాని మాటలు చప్పట్లందుకున్నాయి. తొలినాటి సమావేశంలో నిర్ణీత సమయం కన్నా పది నిమిషాలు ఎక్కువే మాట్లాడిన మోదీ ఆలోచనలు ఆకర్షణీయమే. అనుమానం లేదు. ఇప్పుడిక ఆచరణాత్మక వ్యూహమే అవసరం. అదే అసలైన సవాలు. తాజా ఎన్డీసీల పత్రాన్ని సర్కారు సమర్పిస్తే, లక్ష్యసాధనకు వేసుకున్న ప్రణాళిక ఏమిటో స్పష్టమవుతుంది. ఇప్పటికైతే, ఇచ్చిన మాట నెరవేర్చడంలో వెనుకబడ్డ అనేక అభివృద్ధి చెందిన దేశాలకు మన వాగ్దానాలు స్ఫూర్తినివ్వవచ్చు. రేపు 2030 కల్లా పెట్టుకున్న లక్ష్యాలను మనం సాధించగలిగితే, పర్యావరణ పరిరక్షక అభివృద్ధిలో ప్రపంచానికి భారతే దిక్సూచి. -
శ్రీలంకపై కన్నేసిన అదానీ..!
పునరుత్పాదక (గ్రీన్) విద్యుదుత్పత్తి రంగంపై వచ్చే దశాబ్ద కాలంలో 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అదానీ గ్రూప్స్ శ్రీలంకలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్స్ శ్రీలంకలో పవన, పునరుత్పాదక ఇంధన రంగంలో సాధ్యమయ్యే పెట్టుబడులను పరిశీలిస్తోందని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వైస్ చైర్మన్ నలింద ఇలంగకూన్ వెల్లడించారు. పవన, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను అదానీ గ్రూప్ సోమవారం రోజున అన్వేషించిందని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (CEB) వైస్ చైర్మన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: క్రోమాతో జట్టుకట్టిన ఇన్నోవిటీ..! సోమవారం రోజున గౌతమ్ అదానీతో 10 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం శ్రీలంకలోని ఈశాన్య మన్నార్ జిల్లాలో విండ్ ఎనర్జీ ఫీల్డ్ను సందర్శించినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలికాప్టర్లో అదానీ ప్రయాణించారు. 100మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీపై శ్రీలంకలో అదానీ గ్రూప్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో అదానీ గ్రూప్స్ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి కాదు. కొలంబో పోర్ట్లో వెస్ట్రన్ కంటైనర్ టెర్మినల్ను అభివృద్ధి చేయడానికి శ్రీలంక పోర్ట్స్ అథారిటీతో అదానీ గ్రూప్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానికంగా జాన్కీల్స్ హోల్డింగ్స్తో అదానీ గ్రూప్స్ భాగస్వామి ఉంది. చదవండి: తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభించిన జియో-బీపీ -
AP: ఇథనాల్ ఉత్పత్తి రెట్టింపు
సాక్షి, అమరావతి: గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ, తక్కువ వ్యయంతో ఇంధన వనరులను సముపార్జన లక్ష్యాలుగా ఈ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ముఖ్యోద్దేశం. ఇందుకోసం తొలిసారిగా ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తికి సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా మాత్రమే ఇథనాల్ను ఉత్పత్తి చేస్తుండగా.. ఇకపై మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఈ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సంకల్పించింది. అలాగే, ఇథనాల్ ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మరోవైపు.. ఔషధ రంగానికే పరిమితమైన ఇథనాల్ను ఇకపై పెట్రోలియం ఉత్పత్తుల్లో కూడా విరివిగా ఉపయోగించాలని నిర్ణయించింది. చెరకు ఉప ఉత్పత్తులకు ప్రోత్సాహం దేశంలో అవసరానికంటే ఎక్కువగా చక్కెర ఉత్పత్తి అవుతుండడంతో ఆశించిన గిట్టుబాటు ధర లభించడంలేదు. దీంతో చక్కెర దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. అంతేకాక.. ఫ్యాక్టరీల వారీగా క్రషింగ్కు కోటా పెట్టి ఎగుమతులకు ఇన్సెంటివ్లు ఇస్తోంది. చక్కెర కంటే చెరకు నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇక చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా ఇ నాల్, ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్), ఆర్ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) వంటి ఉత్పత్తులు వస్తాయి. వీటిలో ఇథనాల్ను గ్రీన్ ఎనర్జీగా పరిగణిస్తారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్లో 10శాతం ఇథనాల్ను కలుపుతున్నారు. 2030 నాటికి దీనిని 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. ఇథనాల్ను ఉత్పత్తిచేసే డిస్టిలరీల సామర్థ్యం పెంచుకునేందుకు.. అలాగే, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తి నిమిత్తం కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకోసం ఆర్థికంగా చేయూతనివ్వడమే కాక.. వాటికి వడ్డీ చెల్లింపుపై కనీసం 2–3 ఏళ్ల పాటు మారటోరియం కూడా విధిస్తోంది. ఇథనాల్ ఉత్పత్తి ఎలాగంటే.. ►చెరకును క్రషింగ్ ద్వారా వచ్చిన మొలాసిస్ను చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉండే డిస్టిలరీకి తరలిస్తారు. ►అక్కడ ఒక లీటర్ మొలాసిస్కు మూడు లీటర్ల నీరు కలిపి ఫర్మెంటేçషన్ చేస్తారు. అనంతరం డిస్టిలేషన్ యూనిట్కు పంపిస్తారు. ►అక్కడ ఆవిరిని కండెన్స్ చేయగా వచ్చే పదార్థమే ఇథనాల్. దీనిని స్టోరేజ్ ట్యాంక్కు తరలిస్తారు. ఒక టన్ను చెరకు నుంచి 47 కేజీల మొలాసిస్ వస్తుంది. టన్ను మొలాసిస్ నుంచి 12.5 లీటర్ల ఇథనాల్ వస్తుంది. ►ఇక మొలాసిస్ నుంచి మూడు రకాలుగా ఇథనాల్ను ఉత్పత్తి చేస్తారు. ఇలా టన్నుకు సీ మొలాసిస్ నుంచి 260 లీటర్లు, బి.మొలాసిస్ నుంచి 320 లీటర్లు, షుగర్ సిరప్ నుంచి 285 లీటర్లు ఇథనాల్ను తీస్తారు. ►షుగర్ సిరప్ నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్ను లీటర్కు రూ.62.65లు, బి మొలాసిస్ నుంచి వచ్చే ఇథనాల్కు లీటర్కు రూ.57.61లు, సీ మొలాసిస్ నుంచి వచ్చే ఇథనాల్ను లీటర్కు రూ.45.69లుగా కేంద్రం ధర నిర్ణయించింది. ►వీటిని పెట్రోల్ ఉత్పత్తి చేసే ఆయిల్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ►ఇలా రాష్టంలో 13.75 లక్షల కిలో లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. సామర్థ్యం పెంచేందుకు యత్నిస్తున్నాం కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహంతో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం. మా ఫ్యాక్టరీలో రోజుకు 48వేల లీటర్ల చొప్పున ఏటా 1.58 కోట్ల లీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే ఏడాదికి దీనిని మరింతగా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం రూ.95 కోట్లు ఖర్చుచేయబోతున్నాం. – ఎ. నాగశేషారెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్, సంకిలి, శ్రీకాకుళం జిల్లా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం రాష్ట్రంలో ఈఐడీతో పాటు సర్వారాయ, ఆంధ్రా, కేసీపీ, ఎస్ఎన్జీ షుగర్స్ ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నాయి. చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి కోసం డిస్టిలరీల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఉన్న డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి యత్నిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. – వడకాని వెంకట్రావు, డైరెక్టర్ ఆఫ్ షుగర్స్ -
‘గ్రీన్’ విద్యుత్పై 20 బిలియన్ డాలర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక (గ్రీన్) విద్యుదుత్పత్తి రంగంపై వచ్చే దశాబ్ద కాలంలో 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. పర్యావరణ హిత విద్యుత్కు సంబంధించి వివిధ రూపాల్లో తమ పెట్టుబడులు మొత్తం మీద 50–70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రోలైజర్ల తయారీ భాగస్వాములు మొదలుకుని సౌర.. పవన విద్యుత్ వ్యాపారాలకు అవసరమైన ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పారిశ్రామిక క్లౌడ్ ప్లాట్ఫాంలు మొదలైనవన్నీ ఈ కోవలోకి వస్తాయని వివరించారు. వచ్చే నాలుగేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మూడు రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు అదానీ పేర్కొన్నారు. ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ చాప్టర్ సోమవారం నిర్వహించిన సస్టెయినబిలిటీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా గౌతమ్ అదానీ మాట్లాడారు. మన వైద్య, విద్య, రవాణా తదితర వ్యవస్థల్లో ఉన్న లోపాలను కరోనా మహమ్మారి ఎత్తి చూపిందన్నారు. కోవిడ్ లాంటి మహమ్మారులను నిలువరించేందుకు టీకాలైనా ఉన్నాయని.. కానీ వాతావరణ మార్పుల చికిత్సకు ఎలాంటి టీకాలు లేవని అదానీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పు సమస్యలకు తగు పరిష్కార మార్గాలు కనుగొనడమే కాకుండా.. సైన్స్, విధానాలు, సాంకేతిక అభివృద్ధి ద్వారా అందరికీ ప్రయోజనాలు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 28 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్ .. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్ 28 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తాను గతేడాది చెప్పానని అదానీ పేర్కొన్నారు. అమెరికా తలసరి ఆదాయంలో ప్రస్తుతం ముప్ఫయ్యో వంతుగా ఉన్న భారత్ తలసరి ఆదాయం 2050 నాటికి మూడో వంతుకు చేరుతుందన్నారు. రాబోయే రోజుల్లో అనేక దశాబ్దాల పాటు భారత్ రెండంకెల స్థాయి వృద్ధి సాధించగలదని అదానీ చెప్పారు. మరోవైపు, పర్యావరణ హిత విధానాలను, స్టార్టప్లను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. అక్టోబర్ 6 దాకా సదస్సు.. రాబోయే తరాలకు కూడా వనరులను మిగిల్చే విధంగా.. ప్రస్తుత తరం అవసరాలను తీర్చుకునేందుకు పాటించాల్సిన విధానాలపై (సస్టెయినబిలిటీ) చర్చించేందుకు ఇజ్రాయెల్, కోస్టారికాల భాగస్వామ్యంతో టై నిర్వహిస్తున్న సదస్సు అక్టోబర్ 6 దాకా జరగనుంది. ఇందులో 64 దేశాల నుంచి 25,000 పైచిలుకు సంస్థలు పాల్గొంటున్నాయి. తొలి రోజున ఇరు దేశాల్లోని వ్యవసాయ, సాంకేతిక తదితర రంగాల స్టార్టప్లను ప్రోత్సహించే దిశగా ఇజ్రాయెల్, భారత్లోని టై విభాగాలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ సదస్సు ఊతంతో రాబోయే రోజుల్లో స్టార్టప్లకు దాదాపు 100 మిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు దక్కే అవకాశం ఉందని టీఎస్ఎస్ 2021 చైర్పర్సన్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ దౌత్యవేత్త నిక్కి హేలీ (వర్చువల్గా), కోస్టా రికా దౌత్యవేత్త క్లాడియో అన్సోరెనా, ఇజ్రాయెల్ డిప్యుటీ చీఫ్ ఆఫ్మిషన్రోని క్లెయిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సై అంటోన్న ఆ సంస్థ
న్యూఢిల్లీ: ప్రయివేటైజేషన్ ప్రక్రియలో ఉన్న పీఎస్యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం, గ్యాస్ బిజినెస్, శుద్ధ ఇంధనం, మార్కెటింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితరాలకు నిధులను వెచ్చించనున్నట్లు కంపెనీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా కంపెనీని తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. సంప్రదాయ ఇంధనాలతోపాటు.. కర్బనరహిత మొబిలిటీకి వీలయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్లపై దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. ముడిచమురు నుంచి అధిక విలువగల పెట్రోకెమికల్స్ను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యాచరణ ఇలా దేశంలోనే రెండో పెద్ద ఇంధన రిటైలింగ్ కంపెనీ బీపీసీఎల్ 1,000 మెగావాట్ల పోర్ట్ఫోలియోతో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అరుణ్ కుమార్ విలేకరులకు వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే.. ప్రధానంగా ఇతర కంపెనీల కొనుగోలు ద్వారా బీపీసీఎల్ పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను నిర్మించుకోనుంది. బయోఇంధనాలు, హైడ్రోజన్పై ఇన్వెస్ట్ చేయనుంది. మధ్య, దీర్ఘకాలాలలో 19,000 పెట్రోల్ పంపుల్లో 7,000ను ఎనర్జీ స్టేషన్లుగా మార్పు చేయనుంది. పెట్రోల్, డీజిల్తోపాటు.. ఈవీ చార్జింగ్, సీఎన్జీ, హైడ్రోజన్ తదితరాలను అందించనుంది. చదవండి : crude oil: ఆగస్టులో తగ్గిన క్రూడ్ ఉత్పత్తి -
కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే!
ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన సంపదను మరింత వృద్ధి చేసుకోనున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రానున్న రోజుల్లో సుమారు రూ.60వేల కోట్లు డాలర్ల పెట్టుబడి పెట్టునున్నారు.ఈ పెట్టుబడులతో రూ.6.04 లక్షల కోట్లుగా ఉన్న ముఖేష్ అంబానీ సంపద మరింత పెరగనుంది. మనీ మేకింగ్ మిషన్ ముఖేష్ అంబానీకి గుజరాత్ జామ్ నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఉంది. ఈ కేంద్రం ద్వారా అరేబియా సముద్రంలో ముడి చమురును వెలికి తీసి ఫ్యూయల్, ప్లాస్టిక్, కెమికల్స్ను తయారు చేస్తారు. దీని విస్తీర్ణం సుమారు న్యూయార్క్ సిటీలో మాన్ హాటన్ ప్రాంతం సగం వరకు ఉంటుందని అంచనా. తద్వారా పైప్లైన్ల నెట్వర్క్ ఇక్కడ రోజుకు14 లక్షల బారెల్స్ పెట్రోలియంను ప్రాసెస్ చేస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ తన సొంత కార్యకలాపాల కోసం 45 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేసినట్లు బ్లూమ్ బెర్గ్ లెక్కలు చెబుతున్నాయి. ముఖేష్ ఆస్థి మొత్తంలో 60 శాతం ముడి చమురు ఉత్పత్తుల ద్వారా వచ్చిన సంపదే. కాబట్టే ఆర్ధిక వేత్తలు సైతం జామ్ నగర్ చమురు ఉత్పత్తి కేంద్రం ముఖేష్ అంబానీకి మనీ మేకింగ్ మిషన్ లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. 10శాతం తగ్గుతుందేమో! ప్రపంచం మొత్తం పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముఖేష్ అంబానీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పాటు గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టినా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీ, పన్నులు, తరుగుదల, తీసుకున్న రుణాల్ని తీర్చినా రిలయన్స్ ఆదాయంలో 10% మాత్రమే ఖర్చవుతుందని, ఆయిల్-టు-కెమికల్స్ ప్రాసెస్ తో వచ్చే ఆదాయం 33 శాతం ఉంటుందని శాన్ఫోర్డ్ ఎనలిస్ట్ సి. బెర్న్స్టెయిన్ అంచనా వేశారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమణ మాట్లాడుతూ..జామ్ నగర్ చమురు శుద్ధి కేంద్రాల వల్ల పర్యావరణానికి ప్రమాదమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడుల కోసం చేపట్టే ఉత్పత్తుల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సంకేతాలు వెలువడుతున్నా ముఖేష్ అంబానీ పట్టించుకోవడం లేదని అన్నారు. అలా చేస్తే రిలయన్స్ కూకటి వేళ్లు కదిలే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు?! ఈ ఏడాది జూన్లో జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మొబైల్ నెట్వర్క్లో జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో..రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్ ఎనర్జీ రంగంలో తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. అంతేకాదు మూడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చిన శిలాజ ఇంధనాల యుగం ఎక్కువ కాలం కొనసాగదంటూనే.. గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాబట్టే ఈ గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ చమురు ఉత్పత్తులు తగ్గి రిలయన్స్ కూకటివేళ్లు కదిలే పరిస్థితి ఎదురైనా.. ముఖేష్ అంబానీ కుబేరుడి స్థానానికి వచ్చిన ఢోకా ఏం లేదని జోస్యం చెబుతున్నారు. చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! -
విధిగా గ్రీన్ ఎనర్జీ!.. కేంద్రం చేతిలో ఓపెన్ యాక్సెస్
సాక్షి, హైదరాబాద్: డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ వినియోగదారులు విధిగా నిర్దేశిత మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) కొనుగోలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్తగా గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్–2021 ముసాయిదాను ప్రకటించింది. వచ్చే నెల 14లోగా దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలపాలని రాష్ట్రాలను కోరింది. దీనిప్రకారం విధిగా గ్రీన్ ఎనర్జీ కొనుగోలు బాధ్యత (రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఆర్పీఓ)ను అందరిపై ఏకరీతిన ఉండనుంది. డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్లకు ఈ నిబంధనలు తుది నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి వర్తించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కలిగి ఉన్నాయి. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఈ నిబంధనలను తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సొంతంగా పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ పెట్టుకోవచ్చు... ►తప్పనిసరి అయినా, కాకపోయినా ఏదైనా సంస్థ తమ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధనాన్ని దిగువ పేర్కొన్న ఏదైనా పద్ధతిలో కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ►సొంత వినియోగం కోసం ఏర్పాటు చేసుకొనే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంపై ఎలాంటి పరిమితి ఉండకూడదు. అయితే విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయరాదు. దీనిని ‘బిహైండ్ ద మీటర్’వినియోగం అంటారు. ఈ విద్యుత్ కొనాల్సిన బాధ్యత డిస్కంలకు ఉండదు. ఈ విద్యుత్ ప్లాంట్ను సొంతంగా లేదా డెవలపర్ ద్వారా పెట్టించుకోవచ్చు. డెవలపర్తో దీర్ఘకాల/మధ్యకాల విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ►ఒప్పందం ద్వారా ఓపెన్ యాక్సెస్ విధానంలో డెవలపర్ నుంచి పునరుత్పాదక ఇంధనాన్ని సమీకరించుకోవచ్చు. కేంద్రం చేతిలో ఓపెన్ యాక్సెస్ ఓపెన్ యాక్సెస్లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు అనుమతులు ఇకపై నేరుగా కేంద్రం నుంచి లభించనున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసే నోడల్ ఏజెన్సీ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి సింగిల్ విండో విధానం ద్వారా సంబంధిత ఈఆర్సీలకు వాటిని పంపిస్తుంది. ఆ ఈఆర్సీ అనుమతులు ఇస్తుంది. ►ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాన్ని రాతపూర్వకంగా తెలపాలి. పునరుత్పాదక విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేయవచ్చు... ►ఏదైనా సంస్థ తమ అవసరాల్లో కొంత శాతం మేరకు లేదా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ఈ మేరకు పునరుత్పాదక విద్యుత్ను సమీకరించి సరఫరా చేయాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విజ్ఞప్తి చేయవచ్చు. ►క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్ లేదా ఓపెన్ యాక్సెస్ ద్వారా అందుబాటులో ఉన్న పునరుత్పాదక విద్యుత్ను రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్తో సంబంధం లేకుండా కొనుగోలు చేయవచ్చు. ►విధిగా కొనుగోలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తం/వాటాలో పునరుత్పాదక ఇంధ నాన్ని వినియోగదారులు స్వచ్ఛందంగా కొనుగోలు చేసుకోవచ్చు. కనీసం 50%, 75%, 100% పునరుత్పాదక ఇంధనాన్ని కొనొచ్చు. ►సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) పునరుత్పాదక విద్యుత్ టారిఫ్ను ఖరా రు చేస్తుంది. పునరుత్పాదక విద్యుత్ సమీకరణ సగటు ధర, క్రాస్ సబ్సిడీ చార్జీలు, సర్వీ సు చార్జీల ఆధారంగా టారిఫ్ నిర్ధారిస్తారు. ►పునరుత్పాదక విద్యుత్ కోసం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ చేసే విజ్ఞప్తి కనీసం ఏడాది కాలం కోసం ఉండాలి. ఏడాది పాటు కొంటామని ముందే సూచించాలి. ►డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ నుంచి వినియోగ దారులు కొనుగోలు చేసిన పునరుత్పాదక విద్యుత్ను, ఆ కంపెనీ విధిగా కొనుగోలు చేయాల్సిన విద్యుత్ (ఆర్బీఓ) కింద లెక్కి స్తారు. ప్రతినెలా డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ సరఫరాను లెక్కిస్తారు. ►విధిగా కొనాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను అందుకోవడానికి రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ►పునరుత్పాదక విద్యుత్ ఉపయోగించి ఉత్ప త్తి చేసిన ‘గ్రీన్ హైడ్రోజన్’ను పరిశ్రమలు, ఇతర సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా విధిగా కొనుగోలు చేయాల్సిన పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవచ్చు. ►ఓపెన్ యాక్సెస్లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు వచ్చే దరఖాస్తులన్నింటినీ 15 రోజుల్లోగా పరిష్కరించాలి. 100 కిలోవాట్స్, ఆపై కాంట్రాక్టెడ్ లోడ్, శాంక్షన్డ్ లోడ్ ఉన్న వినియోగదారులకు మాత్రమే ఓపెన్ యాక్సెస్ అనుమతి. -
గ్రీన్పవర్ దిశగా అడుగులు వేస్తున్న ఐవోసీఎల్..!
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తన రిఫైనరీ కేంద్రాలలో గ్రీన్ పవర్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. పలు రిఫైనరీ కేంద్రాల్లో గ్రీన్ పవర్తో ఫ్యూయోల్ ఎక్స్పన్షన్ చేయనుంది. గ్రీన్ పవర్ను ఉపయోగించడం ద్వారా ఉద్గారాలను తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని ఐవోసీఎల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 నాటికి సుమారు 500,000 బ్యారెల్ పర్ డేకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్ పవర్ను ఉపయోగించడంతో కొన్ని భాగాల మానుఫ్యాక్చరింగ్లో డీకార్బోనైజ్ చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మధుర శుద్ధి కర్మాగారంలో 1.6 లక్షల బీపీడీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను నిర్మించాలని ఐవోసీఎల్ యోచిస్తోంది. కాగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రాజస్థాన్లో పవన విద్యుత్ ప్రాజెక్టును కలిగి ఉంది. విద్యుద్విశ్లేషణ ద్వారా పూర్తిగా గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసి మథుర శుద్ధి కర్మాగారానికి ఉపయోగించనున్నట్లు పేర్కొంది. సౌర, పవనశక్తి వంటి పునరుత్పాదాకాలను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ వాడకంతో రిఫైనరీలో ఉపయోగించే కార్బన్-ఉద్గార ఇంధనాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రిఫైనింగ్,ఇంధన రిటైలింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయనుందని తెలిపింది. వచ్చే పదేళ్లలో ఐవోసిఎల్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టి సారిస్తుందని కంపెనీ ప్రతినిధి వైద్య చెప్పారు. -
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సింగపూర్ హైకమిషనర్ హెచ్.ఈ. సైమన్ వాంగ్ అన్నారు. వాంగ్ తన ప్రతినిధుల బృందంతో ఆర్థిక మంత్రి హరీశ్రావును సోమవారం అరణ్యభవన్లో కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో వాంగ్ హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు వాంగ్ చెప్పారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి వెల్లడించారు. డేటాసెంటర్లకు అనువైనదని, ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మా సిటినీ ఏర్పాటు చేస్తోందన్నారు. తెలంగాణ వ్యాక్సిన్ హబ్గా మారిందన్నారు. సోలార్ వంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా తెలంగాణ అనువైందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరా.. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాల గురించి సింగపూర్ ప్రతినిధులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని హరీశ్ తెలిపారు. సముద్రమట్టం నుంచి వంద నుంచి 630 మీటర్ల ఎత్తులో తెలంగాణ ప్రాంతం ఉందని, గోదావరి నీటిని 630 ఎత్తు వరకు ఈ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేస్తున్నట్లు వివరించారు. ఏడున్నరేళ్ల కాలంలో వ్యవసాయం రంగంలోనూ సమూల మార్పులను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. ఫలితంగా రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ రంగంలోనూ స్వావలంభన సాధించామన్నారు. వచ్చే పర్యటనలో తెలంగాణలోని పల్లెలను సందర్శించి ప్రజల జీవన విధానం పరిశీలించాలన్నారు. సిద్దిపేట జిల్లాను సందర్శించాలని కోరారు. ఈ భేటీలో సింగపూర్ హైకమిషన్ సెక్రటరీలు సెన్ లిమ్, అమండా క్వెక్, సింగపూర్ కన్సోల్ జనరల్ (చైన్నై) పాంగ్ కాక్ టైన్, వైస్ కన్సోల్ జనరల్ అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ను శాలువాతో సత్కరించారు. చదవండి: సర్కారీ స్కూళ్లు.. సరికొత్తగా! -
అంబానీ, అదానీ కంపెనీల మధ్య వార్ జరగనుందా..!
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 44వ ఎజీఎం సమావేశంలో 10 బిలియన్ డాలర్లను పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను పెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుంగా ఎజీఎం సమావేశంలో 2035 నాటికి కర్బణ ఉద్ఘారాలను జీరో స్థాయికి తీసుకు రావడం లక్ష్యంగా తమ ప్రణాళిక ఉందని ముఖేష్ అంబానీ వెల్లడించారు. కాగా ముఖేష్ అంబానీ గ్రీన్ఎనర్జీలోకి ఏంట్రీతో అదానీ సోలార్ కంపెనీలకు తలనొప్పిగా మారనుంది. ముఖేష్ రాకతో ప్రస్తుతం ఉన్న సోలార్ విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిపోతాయని వ్యాపార నిపుణులు భావిస్తోన్నారు. భవిష్యత్తులో వీరి ఇరువురి మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని పేర్కొన్నారు. 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ను ముందుంచాలనే ఆశయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రీన్ ఎనర్జీ రంగంలో ముఖేష్ అంబానీ, అదానీ ముందంజలో ఉన్నారు.రాబోయే తొమ్మిదేళ్లలో 100 గీగా వాట్ల ఫ్యాక్టరీలను నిర్మిస్తామని ముఖేష్ అంబానీ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఎనర్జీ స్టోరేజ్ కోసం బ్యాటరీ ఫ్యాక్టరీ, ఫ్యూయల్ సెల్ ఫ్యాక్టరీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్ నిర్మాణానికి వచ్చే మూడేళ్ళలో తమ బృందం 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని ముఖేష్ తెలిపారు. కంపెనీలు దూకుడు..టారిఫ్ల తగ్గుదల భారత్లో ప్రతిష్టాత్మక గ్రీన్ ఎనర్జీ రంగానికి అనువైన స్థలంగా ఉంటుంది. గ్రీన్ఎనర్జీ రంగంలో పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఎదగడానికి సహయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. కాగా గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కంపెనీల మధ్య దూకుడు పెరుగుతోందని భావిస్తున్నారు. దీంతో కంపెనీలు ఒకరినొకరు అధిగమించడానికి ప్రయత్నిస్తుండటంతో టారిఫ్లు మరింత తగ్గుతాయని వ్యాపార నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. తగ్గిపోయిన ఛార్జీలు అదానీ కంపెనీలు గ్రీన్ ఎనర్జీలో భాగంగా ప్రతి సంవత్సరం 5 గీగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అటు గ్రీన్ ఎనర్జీ రంగంలోకి రిలయన్స్ కంపెనీ రాకతో సౌర విద్యుత్ టారిఫ్లు గణనీయంగా తగ్గిపోయాయి. తాజాగా గుజరాత్లో నిర్వహించిన సౌర విద్యుత్ వేలంలో కిలోవాట్ గంటకు రూ. 2లకు పడిపోయింది. ప్రపంచంలోనే అతి తక్కువ సౌర విద్యుత్ టారిఫ్లు భారత్లో నమోదయ్యాయి. భారత్లో 2030 నాటికి సౌర విద్యుత్ టారిఫ్లు కిలోవాట్ గంటకు రూ.1 తాకుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్లో ఎనర్జీ ఫైనాన్స్ స్టడీస్ డైరెక్టర్ టిమ్ బక్లీ అన్నారు. ప్రత్యర్థి వ్యాపారాలకు విఘాతం కలిగించడంలో రిలయన్స్కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. చౌకైన స్మార్ట్ఫోన్లు, డేటా ప్లాన్లతో, జియో కేవలం ఐదు ఏండ్లలో భారత్లో అత్యధిక సబ్స్క్రైబర్స్ను సొంతం చేసుకుంది. -
చేజారే నీటికి సరికొత్త ‘పవర్’
సాక్షి, అమరావతి: కొండ కోనల్లో వృధా అవుతున్న నీటిని విద్యుదుత్పత్తి వనరులుగా మార్చేందుకు ప్రణాళిక తయారవుతోంది. కాలుష్యానికి కళ్లెం వేసే గ్రీన్ ఎనర్జీని పెద్దఎత్తున ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు ఇంధనశాఖ ఇటీవల నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రస్తుతం 1,700 మెగావాట్లు ఉన్న జల విద్యుత్ వచ్చే పదేళ్లలో 7,700 మెగావాట్లకు పెరగనుంది. తద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు మరింత చౌకగా కరెంట్ అందుబాటులోకి వచ్చే వీలుంది. మినీ హైడల్స్, పంప్డ్ స్టోరేజీలకు అనువైన ప్రాంతాలను ఏపీలో అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 31 వేల మెగావాట్ల విద్యుత్ని, వీటి ద్వారా ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. తొలిదశలో 6 వేల మెగావాట్ల జల విద్యుదుత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనికి సంబంధించి సమగ్ర నివేదికలు (డీపీఆర్) శరవేగంగా రూపొందిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయం(పీక్ అవర్స్)లో కూడా జల విద్యుత్ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. పంప్డ్ స్టోరేజీలు అంటే... నదులు, వాగుల్లో నీటిని ఎగువ ప్రాంతంలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుని జల విద్యుదుత్పత్తి చేస్తారు. నిజానికి కొన్ని సందర్భాల్లో సౌర, పవన విద్యుత్ ఎక్కువగా వస్తుంది. దీన్ని వినియోగించుకునేందుకు థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోంది. దిగువ నుంచి ఎగువకు నీటిని పంపే పంప్డ్ స్టోరేజీల్లో ఈ విద్యుత్ను వాడుకుంటారు. రాత్రి సమయంలో సౌర విద్యుత్ ఉండదు. అలాంటప్పుడు డిమాండ్ను పంప్డ్ స్టోరేజీలు భర్తీ చేస్తాయి. ఇవి కాకుండా కొండ ప్రాంతాల్లో జలపాతాల నుంచి జాలువారే నీటిని ఒక చోట ఆనకట్ట ద్వారా నిల్వ చేస్తారు. దీనిద్వారా విద్యుదుత్పత్తి చేస్తారు. వీటిని మినీ హైడల్స్ అని వ్యవహరిస్తారు. కాలుష్యానికి కట్టడి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వల్ల వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు పంప్డ్ స్టోరేజీ తరహా జల విద్యుత్ తోడ్పడుతుంది. గ్రీన్ ఎనర్జీ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త నిబంధనలు తెచ్చింది. పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలంటే 30 శాతం జల విద్యుత్ లభ్యత ఉండాలని సూచించింది. రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని 2030 నాటికి 7,700 మెగావాట్లకు పెంచనున్నారు. జల విద్యుత్ చౌకగా లభిస్తుంది. ప్లాంట్ నెలకొల్పిన 70 ఏళ్ల వరకూ ఉత్పత్తికి ఢోకా ఉండదు. మొదటి 25 ఏళ్లలోనే నిర్మాణ వ్యయం తీరిపోతుంది. ఆ తర్వాత మరింత చౌకగా విద్యుత్ అందుతుంది. మాచ్ఖండ్ నుంచి ప్రస్తుతం యూనిట్ 90 పైసలకే విద్యుత్ వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పంప్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి : అంబానీ వర్సెస్ అదానీ.. ఇద్దరి టార్గెట్ అదే -
అంబానీ వర్సెస్ అదానీ.. ఇద్దరి టార్గెట్ అదే
ముంబై : ఆసియాలోనే అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల ఫోకస్ అంతా గ్రీన్ ఎనర్జీ మీద పెట్టారు. సంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేయడంలో ఒకరిని మించి మరొకరు లక్ష్యాలను నిర్థేశించుకున్నారు. భారీగా పెట్టుబడులకు సిద్ధం అవుతున్నారు. తొలిసారి పోటీ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇద్దరు గుజరాతీయులే. ఎప్పటి నుంచో వ్యాపార రంగంలో ఉన్నారు. ఇండియాలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగారు. అయితే ఎప్పుడు వీరిద్దరు ఒకరికొకరు పోటీ కాలేదు. రిలయన్స్ ప్రధానంగా పెట్రో రిఫైనరీలు, టెలికాం, రిటైల్ తదితర వినియోగదారులు టార్గెట్గా బిజినెస్ చేశారు. మరోవైపు అదాని పోర్టులు, సరుకుల రవాణా, మెగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా మౌలిక వసతుల కల్పన రంగంలో తమ వ్యాపారాలు కేంద్రీకరించారు. కానీ తొలిసారి వీరిద్దరికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో పోటీ ఎదురవుతోంది. గ్రీన్పై అదాని ముందు నుంచి మౌలిక వసతుల కల్పన రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూపు, గ్రీన్ ఎనర్జీపైనా అదే స్థాయిలో ఫోకస్ పెట్టింది. 2030 నాటికి సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో అదానీ గ్రూపును ప్రపంచలోనే నెంబర్ వన్గా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 25 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న వివిధ కంపెనీల్లో అదానీ గ్రూపు పెట్టుబడులు పెట్టింది. మరోవైపు నిధుల సమీకరణకు అదానీ గ్రీన్ ఎనర్జీలో 20 శాతం వాటను ఫ్రాన్స్కి చెందిన టోటల్ ఎనర్జీస్ ఎస్ఈ సంస్థకు కట్టబెట్టింది. రిలయన్స్ ఫోకస్ టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అచ్చంగా అదే స్థాయిలో గ్రీన్ ఎనర్జీలో మార్పులు తెస్తామంటూ స్వయంగా ముఖేష్ అంబానీ ప్రకటించారు. అందుకు తగ్గట్టే గ్రీన్ ఎనర్జీపై ఏకంగా 75,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 100 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు. ఆసక్తికర పోటీ దేశంలో అప్పటి వరకు ఉన్న బడా వ్యాపార కుటుంబాలను, సంస్థలను వెనక్కి నెట్టి అనతి కాలంలోనే అంబానీ, అదానీలు దేశంలోనే సంపన్నులుగా మారారు. మార్కెట్ను సరిగా పసిగట్టి, అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రూపొందించి ఘన విజయాలు సాధించారు. దారులు వేరైనా నంబర్ వన్ స్థానం లక్ష్యంగా ముందుకు కదిలారు. తొలిసారి వీరిద్దరు గ్రీన్ ఎనర్జీ రంగంలో పోటీ పడుతున్నారు. దీంతో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో వీళ్ల వ్యూహాలు ఎలా ఉంటాయనే దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చదవండి : రిలయన్స్కు... కొత్త ‘ఇంధనం’ -
‘గ్రీన్’కి అందని పాజిటివ్ సిగ్నల్స్
ముంబై : గ్రీన్ ఎనర్జీపై రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ చేసిన ప్రకటనపై మార్కెట్ వర్గాలు అంతగా ఆసక్తి కనబరచలేదు. దీంతో సాధారణ వార్షిక సమావేశం ముగిసిన తర్వాత రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ప్రభావం లేదు రాబోయే మూడేళ్లలో గ్రీన్ ఎనర్జీపై రూ. 75,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో తరహాలోనే గ్రీన్ ఎనర్జీ మార్కెట్ రూపు రేఖలు మారుస్తామంటూ చెప్పారు. అయితే ఆ మాటలు పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో రిలయన్స్ షేర్ల ధరలో పెద్దగా మార్పు రాలేదు. సమాశం జరిగే రోజు కూడా శాతం మేర రిలయన్స్ షేర్లు విలువను కోల్పోయాయి. సమావేశానికి ముందు ముదుపరులు తమ వాటాలు అమ్మేందుకు ప్రయత్నించడంతో ఇలా జరిగింది. అయితే సమావేశం ముగిసిన తర్వాత కొంత మేరకు కోలుకుని రిలయన్స్ షేర్ విలువలో నష్టం 2.6 శాతానికే పరిమితమైంది. మార్పులు గ్రీన్ ఎనర్జీపై ప్రకటన వచ్చిన తర్వాత మార్కెట్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత వ్యతిరేకత వ్యకత్మైన వెంటనే సమసిపోయింది. మొత్తంగా వేచి చూసే ధోరణి అవలంభించింది. పైగా ఈసారి రిలయన్స్ బోర్డులోకి కొత్త డైరెక్టర్ రావడం, గూగుల్ భాగస్వామ్యంతో కొత్త ఫోను, క్లౌడ్ స్టోరేజీ లాంటి ప్రకటనలను కూడా మార్కెట్ నిశితంగా గమనిస్తోంది. మరోవైపు ఫేస్బుక్, వాట్సప్లతో కలిసి ప్రారంభించిన జియోమార్ట్ ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. దీంతో మార్కెట్ స్తబ్థత నెలకొంది. చదవండి : శ్రీ చైతన్య సమర్పించు ఇన్ఫినిటీ లెర్న్ -
Reliance AGM 2021: ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీదే... భవిష్యత్ భారత్దే
ముంబై: గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులకు రిలయన్స్ శ్రీకారం చుట్టింది. ఒక్క రిలయన్స్ సంస్థ నుంచే ఏకంగా 450 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటూ సంచలన రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. మొబైల్ నెట్వర్క్లో జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో.. రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్ ఎనర్జీ రంగంలో తీసుకువస్తామంటూ ఆయన ప్రకటించారు. జూన్ 24న వర్చువల్గా జరిగిన రిలయన్స్ 44వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో గ్రీన్ ఎనర్జీపై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రూ. 75,000 కోట్ల పెట్టుబడి గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏకంగా రూ. 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. 2035 నాటికి కర్బణ ఉద్ఘారాలను జీరో స్థాయికి తీసుకు రావడం లక్ష్యంగా తమ ప్రణాళిక ఉందని వెల్లడించారు. దీని కోసం గుజరాత్లోని జామ్నగర్లో ధీరుభాయ్ అంబానీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ తెస్తున్నట్టు వివరించారు. ఇందులో సోలార్ ప్యానెల్స్, అడ్వాన్స్డ్ స్టోరేజీ బ్యాటరీల తయారీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, హ్రైడోజన్ వినియోగాలకు సంబంధించి నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తామన్నారు. వీటి కోసం ఏకంగా రూ. 60,000 కోట్లు వెచ్చించబోతున్నట్టు ఆయన తెలిపారు. దీంతో పాటు ఫ్యూచర్ టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం మరో రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. మూడేళ్ల వ్యవధిలోనే ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తాయన్నారు. ఎండ్ టూ ఎండ్ గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీలకు సంబంధించి ఎండ్ టూ ఎండ్ సర్వీసులను రిలయన్స్ అందివ్వబోతుందని ముఖేష్ ప్రకటించారు. అతి తక్కువ ధరకే సోలార్ మాడ్యుల్స్ తయారు చేయడంతో పాటు విద్యుత్ను నిల్వ చేసుకునేందుకు వీలుగా అత్యాధునిక బ్యాటరీలు కూడా తయారు చేస్తామన్నారు. తమ గ్రీన్ ఉత్పత్తులు ఇండస్ట్రీయల్ స్కేల్లో ఉండటంతో పాటు గృహఅవసరాలు, రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాలు తీర్చే విధంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. 450 గిగావాట్లు రిలయన్స్ ద్వారా స్వంతంగా 450 గిగా వాట్ల గ్రీన్ విద్యుత్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖేష్ తెలిపారు. ఇందులో 100 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి చేరుకుంటామంటూ అంబాని నమ్మకంగా తెలిపారు. ప్రస్తుతం ఇండియా పెట్రోలును దిగుమతి చేసుకుంటుందని, రాబోయే రోజుల్లో ఇండియా నుంచి గ్రీన్ ఎనర్జీ విదేశాలు ఎగుమతి అవుతుందని ఆయన అన్నారు. చదవండి: Reliance AGM 2021: బోర్డులో స్వతంత్ర డైరక్టర్గా ఆరాంకో చైర్మన్..! -
రివర్స్ టెండరింగ్తో చౌకగా సౌర విద్యుత్
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా చౌకగా సౌర విద్యుత్ అందబోతోంది. ఇందుకు సంబంధించిన టెండర్లు బుధవారం ఖరారయ్యాయి. గతంలో రూ.3 వరకు ఉన్న యూనిట్ విద్యుత్ ధర ఇకపై గరిష్టంగా 2.58కే లభించనుంది. ప్రభుత్వం వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా అమలు చేసేందుకు 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా బిల్డ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్(బీవోటీ) విధానంలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తొలి విడతలో భాగంగా 6,400 మెగావాట్లకు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. పూర్తి పారదర్శకంగా న్యాయ సమీక్ష చేపట్టిన కార్పొరేషన్.. రివర్స్ టెండరింగ్ కూడా చేపట్టి అతి తక్కువకు విద్యుత్ ఇచ్చే సంస్థలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని పది ప్రాంతాలకు సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థల వివరాలను గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ బుధవారం మీడియాకు విడుదల చేసింది. -
అదానీ గ్రీన్లో టోటల్కు వాటా
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్నకు చెందిన పునరుత్పాదక ఇంధన కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో వాటా కొనుగోలుకి ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా అదానీ గ్రీన్లో 20% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు దాదాపు రూ.18,200 కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఒప్పందం ద్వారా సోలార్ ఎనర్జీ అభివృద్ధిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న అదానీ గ్రీన్ బోర్డులో టోటల్కు సీటు లభించనుంది. అంతేకాకుండా 2.35 గిగావాట్స్ సోలార్ ఆస్తుల పోర్ట్ఫోలియోలోనూ 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు రెండు కంపెనీలూ సంయుక్తంగా వెల్లడించాయి. కంపెనీలో ప్రమోటర్లకు 74.92 శాతం వాటా ఉంది. దీనిలో 20 శాతం వాటాను టోటల్కు విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు చెందిన 16.4 శాతం వాటాకు సమానమైన 25.65 కోట్ల షేర్లను టోటల్ కొనుగోలు చేసినట్లు అదానీ గ్రీన్ తాజాగా వెల్లడించింది. ఇందుకు రూ. 14,600 కోట్లు(2 బిలియన్ డాలర్లు) చెల్లించినట్లు తెలియజేసింది. తదుపరి మరో 50 కోట్ల డాలర్ల(రూ. 3,600 కోట్లు)తో మిగిలిన వాటాను సైతం సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇతర కంపెనీలలో..: చమురు, ఇంధన రంగ ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ 2018లో గౌతమ్ అదానీ గ్రూప్లోని ఇతర కంపెనీలలోనూ వాటాల కొనుగోలుకి ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా అదానీ గ్యాస్లో 37.4 శాతం వాటా, ఒడిషాలో నిర్మాణంలో ఉన్న ధమ్రా ఎల్ఎన్జీ ప్రాజెక్ట్లో 50 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు అంగీకరించింది. కాగా.. అదానీ ఎనర్జీలో 20 శాతం వాటా కొనుగోలు ద్వారా అదానీ గ్రూప్తో భాగస్వామ్యాలను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు టోటల్ పేర్కొంది. తద్వారా దేశీయంగా శుద్ధ ఇంధన రంగంలో రెండు కంపెనీలూ మార్పులకు కృషి చేయనున్నట్లు తెలియజేసింది. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ విద్యుత్, పునరుత్పాదక ఇంధనాలవైపు మళ్లనున్నట్లు వివరించింది. 2025కల్లా స్థూలంగా 35 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ ప్రస్తుత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 7 గిగావాట్లుగా ఉంది. ఈ ఏడాదిలో 10 గిగావాట్స్కు చేరాలని భావిస్తోంది. ఇక మరోపక్క ఇదే సమయంలో అదానీ గ్రీన్ 25 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలని ఆశిస్తోంది. ప్రస్తుతం సంస్థ కాంట్రాక్టెడ్ సామర్థ్యం 14.6 గిగావాట్లుగా నమోదైంది. 3 గిగావాట్ల నిర్వహణలో ఉండగా.. మరో 3 జీడబ్ల్యూ నిర్మాణంలో ఉంది. అంతేకాకుండా 8.6 జీడబ్ల్యూ అభివృద్ధి దశలో ఉంది. 2015లో ఆరంభం... అదానీ గ్రీన్ తమిళనాడులో 648 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులతో 2015లో ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయంగా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్కాగా.. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుదుత్పాదక ఆస్తులు కలిగిన సంస్థగా ఆవిర్భవించింది. అదానీ గ్రీన్లో ప్రవేశించడం తమ వ్యూహాలలో మైలురాయివంటిదని టోటల్ సీఈవో, చైర్మన్ ప్యాట్రిక్ పయానే పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనం, సహజవాయు విభాగాలలో విస్తరించేందుకు భారత మార్కెట్ కీలకమన్నారు. చౌక పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తికి వ్యూహాలను పంచుకోనున్నట్లు అదానీ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. 2030కల్లా 450 గిగావాట్ల పునరు త్పాదక ఇంధనాన్ని సాధించేందుకు ఇరు కంపెనీలూ కలసి పనిచేస్తాయని వివరించారు. -
‘చాంపియన్ ఆఫ్ ది ఎర్త్’ మోదీ
న్యూఢిల్లీ: స్వచ్ఛ, హరిత పర్యావరణం తమ ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చెప్పారు. వాతావరణం, విపత్తులకు సంస్కృతితో సంబంధం ఉందనీ, పర్యావరణాన్ని కాపాడటం మన సంస్కృతిలో భాగం కానంతవరకు విపత్తులను నివారించడం చాలా కష్టమైన పని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డును మోదీ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ చేతుల మీదుగా అందుకున్నారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ–ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్) విజయవంతమవ్వడంలో కీలకపాత్ర పోషించినందుకుగాను మోదీతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్కు సంయుక్తంగా ఈ అవార్డును ఐరాస ప్రకటించింది. అవార్డును స్వీకరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ ‘వ్యవసాయ, పారిశ్రామిక విధానాల నుంచి ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వరకు.. అన్నింట్లోనూ స్వచ్ఛ వాతావరణం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు భారత్ ఇటీవలి కాలంలో మరింతగా పాటుపడుతోంది. 2005తో పోలిస్తే 2020కల్లా కర్బన ఉద్గారాలను 20–25 శాతం, 2030 నాటికి 30–35 శాతం తగ్గించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2022 కల్లా ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ను నిషేధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. వారందరికీ దక్కిన గౌరవం ఈ అవార్డు.. మోదీ మాట్లాడుతూ ‘ఈ దేశంలో కొన్ని తెగల ప్రజలు అడవుల్లో బతుకుతూ తమ ప్రాణాలకంటే అక్కడి చెట్లనే ఎక్కువ ప్రేమిస్తారు. మత్స్యకారులు తమ జీవనానికి అవసరమైన డబ్బు సంపాదించడానికి ఎన్ని చేపలు అవసరమో అన్నే పడతారు తప్ప అత్యాశకు పోరు. రైతులు ఎంతో కష్టపడి దేశం ఆకలి తీరుస్తున్నారు. చెట్లను దేవతలుగా పూజించే మహిళలు ఇక్కడ ఉన్నారు. వీరందరికీ దక్కిన గుర్తింపుగా నేను ఈ అవార్డును భావిస్తున్నాను’ అని అన్నారు. ప్రకృతిని భారతీయులెప్పుడూ ప్రాణం ఉన్న జీవిగానే చూశారనీ, పర్యావరణాన్ని గౌరవించడం భారత సంస్కృతిలో పురాతన కాలం నుంచే భాగంగా ఉందనీ, స్వచ్ఛతా అభియాన్ ద్వారా ప్రజల ప్రవర్తనను మార్చడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని మోదీ చెప్పుకొచ్చారు. అసలైన నాయకుడు మోదీ: గ్యుటెరస్ హరిత వాతావరణాన్ని నమ్మే వారి పక్షానే సాంకేతికత ఉంటుందని గ్యుటెరస్ అన్నారు. ‘అసలైన నాయకత్వం కలిగిన ఓ రాజనీతిజ్ఞుడిని ఈ పురస్కారంతో మనం గుర్తిస్తున్నాం. వాతావరణ మార్పు సమస్యను గుర్తించి, పర్యావరణ పరిరక్షణతో వచ్చే లాభాలను అర్థం చేసుకునే నాయకుడు మోదీలో ఉన్నారు. ఆయనకు సమస్యలు తెలుసు, పరిష్కరించేందుకూ పనిచేస్తున్నారు. హరిత వాతావరణం మంచి వాతావరణం. బూడిద వాతావరణాన్ని నమ్మే వారి భవిష్యత్తు కూడా బూడిదలాగే ఉంటుంది’ అని గ్యుటెరస్ పేర్కొన్నారు. అవార్డును మోదీకి ప్రదానం చేయడంతో ఆయనకు తగిన గుర్తింపు దక్కిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. -
చైనాకు అమెరికా టెక్ దిగ్గజం సాయం
బీజింగ్ : ఓ వైపు అమెరికాకు, చైనాకు మధ్య ట్రేడ్ వార్ పరిస్థితులు ఉద్రిక్తమవుతే, మరోవైపు అమెరికా టెక్ దిగ్గజాలు చైనాకు సాయం చేస్తున్నాయి. తాజాగా ఆపిల్, చైనాలో 300 మిలియన్ డాలర్ల(రూ.2,054 కోట్ల) క్లీన్ ఎనర్జీ ఫండ్ను లాంచ్చేసింది. ఆ దేశంలో 10 లక్షల గృహాలకు విద్యుత్ అందించే లక్ష్యంతో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులలో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఆపిల్ ప్రకటించింది. చైనా ప్రభుత్వం ప్రస్తుతం కాలుష్యం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్య పొగను తగ్గించాలని, దేశం జలమార్గాలను, కలుషిత మట్టిని శుభ్రం చేయాలని స్థానిక, అంతర్జాతీయ కంపెనీలను చైనా ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో కంపెనీలు సైతం ఈ మేరకు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. పెగాట్రోన్ కార్ప్, విస్ట్రోన్ కార్ప్ వంటి 10 మంది సప్లయిర్స్తో కలిసి, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల్లో ఈ మొత్తాన్ని ఐఫోన్ తయారీదారి పెట్టుబడిగా పెడుతోంది. కాగ, అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్, బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై దెబ్బకు దెబ్బ మాదిరి టారిఫ్ల మోత ప్రపంచంలో ఈ రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు ప్రతికూలంగా మారాయి. ఇరు దేశాలు ప్రశాంతంగా ఉండాలని ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ పిలుపు కూడా ఇచ్చారు. ఆపిల్ సంస్థ తన ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం చైనాకే సరఫరా చేస్తుంది. ఆపిల్కు అత్యంత కీలకమైన మార్కెట్లలో చైనా కూడా ఒకటి. అయితే ఇటీవల స్థానిక స్మార్ట్ఫోన్ ప్రత్యర్థుల నుంచి ఆపిల్కు పెద్ద ఎత్తున్నే సవాళ్లు ఎదురవుతున్నాయి. -
దీవుల అభివృద్ధిపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలోని 26 దీవుల సమగ్రాభివృద్ధికి చేపట్టిన పనుల పురోగతిని ప్రధాన మంత్రి మోదీ సమీక్షించారు. శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన దీవుల్లో చేపట్టిన కీలక మౌలిక ప్రాజెక్టులు, డిజిటల్ కనెక్టివిటీ, గ్రీన్ ఎనర్జీ, సముద్ర జలాలను మంచి నీరుగా మార్చే ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాలు, మత్స్య పరిశ్రమ, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ప్రాజెక్టులు ఏ దశల్లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో సమీకృత పర్యాటక–కేంద్రీకృత పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. దీవుల్లో సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధంగా తయారుచేయాలన్నారు. -
హరిత ఇంధనం.. అసలు లక్ష్యం
-
హరిత ఇంధనం.. అసలు లక్ష్యం
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారుల సమావేశంలో సీఎం ఇందుకోసం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని వెల్లడి విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు హరిత ఇంధనం(గ్రీన్ ఎనర్జీ) సాధన దిశగా సౌర, పవన విద్యుత్ రంగాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇందుకోసం ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల స్థాపనను గణనీయంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులు, డెవలపర్ల ప్రత్యేక సమావేశం గురువారమిక్కడ జరిగింది. ఏపీ నెడ్క్యాప్, జెన్కో, ట్రాన్స్కోలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ భేటీకి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 250 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ.. విద్యుత్రంగ పురోభివృద్ధికి సంస్కరణలు అవసరమన్నారు. ఒకప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ లోటును పరిష్కరించుకోగలిగామన్నారు.గ్రీన్ ఎనర్జీ సాధనలో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఒక 400 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. 2018-19 నాటికి రాష్ట్రంలో మరో 10 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి లక్ష్యమని సీఎం చెప్పారు. సౌర, పవన, మినీ హైడల్, సాలిడ్వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, బయోమాస్ పద్ధతుల్లో దీన్ని ఉత్పత్తి చేసేందుకు లక్ష్యం నిర్ణయించామన్నారు. సౌర విద్యుత్పై శాస్త్రీయమైన అవగాహన పెంచేందుకు కొత్త రాజధాని అమరావతి పరిధిలో సౌర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సీఎం చెప్పారు.వర్సిటీ ఏర్పాటుకు సుజలాం ఎనర్జీ, హీరో గ్రూప్లు తమ వంతుగా రూ.35 కోట్లు, ఏపీ జెన్కో, ట్రాన్స్కో, నెడ్క్యాప్లు మరో రూ.50 కోట్ల భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. మరో రూ.80 కోట్లు మంజూరు చేయాలని సీఎం కేంద్ర ఇంధన వనరులశాఖ (ఎంఎన్ఆర్ఈ) సంయుక్త కార్యదర్శి వర్షాజోషిని కోరారు. రూ.19 వేల కోట్ల పెట్టుబడులపై నెడ్క్యాప్తో ఎంవోయూ ఈ సందర్భంగా సౌర, పవన విద్యుత్ రంగాల్లో పేరు గడించిన పలు కంపెనీలు రూ.19 వేల కోట్ల పెట్టుబడులతో కొత్త యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు సీఎం చంద్రబాబు సమక్షంలో నెడ్క్యాప్ ఎండీ కమలాకరబాబుతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. జపాన్కు చె ందిన సాఫ్ట్బ్యాంక్ సలార్ సర్వీసెస్ కంపెనీ, స్పెయిన్కు చెందిన ఆక్సియానా ఎనర్జియా, సుజలాం ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీలతోపాటు మరో రెండు సంస్థలు ఎంవోయూ చేసుకున్న వాటిలో ఉన్నాయి. రాష్ట్రానికి మరో 10 వేల సౌర పంపుసెట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఇంధన వనరులశాఖ(ఎంఎన్ఆర్ఈ) సంయుక్త కార్యదర్శి వర్షాజోషి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం.. నైపుణ్యాభివృద్ధి పోస్టర్, వీడియో ఫిల్మ్లను ఆవిష్కరించారు. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి లబ్దిదారుల నుంచి వసూలు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి వాటికైన ఖర్చును లబ్ధిదారుల నుంచి వసూలుచేసే విధానం ఉండాలని, అందుకనుగుణంగా హౌసింగ్ పాలసీలో మార్పులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్, చైనా, హాంకాంగ్ తరహాలో ఆటస్థలాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులతో కూడిన టౌన్షిప్లను నిర్మిద్దామన్నారు. సీఎం గురువారమిక్కడ తన నివాసంలో గృహనిర్మాణశాఖపై సమీక్షించి ఈ ప్రతిపాదన తెచ్చారు. తెలుగు సంఘాలకు ఆహ్వానం రాజధాని నిర్మాణానికి జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రావాలంటూ జాతీయ, అంతర్జాతీయ తెలుగు సంఘాలకు ఆహ్వాన పత్రాలు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నేతలతో సీఎం చంద్రబాబు తన నివాసంలో నిర్వహించిన అంతరంగిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఏసీలు లేకున్నా... 24 గంటలూ ఫుల్ ఏసీ!
అదొక అధునాతన హాస్టల్ భవనం... బయటి నుంచి ఒక్క యూనిట్ విద్యుత్తూ అందదు... కానీ వెలుగుజిలుగులకేం తీసిపోదు! ఏసీలు, కూలర్లు అసలే ఉండవు... అయినా ఫుల్ ఎయిర్ కండీషన్డ్! కాలం ఏదైనా బేఫికర్... కరెంటు పోతుందన్న భయమే లేదు! ఖర్చు పెరుగుతుందన్న బెంగ అసలే లేదు! ఎలా? ఎక్కడ? తెలుసుకుందాం... విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది? నీరు, బొగ్గు, గ్యాస్, గాలి, సూర్యరశ్మితో, ఇంకా పలు రకాలుగా. వీటిలో బొగ్గు, గ్యాస్ వంటి సహజ వనరులు ఇంకా ఎంతకాలమని ఊరుతాయి? ఏదోనాటికి తప్పకుండా అయిపోతాయి. అవి అయిపోవడమే కాదు.. ఓజోన్ పొరకు చిల్లు కూడా భారీగానే పడుతుంది. విలువైన నీరు కూడా వృథా అవుతుంటే మానవాళి దాహార్తితో అలమటించి చావాల్సిందే. మరి అప్పుడెలా? ఆ పరిస్థితి రాకముందే ఏం చేయాలి? అందుకు నిలువెత్తు సమాధానమే ‘రిట్రీట్’ హాస్టల్ భవనం. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో గల గ్వాల్ పహాడీ వద్ద దీనిని ‘ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరీ)’ నిర్మించింది. సూర్యర శ్మి, గాలి వంటి ఎప్పటికీ తరగని సుస్థిర వనరులను, వ్యర్థాలనే ఉపయోగించుకుని ఆధునిక టెక్నాలజీలకు దీటుగా అనేక సౌకర్యాలను పొందడంపై పరిశోధనలు నిర్వహించే ఈ సంస్థ తన లక్ష్యాలకు అనుగుణంగా సహజ ఎయిర్ కండీషనింగ్కి మార్గం చూపుతూ ఈ రిట్రీట్ని నిర్మించింది. నేచురల్ ఏసీ ఇలా..! రిట్రీట్ను సహజసిద్ధంగా చల్లగా ఉంచేందుకు ప్రత్యేక అండర్గ్రౌండ్ ఎర్త్ టన్నెల్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భవనం వెలుపల ఓ టవర్ నిర్మించారు. దాని కిటికీల గుండా వాతావరణంలోని గాలి టవర్లోకి ప్రవేశిస్తుంది. టవర్ నుంచి కింద భూమిలో 4 మీటర్ల లోతులో నిర్మించిన 70 మీటర్ల పొడవాటి సన్నటి టన్నెల్ గుండా గాలి ప్రయాణిస్తుంది. అక్కడ చిన్న మోటార్ల సాయంతో గాలి పైకి ఏర్పాటు చేసిన గొట్టాల్లోకి, అక్కడి నుంచి నేరుగా చిన్న రంధ్రాల ద్వారా వివిధ గదుల్లోకి వెళుతుంది. టన్నెల్ భూమిలో 4 మీటర్ల లోతులో ఉండటం వల్ల అందులో ఉష్ణోగ్రత ఎప్పుడూ దాదాపుగా స్థిరంగా ఉంటుంది. ఏడాది పొడవునా 22 నుంచి 26 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. దాంతో గాలి కూడా చల్లబడి నివాస గదుల్లోకి వస్తుంది. తర్వాత నివాస గదుల్లో వేడెక్కిన గాలి వె ళ్లేందుకు వెంటిలేటర్ల మాదిరిగా ప్రత్యేక గొట్టాలతో కూడిన మార్గం భవనం పై వరకూ ఉంటుంది. దాంతో వేడి గాలి భవనంపై నుంచి వెళ్లిపోవడం, గదిలోకి తిరిగి భవనం కింది నుంచి చల్లని గాలి రావడం జరుగుతుంది. ఇంకేం.. ఏసీలు, కూలర్లు లేకుండానే వాటికి దీటుగా గది అంతా ఫుల్ ఎయిర్ కండీషన్డ్ అయిపోతుంది. అయితే సహజ ఏసీ వ్యవస్థ వల్ల భవనంలో శీతాకాలంలో 20 డిగ్రీలు, ఎండాకాలంలో 28 డిగ్రీలు, వానాకాలంలో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకూ ఉండవచ్చు. అవసరాన్ని బట్టి.. గాలిలో తేమను, వేడిని తగ్గించే ఎల్పీజీ, అమ్మోనియా ‘చిల్లర్స్’ పరికరాలను కాసేపు ఉపయోగించుకుంటే సరి.. ఏడాదంతా చౌకగానే ఏసీ అన్నమాట. ప్రకృతి వనరులతో... ‘సుస్థిర’ భవనం! తొమ్మిదేళ్ల క్రితం వరకూ ఎందుకూ పనికిరాని బంజరు భూమి అది. కానీ రిట్రీట్ నిర్మాణంతో ప్రస్తుతం సుస్థిర వనరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలియచెప్పేందుకు వేదికగా మారింది. పరిసరాల్లో ప్రత్యేకంగా చెట్ల పెంపకం వల్ల, అండర్గ్రౌండ్ ఎయిర్టన్నెల్స్ వల్ల దాదాపు బిల్డింగ్ అంతా చల్లగా ఉంటుంది. ఆకురాలే చెట్లు నాటడం వల్ల వేసవిలో పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. శీతాకాలంలో ఆ చెట్ల ఆకులు రాలిపోవడంతో కాస్త వెచ్చగా కూడా ఉంటుంది. ఇక విద్యుత్తు అవసరాలన్నీ పైకప్పుపై ఏర్పాటుచేసే ఫొటోవోల్టాయిక్ ప్యానెల్స్ ఒడిసిపట్టే సౌరవిద్యుత్ ద్వారానే తీరతాయి. వీటికి అదనంగా వంటచెరుకు, పంటల వ్యర్థాలను కాల్చి, వెలువడే వాయువులతో విద్యుత్ను తయారుచేసే గ్యాసిఫైర్ హైబ్రీడ్ ఎలక్ట్రిసిటీ ప్లాంటు కూడా ఉంది. ఒక్క సోలార్ ప్యానెల్స్తోనే 10 కిలోవాట్ల వరకూ విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. పగలు ఉత్పత్తి చేసిన విద్యుత్ను నిల్వ చేసి రాత్రికి ఉపయోగించుకోవచ్చు. పైకప్పుపై నుంచి నేరుగా సూర్యరశ్మి గదుల్లోకి పడేలా ప్రత్యేక స్కైలైట్స్ ఉంటాయి కాబట్టి... పగలంతా లైట్ల అవసరమే ఉండదు. దీంతోపాటు తక్కువ విద్యుత్ కాలే బల్బులు, ఆటోమేటిక్ వ్యవస్థ కూడా ఉంటుంది. మురుగు నీరూ.. ఉపయోగమే హాస్టల్ గదుల నుంచి విడుదలయ్యే మురుగునీరంతా తొలుత ఓ ట్యాంకులోకి చేరుతుంది. అక్కడ ఘనవ్యర్థాలన్నీ ట్యాంకు అడుగున చేరి నీరు మాత్రమే ముందుకు ప్రవహిస్తుంది. ఘనవ్యర్థాలను సూక్ష్మజీవులు కుళ్లబెట్టి విచ్ఛిన్నం చేస్తాయి. తర్వాత మిగిలే మురికి నీటిని ప్రత్యేకంగా రెల్లుగడ్డి మడిలోకి పంపుతారు. ఇంకేం.. గడ్డివేళ్లను, మట్టిని దాటుకుని అవతలికి చేరేసరికి నీరు దాదాపుగా శుభ్రమైపోతుంది. ఈ నీటిని తాగడానికి పనికిరాకున్నా.. సాగునీటిగా, ఇతర అవసరాలకు మాత్రం ఉపయోగించవచ్చు. నేలలో నీటి శాతమూ పెరుగుతుంది. మానవ వ్యర్థాలతో బయోమీథేన్ కూడా తయారుచేసి వాహనాలకు ఇంధనంగానూ వాడవచ్చు. - హన్మిరెడ్డి యెద్దుల రిట్రీట్ అంటే.. తిరోగమనం! సైనిక పరిభాషలో రిట్రీట్ అంటే వెనక్కి తగ్గడం. ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినప్పుడు లేదా ఓడిపోయినప్పుడు రక్షించుకోవడం కోసం వెన్నుచూపడం. ఇప్పుడు మనిషికి కావల్సింది కూడా తిరోగమనమే. పునరుద్ధరింపలేని సహజ వనరుల విచ్చలవిడి వినియోగం నుంచి వెనక్కి మళ్లి ఎన్నటికీ తరిగిపోని సుస్థిర ఇంధన వనరుల వైపు సాగాల్సిన సమయమిది. అందుకే ఈ సంగతిని తెలియజెప్పేందుకే దీనికి రిట్రీట్ అన్న పేరు పెట్టారన్నమాట. ఇలాంటి పద్ధతులపైనే దృష్టిపెట్టాలి... సౌరశక్తి వినియోగంలో భారత్ నెంబర్ వన్ కావాలి. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యాలను తగ్గించేలా ప్రస్తుతం మెరుగుపర్చాలి. తర్వాత దశలవారీగా వాటిని మూసేయాలి. ప్రతి విషయంలోనూ పాశ్చాత్య విధానాలను అనుసరించకుండా భారతీయులు ఇలాంటి పద్ధతులపై దృష్టిపెట్టాలి. అప్పుడే జల వనరులను కాలుష్యమయం చేయకుండా, అడవులను నాశనం చేయకుండానే దేశం అభివృద్ధి సాధిస్తుంది. - ‘టెరీ’ డీజీ రాజేంద్ర కుమార్ పచౌరీ (2007లో నోబెల్ శాంతి బహుమతి పొందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)కి చైర్మన్గా కూడా ఉన్నారు) ఇవీ ప్రత్యేకతలు... సాధారణ నిర్మాణ వ్యయం కంటే 25% అదనంగా ఖర్చు అయినా.. ఇతర భవనాల ఇంధనం ఖర్చుల్లో 50% వరకూ ఆదా అవుతుంది. 24 సోలార్ వాటర్ హీటింగ్ ప్యానెళ్ల ద్వారా రోజూ 2 వేల లీటర్ల నీరు వేడి చేసుకోవచ్చు. రిట్రీట్ లాంటి ఓ భవనానికి వెలుగులు పంచాలంటే సుమారు 28 కిలోవాట్ల విద్యుత్ అవుతుంది. కానీ ప్రస్తుతం రిట్రీట్కు 10 కిలోవాట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతోందట. ఈ పద్ధతి వల్ల పెట్రోలియం, ఇతర వనరుల దిగుమతి తగ్గుతుంది కాబట్టి.. మారకద్రవ్యం రూపేణా విదేశాలకు భారీగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పుతుంది. రిట్రీట్లో ఏర్పాటు చేసుకున్న పర్యావరణ అనుకూల పద్ధతుల వ ల్ల ఏటా వాతావరణంలోకి ఎంత మేరకు సీవోటూ ఉద్గారాలు తగ్గుతాయో తెలుసా? అక్షరాలా 570 టన్నులు!