Huawei
-
ప్రపంచంలో తొలి ట్రై–ఫోల్డ్ ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి చైనా దిగ్గజం హువావే తెరలేపింది. మేట్ ఎక్స్టీ పేరుతో ప్రపంచంలో తొలి ట్రై–ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. రెండు దశల్లో ఫోల్డ్ చేసేలా 3కే రిజొల్యూషన్, ఓఎల్ఈడీ స్క్రీన్తో ఇది రూపుదిద్దుకుంది. పూర్తిగా ఫోల్డ్ చేస్తే 6.4 అంగుళాల స్మార్ట్ ఫోన్గా వాడుకోవచ్చు. కొంత భాగం ఓపెన్ చేస్తే 7.9 అంగుళాలు, పూర్తిగా తెరిస్తే 10.2 అంగుళాల ట్యాబ్లెట్ పీసీ మాదిరి సింగిల్ స్క్రీన్గా మారిపోతుంది. 27 లక్షల పైచిలుకు యూనిట్లకు ప్రీ ఆర్డర్లు ఉన్నాయి.ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లకు ప్రైమరీ స్క్రీన్, కవర్ డిస్ప్లే మాత్రమే ఉన్నాయి. ట్రై–ఫోల్డ్ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 2.35 లక్షలు. ప్రస్తుతానికి చైనాకే పరిమితం. సెపె్టంబర్ 20 నుంచి కస్టమర్ల చేతుల్లోకి రానుంది. బరువు 298 గ్రాములు. పూర్తిగా ఫోల్డ్ చేసినప్పుడు 3.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. 16 జీబీ ర్యామ్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 ఎంపీ టెలిఫోటో లెన్స్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. -
చైనా కంపెనీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా చిప్ల తయారీ!
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. యూఎస్లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్లిస్ట్లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి.. -
సంచలనం..భారత్కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే భారత్కు గుడ్ బై చెప్పింది. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలపై కేంద్రం కఠిన వైఖరిని ప్రదర్శిస్తుంది. ఈ తరుణంలో హువావే సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ఫోన్ కార్యకాలాపాల్ని భారత్లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..మా కంపెనీ అన్నీ నిబంధనలకు లోబడే స్థానిక భాగస్వాములతో కలిసి భారత్లో కార్యకాలాపాల్ని నిర్వహిస్తుంది. కానీ స్పష్టమైన కారణాల్ని హైలెట్ చేస్తూ భారత్లో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు హానర్ సీఈఓ ఝావో మింగ్ తెలిపారు. కానీ ఆ స్పష్టమైన కారణలు ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈడీ దెబ్బ.. హువావే అబ్బా ఇటీవల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో, ఒప్పో, షావోమీలపై దాడులు, దర్యాప్తులు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో హువావే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అమెరికాలో సైతం 2018లో హానర్ భారత్లో ౩ శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అదే సమయంలో హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తరువాత అక్కడ సైతం మార్కెట్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ అమెరికాలో వ్యాపారాన్ని నిర్వహించేందుకు కష్టంగా మారింది. అందుకే హువావే గతేడాది నవంబర్లో తన హానర్ స్మార్ట్ఫోన్కు చెందిన ఆస్తుల్ని చైనాకు చెందిన షెన్జెన్ జిక్సిన్ న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అమ్మేసింది. -
టెస్లా కంటే తోపు కారును లాంచ్ చేసిన హువావే..! ఏకంగా 1000కిమీ మేర..
Huawei Unveils Aito M5 Hybrid Car Claims It Is Better Than Tesla Model Y: అమెరికన్ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ టెస్లాకు ధీటైన ఎలక్ట్రిక్ కారును ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. టెస్లానే కాకుండా దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల సంస్థలకు పోటీగా నిలుస్తోందని హువావే ప్రకటించింది. హువావే ఐటో ఎమ్5 ఇటీవల చైనీస్ కంపెనీ హువావే అనేక దేశాల్లో ప్రతికూలతలు ఎదురైనాయి. అమెరికా లాంటి దేశాలు హువావేపై నిషేధాన్ని విధించాయి. ప్రస్తుతం హువావే ఆవిష్కరించిన ‘ఐటో ఎమ్5’ కారుతో ఆయా దేశాల్లో పునరాగమనం చేసేందుకు ప్రయత్నాలను చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐటో ఎమ్5 కారును హువావే ప్రదర్శించింది. ఇక్కడ ఈ కారు ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక హైబ్రిడ్ కారు. విద్యుత్, ఇంధనంతో నడిచేలా ఐటో ఎమ్5ను హువావే ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్ల పరంగా ఈ వాహనం టెస్లా మోడల్ వైని అధిగమించగలదని కంపెనీ పేర్కొంది. ఈ కారులో హువావే రూపొందించిన ఆపరేటింగ్ సిస్టమ్ హర్మోని ఒఎస్తో పనిచేయనుంది. ఈ కారులో డబుల్ లేయర్డ్ సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఉన్నట్లు తెలుస్తోంది. 200కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో సుమారు 1000 కిమీ మేర ప్రయాణిస్తోందని హువావే పేర్కొంది. ఇది ఒక హైబ్రిడ్ కారు కావున ఒకవేళ ఛార్జింగ్ జీరో అయినా కూడా నిర్విరామంగా ప్రయాణం కొనసాగించవచ్చును. ఐటో ఎమ్5 ధర ఎంతంటే..! ఈ కారు విద్యుత్, ఇంధనం రెండింటితోనూ నడుస్తోంది. ఐటో ఎమ్5 ధర 250,000 యువాన్ (సుమారు రూ. 29,45,915)గా ఉంది. కాగా టెస్లా వై మోడల్ ధర 280,752 యువాన్ (సుమారు రూ. 33,07,887)గా ఉంది. అంటే హువావే ఆవిష్కరించిన కారు టెస్లా వై మోడల్ కంటే తక్కువ ధరలో లభించనుంది. చైనీస్ న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరి 20, 2022 నాటికి కస్టమర్లకు కారును డెలివరీ చేయడం ప్రారంభిస్తామని హువావే ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..! -
పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన హువావే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం హువావే పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. హువావే లాంచ్ చేసిన మొదటి క్లామ్షెల్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్గా హువావే పీ50 పాకెట్ నిలవనుంది. ఈ ఫోన్ సాధారణ ఫ్లిప్ ఫోన్లాగా ఉండనుంది. హువావే పీ50 పాకెట్ తొలుత చైనా మార్కెట్లలో లభించనుంది. వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా లభించనుంది. క్రిస్టల్ వైట్ , అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రీమియం ఎడిషన్ను డచ్కు చెందిన ప్రముఖ డిజైనర్ ఐరిస్ వాన్ హెర్పెర్తో హువావే జతకట్టింది. 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్; ప్రీమియం ఎడిషన్ 12జీబీ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో రానుంది. హువావే పీ50 పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ధర దాదాపు రూ. 1.06 లక్షల నుంచి ప్రారంభం కానుంది. హువావే పీ50 పాకెట్ ఫీచర్స్..! 6.9-అంగుళాల ప్రైమరీ OLED డిస్ప్లే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ హర్మోని ఆపరేటింగ్ సిస్టమ్ 40ఎంపీ+ 13ఎంపీ + 32ఎంపీ రియర్ కెమెరా 10.7ఎంపీ ఫ్రంట్ కెమెరా 8జీబీ ర్యామ్+ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4000mAh బ్యాటరీ కెపాసిటీ 40W ఫాస్ట్ ఛార్జింగ్ చదవండి: షిప్మెంట్లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే! -
అదిరిపోయిన ఎలక్ట్రిక్ కారు.. 700 కి.మీ రేంజ్, ధర కూడా తక్కువే!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఈవీ వాహన ధరలు తగ్గడం వల్లే అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో పోటీ తారస్థాయికి చేరుకుంది. చాలా కంపెనీలు తక్కువ ధరకే ఎక్కువ దూరం వెళ్లే కార్లు, స్కూటర్లు, బైకులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. 700 కి.మీ రేంజ్ చాలా ఎలక్ట్రిక్ కార్లు కంపెనీలు ఎక్కువగా కిమీ రేంజ్ మీద దృష్టి సారిస్తున్నాయి. థర్మల్ మేనేజ్ మెంట్, కొత్త బ్యాటరీ టెక్నాలజీల సహాయంతో మార్కెట్లోకి కార్లను తీసుకొనివస్తున్నాయి. తాజాగా చైనాలో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎస్యువి కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే 700 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు అని కంపెనీ వాగ్దానం చేసింది. అవతార్ ఈ11(AVATR E11)గా పిలిచే ఈ ఎలక్ట్రిక్ ఎస్యువి కేవలం నాలుగు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అని సంస్థ పేర్కొంది. హువావే, క్యాటెల్, చంగన్ ఆటోమొబైల్స్ అనే మూడు కంపెనీల జాయింట్ వెంచర్ అయిన అవతార్ టెక్నాలజీ ఈ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. (చదవండి: Evaru Meelo Koteeswarulu: షోలో కోటి రూపాయలు గెలిచినా దక్కేది ఇంతేనా!) ఈ జాయింట్ వెంచర్ ద్వారా అభివృద్ధి చేసిన మొదటి హై ఎండ్ ప్యూర్ ఆల్ ఎలక్ట్రిక్ వేహికల్ ఇది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యువి కారు స్పోర్టీ డిజైన్ తో వస్తుంది. AVATR E11 ఎలక్ట్రిక్ ఎస్యువి పొడవు 4.8 మీటర్లు. ఈ కారును చైనా మార్కెట్లో 300,000 యువాన్ల ధరకు లాంఛ్ చేశారు. ఇది మన దేశంలో దాదాపు ₹35 లక్షలకు సమానం. ఈ ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యువిని వచ్చే ఏడాది మూడవ త్రైమాసికంలో డెలివరీ చేయలని చూస్తున్నారు. రాబోయే మరో మూడు సంవత్సరాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు తెలిపారు. మన దేశంలోకి ఎప్పుడు తీసుకొనివస్తారు అనే విషయం మీద స్పష్టత లేదు. (చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!) -
ఇక ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్
నవంబర్ 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో పాటు ఐఓఎస్ ఫోన్లలో ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్ ఫారం వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 వినియోగిస్తున్నట్లైతే యూజర్లు వెంటనే అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ తెలిపింది. అప్డేట్ చేయని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని స్పష్టం చేసింది. నవంబర్ 1,2021 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 ఉంటే వాట్సాప్ పనిచేయదని చెప్పింది. ఇక యాపిల్ విషయానికి వస్తే ఐఓఎస్ 9 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ గల స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న జాబితా: ఆపిల్: iPhone 6, iPhone 6s plus, iPhone SE ఎల్ జి: Lucid 2, Optimus F7, Optimus F5, Optimus L3 II, Dual Optimus L5, Best L5 II, Optimus L5, Dual Best L3 II, Optimus L7, Optimus L7, Dual Best L7 II, Optimus F6, Enact Optimus F3, Best L4 II, Best L2 II, Optimus Nitro HD, Optimus 4X HD and Optimus F3Q. హువావే: Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, and Ascend D2. శామ్ సంగ్: Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core and Galaxy Ace 2. జడ్ టీఈ: Grand S Flex, ZTE V956, Grand X Quad V987 and Grand Memo. సోనీ: Xperia Miro, Xperia Neo L, and Xperia Arc S. Alcatel, Archos 53 Platinum, HTC Desire 500, Caterpillar Cat B15, Wiko Cink Five, and Wiko Darknight, Lenovo A820 UMi X2, Run F1, THL W8 వంటి బ్రాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి -
లిప్స్టిక్ ఇయర్ బడ్స్ను చూశారా...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం హువావే యూరప్ మార్కెట్లలోకి కొత్త హువావే నోవా 9 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. స్మార్ట్ఫోన్తో పాటుగా సరికొత్త హువావే జీటీ3 స్మార్ట్వాచ్, ఫ్రీబడ్స్ లిప్స్టిక్ ఇయర్బడ్స్ను కూడా విడుదల చేసింది. హువావే జీటీ3 స్మార్ట్వాచ్ ఈ-సిమ్ సపోర్ట్ను పొందనుంది. యూరప్ మార్కెట్లలో హువావే జీటీ3 స్మార్ట్వాచ్ ధర సుమారు రూ. 21600గా ఉండనుంది. పలు స్ట్రాప్స్ ఆప్షన్స్తో హువావే జీటీ3 స్మార్ట్వాచ్ రానుంది. హువావే లాంచ్ చేసిన ఉత్పత్తుల్తో ఇయర్బడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇయర్బడ్స్ ఛార్జింగ్ కేస్ చూడటానికి లిప్స్టిక్ ఆకృతిలో ఉంది. మహిళ కొనుగోలుదారులను ఆకర్షించేందుకుగాను లిప్స్టిక్ షేప్లో హువావే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇయర్బడ్స్ ధర సుమారు రూ. 21000 వరకు ఉండనుంది. కాగా ఈ గాడ్జెట్స్ను భారత మార్కెట్లలోకి త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫేస్బుక్.. పేరు మార్చడం అంత ఈజీనా? మరి ఆ కంపెనీల సంగతి ఏంది? హువావే జీటీ3 స్మార్ట్వాచ్ ఫీచర్స్ 42మీ.మీ*46మీ.మీ డయల్ అమ్లోడ్ డిస్ప్లే విత్ అల్ట్రా కర్వ్డ్ 3డీ గ్లాస్ 32ఎమ్బీ ర్యామ్+4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 14 రోజులవరకు బ్యాటరీ బ్యాకప్ బ్లూటూత్, జీపీఎస్ టెంపరేచర్ సెన్సార్, ఆప్టికల్ హర్ట్ రేట్ రీడర్ హువావే ఫ్రీబడ్స్ లిప్స్టిక్ ఫీచర్స్.. ఆక్టివ్ నైక్ క్యాన్సిలేషన్ 22 గంటల మ్యూజిక్ ప్లే 410mAh బ్యాటరీ చదవండి: ఫేస్బుక్ నెత్తిన మరో పిడుగు..! -
ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్
ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ‘హువావే’ అంటారు. ఆల్ట్రా–కర్వ్డ్ స్క్రీన్, సైడ్–టచ్ ఫీచర్లుకు సంబంధించిన మోడల్ కోసం పేటెంట్ ఫైల్ చేసింది హువావే. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డింగ్ ఫోన్ని ఆకట్టుకునే ఫీచర్లు, డిజైన్తో రూపొందించారు. ఈ నేపథ్యంలో ‘హువావే’ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఆల్ట్రా–కర్వ్డ్ స్క్రీన్ ద్వారా ఎక్స్ట్రాస్క్రీన్ కలిసొస్తుంది. రకరకాల ఐకాన్ల కోసం, సింగిల్ లైన్ మెసేజ్లు చదువుకోవడం కోసం ఉపయోగపడుతుంది. -
షాకింగ్ సేల్స్ : కేవలం నిమిషంలోనే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు
స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ విడుదల చేసిన హానర్ 50, హానర్ 50 సిరీస్ స్మార్ట్ఫోన్లు కేవలం నిమిషంలోనే అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాల్ని హానర్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2జీ, 4జీ, ఇప్పుడు 5జీ విప్లవం మొదలైంది. దీంతో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీ పై దృష్టిసారించాయి. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేయగా తాజాగా హువాయే సబ్ బ్రాండ్ గా పేరొందిన హానర్ కంపెనీ చైనా కేంద్రంగా హానర్ 50, హానర్ 50ప్రో, హానర్ 50ఎస్ఈ ఫోన్లపై శుక్రవారం రోజు ఫ్రీ ఆర్డర్ను ప్రకటించింది. అలా ఆర్డర్ ప్రకటించింది లేదో కేవలం నిమిషం వ్యవధిలోనే హానర్ 50 సిరీస్ ఫోన్లు అమ్ముడయ్యాయి. చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్ని బట్టి డిస్కౌంట్ హానర్ 50ప్రో ఫీచర్స్ విషయానికొస్తే 6.72అంగుళాలు 120 హెచ్జెడ్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 12జీబీ ర్యామ్ తో 778జీ ప్రాసెసర్ 108 ఎంపీ - 8ఎంపీ-2ఎంపీ-2ఎంపీతో కెమెరా సెటప్ 32 ఎంపీ + 12ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా 4,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది 50ప్రో ధర : ఇండియన్ కరెన్సీలో రూ. 42,380గా ఉంది. హానర్ 50 ఫీచర్స్ అండ్ ప్రైస్ హానర్ 50 సైతం 120 హెచ్ రిఫ్రెష్ రేట్ తో 6.57 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 778జీ ఎస్ఓసీ 12జీబీ ర్యామ్ వేరియంట్ తో వస్తుంది క్వాడ్ రేర్ కెమెరా సెటప్ తో పాటు 108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీ సెన్సార్ను అందిస్తుంది 32ఎంపీ తో సింగిల్ సెల్ఫీ కెమెరా 4,300ఎంఏహెచ్ బ్యాటరీ తో రూ. 30,922కే అందిస్తుంది. హానర్ 50ఎస్ఈ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ హానర్ 50ఎస్ఈ 6.78 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ మీడియా టెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ నుంచి 128జీబీ వరకు స్టోరేజ్ 16 ఎంపీల సెల్ఫీ కెమెరా 108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీల రేర్ కెమెరా సెటప్ 4,300ఎంఏహెచ్ బ్యాటరీ తో రూ. 27,480కే అందిస్తుంది. -
Huwaie Driverless Car: హువాయ్ విప్లవాత్మక ప్రకటన
షెంజెన్: ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ హువాయ్ విప్లవాత్మక ప్రకటన చేసింది. వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఆపకుండా.. డ్రైవర్ లెస్ కార్ల టెక్నాలజీకి శరవేగంగా పావులు కదుపుతోంది. 2025 నాటికల్లా డ్రైవర్లెస్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు కంపెనీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, చైనీస్ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం హువాయ్ టెక్నాలజీస్ ఆటోమోటివ్ స్పేస్లో అడుగుపెట్టబోతున్నట్లు కొంతకాలంగా మీడియాకు హింట్ అందుతూనే వస్తోంది. అయితే ఏకంగా డ్రైవర్లెస్ కార్లను తయారు చేస్తామనే ప్రకటనతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చోంగ్క్వింగ్ ఛాంగన్ ఆటోమొబైల్ కో లిమిటెడ్తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ఎలక్ట్రానిక్ వెహికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రెండు కంపెనీలతో హువాయ్ కంపెనీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీగా పేరున్న హువాయ్.. స్మార్ట్ఫోన్ల అమ్మకం ద్వారా హవా చాటేది. అయితే ట్రంప్ హయాంలో ఆంక్షలు, ప్రత్యేకించి హువాయ్తో అమెరికా వర్తకానికి పెనుముప్పు ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో హువాయ్ దూకుడు మొదలుపెట్టింది. ఇక హువాయ్తో పాటు జియోమి, ఒప్పో కూడా వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు యాపిల్ కూడా ఈ రంగం తీరుతెన్నులపై ఒక అంచనాకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: స్మార్ట్ వాచ్.. 54 శాతం భారీ తగ్గింపు -
గూగుల్ డ్యుయో సేవలు నిలిపివేత!
ప్రస్తుతం వీడియో కాలింగ్ కోసం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్లో గూగుల్ డ్యుయో యాప్ ఒకటి. ఇందులో ఒకేసారి 32 మందితో వీడియో కాల్ చేసి మాట్లాడుకొనే సౌకర్యం ఉంటుంది. తాజాగా గూగుల్ డ్యుయో సేవలు కొన్ని మొబైల్ ఫోన్ లలో నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. గూగుల్ చేత ధృవీకరణ చేయబడని కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్లే సర్వీసెస్ కోసం గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్లకు పరీక్షలు నిర్వహించి సర్టిఫై చేస్తుంది. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం సర్టిఫైడ్ చేసిన ఫోన్లు సురక్షితమైనవి, గూగుల్ ప్లే స్టోర్లో ఉండే యాప్ లు ఎటువంటి ఆటంకం లేకుండా ఇందులో పని చేస్తాయి.(చదవండి: వాట్సాప్ పై కేంద్రం ఆగ్రహం) ఒకవేళ గనుక గూగుల్ యాప్స్కు సంబంధించిన సర్టిఫికేట్ గూగుల్ ఇవ్వకుంటే వాటిలో ఈ యాప్స్ పనిచేయవు. గతంలో ఇలాగే కొన్ని మొబైల్ ఫోన్లలో గూగుల్ మెస్సేజెస్ సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు అదే తరహాలో త్వరలో గూగుల్ డ్యుయో సేవలు నిలిచపోనున్నాయి. గూగుల్ డ్యుయో సేవలు హువావే బ్రాండ్ల స్మార్ట్ఫోన్లలో నిలిచిపోనున్నట్లు సమాచారం. మిగతా నోకియా, శాంసంగ్, వన్ప్లస్, వివో, ఒప్పోతో పాటు ఇతర బ్రాండ్లలో ఈ యాప్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలుస్తోంది. ఈ సేవలు మార్చి 31 నుంచి నిలిచిపోనున్నట్లు సమాచారం. డేటా భద్రపర్చుకొండి మీరు డ్యుయో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ‘త్వరలో డ్యుయో ఆగిపోనుంది. ఎందుకంటే మీరు గూగుల్ ధృవీకరించని డివైజ్ ఉపయోగిస్తున్నారు. మీ ఖాతాను ఈ డివైజ్ నుంచి తొలగించడం జరుగుతుంది’ అనే మెస్సేజ్ పని చేయని ఫోన్లలో వస్తుంది. ఒకవేళ కనుక ఈ మెసేజ్ వస్తే వెంటనే మీరు మీ పూర్తీ డేటాను సేవ్ చేసుకొని వేరొక చోట భద్రపర్చుకోవడం మంచిది. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, జూమ్, జియోమీట్, స్నాప్ఛాట్ వంటి వాటిని వాడుకోవచ్చు. -
మార్కెట్లోకి హువావే 5జీ మొబైల్స్
చైనా: ప్రముఖ టెక్ కంపెనీ హువావే నోవా 8 ప్రో, హువావే నోవా 8 స్మార్ట్ఫోన్లను చైనాలో విడుదల చేసింది. ఈ రెండు 5జీ స్మార్ట్ఫోన్లు 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తాయి. ఈ ఫోన్లు కీరిన్ 985 ప్రాసెసర్ చేత పనిచేస్తాయి. హువావే నోవా 8లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.5-అంగుళాల పూర్తి-హెచ్డి + డిస్ప్లే ఉంది. మరోవైపు, హువావే నోవా 8 ప్రో 6.72-అంగుళాల డిస్ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. లాంచ్కి ముందు చైనా టెలికాం సైట్లో హువావే నోవా 8 యొక్క ఫీచర్స్ లీక్ అయ్యాయి.(చదవండి: లీకైన వన్ప్లస్ 9 సిరీస్ ఫీచర్స్, ధర) హువావే నోవా 8 ప్రో స్పెసిఫికేషన్లు హువావే నోవా 8 ప్రో హార్డ్వేర్ ఫ్రంట్లోని నోవా 8తో సమానంగా ఉంటుంది. కానీ డిస్ప్లే, బ్యాటరీ మరియు ఫ్రంట్ కెమెరాలో తేడాలు ఉన్నాయి. డ్యూయల్ సిమ్ (నానో) హువావే నోవా 8 ప్రో 6.72-అంగుళాల పూర్తి-హెచ్డి + ఒఎల్ఇడి డిస్ప్లే (1,236x2,676 పిక్సెల్స్) తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్10 ఆధారిత ఈఎంయుఐ 11తో నడుస్తుంది. 5జీ హ్యాండ్సెట్లో హిసిలికాన్ ఆక్టా-కోర్ కిరిన్ 985 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. హువావే నోవా 8 ప్రోలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్తో 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెటప్ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం రెండు కెమెరాలు ఉన్నాయి. ఒకటి అల్ట్రా-వైడ్ లెన్స్తో 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి 16 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా. హువావే నోవా 8ప్రో 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2, యుఎస్బి టైప్-సి పోర్ట్, ఎన్ఎఫ్సి ఉన్నాయి. ఇది 184 గ్రాముల బరువు ఉంటుంది. ధర సుమారు రూ.49,600. హువావే నోవా 8 ఫీచర్స్: డిస్ప్లే: 6.57 అంగుళాలు ప్రాసెసర్: హిసిలికాన్ కిరిన్ 985 ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సల్ రియర్ కెమెరా: 64+8+2+2 మెగా పిక్సల్ ర్యామ్: 8జీబీ స్టోరేజ్: 128జీబీ బ్యాటరీ కెపాసిటీ: 3800ఎంఏహెచ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 ధర: రూ.37,200 -
శాంసంగ్ను దాటిన హువావే
లండన్: స్మార్ట్ఫోన్స్ విక్రయాల్లో ప్రపంచ టాప్ సెల్లర్గా హువావే నిలిచినట్టు పరిశోధన సంస్థ కెనలిస్ వెల్లడించింది. శాంసంగ్ను వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) హువావే 5.58 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు కెనలిస్ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5 శాతం తగ్గుదల. శాంసంగ్ విషయానికి వస్తే క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30 శాతం అమ్మకాలు తగ్గి 5.37 కోట్ల యూనిట్లు నమోదైంది. హువావేకు కోవిడ్–19 కలిసి వచ్చిందని కెనలిస్ తెలిపింది. చైనాలో ఈ కంపెనీ అమ్మకాలు గడిచిన త్రైమాసికంలో 8 శాతం వృద్ధి చెందాయి. కంపెనీ మొత్తం విక్రయాల్లో చైనా వాటా 70 శాతముంది. చైనా రికవరీ హువావేకు కలిసి వచ్చింది. శాంసంగ్కు యూఎస్, యూరప్, బ్రెజిల్, భారత్ ప్రధాన మార్కెట్లు. చైనా నుంచి సమకూరుతుంది తక్కువే. -
హార్ట్ బీట్ను పసిగట్టే స్మార్ట్వాచ్
సాక్షి, ముంబై: చైనా మొబైల్స్ తయారీదారు హువావే కొత్త స్మార్ట్వాచ్ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జీటీ 2 స్మార్ట్వాచ్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జీటీ 2 వాచ్ 42 ఎంఎం వేరియంట్ లభ్యత వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే 46 ఎంఎం వేరియంట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇతర రిటైల్ దుకాణాలతో సహా ఇ-కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. జీటీ2 స్మార్ట్వాచ్ ఫీచర్లు 1.2 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్ప్లే, రౌండ్ డయల్ హువావే కిరిన్ ఎ1 చిప్, 3డీ గ్లాస్, బ్లూటూత్ 5.1 వాటర్ రెసిస్టెన్స్, జీపీఎస్ ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్, బ్లూటూత్ కాలింగ్ ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, 15 వర్కవుట్ మోడ్స్, ధరలు 46 ఎంఎం స్పోర్ట్ (బ్లాక్) రూ.15,990, లెదర్ స్ట్రాప్ మోడల్ రూ.17,990, మెటల్ స్ట్రాప్ రూ.21,990. 42 ఎంఎం వేరియంట్ ప్రారంభ ధర రూ. 14,990 డిసెంబర్ 12 - 18 వరకు వినియోగదారులు ప్రీ బుక్ చేసుకోవచ్చు. అలాగే ముందస్తు బుకింగ్లో మొత్తం నగదు చెల్లించిన వారికి 6999 రూపాయల విలువైన హువావే ఫ్రీలేస్ ఉచితంగా అందిస్తామని కంపెనీ తెలిపింది. దీంతోపాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభ్యం. 19 వ తేదీ అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 31 వరకు మొదటి సేల్కు అందుబాటులో వుంటుంది. హువావే మినిస్పీకర్ (రూ .2,999) గెలుచుకునే అవకాశం కూడా వుంది. 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వుంటుందని కంపెనీ తెలిపింది.అంతేకాదు తమ స్మార్ట్వాచ్ వినియోగదారుని హార్ట్ బీట్ను మానిటర్ చేస్తుందని, హృదయ స్పందన రేటు 100 బిపిఎమ్ కంటే ఎక్కువ లేదా 50 బిపిఎమ్ కంటే తక్కువ 10 నిమిషాలకు మించి ఉంటే వినియోగదారుడిని అలర్ట్ చేస్తుందని, స్విమ్మింగ్ చేస్తున్నపుడు కూడా ఈ వాచ్ పనిచేస్తుందని హువావే వెల్లడించింది. -
హువావే ‘మీడియాపాడ్ ఎం5 లైట్’ ట్యాబ్లెట్ విడుదల
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ డివైజెస్ తయారీ సంస్థ హువావే.. తాజాగా ‘మీడియాపాడ్ ఎం5 లైట్’ పేరుతో ట్యాబ్లెట్ను ఇక్కడి మార్కెట్లో విడుదలచేసింది. కాలేజీకి వెళ్ళేవారు, పని నిపుణులు, కళాకారులు, పిల్లలకు సరిపోయే విధంగా దీనిని డిజైన్ చేసినట్లు ప్రకటించింది. భారత్లో ఈ డివైజ్ ధర రూ. 21,990 వద్ద నిర్ణయించింది. శక్తివంతమైన 8–కోర్ ప్రాసెసర్, 10.1 అంగుళాల డిస్ప్లే, 7,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో స్పెసిఫికేషన్లుగా వెల్లడించింది. నూతన ట్యాబ్ సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ వెబ్ సైట్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ‘5జీ’ ట్రయల్స్కు అనుమతి దక్కేనా..! భారత్లో 5జీ ట్రయల్స్కు హువావే ఆసక్తిని వెల్లడించగా.. జాతి ప్రయోజనాల ఆధారంగా ఈ అంశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నామని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ అన్నారు. ఇందుకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. 4 నెలల్లో స్పెక్ట్రమ్ వేలం ఉండనుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
హువావే ‘మేట్ 30’ ఆవిష్కరణ
మ్యూనిక్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ తన అధునాతన ‘మేట్ 30’ సిరీస్ స్మార్ట్ఫోన్ సిరీస్ను గురువారం ఆవిష్కరించింది. ‘మేట్ 30’, ‘మేట్ 30 ప్రో’ పేరిట తొలి సెకండ్ జనరేషన్ ‘5జీ’ స్మార్ట్ఫోన్లను పరిచయంచేసింది. వీటిలో గూగుల్ లైసెన్స్ పొందిన యాప్స్ అయిన మ్యాప్స్, జీ మెయిల్, యూట్యూబ్ లేవని ప్రకటించింది. కిరిన్ 990 ప్రాసెసర్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మేట్ 30 స్మార్ట్ఫోన్.. 6.62 అంగుళాల డిస్ప్లే, 4200 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర 799 యూరోలుగా ప్రకటించింది. ‘మేట్ 30 ప్రో’ ధర 1,199 యూరోలుగా నిర్ణయించింది. -
హువావే వై 9 ప్రైమ్ లాంచ్
చైనా రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. హువావే వై 9 ప్రైమ్ పేరుతో నేడు (ఆగస్టు 1, గురువారం) ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చింది. పాప్ అప్ కెమెరా సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా కంపెనీ తెలిపింది. ధర రూ.15,990 గా ఉంచింది. అమెజాన్లో ప్రైమ్ కస్టమర్లకు ఆగస్టు 7వ తేదీ నుంచి, మిగిలిన వారికి 8వ తేదీనుంచి ఈ ఫోన్ను విక్రయించనున్నారు. లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యంతోపాటు, ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ను కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ పే ద్వారా కొంటే రూ.500 డిస్కౌంట్ ఇస్తారు. అలాగే జియో కస్టమర్లకు రూ.2200 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. హువావే వై9 ప్రైమ్ ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే ఆక్టాకోర్ కిరిన్ 710 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 4 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 16+ 8+ 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4 000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆ ఫోన్లలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఉండవట
శాన్ఫ్రాన్సిస్కో: చైనా టెలికాం దిగ్గజం హువావేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హువావే కొత్త ఫోన్లలో ఫేస్బుక్ సహా, తమ యాప్లు వాట్సాప్, ఇన్స్ట్రామ్ ప్రీ-ఇన్స్టాల్గా లభించవని ప్రకటించింది. మార్కెట్లోకి రానున్న హువావే స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులు వీటిని తప్పక డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని అప్డేట్స్ ఇస్తామని ఫేస్బుక్ తెలిపింది. ఫేస్బుక్ నిర్ణయంపై ట్విటర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు హువావే నిరాకరించింది. హుహావేపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. హువావేకు ఎలాంటి సాయం చేయొద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు భవిష్యత్లో తమ సేవలను అందించబోమని ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా ఇటీవల గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 90 రోజుల తర్వాత హువావే కొత్త ఫోన్లకు గూగుల్ సేవలు ఏవీ అందుబాటులో ఉండవు. దీంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి వారు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ, 90రోజుల తర్వాత గూగుల్ ప్లేస్టోర్ యాక్సెస్ను కూడా హువావే కొత్త ఫోన్లకు ఉండదు. కాగా సాధారణంగా ఫేస్బుక్, ట్విటర్లాంటి సోషల్ మీడియా యాప్లు ప్రీ-ఇన్స్టాల్గా ప్రస్తుత స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తాయి. ఇందుకు ముందుగానే ఒప్పందం చేసుకుంటాయి. సోషల్ మీడియాకు చిన్నా పెద్ద దాసోహం అంటున్న ప్రస్తుత తరుణంలో ఈ యాప్లు లేని స్మార్ట్ఫోన్లపై కొనుగోలు దారుల ఆసక్తి ఏ మేరకు ఉంటుందనేది ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో హువావే స్మార్ట్ఫోన్ విక్రయాలు భారీగా ప్రభావితం కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ఆంక్షల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొనే సత్తా తమ వద్ద ఉందని హువావే ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హువావేకు భారీ ఊరట : రష్యాతో కీలక ఒప్పందం
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువావే కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్వార్లో భాగంగా అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు కీలక డీల్ను కుదుర్చుకుంది. 2019-20 నాటికి 5జీ టెక్నాలజీకోసం రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో రెండుకంపెనీలు ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2019-20 నాటికల్లా యుద్ధ ప్రాతిపదికన 5జీ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్ వెల్లడించింది. రష్యా చైనా దేశాల వ్యూహాత్మక బంధం ఈ ఒప్పందంతో మరింత బలపడిందంటూ సంతోషం వ్యక్తం చేశారు హువావే అధినేత గువోపింగ్. కాగా అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందంటూ హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా టెక్నాలజీ వినియోగించి తమ దేశంపైనే గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది. ఈ క్రమంలో అమెరికాలో తయారయ్యే టెక్నాలజీని ఇతర దేశాలకు విక్రయించరాదంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో హువావే పలు ఇబ్బందుల్లో పడిపోయింది. అమెరికా కనుసన్నల్లో నడిచే పాశ్చాత్య దేశాలు జాతీయ భద్రతా ప్రమాదం పేరుతో హువావేను బ్లాక్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం హువావేకుభారీ ఊరట నివ్వనుంది. -
పెల్లుబుకిన ఆగ్రహం : ఆపిల్కు భారీ షాక్!
బీజింగ్ : చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేను ఎలాగైనా దారికి తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చైనా యువత భారీ షాకిచ్చింది. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియా యూజర్లు, యువత కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ టెక్ దిగ్గజం హువావేకు అక్కడి యూజర్లు మద్దతుగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను నిషేధించాలంటూ పిలుపు నిచ్చారు. ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన హువావే ఉత్పత్తులు, టెక్నాలజీపై ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వంపై అక్కడి యువత మండిపడుతోంది. ట్విటర్, వైబోలాంటి సోషల్ మీడియా వేదికల్లో ఆపిల్ ఉత్పత్తులను బ్యాన్ చేయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోస్టులకు మిలియన్ల కొద్దీ లైకులు, షేర్లు లభిస్తున్నాయి. దీంతో చైనా అంతటా యాంటీ ఆపిల్ ఉద్యమం ఊపందుకుంది. హువావేపై ట్రంప్ సర్కార్ కావాలనే వేధింపులకు పాల్పడుతోందని యూజర్లు మండి పడుతున్నారు. అలాగే ఆపిల్ ఐఫోన్ కొనాలన్న తన ఆలోచనను మార్చుకుని హువావే ఫోన్ను కొనుగోలు చేయనున్నామని మరో యూజర్ ప్రకటించారు. మరోవైపు ఈ నిర్ణయం స్వల్పకాలంలో చైనాలో ఆపిల్ అమ్మకాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఆపిల్ తిరస్కరించింది. దీంతో అమెరికా-చైనా ట్రేడ్ వార్ మరింత ముదురుతున్న ఆందోళన నెలకొంది. కాగా హువావేపై ఆంక్షలను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్రేడ్ వార్ : హువావే స్పందన
చైనీస్ టెలికం దిగ్గజం హువే టెక్నాలజీస్పై విధించిన ఆంక్షలపై హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫీ ధీటుగా స్పందించారు. తమ బలాన్ని అమెరికా ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తోందనీ, ఇది తగదని గట్టిగానే హెచ్చరించారు. ఇలాంటి చర్యల ద్వారా తమ సామర్ధ్యాలను ఏమాత్రం దెబ్బతీయలేరంటూ చైనీస్ స్టేట్ మీడియా సీసీటీవీతో పేర్కొన్నారు. హువావేపై నిషేధం సడలింపు హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలిస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా హువావేపై అమెరికా గుర్రుగా ఉన్న నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హార్డ్వేర్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా గత వారం హువేను వాషింగ్టన్ ప్రభుత్వం వాణిజ్యపరమైన(ట్రేడ్) బ్లాక్లిస్ట్లో పెట్టడంతో గూగుల్ తదితర కంపెనీలు బిజినెస్ డీలింగ్స్ను రద్దుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా సడలిస్తూ వాషింగ్టన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. -
హువావే పీ 30 ప్రొ, పీ 30 లైట్ లాంచ్
చైనా మొబైల్ మేకర్ హువావే భారతీయ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో సరికొత్త డివైస్లతో దూకుడును ప్రదర్శిస్తోంది. ఇటీవలే పీ 30 సిరీస్లో భాగంగా హువావే పీ 30, పీ 30 ప్రొ పారిస్లో ఆవిష్కరించిన సంస్థ తాజాగా పీ30 ప్రొ, పీ 30 స్మార్ట్ఫోన్లను మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్లో విడుదలైన హువావే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీతో పాటు ట్రిపుల్ బ్యాక్ కెమెరా, సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ను ఇందులో అందిస్తోంది. హువావే పీ30 ప్రొ ఫీచర్లు 6.47 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హువావే కిరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 40+ 20+ 8 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ హువావే పీ 30 లైట్ ఫీచర్లు 6.15 ఫుల్హెచ్డీ డిస్ప్లే కిరిన్ 710 సాక్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 24+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీబీ, 6జీబీ రెండు వేరియంట్లలో హువావే పీ 30 లైట్ లభ్యమవుతుంది. కాగా 4జీబీ వేరియంట్ ధర రూ. 19,990గా ఉండగా, 6జీబీ వేరియంట్ ధర రూ. 22,990గా ఉంది. ఈ రెండు ఫోన్లు అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభ్యం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది. హువావే పీ30 ప్రొ స్మార్ట్ఫోన్ ధర రూ.71,990 గా ఉంది. -
హువావే వై6(2019)
మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్ఫోన్ వై6 2019 ను రష్యా మార్కెట్లో విడుదల చేసింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో డ్యూ డ్రాప్ నాచ్డిస్ప్లే , మీడియా టెక్ హీలియో ఏ22 సాక్ ప్రాసెసర్ దీన్ని లాంచ్ చేసింది. రూ.9,770 ధర నిర్ణయించింది. హువావే వై6 2019 ఫీచర్లు 6.09 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 మీడియా టెక్ హీలియో ఏ22 సాక్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3020 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ కెమెరాతో ‘హానర్’ స్మార్ట్ఫోన్
హువావే సబ్ బ్రాండ్ హానర్ ప్రకటించిన విప్లవాత్మక స్మార్ట్ఫోన్ భారతీయ మార్కెట్లోకి అడుగపెట్టబోతోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన హానర్ వ్యూ20ని ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 22) లాంచ్ చేస్తోంది. అలాగే ఈ నెల 29న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అమెజాన్లో ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం కానుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్కు ప్రారంభమైనాయని కంపెనీ ప్రకటించింది. అద్భుతమైన ఫీచర్లు, ప్రపంచంలోనే భారీ కెమెరాతో తొలి స్మార్ట్ఫోన్గా, వ్యూ సిరీస్లో టాప్ ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వ్యూ20 నిలవనుంది. ఈ స్మార్ట్ఫోన్ మూడు వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,500. 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,600గా ఉంది. ఇక ఈ డివైస్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ వ్యూ20 ఫీచర్లు 6.4 ఇంచెస్ డిస్ప్లే కిరిన్ 980 ఆక్టాకోర్ సాక్ ఆండ్రాయిడ్ 9 1080x2310 పిక్సెల్స్ రిజల్యూషన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ మరోవైపు ఈ స్మార్ట్ఫోన్ చైనా మార్కెట్లో ఇప్పటికే లాంచ్ కాగా హానర్ వ్యూ 20 మోషినో రెడ్ ఎడిషన్ను లేటెస్ట్ గా విడుదల చేసింది. Sung too many tunes about reimagining your memories? Upgrade to newer inventions with the #WorldsFirstTechnology of 48MP AI Camera on the #HONORView20!#SeeTheUnseen launching on 29th January! Pre-book!#HONOR Store: https://t.co/rxo3bqIoma@amazonIN : https://t.co/6UArGjoHOJ pic.twitter.com/rvH7NVJ66s — Honor India (@HiHonorIndia) January 21, 2019 -
బిగ్గర్ ఫర్ బెటర్.. హువావే వై 9
చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు హువావే మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వై సిరీస్లో భాగంగా తొలి స్మార్ట్ఫోన్ను వై 9 పేరుతో నేడు (జనవరి 10) విడుదల చేసింది. బిగ్గర్ ఫర్ బెటర్.. ముందూ, వెనక మొత్తం నాలుగు బిగ్ కెమెరాలతో.. యూజర్లు ఫోటోగ్రఫీలో మాస్టర్ అయిపోతారంటూ లాంచింగ్ సందర్బంగా కంపెనీ వ్యాఖ్యానించింది. కాగా ఆ స్మార్ట్ఫోన్ను ఇప్పటికే చైనాలో గత ఏడాది తీసుకొచ్చింది. జనవరి 15నుంచి అమెజాన్ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి అందుబాటులో ఉండనుంది. వై 9 ఫీచర్లు 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 2340x1080 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2.2 ఆక్టాకోర్ కిరిన్ 710 సాక్ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ 256దాకా స్టోరేజ్ను విస్తరించుకునే అవకాశం 16+2ఎంపీ డ్యుయల్ రియర్కెమెరా 13+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ధర : రూ.15,999 -
భారీ కెమెరాతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్ఫోన్
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ మేకర్ హువావే సబ్ బ్రాండ్ హానర్ భారీ కెమెరాతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. 48ఎంపీ సోనీ ఐఎంఎక్స్589 సెన్సర్తో హానర్ వ్యూ 20 / హానర్ వి 20 పేరుతో జనవరి 29న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. గత నెలలో ఈ స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. హానర్ వి 20 ఫీచర్లు 6.4 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 2130x1080 రిజల్యూషన్ హై సిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ పై 9 6జీబీ/8జీబీ ర్యామ్,128జీబీ/256 స్టోరేజ్ 48ఎంపీ రియర్కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ. 30వేలు హైఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.35వేలు -
హువావే హాలిడే సేల్ : రూ.15వేల డిస్కౌంట్
హువావే తన స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా స్మార్ట్ఫోన్లపై 15వేల రూపాయల దాకా డిస్కౌంట్ను అందిస్తోంది. హువావే హాలిడే సేల్ను అమెజాన్ప్రత్యేకంగా విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో 1500 రూపాయల తక్షణ డిస్కౌంట్. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదపాయం కూడా ఉంది. హువావే పీ20లైట్, పీ 20ప్రొ నోవా 3ఐ, నోవా 3స్మార్ట్ఫోన్లపై ఈ భారీ డిస్కౌంట్లను హువావే ప్రకటించింది. భారీ ఆఫర్లివే.. హువావే పీ 20 ప్రొ : ఈ స్మార్ట్ఫోన్పై 15వేల రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. హాలిడే సేల్ లో ఈ స్మార్ట్ఫోన్ రూ. 54,999లకే లభ్యం. ఫీచర్లు: 6.1 అంగుళాల డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 40+24+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ హువావే పీ 20లైట్: రూ. 8వేల డిస్కౌంట్ అనంతరం ఇపుడు రూ.14,999 లకే లభ్యం ఫీచర్లు: 5.84 అంగుళాల డిస్ప్లే, 4జీబీ ర్యామ్,64జీబీ స్టోరేజ్, 24+16ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీకెమెరా, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ నోవా 3ఐ: రూ.7వేల డిస్కౌంట్తో రూ. 16,990 లకే అందుబాటులో ఉంది. ఫీచర్లు: 6.3 అంగుళాల డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్,16+2ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 24+2ఎంపీ డ్యుయల్ రిసెల్ఫీ కెమెరా, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ నోవా 3 : 10వేల రూపాయల తగ్గింపు అనంతరం ప్రస్తుతం రూ. 29,999లకే విక్రయిస్తోంది. ఫీచర్లు: 6.3 అంగుళాల డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 24+16ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 24+2ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుత ఫీచర్లో హువావే నోవా 4
హువావే సంస్థ నుంచి నోవా 4 పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది . ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ హోల్ పంచ్, 48 మెగాపిక్సెల్ భారీ కెమెరా ప్రధాన ఫీచర్లని కంపెనీ తెలిపింది. నోవా సిరీస్కు కొనసాగింపుగా నోవా 3 తరువాత ఆ వరుసలో నోవా 4ను హువావే సోమవారం చైనాలో విడుదల చేసింది. రెండు వేరియంట్లలో (20ఎంపీ కెమెరా, 48 ఎంపీ కెమెరా) విడుదల చేసింది. 48 మెగా పిక్సల్ వేరియంట్ ధర సుమారు రూ.35,300గా ఉండగా, 20 మెగా పిక్సల్ ధర సుమారు రూ.32,200 గా ఉండనుంది. నోవా 4 ఫీచర్లు 6.4 అంగుళాల హెచ్డీ స్క్రీన్ 1080x2310 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్ 2.36 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 48 +6+2 ఎంపీ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 3750 ఎంఏహెచ్ బ్యాటరీ -
మార్కెట్లకు ఎన్నికల ఫలితాల దిశానిర్దేశం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, క్రూడాయిల్ రేట్లతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. రాజకీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలు నిఘా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘మంగళవారం వెల్లడయ్యే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశీ.. అంతర్జాతీయ స్థూల ఆ ర్థిక గణాంకాల వెల్లడి, క్రూడాయిల్ రేట్ల కదలికలు తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోణంలో చూస్తే అయిదు రాష్ట్రాల ఫలితాలు చాలా కీలకంగా ఉండనున్నాయి’ అని ఈక్విటీ99 సీనియర్ రీసెర్చ్ అనలిస్టు రాహుల్ శర్మ తెలిపారు. ‘ఒపెక్ సదస్సు, హువావే గ్లోబల్ సీఎఫ్వో అరెస్టు వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనలో పడవేశాయి. వీటితో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. స్వల్పకాలికంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులకు ఆజ్యం పోయనున్నాయి’ అని ఎపిక్ రీసెర్చ్ సంస్థ సీఈవో ముస్తఫా నదీమ్ చెప్పారు. ‘అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ, క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతుండటం వంటి అంశాలతో ఈ వారం దేశీ సూచీలు ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కూడా హెచ్చుతగ్గులకు దారితీయొచ్చు. సూచీలు ఇంట్రా డేలో 1% పైగా అటూ ఇటూ సాధారణంగానే తిరిగేసే అవకాశం ఉంది’ అని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ సాహిల్ కపూర్ తెలిపారు. టెక్నికల్గా చూస్తే భారీ కరెక్షన్కు లోనైన నిఫ్టీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడంతో బుల్స్ తిరిగొచ్చేందుకు ఆస్కారముందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు. నిఫ్టీ గానీ 10,775 పాయింట్ల నిరోధాన్ని దాటితే మరింత పెరగొచ్చని, 10,588 పాయింట్ల వద్ద మద్దతు ఉండగలదని పేర్కొన్నారు. సెన్సెక్స్ గతవారం 521 పాయింట్లు క్షీణించి 35,673 వద్ద, నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 10,694 వద్ద క్లోజయ్యాయి. రూపాయిపైనా ఒత్తిడి .. గతవారం ఆఖర్లో సమావేశమైన చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ .. ముడిచమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్రెట్ క్రూడ్ రేటు శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పైగా పెరిగింది. మరోవైపు, చైనా టెలికం దిగ్గజం హువావే గ్లోబల్ సీఎఫ్వో మింగ్ వాంఝూను కెనడాలో అరెస్టు చేయడం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీ మార్కెట్నూ కుదిపేసింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో విడత వడ్డీ రేట్ల పెంచడంపై ఈ నెలలో నిర్ణయం తీసుకోనుండటం కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించేందుకు కారణం కానుంది. వడ్డీ రేట్లు పెంపుతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ ఫండ్స్ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చని, ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తవచ్చని అనలిస్టులు పేర్కొన్నారు. 70.50–72.50 మధ్య రూపాయి .. ఈ వారంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.50–72.50 మధ్య తిరుగాడే అవకాశాలు ఉన్నాయని కొటక్ సెక్యూరిటీస్ డిప్యుటీ వైస్ ప్రెసిడెంట్ (కరెన్సీ, వడ్డీ రేట్ల విభాగం) అనింద్య బెనర్జీ తెలిపారు. ‘అమెరికా డాలర్ను ట్రేడర్లు భారీగా షార్ట్ చేశారు. కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రాకపోవొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సెషన్లో షార్ట్ కవరింగ్ జరిగి రూపాయితో పోలిస్తే డాలర్ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి’ అని ఆమె తెలిపారు. ‘వచ్చేవారం ఎన్నికల ఫలితాలే కీలకంగా ఉంటాయి. ఒకవేళ మధ్యప్రదేశ్లో మళ్లీ బీజేపీనే వచ్చి.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఏ ఒక్కదాన్లోనైనా గెలుపొందిన పక్షంలో రూపాయి ర్యాలీ చేయొచ్చు. అలా కాకుండా బీజేపీ ఓడిపోతే.. రూపాయికి ప్రతికూలంగా కాగలదు‘ అని అనింద్య వివరించారు. ఇవి కాకుండా ఈ వారం వెల్లడయ్యే స్థూల ఆర్థిక గణాంకాలూ కీలకం కానున్నాయి. 12న పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) గణాంకాలు, డిసెంబర్ 14న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, ఎగుమతుల గణంకాలు విడుదల కానున్నాయి. 5 రోజుల్లో రూ. 400 కోట్లు దేశీ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్న ఎఫ్పీఐలు న్యూఢిల్లీ: చైనా టెలికం పరికరాల సంస్థ హువావే సీఎఫ్వో అరెస్టుతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) గత 5 సెషన్స్లో ఏకంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం డిసెంబర్ 3–7 మధ్య వ్యవధిలో ఎఫ్పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 383 కోట్లు ఉపసంహరించారు. అదే సమయంలో డెట్ మార్కెట్లలో రూ. 2,744 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్ 6న ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయని, ఎఫ్పీఐలు ఒక్క రోజులోనే రూ. 361 కోట్ల విక్రయాలు జరిపారని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. హువావే సీఎఫ్వో మెంగ్ వాంఝూ అరెస్ట్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా క్షీణించడం ఇందుకు కారణమైందన్నారు. -
కెనడాలో హువావే సీఎఫ్వో అరెస్ట్
ఒటావా: చైనా టెలికం దిగ్గజం హువావే వ్యవస్థాపకుడు కుమార్తె, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) మెంగ్ వాంఝూను కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్తో వ్యాపార లావాదేవీలు కొనసాగించడం ద్వారా హువావే నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలే ఇందుకు కారణమని తెలియవచ్చింది. మెంగ్ వాంఝూను అప్పగించాల్సిందిగా అమెరికా కోరుతోందని, ఆమె బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుందని కెనడా న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హువావేతో దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న అమెరికా... ఇప్పటికే ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అంశంపై హువావే మీద విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టే విధంగా చైనా వ్యవహరిస్తోందని, దీన్ని తాము చూస్తూ కూర్చోబోమని అమెరికా సెనేటర్ బెన్ సాసీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. తద్వారా వాంఝూ అరెస్ట్ వెనుక ఇరాన్ కోణం ఉన్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. అటు ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్తో పాటు అమెరికా చట్టాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని హువావే పేర్కొంది. ఈ మధ్యే వాణిజ్య యుద్ధాలపై తాత్కాలిక సంధి కుదుర్చుకున్న చైనా, అమెరికా మధ్య ఈ పరిణామంతో మరోసారి అగ్గి రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా, చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరిన రోజు డిసెంబర్ 1వ తేదీ నాడే వాంఝూను కెనడాలో అరెస్ట్ చేశారు. మెంగ్ను తక్షణం విడుదల చేయాలంటూ కెనడాలోని చైనా దౌత్య కార్యాలయం డిమాండ్ చేసింది. సంధి చర్యలు సత్వరం అమలుపై చైనా దృష్టి.. అమెరికాతో కుదుర్చుకున్న తాత్కాలిక సంధి చర్యలను సత్వరం అమలు చేయనున్నట్లు చైనా వెల్లడించింది. నిర్దేశిత 90 రోజుల్లోగా డీల్ కుదుర్చుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. సుంకాలపరమైన పోరుతో వాణిజ్య యుద్ధానికి దారి తీసిన వివాదాల పరిష్కారానికి ఇరు దేశాలు 90 రోజుల గడువు విధించుకున్న సంగతి తెలిసిందే. సంధి ఒప్పందం ప్రకారం గడువు తీరేదాకా 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలను 25 శాతానికి పెంచకుండా 10% స్థాయిలోనే అమెరికా కొనసాగించనుంది. అటు చైనా తన వంతుగా అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు మరి న్ని అమెరికన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోనుంది. -
ఆమె అరెస్ట్తో... అతలాకుతలం!
ఒక వ్యక్తి అరెస్ట్... ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నింటినీ గురువారం అల్లకల్లోలం చేసి పడేసింది. దీనికి తోడు డాలర్తో రూపాయి మారకం మళ్లీ 71 మార్క్కు దిగడంతో మన మార్కెట్ కూడా అదే దారిలో ప్రయాణించింది. అన్ని రంగాల షేర్లలో అదేపనిగా అమ్మకాలు జరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడి కొనుగోళ్ల కంటే అమ్మకాలకే అధిక ప్రాధాన్యమివ్వటంతో... బీఎస్ఈ సెన్సెక్స్ 572 పాయింట్లు పతనమై 35,312 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 182 పాయింట్లు క్షీణించి 10,601 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 1.59 శాతం, నిఫ్టీ 1.69 శాతం చొప్పున పతనమయ్యాయి. కిందటి వారమంతా లాభపడిన స్టాక్ సూచీలు... గడిచిన మూడు రోజులూ వరుసగా నష్టపోయాయి. మెటల్, ఆయిల్, గ్యాస్, ఫార్మా, ఆర్థిక, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ... ఇలా అన్ని రంగాల షేర్లూ నష్టపోయాయి. ఇటీవల నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు బుధవారం నికర అమ్మకాలు జరపడం, మన జీడీపీ అంచనాలను ఫిచ్ రేటింగ్స్ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 618 పాయింట్లు నష్టం స్టాక్ మార్కెట్పై దెబ్బ మీద దెబ్బ పడుతోందని సెంట్రమ్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తునుగుంట్ల చెప్పారు. ఇటీవల కొంత కోలుకున్నట్లు కనిపించిన రూపాయి మళ్లీ పతనమైందన్నారు. ముడి చమురు ఉత్పత్తి కోత దిశగా ఒపెక్ సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని తెలియజేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు రిహార్సల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే మంగళవారం (ఈ నెల 11న) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లలో ఒకింత ఆదుర్దా నెలకొందని చెప్పారాయన. నష్టాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజులో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రోజంతా నష్టాల్లోనే సాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 618 పాయింట్ల వరకూ నష్టపోగా, నిఫ్టీ 195 పాయింట్ల వరకూ పతనమైంది. మరిన్ని విశేషాలు.. ► 31 సెన్సెక్స్ షేర్లలో ఒక్క సన్ ఫార్మా మాత్రమే లాభపడింది. గత మూడు రోజులుగా నష్టపోతూ వస్తున్న సన్ఫార్మా షేర్.. సెన్సెక్స్లోని అన్ని షేర్లు నష్టపోయినా, గురువారం పెరగడం విశేషం. ► 50 షేర్ల నిఫ్టీలో మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 47 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► ధరలను పెంచనున్నామని ప్రకటించడంతో మారుతీ సుజుకీ షర్ 4.6 శాతం పతనమై రూ.7,208 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 5 శాతం నష్టంతో రూ.7,178ను తాకింది. సెన్సెక్స్ షేర్లలో బాగా నష్టపోయిన షేర్ ఇదే. మారుతీ సుజుకీతో పాటు టాటా మోటార్స్ 4%, బజాజ్ ఆటో 1.5%, హీరో మోటొకార్ప్1.2 శాతం చొప్పున పడిపోయాయి. ► లోహ షేర్లు భారీగా నష్టపోయాయి. వేదాంత, సెయిల్, ఎన్ఎమ్డీసీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకగా, టాటా స్టీల్, హిందుస్తాన్ జింక్ ఏడాది కనిష్ట స్థాయిలకు చేరువయ్యాయి. లోహ షేర్లే కాకుండా పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ► రిటైల్ రుణాల వడ్డీరేట్లను ఎమ్సీఎల్ఆర్తో కాకుండా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్స్తో అనుసంధానించాలన్న ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ సూచీలోని 12 బ్యాంక్ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. 2.26 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కె ట్ భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 2.28 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,42,15,155 కోట్ల నుంచి రూ.2.26 లక్షల కోట్లు తగ్గి రూ.1,39,88,560 కోట్లకు పడిపోయింది. గత మూడు రోజుల్లో రూ.3.64 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. పతనానికి ప్రధాన కారణాలివీ... ► భారీ నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు... చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ), మెంగ్ వాంఝూను కెనడాలో అరెస్టు చేశారు. ఈమె ఈ కంపెనీ వ్యవస్థాపకుడి కుమార్తె. ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలను హువావే కంపెనీ ఉల్లంఘించిందనేది ఆరోపణ. ఈ ఆరెస్ట్ను చైనా తీవ్రంగా నిరసించింది. ఇప్పటికే వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతంతమాత్రంగా ఉన్న అమెరికా–చైనా సంబంధాలు ఈ వివాదంతో మరింత క్షీణిస్తాయన్న భయాలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. జపాన్ నికాయ్ 1.9 శాతం, హాంగ్కాంగ్ హాంగ్సెంగ్ 2.4 శాతం, చైనా షాంగై సూచీ 1.6 శాతం, కొరియా కోస్పి సూచీ 1.5 శాతం చొప్పున కుదేలయ్యాయి. ఇక యూరప్ స్టాక్ మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో క్షీణించాయి. అమెరికా డోజోన్స్ 700 పాయింట్లు, నాస్డాక్ 100 పాయింట్ల నష్టాలతో ట్రేడవుతున్నాయి. ► 71 మార్క్ దిగువకు రూపాయి... ముడిచమురు ధరల భారీ పతనం కారణంగా కోలుకున్న రూపాయి ఇటీవల మళ్లీ నష్టాల బాట పట్టింది. డాలర్ బలపడుతుండటం, మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తలెత్తడంతో రూపాయి మళ్లీ 71 మార్క్ను దాటింది. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు నవంబర్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ► ఒపెక్ సమావేశంపై ఆందోళన ముడి చమురు ధరల పతనాన్ని అడ్డుకోవడానికి ఒపెక్ దేశాలు ఉత్పత్తి కోతకు సిద్ధం అవుతున్నాయి. ఉత్పత్తి కోత కారణంగా మళ్లీ ధరలు పెరుగుతాయని, ఇది మన రూపాయిపై, మన ఆర్థిక స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొన్నది. ► ఎన్నికల ఫలితాలపై ఆదుర్దా వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకం. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘర్, మిజోరమ్ ఎన్నికల పలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నది. ► ఫిచ్ నివేదిక ప్రకంపనలు... అంతర్జాతీయ రేటింగ్ సంస్థ, ఫిచ్ ఈ ఏడాది భారత్ జీడీపీ అంచనాలను 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. మరోవైపు వచ్చే ఏడాది చివరికల్లా డాలర్తో రూపాయి మారకం 75కు చేరుతుందని కూడా ఫిచ్ పేర్కొనడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ప్రభావం చూపించింది. ► గణాంకాల నిరుత్సాహం ఇటీవల వెలువడ్డ జీడీపీ, పన్ను వసూళ్లు, వాహన విక్రయా లు తదితర గణాంకాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మార్కెట్లో ఉత్తేజకర వాతావరణం కొరవడింది. -
శక్తివంతమైన ప్రాసెసర్తో ‘హువావే మేట్ 20ప్రో’
ప్రముఖ చైనా మొబైల్ తయారీదారు హువావే శక్తివంతమైన ప్రాసెసర్తో కూడిన కొత్త స్మార్ట్ఫోన్ను 'హువావే మేట్ 20ప్రో' పేరిట ఇండియాలో విడుదల చేయనుంది. హువావే తన మేట్ సిరీస్ ఫోన్లను మొదటిసారిగా ఇండియాలో విడుదల చేయనుంది. ట్రిపుల్ రియర్ కెమేరాలతో దీన్ని భారత వినియోగదారులకుఅందాటులోకి తెస్తోంది. 6జీబీ ర్యామ్+ 128జీబీ వేరియంట్ ఫోన్ ధర సుమారుగా రూ 88,400 ఉండనుంది. హువావే మేట్ 20ప్రో ఫీచర్లు 6.39 ఇంచ్ క్యూహెచ్డీ ప్లస్ డిస్ప్లే 1440x3120 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై హైసిలికాన్ కిరిన్ 980 ఎస్ఓసీ ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 40+20+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలు 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,200ఎంఏహెచ్ బ్యాటరీ సూపర్ఫాస్ట్ ఛార్ట్తో కూడిన వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం -
ఆపిల్కు సవాల్: దుమ్ము రేపిన హువావే, లక్ష దాటిన ధర
భారీ స్క్రీన్లు, బ్యారీ స్టోరేజ్, భారీ బ్యాటరీ, అద్భుతైన లైకా ట్రిపుల్ కెమెరా , అధునాతన టెక్నాలజీ మేళవింపులో చైనా మొబైల్ తయారీ దారు హువావే దుమ్ము రేపింది. హైఎండ్ స్మార్ట్ఫోన్ ధరను లక్షకుపైగా రూపాయలుగా నిర్ణయించి లగ్జరీ ఫోన్లకు పెట్టింది పేరైన ఆపిల్కు సరికొత్త సవాల్ విసిరింది. హువావే 20 సిరీస్లో అంచనాలకు మించి వరుసగా నాలుగు అద్భుతమైన స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. హువావే మేట్, 20, మేట్ 20 ప్రొ, మేట్ 20 ఎక్స్, మేట్ 20 ఆర్ఎస్ డివైఎస్లను లండన్లో విడుదల చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలు రూ. 67,900నుంచి ప్రారంభం కానున్నాయి. మేట్ 20ఎక్స్ స్మార్ట్ఫోన్ను 7.12 అల్ట్రా లార్జ్ డిస్ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. మేట్ 20ఎక్స్ ఫీచర్లు 7.12 ఓఎల్ఈడీ అతిపెద్ద డిస్ప్లే 40 ఎంపీ ట్రిపుల్ కెమెరా 6జీబీ, 128జీబీ స్టోరేజ్ 5000 బ్యాటరీ ధర : సుమారు రూ. 76, 500 అక్టోబర్ 26నుంచి విక్రయానికి లభ్యం. దీంతోపాటు లగ్జరీ కస్టమర్లకోసం పోర్షే డిజైన్తో మేట్ ఆర్ఎస్ను హై ఎండ్ వేరియంట్గా తీసుకొచ్చింది. హువావే మేట్ ఆర్ఎస్: 8జీబీర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 8జీబీ, 512 స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేసింది. 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర సుమారు రూ. 1,44,000 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 1,80,000 -
అద్భుత ఫీచర్లతో హువావే స్మార్ట్ఫోన్లు
చైనా మొబైల్స్ తయారీ సంస్థ హువావే రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లండన్లో లాంచ్ చేసింది. మొబైల్ టెక్నాలజీ మరో మెట్టు పైకి తీసుకెళుతూ హువావే మేట్ 20', 'హువావే మేట్ 20 ప్రొ’ పేరిట నూతన స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. హైసిలికాన్ కిరిన్ 980 లాంటి అధునాతన ప్రాసెసర్ తోపాటు, ప్రపంపంచలోనే తొలిసారిగా లైకా ట్రిపుల్ కెమెరాలని ఈ ఫోన్లనో ఏర్పాటు చేసింది. హువావే మేట్ 20 ధర సుమారు రూ. 67,910 హువావే మేట్ 20 ప్రొ ధర: సుమారు రూ.89,155 హువావే మేట్ 20 ప్రొ ఫీచర్లు 6.39 ఇంచెస్ ఫుల్ వ్యూ డిస్ప్లే(19.5:9) 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హైసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9పై 6జీబీర్యామ్,128జీబీ స్టోరేజ్ 40+20+8 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 24ఎంపీ సెల్ఫీ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ హువావే మేట్ 20 ఫీచర్లు 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే(18:7:9) 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హైసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9పై 4/6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు పెంచుకునే సామర్ధ్యం) 16+2+8 20ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
హువావే నోవా 3ఐ కొత్త వేరియంట్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: హువావే నోవా 3ఐ స్మార్ట్ఫోన్ లో కొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. 6జీబీ, 128జీబీ స్టోరేజిను మూడవ వేరియంట్గా విడుదల చేసింది. దీని ధర రూ .25,500 కంపెనీ నిర్ణయించింది. బ్లాక్, పర్పుల్ , వైట్తోపాటు అకాసియా రెడ్ కలర్లో కూడా ఈ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. నోవా 3ఐ ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టా-కోర్ హై సిలికాన్ కిరిన్ 710 సాక్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరించుకోవచ్చు 16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ -
హువావే మేట్ 20 లైట్ లాంచ్
చైనా కంపెనీ హువావే తన నూతన స్మార్ట్ఫోన్ మేట్ 20 లైట్ను విడుదల చేసింది. బెర్లిన్లో (ఆగస్టు 31- సెప్టెంబర్ 5) ప్రారంభమైన ఐఎఫ్ఏ 2018 ఈవెంట్లో లాంచ్ చేసింది. అధునాతన ప్రాసెసర్, మొత్తం నాలుగు కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు ఏఐ ఆధారిత క్యూట్ స్పీకర్ను కూడా విడుదల చేసింది. హువావే మేట్ 20 లైట్ ఫీచర్లు 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ హై సిలికాన్ 710 ఎస్ఓసీ ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3650 ఎంఏహెచ్ బ్యాటరీ -
సూపర్ ఫీచర్స్తో సర్ప్రైజ్ చేసిన హువావే
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ మేకర్ హువావే అద్భుత ఫీచర్లతో హానర్ నోట్ 10ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ కోసం చాలా కాలం ఎదురు చూసిన ఫ్యాన్స్ను ఊహించని ఫీచర్లతో సరప్రైజ్ చేసింది. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీ, ర్యామ్, కిరిన్ 970 చిప్సెట్, డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీ తదితర అమేజింగ్ పీచర్లతో హువావే తన నూతన స్మార్ట్ఫోన్ హానర్ నోట్ 10ను రెండు వెర్షన్లలో (6జీబీ/64జీబీస్టోరేజ్, 8జీబీ/128 జీబీ స్టోరేజ్)ఇవాళ విడుదల చేసింది. రూ.28,115 ప్రారంభ ధరగా నిర్ణయించింది. మిడ్నైట్ బ్లాక్, ఫాంటమ్ బ్లూ కలర్ వేరియెంట్లలో బుధవారం నుంచి కస్టమర్లకు ప్రీ బుకింగ్కు అందుబాటులో ఉండనుంది. హానర్ నోట్ 10 ఫీచర్లు 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2220 పిక్సల్స్ రిజల్యూషన్ ఇంటర్నల్ కిరిన్ 970 చిప్సెట్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 24+16 ఎంపీ డ్యుయల్ రియర్కెమెరా 13 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
4 కెమెరాలతో హువావే కొత్త స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: హువావే రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. నోవా 3 సిరీస్లో నోవా 3, నోవా 3ఐ పేరుతో రెండు డివైస్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రధానంగా నాలుగు కెమెరాలు, ఫింగర్ప్రింట్ సెన్సార్ లాంటి ఇతర ప్రధాన ఫీచర్లతో వీటిని న్యూఢిల్లీలో గురువారం విడుదల చేసింది. నాలుగు ఆర్టిఫిషియల్ క్వాడ్ కెమెరాలు, సొంతంగా 3డీ క్యు(ఎ)మోజీల సృష్టి తమ డివైస్ల ప్రత్యేకత అని లాంచింగ్ సందర్భంగా కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు అమెజాన్లో ప్రత్యేకంగా లభించనున్నామని హువావే ఇండియా ప్రతినిధి అనుపమ్ యాదవ్ తెలిపారు. హానర్ నోవా 3 ఫీచర్లు 6.3 ఆంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3750 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: 34,999 రూపాయలు నోవా 3ఐ ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: 20,990 రూపాయలు ప్రీ ఆర్డర్లు ఈ మధ్యాహ్నం రెండుగంటల నుంచి ప్రారంభం. హానర్ 3 స్మార్ట్ఫోన్ ఆగస్టు 23 నుంచి, హానర్ 3ఐ ఆగస్టు 7వ తేదీ నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. అలాగే 2 వేల రూపాయల ఎక్సేంజ్, రూ.1000 క్యాష్బ్యాక్తో పాటు జియో యూజర్లకు ఉచిత డేటా లాంటి లాంచింగ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. -
హానర్ 9ఎన్ : లాంచ్ ఆఫర్లు, స్పెషిఫికేషన్లు
న్యూఢిల్లీ : హానర్ బ్రాండులో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. హువావే సబ్బ్రాండ్ హానర్, తన లేటెస్ట్ హ్యాండ్సెట్ హానర్ 9ఎన్ ను న్యూఢిల్లీ వేదికగా లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ను ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లోనే విక్రయించనున్నారు. ఈ ఫోన్ కీ ఫీచర్లు ‘నాచ్ ఫుల్వ్యూ’ డిస్ప్లే, 19:9 యాక్సెప్ట్ రేషియోతో బెజెల్-లెస్ డిస్ప్లేను, 12 లేయర్ ప్రీమియం గ్లాస్ డిజైన్ను ఇది కలిగి ఉంది. గత నెలలో చైనాలో లాంచ్ అయిన హానర్ 9ఐ(2018) మోడల్కు భారత్ వేరియంట్ ఈ హానర్ 9ఎన్ స్మార్ట్ఫోన్. హానర్ 9ఐ 2017 అక్టోబర్లో భారత మార్కెట్లోకి వచ్చింది. దీనికి సక్సెసర్గా.. మేడిన్ ఇండియా స్మార్ట్ఫోన్గా దీన్ని కంపెనీ ప్రకటించింది. హానర్ 9ఎన్ ధర, లాంచ్ ఆఫర్లు హానర్ 9ఎన్(2018) 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగ, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 13,999 రూపాయలు. ఇక 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 17,999 రూపాయలుగా కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్, హాయ్హానర్స్టోర్ల ద్వారా జూలై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి వస్తుంది. లావెండర్ పర్పుల్, రాబిన్ ఎగ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్పై రిలయన్స్ జియో రూ.2200 క్యాష్బ్యాక్ ప్రకటించింది. 100 జీబీ అదనపు డేటా, 1200 మింత్రా ఓచర్లు కూడా పొందనున్నారు. హానర్ 9ఎన్ స్పెషిఫికేషన్లు... ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 5.84 అంగుళాల ఫుల్-హెచ్డీ ప్లస్ ఫుల్వ్యూ ఐపీఎస్ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ గ్లాస్ 2.36 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 256 జీబీ వరకు విస్తరణ మెమరీ రియర్ ఫేసింగ్ ఫింగర్ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఫీచర్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
3 నెలల్లోనే 30 లక్షల విక్రయాలు
అదిరిపోయే ఫీచర్లతో హువావే ‘హానర్ 10’ స్మార్ట్ఫోన్ను గత మూడు నెలల క్రితమే గ్లోబల్గా లాంచ్ చేసిన తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్ గ్లోబల్ విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తోంది. లాంచ్ చేసిన 3 నెలల వ్యవధిలోనే 30 లక్షల విక్రయాల మైలురాయిని తాకి, హానర్ 10 దూసుకుపోయింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో వెల్లడించింది. ‘30 లక్షల హానర్ 10 విక్రయాలు, 30 లక్షల మందికి కృతజ్ఞతలు. హానర్ 10కు సపోర్టు ఇచ్చిన హానర్ అభిమానులందరికీ అభినందనలు. మీ సాయం లేకుండా.. ఈ మైలురాయిని తాకడం సాధ్యమయ్యేది కాదు’ అని కంపెనీ ట్వీట్ చేసింది. లాంచ్ చేసిన నెలలోనే 1 మిలియన్ పైగా యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే సగటున నెలకు 10 లక్షల యూనిట్లు విక్రయాలను నమోదు చేసింది. ఆన్లైన్ రిటైలర్ షాపీలో కూడా హానర్ 10 బెస్ట్ సెల్లింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్గా నిలిచింది. రష్యా, ఫ్రాన్స్ల్లో కూడా ఈ స్మార్ట్ఫోనే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్గా ఉంది. తొలుత హానర్ 10 స్మార్ట్ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. అక్కడ లాంచ్ చేసిన రెండు నెలల అనంతరం గ్లోబల్గా ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్ సెట్ ఖరీదు చైనాలో 2,599 సీఎన్వైగా, భారత్లో రూ.32,999గా ఉంది. భారత్లో ఈ స్మార్ట్ఫోన్ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి వచ్చింది. హానర్ 10 స్పెసిఫికేషన్లు 5.84 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ నాచ్ డిస్ప్లే (ఐఫోన్ టెన్ మాదిరి) హువాయి కిరిన్ 970 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 24ఎంపీ + 16ఎంపీ డ్యుయల్ వెనుక కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఈఎంయూఐ 8.1 ఇంటర్ఫేస్ -
ఫేస్బుక్ మరో ఘోర తప్పిదం
వాషింగ్టన్ : డేటా షేరింగ్ స్కాండల్ విషయంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ తన యూజర్ల డేటాను చెప్పా పెట్టకుండా స్మార్ట్ఫోన్, టాబ్లెట్ తయారీదారులకు ఇచ్చినట్టు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. వాటిలో ఆపిల్, శాంసంగ్, అమెజాన్ వంటి 60 కంపెనీలున్నట్టు తెలిపింది. గత దశాబ్ద కాలంగా యూజర్ల డేటాను ఆ కంపెనీలకు ఫేస్బుక్ యాక్సస్ చేస్తున్నట్టు వెల్లడించింది. తాజాగా ఫేస్బుక్ చేసిన మరో ఘోర తప్పిదం వెలుగులోకి వచ్చింది. చైనీస్ డివైజ్ మేకర్లతో కూడా డేటా షేరింగ్ ఒప్పందాన్ని ఈ కంపెనీ కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీనే అంగీకరించింది. హువావే టెక్నాలజీస్ కో, లెనోవో, ఒప్పో, టీసీఎల్ వంటి చైనీస్ డివైజ్ తయారీదారులకు ఫేస్బుక్ తన డేటాను షేర్ చేసినట్టు వెల్లడించింది. ఇదీ కూడా యూజర్లకు తెలియకుండానే చేసినట్టు తెలిసింది. చైనీస్ డివైజ్ తయారీదారులతో ఫేస్బుక్ డేటా షేర్ కావడం ‘అత్యంత ప్రమాదకరం’ అని సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ టాప్ డెమొక్రాట్ మార్క్ వార్నర్ అన్నారు. అయితే తాము ఈ భాగస్వామ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని, ఫేస్బుక్ యాప్ కస్టమ్ వెర్షన్స్ను అభివృద్ధి చేయడానికి స్మార్ట్ఫోన్ కంపెనీలకు తాము సహకరిస్తున్నామని ఈ కంపెనీ చెబుతోంది. మెంబర్ల సమాచారాన్ని వారు ఎలాంటి వాటికి ఉపయోగిస్తున్నారనే విషయంపై చాలా విశ్లేషణ చేశామని పేర్కొంటోంది. 2009 నుంచి చైనాలో ఫేస్బుక్ యాప్ బ్లాక్ అయి ఉంది. అయినప్పటికీ ఆ దేశ కంపెనీలకు మాత్రం ఈ కంపెనీ యూజర్ల డేటా ఇచ్చేసింది. ప్రస్తుతం ఫేస్బుక్ షేర్చేసిన చైనీస్ కంపెనీలు, ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ, వారి మిలటరీకి సంబంధించినివా తెలుపాలని ఆ కమిటీ ఆదేశించింది. ఇప్పటికే ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కన్సల్టెన్సీ కంపెనీతో యూజర్ల డేటాను పంచుకుందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణలపై ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్ కాంగ్రెస్ సభ్యుల మందుకు వచ్చి కూడా క్షమాపణ చెప్పారు. తాజాగా న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసిన రిపోర్టులు, వెలుగులోకి వచ్చిన చైనీస్ కంపెనీలతో భాగస్వామ్యం అన్ని విషయాల్లోనూ ఫేస్బుక్ ఎంత ఘోర తప్పిందం చేసిందో వెల్లడవుతుందని టెక్ వర్గాలంటున్నాయి. -
హానర్ 7ఎస్ లాంచ్..
దిగ్గజ చైనా మొబైల్ సంస్థ హువాయి మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. హానర్ 7ఎస్ పేరుతో తాజా డివైస్ను పాకిస్తాన్లో విడుదల చేసింది. ఇండియన్ కరెన్సీలో ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు 8,430 రూపాయలు. అయితే గ్లోబల్ వెబ్సైట్లో లిస్ట్ అయిన ఈ ఫోన్ భారత్ సహా, ఇతర మార్కెట్ల వినియోగదారులకు ఎపుడు లభ్యం కానుందీ స్పష్టత లేదు. హానర్ 7ఎస్ ఫీచర్లు 5.45 ఇంచ్ డిస్ప్లే 1440 x 720 పిక్సల్స్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీరియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3020 ఎంఏహెచ్ బ్యాటరీ -
నేహా ధుపియా : హానర్ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: హువావే సబ్-బ్రాండ్ హానర్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరల్లో హానర్ 7ఏ, 7సీ పేరుతో ఇండియాలో ప్రారంభించింది. గత నెల చైనాలో లాంచ్ చేయగా మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖనటి నేహా ధుపియా మీదుగా ఈ రెండు డివైస్లను లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రత్యేకంగా ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయానికి లభ్యం. ముఖ్యంగా షావోమికి చెందిన రెడ్ మీ 5, 5ఏకు పోటీగా ఫేస్ అన్లాక్, డ్యుయల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా వీటిని లాంచ్ చేసింది. భారత వినియోగదారుల కోసం పేటీఎం ఫీచర్తోపాటు రైడర్స్ సౌకర్యంకోసం రైడ్మోడ్ అనే ఫీచర్ను యాడ్ చేశామని హానర్ ఇండియా ప్రతినిధి సుమీత్ అరోరా తెలిపారు. ఇండియా టాప్ 5 బ్రాండ్గా హానర్ నిలిచిందని పేర్కొన్నారు. షావోమీ, వన్ప్లస్తో పోలిస్తే 146 శాతం హయ్యస్ట్ గ్రోత్ సాధించామని సుశీల్ తారిఖ్ హువావే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రకటించారు. జియో భాగస్వామ్యంతో మోర్ డేటా, మోర్ క్యాష్బ్యాక్ ఆఫర్ అందిస్తున్నామని హానర్ తెలిపింది. హానర్ 7ఏ ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720 x 1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ 3జీబీ/32జీబీ స్టోరేజ్ 13+2ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్స్ లో లభ్యం హానర్ 7సీ ఫీచర్లు 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720 x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 స్నాప్డ్రాగన్ 400 ప్రాసెసర్ 3జీబీ/4జీబీ ర్యామ్ 32జీబీ/64జీబీ స్టోరేజ్ 13+2ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు: 7ఏ ధర 8,999 రూపాయలు నిర్ణయించింది. ఇది మే29 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో అందుబాటులోఉంటుంది. కాగా 7 సీ ధర రూ.9,600, 11,999 రూపాయలు ఉంది. ఇది అమెజాన్ ద్వారా మే31న విక్రయానికి లభ్యం. -
ఈ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ ఇటీవల లాంచ్ చేసిన ‘పీ20 ప్రో, పీ 20లైట్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. మే 2వతేదీనుంచి 7వరకు మెగా సేల్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కస్టమర్లకు అమెజాన్ ద్వారా ప్రత్యేక క్యాష్ బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లు 2 మే నుండి 7 మే, 2018 వరకు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు 100 జీబీ అదనపు డేటాను అందించడానికి వొడాఫోన్తో కూడా కంపెనీ భాగస్వామ్యం ఉంది. కస్టమర్ సంతృప్తిపై తమకు పూర్తి విశ్వాసం వుందని హువావే ఇండియా-కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ సంజీవ్ ప్రకటించారు. ప్రపంచంలో మొట్టమొదటి లైకా ట్రిపుల్ కెమెరా, అపూర్వమైన కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలను కలిగి ఉన్న హువావే పీ 20 ప్రొ పై 5వేలరూపాయల తక్షణ క్యాష్బ్యాక్. అంతేకాక వినియోగదారులకు 6,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పరికరం నెలకు రూ.5417 వద్ద 12 నెలలకు నో కాస్ట్ ఈఎంఐ. ఈ ఆఫర్ యాక్సిస్ బ్యాంక్ కార్డులకు మాత్రమే వర్తిస్తుంది. పీ 20 లైట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారాకొనుగోల చేస్తే 1500 రూపాయల క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్పై నెలకు 1667 నుంచి 12 నెలలు వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అలాగే 2వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ . మరోవైపు వోడాఫోన్ భాగస్వామ్యంతో ఈ రెండు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 199 పైన 10 నెలల పాటు 10 రీఛార్జ్లపైన 100 జీబీ డేటా అదనంగా అందిస్తుంది. దీంతోపాటు పోస్ట్ పోయిడ్ కస్టమర్లకు వోడాఫోన్ రెడ్ ప్లాన్ రూ. 399 రీచార్జ్పై 10 నెలల పాటు 10జీబీ ఉచిత డేటా అదనంగా పొందవచ్చు. కాగా హువావే పీ 20 ప్రొ ,ప్రీ20 లైట్ లాంచింగ్ ధరలు వరుసగా రూ.64,999, ధర 19,999గా ఉన్నాయి. -
ఒక ఫోన్... వెనక మూడు కెమెరాలు!!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ తాజాగా ప్రపంచపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్ఫోన్ ‘పీ20 ప్రో’ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.64,999. ఇందులో లైకా ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, కిరిణ్ 970 ప్రాసెసర్, ఈఎంయూఐ 8.1 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1 ఓఎస్, అల్ట్రా–థిన్ బెజెల్స్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ ఫుల్వ్యూ డిస్ప్లే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. టాప్ రేటింగ్ 40 ఎంపీ రియర్ కెమెరా.. హువావే ‘పీ20 ప్రో’లో లైకా ట్రిపుల్ రియర్ కెమెరా వ్యవస్థను పొందుపరిచారు. ఇందులో 40 మెగాపిక్సెల్ ఆర్జీబీ సెన్సార్, 20 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్, టెలిఫోటో లెన్స్తో కూడిన 8 ఎంపీ సెన్సార్ అనే మూడు కెమెరాలుంటాయి. అలాగే 5ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 960 ఎఫ్పీఎస్ సూపర్ స్లో మోషన్ వంటివి ఈ స్మార్ట్ఫోన్లోని మరికొన్ని ప్రత్యేకతలు. కంపెనీ ఈ ఫోన్లో 24 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అమర్చింది. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో ఈ హ్యాండ్సెట్ డీఎక్స్వో మార్క్ నుంచి యాపిల్, గూగుల్, శాంసంగ్ ఫోన్లను వెనక్కు నెట్టి మరీ అత్యధిక స్కోర్లను సొంతం చేసుకుంది. మొబైల్, సెన్సార్, లెన్స్ రేటింగ్కు డీఎక్స్వో మార్క్ ర్యాంకింగ్ను పరిశ్రమలో ప్రామాణికంగా తీసుకుంటారు. కంపెనీ ‘పీ20 లైట్’ అనే మరొక స్మార్ట్ఫోన్ కూడా ఆవిష్కరించింది. దీని ధర రూ.19,999. ఈ రెండు ఫోన్లు మే 3 నుంచి అమెజాన్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. -
హువాయి కొత్త స్మార్ట్ఫోన్లు: ఫీచర్లు గమనించారా?
బీజింగ్: హువాయి మూడు కొత్తస్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఎంజాయ్ సిరీస్కు కొనసాగింపుగా ఎంజాయ్ 8, 8ప్లస్, 8ఇ మోడల్ మొబైళ్లను విడుదల చేసింది. ఈ మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతానికి చైనా మార్కెట్లో లభ్యం. కాగా అన్ని డివైస్లలో డ్యుయల్ రియర్ కెమెరాలను అమర్చింది. అలాగే 18.9డిస్ప్లే ప్రత్యేకతగా ఉండనున్నాయి.ఎంజాయ్ 8 3జీ వేరియంట్ 1299 యెన్గాను( రూ. 13వేలు) 4జీవేరియంట్ ధర 1499యెన్లుగా ఉండనుంది. ఎంజాయ్ 8ప్లస్ ధర 1699యెన్స్ (సుమారు రూ.17,606) 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1899గా (రూ.19,679)ను ఉంటుంది. ఎంజాయ్ 8ఇ 1099 (రూ.11,388) యెన్గాను నిర్ణయించింది. ఈ స్మార్ట్ఫోన్లు మూడు బ్లూ, పింక్, బ్లాక్ కలర్స్లో లభ్యం. ఎంజాయ్ 8 ఫీచర్లు 5.99 ఇంచెస్ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 3/4జీ ర్యామ్ 32/64జీబీ స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే సదుపాయం 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంజాయ్ 8 ప్లస్ ఫీచర్లు 5.93 డిస్ప్లే 1080x2160 రిజల్యూషన్ ఆక్టాకోర్ కిరిన్ 659ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 4జీబీ 64/128జీబీ స్టోరేజ్ 256 ఎక్స్పాండబుల్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంజాయ్ 8ఇ 5.7 ఇంచెస్ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
త్రిపుల్ బ్యాక్ కెమెరాతో తొలి స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో ముందడుగు పడబోతోంది. ఇప్పటి వరకు డ్యూయల్ రియర్ కెమెరా స్మార్ట్ఫోన్లు మాత్రమే మనల్ని అలరించగా... ఇక నుంచి త్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్ఫోన్ కూడా మన ముందుకు రాబోతోంది. ప్రపంచపు తొలి త్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్ఫోన్ను భారత్లో లాంచ్ చేసేందుకు చైనీస్కు చెందిన స్మార్ట్ఫోన్ తయారీదారి హువావే సిద్ధమవుతోంది. హువావే పీ20, హువావే పీ20 ప్రొ పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను హువావే భారత్లో లాంచ్ చేయబోతోంది. దీనికి సంబంధించి తన అధికారిక వెబ్సైట్లో ఇమేజ్ను టీజ్ కూడా చేసింది. ‘కమింగ్ సూన్ ఇన్ ఇండియా’ ట్యాగ్లైన్తో కంపెనీ దీన్ని పోస్టు చేసింది. దీనిలో పీ20 ప్రొ స్మార్ట్ఫోన్కు ట్రిపుల్ రియర్ కెమెరా ఉండబోతోంది. త్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తున్న తొలి స్మార్ట్ఫోన్ ఇదే. ఒకటి 40 ఎంపీ, మరొకటి 20 ఎంపీ, మూడోది 8 ఎంపీ సెన్సార్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ స్లో మోషన్ వీడియోను 720పీ రెజుల్యూషన్లో 960ఎఫ్పీఎస్ వద్ద రికార్డు చేస్తోంది. హువావే ఈ రెండు స్మార్ట్ఫోన్లను మార్చి 27న పారిస్లో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 8.0 ఓరియోను, కంపెనీ సొంత కిరిన్ 970 ప్రాసెసర్ను, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. హువావే పీ20 ప్రొ స్మార్ట్ఫోన్కు 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. డ్యూయల్ సిమ్ కార్డులను కూడా కలిగి ఉంది. పీ20 స్మార్ట్ఫోన్ 5.8 అంగుళాల స్క్రీన్ కలిగి ఉండి, 20 ఎంపీ, 12 ఎంపీ సెటప్తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్తో మార్కెట్లోకి వస్తోంది. దీని బ్యాటరీ 3400 ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. హువావే పీ20 ప్రొ అంచనా ధర హువావే పీ20 ప్రొ అత్యధిక ధర 899 యూరోలుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.72000 ఉండొచ్చని అంచనా. ఈ ప్రొ వేరియంట్తోనే హువావే తొలిసారి రూ.70వేల ధర మార్కును క్రాస్చేస్తోంది. -
హువాయి పీ20లైట్ లాంచింగ్...ఈ నెలలోనే
సాక్షి,న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ హువాయి మరో కొత్త స్మార్ట్ఫోన్ను త్వరలోనే లాంచ్ చేయనుంది. పీ 20సిరీస్లో పీ20 లైట్ మార్చి 27న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. తరహాలోనే తాజా స్మార్ట్ఫోన్ కూడా ఉండబోతోందని అంచనా. పారిస్లో నిర్వహించనున్న ఈ లాంచింగ్ఈవెంట్లో పీ 20,పీ 20 ప్రో స్మార్ట్ఫోన్లను కూడా లాంచ్ అందుబాటులోకి తీసుకొ స్తోంది. వెబ్సైట్ సమాచారం ఈ మొబైల్ ధర 30వేల రూపాయలుగా ఉండనుంది. పీ20 లైట్ ఫీచర్లు 5.84 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే 1080x2280 పిక్సల్స్ రిజల్యూషన్ కిరిన్ 659 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16+2 ఎంపీ రియర్ డబుల్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
హానర్ 9లైట్: అద్భుతమైన ఫీచర్
సాక్షి, ముంబై: హువాయి సబ్ బ్రాండ్ హానర్ తాజాగా ఒక స్మార్ట్ఫోన్లో ఆసక్తికరమైన అప్గ్రేడ్ను అవిష్కరించింది. హోటా (హూవాయ్ ఓవర్ ది ఎయిర్) ద్వారా "రైడ్ మోడ్" ఫీచర్తో హానర్ 9 లైట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా భారతదేశంలో విడుదల చేసింది. బైక్ నడిపేటపుడు ఫోన్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. ప్రధానంగా యువతే టార్గెట్గా ఈ ఫీచర్ను జోడించింది. తమ సరికొత్త రైడ్ మోడ్ ఫీచర్ లక్షలాది కస్టమర్లకు డ్రైవింగ్ సమయంలో సురక్షితమైన స్మార్ట్ఫోన్ వినియోగ బాధ్యతను గుర్తు చేస్తుందని హువాయ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పి. సంజీవ్ వెల్లడించారు. రైడ్ మోడ్ యాక్టివేషన్ హానర్ 9 లైట్ కొత్తగా తీసుకొస్తున్న ఈ రైడ్మోడ్ ఫీచర్ను మెనూలోంచి డ్రాప్ డౌన్ నోటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకుకోవడంద్వారా గాని యాక్టివ్టే చేసుకోవచ్చు. లేదా ఫోన్ సెటింగ్స్లో రైడ్మోడ్ ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవాలి. దీంతో యూజర్ బైక్ రైడింగ్లో ఉన్నపుడు ఎవరైనా కాల్ చేస్తే.. వినియోగదారుడు ప్రస్తుతం డ్రైవింగ్లో ఉన్నారనీ...కాల్ ఆన్సర్ చేయలేరనే మెసేజ్ కాలర్స్కి అందుతుంది. అంతేకాదు ఒక వేళ అత్యవసరమైతే.. 1 నెంబర్ ప్రెస్ చేస్తే..కాల్ ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతుంది. ఈ సదుపాయం మార్చి చివరినాటికి తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని సంజీవ్ చెప్పారు. హానర్ 9 లైట్ ఫీచర్లు 5.65 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో కిరిన్ 659 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటెర్నెల్ మెమొరీ 256 జీబీ ఎక్స్టర్నల్ మెమొరీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 13 ఎంపీ +2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 13 ఎంపీ +2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ధర రూ.10,999గా ఉంది. అయితే నాలుగు కెమెరాలతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన ఈ ఫోన్లు ఫ్లిప్కార్ట్లో అమ్మకానికి పెట్టిన ఆరు నిమిషాల్లోనే మొత్తం అమ్ముడైపోయాయి. -
బిగ్ స్క్రీన్, డ్యుయల్ రియర్ కెమెరా, బడ్జెట్ ధర
బీజింగ్: హువాయి తాజాగా కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. హానర్ సీ సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ను హానర్ 7సీ పేరుతో ఫేస్ అన్లాక్ ప్రధాన ఫీచర్గా లాంచ్ చేసింది. చైనామార్కెట్లో మార్చి 13నుంచి విక్రయానికి లభ్యం. అయితే గ్లోబల్ మార్కెట్లో ఎప్పటినుంచి అందుబాటులో ఉండేది ఇంకా వెల్లడి కాలేదు. రెండు వేరియట్లలో ఇది లాంచ్ కాగా 3జీబీ/32 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.9000 గాను, 4జీబీ/64జీబీవేరియంట్ సుమారు ధర రూ. 13,400 గా ఉండనుంది. హానర్ 7సీ ఫీచర్లు 5.99 అంగుళాల డిస్ప్లే 18.9 యాస్పెక్ట్ రేషియో 1.8 గిగా హెడ్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ 720x1440 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే సదుపాయం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 +2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆరు నిమిషాల్లో రికార్డు అమ్మకాలు
సాక్షి, న్యూఢిల్లీ: హువాయి తాజాగా విడుదల చేసిన హానర్ 9 లైట్ స్మార్ట్ఫోన్ హాట్కేకులా అమ్ముడుపోయింది. ఫ్లిప్కార్ట్లో మంగళవారం మధ్యాహ్నం ఫ్లాష్ సేల్లో అమ్మకానికి పెట్టగా రికార్డుస్థాయిలో ఆరు నిమిషాల్లో ఫోన్లు అన్నీ అమ్ముడైపోయాయి. మార్కెట్లో పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ తమ ఫోన్కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని హువాయి కన్జుమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ పి. సంజీవ్ తెలిపారు. సరసమైన ధరలో అత్యాధునిక ఫీచర్లు అందించడం వల్లే హానర్ 9 లైట్ స్మార్ట్ఫోన్ సక్సెస్కు కారణమని వివరించారు. ముందు, వెనుక డ్యుయల్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకత. హానర్ 9 లైట్ ఫీచర్లు 5. 65 అంగులాల డిస్ప్లే కిరిన్ 659 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 3 జీబీ ర్యామ్ 32 జీబీ/256 జీబీ స్టోరేజ్ 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర రూ. 10,999 -
ముందు రెండు, వెనుక రెండు కెమెరాలు
న్యూఢిల్లీ : హువావే బ్రాండ్ హానర్, న్యూఢిల్లీ వేదికగా సరికొత్త స్మార్ట్ఫోన్ను నేడు(బుధవారం) లాంచ్ చేసింది. క్వాడ్-కెమెరాతో హానర్ 9 లైట్ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ను హానర్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లోనే జనవరి 21 నుంచి అందుబాటులోకి రానుంది. ముందు రెండు, వెనుక రెండు కెమెరాలు మాత్రమే కాక, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆధారిత లేటెస్ట్ ఈఎంయూఐ 8.0తో రన్ కావడం ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకత. రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ అయింది. హానర్ 9 లైట్ ధర, లాంచ్ ఆఫర్లు 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలు కాగ, 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర 14,999 రూపాయలు. ఈ రెండు వేరియంట్లు ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో, హానర్ ఇండియా స్టోర్లో ఫ్లాష్ సేల్ ద్వారా లభ్యం కానున్నాయి. తొలి ఫ్లాష్ సేల్ జనవరి 21 అర్థరాత్రి 12 గంటలకు, రెండో ఫ్లాష్ సేల్ అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు. ఆ సేల్స్ అనంతరం మరో రెండు సేల్స్ జనవరి 22, 23 తేదీల్లో మధ్యాహ్నం జరుగనున్నాయి. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే సిటీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద 10 శాతం హానర్ ఆఫర్ చేయనుంది. హానర్ 9 లైట్ స్పెషిఫికేషన్లు... డ్యూయల్-సిమ్ స్మార్ట్ఫోన్ 5.65 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ఆక్టాకోర్ హువావే హాయ్సిలికాన్ కిరిన్ 659 ఎస్ఓసీ 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లు 256జీబీ వరకు విస్తరణ మెమరీ మొత్తం నాలుగు కెమెరాల ముందు, వెనుక 13 మెగాపిక్సెల్తో ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఉద్యోగులను ఇంటికి పంపేసిన చైనీస్ కంపెనీ
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ మల్టినేషనల్ నెట్వర్కింగ్, టెలికమ్యూనికేషన్స్ ఈక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ కంపెనీ హువావే భారత్లోని తన ఉద్యోగులను భారీగా ఇంటికి పంపేసింది. ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీలో నెలకొన్న విలీన కన్సాలిడేషన్తో తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించేసింది. వొడాఫోన్-ఐడియా విలీనం, టెలికాం రంగ వ్యాప్తంగా ఆర్థిక ఒత్తిడి నెలకొనడం హువావే ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగులు కోతను చూస్తున్నామని, సుమారు 30 శాతం మంది ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకి వెళ్లిపోయారని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొంతమంది ఉద్యోగులను ఫీల్డ్ టీమ్స్లో మళ్లీ నియమించుకున్నట్టు తెలిసింది. పనితీరు, నెట్వర్క్ నిలిపివేత, టెలికాం వ్యాపారాలు పడిపోవడం వంటి ఆధారంగా ఉద్యోగులను కంపెనీని వీడాలని చెప్పినట్టు ఓ అధికారి చెప్పారు. హువావే ఓ డైనమిక్ సంస్థ అని, ఈ డైనమిక్ తమ వర్క్ పాలసీ నుంచి కూడా రావాల్సి ఉంటుందని హువావే ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జే చెన్ తెలిపారు. మంచి పనితీరు కనబర్చే వారికి తాము అన్ని వనరులు సమకూరుస్తామని, అదే సమయంలో పనిచేయని వారిపై కూడా చర్యలుంటాయని పేర్కొన్నారు. ఉద్యోగుల కోత విధించిన అనంతరం సేల్స్, సప్లయ్ చైన్, ఆర్ అండ్ డీ, నెట్వర్క్ ఇంజనీరింగ్ ఫంక్షన్స్ వ్యాప్తగా 8వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రధాన వెండర్లు వొడాఫోన్, ఐడియాలు మేనేజింగ్ సర్వీసులను, నెట్వర్క్ సంబంధిత ఆపరేషన్స్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం టెలికాం పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వొడాఫోన్, ఐడియాలు విలీనమవుతున్నాయి. ఈ విలీనం అనంతరం తమకు మరింత స్పష్టత రావాల్సి ఉందని చెన్ చెప్పారు. -
40 ఎంపీ ట్రిపుల్-కెమెరాతో హువాయ్ స్మార్ట్ఫోన్
గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ కెమెరాలు రోజురోజుకి మరింత మెరుగ్గా రూపొందుతూ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ విషయంలో ఐఫోన్ కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ, దాన్ని ప్రత్యర్థులు శాంసంగ్, గూగుల్, హువాయ్లు మాత్రం ఆపిల్ మించిపోయే ఉన్నాయి. ఈ కంపెనీ స్మార్ట్ఫోన్ కెమెరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తాజాగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న రిపోర్టుల ప్రకారం హువాయ్, వచ్చే వారాల్లో ఫోటోగ్రఫీ-సెంట్రిక్ స్మార్ట్ఫోన్ సిరీస్ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇవాన్ బ్లాస్ కూడా కొత్త హువాయ్ స్మార్ట్ఫోన్పై ట్వీట్ చేశారు. హువాయ్ కొత్తగా తీసుకురాబోతున్న స్మార్ట్ఫోన్ లేదా స్మార్ట్ఫోన్ సిరీస్ వెనుక వైపు 40 ఎంపీ ట్రిపుల్-లెన్స్ కెమెరా మోడ్యుల్ను కలిగి ఉన్నట్టు తెలిపారు. సెల్ఫీ కెమెరా కూడా 24 మెగాపిక్సెల్ రూపొందుతుందని పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్కు జర్మన్ కెమెరా కంపెనీ లైకా కో-డెవలప్డ్గా సహకారం అందిస్తుందని ఇవాన్ బ్లాస్ ట్వీట్ చేశారు. హువాయ్ అంతకముందు విడుదల చేసిన పీ10, మేట్ 10 స్మార్ట్ఫోన్లకు కెమెరా మోడ్యుల్స్ను లైకానే అభివృద్ధి చేసింది. ట్రిపుల్ కెమెరా మోడ్యుల్ హ్యువాయ్ తీసుకురాబోతున్న తొలి ఫోన్. ఈ కెమెరా స్మార్ట్ఫోన్లో హువాయ్ విజయవంతమవుతుందో లేదోనని టెక్ వర్గాలు ఆసక్తికరంగా వేచిచూస్తున్నాయి. జర్మన్ కెమెరా తయారీదారి లైకాతో హువాయ్ గత కొన్నేళ్లుగా భాగస్వామ్యం కొనసాగిస్తోంది. లైకా భాగస్వామ్యంలో భారత్లో తొలిసారి విడుదల చేసిన స్మార్ట్ఫోన్ హువాయ్ పీ9. -
హానర్ 7ఎక్స్ వచ్చేసింది..హైలైట్ ఏంటి?
హువావే బ్రాండ్లో హానర్ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. హానర్ 7 ఎక్స్ పేరుతో దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన ఫుల్ వ్యూ డిస్ప్లే , డ్యూయల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. స్టోరేజ్ పరంగా రెండు వేరియంట్లలో ఇది లభ్యంకానుంది. 32జీబీ వేరియంట్ ధరను రూ.12,999గా, 64జీబీ వేరియంట్ ధరను రూ. 15,999గా నిర్ణయించింది. ప్రత్యేకంగా అమెజాన్లో డిసెంబర్ 7వ తేదీ మధ్నాహ్నం 12గంటలకు కొనుగోలుకు లభ్యం. హానర్ 7ఎక్స్ ఫీచర్లు 5.93 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3340 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఐ ఫోన్ ఎక్స్కు చెక్ పెట్టేలా హువాయ్ స్మార్ట్ఫోన్లు
బీజింగ్: చైనా దిగ్గజం హువాయి అమెరికన్ మొబైల్ దిగ్గజం ఆపిల్కు చెక్పెట్టేలా సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఆపిల్ ఇటీవల విడుదల చేసిన ఐ ఫోన్ 8, 8ప్లస్, X కు ధీటుగా రెండు డివైస్లను ప్రవేశపెట్టింది. హువాయి మాట్10, మాట్ 10 ప్రొ లను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ యు ఆవిష్కరించారు. అంతేకాకుండా, హువాయి పోర్స్చే డిజైన్ హువాయ్ మాట్ 10 కూడా ఆవిష్కరించారు. స్మార్ట్ఫోన్లలో అత్యంత అధునాతన చిప్సెట్ తో వీటిని రూపొందించామనీ ఇది చాలా శక్తివంతమైందనీ, అల్టిమేట్ పెర్ఫామెన్స్, ఇంటిలిజెన్స్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయనీ యు పేర్కొన్నారు. హువాయ్ 10 ధర దాదాపు రూ .53,400గాను, 10 ప్రో ధరను దాదాపు రు .61,000గాను నిర్ణయించింది. మాట్ 10 ప్రోను రెండు వేరియంట్లలో (4 జీబీర్యామ్, 64 జీబీ అంతర్గత నిల్వ, 6జీబీ ర్యామ్, 128జీబీ అంతర్గత నిల్వ ) లాంచ్ చేసింది. పరిమితమార్కెట్లలో అందుబాటులో ఉండే పోర్స్చే డిజైన్ హువాయ్ మాట్ 10 దాదాపు రూ.1,6,6,600లకు లభ్యం కానుంది. డైమండ్ బ్లాక్కలర్లో 6జీబీ ర్యామ్/ 256జీబీ లభ్యమవుతుందని కంపెనీ ప్రకటించింది. నవంబరు నుంచి ఆస్ట్రేలియా, చైనా, ఈజిప్ట్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, సింగపూర్, స్పెయిన్,యూఏఈ దేశాల్లో విక్రయాలు మొదలుకానున్నాయి. అలాగే యూరోప్ మరియు ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో కూడా ఉండనుంది. ప్రయోగ మార్కెట్లలో దాదాపు రూ.1,6,6,600 వద్ద అందుబాటులో ఉంచింది. మాట్ 10, 10 ప్రో రెండూ రెండూ ఫుల్ వ్యూ డిస్ప్లేతో, స్వదేశీ HiSilicon Kirin 970 SoC ఆధారితమైనవి, న్యూయరల్-నెట్వర్క్ ప్రాసెసర్ యూనిట్ (NPU) ను కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ఫోన్ చిప్ సెట్ అని కంపెనీ చెబుతోంది. అలాగే ఐ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ మిస్అయితే హువాయి మాత్రం ఈరెండు రెండు ఫోన్లలనో ఫింగర్ ప్రింట్ సెన్సార్ జత చేర్చింది. దీంతో ఆపిల్ తరహా స్లిమ్మెర్ బాడీతో, బయోనిక్ స్వంత డ్యూయల్ కోర్ 'నారల్ ఇంజిన్' మద్దతుతో వస్తున్న ఆపిల్ ఐఫోన్లకు గట్టిపోటీ ఇస్తాయని మొబైల్ నిపుణులు భావిస్తున్నారు. హువాయ్ మాట్ 10 ప్రో 6 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్ రిజల్యూషన్ 4 జీబీ/64 జీబీ అంతర్గత నిల్వ, 6జీబీ ర్యామ్/ 128జీబీ 20మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 12 మెగాపిక్సెల్ ఆర్జీబీ సెన్సార్ 8 ఎంపి సెల్ఫీ కెమెరా 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, హువాయ్ మాట్ 10 5.9 అంగుళాల డిస్ఫ్లే 1440x2560 పిక్సల్స్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 20మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 12 మెగాపిక్సెల్ ఆర్జీబీ సెన్సార్ 8 ఎంపి సెల్ఫీ కెమెరా 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
ఆపిల్కు ఎదురుదెబ్బ: ఫస్ట్ ఛాయిస్ దానికే
బీజింగ్ : టెక్ దిగ్గజం ఆపిల్కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా తన హవా చాటుతున్న ఆపిల్, చైనా మార్కెట్లో మాత్రం తన సత్తాను నిరూపించుకోలేకపోతుంది. చైనా వినియోగదారులకు దగ్గర అవాలనుకుంటున్న ఆపిల్ను స్థానిక బ్రాండ్లు దెబ్బకొడుతున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో చైనా స్మార్ట్ఫోన్ కొనుగోలుదారుల తొలి ఛాయిస్గా హువాయ్ నిలుస్తున్నట్టు వెల్లడైంది. ఫైనాన్సియల్ టైమ్స్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో 31.4 శాతం మంది హువాయ్ను తమ బ్రాండుగా ఎంపికచేసుకుంటున్నట్టు తెలిపారు. తమ తదుపరి ఫోన్గా ఐఫోన్ను కొనుగోలు చేస్తామనే వారి సంఖ్య 24.2 శాతానికి పడిపోయింది. 2016లో ఐఫోన్ 7 లాంచ్ అయినప్పుడు ఈ శాతం 25.8 శాతంగా ఉంది. యేటియేటికి ఐఫోన్ కొనుగోలు చేద్దామనుకునే వారి సంఖ్య పడిపోతుందని తేలింది. గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోనూ జూన్, జూలై విక్రయాల్లో హువాయ్ తొలిసారి ఆపిల్ను అధిగమించేసింది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ తాజా రిపోర్టు 'మార్కెట్ పల్స్ ఫర్ జూలై 2017'' ప్రకారం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తర్వాతి స్థానం గ్లోబల్గా హువాయ్దేనని తెలిసింది. హువాయ్కు ఇది ఒక మైలురాయని, విక్రయ ఛానల్ను విస్తరించుకోవడం, తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లలో స్థిరమైన పెట్టుబడులకు ఇది ఒక ప్రతీకని రిపోర్టులు పేర్కొన్నాయి. కీలక సప్లై చైన్ పార్టనర్లతో హువాయ్, వివో, ఒప్పో, షావోమిలు విజయమవుతున్నట్టు తెలిపాయి. బెజెల్-ఫ్రీ, ఫుల్ డిస్ప్లేస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇన్-హౌజ్ చిప్సెట్స్, అడ్వాన్స్డ్ కెమెరా ఫీచర్లతో వీటి ఫోన్లు రూపొందుతున్నాయి. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది లాంచ్ అయిన కొత్త ఐఫోన్లు కొనుగోలుచేస్తామనే వారి శాతం కూడా తగ్గిపోయింది. -
ఆపిల్ను వెనక్కి నెట్టిన చైనా బ్రాండ్
స్మార్ట్ఫోన్ దిగ్గజం ఆపిల్కి కంపెనీ చైనా ఆధారిత స్మార్ట్ఫోన్ కంపెనీ హువాయి భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచంలో మొబైల్ అమ్మకాల్లో హువాయ్ రెండవస్థానాన్ని ఆక్రమించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది. దీంతో ఆపిల్ మూడవ స్థానానికి పడిపోయింది. తాజా పరిశోధన ప్రకారం ఇప్పటివరకూ ఆపిల్ సొంతమైన రెండవ స్థానాన్ని చైనా బ్రాండ్ హువాయ్ కొట్టేసింది. జూన్, జులై ప్రపంచ స్మార్ట్ఫోన్ అమ్మకాలలో హువాయ్ ఆపిల్ను అధిగమించింది. ఆగస్ట్ అమ్మకాల్లో కూడా ఇదే హవాను కొనసాగించననుంది. గ్లోబల్ గా దాదాపు 13శాతం మార్కెట్షేర్ను కొల్లగొట్టిన హువాయి..భారత్ మార్కెట్లో కూడా తన సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇండియాలో ఈ సంవత్సరాంతానికి టాప్ -5లో ఉండాలన్న టార్గెట్ నిర్దేశించుకుంది. జూన్లో హువాయి ఇండియా డైరెక్టర్ అల్లెన్ వాంగ్ అందించిన వివరాల ప్రకారం 2016 డిసెంబర్ నాటికి 13.2శాతానికి చేరుకోగా, ఆపిల్ కేవలం 12శాతంతో సరిపెట్టుకుంది. గత ఏడాది దాదాపు 139 మిలియన్లవ స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసినట్టు వాంగ్ ప్రకటించారు. అలాగే హానర్ ఇప్పుడు ప్రపంచ నంబర్ వన్ ఆన్లైన్ బ్రాండ్గా మారిందని, తమ బ్రాండ్ ఇప్పుడు భారతదేశంతో సహా 74 దేశాల్లో అమ్ముడవుతోందని వాంగ్ తెలిపారు. పరిశ్రమ నిపుణుల ప్రకారం, స్మార్ట్ఫోన సెగ్మెంట్ లో హువాయ్ భారతదేశంలో అమ్మకాలు రెండింతల వృద్ధిని అంచనావేసింది. అయితే పోటీదారులతో పోలిస్తే ఇది తక్కువేనని ఈ పరిశోధన తెలిపింది.అలాగే 2016 - 2017 మొదటి త్రైమాసికానికి హవావీ అమ్మకాలు రెట్టింపు సాధించినప్పటకీ ప్రత్యర్థులు, చైనా కంపెనీలు ఒప్పో, మరియు వివోలతో పోలిస్తే చాలా తక్కువే. అయినప్పటికీ, భారతదేశంలో పెద్ద ఆటగాళ్లను సవాలు చేసే ఏకైక బ్రాండ్ హువాయి అని తాము విశ్వసిస్తున్నామని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెకర్టర తరుణ్ పాథక్ తెలిపారు. -
మార్కెట్లోకి ‘హానర్ 8 ప్రొ’ స్మార్ట్ఫోన్
ధర రూ.29,999 న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ సబ్బ్రాండ్ హానర్ తాజాగా ‘హానర్ 8 ప్రొ’ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.29,999గా ఉంది. ఆండ్రాయిడ్ నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లో 5.7 అంగుళాల క్యూహెచ్డీ స్క్రీన్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ‘హానర్ 8 ప్రొ’ స్మార్ట్ఫోన్లు కస్టమర్లకు అమెజాన్ ఇండియాలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి. వీటిని ప్రైమ్ యూజర్లు జూలై 10 నుంచి, ఇతరులు జూలై 13 నుంచి కొనుగోలు చేయవచ్చు. -
హువావే నుంచి 'వై7 ప్రైమ్' స్మార్ట్ఫోన్
హువావే తన తాజా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ 'వై7 ప్రైమ్' పేరుతో హాంగ్కాంగ్ లో లాంచ్ చేసింది. త్రీ కలర్స్ లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ను త్వరలోనే దీన్ని భారత్లో కూడా విడుదల చేయనుంది. దీని ధర సుమారు రూ.15,500 గా ఉండనుంది. వై7 ప్రైమ్' ఫీచర్స్ విషయానికి వస్తే.. వై7 ప్రైమ్' ఫీచర్స్ 5.5 ఇంచ్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1280 x 720 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫింగర్ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
హానర్ 8 లైట్ లాంచింగ్..రేపే
న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ హువావే తన నూతన స్మార్ట్ఫోన్ 'హానర్ 8 లైట్'ను భారత మార్కెట్ లో రేపే (11 మే) విడుదల చేయనుంది. ఎప్పటినుంచో ఈ స్మార్ట్ఫోన్ విడుదలపై పలు వార్తలు వచ్చినప్పటికీ తాజాగా మూడు రోజుల్లో బిగ్ సర్ప్రైజ్ అంటూ హానర్ ఇండియా ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ హింట్ తో హానర్ 8 లైట్ను గురువారం లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. అయితే ఫీచర్లు, ధర, లాంచింగ్ పై కచ్చితమైన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ 8 లైట్ ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లో వినియోగదారులకు లభ్యం కానుందని తెలుస్తోంది. అలాగే బ్లూ,గోల్డ్, వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో ఈ డివైస్ను అందుబాటులోకి తేనుంది. ఓన్లీ మొబైల్స్.కాం అందించిన సమాచారం ప్రకారం దీని ధర రూ. 17,999గా నిర్ణయించినట్టు సమాచారం. The big surprise unveils in just 3 days and we can barely curb the excitement! Stay tuned as it’s going to a great one. #LiveLite pic.twitter.com/3e6XsP1L7d — Honor India (@HiHonorIndia) May 9, 2017 -
హువాయ్ ‘ఎంజాయ్ 7ప్లస్’ లాంచ్
చైనా మొబైల్ మేకర్ హువాయ్ తన నూతన స్మార్ట్ఫోన్ 'ఎంజాయ్ 7 ప్లస్'ను లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లో శనివారం ప్రవేశపెట్టింది. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ.14,080, రూ.15,956 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. గోల్డ్, షాంపైన్ గోల్డ్, బ్లూ, బ్లాక్, సిల్వర్, గ్రే మరియు పింక్ కలర్స్లోఅందుబాటులోఉండనుంది. ఏప్రిల్ 28 నుంచి వివిధ ఆన్లైన్ స్టోర్లలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నట్టు సంస్థ ప్రకటించింది. హువాయ్ ఎంజాయ్ 7 ప్లస్ ఫీచర్లు 5.5 ఇంచ్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1280 x 7720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ -
హువాయ్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: హువాయ్ తనకొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎక్స్ సిరీస్ లో 5 ఎక్స్ తో విజయం సాధించిన కంపెనీ ఇపుడు 'హానర్ 6 ఎక్స్'ను లాంచ్ చేసింది. 3 జీబీ వేరియంట్ ధరను రూ.12,999 గా కంపెనీ నిర్ణయించింది. 3 జీబీ 4 జీబీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అమెరికాలో విడుదలైన దీని ధర సుమారు రూ.16,996గా ఉంది. హానర్ 6 ఎక్స్ ఫీచర్లు 5.50 అంగుళాల స్క్రీన్ ఆక్టా కోర్ ప్రాసెసర్ 1080x1920 రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 4 జీబీ ర్యామ్64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 3340ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ -
హువావే ఆనర్.. మూడు 4జీ స్మార్ట్ఫోన్లు
• ధరలు రూ.9,999 నుంచి రూ.29,999 రేంజ్లో • బ్రాండ్ అంబాసిడర్గా సైనా నెహ్వాల్ సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ కంపెనీ హువావే, ఆనర్ బ్రాండ్లో మూడు 4జీ స్మార్ట్ఫోన్లను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆనర్ 8, ఆనర్ 8 స్మార్ట్, ఆనర్ హోలీ 3 పేరుతో రూపొందించిన ఈ మూడు స్మార్ట్ ఫోన్లను బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా, నటి నిమ్రత్ కౌర్, ఆనర్ గ్లోబల్ ప్రెసిడెంట్ జియోర్జ్ జో విడుదల చేశారు. ఆనర్ ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడానికి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో ఒప్పందం కుదుర్చుకున్నామని హువావే. ఆనర్ ఇండియా కన్సూమర్ బిజినెస్ హెడ్ పి. సం జీవ్ పేర్కొన్నారు. ఆనర్ 8 అమ్మకాలు ప్రారంభించామని పేర్కొన్న కంపెనీ, ఆనర్ 8 స్మార్ట్, ఆనర్ హోలీ 3 ఫోన్లను ఎప్పుడు విక్రయించేదీ వెల్లడించలేదు. ఆనర్ 8 @రూ.29,999 ఆనర్ 8 ఫోన్లో వెనక వైపు 12 మెగాపిక్సెల్ డ్యుయల్ లెన్స్ కెమెరా, ముందు వైపు 8మెగా పిక్సెల్ కెమెరా, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ఫోకస్ చేంజ్లతో పాటు కెమెరా అడ్జెస్ట్మెంట్ ఫీచర్లు-లైట్ అపెర్చర్, షట్టర్ స్పీడ్ వంటి ప్రత్యేకతలున్నాయి. హువాయ్ కిరిన్ 950 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3100ఎంఏహెచ్ బ్యాటరీ, 128 జీబీ ఎక్స్టర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.29,999. ఈ మోడల్కు రెండేళ్ల వారంటీని కంపెనీ ఇస్తోంది. ఇక ఆనర్ 8 స్మార్ట్ మోడల్ఫోన్లో 5.2 అంగుళాల స్క్రీన్, 13 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.19,999. ఆనర్ హోలి 3లో 5.5 అంగుళాల డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. భారత్లోనే తయారైన కంపెనీ తొలి స్మార్ట్ఫోన్ ఇది. ధర రూ.9,999. 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యం.. వచ్చే ఏడాది కల్లా 10% మార్కెట్ వాటా సాధిం చడం, భారత్లో మూడో అతి పెద్ద మొబైల్ కంపెనీగా అవతరించడం లక్ష్యాలని సంజీవ్ తెలిపారు. -
హానర్ 8 స్మార్ట్ఫోన్ లాంచింగ్ ఆ రోజే!
హ్యువాయ్ టెర్మినల్ బ్రాండ్ హానర్ 8 స్మార్ట్ఫోన్ లాంచింగ్కు ముహుర్తం ఖరారైంది. అక్టోబర్ 12న న్యూఢిల్లీ ఈవెంట్గా ఈ ఫోన్ను హ్యువాయ్ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ ఈవెంట్కు సంబంధించిన ఆహ్వానాలను కూడా కంపెనీ పంపించింది. ధర, అందుబాటులో ఉండే వివరాలను ఆవిష్కరణ కార్యక్రమంలోనే హ్యువాయ్ ప్రకటించనుంది. వెనుకవైపు రెండు కెమెరాలు కలిగిఉండటం ఈ ఫోన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. పూర్తిగా ప్రీమియం మెటల్ డిజైన్, వెనుకవైపు ఫింగర్ప్రింట్ స్కానర్, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. జూలైలోనే ఈ ఫోన్ చైనాలో ఆవిష్కరణ అయింది. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ను హ్యువాయ్ తీసుకొచ్చింది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ మోడల్ ధర 1,999 యువాన్స్(సుమారు..20వేలు), 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,299 యువాన్స్(సుమారు రూ.23వేలు), 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,499 యువాన్స్(సుమారు రూ.25వేలు)తో మూడు వేరియంట్లను చైనా మార్కెట్లోకి ఈ ఫోన్ విడుదలైంది. అయితే భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఎన్ని వేరియంట్లలో ప్రవేశపెడుతుందో కంపెనీ వెల్లడించలేదు. హానర్ 8 ప్రత్యేకతలు... 5.2 అంగుళాల ఫుల్-హెచ్డీ ఎటీపీసీ ఎల్సీడీ డిస్ప్లే 1.8 గిగాహెడ్జ్ కిరిన్ 950 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3జీబీ లేదా 4జీబీ ర్యామ్ 32జీబీ, 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ 153 గ్రాములు 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
భారత్లో మరో చైనా కంపెనీ తయారీ ప్లాంట్
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్మార్ట్ఫోన్ విక్రయదారి అయిన హువావే కూడా భారత్లో హ్యాండ్ సెట్ల తయారీకి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కార్యకలాపాలను ప్రారంభించబోతుందట. ఇంకో నెలలో ఈ ప్లాన్కు సంబంధించిన వివరాలను హువావే వెల్లడించనుంది. ప్రస్తుతం భారత్లో హ్యాండ్ సెట్ల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి లైసెన్సు పొందామని, త్వరలోనే తయారీ ప్రణాళిక వివరాలను వెల్లడిస్తామని హువావే ఇండియా కన్సూమర్ బిజినెస్ గ్రూపు అధినేత పిటర్ జాయ్ తెలిపారు. చైనా తర్వాత తమ మొబైల్ డివైజ్లకు భారత్ రెండో మార్కెట్గా ఉండాలని కంపెనీ భావిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్గా, సరియైన సమయంలో భారత్లో వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్నామని వెల్లడించింది. భారత్ మార్కెట్లో తమ దూకుడును పెంచి, హువావే స్టోర్లను 50వేలకు పెంచుతామని పిటర్ వివరించారు. గత 16 ఏళ్లుగా హువావే భారత్లో మొబైల్ ఫోన్ల విక్రయాలు చేపడుతోంది. 1999లో బెంగళూరులో స్వతంత్ర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుచేసింది. సొంత బ్రాండెడ్ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు కూడా హువావే ప్లాన్ చేస్తోంది. కానీ ఆ ప్లాన్కు సంబంధించిన వివరాలను ఇంకా బయటికి వెల్లడించలేదు. బుధవారమే హువావే తన కొత్త స్మార్ట్ఫోన్ హువావే పీ9ను రూ.39,999లకు ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయాలు చేపట్టనున్నట్టు తెలిపింది. -
హువావే నుంచి..‘పీ9’ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: ప్రపంచపు మూడో అతిపెద్ద మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ తాజాగా ‘పీ9’ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.39,999. ఈ స్మార్ట్ఫోన్లో నాణ్యమైన సిగ్నల్స్ కోసం మూడు యాంటినాలను పొందుపరిచామని, దీని వల్ల కాల్ డ్రాప్స్ తగ్గుతాయని కంపెనీ పేర్కొంది. ఇక ఆండ్రాయిడ్ మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లో 5.2 అంగుళాల స్క్రీన్, 4జీ, డ్యూయెల్ క్వాడ్కోర్ ప్రాసెసర్, డ్యూయెల్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్లను ఆన్లైన్ పోర్టల్ ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. కాగా కంపెనీ ఈ స్మార్ట్ఫోన్తో పాటు ‘మెట్బుక్’, ‘టాల్క్బాండ్ బీ3’ అనే రెండు ట్యాబ్లెట్ పీసీలను కూడా ఆవి ష్కరించింది. ఇవి త్వరలో భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. -
హువాయి ని సవాల్ చేసిన శాంసంగ్
-
హువాయి ని సవాల్ చేసిన శాంసంగ్
బీజింగ్: టెక్నాలజీ దిగ్గజం, దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హువాయి టక్నాలజీస్ మధ్య చెలరేగిన పెటెంట్ వివాదంలో మరింత ముదురుతోంది. పేటెంట్ ఉల్లంఘన ఆరోపణలతో చైనా లోని బహుళ కోర్టులో హువాయ్ పై దావా వేసినట్టు శాంసంగ్ శుక్రవారం వెల్లడించింది. తన పేటెంట్ హక్కులను ఆరింటిని హువాయి ఉల్లంఘించిందని కంపెనీ చెబుతోంది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో చివరికి న్యాయాస్థానానికి ఆశ్రయించినట్టు పేర్కొంది. తమ మేధో హక్కులను కాపాడుకోవడానికి చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది. అయితే తమకుఎలాంటి నోటీసులు రాలేదని.. వస్తే తగినచర్యలు తీసుకుంటామని హువాయి చెప్పింది. మేధో సంపత్తి హక్కుల వివాదాలు చర్చలతో పరిష్కారంకాకపోవడంతో వ్యాజ్యంతో పరిష్కరించడానికి తరచూ సమర్థవంతమైన మార్గంగా ఉంటోందని కంపెనీ వెల్లడించింది. కాగా తమ 4జీ సెల్యులార్ సమాచార సాంకేతిక, ఆపరేటింగ్ వ్యవస్థలు, యూజర్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ పేటెంట్లు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ ఏడాది మే నెలలో చైనీస్ సంస్థ హువాయీ...శాంసంగ్ పై అమెరికా, చైనా కోర్టులలో దావా వేసింది. అయితే యాపిల్ శాంసంగ్ మధ్య జరిగిన పేటెంట్ యుద్ధంలో చివరికి శాంసంగ్ విజయం సాధించింది. మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని యాపిల్ చెల్లించాలనికోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ తాజా పోరులో విజయం ఎవరిదో వేచి చూడాలి. -
శామ్ సంగ్ పై పేటెంట్ దావా..!
రెండు ఆసియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజాల మధ్య న్యాయపోరాటం తీవ్రతరమవుతోంది. హ్యువాయ్ సంస్థ తన స్మార్ట్ ఫోన్ ప్రత్యర్థి శామ్ సంగ్ పై చైనాలో మరో పేటెంట్ దావాను ఫైల్ చేసింది. 16 శామ్ సంగ్ ఉత్పత్తులు హ్యువాయ్ పేటెంట్ హక్కులను అతిక్రమించాయని ఆరోపణలు చేస్తూ ఈ దావాను నమోదుచేసింది. ఈ హక్కుల ఉల్లంఘనల కింద 120 లక్షల డాలర్ల (దాదాపు రూ. 90 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొబైల్ టెర్మినల్, డిస్ ప్లే కు సంబంధించిన విధానాలను శామ్ సంగ్ ఉల్లంఘించిందని హ్యువాయ్ ఆరోపిస్తోంది. వీటిని శామ్ సంగ్ గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, గెలాక్సీ జే5 లలో ఉపయోగించిందని హ్యువాయ్ ఈ దావాలో పేర్కొంది. ఈ మోడల్స్ ను శామ్ సంగ్ హ్యుజూ, త్యాన్జిన్ కర్మాగారాల్లో రూపొందించినట్టు హ్యువాయ్ ఆరోపిస్తోంది. ఈ కేసును కోర్టు ఆమోదించిందని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ ఫిర్యాదును కంపెనీ పూర్తిగా విశ్లేషించిన తర్వాతే తన ప్రయోజనాలు రక్షించుకునేందుకు తగిన చర్యలు చేపడతామని శామ్ సంగ్ చెప్పింది. హ్యువాయ్ అధికార ప్రతినిధులు మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. మే నెలలోనే శామ్ సంగ్ పై అమెరికా, చైనాల్లో హ్యువాయ్ దావా వేసింది. నాలుగో తరం సెల్యులార్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, యూజర్ ఇంటర్ ఫేస్ సాప్ట్ వేర్ ను శామ్ సంగ్ ఫోన్లలో ఎలాంటి లైసెన్సులు లేకుండా వాడిందని ఆ దావాను ఫైల్ చేసింది. దానికి నష్టపరిహారాన్ని కూడా ఆ కంపెనీ కోరింది. -
శాంసంగ్కు చుక్కెదురు
బీజింగ్: టెక్ దిగ్గజం శాంసంగ్ కు చైనా టెక్నాలజీ ఉత్పత్తుల తయారీ కంపెనీ హువాయి సవాల్ విసిరింది. తన ప్రత్యర్థి మొబైల్ ఫోన్ తయారీ సంస్థలో అగ్రగామిగా నిలిచిన శాంసంగ్ కు వ్యతిరేకంగా ఓ పిటిషన్ దాఖలు చేసింది. పేటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా, చైనాలలో వ్యాజ్యాలు దాఖలు చేసింది. తన ముఖ్యమైన టెక్నాలజీ విషయంలో పేటెంట్ ను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తోంది. హువాయి టెక్నాలజీస్ లిమిటెడ్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తనకు రీజనబుల్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే ఎంత చెల్లించాలని అనేది మాత్రం స్పష్టం చేయలేదు. స్మార్ట్ఫోన్ల విభాగంలో అంచెలంచెలుగా విస్తరిస్తోన్న బ్రాండ్లలో హువాయి ఒకటి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్ఫోన్లను అందిస్తూ తన మార్కెట్ షేర్ ను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో హువాయి ప్రకటన ప్రపం వ్యాప్తంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ పరిశ్రమలో సాంకేతిక సృష్టికర్తలు , పోటీదారుల మధ్య నెలకొన్న పోటీని హైలైట్ చేసింది. మరోవైపు మొబైల్ అమ్మకాల్లో శాంసంగ్ యాపిల్ ను వెనక్కి నెట్టి ముందుకు దూసుకు వచ్చింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మొబైల్ అమ్మకాల్లో 24.5 వృద్ధిని సాధించి నెం.1 స్థానాన్ని కొట్టేసింది. ఆపిల్ 15.3 శాతం అమ్మకాలతో రెండవస్థానంతో సరిపెట్టుకోగా హువాయి 8.2 శాతం అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచి, దిగ్గజ కంపెనీలతో పోటీకి సై అంటోంది. ఈ నేపథ్యంలో హువాయి, శాంసంగ్ ను సవాల్ చేయడం విశేషం. -
మూడు కెమెరాల స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
బీజింగ్ : ఇప్పటివరకు మనం రెండు కెమెరాల స్మార్ట్ ఫోన్ లనే చూశాం. ఇక ఇపుడు మూడు కెమెరాలతో వినియగదారులను ఆకట్టుకోవడానికి రడీ గా ఉన్నాయి స్మార్ట్ ఫో్న్లు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ హువాయ్, హానర్ బ్రాండ్ ఇలాంటి ఓ సరికొత్త మొబైల్ ను చైనాలో ఆవిష్కరించింది. తాజాగా లాంచ్ చేసిన 'వీ8' స్మార్ట్ ఫోన్ ను చైనాలో అందుబాటులో ఉంచింది. ఇండియన్ మార్కెట్ లో కూడా త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. వెనుక రెండు 12మెగా పిక్సెల్ కెమెరాలు ఈ ఫోన్ లో ప్రత్యేక విశిష్టత. ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్ తో కంపెనీ రూపొందించింది. దీంతో ఈ ఫోన్ కు మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. మే 17నుంచి దీని అమ్మకాలు చేపడతామని కంపెనీ పేర్కొంది. సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. హువాయ్ వీ8 ప్రత్యేకతలు... 5.7 అంగుళాల డిస్ ప్లే, 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ ఫుల్ హెచ్ డీ వీడియో రికార్డింగ్ కిరీస్ 950 చిప్ తో కూడిన ఆక్టాకోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, శక్తివంతమైన ప్రాసెసర్ తో హైస్పీడ్ తో పనిచేస్తుంది. అంతర్గత మెమెరీ 32జీబీ, 64జీబీ వేరియంట్లు మైక్రో ఎస్డీ కార్డుతో 128జీబీ వరకూ పెంచుకోవచ్చు వెనుక 12 మెగా పిక్సెల్ రెండు కెమెరాలు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4జీ ఎల్ టీఈ, బ్లూటూత్ 4.2, వైఫై బ్యాటరీ సామర్థ్యం 3500ఎంఏహెచ్ అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర 32జీబీ వేరియంట్ ధర 350 డాలర్లు అంటే దాదాపు రూ.23,500, మరో వేరియంట్ 64జీబీ ధర 439 డాలర్లు అంటే దాదాపుగా రూ.29,000 ఉండొచ్చని అంచనా. -
ఈ స్మార్ట్ వాచ్ ధర ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్లకు తోడుగా ఇపుడు స్మార్ట్ వాచీల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ హువాయ్ తన మొట్టమొదటి స్మార్ట్వాచీని భారత్లో లాంచ్ చేసింది. ప్రీమియం సఫైర్ క్రిస్టల్ పూతతో తయారుచేసిన ఈ వాచీ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా.. డిఫరెంట్ ఆప్షన్స్తో ఆకట్టుకుంటోంది. ఐపీ67గా పిలుస్తున్న ఈ స్మార్ట్ వాచీ బేస్ మోడల్ ధరను రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, లెదర్ స్ట్రాప్ తో వస్తున్న ఈ వాచీ నీళ్లలో పడినా ఏమీ కాదు. వై-ఫై లేదా బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ వాచీని స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేసుకోవడం దీని స్పెషాలిటీ. మోటో 360, (సెకండ్ జనరేషన్), శామ్సంగ్ గేర్ ఎస్2, యాపిల్ వాచ్ వంటి ప్రముఖ వాచీలకు పోటీగా విడుదలైన ఈ హువాయ్ స్మార్ట్వాచ్ కొనాలంటే మాత్రం.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో మాత్రమే లభ్యం. సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో వున్న దీన్ని త్వరలోనే వివిధ నగరాల్లో అందుబాటులో ఉంచేలా యోచిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఐపీ67 స్పెసిఫికేషన్స్ సఫైర్ క్రిస్టల్ లెన్స్ హువాయ్ స్మార్ట్వాచ్ సఫైర్ క్రిస్టల్ లెన్స్తో కూడిన 1.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే (400x400పిక్సల్స్). నీటిలో పడినా పాడవ్వకపోవడంతో పాటు, దుమ్మును కూడా తట్టుకుంటుందని చెబుతున్నారు. 1.4 గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన శక్తిమంతమైన డ్యూయల్ కోర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ను ఈ స్మార్ట్వాచీలో పొందుపరిచారు. ఇంటర్నల్ స్టోరేజ్ 512 ఎంబి ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ ఆఫ్షన్స్తో వాచ్ హార్డ్వేర్ విభాగం బలోపేతంగా ఉంటుంది. దీంతో ఈ వాచ్ స్టోరేజ్ స్పేస్లో బోలెడన్ని యాప్స్ భద్రపరచుకోవచ్చు హార్ట్రేట్ మానిటర్ 6- యాక్సిస్ మోషన్ సెన్సార్, బారో మీటర్తో పాటు హార్ట్రేట్ మానిటర్, వై ఫై, మైక్రోఫోన్, స్పీకర్, 300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తున్నాయి. గోల్డ్, సిల్వర్, బ్లాక్తో పాటు అనేకరకాల కలర్ వేరియంట్లలో హువాయ్ స్మార్ట్వాచ్ లభ్యం కానుంది. -
నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ సేల్
న్యూఢిల్లీ: తాము ప్రవేశపెట్టిన హానర్ హోలీ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లు నిమిషాల్లోనే అమ్ముడుపోయాయని హువాయ్ సంస్థ తెలిపింది. ఫ్లిప్ కార్ట్ లో ఫిబ్రవరి 15న అర్ధరాత్రి మొదటిసారి భారత్ లో అమ్మకాలు ప్రారంభించగా నిమిషాల్లో ఫోన్లు అన్నీ సేల్ అయిపోయాయని హువాయ్ ఇండియా కన్జుమర్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ అలెన్ వాంగ్ వెల్లడించారు. ముఖ్యంగా గోల్డ్ కలర్ ఫోన్లకు డిమాండ్ అధికంగా ఉందని తెలిపారు. భారత్ లో తమ ఫోన్లకు వచ్చిన స్పందన తమను థ్రిల్ కు గురిచేసిందని చెప్పారు. ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని హానర్ హోలీ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లను డిజైన్ చేసినట్టు తెలిపారు. అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచామని చెప్పారు. రివర్స్ చార్జింగ్ తో ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్ కు మైక్రో-బీ, మైక్రో-బీ యూఎస్ బీ కేబుల్ ద్వారా పవర్ షేర్ చేయొచ్చని చెప్పారు. హానర్ హోలీ 2 ప్లస్ ఏమున్నాయంటే... 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 128 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజీ 64-బిట్ క్వాడ్ ప్రాసెసర్ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ తో పాటు జీఎస్ఎం, సీడీఎంఏ, డబ్ల్యూసీడీఎంఏ సపోర్ట్ ధర రూ.8,499 -
హువాయ్ పరిశోధన కేంద్రం ప్రారంభం
బెంగళూరులో ఏర్పాటు; రూ. 1,050 కోట్ల పెట్టుబడి బెంగళూరు: టెలికం పరికరాలు, మొబైల్ ఫోన్స్ తయారీలో ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న చైనా కంపెనీ హువాయ్.. బెంగళూరులో తన పరిశోధన-అభివృద్ధి(ఆర్అండ్డీ) కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది. ఇది భారత్లో ఒక చైనా కంపెనీ నెలకొల్పిన తొలి క్యాంపస్ మాత్రమే కాకుండా... చైనా వెలుపల హువాయ్కి అతిపెద్ద ఆర్అండ్డీ కేంద్రం కూడా కావడం గమనార్హం. దీనిలో 5,000 మంది ఇంజనీర్లను నియమించుకునే సామర్థ్యం ఉందని.. ప్రస్తుతానికి ఇక్కడ 2,500 మంది పనిచేస్తున్నట్లు హువాయ్ ఇండియా ఆర్అండ్డీ సెంటర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విల్సన్ వాంగ్ పేర్కొన్నారు. వివిధ ఉత్పత్తులకు సంబంధించి అత్యంత నాణ్యమైన కాంపొనెంట్లు, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్, అప్లికేషన్లను అభివృద్ధిచేయడం... కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంపై ఈ ఆర్అండ్డీ సెంటర్ దృష్టిపెడుతుందని ఆయన వెల్లడించారు. భారత్ మార్కెట్లో హువాయ్ ప్రస్థానానికి 15 ఏళ్లు పూర్తయింది. దేశంలో టెలికం రంగం ప్రగతి ప్రస్థానంలో హువాయ్ ప్రధాన ప్రాత్ర పోషిస్తోందని.. భారత్ మార్కెట్పై కంపెనీ నిబద్ధతకు ఈ ఆర్అండ్డీ కేంద్రమే నిదర్శనమని పారిశ్రామిక విధానం-ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. -
హువాయ్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్, ట్యాబ్లు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన హువాయ్ కంపెనీ ఒక స్మార్ట్ఫోన్ను, ఒక ట్యాబ్ను భారత మార్కెట్లోకి సోమవారం ఆవిష్కరించింది. ఆనర్ 6 పేరుతో స్మార్ట్ఫోన్ను రూ.19,999కు, మీడియాపాడ్ ఆనర్ టీ1 పేరుతో ట్యాబ్ను రూ.9,999కు అందిస్తున్నామని హువాయ్ టెలికమ్యూనికేషన్స్ ఇండియా సీఈఓ కై లిక్యూన్ చెప్పారు. ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఇవి లభ్యమవుతాయని వివరించారు. ఫోన్ను వచ్చే నెల 6 నుంచి విక్రయించడం ప్రారంభిస్తామని వివరించారు. ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఆనర్ 6 స్మార్ట్ఫోన్ 4జీ ఫోన్ అని, 5 అంగుళాల డిస్ప్లే, 3 జీబీ ర్యామ్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఇక ట్యాబ్లో 8 అంగుళాల డిస్ప్లే, 1.2 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ, వంటి ప్రత్యేకతలున్నాయని ఆయన వివరించారు. 10 లక్షల స్మార్ట్ఫోన్లు విక్రయించడం లక్ష్యం... ఆనర్ సిరీస్ కింద మరిన్ని స్మార్ట్ఫోన్లు తెస్తామని, వీటిని ఫ్లిప్కార్ట్ ద్వారానే విక్రయిస్తామని కై లిక్యూన్ చెప్పారు. ఈ ఏడాది 10 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా రూ.6,000 లోపు 4జీ స్మార్ట్ఫోన్ను అందిస్తామని వివరించారు.