Kannada movie
-
ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలా ఈ శుక్రవారం 12కి పైగా మూవీస్-సిరీసులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటే మరో తెలుగు డబ్బింగ్ చిత్రం కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో డిజాస్టర్ అనిపించుకున్న ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?'కేజీఎఫ్' తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఈ తరహా సినిమాల్ని అప్పుడప్పుడు తీస్తున్నారు. గతేడాది ఇలానే 'కబ్జ' మూవీ తీయగా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ తరహా యాక్షన్ స్టోరీతో తీసిన మరో సినిమా 'మార్టిన్'. దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన కన్నడ డబ్బింగ్ చిత్రం.. దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత మాయమైపోయింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)ఇప్పుడు ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో తెలుగులో హీరోగా చేసి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా.. ఈ సినిమాకు స్టోరీ అందించగా, ఇతడి మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా నటించాడు. మణిశర్మ సంగీత దర్శకుడు.విజువల్స్ పరంగా సినిమా రిచ్గా ఉన్నప్పటికీ సరైన కంటెంట్ లేకపోవడం, రవి బస్రూర్.. గతంలో తాను పనిచేసిన 'కేజీఎఫ్' లాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దీనికి ఇవ్వడం లాంటి చాలా మైనస్లు ఈ మూవీలో ఉన్నాయి.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ) -
OTT: కన్నడ సూపర్ హిట్ మూవీ తెలుగులో.. అప్పుడే ట్రెండింగ్లో
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగులో వచ్చింది. ఈ మూవీ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంంటుంది. ప్రస్తుతం యూత్ ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చక్కగా చూపించారు. అంతర్జాతీయ అవార్డులుఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది. ఓటీటీ ఆడియన్స్ను పలకరించేందుకు సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. ఆహాలో ట్రెండింగ్పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకొచ్చారు. ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఆహాలో టాప్ 4 లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్తో ట్రెండ్ అవుతోంది.చదవండి: అమితాబ్ బచ్చన్ పరిస్థితి చూసి వాళ్లందరూ నవ్వుకున్నారు -
ఓటీటీలోకి వచ్చేసిన వెరైటీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ
ఓటీటీలోకి మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటే ఇష్టపడేవాళ్లకు ఇది మరింత నచ్చేయొచ్చు. ఇప్పటికే కన్నడ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా డిజిటల్గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)'దసరా' సినిమాలో నాని పక్కన నటించిన దీక్షిత్ శెట్టి.. 'బ్లింక్' మూవీలో హీరోగా చేశాడు. మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేస్తే తొలుత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత తర్వాత మౌత్ టాక్తో హిట్ అయింది. ఇప్పుడు దీన్ని తెలుగులో నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చేశారు.'బ్లింక్' విషయానికొస్తే.. పీజీలో ఫెయిల్ అయిన కుర్రాడు అపూర్వ(దీక్షిత్ శెట్టి). తల్లి దగ్గర ఈ విషయం దాచి, పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి జాబ్ చేసి సెటిల్ కావాలనేది డ్రీమ్. అలాంటిది తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ ఇతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే టైమ్ ట్రావెల్లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? అసలు ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ!(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!) -
ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!
సినిమా కోసం నటీనటులు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడూ ఉండేదే. కానీ తొలిసారి ఓ కుక్కతో డబ్బింగ్ చెప్పించారు! నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. 'నను మత్తు గుండా 2' అనే కన్నడ మూవీ కోసం ఇదంతా జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని దర్శకుడే బయటపెట్టాడు. కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇంతకీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!)రీసెంట్ టైంలో కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చకుంటోంది. కేజీఎఫ్, చార్లీ తదితర చిత్రాలు నేషనల్ వైడ్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి కన్నడ ఇండస్ట్రీ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఓ సినిమా కోసం కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పించడం. 2020లో థియేటర్లలో రిలీజైన 'నాను మత్తు గుండా' మూవీ హిట్గా నిలిచింది. ఆటో డ్రైవర్, గుండా అనే అనాథ కుక్కని పెంచుకోవడం అనే కాన్సెప్ట్తో తీశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే సినీ చరిత్రలోనే తొలిసారి కుక్క పాత్ర దానితోనే డబ్బింగ్ చెప్పించారట. లాబ్రాడర్ జాతికి చెందిన సింబా అనే శునకం కీలక పాత్ర పోషించిందని, నేచురాలిటీ కోసం సదరు కుక్కతోనే డబ్బింగ్ చెప్పించామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారట. ఈ సీక్వెల్ మూవీకి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంగీతమందించడం విశేషం.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ) -
ఓటీటీలో కన్నడ హిట్ మూవీ.. ఎక్కడంటే?
కేజీఎఫ్ ఫేం వశిష్ట సింహ హీరోగా నటించిన కన్నడ చిత్రం లవ్లీ. స్టెఫీ పటేల్ హీరోయిన్ నటించింది. చేతన్ కేశవ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకు పైగా రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్, సాధుకోకిలక కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే కన్నడ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా వశిష్ట సింహా.. నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, కేజీఎఫ్, డెవిల్తో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వేస్టేషన్ 2లో విలన్గా కనిపించేనున్నాడు. స్టెఫీ పటేల్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ తెలుగులో నిన్ను తలచి, చెప్పాలని ఉంది వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. Kannada film #LoveLi (2024) by @ChethanKeshav6, ft. @ImSimhaa @StefyPatel #AchyuthKumar @MalavikaBJP #SadhuKokila #Sameeksha #KavyaShetty & #HGDattatreya, now streaming on @PrimeVideoIN.@abhuvanasa @AnoopSeelin pic.twitter.com/DD804MyqaE— CinemaRare (@CinemaRareIN) August 8, 2024 -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా
మరో క్రేజీ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటించిన ఈ కన్నడ మూవీని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో తీశారు. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. హీరోగా చేసిన దీక్షిత్ తెలుగులోనూ పలు సినిమాలు చేయడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా)'దసరా'లో నాని ఫ్రెండ్గా చేసిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి.. 'దియా' మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తెలుగు ఇటు కన్నడ సినిమాల్లో చేస్తున్నాడు. ఇతడు హీరోగా చేసిన 'బ్లింక్' అనే మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలోకి వచ్చింది. తొలుత 50 కంటే తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. టాక్ బాగుండటంతో ఆ నంబర్ పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.ఇక 'బ్లింక్' కథ విషయానికొస్తే.. పీజీలో ఫెయిల్ అయిన కుర్రాడు అపూర్వ(దీక్షిత్ శెట్టి). తల్లి దగ్గర ఈ విషయం దాచి, పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి జాబ్ చేసి సెటిల్ కావాలనుకుంటాడు. అలాంటిది తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ ఇతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే టైమ్ ట్రావెల్లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? అసలు ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్) -
బ్లాక్ బస్టర్ మూవీ నుంచి క్రేజీ మెలోడీ సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఇతర భాషా సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అలా భ్రమయుగం, ప్రేమలు, మంజమ్ముల్ బాయ్స్ లాంటి మలయాళ చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇలా ఇప్పుడు ఓ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోతుంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) కన్నడలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ కృష్ణ.. ఈ మధ్య 'లవ్ మాక్ టైల్ 2' మూవీతో వచ్చాడు. అక్కడ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా 'నీదేలే నీదేలే జన్మ' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. నకుల్ అభయాన్కర్ సంగీతమందించిన ఈ మెలోడీ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. ఇందులో హీరోయిన్ మిలానా నాగరాజ్.. నిజ జీవితంలోనూ హీరో డార్లింగ్ కృష్ణ భార్యనే కావడం విశేషం. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) -
లవ్ మాక్టైల్ 2 నుంచి బ్యూటిఫుల్ సాంగ్..
కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత, రచయిత, దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన చిత్రం లవ్ మాక్టైల్ 2. ఈ మూవీ నుంచి బుధవారం నాడు.. ఎవరితో పయనం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. ఎవరితో పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మాక్టైల్, లవ్ మాక్టైల్ 2 చిత్రాలు కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ.. 'కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమాను వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. -
ప్రకాశ్ రాజ్ నుంచి అవార్డ్ విన్నింగ్ మూవీ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు!
ప్రకాశ్ రాజ్ పేరు చెప్పగానే విలక్షణమైన పాత్రలే గుర్తొస్తాయి. హీరో, విలన్, తండ్రి, బాబాయ్.. ఇలా అన్ని రకాలు పాత్రలు చేశాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించాడు. అయితే గతంతో పోలిస్తే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నాడు. మొన్నీమధ్య 'గుంటూరు కారం'లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అలరించాడు. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఓ అవార్డ్ విన్నింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కన్నడలో తీసిన 'ఫొటో' అనే సినిమాని కొత్త దర్శకుడు ఉత్సవ్ గోన్వర్ తీశాడు. గతేడాది దిల్లీలో జరిగిన హ్యాబిటట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్తోపాటు బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ రెండు చోట్ల కూడా 'ఫొటో' చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ దక్కడం విశేషం. అయితే ఈ సినిమా చూసిన ప్రకాశ్ రాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా సరే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 15న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'ఫొటో' సినిమా కథ విషయానికొస్తే.. బెంగళూరులో ఓ వ్యక్తి, వలస కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అయితే ప్రభుత్వం అనుకోని పరిస్థితుల్లో లాక్డౌన్ విధిస్తుంది. దీంతో తమ సొంతూరు అయిన రాయచూర్కి నడక మార్గంలోనే వెళ్తారు. అసలు ఇంటికి వెళ్లారా అనేది పాయింట్. అలానే ఇదే కథలో ఆ పిల్లాడికి బెంగళూరులోని విధానసౌధ(కర్ణాటక శాసనసభ) ముందు నిలబడి ఫొటో తీసుకోవాలనే కోరిక ఉంటుంది. మరి లాక్డౌన్ కష్టాల మధ్య దాన్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేదే 'ఫొటో' సినిమా స్టోరీ. కథ పరంగా బాగానే ఉంది. వలస కూలీల కష్టాలు ప్రతిబింబించేలా ఉంది. పలు అవార్డ్ వేడుకల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలోనే సినిమా నచ్చి.. సొంతంగా రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. కానీ కరోనా లాక్డౌన్ని జనాలు చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) -
కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?
మరో హిట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కి సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇది తెలుగు కాదు కన్నడ సినిమా. ప్రభాస్ 'సలార్'తో పోటీ పడి కర్ణాటకలో ఈ చిత్రానికి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. స్టోరీ పరంగా చూసుకుంటే పెద్ద మెరుపులేం లేనప్పటికీ కన్నడ ప్రేక్షకులకు నచ్చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయిందట. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ప్రస్తుతం అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అలానే పలువురు రీజనల్ హీరోలు కూడా యాక్షన్ సినిమాలు తీస్తూ వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నారు. అలా కన్నడలోనూ హీరో దర్శన్ ఉన్నాడు. యాక్షన్ సినిమాలు తీసే ఇతడు గతేడాది డిసెంబరులో 'సలార్' చిత్రం థియేటర్లలోకి వచ్చిన వారం తర్వాత అంటే డిసెంబరు 29న 'కాటేరా' అనే మూవీతో వచ్చాడు. సూపర్హిట్ కొట్టేశాడు. (ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సాధారణ కథనే అయినప్పటికీ కన్నడ ఆడియెన్స్కి ఎక్కేసింది. కర్ణాటకలో 'సలార్' కంటే ఈ చిత్రాన్నే ఎక్కువగా చూశారు. అలా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఎప్పుడనేది డేట్ ఇంకా తెలీదు గానీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 9న జీ5లో రిలీజ్ చేయొచ్చని టాక్ అయితే నడుస్తోంది. ఒకవేళ ఓటీటీ రిలీజ్ చేస్తే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అలానే 'కాటేరా' తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ ఉందా లేదా? అనేది కూడా స్పష్టత రావాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
ఆస్పత్రిలో చేరిన నటి హేమా చౌదరి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి
సౌత్ ఇండియ ప్రముఖ నటి హేమా చౌదరి బ్రెయిన్ హెమరేజ్ కారణంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడంతో ఆమె కుమారుడు కూడా నేడు విదేశాల నుంచి వస్తున్నాడు. నటి హేమా చౌదరి ఎక్కువగా కన్నడ చిత్రాల్లోనే నటించి ఆపై తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో 100కు పైగా చిత్రాల్లో మెప్పించింది. కన్నడలో డా. రాజ్కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్నాగ్, అనంతనాగ్, రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో నటించారు. కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు, ప్రేమ్ నజీర్ తదితరులతో కూడా నటించారు. కె.బాలచందర్, డి.యోగానంద్, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్ లాంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో కూడా హేమా చౌదరి నటించారు. పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ,మేస్త్రీ, ప్రేమాలయం వంటి చిత్రాల్లో ఆమె నటించించారు. ఆపై కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్సకు స్పందించడం లేదు. విదేశాల నుంచి కుమారుడి రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'కరావళి' ప్రోమో అదిరిపోయిందంతే!
డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో అందరినీ పలకరించబోతున్నారు. ‘అంబి నింగే వయసైతో’ అనే కన్నడ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గాణిగ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిలింస్ బ్యానర్తో కలిసి గురుదత్త గాణిగ ఫిలిం బ్యానర్ మీద గురుదత్త గాణిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబళ పోటీల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ఈ 40వ సినిమా ఫస్ట్ లుక్, ప్రోమోలను సోమవారం విడుదల చేశారు. ప్రజ్వల్ దేవరాజ్ ఇందులో ఇదివరకెన్నడూ కనిపించని లుక్లో కనిపించారు. మహిషా అవతారం అన్నట్టుగా అలా మహిషం మీద కదిలి వచ్చే సీన్ చూస్తే గూస్బంప్స్ రావాల్సిందే. ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం.. ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం.. చివరకు హీరో కాస్తా మహిషాసురుడు అయ్యాడన్నట్టుగా వెరైటీ గెటప్లో కనిపించే షాట్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియాకు పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్లుగా కనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ కూడా అదే రేంజులో ఉన్నాయి. మా భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నామని దర్శక నిర్మాత గురుదత్త గాణిగ తెలిపారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: ప్రియాంకకు సపోర్ట్ చేయను.. గీతూ ప్రశ్నలకు సమాధానాలు దాటేసిన శోభ -
దుమ్మురేపుతున్న 'ఘోస్ట్' సాంగ్.. ఆ రోజే సినిమా రిలీజ్!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పాన్ ఇండియా మూవీ 'ఘోస్ట్'. శ్రీని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఆన్ యాక్షన్ ఫీస్ట్గా తీస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఒరిజినల్ గ్యాంగస్టర్ మ్యూజిక్ వీడియో విడుదల చేశారు. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) చెన్నై లయోలా కాలేజ్లో అభిమానుల సమక్షంలో ఈ పాటని విడుదల చేశారు. శివరాజ్ కుమార్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీపై అంచనాలు పెంచుతోంది. అనుపమ్ ఖేర్, జయరామ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అర్జున్ జన్య సంగీతమందించారు. ఇకపోతే ఈ మధ్య 'జైలర్'లో గెస్ట్ అప్పీయరెన్స్తో దుమ్ములేపిన శివన్న.. పూర్తిస్థాయిలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటారో చూడాలి. (ఇదీ చదవండి: అనసూయ సోయగాలు.. విష్ణుప్రియ గ్లామర్ షో!) -
కన్నడ హిట్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
ప్రజ్వల్ బీపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 21న రిలీజై, సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ను ‘బేబీ’ చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ– ‘‘కన్నడంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులోనూ ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. ‘‘ట్రైలర్ ఫన్ అండ్ ఎనర్జిటిక్గా అనిపించి, తెలుగులో విడుదల చేయాలని భావించాం’’ అన్నారు సుప్రియ. ‘‘బాయ్స్ హాస్టల్’ క్రేజీ ఫిల్మ్’’ అన్నారు నిర్మాతలు శరత్, అనురాగ్. -
ఈ హీరోయిన్ గుర్తుందా? 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీ!
ఈ బ్యూటీది అసలు మన దేశమే కాదు. అయినాసరే మన సౌత్ సినిమాల్లో నటించింది. హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకుంది. అప్పుడెప్పుడో 1989లో ఫస్ట్ సినిమా చేసింది. తిప్పి తిప్పి కొడితే అరడజను చిత్రాలు కూడా చేయలేదు. అయినాసరే ఈమె చాలా ఫేమ్ సంపాదించుకుంది. అప్పుడెప్పుడో యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఈమె.. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటిస్తోంది. ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు గిరిజా శెట్టర్. ఈ పేరు చెబితే గుర్తురాకపోవచ్చు. కానీ 'గీతాంజలి' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే మణిరత్నం తీసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇది. ఓ హీరోయిన్ క్యారెక్టర్ ఎంత బలంగా రాయొచ్చనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా ఫస్ట్ చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన గీత అలియాస్ గిరిజా శెట్టర్.. ఓవరాల్గా ఐదే సినిమాలు చేసింది. (ఇదీ చదవండి: సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. హైదరాబాద్ వచ్చేది అప్పుడే) ఇంగ్లాండ్లో సెటిలైన ఈమె తండ్రి ఓ డాక్టర్. ఆయనది కర్ణాటక. అమ్మది మాత్రం ఇంగ్లాండ్. అలా కన్నడ-బ్రిటీష్ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. 18 ఏళ్ల తర్వాత భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. అలా నటిగా మారింది. సైకాలజీ, ఫిలాసఫీ సబ్జెక్ట్స్లో థీసిస్ చేసింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన ఇంగ్లాండ్ వెళ్లిపోయిన తర్వాత రైటర్, జర్నలిస్టుగా డిఫరెంట్ ఉద్యోగాలు చేసింది. అయితే ఇన్నేళ్లుగా యాక్టింగ్కి దూరంగా ఉన్న ఈమెని.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలు ఒప్పించారు. 'ఇబ్బని తబ్బిదా ఇలెయాలి' అనే సినిమాలో నటించేలా చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం నుంచి ఈ మధ్యే గిరిజా శెట్టర్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ఆమె గురించి చెబుతూ పెద్ద క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫొటో చూసిన తెలుగు ఆడియెన్స్ ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు. తర్వాత మాత్రం 'గీతాంజలి' భామ అని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Paramvah Studios (@paramvah_studios) (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు!) -
సీఎం బయోపిక్లో సేతుపతి ఫిక్స్!
విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వెర్సటైల్ యాక్టర్ అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా మాత్రమే చేస్తా, లేదంటే లేదు అని మడికట్టుకుని కూర్చోలేదు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ రోల్.. ఇలా తనకు నచ్చిన ప్రతిదీ చేసుకుని పోయాడు. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల్ని సంపాదించుకుంటున్నాడు. అలాంటి ఈ నటుడు ఇప్పుడు ఏకంగా సీఎం బయోపిక్లో ఛాన్స్ కొట్టేశాడట. సీఎం బయోపిక్ అనగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'యాత్ర 2'లో ముఖ్యమంత్రి పాత్ర కోసం తమిళ నటుడు జీవా పేరు పరిశీలనలో ఉంది. బయటకు చెప్పట్లేదు కానీ దాదాపు ఇదే కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతి చేయబోయేది కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్లో అని టాక్. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) ఓ సామాన్యుడిలా మొదలైన సిద్ధరామయ్య ప్రయాణం.. ముఖ్యమంత్రి పీఠం వరకు ఎలా చేరింది అనేది రెండు భాగాల సినిమాగా తీయనున్నారు. అయితే హీరోగా దక్షిణాది నటుల్లో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడట. లాయర్, రాజకీయ జీవితంతోపాటు సిద్ధరామయ్య బ్రేకప్ స్టోరీ కూడా ఇందులో చూపించబోతున్నారట. ఈ బయోపిక్ని ఆర్ట్ ఫిల్మ్లా కాకుండా కమర్షియల్గా వర్కౌట్ అయ్యే విధంగా తీయబోతున్నారట. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ చిత్రానికి 'లీడర్ రామయ్య' పేరు ఖరారు చేశారు. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళంలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి విలన్గా నటించిన 'జవాన్' వచ్చే నెలలో రిలీజ్ కానుంది. హిందీలో ఒకటి, తమిళంలో ఐదు సినిమాల్లో హీరోగా నటిస్తూ విజయ్ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) -
‘తారకాసుర’సిరీస్ విజయం సాధించాలి: ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి
కన్నడలో ఘన విజయం సాధించిన తారకాసుర చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తూనే... ఆ చిత్రానికి సీక్వెల్ గా స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టారు బహుముఖ ప్రతిభాశాలి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం. శ్రీజ మూవీస్ పతాకంపై తనే దర్శకుడిగా, ముఖ్య పాత్రధారిగా నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న "తారకాసుర -2" చిత్రం పటాన్ చెరులోని జైపాల్ ముదిరాజ్ ఫామ్ హౌస్ లో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలనంతరం ముఖ్య పాత్రధారి విజయ్ భాస్కర్ రెడ్డిపై పటాన్ చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... జైపాల్ ముదిరాజ్ క్లాప్ కొట్టారు. పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత కార్టూనిస్ట్ మల్లిక్, సీనియర్ నటులు హేమ సుందర్ తదితరులు అతిధులుగా పాల్గొన్నారు!! "తారకాసుర సిరీస్"తో విజయ్ భాస్కర్ రెడ్డి పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగాలని అతిథులు ఆకాంక్షించారు. టెన్నిస్ ప్లేయర్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక బ్యాంక్ వ్యవస్థాపకునిగా విజయ్ భాస్కర్ రెడ్డిని వరించిన విజయాలు సినిమా రంగంలోనూ వరించాలని వారు అభిలషించారు. ఇకపై తమ "శ్రీజ మూవీస్" బ్యానర్ పై వరుసగా చిత్రాలు నిర్మిస్తానని దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం పేర్కొన్నారు. "తారకాసుర-2" చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. -
ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!
Hostel Hudugaru Bekagiddare Movie: ఏ సినిమా ఎప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. తెలుగులో అలా ఈ మధ్య ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బ్లాక్బస్టర్ టాక్ అందుకున్న మూవీ 'బేబీ'. మూడు నాలుగు చిత్రాలు తీసిన డైరెక్టర్, పెద్దగా అనుభవం లేని హీరోహీరోయిన్స్.. అయితేనేం హిట్ కొట్టారు. ఇలా టాలీవుడ్లో 'బేబీ' హవా నడుస్తుంటే.. కన్నడలో ఓ చిన్న సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది. హాస్టల్ కుర్రాళ్లు కేక కాలేజీ, హాస్టల్ బ్యాక్డ్రాప్ స్టోరీతో అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన కన్నడ చిత్రం 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'. కన్నడ ఇండస్ట్రీకి కాస్త ఊపు తీసుకొచ్చింది. ఎందుకంటే 'కేజీఎఫ్ 2', 'చార్లీ', 'కాంతార' తర్వాత శాండల్వుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటీ ఆ ఇండస్ట్రీకి పడేలేదు. ఇప్పుడు దాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'.. కొంతలో కొంత కవర్ చేసింది అనుకోవచ్చు. (ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్) స్టార్ హీరోలు సైలెంట్ ఈ ఏడాది కన్నడలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. జనవరిలో దర్శన్ 'క్రాంతి', మార్చిలో ఉపేంద్ర 'కబ్జ' భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడ్డాయి. ఐపీఎల్, శాసనసభ ఎన్నికల వల్ల శాండల్వుడ్ బాక్సాఫీస్ డల్ అయిపోయింది. స్టార్ హీరోలు ఎవరూ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' కరెక్ట్గా క్యాచ్ చేసి, హిట్ అయింది. కథేంటి? గత శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంలో అంతగా ఏముందా అంటే.. యూత్ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ. హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది. పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ్బాయిల పేర్లు ఓ నోట్లో రాసి ఉంటాడు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంతకీ 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే' అంటే ఏంటో చెప్పలేదు కదూ.. దానర్థం 'హాస్టల్ పిల్లలు కోరుకుంటే'. ప్రస్తుతం కన్నడలో మాత్రమే ఉన్న త్వరలో తెలుగులో రిలీజైన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని హీరో రక్షిత్ శెట్టి సమర్పించారు. ఇందులో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలానే సీనియర్ హీరోయిన్ దివ్య స్పందన, కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. 'కాంతార'కు సంగీతమందించిన అజనీష్ లోక్నాథ్.. ఈ చిన్న సినిమాని తన మ్యూజిక్ తో మరో లెవల్కి తీసుకెళ్లాడు. (ఇదీ చదవండి: కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!) -
Tarakasura: తెలుగులో మరో కన్నడ సంచలనం
కన్నడలో సంచలన విజయం సాధించిన ‘తారకాసుర’ చిత్రం అదే పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీజా మూవీస్ పతాకంపై ‘విజయ్ భాస్కర్ రెడ్డి పాళ్యం’ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. రవికిరణ్ - మాన్విత హరీష్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు డేని సపని ముఖ్యపాత్ర పోషించడం విశేషం. "పద్మశ్రీ" ఫేమ్ చక్రవర్తి, తృప్తి శుక్లా సెకండ్ హీరోహీరోయిన్లుగా... శాంసన్ యోహాన్ విలన్ గా నటించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ బండియప్ప దర్సకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలో తెలుగులో రానున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి, విలన్ పాత్రధారి శాంసన్ యోహాన్, సెకండ్ హీరోయిన్ తృప్తి శుక్లా, సెకండ్ హీరో పద్మశ్రీ ఫేమ్ చక్రవర్తి పాల్గొనగా... ప్రముఖ దర్శకులు నగేష్ నారదాసి, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, పద్మిని నాగులపల్లి ముఖ్య అతిధులుగా హాజరై... కన్నడలో ఘన విజయం సాధించిన "తారకాసుర" చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించాలని అభిలషించారు. శ్రీజా మూవీస్ అధినేత విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... ‘తెలుగులో ’తారకాసుర’ చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. అందుకోసం షూటింగ్ కూడా చేస్తున్నాం. మా బ్యానర్ నుంచి త్వరలో ఒక స్ట్రయిట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. -
తెలుగు ప్రేక్షకులకు ఆ మాట ఇస్తున్నా: శివ రాజ్కుమార్
‘‘నాన్నగారు (కన్నడ స్టార్ రాజ్కుమార్), ఎన్టీఆర్, నాగేశ్వర రావు, శివాజీ గణేశన్, ఎంజీఆర్సార్లు బ్రదర్స్లా ఉండేవాళ్లు. ఆ వారసత్వాన్ని తర్వాతి తరంలో మేం ముందుకు తీసుకెళుతున్నాం. తారకరత్నగారిని వెళ్లి చూశాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు కన్నడ స్టార్ శివ రాజ్కుమార్. ఆయన నటించిన 125వ కన్నడ చిత్రం ‘వేద’. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్కుమార్ భార్య గీత నిర్మించిన ఈ సినిమాని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి ఈ నెల 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ రాజ్కుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, మంచి సందేశం ఉన్నాయి. నా తర్వాతి చిత్రాలను కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు. ‘కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ వేధ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. -
ప్రభాస్కు వేద టీమ్ కృతజ్ఞతలు
కన్నడ హీరో శివ రాజ్కుమార్ 125వ చిత్రం వేద. అతని భార్య గీతా శివ రాజ్కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్గా నిర్మితమైంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ కానుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్స్ ఇదివరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది చిత్రయూనిట్. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ నాకు అవకాశం దక్కింది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాము. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీకి మన తెలుగులో ఎంతో ఆదరణ ఉంది. మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా హాజరవుతారు' అంటూ తెలిపారు. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై విజయం సాధించింది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు. చదవండి: నా భర్తకు మరొకరితో ఎఫైర్.. నన్ను వాడుకున్నాడంటూ ఏడుపందుకున్న నటి ఆ రికార్డులు తిరగరాసిన పఠాన్.. దంగల్కు ఒక్క అడుగు దూరంలో -
హీరోయిన్గా మారుతున్న సెన్సేషనల్ సింగర్ మంగ్లీ!
జానపదంతో ఆమె దోస్తీ చేసింది. తన గొంతులో పదాలు పాటలయ్యాయి. ఆ పాటల ప్రవాహం జలపాతంలా జనాలను తాకింది. ఆమె కంఠానికి, రక్తి కట్టించే పాటలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. తెలియకుండానే ఆమె అభిమానులయ్యారు. తన గాత్రంతో జనాలను కట్టిపడేసిన ఆమె మరెవరో కాదు సింగర్ మంగ్లీ. జానపదం నుంచి సినిమాల దాకా నిరంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రయాణం కొనసాగిస్తోంది. తాజాగా ఆమె సినిమాల్లో నటించనుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. చక్రవర్తి చంద్రచూడ్ డైరెక్ట్ చేస్తున్న పాదరాయ అనే కన్నడ సినిమాలో మంగ్లీ హీరోయిన్గా నటించనుందట. ఇప్పటికే కన్నడలోనూ పలు పాటలు పాడిన ఆమె ఈసారి ఏకంగా పాదరాయ అనే పాన్ ఇండియా మూవీలో కథానాయికగా నటించనున్నట్లు శాండల్వుడ్లో ప్రచారం జరుగుతోంది. 2013-14లో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. నాగశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి మంగ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. చదవండి: తేజస్వినితో ప్రేమలో పడ్డ అఖిల్ సార్థక్ -
కేజీఎఫ్-3 మూవీపై క్రేజీ అప్ డేట్.. ఆ సినిమా పూర్తయ్యాకే..!
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్ అభిమానులు కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్స్మ్ అధినేత విజయ్ కిరంగదూర్. ప్రశాంత్ నీల్ తెరక్కిస్తున్న ప్రభాస్ మూవీ 'సలార్' తర్వాత పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హోంబలే ఫిల్మ్స్ నుంచి కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీయఫ్-3పై అప్డేట్ ఇచ్చారు. 2018లో కన్నడ చిత్రంగా వచ్చి భారీ విజయం అందకున్న చిత్రం కేజీయఫ్. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాదే కేజీయఫ్ చాప్టర్-2 వచ్చి సందడి చేసింది. ఈ మువీ కూడా భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. కేజీఎఫ్-3 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్ రెడీగా ఉందని.. వచ్చే ఏడాది లేదా సలార్ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. -
ఓటీటీలో దూసుకెళ్తున్న కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'విస్మయ'
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కంటెంట్ ఉన్న చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ నుంచి బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. ప్రియమణి నటించిన కన్నడ చిత్రం "నన్న ప్రకార" అక్కడ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇదే సినిమాను 'విస్మయ' పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ప్రస్తుతం ఈ విస్మయ చిత్రం ఓటీటీలో అందరినీ ఆకట్టుకుంటోంది. విస్మయ చిత్రంలో డాక్టర్గా ప్రియమణి నటించింది. కాంతారా ఫేమ్ కిషోర్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో మూడు కథలు ఒకదానికొకటి అల్లుకుని ఉంటాయి. నగరంలో జరిగే హత్యలను ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో చివర్లో వచ్చే ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. దర్శకుడు వినయ్ బాలాజీకి ఇది మొదటి చిత్రమైనా కూడా ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్లా తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజువల్స్, ఆర్ఆర్, కెమెరాపనితనం అన్ని హైలెట్గా నిలిచాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అర్జున్ రాము సంగీతమందించారు. మనోహర్ జోషి కెమెరామెన్గా పని చేశారు. -
Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు
కన్నడ సెన్సేషన్ 'కాంతర' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేజీఎఫ్ను బీట్ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సినీ ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంతార సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే కాంతార ఓటీటో రిలీజ్లో అభిమానులకు మేకర్స్ షాక్ ఇచ్చారు. ఈ సినిమాకి సోల్ అయినటువంటి వరహారూపం సాంగ్ని మార్చేయడం ఫ్యాన్స్కు నిరాశ కలిగిస్తుంది. ‘వరాహరూపం’ పాట సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. అలాంటిది ఓటీటీకి వచ్చేసిరికి ట్యూన్ మార్చి కొత్త మ్యూజిక్తో విడుదల చేశారు. ఒరిజినల్ సాంగ్తో పోలిస్తే ఇది బాలేదని, వరహారూపం ఒరిజినల్ వెర్షన్ని అప్డేట్ చేయండి అంటూ రిషబ్ శెట్టి సహా మూవీ టీంకు నెటిజన్లు రిక్వెస్టులు పెడుతున్నారు. కాగా తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్'ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. అందువల్లో యూట్యూబ్లోనూ ఆ పాటను హోంబాలే ఫిల్మ్స్ తొలగించింది. మరి ఈ విషయంలో కాంతార మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. -
కాంతార ప్రభంజనం.. కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్
బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన మూవీ 'కాంతార'. భాషతో సంబంధం లేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలై 50 రోజులు అయినా థియేటర్లలో క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా వసూళ్ల పరంగా మరో రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో కేజీయఫ్-2 రికార్డును అధిగమించి రూ.168.50 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. (చదవండి: ఓటీటీకి 'కాంతార'.. ఆ వివాదం వల్లే ఆలస్యమవుతోందా ?) తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్లో రూ.44.50 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అయితే ఇప్పటివరకూ రూ.96 కోట్లు వచ్చినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో డబ్ అయి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో నిలిచింది. మొదటి స్థానంలో ‘కేజీయఫ్2’ రూ.185 కోట్ల టాప్లో ఉండగా, ఆ తర్వాత 2.ఓ (రూ.100కోట్లు), రోబో (రూ.72కోట్లు), కాంతార (రూ.60) ఐ (రూ.57కోట్లు) ఉన్నాయి. ‘KANTARA’ CROSSES ₹ 400 CR WORLDWIDE… #Kantara territory-wise breakup… Note: GROSS BOC… ⭐️ #Karnataka: ₹ 168.50 cr ⭐️ #Andhra / #Telangana: ₹ 60 cr ⭐️ #TamilNadu: ₹ 12.70 cr ⭐️ #Kerala: ₹ 19.20 cr ⭐️ #Overseas: ₹ 44.50 cr ⭐️ #NorthIndia: ₹ 96 cr ⭐️ Total: ₹ 400.90 cr pic.twitter.com/CmBQbLrZvf — taran adarsh (@taran_adarsh) November 22, 2022 -
కాంతార మరో రికార్డ్.. కార్తికేయ-2ను అధిగమించి..!
రిషబ్శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్లోనూ రిలీజైన ఈ సినిమా మరో రికార్డును సాధించింది. హిందీలో డబ్బింగ్ అయిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఏడో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్లో ఇప్పటి దాకా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మొదటి రెండు వారాల కంటే.. మూడో వారం అత్యధిక కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా 'కాంతార' నిలిచింది. టాలీవుడ్ హీరో నిఖిల్ చిత్రం 'కార్తికేయ2' కలెక్షన్ల రికార్డును అధిగమించింది. ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ‘బాహుబలి2’ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది. ఆ తర్వాత ‘కేజీయఫ్2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘2.ఓ’, ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలు ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి ‘కాంతార’ రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. #Kantara *#Hindi version*… ⭐️ #Baahubali2, #KGF2, #RRR, #2Point0, #Baahubali, #Pushpa… #Kantara is now the 7th highest grossing *dubbed* #Hindi film ⭐️ Crosses ₹ 50 cr mark [Day 21] ⭐️ Week 3 is higher than Week 1 and Week 2 pic.twitter.com/82lZR0H30j — taran adarsh (@taran_adarsh) November 4, 2022 -
కాంతారపై రజనీకాంత్ రివ్యూ, గూస్బంప్స్ తెప్పించారు!
చిన్న సినిమాగా విడుదలైన కాంతార పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించింది. కన్నడ ప్రేక్షకులే కాకుండా పరభాషా ప్రేక్షకులు సైతం కాంతారకు నీరాజనాలు పలుకుతున్నారు. సినిమా చూసి ఔరా అనని సెలబ్రిటీ లేడంతే అతిశయోక్తి కాదు. తాజాగా తలైవా రజనీకాంత్ కాంతారపై ప్రశంసలు కురిపించాడు. 'తెలిసినది గోరంత తెలియనిది కొండంత.. ఈ విషయాన్ని సినిమాల్లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు' అని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ను కొనియాడారు. 'కాంతార చిత్రం నా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇండియన్ సినిమాలోనే ఇదొక మాస్టర్ పీస్. రచయిత, దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి టాలెంట్కు హ్యాట్సాఫ్, చిత్రయూనిట్కు అభినందనలు' అని ట్వీట్ చేశాడు రజనీకాంత్. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత దీన్ని ఇతర భాషల్లోనూ డబ్ చేశారు. అలా తెలుగులో అక్టోబర్ 15న రిలీజై ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. చదవండి: వైశాలి సూసైడ్ కేస్: సంచలన విషయాలు వెల్లడించిన నటుడు సమంత సర్జరీ చేసుకుందా? -
కాంతార సెన్సేషన్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2లను దాటేసిందిగా!
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార. సప్తమి గౌడ, కిశోర్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ కేజీఎఫ్ 2 రికార్డును బద్ధలు కొట్టింది. ఐఎమ్డీబీలో కేజీఎఫ్ 2 మూవీకి 8.4, ఆర్ఆర్ఆర్ సినిమాకు 8 రేటింగ్ ఉండగా కాంతార.. వీటిని వెనక్కు నెట్టి అత్యధికంగా 9.6 రేటింగ్ను సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ చిత్రంగా కాంతార నిలిచింది. కాగా అఖండ ప్రేక్షకాదరణ అందుకుంటున్న కాంతార నేడు హిందీలో రిలీజైంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం (అక్టోబర్ 15న) ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. చదవండి: ఎందుకింత ద్వేషం, అతడిని బతకనివ్వండి: నటి -
దేశం మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా " కాంతారా "
-
అద్భుతమైన గ్రాఫిక్స్తో రానున్న 'మహాబలి'..
Mahabali Ready To Release In Telugu: ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ హీరోగా డా. భారతి, కల్యాణి రాజు హీరోయిన్స్ గా కన్నడంలో రూపొందిన చిత్రం 'జయమ్మన మగ'. ఈ చిత్రానికి రవికిరణ్ వికాస్ దర్శకత్వం వహించారు. ఇటీవలే రిలీజై సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం రూ. 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మార్డురి వెంకటరావు 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మార్డురి వెంకట్రావు మాట్లాడుతూ "100 పర్సెంట్ యాక్షన్ అండ్ లవ్ తో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా కన్నడంలో రూపొందిన 'జయమ్మన మగ' చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని మా శ్రీ జె. వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. హార్రర్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇది మరొక సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఐదు పాటలు చాలా డిఫరెంట్ గా కంపోజ్ చేసాడు. అలాగే రీ రికార్డింగ్ అద్భుతంగా చేసాడు. దర్శకుడు రవికిరణ్ టేకింగ్, దునియా పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హై లైట్ గా నిలిచాయి. భారతీబాబు మాటలు, పాటలు అద్భుతంగా రాసారు. త్వరలో ఆడియో రిలీజ్ చేసి అదే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. -
'ఆహా' అనిపించేలా సైబర్ క్రైమ్ థ్రిల్లర్ 'గుళ్టు'.. ఆసక్తిగా ట్రైలర్
Gultoo Movie Telugu Trailer: విభిన్నమైన కాన్సెప్ట్తో సినీ ఆడియెన్స్ను అలరిస్తోంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. స్టోరీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తూనే సూపర్ హిట్ చిత్రాలను తెలుగులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే పలు హాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసిన ఆహా తాజాగా మరో సినిమాను తీసుకురానుంది. కన్నడలో సూపర్ హిట్ అందుకున్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్ 'గుళ్టు' త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ యువ నటుడు జనార్దన్ చిక్కన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆహా వేదికగా జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆహా బృందం 'గుళ్టు' మూవీ ట్రైలర్ను బుధవారం (జులై 6) విడుదల చేసింది. 'ఆకలి కడుపులకు ఆశలెక్కువ. విశాలంగా పెరిగే మనసు, రోజు రోజుకీ పరిస్థితులకు లొంగిపోయి, కనీసం చిన్న చిన్న ఆశలకు కూడా చోటు లేనంతగా ముడుచుకుపోతుంది' అంటూ ప్రారంభమైన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమాకు ప్రధాన పాత్రలో నటించిన జనార్దన్ కథ, దర్శకత్వం వహించారు. -
కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ?
Kicha Sudeep 3D Movie Vikrant Rona Release Date Out: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రధారులుగా అనూప్ భండారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మంగళవారం విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘మిస్టరీ థ్రిల్లర్గా త్రీ డీ టెక్నాలజీతో రూపొందించిన ‘విక్రాంత్ రోణ’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రపంచానికి సరికొత్త సూపర్ హీరోను పరిచయం చేస్తున్నాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా విజువల్ ట్రీట్లా ఉంటుంది. దాదాపు 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’అని చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్తో కనిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను ఇస్తూ అంచనాలను పెంచుతూ వచ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయడంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్పీరియెన్స్ను ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
మాజీ ప్రియుడితో మళ్లీ కలవనున్న రష్మిక?
సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్లో ప్రస్తుతం రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛలోతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో వరుస సినిమా ఛాన్స్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కన్నడంలో ‘కిరాక్ పార్టీ’తో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో తనతో జోడి కట్టిన రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే కొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరూ బ్రేకప్ అయ్యారు. (తండ్రిపై రష్మిక ఎమోషనల్ పోస్ట్..) అయితే తాజాగా లీకువీరులు అందిస్తున్న సమాచారం ప్రకారం రష్మిక, రక్షిత్ శెట్టిలు మళ్లీ కలవనున్నారు. ఎందుకంటే కన్నడంలో సూపర్డూపర్ హిట్ సాధించిన కిరాక్ పార్టీ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టినే హీరో. అయితే హీరోయిన్గా రష్మికను కాకుండా కొత్తవాళ్లని ఎవరినైనా తీసుకోవాలని రక్షిత్ భావిస్తున్నాడట. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితేనే బాగుంటుందని హీరోకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కిరాక్ పార్టీ సీక్వెల్లో రక్షిత్తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభిప్రాయం లేదని రష్మిక తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అయితే రష్మిక-రక్షిత్లో మరోసారి ఆన్స్క్రీన్పై చూడాలని అక్కడి అభిమానులు తెగ కోరుకుంటున్నారంట. మరి కిరాక్ పార్టీ సీక్వెల్ కోసం ఈ మాజీ ప్రేమికులు కలుస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. (పెంగ్విన్ మూవీ రివ్యూ) -
తెలుగు దియా?
2018లో ‘యు టర్న్’ (కన్నడ ‘యు టర్న్’– తెలుగు, తమిళ రీమేక్), 2019 లో ‘ఓ బేబీ’ (సౌత్ కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ తెలుగు రీమేక్), 2020లో ‘జాను’ (తమిళ ‘96’ తెలుగు రీమేక్)... ఇలా మూడేళ్లుగా ఏడాదికో రీమేక్ చిత్రంలో నటించారు సమంత. తాజాగా మరో కన్నడ చిత్రం తెలుగు రీమేక్లో సమంత నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ఏడాది కన్నడలో సూపర్ హిట్ సాధించిన ‘దియా’ తెలుగులో రీమేక్ కానుందనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్నగర్లో నడుస్తోంది. ఇందులో సమంత నటించే అవకాశాలు ఉన్నాయట. ఇక ‘దియా’ చిత్రకథ విషయానికి వస్తే... ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఓ అమ్మాయి కథ.. మరో కొత్త ప్రేమకు ఎలా దారి తీసింది? తన గత ప్రేమ తాలూకు అంశాలు ఆమె ప్రస్తుత ప్రేమను ఎంతలా ప్రభావితం చేశాయి? అనే అంశాల నేపథ్యంలో సాగుతుంది. -
కన్నడనూ కబ్జా చేస్తారా?
పదేళ్లుగా తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను కబ్జా చేసి పడేశారు కాజల్ అగర్వాల్. హీరోయిన్గా పదేళ్లు పూర్తి చేసినా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు కాజల్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు కాజల్. కానీ ఇంతవరకూ కన్నడ సినిమా చేయలేదు. ఉపేంద్ర చేయబోతున్న ‘కబ్జా’ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారట కాజల్. ఆర్.చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కనున్న గ్యాంగ్స్టర్ చిత్రం ‘కబ్జా’. ఇందులో ఉపేంద్ర సరసన హీరోయిన్గా కాజల్ కనిపిస్తారట. ఈ సినిమాలో విలన్గా జగపతిబాబు నటించనున్నారు. ఈ సినిమా ఏడు భాషల్లో రిలీజ్ కానుంది. -
‘సంస్కార’ సాహసి గిరీష్ కర్నాడ్
సాక్షి, న్యూఢిల్లీ : నారణప్ప అంత్యక్రియలు ఎలా చేయాలనే విషయంలో ఓ బ్రాహ్మణ బృందం తర్జనభర్జనలు పడుతుంటోంది. మద్యం తాగి, మాంసం తినే అలవాటున్న వాడే కాకుండా గుడి కోవెలలోనే చేపలు పట్టిన వాడు, అందులోను ఓ దళిత మహిళతో కలిసి ఉండేందుకు తన బ్రాహ్మణ భార్యను వదిలేసిన వ్యక్తిని ఎలా బ్రాహ్మణుడిగా గుర్తించాలి? బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఎలా అంత్యక్రియలు జరపాలన్నది వారి తర్జనభర్జన. ఇంతలో నారణప్ప ప్రేయసి చంద్రి అక్కడికి వస్తుంది. తాను దాచుకున్న, ఒంటికున్న నగలన్నింటిని వలచి ఆ బ్రాహ్మణ బృందం ముందు పడేసి వీటన్నింటిని తీసుకొని నారణప్పకు ఘనంగా అంత్యక్రియలు జరపాలని వేడుకుంటుంది. ఆ బంగారు నగలను చూసి కళ్లు చెదిరిన బ్రాహ్మణులు అసలు విషయాన్ని మరచిపోయి ఆ నగలు ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే విషయమై చర్చ మొదలవుతుంది. నారణప్ప అంత్యక్రియలు ఎలా జరపాలనే విషయం తేలకపోవడంతో బ్రాహ్మణ అగ్రగణ్యుడు, అగ్రహారపు బ్రాహ్మణుడు ప్రణేశాచార్యకు ఆ చిక్కుముడిని విప్పాల్సిన బాధ్యతను అప్పగిస్తారు. 1970లో విడుదలై ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ‘సంస్కార’ కన్నడ భాషా చిత్రంలోని సన్నివేశం ఇది. ఇందులో ప్రణేశాచార్యగా ప్రముఖ బహు భాషా సినీ నటుడు, దర్శకుడు గిరీష్ కర్నాడ్ నటించారు. ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే. యూఆర్ అనంతమూర్తి 1965లో ఈ ‘సంస్కార’ అనే నవలను రాశారు. అనుకోకుండా ఆ నవలను చదివిన గిరీష్ కన్నాడ్ కదిలిపోయారు. ఎలాగైనా దాన్ని సినిమాగా తీయాలని పట్టుకు తిరిగారు. ఆయనకు సహకరించేందుకు ‘మద్రాస్ ప్లేయర్స్’ థియేటర్ గ్రూప్నకు చెందిన సభ్యులు, తిక్కవరపు పట్టాభి రామరెడ్డి ముందుకు వచ్చారు. తాను సినిమాను తీసేందుకు డబ్బును సమకూర్చడంతోపాటు దర్శకత్వం వహించేందుకు రామరెడ్డి సిద్ధపడ్డారు. ఆయనతో కలిసి గిరీష్ కర్నాడ్ ఆ సినిమాకు స్క్రిప్టు రాశారు. అందులో చంద్రిగా పట్టాభి రామిరెడ్డి భార్య స్నేహలతా రెడ్డి నటించారు. జాతీయ అవార్డు, ప్రశంసలు మొదట ఈ సినిమా విడుదలకు అనేక అభ్యంతరాలు వచ్చాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ప్రతికూలత వస్తోందని నాటి కర్ణాటక ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చివరకు ఎలాగో 1970, మే 13వ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటికే కొనసాగుతోన్న ‘మరో సినిమా’ ఉద్యమానికి ఈ సినిమా కొత్త ఊపిరిని పోసింది. జాతీయ స్థాయిలో దీనికి ‘ఉత్తమ చిత్రం’ అవార్డు వచ్చింది. కర్నాడ్ పాత్ర అంతర్మథనం బ్రాహ్మణ కులాచారాలు తప్పకుండా, అటు అబ్రాహ్మణుడైన నారణప్పకు ఎలా అంత్యక్రియలు జరిపించాలో పాలుపోకా అంతర్మథనపడే పాత్రలో గిరీష్ కర్నాడ్ అద్భుతంగా రాణించారు. ఎలా అంత్యక్రియలు జరపాలో చంద్రిని అడిగి తెల్సుకుందామని ఊరిబయటనున్న ఆమె వద్దకు వెళ్లిన ప్రణేశాచార్య (కర్నాడ్) ఆమె ప్రేమ వలపులో చిక్కుకుంటారు. కులం తక్కువ పిల్లతో లైంగిక సుఖాన్ని అనుభవించిన తనదే కులం ఇప్పుడు ? ఎవరి కులంలో ఏముంది ? అసలు కులాలు ఏమిటీ ? అని తాంత్విక చింతనలో పడిన ప్రణేశాచార్య ఊర్లోకి వస్తారు. అప్పటికే ఊరిలో ‘ప్లేగ్’ విస్తరించడంతో ప్రజలంతా ఊరొదిలి పారిపోతుంటారు. నారణప్ప మతదేహం కుళ్లిపోవడం వల్ల ప్లేగ్ వ్యాపిస్తోంది. నారణప్పకు సకాలంలో అంత్యక్రియలు చేయకపోవడం వల్ల ఊరంటుకుంది అన్న సందేశంతో సినిమా ముగుస్తుంది. పట్టాభి రామిరెడ్డి సాహసం ఓ అగ్రవర్ణంలో సంస్కరణను ఆశిస్తూ ఈ చిత్ర నిర్మాణానికి. దర్శకత్వానికి పట్టాభి రామిరెడ్డి ముందుకు రావడం ఓ సాహసమైతే ఆయన భార్యతోనే చంద్రి పాత్రను వేయించడం ఆయన ఉన్నత సంస్కారానికి నిదర్శనం. అడవిలో చంద్రి, ప్రణేశాచార్య శారీరకంగా కలుసుకునే దశ్యానికి వాస్తవికంగా చూపిస్తానంటూ పంతం పట్టి మరీ ఆ దశ్యాన్ని ఆయన చిత్రీకరించడం కూడా విశేషమే. ఎందుకంటే అప్పటి వర కు స్త్రీ, పురుషులు లైంగికంగా కలుసుకున్నారనడానికి రెండు పుష్పాలు పరస్పరం తాకినట్టో పెనవేసుకున్నట్లో చూపేవారు. కళాకారుడు ఎస్జీ వాసుదేవ్, రచయిత రాణి డే బుర్రా. ఆస్ట్రేలియా చిత్ర దర్శకుడు టామ్ కోవన్ తదితరులు ఈ చిత్ర నిర్మాణానికి సహకరించారు. (ఈరోజు ఉదయం బెంగళూరులో మరణించిన గిరీష్ కర్నాడ్ సంస్మరణార్థం ఈ వ్యాసం) -
నంబర్ వన్ రేస్లో...
గణేశ్, రష్మికా మండన్నా కథానాయికలుగా సుని దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘చమ్మక్’. దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాతలుగా ‘గీతా..ఛలో: వీకెండ్ పార్టీ’ పేరుతో ఈ సినిమాను ఈ నెల 3న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయడమే కాదు. రిలీజ్ విషయంలోనూ సరైన ప్రణాళిక ఉండాలి. నిర్మాతలు పంపిణీరంగంలో అనుభవజ్ఞులు. ఈ సినిమాతో నిర్మాతలకు డబ్బు, పేరు రావాలి’’ అన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాలు ఎన్ని విడుదలైనా టేస్ట్ఫుల్ సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘గీత గోవిందం’ సినిమాలో వందకోట్ల క్లబ్లో చేరారు రష్మిక. నంబర్ 1 రేస్లో ఉన్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు ఈ చిత్రసమర్పకుడు దివాకర్. ‘‘కన్నడలో ఈ చిత్రం దాదాపు 30కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే వాయిదా వేసి మే 3న విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
కన్నడకు కమ్బ్యాక్
‘కేజీయఫ్’ చాప్టర్ 1 దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించడంతో, సెకండ్ పార్ట్ను ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్టున్నారు చిత్రనిర్మాతలు. బాలీవుడ్ తారలను కూడా తారాగణంగా తీసుకొని మార్కెట్ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. ఆల్రెడీ సంజయ్దత్ను ముఖ్యపాత్ర కోసం సంప్రదించిన విషయం తెలిసిందే. లేటెస్ట్గా రవీనా టాండన్ను కూడా ఓ కీలకపాత్రలో నటించమని కోరారట ‘కేజీయఫ్’ బృందం. మరి ఈ రోల్కు రవీనా యస్ అంటారో నో అంటారో తెలియాలి. 1999లో ఉపేంద్రతో చేసిన ‘ఉపేంద్ర’ రవీనా టాండన్ చివరి కన్నడచిత్రం. మరి 20 ఏళ్ల తర్వాత కన్నడకు కమ్బ్యాక్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. ఇంతకీ ‘కేజీయఫ్’లో నటించిన యశ్కు బోలెడంత పాపులార్టీ వచ్చిన విషయం తెలిసిందే. చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెండో భాగం పనులతో బిజీగా ఉన్నారు. -
కన్నడ కాలింగ్
తెలుగులో ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ భామ సాయేషా. ఆ తర్వాత ఇక్కడ సినిమాలు చేయక పోయినా తమిళంలో మాత్రం సూపర్ ఫామ్లో కొనసాగుతున్నారు. కార్తీ, ‘జయం’ రవి, ఆర్య.. ఇలా తమిళ యంగ్ హీరోలందరితో యాక్ట్ చేస్తూ తమిళంలో బిజీ హీరోయిన్గా మారారు. ప్రస్తుతం సాయేషాను కన్నడ ఇండస్ట్రీ రా రమ్మని పిలిచింది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ హీరోగా ‘యువరత్న’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంతోష్ అనండ్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయేషాను క«థానాయికగా తీసుకున్నట్లు సోమవారం చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. శాండిల్వుడ్లో సాయేషాకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. యశ్ హీరోగా నటించిన హిట్ చిత్రం ‘కేజీఎఫ్’ను నిర్మించిన హొంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నటుడు ఆర్యతో సాయేషా వివాహం ఫిక్స్ అయ్యింది. మార్చిలో ఆర్య–సాయేషాల వివాహం జరగనున్నట్లు తెలిసింది. -
మళ్లీ రిలీజ్ కానున్న నాటి సంచలనం
బొమ్మనహళ్లి: అలనాటి సూపర్ హిట్ సినిమా ‘నాగరహావు’ నేటి డిజిటల్ ధ్వని, కొంగొత్త హంగులతో ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో శోభన్బాబు, లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ చిత్రానికి మాతృక అయిన ఈ కన్నడ సినిమా సరిగ్గా 46 ఏళ్ల కిందట విడుదలై అనేక రికార్డులను తిరగ రాయడమే కాకుండా అవార్డుల పంట పండించింది. ఈ ఒక్క సినిమాతోనే హీరో విష్ణువర్ధన్ నటుడుగా భారీ బ్రేక్ సాధించి అగ్రనటుడు డాక్టర్ రాజ్ కుమార్ సరసన స్థానాన్ని సైతం సంపాదించాడు. చిత్ర నిర్మాత తనయుని తపనతో... ఈ చిత్ర నిర్మాత ఎన్.వీరాస్వామి కుమారుడు బాలాజీ ఆలోచనతో సినిమా మరోసారి రూపుదిద్దుకుంది. కొత్త టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తిరిగి రూపొందిస్తే ఎలాగుంటుందని తన సోదరుడైన నటుడు రవిచంద్రన్ను అడిగానని, ఆయన తనను ప్రోత్సహిస్తూ, వెంటనే పనిని ప్రారంభించమన్నారని బాలాజీ తెలిపారు. ఈ చిత్రానికి కొత్త హంగులను దిద్దాలనుకున్నప్పుడు ప్రింట్లు మాత్రమే దొరికాయని, చెప్పారు. వెతగ్గా వెతగ్గా చెన్నైలోని జెమిని ల్యాబ్స్లో నెగటివ్ లభ్యమైందని తెలిపారు. కొత్త హంగులను సమకూర్చడంలో 60 మంది సాంకేతిక నిపుణులు రెండేళ్ల పాటు శ్రమించారని చెప్పారు. మొత్తానికి ఈ నాగరహావు విభిన్న దృశ్య అనుభవాన్ని పంచుతుందని చెప్పారు. గత నెలలో యూట్యూబ్లో టీజర్ను విడుదల చేయగా ఇప్పటికి 11 లక్షల మందికి పైగా వీక్షించారు. అప్పట్లో నాగరహావును 35 ఎంఎంలో విడుదల చేయగా, ఇప్పుడు సినిమా స్కోప్లో విడుదల కానుంది. 1972లో సంచలనం 1972లో విడుదలైన ఈ చిత్రం విష్ణువర్ధన్కు సూపర్ స్టార్డమ్ను తెచ్చింది. అప్పటి వరకు రంగ స్థల, కళా చిత్రాల నటుడుగా మాత్రమే పరిచయమైన విష్ణువర్ధన్కు ఈ సినిమాలో హీరోగా అవకాశం లభించింది. ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు పుట్టన్న కనగాల్ అప్పట్లో కళా, వాణిజ్య చిత్రాల వారధిగా వ్యవహరిస్తున్నారు. విష్ణువర్ధన్నే కాదు ఈ చిత్రంలో ఆయన అంబరీశ్ను కూడా పరిచయం చేశారు. ఇక ఆ సినిమాలో చామయ్య మాస్టారుగా నటించిన కేఎస్. అశ్వత్ పేరు ప్రతి ఇంటా ప్రతి ధ్వనించేది. నటీమణులు ఆరతి, జయంతిలకు కూడా ఈ సినిమా ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలోని పాటలు ఈనాటికీ సూపర్ హిట్ అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఈ సినిమాను హిందీలో జహ్రీలా ఇన్సాన్, తమిళంలో రాజ నాగం పేరిట రీమేక్ చేశారు. అభిమానులకు పండుగే నాగరహావు చిత్రం ఓ కళా ఖండం. దీనిని పునః సృష్టించారు. విష్ణువర్ధన్ అభిమానులకు కచ్చితంగా ఇది పండుగ సీజనే. ఈ సినిమా రజతోత్సవాన్ని జరుపుకుంటుందనే విశ్వాసం నాకుంది. – భారతి, అలనాటి హీరోయిన్, విష్ణువర్ధన్ సతీమణి ఓబవ్వ పాత్రను సవాల్గా తీసుకున్నా ఈ సినిమాలో ఓబవ్వ పాత్రను తొలుత కల్పనకు ఇవ్వజూపారు. చిన్న పాత్ర అనే కారణంతో ఆమె తిరస్కరించింది. అనంతరం పుట్టన్న నన్ను అడిగారు. దీనినో సవాలుగా భావించి నేను ఒప్పుకున్నాను. శత్రు సేనలను తుదముట్టించే వీర నారిగా ఓబవ్వను వర్ణిస్తూ రాసిన పాట పుట్టన్న ఊహల్లోంచి పుట్టింది. ఈ పాటను విన్నప్పుడల్లా నాకు కొత్త గీతంగానే అనిపిస్తూ ఉంటుంది. – జయంతి, అలనాటి నటి, ఓబవ్వ పాత్రధారి -
వెల్కమ్ మడోనా
.. అంటూ మడోనాను వెల్కమ్ చేస్తోంది కన్నడ ఇండస్ట్రీ. మనకు ‘ఈగ’ విలన్గా ఎప్పటికీ గుర్తుండిపోయే సుదీప్ కన్నడంలో పెద్ద స్టార్ హీరో. ఆయన లేటెస్ట్ మూవీ ‘కోటిగొబ్బ’ని ఇటీవలే అనౌన్స్ చేశారు. అప్పటినుంచి సుదీప్ పక్కన హీరోయిన్గా ఎవరు యాక్ట్ చేస్తారని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా బంపర్ ఆఫర్ మలయాళ నటి మడోనా సెబాస్టియన్కు లభించింది. డెబ్యూ డైరెక్టర్ శివ కార్తీక్ డైరెక్ట్ చేçస్తున్న ఈ సినిమాను సూరప్ప బాబు నిర్మిస్తున్నారు. మలయాళ ‘ప్రేమమ్’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మడోనా తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగు ‘ప్రేమమ్’లోనూ కనిపించారు. ఇప్పుడు కన్నడంలోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో కెరీర్ ఇనీషియల్ స్టేజ్లోనే సౌత్లో నాలుగు భాషల్లో యాక్ట్ చేసిన క్రెడిట్ కొట్టేశారీ కేరళ బ్యూటీ. -
వారసుడొస్తున్నాడు
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 200 చిత్రాల్లో నటించారు కథానాయిక సుమలత. నైన్టీస్లో తిరుగులేని కథానాయికగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఆమె భర్త అంబరీష్ కన్నడంలో మంచి స్టార్. ఈ దంపతుల తనయుడు అభిషేక్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అంటే వారసుడొస్తున్నాడన్నమాట. నాగ్ శేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘అమర్’ అనే కన్నడ సినిమా ద్వారా అభిషేక్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం పూర్తి అయ్యింది. మిస్ ఇండియా ఫైనలిస్ట్ తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ చిత్రం కోసం థాయ్ల్యాండ్లో మార్షల్ ఆర్ట్స్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు అభిషేక్. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అన్నట్లు.. మంగళవారం అంబరీష్ పుట్టినరోజు. తనయుడు హీరోగా అరంగేట్రం చేయడం ఆయనకు ఈ బర్త్డే స్పెషల్ అనొచ్చు. -
‘స్టేట్మెంట్ 8/11’ .. ఇది మోదీ సినిమా
ప్రస్తుతం ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు ఎన్నికల సందర్భంగా రాజుకున్న రాజకీయ వేడితో కర్ణాటక ప్రజలకు ఊపిరి సలపడం లేదు. ఇలాంటి సమయంలో వినోదం కోసం సినిమాకు వెళదామన్నకున్న వారిని.. అక్కడ కూడా ఎన్నికల ఫీవర్ వదిలేలా లేదు. అయితే ప్రచారంలో భాగంగా మోదీని స్వయంగా చూడలేని ఆయన అభిమానులు థియేటర్లో చూసి తరించవచ్చు. అర్థంకాలేదు కదా.. అయితే స్టేట్మెంట్ 8/11 సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడండి. స్టేట్మెంట్ 8/11.. కన్నడ నాట ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్న సమయంలో.. చరిత్రాత్మక నిర్ణయమైన డీమానిటైజేషన్ గురించి తెరకెక్కిన సినిమా విడుదల కానుండటం విశేషం. స్టేట్మెంట్ 8/11 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో అచ్చం ప్రధాని నరేంద్ర మోదీలా ఉన్న ఎంపీ రాజేంద్రన్ అనే వ్యక్తి ఆయన పాత్ర పోషించారు. నవంబర్ 8 అర్ధరాత్రి అన్ని పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన సీన్తో ఈ సినిమా మొదలవుతుందట. అలాగే డీమానిటైజేషన్ వల్ల సమాజంపై ప్రభావం, వివిధ మార్పుల గురించి వచ్చిన మార్పుల గురించి ఈ సినిమాలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా డీమానిటైజేషన్కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా కానీ ఉండదని చెబుతున్నారు నిర్మాత కేహెచ్ వేణు. అప్పి ప్రసాద్ దర్శకత్వంలో స్టేట్మెంట్ 8/11 తెరకెక్కింది. ఎవరీ ఎంపీ రాజేంద్రన్... ప్రధాని మోదీ పేరు చెప్పగానే.. తెల్లటి గడ్డం, కళ్లద్దాలు, లాల్చీ, పైజామా, కోటు గుర్తుకువస్తాయి. కానీ మోదీ టీ షర్ట్ వేసుకుని...బ్యాగ్ తగిలించకుని.. చేతిలో మొబైల్ పట్టుకుని రైల్వే స్టేషన్లో నిల్చొని ఉండటాన్ని మనం ఊహించగలమా.. అయితే గత జులైలో ఇది జరిగింది. కానీ అక్కడ నిల్చుని ఉన్నది మన ప్రధాని మోదీ కాదు. అచ్చం ఆయనలా ఉన్న మరో వ్యక్తి. ఆయన పేరు ఎంపీ రామచంద్రన్. ఓరోజు రైల్వే స్టేషన్లో నిల్చుని ఉన్నపుడు ఆయన ఫొటో తీసిన విద్యార్థి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో పాపులర్ అయ్యార్. మోదీ ఇన్ పయ్యనూర్ స్టేషన్ అంటూ ఆ విద్యార్థి చేసిన కామెంట్.. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో నటుడిగా కొత్త ప్రయాణానికి నాంది పలికిందంటున్నారు 64 ఏళ్ల రాజేంద్రన్. -
యువతిపై హీరో అత్యాచారం
సాక్షి, బెంగళూరు : తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కన్నడ హీరోపై ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హోంబణ్ణ చిత్ర హీరో సుబ్రహ్మణ్య కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసినట్టు 23 ఏళ్ల యువతి బసవగుడి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. రాజాజీనగర్కు చెందని యువతి, సుబ్రహ్మణ్య రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరద్దరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. అయితే చిత్ర షూటింగ్ ముగిసిన తర్వాత పెళ్లి చేసుకుందామని సుబ్రహ్మణ్య మాట ఇచ్చాడు. ఈ క్రమంలో నవంబర్ 1న తన అక్క ఇంట్లో పార్టీ ఉందని చెప్పి ఆ యువతిని సుబ్రహ్మణ్య ఇంటికి పలిచాడు. అక్కడ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతి నిలదీయడంతో త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. కానీ ఇపుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సబ్రహ్మణ్య పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చేపడుతున్నారు. -
ఆ నలుగురూ ఆడాళ్లే... అండ్ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే!
కన్నడలో ‘ఎమ్ఎమ్సిహెచ్’ అనే ఓ సినిమా రూపొందుతోంది. దీని స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో ముఖ్య తారలు నలుగురూ ఆడాళ్లే! ఈ సిన్మాకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండోయ్! అదేంటంటే.. ఆ నలుగురూ ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే. ఆ నలుగురూ... ‘దూకుడు, ఓ మై ఫ్రెండ్’ తదితర తెలుగు చిత్రాలు చేసిన నటి వినయ్ ప్రసాద్ కుమార్తె ప్రతిమా ప్రసాద్, ‘ఉలవచారు బిర్యాని’ ఫేమ్ సంయుక్తా హోర్నాడ్ (నటుడు ప్రకాశ్ బేలవాడి మేనకోడలు, రీసెంట్గా విడుదలైన ‘గృహం’లో పాస్టర్గా నటించారీయన), మేఘనా రాజ్ (నటుడు సుందర్ రాజ్ కుమార్తె), నక్షత్రా బాబు (నటుడు రాజేంద్రబాబు కుమార్తె). సినిమాలో ఈ హీరోయిన్లు అందరూ కాలేజ్ స్టూడెంట్స్గా కనిపిస్తారట! ఇంకో స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణీ ద్వివేది అతిథి పాత్ర చేస్తున్నారు. ఇదొక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. నాని ‘జెండాపై కపిరాజు’ సినిమాలో రాగిణి ఓ హీరోయిన్గా నటించారు. -
మరోసారి శివగామిగా...
కథానాయికగా రమ్యకృష్ణ ఎన్ని సినిమాలు చేసినా.. ఆమె పేరు చెప్పగానే ‘నరసింహ’ సినిమాలోని నీలాంబరి పాత్ర గుర్తుకురాక మానదు. ‘బాహుబలి’ సినిమా విడుదల తర్వాత అందరూ ఆమెను ‘శివగామి’ అంటున్నారు. మరోసారి శివగామిగా ఆమె వెండితెరపై సందడి చేయనున్నారు. అంటే.. ‘బాహుబలి 3’ ఏమైనా తీయనున్నారా? అనే అనుమానం రాకమానదు. రమ్య మరోసారి శివగామిగా అలరించనున్నది తెలుగువారిని కాదు. కన్నడ ప్రేక్షకులను. అసలు విషయానికొస్తే... రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 9వ శతాబ్దానికి చెందిన రాణి శివగామి కథాంశంతో కన్నడంలో ఓ సినిమా రూపొందనుందట. దర్శకుడు మధు ఈ చారిత్రాత్మక సినిమాని తెరకెక్కించనున్నారట. ఇప్పటికే కథ–స్క్రీన్ప్లే పూర్తి చేసుకున్న ఆయన రమ్యకృష్ణకు వినిపించారట. పవర్ఫుల్ రాణి పాత్ర కావడంతో ఆమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొత్త సంవత్సరంలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని టాక్. -
హీరోగా బొమ్మాళీ...
‘వదల బొమ్మాళీ... నిన్నొదల’– వాయిస్తోనే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించారు రవిశంకర్. ఇంతకీ, ఎవరీయన? ‘అరుంధతి’లో విలన్గా చేశారే... సోనూ సూద్. ఆయనకు డబ్బింగ్ చెప్పిందీయనే! జస్ట్... డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఈయన నటుడు కూడా! పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు చేశారు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’లో రవిశంకర్ విలన్గా చేశారు. ఇప్పుడీ రవిశంకర్ కన్నడలో ‘కాలేజ్ కుమార్’ అనే సినిమా చేశారు. అందులో ఈయన పాత్ర ఆల్మోస్ట్ హీరోలా ఉంటుందట! ‘‘మా సినిమాలో రవిశంకర్ హీరో అంటే తప్పేం కాదు. కానీ, పంచ్ డైలాగులతో లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లా కాకుండా... ఓ డిఫరెంట్ రవిశంకర్ను చూస్తారు’’ అన్నారు ‘కాలేజ్ కుమార్’ దర్శకుడు శంతు. ఇక, రవిశంకర్ అయితే... ‘‘కొన్ని సిన్మాల్లో ఆఫ్బీట్ రోల్స్ తప్పిస్తే, నేనెక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేశా. ఇందులో మిడిల్ క్లాస్ ఫాదర్గా డిఫరెంట్ రోల్ చేశా. నా అభిమానులకు ఈ సినిమా, అందులోని నా పాత్రలో ఓ సర్ప్రైజ్ కూడా ఉంది’’ అన్నారు. ఏంటో? ఆ సర్ప్రైజ్! అన్నట్టు... తెలుగులో మహేశ్బాబు ‘భరత్ అనే నేను’లోనూ రవిశంకర్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారట!! -
గల్లంతైన మరో నటుడి మృతదేహం లభ్యం
హైదరాబాద్: ‘మాస్తిగుడి’ సినిమా క్లైయిమాక్స్ చిత్రీకరణ సమయంలో తిప్పగొండనహళ్లి చెరువులో సోమవారం గల్లంతైన ఇద్దరు కన్నడ నటుల్లో మరొక నటుడి మృతదేహం లభించింది. నటుడు అనిల్ మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. గజ ఈతగాళ్లు, స్థానికులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యల చేపట్టగా.. మంగళవారం ఉదయం ఉదయ్ రాఘవ మృతదేహం లభించింది. కాగా అనిల్ ఆచూకీ లభించకపోవడంతో తీవ్రంగా గాలించిన సిబ్బంది ఈ రోజు ఉదయం అనిల్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. -
షూటింగ్ విషాదం... షాకింగ్ నిజాలు!
కన్నడ సినిమా షూటింగ్లో భాగంగా హెలికాప్టర్ నుంచి రిజర్వాయర్లోకి దూకి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు నటుల మృతదేహాలు ఇంకా లభించలేదు. 30మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రిజర్వాయర్లో తీవ్రంగా గాలిస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. ప్రముఖ హీరో ‘దునియా’ విజయ్ హీరోగా, అమూల్య హీరోయిన్గా నాగశేఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్తీగుడి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం ఈ సినిమా పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏమిటంటే... షూటింగ్లో భాగంగా హెలికాప్టర్లో నుంచి రిజర్వాయర్లోకి దూకే సీన్ కోసం ఎలాంటి ముందుజాగ్రత్త భద్రత చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. హీరో దునియా విజయ్, విలన్ పాత్రలు పోషిస్తున్న ఉదయ్, అనిల్ ముగ్గురు నీటిలో దూకగా.. ఒక్క విజయ్ కోసమే భద్రత ఏర్పాట్లు చేశారని సమాచారం. రిజర్వాయర్ మీద హెలికాప్టర్ తో చక్కర్లు కొట్టేందుకు మాత్రమే బెంగళూరు వాటర్ బోర్డు చిత్రయూనిట్కు అనుమతి ఇచ్చింది. రిజర్వాయర్లో షూటింగ్కు కానీ, రిజర్వాయర్లో దూకే స్టంట్లకుకానీ వాటర్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. ముందుజాగ్రత్త చర్యగా ఒక డీజిల్ బోటును అందుబాటులో ఉంచినా.. అది ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల పనిచేయలేదు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక తెప్ప మాత్రమే అందుబాటులో ఉంది. అది రిజర్వాయర్లో దూకిన హీరో విజయ్ను కాపాడటానికి ఉపయోగపడింది. ఇంకా దారుణం ఏమిటంటే తమకు ఈత సరిగ్గా రాదని, నిపుణుల వద్ద తమకు ఈతలో శిక్షణ కూడా ఇప్పించలేదని నటులు ఉదయ్, అనిల్ షూటింగ్కు ముందు టీవీచానెళ్లతో చెప్పారు. అయినా, వారి భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. హెలికాప్టర్లో చిత్రీకరిస్తున్న ఈ క్లైమాక్స్ సీన్పై చిత్రయూనిట్ బాగా ప్రచారం చేసింది. ఈ ఒక్క సీన్ కోసమే రూ. 1.2 కోట్లు ఖర్చు చేసినట్టు చిత్ర నిర్మాత సుందర్ పీ గౌడ మీడియాకు తెలిపారు. ఈ సీన్ చిత్రీకరణను కవర్ చేసేందుకు న్యూస్చానెళ్లను కూడా ఆహ్వానించారు. షూటింగ్కు ముందు న్యూస్ చానెళ్లతో ఉదయ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి స్టంట్ను నేను చేయడం ఇదే తొలిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే నాకు చాలా భయం. ఇంత ఎత్తు నుంచి ఎప్పుడూ దూకలేదు. మేం ముగ్గురం ఒకరిని ఒకరు చూస్తూ హెలికాప్టర్ నుంచి దూకుతాం. ఆపై దేవుడి దయ. ఏదైనా జరగరానిది జరిగితే ఆయన సంకల్పం అనుకుంటాం’ అని పేర్కొన్నాడు. అనిల్ మాట్లాడుతూ ‘అంత ఎత్తు నుంచి దూకడం ఇదే తొలిసారి. మాకు కొంచెం భయంగా ఉంది. నాకు కొంచెం ఈత వచ్చు. ఊర్లలో బావిలో దూకినట్టు దూకేస్తా’ అని చెప్పాడు. ప్రమాదం జరిగాక సంఘటనాస్థలంలో అంబులెన్సులు, సహాయక సిబ్బంది వంటి అత్యవసర సేవలు ఏమాత్రం అందుబాటులో లేవు. ఏమాత్రం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఇంత ప్రమాదకరమైన షాట్ చిత్రీకరణకు పూనుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పరారీలో ఉన్న చిత్ర నిర్మాతతోపాటు దర్శకుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. -
నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు
బెంగళూరు: కన్నడ సినిమా 'మాస్తీగుడి' షూటింగ్ సమయంలో ఇద్దరు వర్ధమాన నటులు రిజర్వాయర్లో మునిగి చనిపోయిన ఘటనకు సంబంధించి ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, స్టంట్ డైరెక్టర్, యూనిట్ మేనేజర్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సినిమా షూటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని, చిత్ర నిర్మాత, డైరెక్టర్, స్టంట్ డైరెక్టర్ నిర్లక్ష్యం కారణంగా వారు ప్రాణాలుకోల్పోయారని ప్రాథమిక విచారణ నివేదికలో పోలీసులు నమోదు చేసుకున్నారు. దునియా విజయ్ హీరోగా, అమూల్య హీరోయిన్గా నాగశేఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్తీగుడి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సినిమాలో విలన్గా నటిస్తున్న ఉదయ్, స్టంట్మ్యాన్ అనిల్ మొదటగా 50 మీటర్ల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకగా.. ఆ సమయానికి రక్షణ బోట్లు రాకపోవడం, వీరికి ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయారు. -
సినిమా షూటింగ్లో అపశ్రుతి
⇒ హెలికాప్టరు నుంచి రిజర్వాయర్లోకి దూకిన హీరో, విలన్లు ⇒ ఈత రాకపోవడంతో ఇద్దరు నటుల గల్లంతు ⇒ హీరో దునియా విజయ్ క్షేమం సాక్షి, బెంగళూరు: కన్నడ సినిమా చిత్రీకరణ సమయంలో విషాదం చోటుచేసుకుంది. చిత్రం పతాక సన్నివేశాలను ఒక రిజర్వాయర్ సమీపంలో చిత్రీకరిస్తుండగా ఇద్దరు వర్ధమాన నటులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ‘దునియా’ విజయ్ హీరోగా, అమూల్య హీరోయిన్గా నాగశేఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్తీగుడి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సినిమాలో విలన్గా నటిస్తున్న ఉదయ్, స్టంట్మ్యాన్ అనిల్ మొదటగా 50 మీటర్ల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకారు. అయితే వీరికి ఈత రాకపోవడం, రక్షక బోట్లు సరైన సమయానికి రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. హీరో విజయ్ కూడా వారి వెనకే దూకినా అతనికి తెప్ప అందడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భారీగా పేరుకుపోయిన పూడిక కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, సినిమా చిత్రీకరణ యూనిట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత ప్రమాదకరమైన చిత్రీకరణకు ముందు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుర్ఘటనతో కన్నడ సినీవర్గాలు విషాదంలో మునిగిపోయాయి. గల్లంతైన అనిల్, ఉదయ్ కొన్ని రోజుల ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు ఈత సరిగా రాదని, స్టంట్లు చేయడం భయమని పేర్కొనడం గమనార్హం. -
విషాదం: అతను తెలుగు చిత్రాలు చేశాడు!
ఓ కన్నడ సినిమా షూటింగ్ స్టంట్లో పాల్గొంటూ ప్రాణాలు విడిచిన నటుడు రాఘవ ఉదయ్ పలు తెలుగు సినిమాల్లోనూ కనిపించాడు. జక్కన్న, బుల్లెట్ రాణి వంటి తెలుగు సినిమాలతోపాటు త్వరలో కామెడియన్ సప్తగిరి హీరోగా నటించిన 'సప్తగిరి ఎక్స్ప్రెస్'లోనూ అతను నటించినట్టు తెలుస్తోంది. పలు కన్నడ సినిమాల్లో విలన్గా నటించి పలు అవార్డులు సైతం గెలుపొందిన ఉదయ్ ఇటీవలే తనకు ఎత్తులంటే భయమని చెప్పాడు. "ఇలాంటి స్టంట్ను నేను చేయడం ఇదే తొలిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే నాకు చాలా భయం. ఆ దేవుడి దయ వల్ల ఈ స్టంట్ పూర్తిచేస్తానని ఆశిస్తున్నా' అంటూ సువర్ణ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ చెప్పాడు. కన్నడ హీరో దునియ విజయ్ నటిస్తున్న చిత్రం 'మాస్తీగుడి' క్లైమాక్స్ షూటింగ్లో భాగంగా సోమవారం తిప్పగొండనహళ్లి రిజర్వాయర్లో జరిగిన విషాదంలో ఉదయ్తోపాటు మరో నటుడు అనిల్ గల్లంతైన సంగతి తెలిసిందే. వారు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. క్లైమాక్స్ షూటింగ్లో భాగంగా హెలికాప్టర్ నుంచి హీరో దునియ విజయ్తోపాటు ఉదయ్, అనిల్ రిజర్వాయర్లోకి దూకారు. అయితే, ఈత వచ్చిన హీరో ఈదుకుంటూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగా, ఇద్దరు నటులు మాత్రం రిజర్వాయర్లో మునిగిపోయారు. నిజానికి హెలికాప్టర్లో చిత్రీకరిస్తున్న ఈ క్లైమాక్స్ సీన్పై చిత్రయూనిట్ బాగా ప్రచారం చేసింది. ఈ ఒక్క సీన్ కోసమే రూ. 1.2 కోట్లు ఖర్చు చేసినట్టు చిత్ర నిర్మాత సుందర్ పీ గౌడ గతంలో మీడియాకు తెలిపారు. దీంతో క్లైమాక్స్ చిత్రీకరణకు ముందు ఇందులో పాల్గొనే నటులతో న్యూస్చానెళ్లు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ ఇంటర్వ్యూల్లో మాట్లాడిన ఉదయ్ ఆ తర్వాత తిరిగిరాని లోకాలకు వెళ్లడం అతని అభిమానులను దిగ్భ్రాంత పరుస్తున్నది. -
క్లైమాక్స్ షూటింగ్లో పెనువిషాదం..!
అది భారీ రిజర్వాయర్. ప్రముఖ సినిమా క్లైమాక్స్ షూటింగ్ అక్కడ జరుగుతోంది. హెలికాప్టర్ షాట్ను చిత్రీకరిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి హీరోతోపాటు ఇద్దరు విలన్లు దూకారు. దూకడం వరకు దర్శకుడు ప్లాన్ చేసుకున్నట్టే జరిగింది. కానీ, హెలికాప్టర్ నుంచి దూకిన తర్వాతే పెనువిషాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ నుంచి దూకిన ఇద్దరు నటులు చెరువులో ఈదుతూ.. గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. అతికష్టం మీద హీరో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెప్పపాటులో కళ్లముందే కెమెరాలు చిత్రీకరిస్తుండగా ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్ర దిగ్బ్రాంతికర ఘటన కర్ణాటకలో జరిగింది. ప్రముఖ కన్నడ హీరో దునియ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "మాస్తీగుడి' . బెంగళూరుకి 35 కిలోమీటర్ల దూరంలోని తిప్పగొందనహళ్లి రిజర్వాయర్లో సోమవారం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా అనుకోని ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ నుంచి హీరోతోపాటు ఇద్దరు నటులు ఉదయ్, అనిల్ రిజర్వాయర్లోకి దూకారు. అయితే, ఈత వచ్చిన హీరో ఈదుకుంటూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగా, ఇద్దరు నటులు మాత్రం రిజర్వాయర్లో మునిగి చనిపోయారు. ఈ ఘటన సినీ వర్గాలను దిగ్భ్రాంత పరిచింది. మరోవైపు ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండా ఇంత రిస్కీ షాట్ చిత్రీకరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రమదం నేపథ్యంలో చిత్రయూనిట్పై పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు నటులు.......................................................ప్రమాదం నుంచి బయటపడ్డ హీరో దునియ విజయ్ -
హార్సిలీహిల్స్లో కన్నడ చిత్రం లీ షూటింగ్
* గాలిబండపై ద్రోణ్ ద్వారా సన్నివేశాల చిత్రీకరణ * చిత్ర దర్శకుడు మదనపల్లె యువకుడు బి.కొత్తకోట: కన్నడ చిత్రం లీ సినిమా షూటింగ్ శుక్రవారం బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్లో జరిగింది. ఇక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలకు కేంద్రమైన గాలిబండపై చిత్ర హీరో హీరోయిన్లపై ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా గాలిబండ అంచులో హీరోయిన్ నబా నటేష్ నిలబడివున్న సన్నివేశాన్ని కెమెరాతో ఎదురుగా చిత్రీకరించే వీలులేకపోవడంతో దర్శకులు శ్రీనందన్ ద్రోణ్ను వినియోగించారు. హీరోయిన్ వైపు నుంచి ద్రోణ్ ఎదురుగా ఉన్న లోతైన లోయపై నుంచి సుందరమైన దృశ్యాలను చిత్రీంచింది. షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకొన్న పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు. మదనపల్లె రేంజర్ మాధవరావు, సిబ్బంది కూడా షూటింగ్ తిలకించారు. రెండు మతాల మధ్య ప్రేమకథ లీ చిత్రం పూర్తిగా యాక్షన్, ప్రేమ కథనంతో నడుస్తుందని చిత్ర దర్శకుడు హెచ్ఎం. శ్రీనందన్ చెప్పారు. మదనపల్లెకు చెందిన శ్రీనందన్కు దర్శకుడిగా ఇది రెండో చిత్రం. ఈ సినిమాకు నిర్మాత సాధు రమేష్, సంగీతం గురుకిరణ్కాగా ప్రముఖ విలన్ పాత్రధారి రాహుల్దేవ్ది కీలక పాత్రని చెప్పారు. రంగయ్యరఘు, సాధుకోకిల, చిన్నక్క, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్లో సందడి చేయనున్న ‘బబ్రువాహన’
బెంగళూరు: డాక్టర్ రాజ్కుమార్ ద్విపాత్రాభినయంలో నటించిన అలనాటి చిత్రం ‘బబ్రువాహన గల్ఫ్లో కూడా సందడి చేయనుంది. హుణసూరు కృష్టమూర్తి నిర్దేశకత్వంలో 70వ దశకంలో రూపొందించిన ఈ చిత్రం కన్నడ సినిమా రంగంలో కొత్త చరిత్రను సృష్టించిన విషయం విధితమే. తిరిగి ఈ చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీ ద్వారా రంగుల్లోకి మార్చి కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 22న రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇప్పటి తరం అభిమానులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. త్వరలో ఈ సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతుంది. విదేశాల్లో ఉన్న కన్నడ సినిమా అభిమానుల కోరిక మేరకు బబ్రువాహన సినిమాను గల్ఫ్ దేశాలైన దుబాయ్,షార్జా,అబుదాబి,ఓమన్,మస్కత్,సోహార్ తదితర దేశాలలో విడుదల చేయనున్నామని చిత్రవర్గాలు తెలిపాయి. -
స్టైలిష్ స్టార్ను ఎట్రాక్ట్ చేసిన కన్నడ కథ
-
వెండితెర వెనుక జీవితం!
వెండితెర మీద వెలిగినపోయిన జీవితాల వెనక వున్న చీకటి కోణాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా శాండిల్వుడ్లో ఓకథానాయిక జీవిత చరిత్ర తెరెకెక్కి సంచలనం సృష్టిస్తోంది. చాలా రోజులుగా కన్నడ ఇండస్టీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'అభినేత్రి' శుక్రవారం విడుదలైంది. 70వ దశకంలో శాండిల్వుడ్లో కథానాయికగా వెలిగిన నటి కల్పన. అభినేత్రి చిత్రకథ ఆమె జీవితం ఆధారంగానే రూపొందుతుందన్న వార్తలు ప్రారంభంనాటి నుండి వెలువడుతూనే వున్నాయి. పైగా అభినేత్రి టైటిల్ రోల్ దండుపాళ్యంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూజాగాంధీ పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆరు నెలలకు ముందే విడుదలకావాల్సిన ఈ సినిమా వివాదాలతో కావాల్సినంత పబ్లిసిటీని వెంటపెట్టుకుని విడుదలైంది. విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. కన్నడ నాట స్టార్ హీరోయిన్గా వెలిగి, వ్యక్తిగత వ్యవహారాలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్న గ్లామర్ హీరోయిన్ కల్పన పాత్రలో పూజాగాంధీ మెప్పించింది. అలనాటి వాతావరణం, లోకేషన్స్ లాంటి విషయాలలో దర్శకుడు సతీష్ పార్తీబన్ శక్తి వంచన లేకుండా కృషిచేశారు. అయితే వెండి తెరకు సంబంధించిన సినిమా అంటేనే అన్నీ ఒకే రకంగా వుంటున్నాయి. స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్షర్ విజయం సాధించడంతో చాలా మంది కథానాయికలు, ఇలాంటి కథలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాను చూస్తుంటే విద్యాబాలన్ డర్టీ పిక్షర్, మాధూర్ బండార్కర్ హీరోయిన్, వీణామాలిక్ సిల్క్ సక్కత్ మగ, సనాఖాన్ గజ్జెల గుర్రం లాంటి సినిమాలు గుర్తుకు రాకమానవు. -
అడ్వాన్స్ తిరిగివ్వనన్న హీరోయిన్
కాజల్ అగర్వాల్ పై తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ ఫిర్యాదు చేసిన ఉదంతం మరకముందే మరో హీరోయిన్ వివాదాల్లో చిక్కుకుంది. అడ్వాన్స్ గా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇచ్చేందుకు సదరు సమ్మతించకపోవడంతో నిర్మాతల మండలిని ఆశ్రయించారు. ఈ వివాదంలో ఇరుకున్న ఆ హీరోయిన్ పేరు హరిప్రియ. తకిటతకిట, పిల్లజమీందార్, అబ్బాయ్ క్లాస్- అమ్మాయి మాస్ సినిమాల్లో నటించిన ఈ భామ కన్నడంలో 'ఫ్లై' అనే సినిమా ఒప్పుకుంది. తర్వాత అగ్రనటుడు సుదీప్ సరసన నటించే ఛాన్స్ రావడంతో 'ఫ్లై' నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను పెట్టుకున్నారు. అయితే అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని నిర్మాతలు అడిగితే ఇచ్చేది లేదని కచ్చితంగా చెప్పేసిందట హరిప్రియ. చేసేది లేక ఆమెపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. -
'డీకే' చిత్రంలో సన్నీలియోన్ ఐటెం సాంగ్
ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఐటెం సాంగ్లకు డాన్సు చేసిన శృంగార తార సన్నీ లియోన్ ఇప్పుడు తాజాగా కన్నడంలో కూడా రంగప్రవేశం చేసింది. 'డీకే' అనే చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ జానపద గీతానికి ఆమె డాన్స్ చేస్తోంది. 'శేషమ్మా.. శేషమ్మా' అంటూ ఈ పాట సాగుతుంది. గత మూడు రోజులుగా ఈ పాట షూటింగ్ సాగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. సోమవారంతో పాట షూటింగ్ ముగిసిపోతుంది. ఈ పాటలో సన్నీలియోన్ను చూసి కన్నడ ప్రేక్షకులు ఆనందిస్తారని సినిమా వర్గాలు అంటున్నాయి. సన్నీ లియోన్ వచ్చిందన్న విషయం నగరంలో ప్రచారం అయితే ఆమె స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, అందుకే ఈ పాటను రహస్యంగా చిత్రీకరిస్తున్నామని తెలిపాయి. ఉదయప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న 'డీకే' చిత్రంలో ప్రేమ్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే మంచు మనోజ్ సరసన 'కరెంటుతీగ' చిత్రంలో కూడా సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. తమిళంలో వడా కర్రీ చిత్రంలోనూ ఆమె ఐటెం సాంగ్కు డాన్స్ చేసింది. -
స్విస్బ్యాంక్కి దారేది...
ఉపేంద్ర కథానాయకునిగా ‘మినిమమ్ గ్యారెంటీ’ శ్రీనివాస్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం ‘టోపీవాలా’. ఇందులో భావన కథానాయిక. ఈ సినిమాను ‘స్విస్బ్యాంక్కి దారేది’ పేరుతో తెలుగులోకి అనువదించారు రమేష్బాబు ఆవులూరి. ‘ది జర్నీ ఆఫ్ టోపీవాలా’ అనేది ఉపశీర్షిక. వి.హరికృష్ణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో ఇటీవల విడుదల చేశారు. శివాజీ, కృష్ణుడు, టి.ప్రసన్నకుమార్, కె.అశోక్కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బెక్కెం వేణుగోపాల్, మామిడిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆడియో వేడుకకు విచ్చేసిన అందరికీ నిర్మాత కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్.ఎన్.పగడాల, నిర్మాణ నిర్వాహకులు: ఆవులూరి వెంకయ్యనాయుడు, కె.పూర్ణచంద్రరావు. -
కన్నడంలో బ్రహ్మానందం
తెలుగు తెరపై తిరుగులేని హాస్యనటునిగా విరాజిల్లుతోన్న బ్రహ్మానందం ఇప్పుడు కన్నడంలోకి కూడా ఎంటరయ్యారు. పునీత్ రాజ్కుమార్ హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘నిన్నందలే’ చిత్రంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. ఇప్పటివరకూ చాలా కన్నడ ఆఫర్లు వచ్చినా కూడా, తెలుగులో బిజీ కారణంగా బ్రహ్మానందం అంగీకరించలేదు. జయంత్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా బ్రహ్మానందం తొలిసారి కన్నడ చిత్రం చేయడానికి అంగీకరించారు. ఇప్పటికే ఈ సినిమా 95 శాతం పూర్తయింది. త్వరలో ఈ చిత్రం పాటలను బెంగళూరులో మహేశ్బాబు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారట. బ్రహ్మానందం మరోపక్క ఓ హిందీ చిత్రం కూడా అంగీకరించారు. గతంలో ఈవీవీ దర్శకత్వంలో ‘సూర్యవంశమ్’లో నటించిన బ్రహ్మానందంకు ఇది రెండో హిందీ సినిమా. 2007లో వచ్చిన ‘వెల్కమ్’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోన్న ‘వెల్కమ్ బ్యాక్’లో ఆయన దొంగ పాత్ర పోషిస్తున్నారు. నానాపటేకర్, అనిల్కపూర్ల కాంబినేషన్లో బ్రహ్మానందం సన్నివేశాలు ఉంటాయట. పాత్ర అమితంగా నచ్చడం వల్లనే చేస్తున్నానని బ్రహ్మానందం చెబుతున్నారు.