KGBV
-
విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై విచారణ
జి.మాడుగుల: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అసెంబ్లీకి సమయానికి రాలేదని ఇంటర్ సెకండియర్కు చెందిన 18 మంది విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై సోమవారం అధికారులు విచారణ చేపట్టారు. డీఈవో బ్రహ్మాజీరావు, కేజీబీవీ జీసీడీవో కె.సూర్యకుమారి సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం జీఎం కొత్తూరులోని కేజీబీవీకి వచ్చి విద్యార్థినులను విచారించారు. కార్తీక పౌర్ణమి కావడంతో శుక్రవారం పూజలకు వెళ్లి అసెంబ్లీకి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రత్యేక అధికారి(ఎస్వో) సాయిప్రసన్న తమను కొట్టి.. జత్తు కత్తిరించారని విద్యార్థినులు వాపోయారు. దేవుని మొక్కు ఉందని చెప్పినా వినలేదని చెప్పారు. ఎస్వో ప్రవర్తనపై విద్యార్థినుల నుంచి అధికారులు లిఖితపూర్వకంగా వివరాలను నమోదు చేసుకున్నారు. ఎస్వో సాయిప్రసన్న మాట్లాడుతూ.. క్రమశిక్షణలో భాగంగా విద్యార్థినుల జుత్తు కత్తిరించానని.. చేసింది తప్పేనని.. తనను క్షమించాలని కోరింది. చిన్నచిన్న తప్పులకు ఇంత దారుణంగా దండిస్తారా? అంటూ ఎస్వో సాయిప్రసన్నపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈవో బ్రహ్మాజీరావు మాట్లాడుతూ.. నివేదికను ఉన్నతాధికారులకు అందించి.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదికను తమకు అందించాలని కలెక్టర్ను ఆదేశించినట్లు కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు, సభ్యుడు గొండు సీతారాం చెప్పారు. నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.ఎస్వోను బ్లాక్మెయిల్ చేసిన టీడీపీ నేతఈ ఘటన బయటకు రాకుండా చూసుకుంటానని.. సర్పంచ్లు, ఎంపీటీసీలు, విద్యార్థినుల తల్లిదండ్రులకు ఇచ్చేందుకు రూ.లక్ష కావాలంటూ వంజంగిపాటుకి చెందిన టీడీపీ నేత లకే రామకృష్ణ ఎస్వోను బ్లాక్మెయిల్ చేశాడు. తమ పేర్లు వాడినందుకు రామకృష్ణపై సర్పంచ్లు, ఎంపీటీసీలు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘కడుపు’పై కొట్టారు.. చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన
ఎన్నికల ముందు..‘వనరుల కల్పన, కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమల ద్వారా భారీ సంఖ్యలో యువతకు ప్రభుత్వ కొలువులతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తాం.. సంపద సృష్టించి పంచుతాం’ అని కూటమి పార్టీ నేతలు ప్రచారం చేశారు.గద్దెనెక్కాక..మాట మార్చేశారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. చేస్తున్న చిన్న చిన్నఉద్యోగాలను సైతం అన్యాయంగా ఊడగొడుతున్నారు. చిన్న జీతం తీసుకునే చిరుద్యోగుల పొట్ట గొడుతూ ‘తమ్ముళ్ల’ జేబులు నింపుకోమంటున్నారు. చివరకు స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్ర పరిచే వర్కర్లను సైతం వదలకుండా అడ్డగోలుగా తీసేసి.. ముడుపులు ఇచ్చిన వారిని నియమిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ అక్రమ తొలగింపు పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ‘ఓట్లేసి గెలిపిస్తే కడుపుపై కొట్టారు’ అని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : కాకినాడ జిల్లా కోటనందూరు (అల్లిపూడి) కేజీబీవీలో 2017 ఫిబ్రవరిలో నియమితులైన ఆయా కాళ్ల సత్యవతి(బీసీ)ని టీడీపీ నేతలు తొలగించారు. భర్త లేని ఆమె ఈ వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఇదే కేజీబీవీలో రెండేళ్ల నుంచి వంటమనిషిగా పని చేస్తున్న దారా ఆదిలక్ష్మి(ఎస్సీ)ని సైతం గురువారం టీడీపీ నేతలు తొలగించి, తమ మనిషిని నియమించున్నారు. ఇలా ఒక్క చోట కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊళ్లో చూసినా దుర్మార్గపు తొలగింపులు పరిపాటిగా మారాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వండే వంట మనుషులు, హెల్పర్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, నైట్ వాచ్మెన్ల వరకూ అందరినీ తొలగించాలంటూ టీడీపీ నేతలు అధికారులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. తొలగించిన వారి స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఆదేశిస్తున్నారు. ముడుపులు దండుకుంటున్న ‘పచ్చ’ నేతలుతొలగించిన వారి స్థానంలో నియమిస్తామంటూ ఆశావహుల నుంచి భారీ ఎత్తున ముడుపులు దండుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించకూడదంటూ అధికారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. 10, 15 ఏళ్ల నుంచి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు.. 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తొలగిస్తున్నారు. ఆ స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఉపాధి హామీ అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తాళలేక ఇప్పటికే 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అధికారులు తొలగించారు. టీడీపీ నేతల వేధింపులు తాళలేక నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులు.. తొలగింపులు..ప్రభుత్వ బడుల్లో, కేజీబీవీల్లో పార్ట్టైమ్ ఉద్యోగులుగా పని చేస్తున్న మధ్యాహ్న భోజనం వంట కార్మీకులు, ఆయాలు, స్వీపర్లను బెదిరించి బలవంతంగా తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో అన్ని విభాగాల్లోనూ పార్ట్టైమ్ సిబ్బంది సుమారు 20 వేల మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది 14 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు. వీరి నియామకం రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో కలెక్టర్, డీఈవో ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు తొలగింపు మాత్రం స్థానిక టీడీపీ నాయకులు చేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట కొత్త వారి నియామకానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు డీఈవోలు, ఏపీడీలను ఆదేశించారు. ఇదే అదనుగా టీడీపీ వారు గతంలో నుంచి పని చేస్తున్న వారిని తొలగించి, తమ వారిని నియమించి ఆ వివరాలను ఉన్నతాధికారులకు పంపి ఆమోదించుకుంటున్నారు. పలు గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.అన్ని జిల్లాల్లోనూ కన్నీటి గాథలే..⇒ విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాణి మల్లమ్మదేవి, యుద్ధ స్తంభం, డివైడర్ల మధ్య ఉన్న మొక్కల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న 16 మంది చిరు ఉద్యోగులను తొలగించారు. గంట్యాడ మండలం కొటారుబిల్లి కేజీబీవీలో 2019 నుండి పని చేస్తున్న వంట మనిషి రొంగలి శ్రీలక్ష్మి, వాచ్మెన్ ఆర్.దుర్గను తొలగించి, తమ వాళ్లను పెట్టుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని చుక్కవలస, ఏనుగువలస, వెదుళ్లవలస, మెరకముడిదాం మండలంలో భైరిపురం, గర్భాం, కొత్తవీధి, శ్యామయావలస రేషన్ డీలర్లను తొలగించారు. చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికోన్నత పాఠశాలలు, మెరకముడిదాం మండలంలోని రామయవలస, గుర్ల, తెట్టంగి, పెనుబర్తి గ్రామాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించారు. చీపురుపల్లి మండలం పేరిపిలో వేధింపులు భరించలేక ఓ ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా చేశారు. గుర్ల మండలం శేషపుపేటలో ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించారు. ⇒ పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘంలో ఐదేళ్ల నుంచి పని చేస్తున్న సుమారు 50 మంది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మీకులను (ఆప్కాస్) టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అధికారులు తొలగించారు. వీరు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును కలిసినా, వారిని ఉద్యోగాల్లో తీసుకునేందుకు అంగీకరించలేదు. ⇒ వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలోని గొంటువారిపల్లె, బాలాయపల్లె, గంగనపల్లె, ఓబులాపురం, ఉప్పలూరులో రేషన్ డీలర్లను తొలగించారు. కలసపాడు మండలంలో పలువురు డీలర్లను తొలగింపుకు రంగం సిద్ధం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పలువురు లబి్ధదారుల పింఛన్ తొలగించాలని ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ⇒ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామంలోని డ్వాక్రా గ్రూప్ బుక్కీపర్ కె శివనాగేంద్రమ్మను తొలగించారు. పెనమలూరు నియోజకవర్గంలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న నలుగుర్ని తొలగించారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో 10 మంది వీవోఏలను, కందుల భవాని, మరో ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, జయంతిపురం గ్రామంలో 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీదారులను తొలగించారు. ⇒ ఏలూరు జిల్లాలో అంగన్వాడీలు, మధ్యాహ్న¿ోజన కార్మీకులు, డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్, డీఆర్డీఏలో ఉండే విలేజ్ ఆర్గనైజేషన్ అడ్మిని్రస్టేటర్లు ఇలా 67 మంది మహిళల ఉద్యోగాలు తొలగించారు. ఏలూరు నగరంలో అధికార పార్టీ వేధింపులు తాళలేక డ్వాక్రా రిసోర్స్ పర్సన్ పిల్లి విజయలక్ష్మి, ఉంగుటూరు మండలంలో పి.కనకదుర్గలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్నారు. ⇒ ప్రకాశం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 300 మంది వీవోఏలు, 370 మంది మధ్యాహ్న భోజన కార్మీకులు, 200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వంద మంది మున్సిపల్ కార్మికులు, 50 మంది ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, 20 మంది పంచాయతీ కార్మీకులు, 15 మంది స్వచ్ఛభారత్ కార్మికులను తొలగించారు. 2.65 లక్షల వలంటీర్లకు ఉద్వాసనే..2.65 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే పక్కన పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించడానికి గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు నెలకు రూ.పది వేల వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి వారిని పక్కన పెట్టారు. దేవుడి సాక్షిగా తొలగింపు అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న 48 మంది దినసరి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. 80 మంది మధ్యాహ్న భోజనం కార్మీకులను తొలగించారు. పలువురు రేషన్ డీలర్లను తొలగించారు. మిగతా చోట్ల కూడా తొలగించి, వారి స్థానంలో తమ వాళ్లను వేసుకోవడానికి జాబితాలు తయారు చేశారు. ప్రైవేటు కంపెనీలనూ వదలడం లేదు. స్థానికంగా కంపెనీలు నడపాలంటే తమకు కప్పం కట్టడంతో పాటు తాము చెప్పిన వారినే కార్మీకులుగా పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. రణస్థలంలోని యూబీ బీర్ల కంపెనీలో ఏం జరిగిందో అందరూ చూశారు. కూటమికి అనుకూలంగా లేని కార్మీకులను తొలగించారు. మూలపేట పోర్టులోనూ అదే జరిగింది. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులంతా పోర్టు వద్ద పెద్ద ఎత్తున నిరసన చేయడమే కాకుండా కార్యకలాపాలకు అడ్డు తగలడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. ఫోర్జరీ సంతకాలతో డీలర్ల తొలగింపుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం దాచూరులో పొదుపు గ్రూపులకు సంబంధించిన వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)గా పని చేస్తున్న మహిళను తొలగించి ఆ స్థానాన్ని రెండుగా విభజించి టీడీపీకి చెందిన కార్యకర్తలను నియమించాలని డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సిఫార్సు లేఖ పంపారు. కోవూరు నియోజకవర్గం గంగవరంలో రేషన్ షాపు డీలర్ను తొలగించి ఆ పోస్టును స్థానిక టీడీపీ నాయకుడు లక్ష్మీనరసారెడ్డి (బాబురెడ్డి) బేరంపెట్టి రూ.2 లక్షలకు వేరొక వ్యక్తికి కట్టబెట్టాడు. కందుకూరులో 16 రేషన్షాపు డీలర్లను తొలగించేందుకు టీడీపీ నేతలు కుట్రపన్నారు. స్థానిక డిప్యూటీ తహసీల్ధారుతో కుమ్మక్కై డీలర్లకు తెలియకుండానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి రాజీనామా చేసినట్లు లేఖలు పంపడం సంచలనంగా మారింది. తాము రాజీనామాలు చేయలేదని, తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. కందుకూరు, కావలిలలో వైన్షాపులలో పనిచేసే 70 మంది సేల్స్మెన్లు, సూపర్వైజర్లను తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను పెట్టాలని స్థానిక టీడీపీ నేతలు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. కందుకూరులో 50 మందిని తొలగించి వారి స్థానంలో ఆ పోస్టులకు మామూళ్లు దండుకుని టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేలా జాబితా తయారైంది. మున్సిపాలీ్ట, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల్లో దాదాపు 15 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు ఆదేశాలిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు ఏకంగా స్థానిక టీడీపీ నేతలు ఉపాధి హామీ పనులను నిలిపివేశారు. కోవూరు నియోజకవర్గం విడవలూరు, కొడవలూరు మండలాల పరిధిలో పొదుపు గ్రూపులకు సంబంధించిన 10 మంది వీఓఏలను తొలగించి, వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.192 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో బలవంతపు రాజీనామాలుచిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మీకులు, డీలర్లు, సంఘమిత్రలు, ఆర్పీలను తప్పుడు ఫిర్యాదుల ద్వారా టీడీపీ నేతలు తొలగిస్తున్నారు. పలుచోట్ల అధికారులు తలొగ్గి చిరుద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు. ఆయాలు, అంగన్వాడీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. పాలు, సరుకులు ఇవ్వడం లేదని, కేంద్రాలు తెరవడం లేదని, పిల్లలు రావడం లేదని తప్పుడు ఫిర్యాదు చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆర్పీలు, సంఘమిత్రల తొలగింపునకు గ్రామాల్లో డ్వాక్రా సంఘాలను రెచ్చగొట్టి వీధుల్లోకి లాగుతున్నారు. తిరుపతి జిల్లాలో 192 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాజీనామా చేయించారు. రేషన్ డీలర్లు 190 మంది, సంఘమిత్రలు 65 మందిని తొలగించారు. చిత్తూరు జిల్లాలో 86 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అడ్డగోలుగా తొలగించారు. 126 మందిని పని చేయనివ్వకుండా అడ్డుకున్నారు. 34 మందికి నోటీసులు ఇచ్చారు. 47 మంది సంఘమిత్రలను తొలగించాలని అధికారులకు సిఫార్సులు వెళ్లాయి. ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది 112 మందిపై వేటు వేయాలని చూస్తున్నారు. ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీనే అడ్డుకున్న టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులకు కొరత లేకుండా ఉండేలా గత ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన జిల్లా స్థాయి డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పారామెడికల్తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, ఆ నియామకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రులకు స్టాఫ్ నర్స్ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కళాశాలలో 200 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతేడాది సెపె్టంబర్లో విడుదల చేసిన స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్లోని మెరిట్ లిస్ట్ ఆధారంగా తొలుత పాడేరుకు 60, మార్కాపురానికి 47, ఆదోని, పులివెందుల, మదనపల్లె కళాశాలలకు కలిపి 206 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం 313 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఈ ఏడాది జూన్లో కడప, విశాఖపట్నం, గుంటూరు రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయాల్లో సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు. అదే నెల 6న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తామని ప్రకటించారు. కాగా, అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరవ్వాల్సిన ముందు రోజే అర్ధంతరంగా కౌన్సెలింగ్ను రద్దు చేసినట్టు వైద్య శాఖ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని నోటిఫికేషన్లో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తుండటంపై వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, వివిధ జిల్లాల నుంచి కూడా కూటమి నేతలు పోస్టింగ్లు ఇవ్వొద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఊస్టింగ్రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని ఉద్యోగులపై కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించారన్న ఏకైక కారణంతో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా.. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఏపీఐఐసీ, ఏపీ మారిటైమ్ బోర్డు వంటి కీలక సంస్థల్లో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్తగా తమ వారిని నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కూటమి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న ఏపీఐఐసీలోని జీఎం స్థాయి అధికారి వేగంగా పావులు కదుపుతున్నారు. 2019 జూన్ తర్వాత నియమించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలంటూ ఇటీవల కొంత మంది పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు ఆ వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ ఆ ఉన్నతాధికారి జీఎంలకు లేఖలు రాసి, వివరాలు తెప్పించారు. ఇప్పటికే నెల జీతం రూ.40,000 పైన ఉన్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన ఏపీఐఐసీ, తాజాగా ఇప్పుడు అంతకంటే తక్కువ జీతం ఉన్న వారిని కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. ఇలా సుమారు 170 నుంచి 180 మంది ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఏపీ మారిటైమ్ బోర్డు, దాని అనుబంధ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు కింద ఉన్న రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు లిమిటెడ్లో రూ.40 వేలకు పైగా జీతం ఉన్న ఉద్యోగులను తొలగించారు. త్వరలోనే అంతకంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా మొదలు కావచ్చని చెబుతున్నారు. డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారుప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఐదేళ్ల పాటు ఎటువంటి రిమార్కు లేకుండా ప్రజలకు రేషన్ పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం రాగానే డీలర్ షిప్లకు రాజీనామా చేయాలని అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. రెండు నెలలుగా కమీషన్ కూడా ఇవ్వలేదు. మా బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – పాటిల్ ప్రకాష్రెడ్డి, పెద్దకోట్ల, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా మా ఉసురు తప్పక తగులుతుందిమధ్యాహ్న భోజన పథకం కార్మీకురాలిగా పథకం పుట్టినప్పటి నుంచి పని చేస్తున్నా. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ఉన్నఫళంగా మార్చేశారు. నాపై ఎలాంటి ఆరోపణలూ లేవు. అయినా నువ్వు వంట చేయొద్దంటూ నా వంట పాత్రలన్నీ బయట పడేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తప్పించారు. ప్రభుత్వ విధానం మార్చుకోవాలి. లేదంటే మాలాంటి వారి ఉసురు తగులుతుంది. – ఎస్.సరస్వతి, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మీకురాలు, గంగవరం, బెళుగుప్ప మండలం, అనంతపురం జిల్లాసంఘాల మద్దతున్నా తొలగించారునేను 18 మహిళా స్వయం శక్తి సంఘాల సభ్యుల మద్దతుతో తుంగాన పుట్టుగ గ్రామైక్య సంఘానికి వీఓఏగా ఎన్నికయ్యాను. నా బాధ్యతల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చేసిన సేవల్ని గుర్తించిన అధికారులు మహిళా దినోత్సవం నాడు జ్ఞాపికతో సత్కరించారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే నన్ను అకారణంగా తొలగించారు. 18 సంఘాల వారు నన్ను కొనసాగించాలని చెబుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. నా జీతం బకాయి కూడా ఇవ్వలేదు. – తుంగాన అంజలి, తుంగానపుట్టుగ గ్రామైక్య సంఘం వీఓఏ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాబలవంతంగా రాజీనామా చేయించారుగతంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన ఉపాధి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారించి సరైన ఆధారాలు దొరకడంతో తొలగించారు. ఆ స్థానంలో ఉపాధి కూలీగా పనిచేస్తున్న నా అనుభవం, విద్యార్హత చూసి ఫీల్డ్ అసిస్టెంట్గా అవకాశం కల్పించారు. ఏటా నిర్వహించే సామాజిక తనిఖీలో నాపై ఎలాంటి రికవరీలు లేవు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో వారికి అనుకూలమైన వ్యక్తిని పెట్టుకోవాలని నాతో బలవంతంగా రాజీనామా చేయించారు. ఇలా చిరుద్యోగుల కడుపు కొట్టడం సరికాదు. – మునెయ్య, కందాడు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లానా జీవనం ప్రశ్నార్థకంగా మారిందిగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాచ్మెన్గా రెండేళ్లుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాననే నెపంతో నన్ను విధుల నుంచి తొలగించారు. నా కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అన్యాయంగా పొట్ట కొట్టడం సరికాదు. – మాలాజీ ఏసుబాబు, జయంతి, వీరులపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా346 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుశ్రీసత్యసాయి జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కార్మీకులు, ఏజెన్సీల నిర్వాహకులు, రేషన్ షాపుల డీలర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పాఠశాలల వాచ్మెన్లు, వలంటీర్లను బలవంతంగా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా 520 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, 7,836 మంది వలంటీర్లను తీసేశారు. 346 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. 1,438 మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,730 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మీకులను వీధిన పడేశారు. 97 మంది వాచ్మెన్లను తొలగించారు. 1,367 మంది రేషన్ డీలర్లను మార్చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,125 రేషన్ డీలర్లను మార్చేశారు. 420 మంది యానిమేటర్లను తప్పించారు. 677 స్కూళ్లలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,300 మందికి పైగా కార్మికులను తొలగించారు. 274 మంది వాచ్మెన్లు, మరుగుదొడ్లు శుభ్రం చేసే ఆయాలు 450 మందికి పైగా తొలగించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో రాజీనామా చేయించారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, స్కూళ్లలో టాయ్లెట్స్ క్లీన్ చేసే ఆయాలు, నైట్ వాచ్మెన్లపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. చౌక డిపో డీలర్లు అత్యధిక శాతం టీడీపీ వారే ఉన్నారు. ప్రతి పది షాపులకు ఒకరిని ఇన్చార్జ్గా నియమిస్తున్నారు. వారి ద్వారా మామూళ్లు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. -
బాధ్యతలు పెంచినా.. జీతాలు పెంచలే!
సాక్షి, హైదరాబాద్: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న ప్రత్యేకాధికారులు.. తమ సమస్యలను పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు అనేక బాధ్యతలు అప్పగించి, వేతనం మాత్రం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని అంటున్నారు. ఇటీవల కేజీబీవీ సంఘ నేతలు, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం నేతలు దీనిపై సర్కారుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ బడుల ఉపాధ్యాయుల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నా.. వారితో సమాన గౌరవం లభించడం లేదని అందులో వాపోయారు. కేజీబీవీలను అప్గ్రేడ్ చేస్తున్నప్పటికీ అందుకు తగినట్టుగా మౌలిక వసతులు కల్పించడం లేదని.. పట్టించుకోకుంటే చదువుల నాణ్యత పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారులు చేయాల్సిన పనులన్నీ ఏళ్ల తరబడి కాంట్రాక్టు కొలువుల్లో ఉన్న తమపై వేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. పెరిగిన విధులు.. పెరగని వేతనం.. బాలికలు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితిని మార్చే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2010–11లో కేజీబీవీలను ఏర్పాటు చేశారు. హాస్టల్తోపాటు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో 450 కేజీబీవీలున్నాయి. తొలుత ఆరు, ఏడు తరగతులే ప్రారంభించి.. తర్వాత టెన్త్ వరకూ, 2018–19లో ఇంటర్మీడియట్ వరకూ అప్గ్రేడ్ చేశారు. ప్రతీ కేజీబీవీకి ఒక స్పెషల్ ఆఫీసర్ సహా ముగ్గురిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. వారికి చాలా ఏళ్లుగా నెలకు రూ.32,500 వేతనమే అందుతోంది. ఇంటర్మీ డియట్ వరకు అప్గ్రేడ్ చేయడంతో విధులు పెరిగాయి. నెలకు కేవలం రెండే క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అత్యవసరమై అదనంగా సెలవు పెడితే వేతనంలో కోతపడుతుంది. అనుక్షణం విధుల్లోనే.. స్కూల్, హాస్టల్, ఇంటర్ కాలేజీల నిర్వహణ మొత్తం ప్రత్యేక అధికారి చూసుకోవాలి. కొన్ని జిల్లాల్లో మోడల్ స్కూళ్ల బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు. కొత్తగా నిర్మిస్తున్న కేజీబీవీల్లో స్కూల్ ఒకచోట హాస్టల్ మరోచోట ఉంటున్నాయి. దీంతో అన్ని విధులు నిర్వర్తించడం కష్టంగానే ఉందని వారు చెబుతున్నారు. రాత్రి విధులప్పుడు చాలా ఇబ్బందిపడుతున్నామంటున్నారు. ఆ రోజు మధ్యా హ్నం నుంచి మర్నాడు మధ్యాహ్నం వరకూ నిరంతరం డ్యూటీ ఉంటుందని, దీనివల్ల అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. 2017లో జాబ్చార్ట్ ఇచ్చినా అందులో మార్గదర్శకాలు ఇవ్వలేదని.. దీనితో అధికారులు ఇష్టానుసారం బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్తున్నారు. హాస్టల్లో విద్యార్థులను గమనించడం, భోజనం నాణ్యత పరిశీలించడం, కాలేజీలో విద్య నాణ్యత వంటి విధుల్లో ఎక్కడ తేడా వచ్చిన అధికారులు తమనే బలిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ పరిస్థితిని సానుభూతితో పరిశీలించాలని కోరుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నాం కేవలం చిన్న స్కూళ్ల విధుల కోసమంటూ మమ్మల్ని తీసుకుని తర్వాత రెట్టింపు బాధ్యతలు పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా వేతనం పెంచలేదు. టీచర్ల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నాం. ఎంతోమంది విద్యార్థినుల ఉన్నతికి తోడ్పడుతున్నాం. మాకు పని ఒత్తిడి తగ్గించి, వేతనం పెంచితే తప్ప మేం సంతృప్తిగా పనిచేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మా గోడు ఆలకిస్తుందని ఆశిస్తున్నాం. – దోపతి శ్రీలత, రాష్ట్ర కేజీబీవీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వారి పరిస్థితి మెరుగుపర్చాలి.. కేజీబీవీ ప్రత్యేక అధికారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి ఇటీవల వినతిపత్రం ఇచ్చాం. బాలికలకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా కేజీబీవీ ఉద్యోగుల పరిస్థితిని మెరుగుపర్చాలి. –పి.రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
కేజీబీవీల్లో ‘పంచతంత్ర’ ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లోని విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మిడియెట్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థినులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు 100 రోజుల ‘పంచతంత్ర’ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో ఆయా విద్యాలయాల ప్రిన్సిపాల్స్, టీచర్లతోపాటు డీఈవోలు, ప్రాజెక్టు కో–ఆరి్డనేటర్లు, జీసీడీవోలు, ఎంఈవోలు చేపట్టాల్సిన విధివిధానాలను సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు రూపొందించి కేజీబీవీలకు పంపారు. శనివారం నుంచి వచ్చే ఏడాది మార్చి 6వ తేదీ వరకు (100 రోజులు) అనుసరించాల్సిన రోజువారీ ప్రణాళికను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థులపై శ్రద్ధ పెట్టేలా.. కేజీబీవీల్లో 2022–23 విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతిలో 67 శాతం, ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 59.37 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులు 41.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యాశాఖ వందరోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో పదో తరగతి విద్యార్థులు 13,217 మంది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 9,654 మంది, రెండో ఏడాది విద్యార్థులు 8,093 మంది, మొత్తం 3,0964 మంది ఉన్నారు. వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా పాఠ్యాంశాల వారీగా యాక్షన్ ప్లాన్ను తయారు చేశారు. ఇందులో స్టడీ ప్లానింగ్, వారాంతపు పరీక్షలు, చదువులో వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశాలు కీలకంగా ఉన్నాయి. ప్రతి టీచర్ 15 మంది విద్యార్థినులపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు రూ.5 వేలు, నూరు శాతం ఫలితాలు సాధించిన విద్యాలయాలకు రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని సమగ్ర శిక్ష ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరత ఉన్న విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీని నియమంచాలని ఇప్పటికే సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వచ్చే నెలాఖరు నాటికి విద్యార్థినులకు డబుల్ బంకర్ బెడ్లు అందించనున్నారు. ఉత్తమ ఫలితాలకు పురస్కారం గత ఏడాది ఫలితాలు ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాం. పది, ఇంటర్మిడియెట్ పరీక్షలు రాసే విద్యార్థినులు, ఉపాధ్యాయులపై ఈ వందరోజులు రాష్ట్ర స్థాయిలో అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ రోజువారీ స్టడీ ప్లాన్, టైం టేబుల్ ఇచ్చాం. వెనుకబడిన విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ను కూడా ఇస్తాం. ఇంటర్లో బాగా చదివేవారి కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ను ఇస్తాం. వారు నీట్, జేఈఈ మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా శిక్షణ ఉంటుంది. – డి.మధుసూదనరావు, కేజీబీవీ కార్యదర్శి -
కేజీబీవీ విద్యార్థినులకు బంకర్ బెడ్లు
సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో మెరుగైన సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్మిడియెట్ వరకు చదువుతున్న 98,560 మంది విద్యార్థినులకు మంచాలు అందించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విద్యార్థినులకు అన్ని రకాలుగా అనువుగా ఉండేలా స్టోరేజీ బాక్స్తో ఉండే రెండు లేదా మూండంచెల బంకర్ బెడ్లను అందించాలన్నారు. వీటిని డిసెంబర్ నెలాఖరుకు ఆయా పాఠశాలలకు అందించాలని యోచిస్తున్నారు. దీంతో 98,560 మంది విద్యార్థినులకు మేలు కలగనుంది. కేజీబీవీలకు గత టీడీపీ ప్రభుత్వం 2018లో మందపాటి బొంతలను మాత్రమే ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థినులకు అందుతున్న వసతులపై సమగ్ర శిక్ష, కేజీబీవీ అధికారులు ఆరా తీశారు. ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ డిసెంబర్లోగా మంచాలు అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే కేజీబీవీల్లో చదువుతున్న బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి, అవసరమైనవారికి మాత్రలు అందజేసింది. ఆ పరీక్షల రిపోర్టును రికార్డు చేసేందుకు ‘హెచ్బీ పర్సంటేజ్’ కార్డులను సైతం ఆయా స్కూళ్లకు అందించింది. చదువుకునేందుకు కూడా ఉపయోగపడేలా.. ఏపీలో 2004–05 విద్యా సంవత్సరంలో కేజీబీవీలను అందుబాటులోకి తెచ్చారు. తొలుత 6 నుంచి 8వ తరగతి వరకు ప్రారంభించారు. అనంతరం ఇంటర్మిడియెట్ వరకు పెంచారు. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో 98,560 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరికి గత ప్రభుత్వం బొంతలు మాత్రమే అందించడంతో నేలపై పడుకోవాలి్సన దుస్థితి తలెత్తింది. పేదింటి ఆడపిల్లలు చదువుకునే విద్యాలయాల్లో వారికి మంచాలు అందించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థినులు పడుకునేలా, వాటిపై కూర్చుని చదువుకునేందుకు అనువైన ఎత్తు ఉండేలా బంకర్ బెడ్లను తయారు చేయిస్తున్నారు. ఒకదానిపై ఒకటి ఉండి ఇనుముతో చేసిన బంకర్ బెడ్లు అడుగున విద్యార్థినుల పుస్తకాలు, ఇతర సామగ్రి దాచుకునేందుకు వీలుగా స్టోరేజీ బాక్స్లను సైతం బిగించనున్నారు. -
ఐరాస సదస్సుకు ఎటపాక కేజీబీవీ విద్యార్థిని
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఐరాస సదస్సుకు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎటపాక కేజీబీవీ విద్యార్థిని మోతుకూరి చంద్రలేఖ ఎంపికైంది. 2022–23 విద్యాసంవత్సరం పదవ తరగతిలో 523 మార్కులు సాధించి జిల్లాలోని 19 కేజీబీవీల్లో టాపర్గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల పాఠశాలల టాపర్స్కు జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా గత నెలలో ఆన్లైన్లో పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పరీక్షలో చంద్రలేఖ 100 మార్కులకు గాను 94 మార్కులు సాధించి ఆన్లైన్ ఇంటర్వ్యూకు ఎంపికైంది. ఈమెతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీల నుంచి ఇద్దరు ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన చంద్రలేఖ ఐరాస సదస్సుకు ఎంపికైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి శుక్రవారం ఆమెకు సమాచారం అందింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విద్యా ప్రమాణాలపై ఐరాస సదస్సులో చంద్రలేఖ మాట్లాడనున్నట్లు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిణి కె.సూర్యకుమారి తెలిపారు. త్వరలో విద్యార్థిని యూఎస్ఏ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కాగా, సీఎం జగన్ సంకల్పం నెరవేరుతోందనడానికి ఈ పేదింటి విద్యార్థిని ఇప్పుడు ఐరాస సదస్సుకు వెళ్లడమే నిదర్శనం. -
రోడ్డు ప్రమాదంలో కేజీబీవీ ఎస్ఓ మృతి
సాక్షి, శ్రీకాకుళం: బూర్జ మండలం వైకుంఠపురం కూడలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్.ఎన్.పేట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ మండల శ్రీదేవి(38) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని పెద్దకాపు వీధికి చెందిన శ్రీదేవి ఐదు నెలలుగా ఎల్.ఎన్.పేట కేజీబీవీ ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజూ పాలకొండ నుంచి ఆమదాలవలస వరకు స్కూటీపై వెళ్లి అక్కడి నుంచి బస్సులో ఎల్.ఎన్.పేట వెళ్లేవారు. ఎప్పట్లాగే శుక్రవారం కూడా విధుల్లో భాగంగా స్కూటీపై వస్తుండగా వైకుంఠపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మను ఢీకొట్టారు. ఈ ఘటనలో దవడ భాగం తెగిపోవడంతో తీవ్ర రక్త స్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చదవండి: (షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి) స్థానికులు గమనించి 108కు ఫోన్ చేశారు. సిబ్బంది వచ్చి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. అదే వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శ్రీదేవికి తల్లి విజయలక్ష్మి, తమ్ముడు దినేష్, వివాహితురాలైన చెల్లి రేణుక ఉన్నారు. దినేష్ ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేటలో విషాదం.. శ్రీదేవి మృతితో ఎల్.ఎన్.పేటలో విషాదం అలముకుంది. కేజీబీవీ ఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బోధనతో పాటు విద్యారి్థనులను తోబుట్టువులా చూసుకునేవారని స్థానికులు చెబుతున్నారు. మంచి ఎస్ఓను కోల్పోయామని సిబ్బంది, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతి పట్ల ఎల్.ఎన్.పేట జెడ్పీటీసీ కిలారి త్రినాథులు సంతాపం తెలియజేశారు. -
నేరడిగొండ కేజీబీవీ ఎస్వో సస్పెండ్
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యం(కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ జయశ్రీ సస్పెండ్ అయ్యారు. ఈ కేజీబీవీలో నాసిరకం భోజనం తిని విద్యార్థినులు ఆదివారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. సోమవారం కూడా కిచిడీలో వెంట్రుకలు, అన్నం, పప్పులో పురు గులు, వెంట్రుకలు వచ్చాయి. ఆది వారం జరిగిన సంఘటన మర్చిపోక ముందే మళ్లీ ఇలా జరగడంతో పాఠశా లకు విచ్చేసిన పలువురు ఇదేంటని మండిపడ్డారు. పాఠశాలలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి కొంతమంది విద్యార్థిను లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీఈవో ప్రణీత అక్కడికి చేరుకుని జయశ్రీని సస్పెండ్ చేయడంతో పాటు వంట నిర్వాహకులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అయితే పాఠశాలలో 248 మంది విద్యార్థినులుండగా ఇలా జరగడంతో పలువురు ఇంటిబాట పట్టారు. సోమవారం రాత్రి వరకు 72 మంది మాత్రమే పాఠశాలలో ఉన్నారు. -
కేజీబీవీలో నాసిరకం ఆహారం
నేరడిగొండ: నాసిరకం భోజనం కారణంగా 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో 248 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉదయం టిఫిన్ (చపాతి, పెసరపప్పు) చేసిన 11మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్సీకి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు రిఫర్ చేశారు. ఈ క్రమంలో మిగతా విద్యార్థులు కేజీబీవీ భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. ఇటీవల భోజనంలో తరచూ రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆదివారం సెలవుదినం కావడంలో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కూడా సిబ్బందిని నిలదీశారు. దీంతో ప్రిన్సిపాల్ జయశ్రీ అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. సెక్టోరల్ అధికారి ఉదయశ్రీకి పలువురు పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేయగా, సోమవారం వచ్చి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపాల్ను ఈ విషయమై సంప్రదించగా.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. కాగా, లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విద్యార్థినుల నిరసనకు మద్దతు తెలిపారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించారు. -
వరుస విషాదాలు.. హాస్టళ్లలో దారుణాలు.. అసలు ఏం జరుగుతోంది?
సాక్షి ప్రతినిధి మంచిర్యాల/కాగజ్నగర్టౌన్: కుమురంభీం జిల్లాలో ఓ విద్యార్థిని జ్వరంతో మంగళవారం రాత్రి చనిపోయింది. కాగజ్నగర్ మండలం అంకుశాపూర్కు చెందిన శంకర్, నీలాబాయి దంపతుల పెద్ద కూతురు ఐశ్వర్య (14) కాగజ్నగర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం తలనొప్పిగా ఉందని డ్యూటీ టీచర్కు చెబితే పెయిన్బామ్ రాసుకోమనడంతో, జండూబామ్ రాసుకుని నిద్రపోయిన ఐశ్వర్య ఉదయంఎంతకీ నిద్రలేవలేదు. నోరు, ముక్కు నుంచి నురగలు రావడంతో విద్యార్థులు డ్యూటీ టీచర్కు చెప్పారు. చదవండి: ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన సమాచారం అందుకున్న తండ్రి శంకర్ వచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఐశ్వర్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బాలిక మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు మృతదేహంతో హాస్టల్ ముందు 8గంటలపాటు ధర్నా చేశారు. కొందరు స్కూల్లోకి చొచ్చుకెళ్లి డీఈవో అశోక్ ముందే ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డీఎస్పీ కరుణాకర్ ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలిక మృతికి కారణమైన ఎస్వో స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీ టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తెలిపారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్గ్రేషియాగా రూ.15లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతోపాటు తక్షణ సాయం కింద రూ.50వేలు నగదు ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు. కాగా, గత 15 రోజుల్లో జిల్లాలోని పలు గురుకులాల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఇందులో ఒకరు డిగ్రీ విద్యారి్థని. హాస్టళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం వల్లే ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. -
కేజీబీవీల కేటాయింపుపై కిషన్రెడ్డి కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 2022–23లో అదనంగా 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) కేటాయించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కేజీబీవీల్లో 696 అంటే దాదాపు 15 శాతం విద్యాలయాలు రాష్ట్రంలోనే ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కలిపి మొత్తం 31 కేజీబీవీలను కేటాయిస్తే అందులో రాష్ట్రానికి 20 కేటాయించారన్నారు. నాలుగేళ్లలోనే కేంద్రం తెలంగాణకు 104 నూతన కేజీబీవీలను కేటాయించిందని చెప్పారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు, మైనారిటీలకు, దారిద్య్రరేఖకు దిగువనున్న, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆడ పిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారని కిషన్రెడ్డి వివరించారు. బడుగు బలహీన, అణగారిన వర్గాల పిల్లలను ఒకేచోట చేర్చి వారి మధ్య సమానత్వ భావనను పెంపొందించడం వీటి ఉద్దేశమని పేర్కొన్నారు. -
ఆ మేడం వస్తే మేం వెళ్లిపోతాం!
ఆదిలాబాద్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది తీరు మారడం లేదు. గతనెల జిల్లా కేంద్రంలోని రూరల్ కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 90 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు కన్నీరుమున్నీరు కాగా, కలెక్టర్ విచారణ చేపట్టి రూరల్ కేజీబీవీ ప్రత్యేక అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఎస్వోపై సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఈమేరకు విద్యార్థులతో బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎస్వోను తిరిగి విధుల్లోకి తీసుకుంటే తాము ఈ పాఠశాల నుంచి వెళ్లిపోతామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. చికెన్, బిస్కెట్లు పెడతామని.. ఫుడ్ పాయిజన్ తర్వాత పరిస్థితి మారిందని విద్యార్థులు చెబుతున్నారు. చదువుతోపాటు నాణ్యమైన భోజనం పెడుతున్నారని పేర్కొంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం పాఠశాలలో పనిచేసే స్వీపర్ కవిత, వంటచేసే సిబ్బంది సుందరమ్మ, సరస్వతి, అనిత బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు చేయించారని విద్యార్థులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాలలో డ్యూటీ సీఆర్టీ మాత్రమే ఉన్నారు. వీరితోపాటు ఈ సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కరిని పిలిచి చికెన్ తింటారా.. బిస్కెట్లు కావాల అని అడిగి 7, 8వ తరగతి విద్యార్థులతో తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారు. ఎందుకు సంతకాలు తీసుకుంటున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తే మీకు చికెన్, బిస్కెట్లు తెప్పించడానికని వారిని నమ్మించారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలా సంతకం పెట్టించలేదని, కొత్తగా ఎందుకు పెట్టిస్తున్నారని మరికొంతమంది అడిగారు. ఈ సిబ్బంది సస్పెన్షన్కు గురైన ఎస్వోకు మద్దతుగా సంతకాలు చేయించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వీరితోపాటు ఓ దళిత సంఘానికి చెందిన నాయకుడు ఫుడ్పాయిజన్ జరిగిన సమయంలో విద్యార్థులకు మద్దతుగా నిలవగా, ప్రస్తుతం ఎస్వోకు మద్దతుగా విద్యార్థులతో సంతకాలు పెట్టించేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొంటున్నారు. ‘మీరు రెండు సంవత్సరాలు ఉండి వెళ్లిపోతారు.. పాత టీచర్ను తీసుకుంటే మీకేం ఇబ్బంది’ అని విద్యార్థులను ప్రశ్నించారని తెలిపారు. నిబంధనల ప్రకారం కేజీబీవీలోకి ఎవరినీ అనుమతించరాదు. అయినా అక్కడ పనిచేసే సిబ్బందిని బెదిరించి సదరు నాయకుడు క్యాంపస్లోనికి వచ్చి విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం. తల్లిదండ్రుల ఆందోళన.. కేజీబీవీలో విద్యార్థినిలను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కేజీబీవీ వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులను, అక్కడ పనిచేసే సిబ్బందిని నిలదీశారు. తమకు తెలియకుండా తమ పిల్లలతో తెల్లకాగితంపై ఎందుకు సంతకాలు తీసుకున్నారని నిలదీశారు. తమ పిల్లలకు ఏమైన జరిగితే వారే బాధ్యులని హెచ్చరించారు. ఎస్వోను తిరిగి ఈ పాఠశాలలో తీసుకుంటే తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చదివించమని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్న సిబ్బందిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ చదువుకోం మా పాత మేడం ఉన్నప్పుడు సరిగా మాకు భోజనం పెట్టేవారు కాదు. నాసిరకం భో జనం, కలుషిత నీరు అందించారు. దీంతో తాము అనారోగ్యం బారిన పడ్డాం. ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రి పాలయ్యాం. ఆ మేడం సస్పెండ్ అయినప్పటి నుంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. మళ్లీ ఆమె వస్తే మేం ఇక్కడ చదువుకోం. – నిక్షిత, విద్యార్థిని బలవంతంగా సంతకాలు.. రెండు రోజుల కింద స్వీపర్, అటెండర్ నన్ను గేటు దగ్గరికి పిలిచి ఒక తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారు. ఎందుకోసమని అడిగితే చికెన్, బిస్కెట్లు ఎంతమంది తింటారనేది రాసుకుంటున్నామని చెప్పారు. వారు ఒత్తిడి చేయడంతో నాకు తోచక సంతకం చేశాను. – ప్రసన్న, విద్యార్థి విద్యార్థులతో మాట్లాడాను కేజీబీవీ విద్యార్థులతో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులతో మాట్లాడాను. సిబ్బందికి ఈ విషయమై హెచ్చరించాను. ఇలాంటివి మళ్లీ జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశాను. – ప్రణీత, డీఈఓ, ఆదిలాబాద్ -
బావ వరసయ్యే వ్యక్తితో ప్రేమ.. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని
సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్): పొన్నాడ కేజీబీవీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం బయట పడటంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థినిది ఎచ్చెర్ల మండలం పొన్నాడ సరిహద్దు ధర్మవరం గ్రామం. ఈమె గర్భిణి అనే విషయం గోప్యంగా పాఠశాల యాజమాన్యం ఉంచింది. అయితే ప్రిన్సిపాల్ శిరీషకు పడనివారు విద్యార్థిని గర్భం దాల్చిన విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ప్రాధమికంగా విధుల నుంచి తొలగిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై అధికారులు మంగళవారం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చదవండి: (విషాదం: అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు..) ఈ మధ్య కరోనా సెలవుల్లో విద్యార్థిని ఇంటికి వెళ్లడంతోపాటు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో విద్యార్థిని గ్రామానికి చెందిన బావ వరసయ్యే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. యువతిపై లైంగిక వేధింపుల విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ.. ఆమె గర్భిణిగా తేలడం పాఠశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల వసతి గృహంలో వాంతులు చేసుకోగా సిబ్బంది గమనించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా ప్రిన్సిపాల్ జాప్యం చేసినప్పటికీ ఫిర్యాదు రూపంలో విషయం బయట పడింది. విద్యార్థిని తండ్రి మృతి చెందగా, తల్లి వలస కూలీగా పని చేస్తోంది. ఈ విషయాన్ని ఎచ్చెర్ల ఎస్సై రాము వద్ద ప్రస్తావించగా.. పోలీస్స్టేషన్కు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
భిక్షాటన చేస్తుంటే చేరదీసి స్కూల్కి పంపారు.. రెండు నెలల తర్వాత..
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల కిందట మంచాల కస్తూర్బాగాంధీ గిరిజిన బాలికల హాస్టల్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మంచాల ఎస్సై రామన్ గౌడ్ కథనం ప్రకారం.. నగరంలో భిక్షాటన చేసే ఆరుగురు బాలికలను చైల్డ్లైన్వారు ఆపరేషన్ స్మైల్ ద్వారా చేరదీసి నగరంలోని చంద్రాయన్గుట్టలోని ఎంవీ ఫౌండేషన్లో చేర్పించారు. అక్కడ నుంచి రెండు నెలల కిందట మంచాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల హాస్టల్లో చేర్పించారు. వారిలో సమ్రీన్(14) 9వ తరగతి, నుస్రత్(13) 8వ తరగతి చదువుతోంది. వీరు ఇరువురు బాలికలు శనివారం ఉదయం హాస్టల్ నుంచి పారిపోయారు. గమనించిన హాస్టల్ వార్డెన్ శ్రీలతారెడ్డి ఎంవీ ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం మంచాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: First Gay Marriage In Telangana: తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్ -
భోజనం నాణ్యత విషయంలో రాజీ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం అధికారులతో మాట్లాడుతూ.. ఇటీవల కొన్నిచోట్ల వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించి నివేదిక అందించాలని కోరారు. భోజనం బిల్లులు రాలేదని కొందరు చెబుతున్నారని.. వాటిని సకాలంలో పోర్టల్లో ఎందుకు పొందుపరచలేకపోయారని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లో బకాయిల వివరాలను వెంటనే పోర్టల్లో పొందుపరిచి నివేదిక ఇవ్వాలన్నారు. త్వరలోనే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా కాజీపేట పాఠశాలల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే నివేదికివ్వాలని ఆదేశించారు. కొన్నిచోట్ల టీచర్ల మధ్య అంతర్గత విభేదాలతో అసత్య కథనాలు బయటకు వస్తున్నాయని, ఇలాంటి వివాదాలకు కారణమైన టీచర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల పర్యవేక్షణకు అధికారులతో త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. -
కేజీబీవీల్లో 958 టీచింగ్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అన్ని కేజీబీవీల్లో 958 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెట్రిసెల్వి శుక్రవారం అన్ని జిల్లాల విద్యాధికారులను ఆదేశిస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. పోస్టులను భర్తీ చేసి ఈనెల 20వ తేదీలోగా నివేదికలు పంపాలని పేర్కొన్నారు. అభ్యర్ధుల అర్హతలు, మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్దేశించారు. రిజర్వుడ్ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 47 ఏళ్ల వరకు ఉంటుంది. కేజీబీవీల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతున్నందున తప్పనిసరిగా అదే మాధ్యమంలో బోధన సామర్థ్యం కలిగి ఉండాలి. అలా లేనివారి నియామకాలను రద్దు చేసి తొలగిస్తారు. టీచింగ్ సిబ్బంది నియామక ఉత్తర్వులను జిల్లా స్థాయిలో, ప్రిన్సిపాళ్ల నియామక ఉత్తర్వులు రాష్ట్ర స్థాయిలో ఇస్తారు. అభ్యర్ధుల విద్యార్హతలు, సాధించిన మార్కులు, అనుభవం, రిజర్వేషన్ల వారీగా ప్రొవిజనల్ జాబితాను ఆయా జిల్లాల అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, డీఈవోలు విడుదల చేస్తారు. అభ్యంతరాలను స్వీకరించి తుది మెరిట్ జాబితా వెలువరిస్తారు. విద్యార్హతలు, నెలవారీ వేతనాలు ఇలా ప్రిన్సిపాల్ (స్పెషలాఫీసర్): యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, బీఈడీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.27,755 సీఆర్టీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీతో పాటు ఏపీటెట్ లేదా తత్సమాన పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో ప్రిన్సిపాల్గా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.21,755 పీఈటీ: 50 శాతం కనీస మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత. యూజీడీపీఈడీ లేదా బీపీఈడీ/ఎంపీఈడీ శిక్షణతో పాటు ఏపీటెట్లో అర్హత సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. వేతనం రూ.21,755 పీజీటీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీ అర్హత సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీగా రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12,000 పీజీటీ వొకేషనల్: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కనీస మార్కులతో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమో చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీ, హైస్కూళ్లలో పీజీటీ వొకేషనల్ పోస్టులో రెండేళ్ల అనుభవం. వేతనం రూ.12000. -
జాగ్రత్తల నడుమ ‘కస్తూర్బా’ తరగతులు
సాక్షి, అమరావతి: అనాథ, నిరుపేద బాలికలకు విద్యాబుద్ధులు నేర్పే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) తరగతులను ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అనేక జాగ్రత్తలు చేపట్టింది. వసతి గృహాలతో కూడిన ఈ విద్యాలయాల్లో 9వ తరగతి నుంచి 12 వరకు గల విద్యార్థినులకు సోమవారం నుంచి తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ప్రస్తుతం నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో అదనపు గదులు, కిచెన్ షెడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టిన విద్యాలయాల్లో మాత్రం అక్కడి పరిస్థితుల ఆధారంగా తరగతుల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ డిసెంబర్ నెలాఖరులోగా అన్ని విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేలా సూచనలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉండగా.. వాటిలో సుమారు 75 వేల మంది విద్యార్థినులు ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో సోమవారం నుంచి తరగతులు ప్రారంభమైన కేజీబీవీల్లో పరిపాలనా భవనాలు, తరగతి గదులు, వసతి గృహాలు, డైనింగ్ హాల్స్, కిచెన్ షెడ్స్ అన్నిటినీ శానిటైజ్ చేయించారు. బియ్యం, ఇతర సరుకులు, కూరగాయలు, పాలు, వంట గ్యాస్ను ముందే సమకూర్చారు. నిత్య జాగ్రత్తలు తప్పనిసరి కేజీబీవీల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. ఉదయం పూట నిర్వహించే అసెంబ్లీని రద్దు చేసి కోవిడ్ ప్రతిజ్ఞ చేయించాలి. సిబ్బంది, విద్యార్థినులకు రోజుకు రెండుసార్లు విధిగా థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. రాత్రివేళ విద్యార్థినులను జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రతి విద్యాలయంలో ఇద్దరు ఉపాధ్యాయులు, వాచ్ ఉమన్లు క్యాంపస్లోనే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. కోవిడ్ ప్రొటోకాల్ను అనుసరించి సీనియర్ సీఆర్టీ సమయ పట్టికను సిద్ధం చేయాలి. తరగతులను, విద్యార్థినుల అధ్యయనాన్ని పర్యవేక్షించాలి. వంటగది సిబ్బంది తప్పనిసరిగా హెడ్ క్యాప్స్, మాస్క్లు, గ్లౌజులు ధరించేలా చూడాలి. అవసరానికి అనుగుణంగా విద్యార్థినులకు గోరు వెచ్చని తాగునీరు, పరిశుభ్రమైన వేడి ఆహారం సమకూర్చాలి. డైనింగ్ హాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. విద్యార్థినులకు ఉదయం, సాయంత్రం సూర్యరశ్మి తగిలేలా చూడాలి. పీఈటీ పర్యవేక్షణలో మాత్రమే వ్యక్తిగత వ్యాయామాలు, యోగా చేయాలి. మాస్డ్రిల్, ఆటలు అనుమతించరు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పడే విద్యార్థినులకు ప్రత్యేక గది కేటాయించాలి. వారి ఆరోగ్య పర్యవేక్షణ బాధ్యతను పార్ట్ టైమ్ వైద్యులకు అప్పగించాలి. అలాంటి విద్యార్థినులను సమీప ఆస్పత్రి లేదా పీహెచ్సీకి తీసుకువెళ్లాలి. విద్యార్థినుల ఆరోగ్య, భద్రతల పర్యవేక్షణకు బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరు రోజుల్లో సిబ్బందికి విధులు అప్పగించాలి. పూర్తి జాగ్రత్తలతో.. పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కేజీబీవీలను సిద్ధం చేసేలా ప్రణాళిక ఇచ్చారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రతిరోజూ ఇద్దరు చొప్పున టీచర్లకు విడతల వారీగా బాధ్యతలు అప్పగించాం.- పి.లిల్లీ ప్రకాశవాణి, స్పెషలాఫీసర్, కేజీబీవీ, పుల్లల చెరువు, ప్రకాశం జిల్లా అన్ని చర్యలూ చేపడుతున్నాం కోవిడ్ నేపథ్యంలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ చేపడుతున్నాం. తల్లిదండ్రుల నుంచి విధిగా అనుమతి పత్రాలు తీసుకుని విద్యార్థినులను తరగతులకు అనుమతిస్తాం.- ఎన్.దీప్తి రాణి, సీఆర్టీ, కేజీబీవీ, బొల్లాపల్లి, గుంటూరు జిల్లా -
నీటి కొరత ఉంటే తలస్నానం చేస్తారా?
సాక్షి, రఘునాథపల్లి : హోలీ సందర్భంగా సోమవారం రంగులు చల్లుకున్న విద్యార్థినులు తలస్నానాలు చేశారు. నీటి కొరత ఉన్నప్పుడు తలస్నానాలు చేసి నీటిని వృథా చేశారంటూ ఆగ్రహంతో విద్యార్థినులను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి చితకబాదింది. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కేజీబీవీలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ప్రత్యేకాధికారి సుమలత పాఠశాలకు వచ్చేసరికి సంపులోని నీరు ఖాళీ అయింది. దీంతో తలస్నానాలు చేసిన బాలికలందరినీ పిలిచి చేతి వేళ్లపై కర్రతో కొట్టింది.ఘటనపై సుమలతను వివరణ కోరగా.. ‘పాఠశాలలో నీటి సమస్య ఉంది.. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున రంగులు చల్లుకోవద్దని చెప్పినా వినలేదు’ అని చెప్పారు. -
గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్
సాక్షి, అక్కన్నపేట: గిరిజన విద్యార్థుల మాతృ భాషపై కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆంక్షలు విధిస్తున్నాడు. ఆ భాషలో మాట్లాడితే జరిమానా చెల్లించాలంటూ ఎస్ఓ హుకుం జారీ చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో ఇది జరుగుతోంది. అకౌంటెంట్ ఉన్నప్పటికీ అన్నీ వ్యవహారాలు ఎస్ఓ చేతి మీదుగా సాగుతున్నాయని, నిధుల దుర్వినియోగంతో పాటు ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్న చందంగా పరిస్థితి తయారైందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎస్ఓ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. సోమవారం అక్కన్నపేట మండల ఎంపీపీ మాలోతు లక్ష్మి కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని తెలుసుకున్నారు. కాగా, తరగతి గదిలో ‘గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్’వేస్తున్నారని ఓ గిరిజన విద్యార్థిని తెలిపింది. ఎంపీపీ మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకోవడానికి విద్యార్థులు భయపడుతున్నారని, గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్ విధించడాన్ని తప్పుపట్టారు. -
పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని
సాక్షి, టెక్కలి: ఇసుక విధానంపై కనీస అవగాహన లేని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పవన్ను రాజకీయ అజ్ఞానిగా భావించవచ్చునని, ఆయన చేయబోయే లాంగ్మార్చ్ ప్రజలను వంచించడానికేనన్నారు. ఇసుక సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని, టెక్కలి, నరసన్నపేట తదితర కేంద్రాల్లో ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేందుకు గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన పవన్కు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒకే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. తొలి నుంచీ ఇద్దరికీ రాజకీయ బంధం ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలపడంతో మరోసారి బట్టబయలైందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.రాజు, పార్టీ నాయకులు అన్నెపు రామారావు, దుబ్బ వెంకటరావు, పేడాడ వెంకటరావు, ఆర్.శైలేంద్రకుమార్, బోయిన నాగేశ్వరరావు, దుక్క రామకృష్ణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ అంతకుముందు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. పాఠశాల వసతి సమస్యలు, ఉపాధ్యాయుల జీతభత్యాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
కేజీబీవీల్లో ఇంటర్
అనాథలు.. బడి మధ్యలో మానేసిన బాలికల కోసం మహానేత దివంగత సీఎం వైఎస్సార్ 2004–05 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 53 మండలాల్లో కస్తూర్బా బాలికల విద్యాలయాలను ప్రారంభించారు. దీంతో ఎంతోమంది నిరుపేద బాలికలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. దివంగత నేత ఆశయాలే స్ఫూర్తిగా పరిపాలన సాగిస్తున్న నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యాలయల్లో సమూల మార్పు తీసుకొచ్చే క్రమంలో భాగంగా జిల్లాలోని 21 కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యను ప్రారంభించాలని నిర్ణయించారు. కర్నూలు ,ఆళ్లగడ్డ: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు ముందు ఈ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిస్ మీడియంలో ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. అయితే పదో తరగతి వరకు చదువున్న బాలికలు ఇంటర్ విద్యకు దూరమవుతండటంతో పాటు బాల్య వివాహాలు జరుగుతున్నా యి. వారు పదితోనే ఆగకుండా ఉన్నత చదువులు చదవాలని భావించి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 140 కేజీబీవీలను అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్, వృత్తి విద్యాకోర్సులు ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 21 కేజీబీవీల్లో మొదటి సంవ త్సరం ఇంటర్మిడియట్ ప్రారంభించనున్నారు. నిరుపేద బాలికలకు వరం.. కేజీబీవీల్లో పదో తరగతి పూర్తి చేసిన బాలికలు పై చదువులకు దూరమవుతున్నారు. దూర ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలలకు పంపలేని అనేక మంది బాలికల కుటుంబ సభ్యులు వారికి బాల్య వివాహాలు చేస్తున్నారు. అలాంటి బాలికలకు కేజీబీవీల్లో ఇంటర్ విద్య వరంగా మారనుంది. జిల్లాలోని 53 కేజీబీవీల్లో గత సంవత్సరం రెండు చోట్ల ఇంటర్ విద్య ప్రవేశ పెట్టినప్పటికీ అవసరమైన సిబ్బంది, వసతులు కల్పించక పోవడంతో ఉపయోగంలోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఇంటర్తో పాటు టెక్నికల్, ఉపాధి కోర్సులు ప్రవేశ పెట్టడంతో నిరుపేద బాలికలకు వరంగా మారనుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక కేజీబీవీ జూనియర్ కళాశాలలు
బి.కొత్తకోట: జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్యను ప్రారంభిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యకు దూరమైన, ఆలనాపాలనా చూసేవారు లేని అనాథ బాలికల విద్య కోసం 20 కేజీబీవీలను జిల్లాలో 2004–05 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇందులో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. హాస్టల్ వసతి, భోజనం, దుస్తులు తదితర వాటిని సమకూర్చుతున్నారు. గత ప్రభుత్వం గత ఏడాది జిల్లాలోని 20 కేజీబీవీల్లో కేవలం రామకుప్పం, గంగవరం విద్యాలయాల్లో మాత్రమే ఇంటర్ విద్యను ప్రవేశపెట్టింది. వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో కలుపుకుని జిల్లాలో 16 కేజీబీవీల్లో ఇంటర్ విద్య బోధించనున్నారు. ఎర్రావారిపాళ్యం, కేవీబీపురం, కురబలకోట, తంబళ్లపల్లె కేజీబీవీల్లో మాత్రం పదో తరగతి వరకే విద్య అందుతుంది. పేద బాలికలకు వరం కేజీబీవీల్లో పది చదివిన తర్వాత పై చదువులకు వెళ్లలేని స్థితిలో బాలికలు విద్యకు దూరమవుతున్నారు. అలాంటి బాలికలకు ఇంటర్ విద్య వరంగా మారింది. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రారంభించే కోర్సుల్లో హెచ్ఈసీ, సీఈసీ, బైపీసీ కోర్సులేకాక బాలికలు వారి జీవితాల్లో ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా వృత్తిపరమైన కోర్సులను అమలు చేస్తున్నారు. దీనివల్ల బాలికలు ఇంటర్ పూర్తిచేయగానే సంపాదనకు మార్గం ఏర్పడుతుంది. తద్వారా బాలికల జీవితాల్లో మార్పు రావడమేగాక కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయి. తంబళ్లపల్లెలో నాలుగింటికి జిల్లాలో 14 కేజీబీవీల్లో ఇంటర్ విద్య మంజూరుకాగా అందులో నాలుగు కేజీబీవీలు తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందినవే. తంబళ్లపల్లె, కురబలకోట మండలాల్లో మాత్రమే ఇంటర్ విద్య ప్రారంభం కావాల్సి ఉంటుంది. -
అర్ధరాత్రి కేజీబీవీలోకి ప్రవేశించిన అగంతకుడు
♦ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల విద్యార్థినులకు భద్రత కరువవుతోంది. తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు వారిని ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం...అమ్మాయిల పాలిట శాపంగా మారుతోంది. రెండు రోజుల కిందట యాడికి కేజీబీవీలో జరిగిన ఘటన అక్కడి ఉద్యోగులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. రాత్రి 10 గంటల సమయంలో అగంతకుడు డు ఏకంగా ప్రహరీలోకి ప్రవేశించి భవనంపైకి ఎక్కాడు. అదృవశాత్తూ స్టడీలో ఉన్న విద్యార్థినులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇవ్వడం, వారు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమయానికి వచ్చిన పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు. ♦ బత్తలపల్లి కేజీబీవీలో గతేడాది అర్ధరాత్రి ఓ అగంతకుడు చొరబడి ఓ విద్యార్థిని గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. కేకలు పెట్టడంతో పారిపోయాడని బాధిత విద్యార్థిని వాపోయింది. అనంతపురం ఎడ్యుకేషన్: అనాథలు, మధ్యలో బడిమానేసిన ఆడ పిల్లల కోసం కేజీబీవీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 62 కేజీబీవీల్లో 12,150 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ విద్యాలయాలన్నీ శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. చాలా చోట్ల ›ప్రహరీలు లేవు. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది అలసత్వం విద్యార్థినుల పాలిట శాపంగా మారుతోంది. శింగనమల నియోజకవర్గంలోని ఓ కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రసవించింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తాడిపత్రి ప్రాంతంలోని ఓ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులను అర్ధరాత్రి 11 గంటల సమయంలో కొందరు యువకులు బయటకు తీసుకెళ్లి తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరిగి వదిలి వెళ్లారు. లోపలికి వచ్చే సమయంలో గోడ దూకుతున్న విద్యార్థినులను గుర్తించిన సిబ్బంది మరుసటిరోజు బంధువులను పిలిపించి ఇంటికి పంపించేశారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఓ విద్యార్థిని పట్ల కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. గార్లదిన్నె కేజీబీవీలో ఓ విద్యార్థిని గోడదూకి ఆత్మహత్యాయత్నం చేసింది. మరో కేజీబీవీలో విద్యార్థిని చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ ఈ అమ్మాయి ఆచూకీ రెండు రోజుల తర్వాత లభించడంతో బంధువులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సహకారంతో రాప్తాడు నియోజకవర్గంలోని ఓ కేజీబీవీలోకి తరచూ పురుషులు వస్తున్నారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితే బాధ్యులెవరని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పని చేయని సీసీ కెమెరాలు తరచూ చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో కేజీబీవీల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో 231 సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేజీబీవీలో 2 నుంచి 5 దాకా కెమరాలు అమర్చారు. అయితే ఇవి చాలా చోట్ల పని చేయడం లేదు. అవి పని చేయకపోవడమే బాగుంటుందనే ధోరణిలో సిబ్బంది ఉన్నారు. రిపేరీ సాకుతో వీటిని మూలనపడేశారు. ఏదో ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప ముందుగా చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకుంటున్నాం కేజీబీవీల్లో విద్యార్థినుల భద్రతపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమరాలు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. డే, నైట్ వాచ్ ఉమెన్లు ఉన్నారు. వారితో పాటు సిబ్బంది కూడా నైట్ డ్యూటీలో ఉంటారు. కేజీబీవీల వద్ద రాత్రిపూట ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలి. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంతో ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా సంబంధిత ఎస్ఓ, సిబ్బందిపై చర్యలుంటాయి. – ఉషారాణి, జీసీడీఓ -
‘కస్తూర్బా’ నిర్మాణాలకు గ్రహణం
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)కు సొంత భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విడతలవారీగా శాశ్వత భవనాలను కేంద్రం మంజూరు చేస్తున్నప్పటికీ వాటి నిర్మాణం సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లోనే విద్యార్థులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 475 కేజీబీవీలున్నాయి. వీటిలో దాదాపు 198 కేజీబీవీలకు ఉమ్మడి రాష్ట్రంలోనే సొంత భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 34 కేజీబీవీలకు కేంద్రం భవనాలు మంజూరు చేసి ఒక్కోదానికి రూ.2.75 కోట్ల చొప్పున కేటాయించింది. రూ.93 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంతో రాష్ల్ర విద్యాశాఖ టెండర్లు పిలిచి అర్హతలున్న కాంట్రాక్టర్లను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించి దాదాపు నాలుగు ఏళ్లు కావస్తున్నా వీటి నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. పర్యవేక్షణ కరువు... కేజీబీవీల్లో అనాథ బాలికలతోపాటు అత్యంత నిరుపేద బాలికలకు వసతితోపాటు అక్కడే చదువుకునే వీలుంటుంది. నూరుశాతం బాలికలే ఉండడంతో ఆ భవనాలకు భద్రత కల్పించాలి. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో సొంత భవనాలను మంజూరు చేస్తూ వచ్చింది. భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసే ప్రక్రియ విద్యాశాఖ చూస్తుండగా నిర్మాణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లపై ఆజమాయిషీ ఈడబ్ల్యూఐడీసీకే ఉంది. సకాలంలో పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఈడబ్ల్యూఐడీసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు విడతలవారీగా విద్యాశాఖ అధికారులు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ నిర్మాణ పనులపై స్పష్టత లేదు. ఈడబ్ల్యూఐడీసీ గణాంకాల ఆధారంగానే బిల్లులు చెల్లిస్తుండడంతో నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయనే అంశం విద్యాశాఖ అధికారుల వద్ద స్పష్టత లేకుండా పోయింది. -
కస్తూరి కుసుమాలు
గ్రామీణ నేపథ్యం, పేదరికం, అనాథలుగా మారడం, తదితర కారణాలతో పాఠశాలలను మధ్యలో మానేసిన బాలికలను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. విద్యతో పాటు క్రీడలు, యోగా, కంప్యూటర్ తదితర అంశాలలోనూ శిక్షణ నిస్తున్నాయి. విద్యార్థినులు 6వ తరగతిలో ఈ పాఠశాలల్లో చేరితే పైసా ఖర్చు లేకుండా ఇంటర్ విద్యను పూర్తి చేసుకోవచ్చు. మదనపల్లె సిటీ: పేద విద్యార్థినుల జీవితాల్లో కేజీబీవీలు వెలుగునింపుతున్నాయి. జిల్లాలో 20 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో గంగవరం, రామకుప్పం మండలాల్లో ఉన్న కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ విద్యను కూడా ప్రవేశపెట్టారు. అద్భుతం..దినచర్య ఈ విద్యాలయాల్లో దినచర్య అద్భుతంగా ఉంటుంది. నిత్యం వేకువజాము 4 గంటలకు బాలికలను నిద్రలేపి సుమారు గంటపాటు చదివిస్తారు. ఒక గంట పాటు యోగాసనాలు చేయిస్తారు. స్నానం, అల్పాహారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేస్తారు. సాయంత్రం 5 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం గంట పాటు ఆట, పాటలు, మొక్కలు సంరక్షణ వంటి పనులు చేస్తారు. రాత్రి 7 తరువాత భోజనం, అనంతరం 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ వుంటాయి. నిత్యం అధ్యాపకులు ఒక పద్ధతి ప్రకారం విద్యార్థినులకు దినచర్య అమలు చేస్తారు. ఏడో తరగతి విద్యార్థినుల కోసం ఇంకో అడుగు ముందుకేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విద్యతో పాటు విద్యార్థినులకు మానసిక ఉల్లాసం కోసం ఆటలు కూడా ఆడిస్తున్నారు. కుట్టుపని, కంప్యూటర్ విద్య, చేతి పనులపై కూడా శిక్షణ ఇస్తున్నారు. మెరుగైన మెనూ విద్యార్థినులకు పౌష్టికాహారంతో కూడిన మెనూను కేజీబీవీల్లో అమలు చేస్తున్నారు. ప్రతి రోజు మూడు పూటల భోజనంతో పాటు ఉద యం, సాయంత్రం ప్రత్యేకంగా స్నాక్స్ను అందజేస్తున్నారు. వారానికి ఐదు రోజుల పాటు కోడిగుడ్లు, ఆదివారం చికెన్తో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, పెన్నులు, ఏడాదికి నాలుగు జతల యూనిఫాం, బూట్లు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు అందిస్తున్నారు. వాటితో పాటు ప్రతి నెలా సబ్బులు, తలనూనె, టూత్పేస్టు, కాస్మోటిక్స్ కూడా అందజేస్తున్నారు. స్వచ్ఛ విద్యాలయాలుగా... విద్యార్థినులకు శారీరక సమస్యలపై అవగాహన కల్పించేందుకు 24 గంటలు ఒక ఎఎన్ఎం అందుబాటులో ఉంటుంది. దీనికి తోడు విద్యాలయ ఆవరణలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు,కూరగాయల తోటలను పెంచే బాధ్యతలను చిన్నారులకు అప్పగిస్తున్నారు. వాటిని విద్యార్థినులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని కేజీబీవీలు స్వచ్ఛ విద్యాలయాలుగా మారుతున్నాయి. కురబలకోట మండలంలోని కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయం జాతీయ స్థాయిలో స్వచ్ఛ పురస్కార్ అవార్డుకు ఎంపికై రూ.50 వేల నగదు బహుమతిని కూడా అందుకుంది. -
భారమైన బాలికల చదువులు
విజయనగరం అర్బన్: పేదరికం, ఆదరించేవారు లేక బడి మధ్యలో మానేసిన బాలికల్లో విద్యావెలుగులు నింపాల్సిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) లక్ష్యానికి దూరంగా నడుస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో బాలికలను ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. చదువుకు మళ్లీ దూరం చేస్తున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే కేజేబీవీ బాలికలకు వసతి కల్పనతోపాటు నోట్ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు, పాదరక్షల ను ప్రభుత్వం అందించాలి. పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు గడిచినా ఇవేవీ వారికి ఇవ్వలేదు. దీంతో బాలికలు అప్పులు చేసి బయట మార్కెట్లో కొనుగోలు చేసుకుంటున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో మొత్తం 33 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 6,500 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఆ విద్యాలయాల్లో ప్రవేశం పొందాలంటే బడి మధ్యలో మానేసిన విద్యార్ధినులు ఎలాంటి ద్రువ పత్రాలు లేకున్నప్పటికీ చేరవచ్చు. ప్రవేశం పొందిన విద్యార్థినికి రెండు జతల యూనిఫారాలు, పాదరక్షలు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ తదితర అభ్యసనా సామగ్రి, ప్లేట్లు, పెట్టెలు, కాస్మోటిక్ చార్జీలు నెలకు రూ.100 చొప్పున అందజేయాలి. విద్యాలయాలు ప్రారంభమై నెలరోజులు గడిచినా నోట్ బుక్స్ జాడలేదు. గత ప్రభుత్వం జిల్లా స్థాయిలోని పర్చేజింగ్ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేసి జూన్ నెలలోనే పంపణీ చేసేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా రాష్ట్రస్థాయిలో టెండర్లు వేసి అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. జాప్యం అవుతుండడంతో అత్యవసర నిధులను కేటాయించి ఒక్కో విద్యార్థినికీ 4 నోట్లు పుస్తకాల వంతున జిల్లా స్థాయి పర్చేజింగ్ కమిటీ ద్వారా పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితీ లేదు. బాలికలు సొంత డబ్బులతో నోట్ బుక్సు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. తల్లిదండ్రులు లేనిబాలికలు ఆవేదన చెందుతున్నారు. ఖర్చ బారెడు... పదో తరగతికి నోట్ పుస్తకాలు ఒక్కో విద్యార్థినికి 20కి పైగా అవసరం. సబ్జెక్టుకు రెండు చొప్పున, వివిధ పరీక్షల నిర్వహణకు ఒక్కో పుస్తకం కొనుగోలు చేయాలి. అంటే మొత్తం ఈ పుస్తకాలకే రూ.వేయికుపైగా అవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి కొంత మంది విద్యార్థినులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థినులకు రూ.600 నుంచి 700 ఖర్చు అవుతున్నట్లు చెబుతున్నారు. అంటే ఒక కస్తూర్బా విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉండగా, వారికి రాత పుస్తకాల ఖర్చు సుమారు రూ.1.4 లక్షల మేరకు అవుతుందని అంచనా. ఈ లెక్కన జిల్లాలలోని 33 విద్యాలయాలలో రూ.46.2 లక్షల మేర విద్యార్థినులు వెచ్చించాల్సి వస్తోంది. యూనిఫారాలూ అందని వైనం 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫారాలు 2018 మార్చిలో వచ్చాయి. ఇక 2018–19 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎప్పుడు వస్తాయోనని బాలికలు ఎదురుచూస్తున్నారు. కొత్తగా ప్రవేశాలు చేసిన ఆరోతరగతి విద్యార్థినులకు యూనిఫారాలు లేవు. జిల్లాలోని 33 కెజీబీవీల్లో 6,500 మంది బాలికలంటే ఒక్కొక్కరికి రెండు జతలు చొప్పున 13 వేల దుస్తులు పంపిణీ చేయాల్సి ఉంది. బయట దుకాణాల్లోకొని తెచ్చుకుంటున్నాం పాఠ్యాంశాల బోధన మొదలైంది. రాత పుస్తకాల అవసరం ప్రతిరోజు ఉంటుంది. స్కూల్లో పుస్తకాలిస్తారని చేరాం. ఇంతవరకు ఇవ్వలేదు. ఇంటిదగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని బయట కొనుగోలు చేశాం. విద్యాలయంలో పుస్తకాలను త్వరగా ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాతోటి స్నేహితురాలు కొనుగోలు చేయలేక ఆర్థికంగా అవస్థలు పడుతోంది. త్వరగా ఇస్తే బాగుంటుంది. – దార వెంకటలక్ష్మి, 10వ తరగతి విద్యార్థిని, విజయనగరం కేజీబీవీ పాత స్టాక్ నుంచి ఇస్తున్నాం.. నోట్ పుస్తకాలు రాష్ట్రస్థాయి నుంచి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి పాత స్టాక్ నుంచి ఇస్తున్నాం. అత్యవసరంగా పదోతరగతి విద్యార్థినులకు నోట్ పుస్తకాల కొరత లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. మిగిలిన తరగతులకు పుస్తకాలు వచ్చాక పంపిణీ చేస్తాం.– జె.సీతారామారావు, జేసీ–2, పీఓ(అదనపు బాధ్యతలు), ఎస్ఎస్ఏ -
కేజీబీవీల్లో కళాశాల విద్య
సిరిసిల్ల ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కళాశాల విద్యను ప్రారంభిస్తామ న్న ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చింది. రాష్ట్రంలో 94 కేజీబీవీల్లో కళాశాల విద్యను అం దించడానికి అనుమతి లభించగా వీటిలో ప్రస్తు తం 84 కళాశాలలను ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్షాభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయ్కుమార్ సంబంధిత జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరో పది కళాశాలలు ప్రారంభించడానికి అవకాశం ఉన్నా.. వసతులు లేకపోవడంతో వాటిని ప్రారంభించట్లేదని తెలుస్తోంది. దీంతో 84 కేజీబీవీల్లో కళాశాల విద్యకోసం ప్రవేశాలకు ఏర్పాట్లు చేశారు. 13 వరకు దరఖాస్తుల ఆహ్వానం.. కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం ఇంటర్ ఫస్టియ ర్కు మాత్రమే విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనిలో కొన్ని కళాశాలలకు సైన్స్ గ్రూప్లను కేటాయించగా.. మరికొన్నింటి లో ఆర్ట్స్ గ్రూప్లకు అవకాశం కల్పించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 13లోగా సంబంధిత డీఈవో కార్యాలయంలో సంప్రదించి దర ఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు తెలిపారు. ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్లలో ఒక్కో గ్రూప్కు 40 సీట్లను కేటాయించారు. వీటిని ముందుగా కేజీబీవీల్లో టెన్త్ చదివిన విద్యార్థినులకు, అనాథలకు, పేద విద్యార్థులకు ప్రాధా న్యక్రమంలో కేటాయిస్తారు. సీట్లు భర్తీ కాకుంటే మిగతా వారికి అవకాశం ఇస్తారు. కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపక పోస్టులకోసం దరఖాస్తులను ఈ నెల 13 వరకు సంబందిత డీఈవో కార్యాలయాల్లో అందజేయాలని, అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లో 55% మార్కులతో పీజీ, బీఈడీ పూర్తిచేసి ఉండాలని నిబంధనలు పెట్టారు. ఎంపికైన అధ్యాపకులకు నెలకు రూ.23 వేల గౌరవ వేతనం అందించనున్నారు. కళాశాలల్లో కోర్సుల ప్రారంభానికి సమగ్ర శిక్షా అభియాన్ నుంచి ఆదేశాలందాయని రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్టోరల్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. -
84 కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 475 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) ఉండ గా, అందులో 84 కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్స రం నుంచే ఇంటర్మీడియట్ ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. కేబ్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు కేంద్రం కేజీబీవీల్లో 12వ తరగతి వరకు నిర్వహణకు చర్య లు చేపట్టిందన్నారు. అందులో భాగంగా 84 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. వీటిల్లో ప్రవేశాలకు నోటిఫికే షన్ను జారీ చేశామన్నారు. గురువారం సచివా లయంలో టీచర్ల బదిలీల వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేజీబీవీల్లో ప్రస్తుతం ప్రతి సెక్షన్కు 20 మందినే తీసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ దానిని 40కి పెంచాలని, ఆర్ట్స్, సైన్స్ గ్రూపులు ఉండేలా చూడాలని చేసిన సిఫార్సుకు కేంద్రం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లోనూ కేజీబీవీ విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కేజీ బీవీలను అప్గ్రేడ్ చేయడం ద్వారా ఇంటర్ సీట్లు లభించవన్న ఆందోళన ఉండదన్నారు. అప్గ్రేడ్ చేసిన ప్రతి 3 కేజీబీవీల్లో రెండింటిలో సైన్స్ గ్రూపులు, ఒక దాంట్లో ఆర్ట్స్ గ్రూపులు ప్రవేశపెడుతున్నామన్నారు. అన్ని ఉన్నత పాఠశాలల్లోని 6.25లక్షల మంది బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇస్తున్నామన్నారు. ఇందుకు సీఎం రూ.100 కోట్లు కేటాయించారన్నారు. బాలికల కిట్స్పై విమర్శలేంటి? కేజీ టు పీజీ ఏమైందని, ఈ కిట్స్ కొత్త పథక మేమీ కాదని కొందరు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. కేంద్ర వైద్య శాఖ కిశోర బాలిక స్వాస్థ్య యోజన పథ కం కింద బాలికలకు 6 రూపాయలకు 6 న్యాప్కిన్లు అందిస్తోందని, అదీ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనే ఇస్తోందన్నారు. ఇందుకు రూ.2.5 కోట్లే కేటాయించిందన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి తనకు ఫోన్ చేసి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పథకం బాగుందని, ప్రధానిని కలిసి దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతానని చెప్పారన్నారు. ఉపాధ్యాయ బదిలీల వెబ్సైట్ ప్రారంభం ఉపాధ్యాయ బదిలీల వెబ్సైట్ను (http:// transfers.cdse.telangana.gov.in)anfana.gov.in) ఈ సందర్భంగా కడియం శ్రీహరి ప్రారంభించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రభుత్వ డిగ్రీ, జూని యర్, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ల బదిలీల సమాచారం ఇందులో ఉందన్నారు. నాన్ టీచింగ్ ఉద్యోగుల బదిలీల సమాచారం ఉందన్నారు. కేజీబీవీలు కేంద్ర పథకం అయినందున అందులో బదిలీలు ఉండవన్నారు. మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు ఆగస్టులో చేపడతామన్నారు. 8,792 మంది టీచర్ల రిక్రూట్మెంట్ను టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టామని, కొంతమంది దీనిపై కోర్టుకు వెళ్లారన్నారు. త్వరలోనే కోర్టులో స్టే ఎత్తివేయించి భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం ఫీజులను నియంత్రించాలనే ఆలోచనలోనే ఉందన్నారు. ఫీజుల నియంత్రణ కమిటీ ఇచ్చిన 10% పెంపును అమలు చేయడం లేదన్నారు. -
కేజీబీవీల సంఖ్య పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: బాలికా విద్యపై ఏర్పాటైన సబ్ కమిటీ (కేబ్స్) ఇచ్చిన నివేదిక ఆధారంగా కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలల్లో (కేజీబీవీ) ఇంటర్ వరకు విద్యనందించే విషయంలో పాఠశాలల అప్గ్రేడేష్ను కొన్నింటికే పరిమితం చేయడం సరికాదని, వీటి సంఖ్యను పెంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉంటే 94 స్కూళ్లలోనే ఇంటర్ విద్యనందించేందకు కేంద్రం అనుమతించిందని, తరగతి గదికి 20 మంది విద్యార్థులనే పరిమితం చేయడం సరికాదని ఆయన వివరించారు. పలు అంశాలపై కడియం మంగళవారం ఢిల్లీలో ఎంపీలు వినోద్కుమార్, సీతారాం నాయక్, బండ ప్రకాశ్లతో కలసి కేంద్ర మంత్రికి నివేదిక అందజేశారు. అందులో ప్రముఖంగా ఇంటర్ వరకు విద్యాబోధనకు కేజీబీవీల సంఖ్యను పెంచడం, గ్రూపుల వారిగా తరగతికి 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. పాఠశాలల అప్గ్రేడేషన్పై ప్రధానంగా దృష్టి సారించాలని, ఇంటర్ వరకు విద్యాబోధనకు ప్రతి పాఠశాలకు 15 మంది టీచర్ల అవసరం ఉంటుందని, కేంద్రం 9 మందినే నియమిస్తామనడం సరికాదన్నారు. అందులో కూడా క్వాలిఫైడ్ టీచర్ల నియమించి, రూ.40 వేల వేతనాలు చెలించాలని కోరారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.7.5 కోట్లు విడుదల చేయాలని, ప్రస్తుతం నిర్ణయించిన వరంగల్ జిల్లా మాము నూరు ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లను ప్రారంభించేందుకు జాతీయ పశువైద్య మండలి అనుమతులిచ్చిన నేపథ్యంలో.. అడ్మిషన్లపై కడియం వెటర్నరీ కౌన్సిల్ డైరెక్టర్ కరుణ్ శ్రీధర్తో సమావేశమై చర్చించారు. -
కస్తూర్బా బాలికలకు ట్రిపుల్ ఐటీ కలేనా?
ప్రకాశం, కందుకూరు అర్బన్:గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థినులు రాష్ట్ర విద్యాశాఖ చేస్తున్న తప్పిదాల వల్ల ఉన్నత చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నూజివీడు, బాసర, పులివెందుల ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నా.. కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన బాలికలు మాత్రం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో చదివి ఉద్యోగాల్లో స్థిరపడటంతో ఈ కాలేజీల్లో చదువుకోవాలని బాలికలు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో చేరి ఉజ్వల భవిష్యత్ పొందాలని కలలు కంటున్నారు. కానీ వారి కళ నేరవేరేటట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన విద్యార్థులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అప్లికేషన్ ఆన్లైన్ చేసే సమయంలో జిల్లా, మండలం, స్కూల్ పేర్లతోపాటు 4 తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివారో వివరాలు నమోదు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్న సమయంలో కొన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో ఆన్లైన్లో పొందుపరిచిన స్కూల్స్కు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో ప్రభుత్వం రెసిడెన్షియల్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం పేర్లు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కనీస సమాచారం కూడా ఉన్నతాధికారులు తెలియజేయలేదు. జిల్లాలో 37 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది కస్తూర్బా విద్యాలయాల్లో 1206 మంది బాలికలు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 1154 మంది ఉత్తీర్ణత సాధించారు. 25 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. అనేక మంది బాలికలు 10కి10 జీపీఏ, 9.8, 9.6 జీపీఏ సాధించారు. వీరిలో కొంత మంది మధ్యలో బడిమానేసి మళ్లీ చదువు కొనసాగించాలని కొండంత ఆశతో కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో చేరి మంచి మార్కులు సాధించారు. ‘లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే స్థోమత మాకు లేదు. ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించండి’ అని బాలికలు ప్రాధేయపడుతున్నారు. జూన్ 8వ తేదీతో ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ముగియనుంది. ఉన్నతాధికారులు స్పందించి ఆన్లైన్లో సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు. -
ఆత్మ రక్షణ విద్యలో అక్కాచెల్లెళ్ల సవారి
కొనకనమిట్ల: మహిళల రక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. ఆడవాళ్లపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు అంతులేకుండా పోతున్నాయి. సమాజంలో నేర స్వభావం పెరుగుతున్న కొద్ది.. ఆడవారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పటం అవసరం. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటారు.. ఆ కోవలోనే అక్కాచెల్లెళ్లు లహరి అనిత, లిలతా భవానిలు తైక్వాండో (కరాటే) రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఇటీవల విశాఖపట్టణంలో నిర్వహించిన పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి సత్తాచాటారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కొనకనమిట్ల మండలం గొట్లగట్టు కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న లహరి అనిత, లలితా భవానిలు క్రీడలలో మంచి ప్రతిభ కనబరచడంతో పాఠశాల ప్రత్యేకాధికారి ఆర్.సురేఖ, పాఠశాల పీఈటీ వనజలతలు తమ విద్యార్థినులను కరాటే దిశగా ప్రోత్సహించి వారికి మంచి తర్ఫీదునిచ్చారు. అంతకు ముందు కరాటేలో రాజు మాస్టర్ దగ్గర మెళకువలు నేర్చుకున్న అహరి అనిత, లలితా భవానిలు కరాటే విద్యపై మక్కువ చూపించారు. ఇటీవల ఒంగోలులో జరిగిన పోటీలతో పాటు రాష్ట్ర స్థాయిలో వైజాగ్లో జరిగిన 13 జిల్లాల కేజీబీవీల కరాటే (తైక్వాండో) పోటీల్లో గొట్లగట్టు కేజీబీవి బాలికలు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సత్తాచాటారు. అక్కడ కేజీబీవీ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్, కామేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, నారాయణ, విద్యాశాఖ జేడీ శ్రీనివాసులు, సర్వశిక్ష అభియాన్ పీఓ ఎం.వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కేజీబీవీ బాలికలు అవార్డులు మెమెంటోలు అందుకున్నారు. జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలి.. జాతీయస్థాయి పోటీలలో పాల్గొనాలనేది తమ లక్ష్యమని అక్కాచెల్లెళ్లు లహరి అనిత, లలితా భవాని అన్నారు. కరాటేతో పాటు కబడ్డీ అంటే ఇష్టమని కబడ్డీ పోటీల్లో కూడా ప్రావీణ్యం ఉంది. పాఠశాల జోనల్ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాం. మంచి క్రీడాకారిణిలుగా పేరుతెచ్చుకోవాలన్నదే లక్ష్యం.. తైక్వాండోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లహరి అనిత, లలిత భవానిలను, తర్ఫీదునిచ్చిన పీఈటీ వనజలతను, పాఠశాల ప్రత్యేకాధికారి సురేఖను పలువురు అభినందించారు. -
కేజీబీవీలో సౌకర్యాల లేమిపై మంత్రి గంటా ఆగ్రహం
రాప్తాడు: రాప్తాడు కేజీబీవీలో వసతులు సక్రమంగా కల్పించకపోవడంపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో వసతులు లోపాలను గుర్తించిన ఆయన.. పాఠశాలను నిర్వహించాల్సింది ఇలాగేనా? అంటూ జిల్లా అధికారులు, సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం రాప్తాడులోని ధర్మవరం ఫంగల్ రోడ్డు సమీపంలో ఉన్న కేజీబీవీని మంత్రి గంటా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, శాసన మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, డీఐజీ ప్రభాకర్రావు ఉన్నారు. ముందుగా ఆయన స్థానిక ఏపీ మోడల్స్కూల్ను పరిశీలించారు. కేజీబీవీ విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని కేజీబీవీల్లో నీటి సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి, డీఈవో జనర్ధానాచార్యులు, ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి, ఈఈ విజయ శేఖర్, ఏఎంవో జయచంద్రనాయుడు, సీఎం ఆనంద్బాబు, జీసీడీవో ఉషారాణి, ఎంపీడీఓ జల్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
నల్లబెల్లి(నర్సంపేట): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడంతోపాటు సుఖ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. స్థానిక పీహెచ్సీతోపాటు, కస్తూరిబాగాంధీ బాలికల గురుకుల విద్యాలయం, మామిండ్లవీరయ్యపల్లి నర్సరీలను ఆమె శుక్రవారం సందర్శించారు. పీహెచ్సీలో మేడిసిన్ స్టాక్ రూం, ప్రసవాల గదిని పరిశీలించారు. పనికిరాని వస్తువులు ఆస్పత్రిలోపల ఎందుకు ఉంచారని సిబ్బందిని మందలించారు. ధ్వసమైన కాంపౌండ్ వాల్కు మరమ్మతు చేయించే విషయమై స్థానిక సర్పంచ్ కొత్తపల్లి కోటిలింగాచారితో చర్చించారు. ఆస్పత్రి ఆవరణలోని మొక్కలకు నీళ్లుపోశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు నిర్మించుకొని నాలుగు నెలలు కావస్తున్నా అధికారులు బిల్లులు చెల్లించడంలేదని బీజేపీ జిల్లా నాయకుడు తడుక అశోక్గౌడ్, కాంగ్రెస్ నాయకుడు నాగంపెల్లి వీరన్న కలెక్టర్ దృష్టికి తీసువెళ్లగా త్వరలోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కస్తూరిబా పాఠశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. మూడేళ్లుగా నిర్మించిన మరుగుదొడ్ల బిల్లు చెల్లించడంలో ఇంజనీరింగ్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంఈఓ మాలోత్ దేవా కలెక్టర్ దృష్టికి తీసువెళ్లగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మామిండ్లవీరయ్యపల్లి నర్సరీని సందర్శించిన కలెక్టర్ హరితహారం లక్ష్యాన్ని అధిగమించేలా అధికారులు పనిచేయాలని సూచిం చారు. మండల ప్రత్యేకాధికారి పురుషోత్తం, తాహసీల్దార్ రాజేంద్రనాద్, ఇన్చా ర్జి ఎంపీడీఓ బాబు, ఎంఈఓ దేవా, నల్లబెల్లి వైద్యాధికారి మమేందర్నాయక్, కస్తూరిబాగాంధీ ఎస్ఓ సునీత, సర్పంచ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో ఇంటర్
ఆర్థిక స్థోమత లేక చదువు మధ్యలో మానేసిన.. తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇకనుంచి ఇంటర్ కూడా కొనసాగించనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభ్యర్థన మేరకు కేంద్రప్రభుత్వం అంగీకరించి.. ఇంటర్ బోధనకు సిద్ధమైంది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్య అందుతుండగా.. ఇక నుంచి ఇంటర్ వరకు బోధించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు చదువుకు అవసరమైన నిధులు విడుదల చేస్తుండగా.. 9, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. కరీంనగర్ఎడ్యుకేషన్: డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో బాలికల విద్య సబ్ కమిటీ సమావేశం గత డిసెంబర్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ను కలిసి కేజీబీవీల్లోఇంటర్ వరకు విద్యను పొడగించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. తాజాగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇంటర్ విద్యను కేజీబీవీల్లో ప్రవేశపెట్టేందుకు అంగీకరించడంతో కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరుగనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలు జరుగనున్నాయి. జిల్లాలో 11 కేజీబీవీలు కరీంనగర్ జిల్లాలో మొత్తం 11 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 5,370 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలల్లో చదివిన వారికి వసతితోపాటు నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భోజనం మెనూలో కూడా ఇటీవల ప్రభుత్వం మార్పు చేసింది. వారానికి రెండుసార్లు మటన్, నాలుగుసార్లు చికెన్, రోజు కోడిగుడ్డు, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, పాలు, ఇతర స్నాక్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా న్యాప్కిన్స్, కాస్మోటిక్ కిట్లను అందిస్తున్నారు. భవనాలు నిర్మించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పది తర్వాత చదువు కొనసాగించే వీలు కేజీబీవీల్లో చదివి పదో తరగతి ఉత్తీర్ణులైన చాలామంది ఇంటర్ విద్యను కొనసాగించలేకపోతున్నారు. గురుకులాల్లో ఇతర కళాశాలల్లో అందరికీ సీట్లు లభించకపోవడం.. సొంత గ్రామాలకు వెళ్లిపోవడం.. ఆర్థిక స్థోమత లేకపోవడంతో అక్కడికే చదువును ఆపేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగనుంది. ఉన్నత చదువు చదువుకునే వీలుంటుంది. పదో తరగతి వరకు కేజీబీవీలో చదివిన వారు ఆ తర్వాత అక్కడే విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించడంతో తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలపై భద్రత భావం ఉంటుంది. ఎట్టకేలకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీబీవీలను ఇంటర్ విద్య వరకు పొడిగిస్తామని పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలిక విద్య ఉపసంఘానికి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్గా ఉండడంతో అమలుకు నోచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు ఆ కేజీబీవీల్లోనే ఇంటర్ చదువుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2100 మంది ఉన్నారు. ఉత్తీర్ణులైన వారందరికీ ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థులకు ప్రయోజనం– అనురాధ, ఆర్వీఎం సెక్టోరియల్ అధికారి ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు జరుగనుంది. కేజీబీవీల్లో ప్రస్తుతం పదో తరగతి వరకే విద్య అందుతోంది. పది పూర్తయిన తర్వాత కొంత మంది పిల్లలు ఇంటర్ అభ్యసించకుండా చదువు మానేస్తున్నారు. కేజీబీవీల్లో ఇంటర్ ఏర్పాటు చేయడం వల్ల పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఆనంతరం ఇక్కడే చదువుకోవచ్చు. -
కేజీబీవీల్లో 12వ తరగతి
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇకపై 12వ తరగతి వరకు విద్యా బోధన కొనసాగనుంది. ఇప్పటివరకు 6, 7, 8 తరగతుల్లోనే నివాస వసతితో కూడిన విద్యను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై 12వ తరగతి వరకు విద్యను అందించాలని నిర్ణయించింది. దీంతో సామాజిక, ఆర్థిక పరిస్థితులతో డ్రాపవుట్స్గా మిగిలిపోతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు 12వ తరగతి వరకు చదువుకునే వీలు కలగనుంది. సొంతంగా 9, 10 తరగతులు కొనసాగిస్తున్న రాష్ట్రం... కేజీబీవీల్లో ఇప్పటివరకు 8వ తరగతి వరకే బోధన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుండగా తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 9, 10 తరగతులను కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 391 కేజీబీవీల్లో 73 వేల మంది బాలికలు చదువుతుండగా వారి చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 212 కోట్లు వెచ్చిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో 110 మండలాలు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నట్లు కేంద్రం 2017లో గుర్తించి మరో 84 కేజీబీవీలను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. కేంద్రం తాజా నిర్ణయంతో వాటన్నింటిలో బాలికలకు నివాస వసతితో కూడిన ఇంగ్లిష్ మీడియం విద్య 12వ తరగతి వరకు అందనుంది. అమల్లోకి వచ్చిన కేబ్ సబ్కమిటీ సిఫార్సులు... దేశవ్యాప్తంగా బాలికా విద్యకు ప్రోత్సాహం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్గా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) సబ్ కమిటీని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ గతేడాది ఏర్పాటు చేసింది. అస్సాం మంత్రి హేమంత బిస్వాశర్మ, జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్ సభ్యులుగా, కేంద్ర మానవ వనరులశాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్ సభ్య కార్యదర్శిగా ఏర్పాటైన ఈ కమిటీ పలు దఫాలుగా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఇటీవలే నివేదిక సమర్పించింది. కేజీబీవీలను 12వ తరగతి వరకు కొనసాగించాలని నివేదికలో సిఫారసు చేసింది. దీనిపై కేంద్ర కేబినెట్ సానుకూలంగా స్పందించింది. కేంద్రం నిర్ణయంతో నిరుపేద బాలికలకు విద్యావకాశాలు మెరుగుపడతాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
కస్తూర్బావజ్రాలు
మట్టిలో మాణిక్యాలను గుర్తించి వాటికి మెరుగుపెడితే మరింత ప్రకాశిస్తాయి. రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ అధికారులు ఇదే చేశారు. జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 8, 9 తరగతులు చదివే నిరుపేద బాలికల్లో ఉన్న ప్రతిభా పాటవాలను గుర్తించా రు. వీరిలోని శాస్త్ర సాంకేతిక రంగాల పటిమకు పదును పెట్టారు. కేవీపల్లి, పుంగనూరు, బైరెడ్డిపల్లి, రొంపిచెర్ల కేజీబీవీలకు చెందిన తొమ్మిది మంది బాలికలు నాసా నిర్వహించే ఐఎస్డీసీకి ఎంపికయ్యారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలకు ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు లభించింది. గతంలో ఎన్నడూ రానంత పేరు ప్రఖ్యాతులు ఈ విద్యాలయాలు సొంతం చేసుకున్నాయి. ఇందుకు కారణం మన జిల్లా బాలికలే. జిల్లాలోని కేవీపల్లి, పుంగనూరు, బైరెడ్డిపల్లి, రొంపిచర్ల కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో 8, 9 తరగతులు చదివే 9 మంది బాలికలు నాసా సభలకు ఎంపికై జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేశారు. మే 24 నుంచి జూన్ 2 వరకూ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ (ఐఎస్డీసీ)లో ‘అంతరిక్షంలో ఆవాసాలు’ అనే అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎంపికైంది వీరే.. వెలగా ప్రత్యూష(కేవీపల్లి), కె.రెడ్డిరాణి (కలకడ), సీహెచ్ స్నేహ (గంగవరం), గుజ్జల దివ్య (కేవీపల్లి), ఎస్కే రోషిణి (పుంగనూరు), కే. ప్రీతి( బైరెడ్డిపల్లి), టీ సాయిశ్రీ (రొంపిచెర్ల), ఎం.పూజ (కేవీపల్లి), వీ.సైదాభాను (పుంగనూరు) ఎంపికైన వారిలో ఉన్నారు. వీరంతా టెన్త్ లోపు విద్యార్థులే. అంతరిక్షంలో నివాస ప్రాంతాలు, వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు, ఆవాసాలు, మొక్కల పెంపకం, ఆహారం, గాలి, ఉష్ణోగ్రతలు, గురుత్వాకర్షణ శక్తి వంటి అంశాలపై ప్రతిభ చాటారు. అంతరిక్షంలో మానవ మనుగడ ఎలా అన్నదే అందరి సంయుక్త పరిశోధన కానుంది. హైదరాబాద్లోని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. రఘునందన్కుమార్ విద్యార్థులకు ఎంతగానో సహకారం అందించారు. శాటిలైట్ ల్యాంచింగ్ లేబొరేటరీ, ఆస్ట్రోనాట్స్తో ముఖాముఖి వంటి అంశాలను చిన్నారులకు నేర్పారు. నెల రోజుల కిందట తిరపతిలోని నెహ్రూ మున్సిపల్ స్కూల్లో చిన్నారులకు అవగాహన తరగతులు నిర్వహించారు. ఇక్కడే వీరికి తగిన శిక్షణ కూడా ఇచ్చారు. అందరిదీ గ్రామీణ నేపథ్యమే.. ఎంపికైన విద్యార్థినులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. పేద, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్లేందుకు ఆరాట పడుతున్న భావి మేధావులు. తొలిసారి విమానంలో అమెరికా వెళ్లబోతున్నామన్న ఆనందం, నాసా వర్క్షాప్ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ వీరిలో కనిపిస్తోంది. -
బాలికలకు వరం
ఆదిలాబాద్టౌన్: ఆర్థిక స్థోమత లేక చదువు మధ్యలో మానేసిన, తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్యను అందిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6నుంచి 8వ తరగతి విద్యార్థులకు చదువుకు అవసరం అయి న నిధులు విడుదల చేస్తుండగా.. 9,10వ తరగ తి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యయాన్ని భరిస్తోంది. డెప్యూటీ సీఎం ఆధ్వర్యంలో బాలిక విద్య సబ్ కమిటీ మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ను కలిసి కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యను పొడి గించాలని కోరగా ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరగనుంది. వచ్చే విద్య సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 68 కేజీబీవీలున్నాయి. వీటిలో 10,380 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్లోని 17 కేజీబీవీల్లో 2,385 మంది, నిర్మల్లో 18 కేజీబీవీల్లో 2900 మంది, ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలో 15 కేజీబీవీల్లో 2500 మంది విద్యార్థులు, మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీవీల్లో 2600 విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశా రు. ఈ పాఠశాలల్లో చదివిన వారికి వసతితో పాటు నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భోజన మెనూలో కూడా ఇటీవల ప్రభుత్వం మార్పు చేసింది. వారానికి రెండు సా ర్లు మటన్, నాలుగు సార్లు చికెన్, రోజు కోడిగుడ్డు, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, పాలు, స్నాక్స్ అందిస్తున్నారు. అంతే కాకుండా న్యాప్కిన్స్, కాస్మోటిక్ కిట్లను అంది స్తున్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పది తర్వాత చదువు కొనసాగించే వీలు.. కేజీబీవీల్లో చదివి పదో తరగతి ఉత్తీర్ణులైన చాలా మంది ఇంటర్ విద్యను కొనసాగించలేకపోతున్నారు. గురుకులాల్లో ఇతర కళాశాలల్లో అందరికీ సీట్లు లభించకపోవడం, వారి సొంత గ్రామాలకు వెళ్లిపోవడం, ఆర్థిక స్థోమత కారణంగా అక్కడికే చదువును ఆపేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తో విద్యార్థులకు మేలు జరగనుంది. ఉన్నత చదువు చదువుకునే వీలుంటుంది. పదో తరగతి వరకు కేజీబీవీలో చదివిన వారు ఆ తర్వాత అక్కడే విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించడంతో తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలపై భద్రత భావం ఉంటుంది. ఎట్టకేలకు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీబీవీల ను ఇంటర్ విద్య వరకు పొడిగిస్తామని పలు సా ర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలిక విద్య ఉపసంఘానికి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్గా ఉండడంతో అమలుకు నోచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు ఆ కేజీబీవీల్లోనే ఇంటర్ చదువుకునే అవకాశం ఉం టుంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులు 2500 మంది ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మేలు.. ఆరు నుంచి పదో తరగతి వరకు ఆదిలా బాద్ కేజీబీవీలో చదువుతున్నా. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్ కూడా ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించింది. నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు బాగున్నాయి. – శీతల్, పదోతరగతి విద్యార్థి, ఆదిలాబాద్ విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు జరగనుంది. కేజీబీవీల్లో ప్రస్తుతం పదోతరగతి వరకే విద్యను అందించడం జరుగుతుంది. పది పూర్తయిన తర్వాత కొంత మంది పిల్లలు ఇంటర్ అభ్యసించకుండా చదువు మానేస్తున్నారు. కేజీబీవీల్లో ఇంటర్ ఏర్పాటు చేయడం వల్ల పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అనంతరం ఇక్కడే చదువుకోవచ్చు. – లస్మన్న, ఆర్వీఎం సెక్టోరియల్ అధికారి -
పదిలమైన ఫలితాల కోసం...
బాలికల్లో డ్రాపవుట్స్ను తగ్గించేందుకు ఆవిర్భవించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఆంగ్లమాధ్యమానికి అప్గ్రేడ్ అయ్యారు. ఐదేళ్లుగా ఎలాగోలా వంటబట్టించుకున్నా...పబ్లిక్ పరీక్షలు తొలిసారిగా రాస్తున్నారు. శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో రకరకాలుగా ప్రణాళికలు రూపొందించిన అధికారులు వాటిని పక్కాగా అమలుచేస్తున్నారు. విజయనగరం అర్బన్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న పదోతరగతి విద్యార్థినులు మెరుగైన వార్షిక ఫలితాలు సాధన కోసం సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) యంత్రాంగం కుస్తీ పడుతోంది. ఆంగ్లమాధ్యమం ప్రారంభించిన తరువాత ఈ ఏడాదే తొలిసారిగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. దీనివల్ల ఫలి తాల్లో ఏమాత్రం తేడా రాకుండా ఉండాలనే లక్ష్యంతో ఎస్ఎస్ఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. జిల్లాలోని 33 కేజీబీవీల్లో విద్యార్థుల సామర్థ్యాలపై ఇప్పటికే అంచనావేసి ప్రత్యేక తర్ఫీదులను ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏడాదిలో ఇంతవరకు జరిగిన వివిధ రకాల పరీక్షల్లో ప్రదర్శించిన సామర్థ్యాలకు అనుగుణంగా తరగతిలో విద్యార్థులను విభజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవల సబ్జెక్ట్లోని రెండేసి చాప్టర్ల వారీగా టెస్ట్లు పెట్టారు. వీటి ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. ఒక్కో కేజీబీవీలలో 5 నుంచి 6 శాతం వంతున జిల్లా వ్యాప్తంగా 360 మంది వెనుకబడిన విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరందరినీ పాస్ చేయించేం దుకు శ్రద్ధ చూపుతున్నారు. ఎస్ఎస్ఏ పీఓ నుంచి సెక్టోరియల్ అధికారి వరకు ఒక్కో అధికారి ఒక్కో కేజీబీవీని దత్తత తీసుకొని అక్కడి వెనుకబడిన విద్యార్థినుల ఉత్తర్ణత బాధ్యతను తీసుకున్నారు. రోజూ నిర్వహించే ఉద్యోగ విధులతోపాటు అదనంగా ఈ బాధ్యత నిర్వర్తించాలి. సబ్జెక్ట్ వారిగా మాదిరీ ప్రశ్నపత్రాలను తయారు చేసి వాటి ద్వారా వెనుకబడినవారికి తర్ఫీదు ఇస్తున్నారు. టాప్ ఫైవ్ విద్యార్థులను ఒక చోటకు చేర్చి 10/10 సాధన కోసం శిక్షణ ఇస్తున్నారు. పరీక్షకు హాజరుకానున్న 1,139 మంది విద్యార్థినులు వచ్చేనెల 15 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు కేజీబీ వీల నుంచి 1,045 మంది విద్యార్థినులు హాజరవుతున్నారు. కేజీబీవీల పరిధిలోని ఉపాధ్యాయులు రూపొం దించిన ప్రత్యేక ప్రశ్నావళితో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. గతేడాది సాధించిన 92.3 శాతం ఉత్తీర్ణత కంటే మెరుగైన ఫలితాలకోసం ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. విద్యార్థినుల్లో పరీక్షపై భయం పోగొట్టే ప్రక్రియలో భాగంగా పాఠశాల స్థాయిలో మానసికోల్లా స కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు పిలిపించి వారిని గౌరవించే కార్యక్రమం విద్యాలయం స్థాయిలో చేపట్టారు. ఇలాంటి వాటి ద్వారా వారిలో పరీక్షలంటే భయం పోతుందని ఎస్ఎస్ఏ అధికారులు అంటున్నారు. ఉత్తీర్ణతా శాతంపెంపునకు ప్రణాళికలు కేజీబీవీల్లో పదో తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని గతేడాది కంటే మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాం. గతేడాది 92 శాతం ఉత్తీర్ణత సాధించాం, ఈ ఏడాది సీసీఈ విధానం అమలులో ఉండడంతో ఏమాత్రం తగ్గకుండా శతశాతం ఫలితాలకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న గ్రాండ్ ఫైనల్, ఈ నెల 24 నుంచి జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల తరువాత పాఠశాల స్థాయిలో విద్యార్థుల సామర్ధ్యం తెలుస్తుంది. తద్వారా బోధనపై శ్రద్ధపెడతాం. ఇంగ్లిష్ మాధ్యమంపైభయాన్ని పోగొట్టాం నాలుగేళ్లక్రితం ఆరోతరగతిలో ఇంగ్లిష్ మాధ్యమం మొదలైంది. తొలి బ్యాచ్ పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది రాస్తున్నారు. వీరికి తొలి రోజుల్లో ఇంగ్లిష్ మాధ్యమమంటే భయం ఉం డేది. దీనిని పోగొట్టడానికి ఏడా ది బోధనలో అధిక ప్రాధాన్యమిచ్చాం. దీనివల్ల ఫలితా లను మెరుగవుతాయన్న నమ్మకం ఉంది. – బలగ జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, గంట్యాడ ఫలితాలకోసం ప్రత్యేక కార్యాచరణ కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యచరణను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఉదయం 8.30 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతుండగా సాయంత్రం 5.30 గంటల వరకు చివరి తరగతిని నిర్వహిస్తారు. పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు వరుస సెలవులు మంజూరు చేయరు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పాఠాల పునశ్చరణ చేస్తున్నారు. సిలబస్ పూర్తయిన చోట సబ్జెక్టుల వారీగా వినిధరూపాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని నిర్ణయించారు. ఏ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. వాటిని ఎలా రాయాలి తెలుసుకోవాలనే దానిపై శ్రద్ధ తీసుకుంటున్నారు. -
సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (యుఆర్ఎస్) పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం చేయనున్నట్లు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ నెల 19, 20 తేదీల్లో భోజన విరామ ప్రదర్శనలు, 29న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఫిబ్రవరి 10న డీఎస్సీ ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొంది. కేజీబీవీ, యుఆర్ఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సదస్సు శుక్రవారం హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీహెచ్ దుర్గా భవాని అధ్యక్షతన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనాథలు, డ్రాప్అవుట్ల కోసం నిర్వహిస్తున్న స్కూళ్లల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు బాధ్యతతో పని చేస్తున్నారని, వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకపోవటం అన్యాయమన్నారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాములు, చావ రవి మాట్లాడుతూ, విద్యార్థుల కోసం ఐక్యంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ ఐక్యతను సమస్యల సాధన కోసం జరిపే పోరాటంలోనూ చూపించాలన్నారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానాలు ఇలా.. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, ఉపాధ్యాయుల పేస్కేలులోని కనీస వేతనాన్ని కేజీబీవీ, యుఆర్ఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెల్లించాలి, వేసవి సెలవుల వేతనం, హెల్త్ కార్డులు జారీ చేయాలి, ప్రభుత్వ పాఠశాలల్లోని రెగ్యులర్ మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వర్తించే ప్రసూతి, శిశు సంరక్షణ సెలవులతోపాటు అన్నిరకాల సెలవులను వర్తింపచేయాలి, ఆదివారాలు, పండుగ సెలవుల్లో పని చేసిన వారికి మరుసటి రోజు సెలవు (వీక్లీ ఆఫ్) ఇవ్వాలి. రెండో శనివారం సెలవుగా ప్రకటించాలి. -
పదితో సరి
కావలి: వివక్షకు గురైన, ఒంటరులైన, వివిధ కారణాలతో బడి మానేసిన ఆడ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో జిల్లాలో 10చోట్ల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఏర్పాటయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 2 వేలమంది బాలికలు వీటిలో చదువుతున్నారు. 6నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో ఇక్కడ బోధన చేస్తారు. పాఠశాల, హాస్టల్ ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ తరహాలో వీటిని నడుపుతున్నారు. అయితే, ఇక్కడి విద్యార్థినులు 10వ తరగతి పూర్తికాగానే పైచదువులకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. జూనియర్ కళా శాలలు ఏర్పాటు కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో పేదరికంలో మగ్గిపోతున్న వారు పదో తరగతి తరువాత చదువు మానేసి కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. 10 విద్యాలయాల్లో రెండుచోట్ల మాత్రమే జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. దీంతో మిగిలిన 8 విద్యాలయాల్లోని బాలికలు టెన్త్ తరువాత చదువుకు దూరమవుతున్నారు. కావలి, కలిగిరి, కొండాపురం, నంది పాడు, సీతారామపురం, మర్రిపాడు, ఏఎస్పేట, దొరవారిసత్రం, తడ, వెంకటగిరి గ్రామాల్లో కస్తూర్బా విద్యాలయాలు ఏర్పాటు కాగా.. ఒక్కొక్క పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు ప్రవేశం కల్పిస్తున్నారు. కావలి, వెంకటగిరి విద్యాలయాల్లో జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలోనూ కేవలం బైపీసీ, ఎంపీసీ కోర్సులు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో 60 మంది చొప్పున 120 మందికి ప్రవేశం కల్పిస్తారు. మిగిలిన 8 విద్యాలయాల్లో జూనియర్ కళా శాలలు ఏర్పాటుకాక బాలికలు పై చదువులకు దూరమవుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది 8 కస్తూర్బా విద్యాలయాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటు అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. బాలికా విద్యను ప్రోత్సహించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఇ.విశ్వనాథ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, రాజీవ్ విద్యామిషన్ -
ఎస్ఎస్ఏలో పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పరిధిలోని వివిధ విభాగాల్లో 15 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న, మిగిలిపోయిన దాదాపు 1000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాల్లో డీఈవోలు అక్టోబర్ 3న నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది. అలాగే వివిధ పోస్టుల భర్తీకి అక్టోబర్ 23న రాత పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (యూఆర్ఎస్), 84 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ (ఎస్వో), కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), అకౌంటెంట్, నర్సు పోస్టులను, ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, ఐఈఆర్పీ పోస్టులను భర్తీ చే యనుంది. అలాగే 391 పాత కేజీబీవీల్లోనూ ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. సీఆర్టీ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి, మెరిట్తోపాటు రోస్టర్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా వాటిని భర్తీ చేయాలని వెల్లడించింది. మొత్తంగా అక్టోబర్ 30లోగా ఈ పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. జిల్లా యూనిట్గా డీఈవోలు నోటిఫికేషన్లను జారీ చేయాలని వెల్లడించింది. జిల్లా ఎంపిక కమిటీ ఏర్పాటు..: ఈ పోస్టుల భర్తీకి జిల్లా ఎంపిక కమిటీలను ఏర్పాటు చేసింది. మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ ఈ నియా మకాలను చేపట్టాలని వివరించింది. ఈ కమిటీకి చైర్ పర్సన్గా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్గా డీఈవో వ్యవహరిస్తారు. సభ్యులుగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ, ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తే నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంట ర్కు చెందిన డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డైట్ ప్రిన్సిపాల్ లేదా అతని ప్రతినిధి కమిటీలో సభ్యులుగా ఉంటారు. భర్తీ చేయనున్న పోస్టులివే..: జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోగ్రామర్, జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో సిస్టమ్ అనలిస్టు, జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో/మండల రీసోర్సు సెంటర్లో డాటా ఎంట్రీ ఆపరేటర్, మండల రీసోర్సు సెంటర్లో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్సు పర్సన్ యూఆర్ఎస్లలో.. కేజీబీవీల్లో.. స్పెషల్ ఆఫీసర్, సీఆర్టీ, పీఈటీ, అకౌంటెంట్, నర్సు. ఇదీ షెడ్యూలు (అక్టోబర్ నెలలో..) 3న: నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 7న: దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు 10న: దరఖాస్తుల స్క్రూటినీ 11న: రాత పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత పొందిన వారి జాబితా ప్రకటన 23న: ఆన్లైన్/ఆఫ్లైన్లో రాత పరీక్ష నిర్వహణ 28న: ఫలితాల ప్రకటన 30న: ఎంపికైన వారిని విధుల్లోకి తీసుకోవడం -
1,133 కొత్త కొలువులు
♦ 2008 నుంచి ప్రారంభించిన 81 జూనియర్ కాలేజీలకు పోస్టులు మంజూరు ♦ ఉర్దూ మీడియం సెల్ఫ్ ఫైనాన్స్ సెక్షన్లకు 69 లెక్చరర్ పోస్టులు ♦ పార్ట్టైం లెక్చరర్ల వేతనాలు రెండింతలు పెంపు ♦ పార్ట్ టైం ల్యాబ్ అటెండర్ల వేతనాలు రూ.3,900 నుంచి రూ.7,800కు పెంపు ♦ ఎస్ఎస్ఏ, కేజీబీవీ ఉద్యోగుల వేతనాలు కూడా.. ♦ 11,839 మంది ఉద్యోగులకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: విద్యా శాఖలో కొత్త పోస్టులు మంజూరయ్యాయి. 2008 తర్వాత ప్రారంభిం చిన 81 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,133 పోస్టులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంజూరు చేశారు. వీటితోపాటు సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) బోధన, బోధనేతర సిబ్బంది గౌరవ వేతనాల పెంపునకు గురువారం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 2008 తర్వాత పలు దఫాలుగా 81 జూనియర్ కాలేజీలను ప్రారంభించినా.. వాటికి కావల్సిన బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేయలేదు. దాంతో పూర్తిగా కాంట్రాక్టు విధానంలో బోధన, బోధనేతర సిబ్బందితోనే ఆ కాలేజీలు కొనసాగుతున్నాయి. ఇది ఇబ్బందికరంగా ఉందని, రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలన్న విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం 1,133 పోస్టులను మంజూరు చేసింది. ‘సెల్ఫ్ ఫైనాన్స్’ నుంచి ఉర్దూ మీడియం సెక్షన్లకు విముక్తి రాష్ట్రంలోని 15 ప్రభుత్వ ఉర్దూ మీడియం జూనియర్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద నడుస్తున్న 21 సెక్షన్లకు సంబంధించి 69 జూనియర్ లెక్చరర్ పోస్టులను కూడా సీఎం మంజూరు చేశారు. ఈ కోర్సుల వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోందని గమనించిన ప్రభుత్వం.. ఆ కోర్సులకు అవసరమైన 69 పోస్టులను మంజూరు చేసింది. ఇందుకు ఏటా ఖర్చయ్యే రూ. 1.86 కోట్లను ప్రభుత్వమే భరించనుంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమించే ఒక్కో ఉర్దూ మీడియం జూనియర్ లెక్చరర్కు ఇక నుంచి రూ.27వేల వేతనం అందనుంది. పార్ట్టైం ఉద్యోగులకూ.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 63 మంది పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల వేతనాలను ఒక్కో పీరియడ్కు రూ.150 నుంచి రూ.300కు పెంచారు. అంటే ఒక్కో పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ నెలకు 72 పీరియడ్ల లెక్కన ఇప్పటివరకు రూ.10,800 వేతనం పొందుతుండగా.. ఇకపై రూ.21,600 అందుతాయి. 52 మంది పార్ట్టైం ల్యాబ్ అటెండర్ల వేతనాన్ని రూ.3,900 నుంచి రూ.7,800కు పెంచారు. అలాగే ఎస్ఎస్ఏ, కేజీబీవీల్లో పనిచేస్తున్న దాదాపు 11,839 మంది సిబ్బందికి గౌరవ వేతనాలు పెంచారు. -
మరిన్ని మోములపై ముస్కాన్
♦ 45 %తగ్గిన వీధి బాలల సంఖ్య ♦ సరైన చిరునామాలు చెప్పిన వారిని స్వస్థలాలకు చేర్చేలా ఏర్పాట్లు ♦ అనాథ బాలలను కేజీబీవీలు, బాలసదనాలకు తరలింపు రాష్ట్రంలో వీధి బాలల సంఖ్య తగ్గుతోంది. ఇళ్ల నుంచి పారిపోవడం, తప్పిపోవడం లాంటి కారణాలతో వీధినపడ్డ పిల్లల్ని సంరక్షించి పునరావాసం కల్పించేందుకు శిశుసంక్షేమశాఖ ఆరు నెలలకోసారి చేపడుతున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,033 మంది పిల్లలను గుర్తించగా జూలైలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 2,496 మంది బాలలను గుర్తించారు. ఆరు నెలల వ్యవధిలో వీధి బాలల సంఖ్య తగ్గినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పేర్కొంది. తాజాగా గుర్తించిన పిల్లల్ని బాల సదనాలు, కేజీబీవీల్లో చేర్పించడంతోపాటు సరైన చిరునామా ఇచ్చిన పిల్లల్ని స్వగృహాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీధిబాలల సంఖ్య ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటుంది. తాజాగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో హైదరాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ మంది వీధి బాలలను గుర్తించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్లాట్ఫారాలు, బస్టాపుల్లోనే ఎక్కువ మంది.. జూలై 1 నుంచి 30 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 2,496 మంది వీధి బాలలను అధికారులు గుర్తించారు. వారిలో రాష్ట్రానికి చెందిన పిల్లలు 2,402 మందికాగా మిగిలిన వారు పొరుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు. తాజాగా గుర్తించిన వారిలో ఎక్కువ మంది రైల్వే ప్లాట్ఫారాలు, బస్టాపులు, కూడళ్లలో తిరిగుతూ అధికారులకు కనబడగా మరికొందరు యాచిస్తూ కనిపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లల్లో కొందరు తప్పిపోగా మరికొందరు పరిశ్రమలు, కర్మాగారాల్లో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ముస్కాన్ బృందాలు ఆయా పరిశ్రమలపై దాడులు నిర్వహించి బాలలకు విముక్తి కలిగించారు. వారిలో అత్యధికంగా ఒడిశాకు చెందిన 47 మంది చిన్నారులు ఉండగా ఆ తర్వాతి స్థానంలో బిహార్కు చెందిన పిల్లలున్నారు. ఆయా పిల్లలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, చిరునామాలు చెప్పిన వారిని ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లకు పంపిస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మీదేవి తెలిపారు. కేజీబీవీలకు అనాథ బాలలు... ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా గుర్తించిన వీధి బాలల్లో అనాథలను కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో, బాలసదనాల్లో అధికారులు చేర్పిస్తున్నారు. తాజా ఆపరేషన్లో 286 మందిని బాలసదనాలు, కేజీబీవీల్లో చేర్పించినట్లు శిశు సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. వీధి బాలల సంరక్షణకు ఆరు నెలలకోసారి నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలే కాకుండా నిరంతరం పనిచేసేలా బాలల పరిరక్షణ సెల్లు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశ్రమలు, నిర్మాణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని శిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత
తాడిపత్రి రూరల్: తాడిపత్రి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి కడుపు నొప్పితో ఒకరిద్దరు బాధ పడుతుండటంతో ఇన్చార్జ్ మునెమ్మ వారికి ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. శనివారం హిమాంబీ, భాగ్యలక్ష్మి, శ్రావణి, గౌతమి, కావ్య, చిట్టితోపాటు మరో 24 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం బాధిత విద్యార్థినులందరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం రాగిమాల్ట్ తాగామని, అప్పటి నుంచి ఇలా ఒక్కొక్కరికి కడుపు నొప్పి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. ప్రస్తుతం మినరల్ వాటర్ అయిపోవడంతో బోరు నీటిని తాగుతున్నారు. ఎందువలన అస్వస్థతకు గురయ్యారనేదానిపై ఆరా తీస్తున్నారు. ఆర్డీఓ మలోలా, సర్వశిక్షా అభియాన్ పీఓ సుబ్రమణ్యం హుటాహుటిన తాడిపత్రి చేరుకుని తహసీల్దార్ ఎల్లమ్మ, డీఎస్పీ చిదానందరెడ్డి, రూరల్ సీఐ సురేంద్రానాథ్రెడ్డి, ఎంఈఓ నాగరాజు, మునిసిపల్ శానినటరీ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డిలతో కలిసి ఆస్పత్రికెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కేజీబీవీ చేరుకుని సౌకర్యాలపై ఆరా తీశారు. ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండటం చూసి సిబ్బందిౖపై అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫుడ్ ఇన్స్పెక్టర్ విద్యాలయంలో ఆహారం, తాగునీటిని పరీక్షించేందుకు శాంపిల్స్ తీసుకెళ్లారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చే నివేదికను బట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు. -
వాడిన జుట్టు.. మాసిన బట్టలు
- వారానికి ఒకసారే స్నానం.. కాలకృత్యాల పరిస్థితి నరకం - మంత్రి కాలవ ఇలాకాలో కేజీబీవీ విద్యార్థినుల అవస్థలు గుమ్మఘట్ట : చదువులో ప్రథమం.. సౌకర్యాల్లోనే అధమంగా నిలుస్తోంది గుమ్మఘట్ట మండలం బీటీ ప్రాజెక్ట్ వద్ద ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల. పది రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య విద్యార్థినులను వేధిస్తుండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు. పాఠశాలలో 6 నుంచి 10 వరకు 200 మంది చదువుతున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన బోరుబావిలో రెండు నెలల కిత్రం నీరు అడుగంటిపోయింది. దీంతో విద్యార్థినులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రతి విద్యార్థినికీ స్నానం, బట్టలు ఉతుక్కోవడానికి రోజుకు కనీసం 40 నుంచి 50 లీటర్ల నీరు అవసరం. ఈ లెక్కన రోజుకు 10 వేల లీటర్ల నీరు అందుబాటులో ఉండాలి. కానీ 3 వేల లీటర్లు నిలువ చేసే సింటెక్స్ ట్యాంకులు ఉండటంతో మిగులు నీరు అన్ని వేళలా వాటిలో భద్రపరిచేవారు. ప్రస్తుతం కుళాయి ద్వారా రోజుకు వెయ్యి నుంచి 1,500 లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. తరగతులు, సెక్షన్ల వారీగా రోజుకు బకెట్ నీటిని మాత్రమే చౌకగా అందిస్తున్నారు. ఈ నీటిలోనే అన్నీ ముగించాలని చెబుతున్నారు. ఫలితంగా మాసిన బట్టలు.. వాడిన జుట్టుతోనే విద్యార్థులు చదువులకు వెళ్తున్నారు. రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతిని«థ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో పిల్లలకు ఇలాంటి కష్టాలు ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత తాగునీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. మాసిన బట్టలతోనే వెళ్తున్నాం నీటి ఇబ్బందుల దృష్ట్యా బట్టలను శుభ్రం చేసుకోలేకపోతున్నాం. వారానికి ఓసారి ఇంటికి పంపి శుభ్రం చేయించుకుని రమ్మని చెబుతున్నాం. దీంతో మాసిన బట్టలే దిక్కు అవుతున్నాయి. శాశ్వత నీటి కష్టాలు తీర్చాలి. – డి.శ్రుతి, 8వ తరగతి విద్యార్థిని బకెట్ నీరు సరిపోవడం లేదు బకెట్ నీరు ఏమాత్రం సరిపోడం లేదు. సీజనల్ వ్యాధులు సైతం ముసిరి ముంచెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో శుభ్రత పాటించకపోతే వ్యాధుల బారిన పడక తప్పదు. వంతుల వారీగా నీటిని అందిస్తున్నారు. – ఎం.అంబిక, 10వ తరగతి విద్యార్థిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం పాఠశాలలో తాగునీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండు రోజుల కిత్రం తహసీల్దార్ అఫ్జల్ఖాన్, ఎంపీడీఓ జి.మెనెప్ప, జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు, ఎంపీపీ పాలయ్య కూడా పాఠశాలకు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. – షబానాబేగం, ఎస్ఓ, బీటీపీ సమస్య పరిష్కరిస్తాం విద్యార్థినుల తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు సత్వర పరిష్కారం చేపడుతాం. అందుబాటులో ఉన్న ఆర్ఎంఎస్ఏ నిధులను తాగునీటికి ఖర్చు చేసేలా సంబంధిత ఎస్ఓను ఆదేశిస్తాం. అవసరమైతే ట్యాంకర్ ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేసి విద్యార్థుల ఇబ్బందులు తీర్చుతాం. – సుబ్రమణ్యం, ఆర్వీఎం, జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ -
15న కొత్త కేజీబీవీలు, యూఆర్ఎస్ల ప్రారంభం
డిప్యూటీ సీఎం కడియం వెల్లడి ప్రభుత్వ స్కూళ్లలో ఈసారి 50 వేల మంది విద్యార్థులు పెరిగారు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న 84 కొత్త కేజీబీవీలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లను (యూఆర్ఎస్) ఇంగ్లిష్ మీడియంలో ప్రారంభి స్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలి పారు. ఈలోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పాఠశాల విద్యా కార్యక్రమాలపై గురువారం డీఈవోలతో సమీక్ష తర్వాత కడియం మీడియాతో మాట్లాడారు. జిల్లాల్లో కలెక్టర్లు, డీఈవోలు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను అన్ని జిల్లాల్లో అమలు చేసేలా వచ్చే నెలలో 3 రోజులపాటు డీఈవోలకు వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి సర్కారు ప్రతిష్టను పెంచేలా డీఈవోలు పని చేయాలన్నారు. ఒకటో తరగతిలో ఈసారి విద్యార్థుల సంఖ్య గతేడాదికన్నా 50 వేలు తగ్గిం దని, మొత్తంగా చూస్తే గతేడాదికన్నా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల మంది విద్యార్థులు పెరిగారన్నారు. కొత్తగా 525 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు ఇంగ్లిష్ మీడియంలో రావడం వల్ల పాఠశాలల నుంచి గురుకులాలకు వెళ్తున్నారన్నారు. తరగతి గదిలో సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేదిలేదన్నారు. పదో తరగతి ఫలితాలను పెంచేందుకు వచ్చే నెల 10వ తేదీ తరువాత ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో అదనంగా 2 గంటలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ సారి జూన్ కంటే ముందే 95% పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించామన్నారు. యూనిఫా రాల బట్ట అన్ని స్కూళ్లకు సరఫరా అయిందని, వాటిని కుట్టించే పని కూడా 80% పూర్తయిందన్నారు. ఈ నెలాఖరుకల్లా మొత్తం పూర్తవుతుందన్నారు. ఒక్క విద్యార్థి కూడా చేరని స్కూళ్లు ఉన్నప్పటికీ, ఈసారి ఒక్క పాఠశాలనూ మూసివేయలేదన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇన్చార్జి కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
కన్నీటి కష్టాలు
కేజీబీవీల్లో నీటికి కటకట! ► అల్లాడుతున్న విద్యార్థినులు, ఉద్యోగులు ►మూడు రోజులకోసారి స్నానం..దుస్తులు ఉతుక్కోవడం లేదు ►బహిర్భూమికీ ఆరుబయటకే ఈ చిత్రం గుమ్మఘట్ట మండలంలోని బీటీపీలో ఉన్న కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయది. పాఠశాలలో ఏర్పాటు చేసిన తాగునీటి బోరు అడుగంటడంతో పంచాయతీ బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా అవి విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కొళాయి నీటిని డ్రమ్ముల్లో నిల్వచేసి ఉపయోగించుకుంటున్నారు. అయితే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం...నీరు తక్కువగా ఉండడంతో బాలికలంతా పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కోసారి పాఠశాలకు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. అనంతపురం ఎడ్యుకేషన్ : లేపాక్షి కేజీబీవీలో 200 మంది విద్యార్థినులతో పాటు 15–18 మంది ఉద్యోగులు ఉన్నారు. భూగర్భజలాలు అడుగంటి ఉన్న ఒక్కబోరూ ఇటీవల ఎండిపోయింది. దీంతో రోజూ ఒక ట్యాంకరు నీళ్లు వస్తున్నాయి. అవి సరిపోకపోవడంతో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటిదాకా దుస్తులు ఉతుక్కోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా లేపాక్షి ఒక్కటే కాదు జిల్లాలో చాలా కేజీబీవీల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భజలాలు అడుగంటడం...ప్రత్యామ్నాయ మార్గాలు పెద్దగా ఉపయోగపడకపోవడంతో కొన్ని కేజీబీవీల్లోని విద్యార్థులు మూడు రోజులకోసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు లేక అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గుమ్మఘట్ట, హిందూపురం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కనగానపల్లి, పరిగి, తనకల్లు, కుందుర్పి, అగళి కేజీబీవీల్లోని విద్యార్థులు నీటికోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఒక మనిషికి రోజు అవసరాల కోసం కనీసం 70 లీటర్ల నీరు అవసరం. అయితే కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఇందులో సగం కూడా దొరకడం లేదు. మూడు రోజులకోసారి స్నానం నీటి కొరత కారణంగా కొన్ని కేజేబీవీల్లో విద్యార్థినులు మూడు రోజుకోసారి స్నానం చేస్తున్నారు. తరగతి గదిలో చమట వాసన భరించలేకున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. అలాగే దుస్తులు ఉతుక్కోవడం లేదు. దీంతో మాసిన దుస్తులను వేసుకుంటున్నారు. గుమ్మఘట్ట కేజీబీవీలో నీటి సమస్య కారణంగా తరగతుల వారీగా వంతుల ప్రకారం స్నానాలు చేస్తున్నారు. అంటే వారంలో తొలిరోజు 6వ తరగతి, ఆతర్వాతి రోజు 7వ తరగతి ఇలా వంతుల వారీగా స్నాలకు నీళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇక శెట్టూరు కేజీబీవీలో బోరు ఎండిపోగా ఇటీవల మండలస్థాయి ‘మీకోసం’ కార్యక్రమంలో స్వయంగా స్పెషలాఫీసర్ ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం నీటి సమస్య ఉంది కదా ‘సర్దుకోవాలి’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. నీటి సమస్య తీవ్రతరం కావడంతో చాలా కేజీబీవీల్లో మరుగుదొడ్లు ఉపయోగించడం లేదు. దీంతో విద్యార్థినులు బహిర్భూమికోసం ఆరుబయటకు వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి కేజీబీవీల్లో నీటి కష్టాలను తప్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధిగమిస్తాం వేసవికాలం ప్రారంభం కాగానే చాలాప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతాయి. నీటి సమస్య అధికంగా ఉంటుంది. అయితే విద్యార్థినులెవరూ ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని ఆదేశించాం. నీటి సమస్య ఉన్నచోట అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థినీ ఇబ్బంది పడకుండా చూస్తాం. – సుబ్రమణ్యం, పీఓ ఎస్ఎస్ఏ -
కేజీబీవీల్లో ప్రవేశాలకు ప్రధానోపాధ్యాయుల అడ్డు!
అడ్డుకోవద్దని విద్యాశాఖ సూచన సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలిక ల విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాలకు కొంతమంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులు అడ్డుపడుతున్నట్లు విద్యా శాఖ గుర్తించింది. తమ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనే అడ్డుపడుతు న్నట్లు తేలింది. కరీంగనర్ జిల్లా గంగాధర మండలం, ఖమ్మం జిల్లాలోని ఓ మండ లంలో ఈ పరిస్థితిని అధికారులు గుర్తించా రు. పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని, 78 వేల మందికి అవకాశ మున్నా, 73 వేల మంది మాత్రమే ప్రవేశా లు పొందారు. దీంతో హాస్టల్ సదు పాయమున్న కేజీబీవీల్లోకి వెళ్లేలా బాలికలను ప్రోత్సహించాలని విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులకు సూచించింది. -
కేజీబీవీలను అభివృద్ధి చేయాలి
అసోంలోని లహరి ఘాట్ కేజీబీవీని సందర్శించిన కడియం సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాల (కేజీబీవీ)ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసర ముందని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం అసోం మోరిగావ్ జిల్లా లహరిఘాట్ కస్పూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సతీమణి వినయా రాణితో కలసి సందర్శించారు. బోధన ప్రక్రియ, వసతుల కల్పనను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం సమావేశమయ్యారు. బాలికల విద్యపై కేంద్రం నియమించిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రెండో సమావేశం సందర్భంగా కడియం శనివారం గువాహటి వెళ్లారు. కేజీబీవీలను 8వ తరగతికే పరిమితం చేయకుండా 12వ తరగతి వరకు పెంచాలని, దీన్ని పూర్తిగా కేంద్ర ఆర్థిక సాయంతోనే నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. -
కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టాలి
ఎస్ఎఫ్ఐ నేతలు అనంతపురం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యచంద్రయాదవ్, జయచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. కరువు జిల్లా పేద, మధ్య తరగతి వారికి విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. జిల్లా కరువు పరిస్థితుల దృష్టా ్య బాలికలు డ్రాపౌట్స్ కాకుండా వారికి చదువుకునే అవకాశం కల్పించాలన్నారు. నాయకులు హరీష్, శ్రీను పాల్గొన్నారు. -
పాఠశాల ఘటన బాధ్యులపై చర్యలు తప్పవు
వేముల : స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం జరిగిన సంఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తప్పవని ఎస్ఎస్ఏ రాష్ట్ర అధికారి గీత పేర్కొన్నారు. పాఠశాలలో పురుగుల అన్నం తిని 21 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అస్వస్థతకు గురైన 21 మంది విద్యార్థినులు కోలుకున్నారని, ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై సిబ్బంది, ప్రత్యేకాధికారి ఉమాదేవిని విచారించినట్లు తెలిపారు. పాఠశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్వో నిర్వాకం వల్లే ఇలా జరిగినట్లు విచారణలో తేలిందని, ఈ సంఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తప్పక తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జీసీడీవో ప్రమీల పాల్గొన్నారు. పాఠశాల సంఘటనపై కలెక్టర్కు నివేదిక పాఠశాలలో జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టర్ కె.వి.సత్యనారాయణకు నివేదిక ఇవ్వనున్నట్లు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. ఆయన శనివారం పాఠశాలను సందర్శించి బాలికల ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు కోలుకున్నారని, పాఠశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందన్నారు. గురువారం రాత్రి నుంచే విద్యార్థినులు కడుపు నొప్పితో బాధపడుతున్న విషయంపై సమాచారం ఇవ్వలేదన్నారు. ముందస్తు సమాచారం ఉన్నట్లయితే ఇలా జరిగేది కాదన్నారు. పాఠశాలకు సరఫరా అయిన బియ్యం నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్వో, ఇద్దరు వంట మనుషుల సస్పెన్షన్ విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్వో ఉమాదేవితో పాటు ఇద్దరు వంట మనుషులను కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు సర్వశిక్షా అభియాన్ పీవో వెంకటసుబ్బయ్య తెలిపారు. -
నిధులు రాక.. నడపలేక
• విద్యార్థినులను పస్తులు ఉంచలేక.. అప్పులు ఇవ్వక.. • అవస్థలు పడుతున్న స్పెషలాఫీసర్లు • కేజీబీవీల నిర్వహణకు టెండర్లు పిలవని ప్రభుత్వం • అడ్వాన్సు చెల్లింపులోనూ అదే నిర్లక్ష్యం • బంగారు నగలు తాకట్టుపెట్టి హాస్టల్ నిర్వహణ సాక్షి ప్రతినిధి, కడప: కేజీబీవీల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు స్పెషలాఫీసర్లు స్కూళ్లను నడపడానికి అల్లాడిపోతున్నారు. నిధులు కేటారుుంపులో నిర్లక్ష్యం తాండవిస్తోంది. అడ్వాన్సులు లేవు.. బిల్లులు జమకావు. వెరసి స్పెషల్ ఆఫీసర్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యార్థినులను పస్తులు ఉంచలేక, హాస్టల్స్ నిర్వహించలేక సతమతమవుతున్నారు. ఇంట్లో ఉన్న బంగారం సైతం తాకట్టుపెట్టి నిర్వహించేవారు కొందరైతే, అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు ఇంకొందరు. బాలికల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పేదరికంలో ఉన్నవారి కోసం కేజీబీవీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 29 కేజీబీవీలున్నారుు. విద్యాబోధనతోపాటు చక్కటి హాస్టల్ వసతి సమకూర్చారు. వాటి పరిధిలో దాదాపు 6 వేలమంది విద్యార్థినులు చదువున్నారు. ప్రతి హాస్టల్లో సరాసరిన ఒకరోజుకు క్వింటా బియ్యం అవసరం. ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తుండగా, టెండర్దారులు సరుకులు సరఫరాకు చేస్తున్నారు. కాగా కూరగాయాలు, పండ్లు, గుడ్లు, పాలు, గ్యాస్, చికెన్ తదితర వస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లు నిర్వహించలేదు. వాటిని ఎస్ఓలే తెప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకుగాను నెలకు రూ.1లక్ష అడ్వాన్సు సర్వశిక్షా అభియాన్ చెల్లించేది. ఈమొత్తం ఏడు నెలలుగా చెల్లించడం లేదు. ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. బంగారు నగలు సైతం తాకట్టు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు అంతా మహిళా ఉద్యోగులే. నిధులు అందకపోవడంతో ఏడు నెలలపాటు హాస్టల్ నిర్వహణ వారికి కష్టతరంగా మారింది. ఇప్పటికే కొందరు అప్పులు చేశారు, ఆపై బంగారు నగలు తాకట్టుపెట్టారు. చిరుద్యోగులుగా ఉన్న తమకు కేజీబీవీలు నిర్వహించడం భారంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఏడు నెలలపాటు బిల్లులు జమకాలేదని, ఇంకెంత కాలం భరించాలంటూ ఉన్నతాధికారులను ఆశ్రరుుస్తున్నారు. ప్రతి కేజీబీవీకి దాదాపు రూ.7లక్షలు రావాల్సి ఉందని ఉన్నతాధికారులు సర్దిచెప్పి పంపుతున్నారని, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వేధింపులు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. రూ.1కోటి మాత్రమే మంజూరు: ఎస్ఎస్ఏ పీఓ వెంకటసుబ్బయ్య కేవీజీబీల నిర్వహణకు సంబంధించి జిల్లాకు రూ.5కోట్లు నిధులు రావాల్సి ఉంది. అందులో ఇటీవల రూ.1కోటి మాత్రమే మంజూరు చేశారు. స్పెషల్ ఆఫీసర్లకు ఏడు నెలలుగా అడ్వాన్సు బిల్లులు చెల్లించలేదు. నిధుల కొరతే కారణం. ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లాం. నిధుల కోసం వేచియున్నాం. త్వరలో పరిష్కారం లభిస్తోందని ఆశిస్తున్నాం. -
నకిలీ పేర్లతో నాసిరకం
కేజీబీవీల్లో అక్రమాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 391 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో విద్యార్థులకు నాసిరకం పుస్తకాలు అంటగట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. పుస్తక ఏజెన్సీలతో కలిసి ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే దాదాపు 80 వేల మంది విద్యార్థులకు అందించాల్సిన ‘రాయల్ అట్లాస్’ పుస్తకాలకు బదులు అదే పేరును తలపించే ‘రాయల అట్లస్’ అనే నాసిరకం పుస్తకాలను ఇచ్చినట్లు బయట పడింది. అలాగే ఆక్స్ఫర్డ్ వంటి డిక్షనరీలకు బదులు రాఘవేంద్ర పబ్లిషర్స్కు చెందిన నాసిరకం డిక్షనరీలను పంపిణీ చేసినట్టు వెల్లడైంది. నోట్బుక్స్ లోనూ విద్యార్థులకు కోత పెట్టారు. విద్యా శాఖ ఇటీవల క్షేత్రస్థాయిలో చేపట్టిన తనిఖీల్లోనే ఈ అక్రమాలు వెలుగు చూశాయి. వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ వెల్లడించారు. -
జినుగుర్తి కేజీబీవీలో కలకలం!
తాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తిగేటు సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలకలం రేగింది. ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన గురువారం అలస్యంగా వెలుగుచూసింది. వివరాలు...జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న కేజీబీవీలో ఏడో తరగతి చదువుతున్న అనూష, ఎనిమిదో తరగతి చదువుతున్న అనిత కాచిగూడలోని ఓ అనాథాశ్రమం నుంచి ఇటీవలే ఇక్కడికి వచ్చారు. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి ఇద్దరు విద్యార్థినులు తోటివారితో కలిసి భోజనం చేశారు. పాఠశాలలోని గదిలో నిద్రకు ఉపక్రమించారు. బుధవారం తెల్లవారుజమున 5 గంటల సమయంలో విద్యార్థినులు కనబడలేరు. దీంతో పాఠశాల సిబ్బంది వారికోసం తరగతి గదులు, ఆవరణలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ విషయాన్ని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ భావనికి తెలిపారు. ఆమె పోలీస్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని ఎస్ఐ రేణుకారెడ్ది దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినులు అదృశ్యమై రెండు రోజులు కావొస్తున్నా ఆచూకీ లేకపోవడంతో యాజమాన్యం, తోటి విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థినుల అదృశ్యంపై సర్వశిక్షా అభియాన్ ఏఎమ్ఓ రవి విచారణ జరిపారు. కేజీబీవీకి చేరుకొని విద్యార్థినులతో పాటు సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. సమగ్రంగా విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం.. అదృశ్యమైన అనూష, అనితకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాం, ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టాం. విద్యార్థినులిద్దరు అనాథలు కావడంతో వారి అచూకీ దొరకడం కష్టంగా మారింది. కాచీగూడ అనాథాశ్రమంలోనూ వారి గురించి వాకబు చేయగా అక్కడికి రాలేదని చెప్పారు. – వెంకటయ్య, ఎంఈఓ -
కేజీబీవీ ఎస్వో తీరుపై పీవో అసంతృప్తి
ఎల్.ఎన్.పేట: లక్ష్మీనర్సుపేట కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) ప్రత్యేక అధికారి ఎస్.లలితకుమారి పని తీరుపై రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) పీఓ ఎస్.త్రినాథరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీని ఆయన గురువారం పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ బాగులేదన్నారు. ఇటీవలే 24 మంది బాలికలు అతిసారతో అస్వస్థతకు గురై ప్రస్తుతం తేరుకున్నారని, ఇప్పటికీ గుణపాఠం తెచ్చుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. మీ పిల్లలు చదువుకునే పాఠశాలల ప్రాంగణం ఇలా ఉంటే మీకు ఎలా అనిపిస్తోందని నిలదీశారు. తక్షణమే వాడుక నీరు మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడపై నాచుపట్టి ఉందని, ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్థినులతో కాసేపు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట గ్రామ పెద్దలు ముగడ జనార్దనరావు, దేవరశెట్టి తిరుమలరావు, ఊణ్ణ పకీరు, పరీక్షల పర్యవేక్షణ అధికారి కె.తేజేశ్వరరావులు ఉన్నారు. -
సమస్యల్లో కేజీబీవీ టీచర్లు
సకాలంలో అందని వేతనాలు కనీస వసతులు కరువే డిమాండ్ల సాధనకు టీచర్ల పోరాటం 4న హైదరాబాద్లో మహాధర్నా నిజామాబాద్ అర్బన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం కొన్నేళ్లుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అయినా, వారి మొర అలకించిన వారు, సమస్యలు తీర్చిన వారే లేరు. రాత్రింబవళ్లు విద్యాలయాల్లో పని చేస్తున్న టీచర్లకు సరైన సౌకర్యాలు కూడా కరువయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతనాల సమస్య వేధిస్తూనే ఉంది. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో కేజీబీవీ టీచర్లు యూనియన్గా ఏర్పడి డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ, 4వ తేదీన హైదరాబాద్లో మహా ధర్నా నిర్వహించనున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 36 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. పదవ తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులు కూడా ఇక్కడ ఉంటున్నారు. వీరికి కేజీబీవీ టీచర్లు మెరుగైన విద్య, వసతులు అందిస్తూ సక్రమంగా చూసుకుంటున్నారు. కేజీబీవీలు చాలా చోట్ల ఊరికి దూరంగా ఉండడం, ప్రధానంగా మహిళా టీచర్లు కావడంతో కేజీబీవీలో ఉండేందుకు, వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె ఇళ్లలో కొనసాగుతున్న కేజీబీవీల్లో సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న వీరికి రూ.14 వేల వేతనం ఇస్తున్నారు. అది కూడా మూడు నెలలకు ఒకసారి ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. – వివిధ శాఖలలో ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లే కేజీబీవీ టీచర్లను కూడా క్రమబద్ధీకరించాలి. – పదో పీఆర్సీ ఆధారంగా స్పెషల్ ఆఫీసర్ల వేతనం రూ.37 వేలు, ఉపాధ్యాయుల వేతనం రూ.28 వేలు, పీఈటీలకు రూ.22 వేలు, అకౌంటెంట్కు రూ.20 వేలు, ఏఎన్ఎంకు రూ.18 వేల మేర పెంచాలి. – ఆకస్మిక సెలవులు 20, ప్రత్యేక ఆసస్మిక సెలవులు 7 మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. – వేతనంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలి. – హెల్త్కార్డుల మంజూరీతో పాటు వేసవి సెలవుల్లోనూ వేతనం ఇవ్వాలి. -
డయేరియా విజృంభణ
ఎల్ఎన్పేట కేజీబీవీలో 24 మంది బాధితులు వైద్య, విద్యాశాఖాధికారుల పరిశీలన ఎల్.ఎన్.పేట : లక్ష్మీనర్సుపేట కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు డయేరియా బారిన పడ్డారు. రెండు రోజులుగా ఒకరిద్దరే బాధితులు ఉండగా శుక్రవారం నాటికి ఆ సంఖ్య 24కు చేరింది. ఈ విషయమై సమీపంలోని ప్రభుత్వ ప్రా«థమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఏఎన్ఎం మందులు ఇచ్చారని, అయినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థినులు చెప్పారు. ఎప్పటికప్పుడు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం తెలియజేస్తున్నామని కేజీబీవీ ప్రత్యేకాధికారి ఎస్.లలితకుమారి తెలిపారు. టి.మాధవి, పి.లత, ఇ.శ్రావణి, భవాని, సుమతి, అనూరాధ, ఎం.సుభాషిణిలతో పాటు పలువురు డయేరియా బారిన పడ్డారు. సమస్య తీవ్రంగా కావడంతో విషయాన్ని కలెక్టర్కు తెలియజేశారు. ఆయన స్పందించి జిల్లా ఎపిడమిక్ అధికారి డాక్టర్ గిరిధర్ను తక్షణమే కేజీబీవీకి పంపించారు. ఆయన వచ్చిన తర్వాత వైద్యసిబ్బంది చేరుకున్నారు. అధ్వానంగా పరిసరాలు.. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, డ్రమ్లో పురుగులతో కలిసిన నీరు ఉండటం, మేడపై ట్యాంకులపై మూతల్లేకపోవడం వల్లే అతిసార ప్రబలిందని జిల్లా ఎపిడమిక్ అధికారి డాక్టర్ గిరిధర్ విలేకర్లకు చెప్పారు. వంటగదిలోనూ పరిశుభ్రత లోపించిందని చెప్పారు. ఆహార పదార్థాలపై విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ వివరాలన్నింటినీ కలెక్టర్కు నివేదిస్తామని తెలిపారు. మినరల్ వాటర్ సరఫరా చేయాలి: డీఈఓ కేజీబీవీ విద్యార్థినులకు ప్రతిరోజు మినరల్ వాటర్ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.దేవానందరెడ్డి ఎస్ఓను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎందుకు మినరల్ వాటర్ ఇవ్వలేదని ప్రశ్నించారు. వర్షాకాలంలో కనీసం మరిగించిన నీరైనా ఇవ్వాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కుళాయి నీరే వాడుతున్నాం: ఎస్ఓ మేడపైనుంచి వర్షం నీరు పడుతున్నప్పుడు పట్టేందుకు డ్రమ్ ఉంచామని, ట్యాంకుల్లో నీరు స్నానాలకు, బాత్రూం అవసరాలకు మాత్రమే వాడుతున్నామని ఎస్ఓ తెలిపారు. వంటకు, తాగేందుకు పంచాయతీ నుంచి వస్తున్న కుళాయి నీటినే వాడుతున్నామని చెప్పారు. -
‘కస్తూర్బా’లో కోతుల బాధ
నిజాంసాగర్ : అటవీ ప్రాంతాల్లో సంచరించాల్సిన వానరసైన్యం జనారణ్యంలో స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోకి కోతులు వెళ్తున్నాయి. ఈ పాఠశాలలు మండల కేంద్రానికి దూరంగా ఉండడంతోపాటు ప్రహరీలూ లేవు. వంటశాలలతో పాటు స్నానపుగదులు, మూత్రశాలలు, తరగతి గదుల్లోకి కోతులు వస్తున్నాయి. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో వారిపై దాడులకు దిగుతున్నాయి. చేతుల్లో ఉన్న వస్తువులతో పాటు ప్లేట్లల్లో ఉన్న ఆహారాన్ని ఎత్తుకెళ్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల నిజాంసాగర్ కేజీబీవీలో సుమలత, శ్రావణి అనే విద్యార్థినులపై కోతులు దాడి చేశాయి. మండలకేంద్రంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాలు, నవోదయ విద్యాలయంలోనూ కోతుల బెడద ఉంది. కోతుల బెడద ఎక్కువగా ఉంది మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఏడాది కోతుల బెడద ఎక్కువైంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని విద్యాలయం ఉండడంతో కోతులు ఇక్కడికి వస్తున్నాయి. విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయపడుతున్నాం. కోతుల బెడద విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – సరోజన, కేజీబీవీ ప్రిన్సిపాల్, నిజాంసాగర్ -
గాయత్రి యజ్ఞంలో ముస్లిం మహిళ
మానుకోటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్ఎస్.లోయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గణేశ్ గాయత్రి యజ్ఞం నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక విద్యార్థులు మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి పాఠశాలలో ప్రతిషి్ఠంచి పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న ముస్లిం మహిళ జహేరా.. గణేశ్ గాయత్రి యజ్ఞంలో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటేనని.. ప్రజలందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరారు. – మహబూబాబాద్ రూరల్ -
ఎస్ఎస్ఏలో ఎస్వో, సీఆర్టీలకు బదిలీలు
– 11ఏళ్లలో రాష్ట్రస్థాయిలో రెండోసారి – రెండేళ్లుదాటì న ఎస్వోలు, మూడేళ్లదాటిన సీఆర్టీలకు – 3,168 మందికి స్థాన చలనం, బదిలీల షెడ్యూలు జారీ బి.కొత్తకోట (చిత్తూరుజిల్లా): సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఒకేచోట ఏళ్లతరబడి పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు, సీఆర్టీ (కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్స్), పీఈటీ ల బదిలీలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్ఎస్ఏ రాష్ట్రప్రాజెక్టు అధికారి జి.శ్రీనివాస్ జారీచేసిన ఉత్తర్వులు మంగళవారం రాత్రి జిల్లాల పీవో కార్యాలయాలకు చేరాయి. విద్యాలయాలు ప్రారంభమైన 11ఏళ్లలో రాష్ట్రస్థాయిలో బదిలీలకు శ్రీకారం చుట్టడం ఇది రెండోసారి. దీంతో రాష్ట్రంలోని 352 విద్యాలయాల్లో పనిచేస్తున్న 3,168 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆయా జిల్లాల్లోని ఇతరా విద్యాయాలకు బదిలీలు కానున్నారు. రాష్ట్రంలో 2005–06లో కేజీబీవీలను ప్రారంభించగా ఒక్కో విద్యాలయానికి ఒక ప్రత్యేకాధికారి, ఏడుగురు సబ్జెక్ట్ టీచర్లు, ఒక పీఈటీలను నియమించారు. ప్రారంభంనుంచి వీరికి ఒకసారి మాత్రమే రాష్ట్రస్థాయిలో బదిలీలను నిర్వహించగా మళ్లీ రెండోసారి బదిలీలు చేపట్టారు. వెబ్ ద్వారా బదిలీలు జూన్ ఒకటినాటికి ఒకేచోట రెండేళ్లు పూర్తిచేసుకున్న ఎస్వోలు, మూడేళ్లు పూర్తిచేసుకున్న సీఆర్టీలు బదిలీలకు అర్హులు. బదిలీల్లో ప్రాధాన్యతలను నిర్ణయించారు. గడచిన మూడేళ్లు 10వ తరగతి మంచి ఫలితాలు సాధించడం, తరగతుల్లో బాలికల సంఖ్య నిలకడగా ఉంటే వారికి అదనపు పాయింట్లు ఇస్తారు. అలాగే 100శాతం విద్యార్థుల నమోదు, చట్ట పరిధిలో విడాకులు పొందినవారు, భర్త ప్రభ్వుత ఉద్యోగి అయివుంటే, అంగవైకల్యం కలిగివున్నా, అవివాహితులై ఉన్నా వారికి అదనపు పాయింట్లు ఇస్తారు. వీరందికి బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తారు. సెపెంబర్ 6న బదిలీల ప్రక్రియ చేపట్టి 30కు పూర్తి చేస్తారు. బదిలీ అయినవాళ్లు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టాల్సివుంటుంది. బదిలీల షెడ్యూల్ ఇదే సెప్టెంబర్ 6–సిబ్బంది వివరాలు, ఖాళీగావున్న పోస్టుల వివరాల నమోదు సెప్టెంబర్ 7–8–దరఖాస్తుదారులు ఎక్కడికి బదిలీకావాలో కోరుకోవడం సెప్టెంబర్ 12–దరఖాస్తుల పరిశీలన సెప్టెంబర్ 17–దరఖాస్తు లోపాల సవరణ పూర్తి చేయుట సెప్టెంబర్ 19–21–జిల్లాల పీఓలు సిద్దంచేసిన తుది జాబీతా ఎస్పీఓ పరిశీలన సెప్టెంబర్ 22–23–పీఓ, ఎస్పీఓ కార్యాలయాల్లో తాత్కాలిక సీనియారిటీ జాబీతా ప్రదర్శన సెప్టెంబర్ 24–27–సీనియారిటీ జాబీతాపై అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబర్ 28–29–అభ్యంతరాలను పరిష్కరించి, తుది జాబీతా ప్రకటన సెప్టెంబర్ 30–బదిలీలు, ఉత్తర్వులు జారీ -
కేజీబీవీలో అగ్ని ప్రమాదం
వీరఘట్టం : రేగులపాడు గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో పాఠశాలలోని కిచెన్ రూంలో వంటలు వండుతుండగా గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు ఉధృతంగా మారాయి. ఈ సమయంలో గ్యాస్ వండుతున్న సిబ్బంది గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చి తరగతి గదుల్లో ఉన్న విద్యార్థినిలను అప్రమత్తం చేశారు. దీంతో విద్యార్థినిలు హాహాకారాలు చేస్తూ పాఠశాల నుంచి బయటకు వచ్చేయగా, అక్కడే ఉన్న కొంతమంది సిబ్బంది, సీఆర్టీలు మేల్కొని ఇసుకను లీకైన గ్యాస్సిలిండర్ పైకి వేయడంతో పాటు మంటలు అదుపులోకి రాగానే కిచెన్రూంలోని మిగిలిన గ్యాస్ సిలిండర్లును బయటకు నెట్టివేశారు. గ్యాస్ లీకైన సిలెండర్లో తక్కువ గ్యాస్ ఉండడంతో ప్రమాదం అదుపులోకి వచ్చింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఈ-లెర్నింగ్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 30 మోడల్ స్కూళ్లు, 46 కస్తుర్బాగాంధీ బాలికా విద్యాల యాల్లో (కేజీబీవీ) ఈ-లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యాశాఖ, రోటరీ ఇండియా లిటరసీ మిషన్ సంయుక్తాధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని 50 జిల్లా పరిషత్తు పాఠశాలల్లోనూ పెలైట్ ప్రాజెక్టు కింద ఈ-లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆ తరువాత ఇతర పాఠశాలలు, జిల్లాలకు విస్తరించే అవకాశాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఆన్లైన్ ఆధారంగా ఈ-లెర్నింగ్ కేంద్రాల్లో విద్యార్థులకు బోధనను అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఒక్కో స్కూల్లో ఈ-లెర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ. 30 వేల చొప్పున వెచ్చించనుంది. డిజిటల్ తరగతులు.. మరోవైపు రాష్ట్రంలోని 5,200 పాఠశాలల్లో త్వరలోనే డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్ప టికే 70 శాతం ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్కు అవసరమైన ప్రొజెక్టర్లు ఉన్నాయి. దీంతో డిజిటల్ తరగతులు, లెర్నింగ్ను దశల వారీగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ను సిద్ధం చేశారు. వీలైన చోట ఆన్లైన్లో పాఠ్యాంశాల బోధన చేపడతారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో 250 స్కూళ్లలో, ఐటీ శాఖ ఆధ్వర్యంలో 500 స్కూళ్లలో మొదట అమలు చేస్తారు. ఆ తర్వాత మిగతా పాఠశాలలకు వర్తింపజేస్తారు. ప్రైమరీ విద్యార్థుల కోసం యూనిసెఫ్ ఆధ్వర్యంలో టాకింగ్ బుక్స్ సిద్ధం చేశారు. ఇందులో ఏదేనీ బొమ్మ, పదంపై పెన్ను పెట్టగానే అదేంటన్న దానిపై వాయిస్ వస్తుంది. దీనిని ఆరునెలల్లోగా అమల్లోకి తెస్తారు. -
16న కేజీబీవీ స్పెషలాఫీసర్ల పరీక్ష ఫలితాలు
విద్యారణ్యపురి : జిల్లాలోని కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఐదు స్పెషల్ ఆఫీసర్ల పోస్టులకు జూలై 29 న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను ఈనెల 16న వెల్లడించనున్నట్లు ఏజేసీ, సర్వశిక్షాభియాన్ జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు ఆఫీసర్ తిరుపతిరావు వెల్లడించారు. ఐదు పోస్టులు భర్తీ చేయనుండగా, రెండింటిని దృష్టి లోపం, మూగచెవిటి అభ్యర్థినులకు కేటాయిం చారన్నారు. ఉత్తీర్ణుల్లో మూగ, చెవిటి, దృష్టిలోపం ఉన్న వారు ఎవరైనా ఉంటే ఈనెల 16న హాజరు కావాలని సూచించారు. -
అధ్వానంగా కేజీబీవీల నిర్వహణ
ఏప్రిల్ నుంచి రూపాయి కూడా మంజూరుకు నోచుకోని వైనం మూడు నెలలలుగా ఎస్ఓలు, సిబ్బందికి జీతాల్లేవ్ ఎనిమిది నెలలుగా విద్యార్థులకు అందని ఉపకారవేతనం అనంతపురం ఎడ్యుకేషన్ : అనాథలు, చదువుకుంటూ మధ్యలో బడిమానేసిన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) నిర్వహణ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. మూన్నెళ్లుగా నిర్వహణకు పైసా కూడా విడుదల చేయకపోవడంతో ప్రత్యేకాధికారుల(ఎస్ఓలు) కష్టాలు వర్ణణాతీతం. నిత్యావసర సరుకులు టెండరుదారులు సరఫరా చేస్తుండగా, రోజువారి అవసరమయ్యే కూరగాయలు, అకుకూరలు, పాలు తదితర వాటి కొనుగోలుకు పలు ఇబ్బందులు పడుతున్నారు. నెలంతా ఖర్చు చేసి నెలతర్వాతైనా బిల్లులు వస్తాయంటే అవీ ఇవ్వడం లేదని ఎస్ఓలు వాపోతున్నారు. వీటికి తోడు కరెంటు బిల్లులు చెల్లించలేక, గ్యాస్ సిలిండర్ల కొనుగోలు చేయలేక దిక్కులు చూస్తున్నారు. ఈ రెండింటికీ నెలకు దాదాపు రూ. 25 వేలు దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కరెంటు బిల్లు ఆలస్యమైతే అపరాధ రుసుం పడుతోంది. సిలిండర్లకు డబ్బు చెల్లించకపోతే ఇవ్వడం లేదు. బిల్లులు పెండింగ్ కారణంగా మెనూ అమలు గాలికి వదిలేస్తున్నారు. మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో మొన్నటిదాకా 36 కేజీబీవీలు ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో నడుస్తుండగా, 18 కేజీబీవీలు ఏపీఆర్ఐఈ సొసైటీ కింద, 5 కేజీబీవీలు గిరిజన సంక్షేమశాఖ, 3 కేజీబీవీలు సాంఘిక సంక్షేమశాఖ కింద పని చేసేవి. అయితే గత నెలలో అన్నీ ఒకే గొడుగుకిందకి చేరాయి. వీటిల్లో సుమారు 12 వేల మంది దాకా విద్యార్థినులు చదువుతున్నారు. మూడు నెలలుగా అవస్థలు కేజీబీవీల నిర్వహణ ఇక్కట్లు ఇలా ఉంటే.. మరోవైపు మూడు నెలలుగా వారికి జీతాలు మంజూరు కాలేదు. ఎస్ఓలు మొదలుకుని సీఆర్టీలు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఏప్రిల్, జూన్, జూలై నెలల జీతాలు రాలేదు. నిర్వహణ బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మాజీతాలు కూడా ఇవ్వకుండా పెండింగ్ పడుతున్నారని కొందరు ఎస్ఓలు వాపోతున్నారు. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఓ కేజీబీవీ ఉద్యోగిని వాపోయింది. సబ్బులూ కొనలేదంటున్న విద్యార్థినులు ఉపకారవేతనం రాక విద్యార్థినులు అగచాట్లు పడుతున్నారు. నెల కాదు రెన్నెళ్లు కాదు ఏకంగా ఎనిమిది నెలలుగా విద్యార్థినులకు ఉపకార వేతనం అందలేదు. వ్యక్తిగత అవసరాల కోసం నెలకు ఒక్కో విద్యార్థినికి రూ. 100 ఇవ్వాల్సి ఉంది. నవంబర్ నుంచి ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సబ్బులు, నూనె, ఇతర వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వస్తువులను కొనడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కేజీబీవీలో గ్యాస్ పైపు లీక్
సీతంపేట : సీతంపేట కస్తూరిబా గాంధీ పాఠశాలలో మంగళవారం ఉదయం గ్యాస్పైపు లీకైంది. దీంతో మంటలు చేలరేగాయి. విద్యార్థినులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐ జగన్నాధరావు పాఠశాలకు చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యార్థినుల కోసం ఉదయం పూట రాగిజావ వండే సమయంలో పైపు లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం కొండగొర్రె సుబ్బారావు పాలకొండ అగ్నిమాపక శకటానికి ఫోన్ చేశారు. శకటం వచ్చేసరికే మంటలను అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో ప్రత్యేకాధికారిణి రేవతితో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఐటీడీఏ, ఆర్వీఎంకు సమాచారం చేరవేశారు. -
రేపు కేజీబీవీ ప్రత్యేక అధికారుల రాత పరీక్ష
నల్లగొండ టూటౌన్ : కేజీబీవీ ప్రత్యేక అధికారులు రాతపరీక్ష శుక్రవారం నల్లగొండలోని డైట్ కళాశాలలో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనున్నట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ కిరణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్టికెట్లను నల్లగొండలోని సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పొందాలని కోరారు. తిరస్కరించిన అభ్యర్థుల దరఖాస్తు వివరాలు కార్యాలయం నందు, టట్చnlజ.ఠ్ఛీbట.ఛిౌఝ పొందుపర్చినట్లు పేర్కొన్నారు. -
అవినీతి భాండాగారం
కేజీబీవీలకు సరుకుల కొనుగోళ్లలో చిలక్కొట్టుడు తప్పుడు బిల్లులతో మాయాజాలం వాటిలోనూ యథేచ్ఛగా దిద్దుబాట్లు తక్కువ సరుకు కొనుగోలు.. ఎక్కువ మొత్తానికి బిల్లు డీలర్లతో కేంద్రీయ భాండార్ అధికారుల కుమ్మక్కు ఇష్టారాజ్యంగా చెల్లింపులకు సిఫారసులు మీరు ఈరోజు ఒక షాపుకెళ్లి ఏదో వస్తువు కొన్నారు. దానికి రసీదు తీసుకున్నారు. దానిపై ఒక నెంబర్ ఉంటుంది...మరుసటి రోజు అదే షాపునకు వెళ్లి ఇంకేదో వస్తువు కొని రసీదు అడిగితే ఏ నెంబరు రసీదు ఇస్తారు.. సహజంగా నిన్నటి రసీదు తర్వాతి నెంబరే వస్తుంది కదా!..కానీ దాని ముందు నెంబరుతో రసీదు ఇస్తే.. ఖచ్చితంగా అక్కడేదో మతలబు జరుగుతోందనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కస్తూర్బాగాంధీ విద్యాలయాలకు సరుకుల సరఫరాలో అదే జరుగుతోంది..! కావాలంటే ఈ బిల్లులు చూడండి.. జూన్ 4వ తేదీన తీసుకున్న సరుకులకు 0885 నెంబర్ బిల్లు ఇచ్చారు..అక్కడికి 14 రోజుల తర్వాత అంటే.. జూన్ 18న తీసుకున్న సరుకులకేమో దానికి ముందున్న 0880 బిల్లు ఇచ్చారు.అదెలా సాధ్యం.. అసలక్కడేం జరుగుతోంది?.. అన్న అనుమానాలొస్తున్నాయి కదూ..కానీ ఘనత వహించిన కేంద్రీయ భాండార్ అధికారులకు మాత్రం అటువంటి అనుమానాలు లేశమాత్రమైనా కలగడం లేదు. వాటిని యథాతథంగా చెల్లింపులకు సి‘ఫార్సు’ చేసేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఎ) పరిధిలో కేంద్రీయ భాండార్ సరకులు సరఫరా చేస్తున్న అన్ని కేజీబీవీల్లోనూ ఇదే తతంగం నడుస్తోంది. తేదీలు, బిల్లు నెంబర్లలో మాయాజాలమే కాదు.. ఏకంగా బిల్లుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు కూడా చోటుచేసుకుంటున్నాయి. అదేమని అడిగితే ఏదో పొరపాటున జరిగిందని తేలిగ్గా తీసిపారేస్తారు. ఈ తంతు ఒక్క నెలకో, ఏ రెండు కేజీవీబీలకో పరిమితం కాలేదు. అసలు కేంద్రీయ భాండార్ బండారమేమిటో ఓసారి పరిశీలిస్తే... రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)కు విశాఖలో ఉన్న కేంద్రీయ భాండార్ పాలు, కూరగాయలు మినహా అన్ని నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తుంది. అదే విధంగా జిల్లాలోని 18 కేజీబీవీలకు ప్రతి నెలా కేంద్రీయ భాండార్ సరకులు అందిస్తోంది. ఈ మేరకు ముగ్గురు రిజిస్టర్ట్ డీలర్లను నియమించుకుంది. వారు అనకాపల్లి, యలమంచిలి, విశాఖ పూర్ణామార్కెట్లోని హోల్సేల్ దుకాణాల్లో సరుకులు కొని కేజీబీబీలకు సరఫరా చేస్తారు. ఆ బిల్లులను కేంద్రీయ భాండార్కు అందిస్తే.. సదరు భాండార్ అధికారులు ఆ బిల్లులను పరిశీలించి చెల్లింపుల కోసం సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)కు పంపిస్తారు. ఎస్ఎస్ఏ అధికారులు ఆ బిల్లు మొత్తాలను చెక్కుల రూపంలో కేంద్రీయ భాండార్ ఖాతాలో జమ చేస్తారు. అయితే చెప్పినంత సవ్యంగా ఇదంతా జరగడంలేదు. బిల్లుల చెల్లింపులో భాండార్ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. తప్పుడు తేదీలతో బిల్లులు, దిద్దుబాటు బిల్లులను క్లెయిమ్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఒక్కో కేజీబీవీకి నెలకు రూ. 60 వేల నుంచి రూ. 70వేల సరకులు కొనుగోలు చేస్తుంటారు. ఇలా జిల్లాలోని 18 కేజీబీవీలకు ప్రతి నెలా రూ. 10 లక్షలకు పైగానే కొనుగోళ్లు చేస్తున్నారు. డీలర్లు హోల్సేల్ షాపుల వద్ద తక్కువ మొత్తంలో సరుకులు కొని ఎక్కువ మొత్తానికి బిల్లులు రాయించి కేంద్రీయ భాండార్కు పంపిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. భాండార్ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా డీలర్లు ఇచ్చిన తప్పుడు బిల్లులనే చెల్లింపులకు సిఫార్సు చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. తిరోగమన పథంలో ఉన్న ఫొటోల్లోని రెండు బిల్లులు, వాటిలోని దిద్దుబాట్లు వీటిని బలపరుస్తున్నాయి. ఎక్కడో పొరపాటు జరిగింది ఇదే విషయాన్ని సాక్షి ప్రస్తావిస్తే.. ‘వాస్తవానికి ఎక్కడో పొరపాటు జరిగింది. అందుకే బిల్లు నెంబర్లలో తేడా వచ్చింది. అంతే కానీ అవినీతి జరగలేదు. డీలర్లతో కుమ్మక్కు అయ్యామన్న వాదనల్లో నిజం లేదు. ప్రతి బిల్లు వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తాం’.. అని కేంద్రీయ భాండార్ డివిజనల్ ఇన్చార్జి జి.నరేంద్రకుమార్ చెప్పారు. -
కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం
గూడూరు : గూడూరు శివారు బ్రాహ్మణపల్లిలోని కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి అదృశ్యమైన ఓ బాలిక సోమవారం ఉదయం ప్రత్యక్షమైనట్లు తెలిసింది. వివరాలిలా.. మట్టెవాడకు చెందిన బాలిక స్థానిక కేజీబీవీలో 6వ తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం బాలిక తల్లి పాఠశాలకు వచ్చి, కూతురును కల్సి, తనకు జ్వరం వస్తోందని చెప్పింది. కూతురును బాగా చదువుకోమ్మని చెప్పి వెళ్లింది. కాగా, బాలిక రాత్రి ఎవరికీ చెప్పకుండా గేటు దూకి బయటికి వెళ్లిందని, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బ్రాహ్మణపల్లిలోని ఆమె పిన్ని ఇంటి వద్ద నిలబడి ఉందని తెలిసింది. ఆదే సమయంలో పాఠశాలకు పాల వ్యాన్ వస్తుండగా, ముందుగా వస్తున్న పనిమనిషికి బాలిక కనిపించింది. ‘ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావ్, ఏం చేస్తున్నావ్, ఎలా వచ్చావ్’ అని మందలించి తనతో పాఠశాలకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ మాధవిని వివరణ కోరగా బాలిక తల్లిపై బెంగతో ఉదయం 3 గంటలకు గేటు దూకి పిన్ని వాళ్లింటికి వెళ్లిందని, గుర్తించిన పనిమనిషి వెంటనే పాఠశాలకు తీసుకొచ్చిందని తెలిపారు. -
ధరల దరువు బతుకు బరువు
♦ భయపెడుతున్ననిత్యావసర వస్తువులు ♦ మండుతోన్న కూరగాయల ధరలు ♦ మార్కెట్లో దళారుల మాయాజాలం ♦ జీవనం కష్టంగా మారిందంటున్న ♦ పేద, మధ్యతరగతి ప్రజలు కేజీబీవీల నిర్వహణ ♦ బహుకష్టంగా మారిన వైనం జేబులో వంద, రెండువందలో డబ్బులు పెట్టుకుని మార్కెట్కు వెళితే సరుకులతో సంచి నిండి ఇంటికొచ్చే రోజులుపోయాయి. కనీసం రూ.2000 ఉంటేగానీ సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అదీ అరకొరనే. పప్పులు నిప్పులవ్వుతున్నాయ్. నూనెలు సలసల కాగుతున్నాయ్. కూరలు కరుస్తున్నాయ్.. బియ్యం భయపెడుతున్నాయ్.. ఇక మధ్య తరగతి, సామాన్యుల నోటికి మాంసం ముక్క చిక్కడం లేదు. కనీసం కోడి గుడ్డు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. దళారుల మాయాజాలంలో మార్కెట్ నడుస్తోంది. ధరలను నియంత్రించే పరిస్థితి లేకపోవడంతో ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. సాక్షి ప్రతినిధి, కడప: మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు దడపుట్టిస్తున్నాయి. కూరగాయలు మొదలు అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీంతో సగటు మధ్యతరగతి జనాల బతుకు భారమైంది. ధరలు చూసి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలీ పనిచేసి జీవించే పేదలకు ఈ ధరలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. నెలరోజుల కిందటికీ ఇప్పటీకీ అటు నిత్యావసర వస్తువులు ఇటు కూరగాయాల ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. జిల్లాలోని మున్సిపాలిటీలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు ధరాఘాతంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు నెలాఖరున మాత్రమే ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు నెలంతా ఇబ్బందిగానే మారింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటినా సర్కారు నియంత్రించలేకపోతోంది. ధరల మానిటరింగ్ కమిటీ ఉన్నా ఉపయోగంలేదు. సామాన్యుడు సన్న బియ్యం తినలేని పరిస్థితి నెలకొంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సన్న బియ్యం కిలో నెల కిందట రూ.40లుండగా, తాజాగా కిలో రూ.48కు చేరింది. నిప్పులు కురిపిస్తున్న పప్పుల ధరలు నిత్యం ఉపయోగించే కందిపప్పుతో పాటు అల్పాహారాలలో వినియోగించే ఉద్దిపప్పు, పెసరపప్పు ధరలు నింగిని తాకుతున్నాయి. వేరుశనగ విత్తనాల ధరలు అదేస్థాయిలో ఉన్నాయి. రెండు నెలల నుంచి ఆయా పప్పుల ధరలు నిప్పులను కురిపిస్తున్నాయి. దీని ప్రభావం కుటుంబ బడ్జెట్పై చూపుతోంది. మంచిరకం కందిపప్పు కిలో నెల కిందటి వరకు రూ.120 ఉండగా నేడు కిలో రూ.180 పలుకుతోంది. మిన పప్పు కిలో రూ.130 ధర ఉండగా ఉన్నట్లుండి కిలో రూ.180లకు చేరుకుంది. కందిపప్పు, మినపప్పు మధ్యలో రూ.200ను కూడా దాటింది. అలాగే పెసరపప్పు కిలో రూ.80ల నుంచి నేడు రూ.120లకు చేరుకుంది. వేరుశనగ పప్పు కూడా రూ.100పైనే ఉంది. పప్పులు కూడా కిలో రూ.65ల నుంచి రూ.100లకు చేరుకున్నాయి. అలాగే ఎండుమిరప, తెల్లగడ్డలు ధరలు ఘాటెక్కుతున్నాయి. ఇవి మొన్నటివరకు కేవలం రూ. 70నుంచి 80లకు మించి పలకలేదు. తాజాగా ఎండుమిరప కిలో రూ.185గాను, తెల్లగడ్డలు కిలో రూ. 200ల ధర పలుకుతున్నాయి. చేతికందని మాంసం ముక్క.. మాంసం పేరెత్తితేనే సామాన్యుడు హడలిపోతున్నాడు. మాంసం ధరలు నొటికందనంత దూరంలో ఉంటున్నాయి. మాంసం కిలో రూ. 450కి చేరుకుంది. అలాగే చికెన్ ధరలు రూ. 170 నుంచి 210 పలుకుతున్నాయి. అదివారం అదనం. అదేవిధంగా చేపలు ఆయా రకాలను బట్టి కిలో రూ.200 నుంచి 450లు, రొయ్యలు రూ.350 నుంచి 520 పలుకుతున్నాయి. ఇక కోడిగుడ్లు చవకగా ఉన్నాయనుకుంటే పొరపాటే. డజను గుడ్లు మార్కెట్లో రూ.55 నుంచి 60 వరకు ధర పలుకుతున్నాయి. బహుకష్టంగా మారిన కేజీబీవీల నిర్వహణ ‘సీత కష్టాలు సీతవి...పీత కష్టాలు పీతవి’ అన్నట్లుగా కూరగాయల ధరలు పెరగడంతో ప్రభుత్వ హాస్టల్స్ నిర్వహణ బహుకష్టంగా మారింది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నెలకు రూ.90 చెల్లిస్తుంది. ఒక్కో విద్యార్థికి సరాసరిన నెలకు 6 కిలోలు కూరగాయాలు (ఆకుకూరలతో కలిపి)వాడాల్సి ఉంది. కిలో రూ.15 చొప్పున నెలకు రూ.90 మాత్రమే చెల్లిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆ మొత్తానికి ఒక్క కిలోతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నెల పొడువునా ఒక్కొక్క విద్యార్థికి ఒక కిలో కూరగాయలతో నెట్టుకురావడం అసంభవమని బాధ్యులు వివరిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన భోజనం పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. వాస్తవంలో పప్పుదినుసులు, కూరగాయాల ధరలు ఆకాశాన్ని అంటుతోన్నాయి. ఈతరుణంలో కేవీజీబీ బాధ్యులకు హాస్టల్ నిర్వహణ బహుకష్టంగా మారింది. ప్రస్తుతం తమ బాధలను చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని, చెప్పుకున్నా పట్టించుకునే నాథుడులేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో దళారుల మాయాజాలం... ధరలు అమాంతం పెరగడానికి మార్కెట్ మాయాజాలమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. మార్కెట్లో స్టాకు తక్కువగా చూపుతూ వ్యాపారులు, దళారులు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాలో రోజుకు వినియోగదారులు అన్నిరకాల కూరగాయలను కలిపి 356 మెట్రిక్ టన్నులు వాడుతున్నారని అధికారుల అంచనా. రైతుల వద్ద వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిని మార్కెట్లోని వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తుండటం వల్ల ధరలు అమాంతం పెరుగుతున్నాయని పలువురు వివరిస్తున్నారు. నిత్యావసర వస్తువులు సైతం రైతుల వద్ద దిగుబడి ఉన్నంతవరకూ ధరలు ఉండటం లేదు. తర్వాతే మండిపోతున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. -
మహిళా సమాఖ్యలకు
కేజీబీవీల పగ్గాలు ప్రతి నెలా రూ.1000 ఇవ్వాలని నిర్ణయం పనితీరు ఆధారంగా సొమ్ము పెంచే అవకాశం పర్యవేక్షణకు ప్రత్యేక వెబ్సైట్ భానుగుడి (కాకినాడ) : ఇప్పటివరకూ అధికారుల పర్యవేక్షణలో ఉన్న కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ఇకనుంచి మహిళా సమాఖ్యలకు అప్పగించనున్నారు. బడి మధ్యలో మానేసిన విద్యార్థినులకు, తల్లితండ్రులు వదిలేసిన వీధి బాలికలవంటివారికి విద్యాసుగంధాన్ని అందించేందుకు కేజీబీవీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని తుని, తొండంగి, కోటనందూరు, శంఖవరం, గంగవరం, వై.రామవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, కోటనందూరు, వీఆర్ పురం, ఎటపాక మండల కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. వీటిల్లో 2,282 మంది విద్యార్థినులు 6 నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. ఈ విద్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.6 కోట్లు వెచ్చిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఉండడంతో ఈ విద్యాలయాలను పర్యవేక్షించడం అధికారులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వీటి పర్యవేక్షణ బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించాలని కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల సభ్యులకు అధికారులతో శిక్షణ ఇస్తున్నారు. మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు, ప్రతి రోజూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.కేజీబీవీల నిర్వహణకు హేస్ట్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ఎస్ఎఎంఎస్ వెబ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ప్రతి కేజీబీవీలోనూ ఉదయం 8.30 గంటలకే విద్యార్థినుల హాజరు ఈ వెబ్సైట్లో నమోదు కావాలి. విద్యార్థులు, ఉద్యోగుల హాజరంతా ఈ వెబ్సైట్ ద్వారా జిల్లా అధికారులు తెలుసుకోవచ్చు. తద్వారా విద్యార్థినుల హాజరు శాతం పెంచవచ్చని అధికారులు అంటున్నారు.కేజీబీవీల పర్యవేక్షణకు సంబంధించి మహిళా సమాఖ్యకు ప్రతి నెలా రూ.1000 ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించారు. మహిళా సంఘాల పనితీరు ఆధారంగా ఈ సొమ్ము పెంచే అవకాశాలున్నాయి. -
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
- ఆర్వీఎం నియామకాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు సంగారెడ్డి మున్సిపాలిటీ : సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు వారిని తిరిగి దొడ్డిదారిలో విధుల్లోకి తీసుకొంటూ రూ. లక్షలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలన్నా, తొలగించాలన్న రాష్ట్ర ప్రాజెక్టు అధికారి అనుమతితోనే చేపట్టాల్సి ఉంటుంది. అయితే మామూళ్లు దండుకొని దర్జాగా కోరిన చోట పోస్టింగ్లు ఇస్తున్నారు. గత మార్చిలో ములుగు కస్తూర్బాగాంధీ బాలిక హాస్టల్ ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అప్పట్లో జిల్లా ఆర్వీఎం పీఓ ప్రకటించారు. అయితే అధికారులకు మామూళ్లు ముట్టడంతో జేసీడీఓ స్థాయి అధికారితో పాటు కార్యాలయంలోని ప్రధాన విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి డబ్బులు దండుకొని ఆ ప్రత్యేకాధికారికి చిన్న కొడూర్ మండలం అల్లీపూర్ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. చిన్న కోడూర్ మండలం అల్లీపూర్లో పనిచేస్తున్న ప్రత్యేకాధికారి తనకు దూరమవుతున్నందున ములుగు బదిలీ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఆమెకు అక్కడ కాకుండా రాయికోడ్కు బదిలీ చేశారు. నంగునూర్ మండల పరిధిలోని నర్మెటలో పనిచేస్తున్న హాస్టల్ ప్రత్యేక అధికారిపై విద్యార్థులు ఆరోపణలు చేయడంతో సిద్దిపేట ఆర్డీఓ విచారణ చేపట్టారు. దాని ఆధారంగా ఆమెను సెస్పెండ్ చేశారు. అనంతరం జేసీడీఓ ప్రకాశ్రావు శాఖా పరమైన విచారణ చేపట్టి ఆమెను తొలగించారు. అయితే 45 రోజుల తరువాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఇవి కేవలం కొన్ని ఉదహారణలు మాత్రమే. అయితే కింది స్థాయి సిబ్బందిని తొలగించి, తిరిగి తీసుకోవడంలో అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఇలా ప్య్రతేకాధికారుల వ్యవహరమే కాకుండా సీఆర్టీలో సైతం డబ్బులు దండుకొని బదిలీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై జేసీడీఓ ప్రకాశ్రావు మాట్లాడుతూ సస్పెన్షన్కు గురైన ఎస్ఓలు తమ తప్పును ఒప్పుకోవడంతో కలెక్టర్ వారిని తీసుకోవాలని సూచించడంవల్లే తీసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియమకాలు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసే నాన్ టీచింగ్ సిబ్బందిని గుర్తుంపు పొందిన ఏజెన్సీల ద్వారానే నియమించాలి. అయితే నిబంధనలను పట్టించుకోకుండా డబ్బులు దండుకొని ఇష్టానుసారంగా నియమాకాలు చేస్తున్నారు. ఎవరైనా అడిగితే మాత్రం ఏజెన్సీల ద్వారానే నియమించడం జరుగుతుందని సమాచార హక్క చట్టం కింద ఆర్వీఎం శాఖకు చెందిన జేసీడీఓ పేర్కొన్నారు. చిన్నకోడూర్ కేజీబీవీలో స్థానిక నాయకులు, ఆర్వీఎం జిల్లా అధికారులకు ముడుపులు చెల్లించడం వల్లే తీసుకోవడం జరిగిందనే ఆరోపణలున్నాయి. మరో వైపు స్థానిక ఎంఈఓ,ఎంపీడీఓ, ఎస్ఓ తదితరులు కుమ్మకై అడ్వయిజరీ కమిటీ పేరుతో డబ్బులు తీసుకొని అర్హత లేని వారిని నియమించారనే ఆరోపణలు వచ్చాయి. స్పందించని పీఓ ఎస్ఓలను తిరిగి విధుల్లో తీసుకునే విషయంలో ముడుపులు తీసుకుంటున్నారనే విషయమై పీఓను వివరణ కోరే ందుకు ప్రయత్నించినా స్పందించలేదు. -
మరో దారుణం
- కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని వంచించిన కానిస్టేబుల్ - ఓ ఉద్యోగిని సహకారం - గోప్యంగా ఉంచిన సిబ్బంది అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మరో దారుణం వెలుగుచూసింది. మొన్న ఓ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని ప్రసవించిన ఘటన మరువకముందే.. మరోచోట తొమ్మిదో తరగతి విద్యార్థిని వంచనకు గురైంది. కళ్యాణదుర్గం ప్రాంతంలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పరిధిలో నడుస్తున్న ఓ కేజీబీవీలో చదువుతున్న సదరు విద్యార్థినిని ఓ పోలీస్ కానిస్టేబుల్ లోబర్చుకుని వాంఛ తీర్చుకున్నాడు. అతనికి ఓ ఉద్యోగిని సహకరించింది. కానిస్టేబుల్కు సదరు ఉద్యోగినితో ఉన్న చనువుతో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై కన్నేశాడు. ఆర్థిక, ఇతర అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగిని ద్వారా విద్యార్థినిని లోబర్చుకున్నాడు. ఉద్యోగిని కూడా విద్యార్థినికి మాయమాటలు చెప్పి ట్రాప్లో పడేలా చేసింది. ఏది మంచో, ఏది చెడో గ్రహించలేని వయసులో ఉన్న ఆ విద్యార్థినితో కానిస్టేబుల్ పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. రెండు మూడు సార్లు నేరుగా కేజీబీవీకి వెళ్లి విద్యార్థినిని బైకులో ఎక్కించుకెళ్లి తిరిగి వదిలిపెట్టినట్లు తెలిసింది. పోలీస్ కావడంతో కేజీబీవీ సిబ్బంది కూడా గట్టిగా చెప్పలేకపోయారనే ప్రచారముంది. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడితే తమకు ఇక్కట్లు తప్పవని భావించిన నిర్వాహకులు సదరు విద్యార్థిని బంధువులను పిలిపించి పంచాయితీ పెట్టారు. తమ అమ్మాయిదే తప్పు అని, మరోసారి ఇలా జరిగితే తామే బాధ్యులమని వారితో రాయించుకున్నట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ కోన శిశధర్ పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముంది. తమకు సంబంధం లేదన్నట్టు నివేదిక? ఇటీవల జిల్లాలోని ఓ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని ప్రసవం కేసును సీరియస్గా పరిగణించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించింది. వివిధ శాఖల అధికారులు విచారణ చేసి నివేదికలు ఇచ్చారు. ఎస్ఎస్ఏ అధికారులు మాత్రం సదరు కేజీబీవీ పర్యవేక్షణను ఏపీఆర్ఐఈ సొసైటీ చూస్తుందని, తమకు ఎంతమాత్రమూ సంబంధం లేదని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 36 ఏపీ సర్వశిక్ష అభియాన్,18 ఏపీఆర్ఐఈ సొసైటీ, 5 గిరిజన సంక్షేమశాఖ, 3 సాంఘిక సంక్షేమశాఖ పర్యవేక్షణలో నడుస్తున్నాయి. బిల్లులు, సిబ్బంది వేతనాలు ఆయా పర్యవేక్షణ సంస్థలు చెల్లించినా.. సిబ్బంది రిక్రూట్మెంట్, బదిలీలు ఇలా పలు బాధ్యతలను ఎస్ఎస్ఏ అధికారులే చూస్తున్నారు. -
కేజీబీవీల్లో భద్రతెంత?
అనంతపురం ఎడ్యుకేషన్ : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)లో అమ్మాయిల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు రెసిడెన్షియల్ విధానంలో అమలువుతున్న కేజీబీవీల పర్యవేక్షణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. వారం రోజుల కిందట జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వనీయ సమాచారం మేరకు...సదరు కేజీబీవీ నుంచి ఇద్దరు అమ్మాయిలు రాత్రి 11 గంటల సమయంలో బయటకు వెళ్లారు. తిరిగి తెల్లవారుజామున 3 గంటల సమయంలో కేజీబీవీకి వచ్చారు. ఇదే సమయంలో సిబ్బంది వారిని గుర్తించారు. మరసటి రోజు ఉదయాన్నే బంధువులను పిలిపించి అ ఇద్దరి అమ్మాయిలను పంపించేశారు. అయితే రాత్రి విధుల్లో ఉండాల్సిన కేజీబీవీ ఉద్యోగులు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. వారు తిరిగి వచ్చేవరకు విషయం తెలీదంటే సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. రాత్రి సమయంలో అందులో అమ్మాయిలు ఎక్కడికెళ్లారు అనేది అంతుచిక్కడం లేదు. కేజీబీవీ గేటు ద్వారా కాకుండా కాంపౌండ్ దూకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎక్కడికెళ్లారనే దానిపై ఆరా తీస్తే...భయంకరమైన విషయం వెలుగుచూస్తోంది. ఇద్దరు యువకులు వచ్చి ఆ అమ్మాయిలను తీసుకెళ్లినట్లు తెలిసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఊరి చివర్లో ఉన్నట్లు తెలిసింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తిరిగి కేజీబీవీ కాంపౌండు దూకే సమయంలో కొందరు గుర్తించినట్లు సమాచారం. కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది అసలు విషయం తెలిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోనని భావించిన కేజీబీవీ సిబ్బంది విషయం బయటకు పొక్కకుండా కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా అమ్మాయిల బంధువులను పిలిపించి వారికి అసలు విషయం చెప్పి పంపినా....ఎవరైనా అడిగితే హోంసిక్ కారణంగానే పిల్లలను పంపినట్లు చెప్పేలా శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలాఉండగా జిల్లాలో చాలా కేజీబీవీల్లో ఇలాంటి ఘటన వెలుగు చూడడ ం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అమ్మాయిలు ఉండే కేజీబీవీల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై సంబంధించ ఎస్ఓను ఁసాక్షి* వివరణ...హోంసిక్ కారణంగా ఆ ఇద్దరు అమ్మాయిలనూ ఇంటికి పంపామని చెప్పారు. -
పొట్ట కొడుతున్నారు!
కేజీబీవీల్లో మెనూ అమలు గాలికి ఆఫీస్ మెయింటెనెన్స్ పేరుతో దందా అనంతపురం ఎడ్యుకేషన్ : అనాథలు, మధ్యలో బడిమానేసిన ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) స్పెషల్ ఆఫీసర్లు, సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) కార్యాలయంలోని కొందరు అధికారులకు ఆదాయ వనరులుగా మారాయి. వీటిద్వారా ప్రతినెలా లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. కేజీబీవీలను పర్యవేక్షించాల్సిన అధికారుల అండతోనే స్పెషల్ ఆఫీసర్లు ఈ అక్రమాలకు తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు ఎస్ఎస్ఏ సిబ్బంది పెట్టిన పేరు ‘ఆఫీస్ మెయింటెనెన్స్’. జిల్లాలో మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో 36 కేజీబీవీలు ఏపీఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 18 ఏపీఆర్ఐఈ సొసైటీ కింద, 5 గిరిజన సంక్షేమశాఖ, 3 సాంఘిక సంక్షేమశాఖ కింద నడుస్తున్నాయి. వీటిల్లో సుమారు 10,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు . ప్రతినెలా రూ.5 వేలు ఎస్ఎస్ఏ పరిధిలో నడుస్తున్న 36 కేజీబీవీల నుంచి ఆఫీస్ మెయింటెనెన్స్ పేరుతో ఎస్ఎస్ఏలో కొందరు సిబ్బంది దందా చేస్తున్నారు. బిల్లులు చేయాలంటే ఒక్కో కేజీబీవీ నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు చెల్లించాల్సిందే. గతంలో ఎంతోకొంత పుచ్చుకుని బిల్లులు చేసేవారు. ఇటీవల ఓ అధికారి ప్రతి కేజీబీవీకి రూ.5 వేలు ఫిక్స్ చేశారు. గతేడాది నవంబరు నుంచి ఈ దందాకు తెరతీశారు. 36 కేజీబీవీల ద్వారా ప్రతి నెలా రూ.1.80 లక్షలు అప్పనంగా వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంలో వివిధ స్థాయి అధికారులు వాటాలు పంచుకుంటున్నట్లు తెలిసింది. స్పెషలాఫీసర్లు రూ.5 వేలు ముందుగా చెల్లించకపోతే బిల్లులు పాస్ చేయకుండా కొర్రీ వేస్తున్నారు. దీంతో చాలామంది స్పెషలాఫీసర్లు బిల్లులు తెచ్చేటప్పుడే ‘ఆఫీస్ మెయింటెనెన్స్’ కూడా తెచ్చిస్తున్నారు. మెనూ అమలు గాలికి గతంలో ఒక్కో కేజీబీవీలో విద్యార్థుల జాబితాల్లో పదుల సంఖ్యలో బినామీ పేర్లు ఉండేవి. వాటి ద్వారా వచ్చే సొమ్ములో కేజీబీవీ, ఎస్ఎస్ఏ సిబ్బంది వాటాలు పంచుకునేవారు. ఇటీవల ఆధార్ సీడింగ్ జరిగిన తర్వాత బోగస్ విద్యార్థినులు దాదాపు లేరు. ఈ పరిస్థితుల్లో ప్రతి నెలా రూ. 5 వేల ‘ఆఫీసు మెయింటెనెన్స్’ ఇవ్వడం ఇబ్బందే. దీంతో పిల్లల పొట్టకొడుతున్నారు. మెనూ అమలు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా ఏ నిత్యావసర సరుకులూ ఉపయోగించడం లేదు. నీళ్ల పప్పు, నీళ్ల మజ్జిగ, కూరగాయలు లేని సాంబారు, చికెన్, కోడిగుడ్డు.. ఇలా అన్ని విషయాల్లోనూ మమ అనిపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కేజీబీవీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థినుల బంధువులు కోరుతున్నారు. -
ఇక్కట్ల చదువులు!
ఇంటిపేరు కస్తూరి వారు....ఇంట్లో గబ్బిలాల కంపు అన్న చందంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) పరిస్థితి తయారైంది. బాలికల విద్యాభివృద్ధే లక్ష్యంగా, మధ్యలో బడిమానివేసిన వారికోసం ఏర్పాటైన చాలా కేజీబీవీలపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. పైకి భవంతులు బాగా కనిపిస్తున్నా, లోపల సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో విద్యార్థినులు నిత్యం అవస్థలకు గురవుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై పాలకులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. పాఠశాలలకు ప్రహరీలు లేకపోడంతో విద్యార్థినులు నిత్యం అభద్రతాభావానికి గురవుతున్నారు. రక్షణలేక భయం భయంగా చదువులు సాగిస్తున్నారు. వంటగ్యాస్ పంపిణీ అరకొరగా ఉండడం వల్ల కట్టెల పొయ్యిలపైనే ఆహారపదార్థాలు తయారు చేస్తుండడంతో అవి అనారోగ్యానికి హేతువుగా మారుతున్నాయి. కంప్యూటర్లను ఏర్పాటు చేసినా చాలా పాఠశాలల్లో బోధకులు లేరు. మైదానాలున్నా క్రీడా సామగ్రి ఉండదు ఇలా చెప్పుకొంటూ పోతే బాలికల విద్య కోసం సర్వశిక్షాభియాన్ శాఖ సమకూర్చిన సదుపాయాలు అకరకొరగానే కనిపిస్తున్నాయి. కేజీబీవీల్లో బోధన, సౌకర్యాలు, వాళ్లకు కావాల్సి అవసరాలను స్వయంగా తెలుసుకోవడానికి సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారి జి.నాగమణి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారారు. గంట్యాడ మండలంలోని కేజీబీవీ పాఠశాలకు వెళ్లి అక్కడ విద్యార్థినులు, టీచర్లు, ఇతర సిబ్బందితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో జరిపిన సంభాషణ వివరాలు.... పీఓ నాగమణి: (పాఠశాల స్పెషల్ ఆఫీసర్తో) పాఠశాల నిర్వహణపై విద్యార్థినులు, తల్లిదండ్రుల నుంచి ఎప్పుడైనా ఫిర్యాదులు నమోదయ్యాయా...? బడే జ్యోతి (పాఠశాల స్పెషల్ ఆఫీసర్): పాఠశాలలో 200 మంది విద్యార్థుల వరకు వసతి సౌకర్యం ఉంది. ప్రస్తుతం 178 మంది విద్యార్థినులున్నారు. గత ఏడాది నూతన భవనంలోకి వచ్చాం. ఇంతవరకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. పీఓ నాగమణి: అన్ని సబ్జక్టులకు టీచర్లున్నారా ? బడే జ్యోతి: విద్యార్థినుల సంఖ్యకు సరిపడా సబ్జెక్టు టీచర్లున్నారు. కంప్యూటర్ టీచర్ను నియమంచాల్సి ఉంది. అలాగే అదనంగా స్వీపర్ను నియమించాల్సి ఉంది. పీఓ నాగమణి: కంప్యూటర్ టీచర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తారు., మరో స్వీపర్ను పోస్టు కేటాయించడానికి ప్రయత్నిస్తాను. పీఓ నాగమణి: (వంటగదిలో వార్డెన్తో) వంటకు అవసరమైన నిత్యావసర వస్తువుల స్టోరేజీలో ఎటాంటి పరిశుభ్రత చర్యలు పాటిస్తున్నారు. ? మాధవి (వార్డెన్): స్టోర్ రూమ్ పరిశుభ్రంగా ఉండే విధంగా నిత్యం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా తెప్పించుకున్న సరుకులను స్టోర్రూంలో భద్రపరిచి,. వంట చేసే ముందురోజు సాయంత్రం సరుకులను బయటకు తీసి శుద్ధి చేస్తాం మేడమ్. పీఓ నాగమణి: వంటకు సరిపడా సిబ్బంది ఉన్నారా...? మాధవి: ఒక కుక్తోపాటు నలుగురు సహాయకులున్నారు మేడమ్. సత్యవతి (కుక్): సహాయకులు సరిపోరు. గ్యాస్ సిలెండర్లు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల కట్టెలతో వంట చేయవలసి వస్తోంది. పొగవల్ల అనారోగ్యానికి గురవుతున్నాం. సిలెండర్లను పూర్తిస్థాయిలో అందజేయాలి. పీఓ నాగమణి: రాయితీ సిలెండర్ల పంపిణీ సాధ్యం కాదు. అదనపు సిలెండర్లను సమకూర్చడానికి ప్రయత్నిస్తాను. సత్యవతి (కుక్): విద్యుత్ కోత సమయంలో దీపాల కొరత ఉంది మేడమ్. ఆ సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి లోపాలూ లేకుండా వంటలు చేయడానికి వీలుంటుంది. పీఓ నాగమణి: సోలార్ లాంతర్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపుతాం. పీఓ నాగమణి: (డార్మెంట్లకు వెళ్లి విద్యార్థినులతో....) నిద్రించే గదిలో అందిరికీ సరిపడా బెడ్లు,ఫ్యాన్లు ఉన్నాయా...? మనీషా (విద్యార్థిని): సరిపడినన్ని ఉన్నాయి మేడమ్ పీఓ నాగమణి: ఉదయం టిఫిన్, భోజనం మెనూ ప్రకారం అందుతున్నాయా.....? ఇతర సౌకర్యాలు బాగున్నాయా..? బి.సూర్యకళ (విద్యార్థిని): ఇక్కడికి రాకముందు చిన్న ప్రైవేటు పాఠశాలలో చదివేదాన్ని. ఇంట్లోవాళ్లు చదివించలేక చదువు మానిపించారు. తరువాత ఇక్కడి చేరాను. ఇంకా పైచదువులు చదవాలని ఉంది. 9, 10వ తరగతుల వారికి నాలుగు, ఆరు నుంచి 8వ తరగతి విద్యార్థినులకు మూడు ఇడ్లీలు పెడుతున్నారు. పీఓ నాగమణి: (కంప్యూటర్ గదిలో విద్యార్థినులతో...) కంప్యూటర్ విద్య అందుతోందా...? కె.రాజేశ్వరి (9వ తరగతి): కంప్యూటర్ టీచర్ లేరు మేడమ్. కానీ వేరే టీచర్లు వచ్చి కంప్యూటర్ విద్య బోధిస్తున్నారు. కంప్యూటర్ టీచర్ని నియమిస్తే ఇంకా బాగా నేర్చుకుంటాం. పీఓ నాగమణి: నియామకాల ప్రక్రియకు త్వరలో ఆదేశాలు వస్తాయి. పీఓ నాగమణి: (మెడికల్ సర్వీసు గదిలో ఏఎన్ఎంతో...) విద్యార్థినులకు తరచూ వచ్చే వ్యాధులేంటి..? వాటి నివారణకు మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు..? సత్యవతి (ఏఎన్ఎం): మేడమ్ సీజనల్ వ్యాధులు సహజంగా వస్తున్నాయి. రోజుకు ఐదుగురు నుంచి ఏడు మంది వరకూ వివిధ వ్యాధులు, జ్వరాలతో బాధపడుతున్నారు. వీరందరికీ ప్రాథమిక చికిత్స అందజేసి, మందులు ఇస్తున్నాను. ఇంకా తగ్గకపోతే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నాం. పీఓ నాగమణి: (పదోతరగతిలో విద్యార్థులతో...) టీచర్లు చెబుతున్న పాఠాలు అర్థమవుతున్నాయా ? పరీక్షల్లో పాసవుతామనే నమ్మకం ఉందా..? కె.దేవీ (పదోతరగతి విద్యార్థిని): అన్ని సబ్జెక్టులకూ టీచర్లు ఉన్నారు. పాఠాలు అర్థమవుతున్నాయి. పాసవడమే కాకుండా, 10కి 10 పాయింట్లు వచ్చే విధంగా చదువుతున్నాం. కె.మధు(పదోతరగతి విద్యార్థిని): మేడమ్ పదోతరగతి పూర్తయిన తరువాత మేం ఇళ్లకు వెళితే... ఉన్నత చదువులు చదివించరు. అందుకే ఇంటర్మీడియెట్ కోర్సులు కూడా ఇక్కడ నిర్వహించాలి. పీఓ నాగమణి: మీ అందరి విన్నపాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాను. పీఓ నాగమణి: (క్లాస్ టీచర్తో) మీరు బోధిస్తున్న విషయాలను విద్యార్థినులు అర్థం చేసుకుంటున్నారా ? బీవీసులోచన(సోషల్ టీచర్): మేడమ్... బాగా అర్థం చేసుకుంటున్నారు. తరగతిలో 5 మంది మాత్రమే సీ, డీ గ్రేడ్ విద్యార్థినులున్నారు. వారి కోసం ప్రత్యేకంగా మెటీరియల్ తయారుచేశాం. సింపుల్గా మార్కులను సాధించగలిగే మ్యాప్ పాయింటింగ్ వంటి అంశాలను వివరిస్తున్నాం. దీని వల్ల నూరుశాతం ఉత్తీర్ణత సాధించగలుగుతున్నాం. పీఓ నాగమణి: (క్రీడా ప్రాంగణంలో విద్యార్థినులతో) ఇక్కడ మీకు ఆటలు ఆడిస్తున్నారా...? ఏ ఏ ఆటలు నేర్పుతున్నారు...? ఎం.తులసి (ఏడోతరగతి): పీఈటీ మేడం... ఆటలు ఆడిస్తున్నారు. టెన్నీకాయిట్, తైక్వాండో, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో మెలకువలు నేర్పుతున్నారు. పీఓ నాగమణి: క్రీడలు ఆడడానికి పీఈటీ ప్రోత్సహిస్తున్నారా..? ఎం.తులసి: ప్రతిరోజూ ఉదయాన్నే లేపి యోగా చేయిస్తారు. సాయంత్రం మాకు ఇష్టమైన క్రీడల్లో తర్ఫీదు ఇస్తారు మేడమ్. అయితే క్రీడా పరికరాలు లేవు. పీఓ నాగమణి: సామాగ్రి కోసం ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తాను. పీఓ నాగమణి: (సీఆర్ టీచర్లతో) ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి...? దమయంతి (సీఆర్టీ): కాంట్రాక్ట్ ఉద్యోగాలయినప్పటికీ బడిబయట బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని ఎంతగానో తృప్తిపడుతున్నాం. అయితే వేతనాలు అరకొరగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తున్నారు. మాకు కూడా పెంచాలి. కనీసం ఆర్జితసెలవులు కూడా కూడా ఇవ్వడంలేదు. పీఓ నాగమణి: మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. పీఓ ఏమన్నారంటే.. బడిబయట బాలికల విద్యాభివృద్ధికి కేజీబీ విద్యాలయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గత ఐదేళ్లగా పాఠశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. జిల్లాలోని 34 విద్యాలయాల్లో అకడమిక్ పరీక్షలతోపాటు క్రీడా, సాంస్కృతిక, వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో పలువురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. అయితే పలు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది. కొన్ని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాల్సి ఉంది. వాటి కోసం నిధులు వచ్చాయి. నిర్మాణాలను చేపడుతున్నాం. వంటగ్యాస్ పంపిణీ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల కట్టెల పొయ్యిపై ఆహారపదార్థాలను తయారుచేయడం గమనించాను. మరిన్ని గ్యాస్ సిలిండర్లను కేటాయిస్తే కట్టెలతో వండడాన్ని నిరోధించవచ్చు. కంప్యూటర్ ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం. క్రీడా సామగ్రి కోసం ఉన్నతాధికారులను కోరతాను. ఇంటర్మీడియెట్ విద్యాకోర్సులను కేజీబీవీలలో ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కోరిన మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతాం. -
కష్టాల..కస్తూరిబా
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామీణ ప్రాంతాలలోని వెనుకబడిన వర్గాల పిల్లల్లో ప్రాథమికోన్నత విద్యాస్థాయిలో మగపిల్లల కంటే బాలికల నమోదు చాలా తక్కువగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలికల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో హాస్టల్ వసతి కల్పిస్తూ కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఏర్పాటు చేశారు. లక్ష్యం బాగానే ఉన్నా.. నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది. విద్యాలయాలు కష్టాలకు నిలయాలుగా మారాయి. మంచినీరు లేక ఫ్లోరైడ్ నీటిని తాగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వసతుల మధ్య సాగుతున్న ఈ విద్యాలయాల్లో విద్యార్థినుల సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతోంది. విద్యార్థినుల సంఖ్యను పెంచడానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉండాలి. కానీ ఏ ఒక్క పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదు. జిల్లాలో 46 కస్తూరిబా బాలికల విద్యాలయాలు ఉండగా కేవలం 7964 మంది విద్యార్థినులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. మౌలిక వసతుల లేమికి తోడు సరిపడా సీఆర్టీలు కూడా లేరు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటివరకు నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయలేదు. ఇష్టానుసారంగా మెనూ పాటిస్తున్నారు. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వలేదు. నూతన భవనాల్లో సైతం సరైన వసతులు లేక విద్యార్థినులు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా అద్దె భవనాల్లో నిర్వహించే పాఠశాలల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. మంచినీటి కోసం విద్యాలయంలోని బోరు ద్వారా వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగాల్సి వస్తోంది. ఒక్కొక్క విద్యాలయంలో ఒక స్పెషల్ ఆఫీసర్, ఏడుగురు సీఆర్టీలు, ఒక పీఈటీ ఉండాల్సి ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా 27 సీఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టించుకోవడం లేదు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆత్మకూర్(ఎం), తుర్కపల్లి మండలాల్లోని కస్త్తూరిబా పాఠశాలల్లో విద్యార్థినులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి వస తి, విద్యుత్ వసతులు లేక విద్యార్థినులు రెండు మూడు రోజు లకోసారి స్నానాలు చేస్తున్నారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. రాత్రి సమయాల్లో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్థినులకు కాస్మోటిక్ బిల్లులు రాలేదు. ువనగిరి నియోజకవర్గంలోని భువనగిరిలో మైనార్టీ, వలిగొండ మండలం లోతుకుంట, భూదాన్పోచంపల్లిలో ఉన్న కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మంచినీరు, విద్యుత్, ఉపాధ్యాయుల, ఫర్నిచర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. భువనగిరి, వలిగొండల్లో నీటిని కొనుక్కుని తాగుతున్నారు. మున్సిపల్ ట్యాంకర్ రెండురోజులకోసారి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. యూనిఫామ్స్, ట్రంక్పెట్టెలు, తెలుగు పాఠ్యపుస్తకాలు, కాస్మోటిక్ బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. ేవరకొండ కస్తూరిబా పాఠశాలలో విద్యుత్, నీటి సమస్యలు నెలకొనగా పీఏపల్లి పాఠశాలలోవిద్యార్థినులు బోరింగు నీటిపైనే ఆధారపడ్డారు. విద్యార్థినులకు ప్రభుత్వం సరఫరా చేసే దొడ్డు బియ్యంతోనే వండిపెడుతుండటంతో అన్నం తినలేకపోతున్నామని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చింతపల్లి కస్తూరిబా పాఠశాలలో మ్యాథ్స్ పోస్టు, డిండి పాఠశాలలో ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ పోస్టు, పీఏపల్లి మండలంలో ఇంగ్లీష్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేవరకొండ, చింతపల్లి, పీఏపల్లి, డిండి కస్తూరిబా పాఠశాలలకు ప్రహరీ గోడ లేకపోవడంతో భద్రత కొరవడింది. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో నిరుపయోగంగా ఉన్న వ్యవసాయసబ్ మార్కెట్ యార్డులో పాఠశాలను ఏర్పాటు చేశారు. మేళ్లచెరువులోని పాత ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవనంలో కేవలం ఆరు గదులు మాత్రమే ఉండటంతో ఇరుకు గదుల్లో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు విద్యార్థినులకు సరిపడా లేకపోవడంతో ఆరుబయటకు వెళుతున్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో నూతన భవనం నిర్మించినప్పటికీ సరైన వసతులు ఏర్పాటు చేయలేదు. పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతోపాటు లోవోల్టేజీ విద్యుత్ సమస్య నెలకొనడం వల్ల తరచు విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతుండడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాల అద్దె భవనంలో ఉంది. మౌలిక సదుపాయాలు లేవు. నిడమనూరు, పెద్దవూర మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో తాగునీటి సమస్య నెలకొన్నది. ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ను కొనుగోలు చేసి తాగుతున్నారు. పెద్దవూరలోని విద్యాలయానికి వ్యవసాయ విద్యుత్ లైన్నుంచి కనెక్షన్ తీసుకోవడంతో పాఠశాలలో రోజుకు 4 గంటలకు మించి కరెంట్ ఉండటం లేదు. రాత్రి సమయంలో విద్యార్థినులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో పాఠశాల చుట్టూప్రహరీలేకోవడంతో విద్యార్థినులకు రక్షణ కరువైంది. కోదాడ నియోజకవర్గంలో నడిగూడెం, మునగాల, మోతె మండల కేంద్రాల్లో కస్తూరిబా పాఠశాలలున్నాయి. మోతెలోని పాఠశాలకు నీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పనిచేయడంలేదు. పీఈటీ పోస్టు ఖాళీగా ఉంది. నడిగూడెం పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు నాలుగే మరుగుదొడ్లు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకుండా బయటనుంచి వచ్చిపోతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల మండలాలలో మూడు కస్తూరిబా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రధానంగా నీటికొరత తీవ్రంగా ఉంది. మిర్యాలగూడ పాఠశాలలో188 మంది, దామరచర్లలో 200, వేములపల్లిలో 180 మంది విద్యార్థినులు ఉన్నారు. దామరచర్లలో సాంఘికశాస్త్రం, కంప్యూటర్ బోధించే ఉపాధ్యాయులు లేరు. వేములపల్లి పాఠశాలలో బోరులో సరిపడ నీరులేక విద్యార్థినులు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. కిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో 200 మందికి గాను 193 మంది ఉన్నారు. ఇక్కడ మౌలిక వసతులలేక తీవ్ర ఇబ్బందులు విద్యార్థినులు ఎదుర్కొంటున్నారు. ఇంగ్లీష్, జీవవాస్త్రం,భౌతికశాస్త్రం, తెలుగు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అద విధంగా కట్టంగూర్లోని విద్యాలయంలో లోఓల్టేజీ సమస్య ఉంది. అకౌంటెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. సూర్యాపేట పట్టణంలోని కస్తూరిబా పాఠశాల అద్దె భవనంలో నడుస్తోంది. చివ్వెంల మండల కేంద్రంలోని పాఠశాలకు రెగ్యులర్ ఎస్ఓ లేడు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు నోట్పుస్తకాలు, కాస్మోటిక్ బిల్లులు రాలేదు, పాఠశాలలో వేసిన స్కీంబోరు నుంచి వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. పెన్పహాడ్ మండల కేంద్రంలో గల కస్తూరిబా పాఠశాలలో అద్దె భవనంలో తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, మూత్రశాలలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని పాఠశాలలో కంప్యూటర్లు ఉన్నా వినియోగం లేవు. ుంగతుర్తి నియోజకవర్గంలో 6 కేజీబీవీలు ఉన్నాయి. తిరుమలగిరి, శాలిగౌరారం, నూతనకల్ పాఠశాలల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈమూడు పాఠశాలలకు ప్రహరీలు లేక రక్షణ కరువైంది. నూతనకల్, అర్వపల్లిలలో సోషల్ సీఆర్టీలు, తిరుమలగిరిలో బయాలాజికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా యూనిఫామ్స్ రావడం లేదు. సీఆర్టీలకు సరిగా వేతనాలు కూడా లేవు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో ఉన్న కస్తూరిబాగాంధీ బాలికల వసతి గృహంలో కృష్ణా మంచినీరు లేకపోవడం వల్ల ప్యూరిఫైడ్ నీటికి రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నారు. మునుగోడులోని విద్యాలయానికి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టకపోవడంతో రాత్రి సమయంలో విద్యార్థినులు భయం భయంతో ఉంటున్నారు. పాఠశాలల్లో సాంఘికశాస్త్రం, కంప్యూటర్ శిక్షకులు, క్రాఫ్ట్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో ఇంగ్లీష్, కంప్యూటర్, పీఈటీ ఉపాధ్యాయుల లేరు. కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి.