manikonda
-
లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది.మస్తాన్సాయి రిమాండ్ రిపోర్టు ప్రకారం..‘మస్తాన్సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్ను కూడా పోలీసులు జత పరిచారు. మస్తాన్ సాయి ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్తరుణ్ గతంలోనే తొలగించాడు. అయితే, ఆలోపే ఇతర డివైస్లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. లావణ్యను పలు మార్లు చంపేందుకు అతడు యత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు.వెలుగులోకి వస్తున్న ఆకృత్యాలు.. కొన్నేళ్లుగా మస్తాన్సాయి పబ్లు, వీఐపీ పార్టీలలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ రికార్డింగులను హార్డ్ డిస్క్లో భద్రపరిచాడు. ఆ హార్డ్ డిస్క్ను మస్తాన్సాయి ఇంటినుంచి తీసుకున్న లావణ్య.. పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్సాయి తన ఇంటిపై దాడిచేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..కాగా, లావణ్యను డ్రగ్స్ కేసులో మరోమారు ఇరికించేందుకు మస్తాన్సాయి, శేఖర్బాషా యత్నిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది నాగూర్బాబు ఆరోపించారు. వారి మధ్య జరిగిన సంభాషణ రికార్డులను మంగళవారం పోలీసులకు అందించామని తెలిపారు. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, ఇంట్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించాలనే పథకం వేశారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ పోలీసులకు అందించి చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. -
రంగారెడ్డి జిల్లా మణికొండలో హైడ్రా కూల్చివేతలు
-
కాలింగ్ బెల్ కొట్టి..ఇంట్లోకి చొరబడి..
మణికొండ: చైన్స్నాచర్లు రోడ్ల పక్కన ఏమరుపాటుగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసి చైన్స్నాచింగ్లకు పాల్పడతారు. అందుకు భిన్నంగా ఇంట్లో ఉన్న మహిళలోని గొలుసును చోరీ చేసిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్లో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్షాకోట్ గ్రామం సన్సిటీలోని విజయ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో మంజుల నివసిస్తుంది. దీనికి సమీపంలోనే ఓ జిరాక్స్సెంటర్ నడుపుతుంది. ప్రతిరోజూ మాదిరిగానే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తిని కొద్ది సేపు పడుకునే ప్రయత్నం చేసింది. అంతలోనే కాలింగ్ బెల్ పలుమార్లు మోగటంతో నిద్రమత్తులోనే వచ్చి డోరు తీసింది. మొహానికి మాస్క్ ధరించిన ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. ఆమె గట్టిగా అరవంటంతో పక్కఫ్లాట్లోని వ్యక్తి అతని వెంబడించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
రెండ్రోజుల క్రితమే గృహ ప్రవేశం.. అంతలోనే అగ్ని ప్రమాదం
రెండ్రోజుల క్రితం ఆనందంగా బంధు మిత్రులను పిలుచుకుని గృహ ప్రవేశం చేశారు. సొంతింటి కల నెరవేరిందని సంబరపడ్డారు. అంతలోనే కలల సౌధం కాలిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈఐపీఎల్ కార్నర్స్టోన్ గేటెడ్ కమ్యూనిటీలోకి కొందరు చేరుతున్నారు. అందులోని 8వ అంతస్తు 804 ఫ్లాట్ను ఐటీ ఉద్యోగి సంతోష్ కొనుగోలు చేశారు.రెండు నెలలుగా ఇంటిరీయర్ పనులు చేయించారు. సోమవారం గృహ ప్రవేశం చేశారు. మూడు రోజుల పాటు కొత్త ఫ్లాట్లోనే నిద్ర చేశాక పూర్తి స్థాయిలో సామాన్లతో ఇక్కడకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. కిచెన్లో పూజ చేసి వెలిగించిన దీపం బుధవారం దాని కింద ఉన్న దుస్తులకు అంటుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు దీపాన్ని ఆర్పకుండా భయంతో బయటికి పరుగులు తీశారు. దీంతో మంటలు వ్యాపించడంతో ఫ్లాట్ మొత్తం కాలిపోయింది. మంటలను ఆర్పిన సిబ్బంది... కిచెన్లో మొదలైన మంటలను చూసి బయటకు పరుగులు తీసిన ఇంటి యజమాని, బంధువులు మెయింటెనెన్స్ వారికి అగ్ని ప్రమాదం విషయం చెప్పారు. సెక్యూరిటీ, మెయింటెనెన్స్ సిబ్బంది వెంటనే నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఫ్లాట్ మొత్తం వుడ్ వర్క్తో పాటు కాలి బూడిదయ్యింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మరోసారి నీటిని చల్లారు. చదవండి: సరోగసీ కోసం వచ్చి.. ఆపై పారిపోదామనుకొని..పది రోజుల క్రితం పక్క గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్లో ఇదే మాదిరిగా అగ్ని ప్రమాదం జరగటంతో ఇందులోని నివాసితులకు అలాంటి పరిస్థితి ఎదురయినపుడు మంటలను ఎలా ఆర్పాలి? ఫైర్ గ్యాస్ను ఎలా ఉపయోగించాలి? నీటి లభ్యత ప్రతి ఫ్లాట్కు ఎలా వస్తుంది? అనే విషయంలో మాక్డ్రిల్ నిర్వహించారు. అయినా బుధవారం వాటిని పట్టించుకోకపోవటంతో ప్రమాదం సంభవించిందని మెయింటెనెన్స్ ఇన్చార్జి గిరి తెలిపారు. -
Hyderabad: పేలిన రిఫ్రిజిరేటర్ సిలిండర్
మణికొండ: రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు రావడంతో అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ కిచెన్, హాల్, బెడ్రూం వరకు వ్యాపించడంతో అందులోని వ్యక్తులు హాహాకారాలు చేస్తూ కిందకు పరుగులు తీశారు. గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థలంలో పార్కును అభివృద్ధి చేయటంతో అగ్నిమాపక వాహనాలు ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ వరకు సకాలంలో చేరలేక పోయాయి. మణికొండ మున్సిపాలిటీ, పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియల్ కమ్యూనిటీలోని బీ బ్లాక్ మూడో అంతస్తులోని 301 ఫ్లాట్లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఫ్రిడ్జిలోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో వంట గది మొత్తం అంటుకుని మిగతా గదులకూ వ్యాపించాయి. మంటలు వంట గ్యాస్ సిలిండర్కూ అంటుకోవటంతో పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఇంటి యజమాని వెంకటరమణతో పాటు మిగతా నలుగురు కుటుంబ సభ్యులు భయభ్రాంతులతో కిందకు వచ్చేశారు. చుట్టు పక్కల వారు సైతం నిద్రనుంచి మేల్కొని అగి్నమాపక శాఖకు సమాచారం ఇచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అపార్ట్మెంట్ వరకూ వెళ్లలేక పోయిన ఫైరింజిన్.. గోల్డెన్ ఓరియల్లో రెండు బ్లాక్ల మధ్య ఉన్న రోడ్డును పార్కుగా మార్చారు. సకాలంలోనే గేటు వద్దకు చేరుకున్న మూడు ఫైరింజిన్లు ఫ్లాట్ వద్దకు చేరుకోలేక 300 మీటర్ల దూరంలోనే నిలిచిపోయాయి. దీంతో ఫ్లాట్ పూర్తిగా కాలిపోయిందని అగ్నమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలు ఫ్లాట్ మొత్తం వ్యాపించి విలువైన గృహోపకరణాలతో పాటు దుస్తులు, నగదు కాలిపోవటంతో రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఫ్లాట్ యజమాని తెలిపారు. ఫ్లాట్ వద్దకు చేరుకునేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది గంట పాటు ప్రయత్నం చేసినా సఫలం కాక పక్క బ్లాక్ నుంచి నీటిని చల్లి మంటలను ఆర్పారు. కాగా.. స్థానికులు అంతలోపే పక్క ఫ్లాట్ల నుంచి పైపులను వేసి సాధ్యమైనంత వరకు మంటలను ఆర్పారు.కేసు నమోదు గోల్డెన్ ఓరియల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంటి యజమాని వెంకటరమణ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మణికొండ మున్సిపల్ డీఈపై అవినీతి ఆరోపణలు
-
లంచగొండి భార్య... పట్టించిన భర్త!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను విడుదల చేశారు ఆమె భర్త. ఇంట్లో డబ్బుల్ని దాచిన ప్రతి చోటు చూపిస్తూ వీడియోల్ని విడుదల చేశారు.జ్యోతి నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేళ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తుందంటూ విడుదల చేసిన వీడియోల్లో పేర్కొన్నారు.లంచం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చినా.. డబ్బులు తీసుకోకుండా ఇంటికి వచ్చేది కాదు. దాదాపూ రూ.80లక్షల విలువైన నోట్ల కట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తన భార్య తీసుకున్న లంచానికి ఇవే సాక్షాలంటూ వీడియోల్ని విడుదల చేశారు.మణికొండలోని కాంటట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ ఇంటికి భారీగా లంచాలు తీసుకువస్తుందంటూ ఆమె భర్తే ఆరోపించారు. ఇదే విషయంలో జ్యోతితో గొడవ పడ్డానని, అయినా తనలో మార్పురాలేదన్నారు. పైగా తాను లంచం తీసుకోకూడదు అని అనుకున్నా.. పై అధికారులు లంచం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారని చెబుతూ వస్తుందని వాపోయారు. చివరికి భార్య చేస్తున్న తప్పును తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు జ్యోతి భర్త విడుదల చేసిన వీడియోలో తెలిపారు. మరోవైపు జ్యోతిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీకి బదిలీ చేయించుకున్నారు. -
మణికొండలో విషాదం.. గుండెపోటుతో టెక్కీ మృతి
సాక్షి, హైదరాబాద: మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్.. అనంతరం ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం రాత్రి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. 15 లక్షల వరకు లడ్డు వేలంలో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితుడు లడ్డూ కైవసం చేసుకోవడంతో గణనాథుడి వద్ద ఉత్సాహంగా డాన్స్లు చేశాడు. స్నేహితులతో కలిసి తీన్మార్ స్టెప్పులేశాడు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.చదవండి: Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు! -
హైడ్రా ఎంట్రీ.. చిత్రపురి కాలనీలో విల్లాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే టార్గెట్గా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ను హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో, హైడ్రా చర్యలు హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు, తాజాగా మణికొండ చిత్రపూరి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.కాగా, చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు అందజేశారు. ఈ సందర్బంగా జీవో 658కు విరుద్దంగా 225 రోహౌజ్ల నిర్మాణాలు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఇక, గత సొసైటీ పాలక వర్గం దొంగ చాటున నిర్మాణాలకు అనుమతులు పొందిందని అధికారులు తేల్చారు. అలాగే, ఈ నిర్మాణాల కోసం కేవలం జీ+1 అనుమతులు పొంది అక్రమంగా జీ+2 నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు.దీంతో, 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మణికొండ మున్సిపల్ కమిషనర్ సూచించారు. గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు రూ.50 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. చిత్రపురి కాలనీలో జరిగిన అవకతవకల గుట్టురట్టు చేయాలంటూ ఫిర్యాదుల వెల్లువెట్టడంతో రంగంలోకి మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల్లో టెన్షన్ నెలకొంది. -
Saina Nehwal: నా ఆత్మలో.. బ్యాడ్మింటన్!
మణికొండ: బ్యాడ్మింటన్ తన ఆత్మలో ఉందని, దాన్ని ఎప్పటికీ వదలిపెట్టనని పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ, అలకాపూర్ టౌన్షిప్ రోడ్డు నంబర్–3 వద్ద యోనెక్స్ స్పోర్ట్స్ స్టోర్ను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో క్రీడాకారుల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువులతో పాటు వారికి నచి్చన క్రీడలో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలకు మన దేశంలో రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఫిట్గా ఉండేలా చూసుకుని క్రీడల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. రెజ్లర్ వినేష్ పోగట్కు మరో పథకం వస్తుందనే ఆశతోనే ఉన్నానన్నారు. కార్యక్రమంలో స్టోర్ యజమానులు అమర్, కిరణ్, వెంకట్తో పాటు ఆమె అభిమానులు పాల్గొన్నారు. -
ఔటర్పై కార్లు, ఇతర వాహనాలకు వేర్వేరు మార్గాలు
మణికొండ: ఔటర్ రింగ్రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్తో టోల్గేట్ల వద్ద వాహనదారుల పడిగాపులు పెరిగిపోతున్నాయి. వాటిని నివారించే ఉద్దేశంతో అధిక రద్దీ ఉండే పుప్పాలగూడ టోల్గేట్ వద్ద నిర్వాహకులు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసి రద్దీ నివారణ చర్యలు చేపట్టారు. ఆదివారం నుంచి శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఉన్న మూడు టోల్ వసూలు కౌంటర్లలోకి కార్లను మాత్రమే అనుమతించారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో కార్లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఫాస్ట్ట్యాగ్ ఉన్న వాహనదారులే ప్రవేశించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఫాస్ట్ట్యాగ్ లేకుండా ఆయా మార్గాల్లోకి ప్రవేశిస్తే చెల్లించాల్సిన డబ్బుకు రెండితలు వసూలు చేస్తున్నామని టోల్గేట్ నిర్వాహకులు తెలిపారు. ఫాస్టాగ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గాల్లోకి ఇతర వాహనదారులు రావొద్దని బోర్డులు ఏర్పాటు చేసినా వారు ప్రవేశించి నగదు రూపంలో టోల్ చెల్లిస్తుండటంతో రద్దీ పెరిగిపోతోందన్నారు. అందుకే కచ్చితంగా ఫాస్టాగ్ ఉన్న కార్లను ఆయా మార్గాల్లో.. మిగతా వాహనాలను ఇతర కౌంటర్లలోకి అనుమతిస్తున్నామన్నారు. దాంతో ఆదివారం ఎక్కువగా ట్రాఫిక్ స్తంభించలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో అధిక రద్దీ ఉండే మరిన్ని టోల్ కేంద్రాల వద్ద ఇలాంటి ఏర్పాట్లను చేస్తామని వారు తెలిపారు. -
ల్యాండ్ మార్క్ చెట్లు
మణికొండ: ఒక్కో గ్రామంలో ఒక్కో భవనం, విగ్రహాలు, చౌరస్తాలు, బావులు లాండ్ మార్క్గా నిలవటం సహజం. కానీ రెండు చెట్లు ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలం పాటు ల్యాండ్ మార్క్గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమం నుంచి ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నాయి. వాటి చుట్టు పక్కల మరో ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసినా ప్రజలు వాటిని గుర్తించలేక పాత వాటితోనే పిలుస్తున్నారంటే ప్రజల్లో ఎంతలా నాటుకుపోయాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ చెట్లేంటి? వాటి కథేంటి? తెలుసుకుందాం.. దైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలన్నా.. ఎవరికైనా అడ్రస్ చెప్పాలన్నా.. ముందుగా ఆ ప్రాంతం పేరుతోపాటు అక్కడ ప్రాచుర్యం పొందిన ల్యాండ్ మార్క్ చెప్పడం పరిపాటి.. అయితే అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని పేర్లు మారుతుంటాయి.. మరికొన్ని ఏళ్ల తరబడి అవే గుర్తింపుగా మారుతుంటాయి.. అలాంటి గుర్తింపు పొందిన రెండు వృక్షాల కథే ఇది..పూర్తి వివరాల్లోకి వెళితే గతంలో మణికొండకు కొత్తగా వచ్చే వారు మీ ఇంటికి ఎలా రావాలి అంటే ముందుగా మర్రిచెట్టు వద్దకు వచ్చి ఎడమవైపు, కుడి వైపు, నేరుగా ఇటువైపు రావాలని చిరునామా చెప్పే వారు. దాని కేంద్రంగానే మణికొండకు కొత్తగా వచ్చే వారు గమ్యస్థానాలను చేరేవారు. ఇదే మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులు అలకాపూర్ టౌన్షిప్ ప్రవేశంలో ఉండే చింత చెట్టును కేంద్రంగా చేసుకుని చిరునామా చెప్పేవారు. అక్కడి నుంచి ఎడమ, కుడి, నేరుగా అనే రోడ్లతో వారి గమ్యస్థానాలకు చేరుకునే వారు. ఆ తరువాతి క్రమంలో గూగుల్ మ్యాప్లు, లొకేషన్ పాయింట్లు వచ్చి వాటి ఆదారంగా కొత్త వారు గమ్య స్థానాలను చేరుకుంటున్నా వీటి గుర్తింపు ఏమాత్రం చెక్కు చెదరలేదు. వాటిలో ముందుగా మణికొండ మర్రిచెట్టు, పుప్పాలగూడ, నెక్నాంపూర్ చింతచెట్టు అడ్రస్కి కేరాఫ్గా మారాయి.మార్పులు చేసినా... మణికొండ మర్రిచెట్టు కూడలికి కాల క్రమంలో పేరు మార్చాలనే ఉద్దేశంతో ఓ సంస్థ దాని కింద భరతమాత విగ్రహాన్ని నెలకొలి్పంది. అప్పటి నుంచి దాన్ని భరతమాత కూడలిగా పిలవాలని ప్రకటించారు. అది ఏమాత్రం ప్రజల్లోకి ఎక్కకుండా అదే మర్రిచెట్టు కూడలిగానే ప్రసద్ధి చెందుతోంది. ఇదే తరహాలో పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులకు ల్యాండ్ మార్క్గా ఉన్న చింత చెట్టు పక్కనే మున్సిపాలిటీ నుంచి శోభాయమానంగా సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టుగా కూడలిని అభివృద్ధి చేశారు. దాన్ని బటర్ఫ్లై కూడలిగా నామకరణం చేసినా దాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. అదే చింతచెట్టు సర్కిల్గానే దాని పేరు కొనసాగుతోంది. అదే రోడ్డులో అలకాపూర్ టౌన్íÙప్లోకి నేరుగా వెళితే మూలమలుపు వద్ద ఏర్పాటు చేసిన యోగ సర్కిల్(సూర్యనమస్కారాల బొమ్మలు) మాత్రం ఇప్పుడిపుడే ప్రాచూర్యం పొందుతున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిచెట్టు, చింతచెట్ల చరిత్ర అవి జీవించినంత కాలం కొనసాగుతుందని స్థానికులు భావిస్తున్నారు. మణికొండలోని అదే మర్రిచెట్టుపై కొత్తగా రావి చెట్టు, దాని కింద వేపచెట్టు పెరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
‘తాన్సేన్’ మొఘల్ వైభవం..
ఐదు దశాబ్దాల వారసత్వంతో ఆహార ప్రియులకు విభిన్న రుచులను అందిస్తున్న ఓహ్రీస్ గ్రూప్ ఔటర్రింగ్ రోడ్డు పక్కన, ఐటీ జోన్కు సమీపంలో తాన్సేన్ రెస్టారెంట్ను గురువారం ప్రారంభించింది.అద్భుతమైన పాకశాస్త్ర వారసత్వం, మొఘల్ వైభవంతో దీన్ని తీర్చిదిద్దామని సంస్థ చైర్మెన్ అమర్ ఓహ్రి పేర్కొన్నారు. లెజండరీ సంగీత కారకుడు తాన్సేన్ నుంచి ప్రేరణ పొంది గ్యాస్టోన మీ స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుపరిచే రుచుల వేడుకగా ఇది నిలుస్తుందన్నారు. విభిన్న రుచులు, వంటకాల నైపుణ్యంతో ప్రతి వంటకం ఓ అద్భుత కళాఖండంలా తాన్సేన్లో ఉంటుందని చెఫ్ కన్సల్టెంట్ అనూజ్ వాధావన్ అన్నారు. - మణికొండ -
ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
హైదరాబాద్, సాక్షి: మణికొండ పోకల్వాడలో భారీ భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్మాల్ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి నుంచి పాస్బుక్లు జారీ అయ్యాయి. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించి ఈ స్కామ్కు పాల్పడ్డారు. ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐదెకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ధరణి ఉద్యోగులతో రూ.3 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో పాస్బుక్లు జారీ చేశారు. అయితే.. బ్లాక్ లిస్ట్లో ఉన్న ల్యాండ్కు పాస్ బుక్లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్ ఛానెల్తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది. -
మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా
-
కారులో మృతదేహం కంగారు పడ్డ జనం
-
మణికొండలో కలకలం.. కారులో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: మణికొండలో కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మారుతి వ్యాన్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ సీటు వెనుక లో మృతదేహం లభ్యం కావడంతో హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
గాన సరస్వతి
పువ్వుకు రాగం అబ్బితే ఎలా ఉంటుంది? ఆ పువ్వు స్వరాన్ని ఎలా సవరించుకుంటుంది? ఆ తావి గానాన్ని ఎలా శ్రుతి చేసుకుంటుంది? అక్షరాలను పూలరెక్కల్లా పొదివి పట్టుకుంటుంది. సరిగమలు కందకుండా సున్నితంగా గానం చేస్తుంది. ఆ గాన సరస్వతి... మన రావు బాలసరస్వతీదేవి. పువ్వు పాడితే ఎలా ఉంటుందో... రావు బాలసరస్వతీదేవి పాట వింటే తెలుస్తుంది. హైదరాబాద్, మణికొండలోని గాయత్రి ప్లాజాలో ఆమె ఫ్లాట్ గోడలు ఆ గానసరస్వతి రాగాలను నిత్యం వింటుంటాయి. తొంభై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో రాగం శ్రుతి తప్ప లేదు. తొంభై ఏళ్లుగా సాగుతున్న సాధనతో ఆ స్వరం అద్దుకున్న తియ్యదనం అది. పారిజాత పువ్వులాంటి మృదుత్వం ఆమె రాగానిది. ఆ గొంతు సన్నజాజి మొగ్గలా పరిమళం వెదజల్లుతోందిప్పటికీ. ఆ సుమధుర గానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తొమ్మిది దశాబ్దాల ఆమె సంగీత సేవను గౌరవిస్తోంది. నవంబర్ ఒకటవ తేదీన (రేపు) ఆమె వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. గ్రామఫోన్ నుంచి సీడీల వరకు సరస్వతి నాలుగవ ఏట నుంచి వేదికల మీద పాడుతున్నారు. ఆరవ ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్లో రికార్డు చేసింది. తెలుగు సినిమాలో తొలి నేపథ్య గాయనిగా రికార్డు ఆమెదే. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు సింహళ గీతాలనూ ఆలపించారు. బాలనటిగా, బాల గాయనిగా సినీరంగం ఆమెను గారం చేసింది. పేరు ముందు ‘బాల’ను చేర్చింది. కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతాలు సాధన చేసింది. సినిమా షూటింగ్ల కారణంగా స్కూలుకెళ్లడం కుదరకపోవడంతో ఆమె చదువు కోసం ట్యూటర్ ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. ఆమెకు ఇంగ్లిష్ నవలలు చాలా ఇష్టం. ఆ అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గ్రామఫోన్ రికార్డుల కాలం నుంచి క్యాసెట్ టేప్లో రికార్డ్ చేసే టెక్నాలజీని చూశారు. సీడీలు, ఎంపీత్రీలనూ చూశారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతూ వచ్చారు. కానీ, సినిమా సంగీతం, సాహిత్యంలో వచి్చన భాషాపరంగా విలోమమవుతున్న ప్రమాణాలను అంగీకరించలేకపోయారు. సినిమా అంటే శక్తిమంతమైన వినోదసాధనం. పిల్లలు, యువతకు మానసిక వికాసం, మేధో వికాసంతోపాటు వాళ్ల అభివృద్ధికి... వినోదం అనే సాధనంతో బాటలు వేసే గొప్ప కళామాధ్యమంగా ఉండాలి సినిమా. అంతే తప్ప విలువలను దిగజార్చుకునే సాధనం కాకూడదని చెబుతారామె. రెండు వేలకు పైగా పాటలు పాడిన ఈ సంగీత సరస్వతి ఈ రోజుల్లో పాటల సాహిత్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాట కలిపింది ఇద్దరినీ! చెన్నై (మద్రాసు) లో పుట్టి పెరిగిన బాల సరస్వతి పెళ్లి తర్వాత కోడలిగా కోలంక జమీందారీలో అడుగుపెట్టారు. ప్రకృతి ఇద్దరు వ్యక్తులను దూరం చేసిన విషాదాంతాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ ప్రకృతి ఇద్దరు మనుషులను దగ్గర చేయాలనుకుంటే చాలా చమత్కారంగా దగ్గర చేస్తుంది. అందుకు ఈ గానసరస్వతి పెళ్లే గొప్ప ఉదాహరణ. ‘‘నా పాటను వినడానికి స్వయంగా కోలంక జమీందార్... శ్రీ రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారు మద్రాసులో మా ఇంటికి వచ్చారు. నేనప్పుడే ‘కలువ రేకుల కనులు గల నా స్వామీ’ అనే పాట రికార్డింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. మా నాన్న పాట పాడమనగానే అదే పాట పాడాను. రాజా వారేమో తన పెద్ద కళ్లను వరి్ణస్తూ, వారి మీద ప్రేమను అలా పాట రూపంలో వ్యక్తం చేశాననుకున్నారట. అదే మా పెళ్లికి నాందీ గీతం’ అంటూ ఆనాటి జ్ఞాపకాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారామె. అందుకే తనకు ఇష్టమైన ప్రదేశం మద్రాసేనని చెబుతారామె. ఈ బాల రెండో బాల్యమిది! బాలసరస్వతీ దేవికి హాఫ్ వైట్ పట్టు చీరలిష్టం. క్రీమ్ కలర్తో అనేక రంగుల కాంబినేషన్లలోనే ఎక్కువగా కనిపిస్తారు. ఆమెకు మల్లెలన్నా ఇష్టమే. ఇక స్వీట్స్... ముఖ్యంగా గులాబ్ జామూన్, జాంగ్రీలను చూస్తే చిన్నపిల్లయిపోతారు. చాక్లెట్ చేతికిస్తే పసి పిల్లల ముఖం వికసించినట్లే ఆమె ముఖంలో నవ్వులు పూస్తాయి. భోజనం గుప్పెడే కానీ, ఆ వెంటనే స్వీట్ తినడం ఆమెకిష్టం, ఆ తర్వాత తియ్యగా పాడడం మరింత ఇష్టం. ఆ సరిగమల వారసత్వం ఇద్దరు కొడుకులకు రాలేదు, మనుమడు, మనుమరాలికీ రాలేదు. కానీ మనుమరాలి కూతురు నేహకు వచ్చింది. గానసరస్వతి కళ్ల ముందే ఆ ఇంట్లో సరిగమల కొత్తతరం వెల్లివిరుస్తోంది. తొంబై ఐదేళ్ల వయసులో హైదరాబాద్లోని పెద్ద కుమారుని ఇంటిలో ప్రశాంతంగా పసిబిడ్డలా జీవిస్తున్నారు బాల సరస్వతీదేవి. కన్నతల్లిని ‘కన్నక్కా’ అని పిలుస్తూ తల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారాయన. కోడలు అత్తగారి చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆమె కొన్ని సంగతులు చెప్తూ మధ్యలో మర్చిపోతుంటే ఆమె పెద్ద కొడుకు, పెద్ద కోడలు అందుకుని పూర్తి చేయడమే అందుకు నిదర్శనం. సినిమాలకు మాత్రమే దూరం... స్వరానికి కాదు! పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు బాల సరస్వతీదేవి సినిమాల కోసం పాడడం మానేశారు. కానీ సంగీత సాధన మాత్రం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారామె. ఎనభై ఏళ్ల వయసులో ఆమె తనకిష్టమైన కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. కోవిడ్కి ముందు 2018లో అంటే ఆమె తొంబయ్యేళ్ల వయసులో ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాడడమే ఆమె చివరి వేదిక. ఆ వేడుక తర్వాత మూడవ రోజు ఇంట్లో జరిగిన ప్రమాదం ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయితే ఆశ్చర్యంగా జారి పడడంతో విరిగిన తుంటి ఎముక దానంతట అదే సరయింది. సంగీతమే తనను స్వస్థత పరిచిందంటారామె. ఇప్పటికీ రోజూ ఆ స్వరం రాగాలను పలుకుతుంటుంది. ఆమె ఊపిరితిత్తులకు శక్తినిస్తున్నది సంగీతమేనని వైద్యులు కూడా నిర్ధారించారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: మోహనాచారి -
పని మనిషి ఆత్మహత్య.. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
హైదరాబాద్: ల్యాంకోహిల్స్లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు బయటపడుతున్నాయి. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితం నగరానికి చేరి బంజారాహిల్స్ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్స్ 15 ఎల్హెచ్ బ్లాక్లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె కేర్టేకర్గా పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటోంది. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం . కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం పూర్ణచంద్రావు కుమార్తెను సాకేందుకు మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీపై 21వఅంతస్తుపై నుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్కు చేరగా.. అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. వేధింపుల వల్లేనా? కన్నడ సినిమాల్లో నటించానంటూ పూర్ణచంద్రావు ప్రచారం చేసుకునేవాడు. సినీపరిశ్రమలో తన పరిచయాలతో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశచూపేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. తరచూ ఇదే విధంగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవటం, అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న కొందరు మీడియాకు తెలిపారు. ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు నలుగురు యువతులు అతడి ఫ్లాట్కు వచ్చారని వివరించారు. అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన పోలీసులు వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూర్ణచంద్రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్లకు డైరెక్టర్గా ఉన్నారు. ఇదిలా ఉండగా 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి ట్రాన్స్ ట్రాయ్ సింగపూర్ లిమిటెడ్కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ. 300 కోట్ల రూపాయల రుణాలు పొందగా.. తిరిగి ఆ రుణాలు చెల్లించకపోవడంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 260 కోట్ల రూపాయలను ఇతర కంపెనీకి మళ్ళీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. లోన్ కోసం తీసుకున్న డబ్బులను బంగారం, వెండి ఆభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్ను కెనరా బ్యాంక్ ఆడిట్ చేసింది. అప్పటినుంచి బ్యాంక్ల లిస్ట్లో నాన్ పర్ఫామింగ్ అసెట్గా మారింది ట్రాన్స్ ట్రాయ్. ఇక ఇదే కంపెనీకి మలినేని సాంబశివరావు డైరెక్టర్గా ఉన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి -
HYD: తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. చేతిపై ఏం రాసి ఉంది?
సాక్షి, హైదరాబాద్: తల్లీకూతుళ్ల ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కూతురు లాస్యకి ఉరి వేసి చంపి, తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కొడుకును కూడా చంపే ప్రయత్నం చేసిన తల్లి.. గాడ నిద్రలో ఉండటంతో వదిలేసింది. గత కొంత కాలం నుంచి తీవ్ర మానసిక వేదనలో ఉన్న తల్లి, కూతురు కరోనా సమయం నుంచి బయటికి రావడం లేదు. రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు అలివేలు.. భర్తనుదూరంగా పంపించింది. భర్త సదానందానికి రూ.5 వేలు ఇచ్చి యాదాద్రి వెళ్లమని బలవంతంగా పంపించింది. కూతురు చేతిపై ‘Do Something That Make You Happy’ అని రాసింది. ‘The Game Is Started’ అని గోరింటాకుతో రాసుకున్న తల్లీకూతుళ్లు.. ఆత్మహత్యకి ముందు.. ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు. ఇదే విషయంపై కొడుకుతో వాగ్వివాదం జరిగింది. ఉద్యోగం మానేసిన భర్త సదానందం.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. చదవండి: ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగ్గా లేదని, కరోనా టైం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారన్నారని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. రెండేళ్లగా ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఇంటి పక్కన వాళ్లతో కూడా మాట్లాడటం లేదు.. ఆత్మహత్యకి ముందు.. తల్లీ కూతుళ్ళు ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు.. ఎందుకు అని బాబు అడిగితే.. చిన్న పిల్లాడివి.. నీకేం తెలియదు అంటూ తల్లి మందలించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’’ అని సీఐ వెల్లడించారు. -
భర్తను యాదాద్రికి పంపించి.. హైదరాబాద్లో తల్లీకూతురు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మణికొండ ఆంధ్రా కాలనీలో తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అలివేలు, ఆమె కుమార్తె లాస్యగా గుర్తించారు. నిన్న సాయంత్రం భర్తకు రూ.5 వేలు ఇచ్చి యాదాద్రి ఆలయానికి వెళ్లమని అలివేలు చెప్పినట్లు సమాచారం. ఈ రోజు(శుక్రవారం) తెల్లవారుజామున పడక గదిలో కూతురు లాస్య, వంటగదిలో తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు పాత దుస్తుల్ని అలివేలు తగులబెట్టింది. తల్లి పాత బట్టలను తగులబెడుతుండగా ప్రశ్నించిన కుమారుడికి సమాధానం ఇవ్వలేదు. కూతురు లాస్యకి ఉరి వేసి చంపి, తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కొడుకును కూడా చంపే ప్రయత్నం చేసిన తల్లి.. గాడ నిద్రలో ఉండటంతో వదిలేసింది. లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగ్గా లేదని, కరోనా టైం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారన్నారని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. చదవండి: నాచారంలో సెల్ఫీ సూసైడ్ -
ప్లే స్కూల్ లో అగ్ని ప్రమాదం
-
మణికొండ: ప్లే స్కూల్లో మంటలు.. పరుగు తీసిన చిన్నారులు
సాక్షి, హైదరాబాద్: మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లేస్కూల్ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్తో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కాగా, మంటలు ఎగసిపడటం, పొగ బయటకు రావడంతో భయంతో చిన్నారులు పరుగు తీశారు. ఇక, అగ్ని ప్రమాదం సంభవించడంతో చిన్నారుల పేరెంట్స్ భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆరు లేన్లుగా ఎన్హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ! -
హైదరాబాద్లో విషాదం.. ఇంటర్లో ఫెయిలయ్యామని..
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన పి.జాహ్నవి (17) ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యనభ్యసిస్తుంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సంగెం లక్ష్మీబాయి జూనియర్ కళాశాలలో జాహ్నవి ఎంపీసీ పూర్తిచేసింది. వనస్థలిపురంలో ఇంటర్ ఇద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో గాయత్రి అనే విద్యార్తి ఇంట్లో ఉరేసుకుంది. హస్తినాపురం నవీన కళాశాలలో అక్కాచెల్లెల్లు చదవుతుండగా .. చెల్లి పాస్ అయి తాను ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. ఖైరతాబాద్లోని తుమ్మల బస్తీకి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో (బైపీసీ) ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థిని గౌతమ్ కుమార్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. మణికొండలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శాంతకుమారి ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షలో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్తాపం చెంది ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. హుటాహుటిన ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా శాంతకుమారి రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్లోని నేరేడ్మెట్లో ఠాణా పరిధి వినాయక్ నగర్కు చెందిన ఓ విద్యార్థి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఒక సబ్జెక్టులో తప్పడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. చదవండి: అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి.. -
Hyderabad: ముదురుతున్న మణికొండ పుప్పాలగూడ ‘రోడ్డు వార్’
సాక్షి, హైదరాబాద్: ప్రజావసరాల నిమిత్తం రోడ్డు వేయాలని హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) పనులు చేపట్టింది. తమ హౌసింగ్ సొసైటీ స్థలంలోనుంచి సదరు పనులను అనుమతించేది లేదని ఇండియన్ సర్వీసెస్ విశ్రాంత అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య రోడ్డు వార్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగర శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ రెవెన్యూలో సర్వే నెంబర్ 454లో 2007 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ‘ఆదర్శ్నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’కి 57 ఎకరాలను కేటాయించింది. హౌసింగ్ సొసైటీలకు భూమి కేటాయింపు కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. కాగా, మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పెరుగుతున్న జనాభా అవసరాల నిమిత్తం ల్యాంకోహిల్స్ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2.35 కిలోమీటర్ల వంద అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని రెండేళ్లకిందట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా టెండర్లు పిలిచింది. కొంత మేర పనులు పూర్తి చేశారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు శనివారం పునఃప్రారంభించారు. దీంతో.. తమ స్థలంలో పనులు చేపట్టనివ్వబోమని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ భీషి్మంచింది. అయినా పనులను కొనసాగించారు. ఆదివారం రాత్రి తిరిగి పనులు.. మరునాడు ఆదివారం సొసైటీవాసులు పనులను అడ్డుకుంటారని భావించి రోజంతా పనులను చేయలేదు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో హెచ్ర్డీసీఎల్ సీఈ సరోజ ఆధ్వర్యంలో అధికారుల బృందం అక్కడకు చేరుకుని పనులు ప్రారంభించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇండియన్ సరీ్వసెస్ విశ్రాంత అధికారులు తమ న్యాయవాదులు, సిబ్బందితో పాటు అక్కడే ఉండి పనులను అడ్డుకున్నారు. తమ స్థలంలోకి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమకు హైకోర్టు నుంచి స్టే ఉందని, శనివారం కోర్టు ధిక్కరణ పిటిషన్ను సైతం వేశామని అధికారులతో వాదనలకు దిగారు. తమ పిటిషన్కు కోర్టులో సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా పనులు చేపట్టడం ఏమిటని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాంనారాయణ్రెడ్డి, రాయుడు, వెంకట్రాంరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎన్జీ మురళి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఎంజీ అక్బర్లు ప్రశ్నించారు. తమ స్థలంలో పనులు చేస్తే అడ్డుకుంటామని అధికారులు, ఎలాగైనా పనులు చేస్తామని హెచ్ఆర్డీసీఎల్ అధికారులు బీష్మించడంతో ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి వరకు సొసైటీ స్థలంలో కాకుండా వేరేచోట పనులను కొనసాగించారు. కోర్టు నుంచి సోమవారం వచ్చే ఆదేశాలకోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
విద్యార్థుల కోసం.. ఇది సరికొత్త ఎడ్యుకేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రోజుల్లో విద్యాసంస్థలు సంఖ్య రోజు రోజూకీ పెరుగుతున్నాయి. అలాగే వాటిలో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే కళాశాలల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు ఉద్యోగులకు మారేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీనికి ప్రస్తుతం విద్యా విధానంలో రెగులర్ పాఠ్యాంశాలతో పాటు పాక్ట్రికల్తో కూడిన విద్యను పక్కన పెట్టడమే కారణమని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని స్టార్ట్ప్లు ముందుకు వస్తున్నాయి. ప్రాక్టికల్ ఒక డిజైన్ ఎలా చేయాలి, ఒక ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఎలా జతచేయాలి , వాటిని ప్రోగ్రాం ద్వారా ఎలా కంట్రోల్ చేయాలి, కనీసం ఒక ఇంకుబేషన్ సెంటర్.. ఇవన్నీ ప్రస్తుతం కాలేజీ స్థాయిలో కూడా మనకు ఎక్కడా కనిపించడం లేదు. వీటిని విద్యార్థులకు అందించేందుకు ముందుకు వచ్చింది మణికొండలోని కిటోలిట్(KITOLIT)కంపెనీ. దీనిపై సంస్థ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు లేటెస్ట్ టెక్నాలజీతో ప్రాక్టికల్ నాలెడ్జ్ను అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు స్కూల్స్తో టెక్నికల పార్టనర్స్గా వ్యవహరిస్తున్నాం. వీటితో పాటు ఇతర దేశాలలో ఉన్న మా క్లయింట్స్తో కూడా ఆన్లైన్ సెషన్స్ జరిపిస్తుంటాం. తక్కువ ధరకే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రోబోను తయారు చేయడమే మా విజన్గా పెట్టుకున్నాం. అందులో ఏఐ టెక్నాలజీ, మిషిన్ లెర్నింగ్ ఉపయోగిస్తున్నాం. వీటితో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ కారును కూడా డిజైన్ చేస్తున్నామని’ పేర్కొన్నారు. ఇక్కడ తాము టెక్నాలజీతో కూడిన విద్యను ప్రాక్టికల్గా అందిస్తున్నామన్నారు. -
తమిళిసై వద్ద పెండింగ్లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్పర్సన్పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్పర్సన్కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
మణికొండలో సందడి చేసిన విరాట్ కోహ్లి..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్లోని మణికొండలో సందడి చేశాడు. మణికొండ గ్రీన్ లివింగ్ అపార్ట్మెంట్లోని హైకీ జిమ్లో ఓ యాడ్ షూటింగ్లో కింగ్ కోహ్లి పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. దీంతో, ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. కాగా మణికొండలోని పైపులైను రోడ్డులో గల హాల్మార్క్ హబ్లో హైకీ ఫిట్నెస్ స్టూడియో ఉంది. ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కోహ్లి.. అత్యాధునికంగా డిజైన్ చేసిన ఈ జిమ్లో దాదాపు రెండు గంటల సేపు సమయం గడిపాడు. ఓ సంస్థకు సంబంధించిన వ్యాపార ప్రకటనను ఇక్కడే షూట్ చేశారు. షూట్ ముగిసిన తర్వాత హైకీ ఫిట్నెస్ స్టూడియోని ఆరంభించిన యంగ్ ఎంటర్ప్రెన్యూర్ మనీషాతో కోహ్లి ముచ్చటించాడు. కాగా ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో తొలి వన్డేలో పాల్గోనేందుకు కోహ్లి భాగ్యనగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కివీస్తో జరిగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లి 8 పరుగులు మాత్రమే చేశాడు. యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. గిల్ 143 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్లతో 208 పరుగులు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాయ్పూర్ వేదికగా జనవరి 21న జరగనుంది. చదవండి: SA20 2023: రషీద్ ఖాన్కు చుక్కలు చూపించిన సన్రైజర్స్ బ్యాటర్.. ఒకే ఓవర్లో 28 పరుగులు! -
సీబీఐటీకి ఐఎస్ఓ సర్టిఫికేషన్
మణికొండ: గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి హెచ్వైఎం ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఐఎస్ఓ 9001:2015 నాణ్యతా వ్యవస్థల ప్రామాణిక దృవపత్రం లభించింది. 2002 సంవత్సరం నుంచి సీబీఐటీకి ఐఎస్ఓ 9001 ప్రమాణాల కింద దృవీకరించచడం జరుగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రవీందర్రెడ్డి తెలిపారు. ఇదంతా కళాశాల స్టాఫ్ కృషి ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. -
దోపిడీ దొంగల బీభత్సం
మణికొండ: నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ముగ్గురిని కత్తులతో పొడవగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతుడి బైక్ను చోరీ చేసి దానిపై పరారయ్యారు. పట్టుకునేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై ఆ ఇద్దరిలో ఓ నిందితుడు కత్తితో దాడి చేసి పరారవ్వగా.. ఆ పోలీసులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. బుధవారం రాత్రి హైదర్షాకోట్కి చెందిన ట్రాన్స్జెండర్ నిహారిక(నరేష్) తన మిత్రులతో కలిసి నార్సింగి రక్తమైసమ్మ గుడి సమీపంలో కోకాపేటకు చెందిన తులసికుమార్ అనే వ్యక్తితో మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు తులసికుమార్ను కత్తితో పొడిచి అతడి నుంచి రూ.15వేలు లాక్కున్నారు. కత్తి దాడిలో అతని చేతి వేళ్లు తెగిపోయాయి. అక్కడే ఉన్న ట్రాన్స్జెండర్లను డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో నిహారిక తన భర్త కిషోర్రెడ్డి(35)కి ఫోన్ చేసింది. దాంతో అతను తన మిత్రుడు శివరాజ్తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే తులసికుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. ఈ లోగా నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. శివరాజ్ ఆ తర్వాత దారి కాచి హత్య... ఆ తర్వాత ఇద్దరు దుండగులు గంధంగూడ దారిలో కిషోర్రెడ్డి, అతని మిత్రుడు శివరాజ్లను అడ్డగించి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా శివరాజ్ స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. మృతుడు కిషోర్ ద్విచక్రవాహనం తీసుకుని వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల్లో ఒకతను సిక్కు వేషధారణలో ఉండగా మరొకతను మాస్క్ ధరించి ఉన్నాడని నిహారిక తెలిపారు. నిందితులను గుర్తించిన నార్సింగి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఎస్ఓటి పోలీసులపై దాడి జగద్గిరిగుట్ట: నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో హత్య కేసు నిందితుడు కరణ్సింగ్.. కూకట్పల్లి సిక్ బస్తీలోని భగవాన్సింగ్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు విజయ్, రాజు గురువారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడి చేశారు. అప్పటికే పోలీసుల రాకను గమనించిన కరణ్ సింగ్ కత్తితో వారిపై దాడి చేసి పారిపోయాడు.. దాడిలో రాజు తలకు గాయం కావడంతో కూకట్పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఛాతీపై తీవ్ర గాయాలైన విజయ్ను మాదాపూర్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందడంతో బాలానగర్ డీసీపీ సందీప్ గోనె, మాదాపూర్ ఎస్ఓటీ క్రై మ్ అడిషనల్ డీసీపీ నారాయణ, బాలానగర్ ఏసీపీ గంగారామ్, జగద్గిరిగుట్ట సీఐ సైదులు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ఆచూకీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా గురువారం రాత్రికి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
వైరల్ వీడియో: ఎల్లలు దాటిన అనురాగం.. దాయాది దేశంలో ఊహించని ఆతిథ్యం
-
ఎల్లలు దాటిన అనురాగం.. దాయాది దేశంలో ఊహించని ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో నివసించే శ్యాంసన్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. కుమార్తె తానియా సరాయ్ టెన్నిస్ క్రీడాకారిణి. ఈ నెల ప్రథమార్థంలో ఐటీఎఫ్–జే 5 టోర్నమెంట్ కోసం మొయినాబాద్లోని అజీజ్నగర్కు చెందిన సత్తయ్య, ఆయన కుమార్తె ప్రిన్సీతో కలిసి పాకిస్తాన్ వెళ్లారు. అక్కడి వారిని కలిసే వరకు మనసు నిండా ఎన్నో సందేహాలు, సంకోచాలు.. భయాలు. కాగా.. అక్కడ పర్యటించిన పక్షం రోజుల్లోనే వారి అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. పాకిస్థానీల వెలకట్ట లేని ప్రేమాభిమానాలతో ఉబ్బితబ్బిబ్బయ్యామని.. ఆ అనుభవాలను శ్యాంసన్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. అనుమానాలతో అడుగుపెట్టాం.. పాక్లో జరిగిన రెండు టోర్నమెంట్లలో తానియా, ప్రిన్సీ పాల్గొనాల్సి ఉండటంతో ఈ నెల 4న అక్కడకు చేరుకున్నాం. వాఘా సరిహద్దులో దౌత్య అధికారులు మాకు ధైర్యం చెప్పారు. అయినా మనసులో తెలియని భయం. అక్కడి వాళ్లు ఎలా ఉంటారో? వారి ప్రవర్తన ఎలా ఉంటుందో? మైండ్ సెట్స్ ఏమిటి? భారతీయులు అనగానే ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఇలా మనసులో అనేక సందేహాలతో బోర్డర్ దాటాం. ఇస్లామాబాద్లోని ఓ హోటల్లో బస చేశాం. అక్కడకు దాదాపు 20 కి.మీ దూరంలోని అడవిలో జిన్నా స్టేడియంలో టోర్నమెంట్. దీంతో ప్రతి రోజూ వెళ్లి రావాల్సి వచ్చేది. తాహెర్ ఖాన్తో అనుభవాలు మర్చిపోలేం... ఈ నెల 10న గేమ్ పూర్తయిన తర్వాత హోటల్కు తిరిగి వెళ్లడానికి క్యాబ్ కోసం ప్రయత్నించినా దొరకలేదు. దీంతో నిర్మానుష్యంగా ఉండే షకర్పరియర్ మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అదే సమయంలో ఇస్లామాబాద్కు చెందిన తాహెర్ ఖాన్ తన వాహనంలో వస్తుండగా లిఫ్ట్ అడిగాం. వెంటనే ఆపి మా నలుగరినీ ఆయన తన కారులో ఎక్కించుకున్నారు. మేం భారతీయులం అని తెలిసిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి మాట ‘వారె వాహ్’. హోటల్ దగ్గర దింపడానికి ముందు తన ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. కరాచీ, ఇస్లామాబా ద్, లాహోర్ల్లో ఎనిమిది రెస్టారెంట్లకు యజమాని అయిన తాహెర్ యూట్యూబర్, బ్లాగర్ కూడా. చదవండి: ఐస్క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి.. పిల్లలతో ఆటలేంటి? I want my Indian friends & followers to watch this video. An Indian family who’re visiting Pakistan for his daughter’s tennis match in Islamabad. They met a good friend of mine Tahir Khan & asked for a lift. They’ve shared their experience in the video. This is Pakistan in real✌️ pic.twitter.com/S7VBrQawss — Ihtisham Ul Haq (@iihtishamm) November 8, 2022 విమర్శనూ పాజిటివ్గా.. పేదరికంలో ఉండీ పిల్లల భవిష్యత్తు కోసం అక్కడి వరకు వచ్చిన మమ్మల్ని చూసి మంత్రముగ్ధుడయ్యారు తాహెర్ ఖాన్. ఇస్లామాబాద్లోని తన రెస్టారెంట్కు తీసుకువెళ్లి పాకిస్తానీ వంటకాలతో పాటు హైదరాబాద్ బిర్యానీ వడ్డించారు. భోజనం చేస్తున్నప్పుడే తాహెర్ మా పిల్లల్ని ఉద్దేశించి ఏ దేశ క్రీడాకారులతో తలపడుతున్నారని అడిగారు. పాకిస్థానీయులతోనే అని చెప్పగా... ఎవరు గెలుస్తారంటూ ప్రశ్నించారు. చివరకు గెలుపు మా చిన్నారులదే అయింది. భోజనం ముగిసిన తర్వాత హైదరాబాద్ బిర్యానీ రుచి వివరాలను ఆయన అడిగారు. మా దగ్గర లభించే దానికి ఏమాత్రం సరిపోదన్నాం. సగం మంది డబ్బు తీసుకోలేదు.. ఇస్లామాబాద్లో ఆటోలు లేకపోవడంతో 15 రోజుల టూర్లో భాగంగా అనేక క్యాబ్లు ఎక్కాం. వాటి డ్రైవర్లతో మాటల సందర్భంలో మేం భారతీయులమని చెప్పాం. దాదాపు సగం మంది డబ్బులు తీసుకోలేదు. -
అదృశ్యమైన కారు డ్రైవర్ హత్య.. ప్రియుడితో కలిసి భార్య సుపారీ
సాక్షి, నల్గొండ/హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సమీప బంధువు ఘాతుకానికి తెగబడ్డాడు. వరుసకు తమ్ముడైన వ్యక్తిని సుపారీ కిల్లర్స్తో హత్య చేయించి నాగార్జునసాగర్ వెనుక జలాల్లో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటన నేరేడుగొమ్ము మండలంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, హతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన లావుడ్య రాగ్య(30)కు పెద్దవూర మండలం ఊరబావితండాకు చెందిన రోజాతో 12సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా, రాగ్య హైదరాబాద్లోని మణికొండలో కారు డ్రైవర్గా పని చేస్తూ అక్కడే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజాకు బావ వరుస అయిన ఇబ్రహింపట్నంలోని ఎల్లాపూర్తండాకు చెందిన లక్పతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. హత్యకు రూ.20లక్షల సుపారీ తమ సఖ్యతకు రాగ్య అడ్డుగా ఉన్నాడని లక్పతి, రోజా భావించారు. దీంతో అతడి అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లక్పతి నేరెడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన మాన్సింగ్, బాలోజీతో సుపారీ కుదుర్చుకున్నాడు. రాగ్యను హత్య చేస్తే రూ.20లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకుని.. పరిచయం పెంచుకుని.. సుపారీ కుదుర్చుకున్న మాన్సింగ్, బాలోజి వైజాక్ కాలనీలో చేపల బేరం చేస్తారు. వీరు బేరం నిమిత్తం తరచూ హైదరాబాద్కు వెళ్లే వారు. ఈ క్రమంలో లక్పతి వద్ద రాగ్య ఫోన్ నంబర్ తీసుకుని అతడితో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ప్రథకం ప్రకారం ఆగస్టు 19న రాగ్యను హత్య చేసి మృతదేహానికి ఇనుప కడ్డీలు కట్టి కాచరాజుపల్లి సమీపంలో సాగర్ వెనుక జలాల్లో పడవేశారు. చదవండి: బోర్కర్..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది విషాదంలో రాగ్య తల్లిదండ్రులు, పక్కన రాగ్య (ఫైల్) హైదరాబాద్లో కేసు నమోదు.. సెల్ఫోన్ ఆధారంగా.. రాగ్య రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 21న హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాగ్య తరచూ ఫోన్లో మాన్సింగ్, బాలోజీతో సంభాషించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యోందంత వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు మాన్సింగ్, బాలోజీలను తీసుకుని కాచరాజుపల్లికి తీసుకువచ్చారు. కృష్ణా వెనుక జలాల్లో మృతదేహం కోసం గాలించగా సాయంత్రం వరకు లభ్యం కాలేదు. ఈ క్రమంలో నిందితులను తమకు అప్పగించాలని అక్కడికి చేరుకున్న రాగ్య కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం రాళ్లు రువ్వడంతో రాగ్య బంధువులకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు సోమవారం రాగ్య మృతదేహాన్ని వెలికి తీసేందుకు గాలింపు చర్యలు చేపడతామని అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, రాగ్యను ఎక్కడ ఎలా హత్య చేశారు. హత్యోదంతంలో ఎంత మంది పాత్రధారులు? ఇందులో రాగ్య భార్య రోజా పాత్ర ఏ మేరకు ఉంది.? తదితర విషయాలు దర్యాప్తులో తేలుతాయని నేరేడుగొమ్ము పోలీసులు పేర్కొంటున్నారు. -
సెల్లార్లో తెల్లారిన బతుకులు
మణికొండ: నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ గుంతలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులపై మట్టి కూలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈఐపీఎల్ 10 ఎకరాల్లో 14 అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేప ట్టింది. అందులో భాగంగా పుప్పాలగూడ గ్రామం వైపు వెళ్లే రోడ్డు పక్కన సెప్టిక్ ట్యాంక్ నిర్మిస్తోంది. శనివారం అందులో 8 మంది కూలీలు దిగి సెంట్రింగ్ పనులు చేస్తుండగా సాయంత్రం పక్కన ఉన్న మట్టి ఒక్కసారిగా ఇద్దరిపై కూలింది. మిగిలిన వారు తప్పించు కున్నారు. మృతి చెందిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్ (40), వెంకటర మణ(42)గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరు కొద్దిరోజుల క్రితమే పనిలో చేరినట్టు తోటి కూలీలు పేర్కొన్నారు. వెంకటరమణ వద్ద జగద్గిరి గుట్ట చిరునామా తో ఉన్న ద్విచక్రవాహన ఆర్సీ లభించింది. పుప్పాలగూడలో అపార్ట్ మెంట్ సెల్లార్ గుంతలో మట్టి కూలిన విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక పనుల్లో పాల్గొన్నారు. గంటన్నర వ్యవధిలోనే ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పనులు ఆపాలని నోటీసు ప్రస్తుతం వర్షాకాలం రావటంతో సెల్లార్ల పనులను నిలిపివేయాలని మణికొండ మున్సిపాలిటీ అధికారులు ఈఐపీఎల్ సంస్థకు ఇటీవలే నోటీసు జారీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని భవనాల తోపాటు దీనికీ జారీ చేశామని, అయినా పనులను కొనసాగించటంతోనే అనర్థం జరిగిందని మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారి రాకేశ్ పేర్కొన్నారు. -
హైదరాబాద్లో 1, 2 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం
సాక్షి,హైదరాబాద్: సింగూరు ఫేజ్– 3 పైప్లైన్ లీకేజీలకు మరమ్మతుల కారణంగా బుధ, గురువారాల్లో నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి ప్రకటించింది. బుధవారం (జూన్ 1) ఉదయం 6 గంటల నుంచి గురువారం (జూన్2) ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్కు నీటి లీకేజీలు నివారించేందుకు శంకర్పల్లి సమీపంలో మూడు చోట్ల మరమ్మతు పనులను చేపట్టనున్నారు. దీంతో గండిపేట, నార్సింగి, మంచిరేవుల, మణికొండ, కోకాపేట, పుప్పాలగూడ, చందానగర్, హుడా కాలనీ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, తారానగర్, గంగారం, లింగంపల్లి రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల, గోపన్పల్లి, గుల్మొహర్ పార్కు, నేతాజీనగర్, నెహ్రూ నగర్, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, చింతలబస్తీ, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. (క్లిక్: సర్కారు స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ సర్వే షురూ..) -
అప్పీల్కు వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ధర్మాసనం హజరత్ హుస్సేన్ షావలీ దర్గా మణికొండ జాగీర్ భూముల విషయంలో ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్కు వెళ్తామని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ హజ్హౌస్లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. దర్గా భూముల అంశాన్ని సీరియస్గా తీసుకుంటామన్నారు. కోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణలతో సమీక్షి స్తామని చెప్పారు. ఆ 1,654 ఎకరాల 32 గుంటల భూమి వక్ఫ్బోర్డుదేనని, అందుకు ఆధారాలు, సర్వే నివేదికలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో వక్ఫ్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టు కూడా అవి వక్ఫ్ భూములేనని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో గెజిట్ను రద్దు చేయలేదని, మరోవైపు కట్టడాలకు సంబంధించి వక్ఫ్ బోర్డుకు పరిహారం చెల్లించాలని ప్రభు త్వాన్ని ఆదేశించిందన్నారు. ఒక్క సారి భూమి వక్ఫ్ అయితే ప్రపంచం అంతం వరకు అలానే ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో అప్పీల్కు వెళ్తున్నట్లు వెల్లడించారు. మణి కొండతోపాటు శామీర్పేట వక్ఫ్ భూములూ బోర్డువేనని చెప్పారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలోనే పెద్ద ఎత్తున వక్ఫ్ భూములు అన్యాక్రాంత మయ్యాయని ఆరోపించారు. -
తప్పిన రూ. 50 వేల కోట్ల భారం!
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లోని మణికొండ జాగీరు భూములకు సంబంధించి ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదానికి తెరదించుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జాగీర్ పరిధిలోని 1,654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని తేల్చిచెప్పింది. ఈ భూములు తమవేనంటూ 2006లో ఏపీ వక్ఫ్ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. అలాగే వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్లు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం వక్ఫ్ బోర్డు సవరణ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందు సవాల్ చేయొచ్చా వంటి అంశాలను విచారించిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం సోమవారం తుది తీర్పు వెలువరించింది. ‘‘ధార్మిక, మతపరమైన ప్రయోజనాల కోసం ఇచ్చిన భూమిపై రాష్ట్రానికి హక్కు లేదనలేం’’అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు పొరబడింది.... ఈ కేసులో వాస్తవాలు, పరిస్థితులకు సంబంధించి ఇరు పక్షాల చట్టబద్ధమైన పరిష్కారంలో హైకోర్టు పొరపడిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మెరిట్స్పై ఈ అంశాలను పరిష్కరించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. తన ఆస్తిని రక్షించుకోవడానికి కోర్టును ఆశ్రయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. 1954 చట్టం, 1995 చట్టం ప్రకారం వక్ఫ్బోర్డు అనేది చట్టబద్ధమైన అథారిటీ అని, అయితే, వక్ఫ్ బోర్డుకు సంబంధించి అధికారిక గెజిట్లో ప్రచురితమైన నోటిఫికేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 1995 చట్టంలోని సెక్షన్ 40 (1) ప్రకారం విచారణ జరిపాక సందేహాస్పద ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తా కాదా అనే విషయంపై ఎలాంటి నిర్ధారణ కాలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. నజీమ్ అతియత్ అధికారం కమ్యుటేషన్ నిబంధనలకు మాత్రమే పరిమితమైందని... మష్రుత్–ఉల్–ఖిద్మత్ భూమి లేదా మదద్ మాష్ భూమి వ్యవహారాలు నజీమ్ అతియత్ అధికార పరిధిలోకి రావని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో వక్ఫ్బోర్డు చేసిన వాదనను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రాపర్టీని స్వాధీనం చేసుకొనే క్రమంలో రాష్ట్ర హక్కులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 జోక్యం చేసుకోబోదని స్పష్టం చేస్తూ ఖాజామియా వక్ఫ్ ఎస్టేట్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసును ధర్మాసనం ఉటంకించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాథన్, వి.గిరి, న్యాయవాది పాల్వాయి వెంకట్రెడ్డిలు వాదనలు వినిపించారు. -
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉదయమే వాతావారణం చల్లబడింది. దీంతో ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్గూడ, నాగోల్, మీర్పేట్, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్ఘాట్, అంబర్పేట్, హిమాయత్నగర్, రామంతపూర్, చే నంబర్, గోల్నాక, ఉప్పల్, సైదాబాద్, మలక్పేట్, చాదర్ఘాట్, దిల్షుఖ్నగర్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. -
జూబ్లీహిల్స్లో దారుణం.. బ్యూటీ పార్లర్కు వచ్చిన యువతిని బయటకు లాక్కొచ్చి
సాక్షి, బంజారాహిల్స్: స్నేహితురాలి వెంటపడి వేధించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... మణికొండలో నివాసం ఉంటున్న యువతి(26)రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. బండ్లగూడ సమీపంలోని సన్సిటీలో నివాసం ఉంటున్న సమయంలో ఆమెకు పరిచయం ఉన్న రవికిరణ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెను వెంబడించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించడంతో రాయదుర్గం పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఇదిలా ఉండగా ఈ నెల 24న సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని గాయత్రీహిల్స్లో బ్యూటీ పార్లర్కు వచ్చిన యువతిని బయటకు లాక్కొచ్చిన రవికిరణ్ తనతో పాటు రావాలని కారులోకి లాక్కున్నాడు. ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తప్పించుకుని పారిపోయింది. ఈ మేరకు బాధితురాలు శనివారం రాత్రి జూబ్లీహిల్స్పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు రవికిరణ్పై ఐపీసీ 354(ఏ), (డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కొడుకుల ప్రోత్సాహంతో.. పెళ్లైన 25 ఏళ్లకు మళ్లీ పెళ్లి..!
సాక్షి, మణికొండ: ఓ జంట పెళ్లైన 25 ఏళ్లకు వారి కుమారుల ప్రోత్సాహంతో మళ్లీ పెళ్లి పీటలెక్కారు. హైదరాబాద్లోని చంపాపేటకు చెందిన సి.నాగిరెడ్డి చదువుకునే సమయంలో తన జూనియర్ సంస్కృతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో స్నేహితుల మధ్య వీరి వివాహం 1996లో నిరాడంబరంగా జరిగింది. కొన్ని రోజులకే కుటుంబ సభ్యులు అంగీకరించి ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. చదవండి: న్యూఇయర్ వేడుకలు: లిక్కర్ టార్గెట్పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ అప్పట్లో ప్రేమ వివాహం, కానీ వివాహం బంధువుల మధ్య జరగలేదనే కోరిక ఆ దంపతుల్లో ఉండిపోయింది. దీంతో వారి కుమారులు శ్రీజయసింహారెడ్డి, సుజయ్సింహారెడ్డిలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. శుక్రవారం రాత్రి శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి దేవాలయంలో తిరిగి వివాహం చేసుకున్నారు. చదవండి: పోలీసు కొలువులకు కేరాఫ్ అడ్రస్గా ఆ గ్రామం.. ఇదంతా ఆయన స్ఫూర్తితోనే.. ఇప్పడు తిరిగి వివాహం చేసుకుంటున్న దంపతులు -
ఇన్నోవా కారులో ముగ్గురు.. ఎలాంటి లెక్కలు లేవు.. రూ. కోటి స్వాధీనం
సాక్షి, మణికొండ: ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ఎలాంటి లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ. కోటి నగదును నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టగా టీఎస్ 15ఈబీ 3993 నెంబర్ గల ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా ఆపి తనిఖీ చేయగా నగదు దొరికింది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియో: సీఎం ప్రాథమిక విచారణలో భాగంగా వారు రూ.కోటి రూపాయలను నగదుగా హ్యాకర్లకు ఇస్తే వారు ఇతరుల బ్యాంక్ అకౌంట్లనుంచి తస్కరించి తమకు రూ. 2 కోట్లను బ్యాంక్ అకౌంట్లలోకి వేస్తారని అంగీకరించారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఇన్కంట్యాక్స్ శాఖకు అప్పగిస్తామని, తదుపరి విచారణతో పాటు వీరి వ్యవహారాలపై మంగళవారం లోతుగా విచారణ జరుపుతామన్నారు. అప్పటి వరకు డబ్బుతో దొరికిన వారి పేర్లు.. వివరాలను ఇచ్చేందుకు నార్సింగి పోలీసులు నిరాకరించారు. చదవండి: మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం -
‘డబ్బు’ల్ ధమాకా!
మణికొండ(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అక్రమాలకు అంతులేకుండాపోతోంది. మాస్టర్ప్లాన్లో రోడ్డుగా చూపిన స్థలంలో బహుళ అంతస్తు భవనానికి అనుమతి ఇచ్చిన ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఒక లేఔట్కు అనుమతి జారీ చేసిన హెచ్ఎండీఏ.. అందులోని ప్రజావసరాలకు వదిలిన స్థలాన్ని కలుపుకొని మరో లేఔట్కు పర్మిషన్ ఇచ్చింది. రెండో లేఔట్ జారీ చేసేనాటికే.. ఈ ఖాళీ స్థలం స్థానిక గ్రామ పంచాయతీకి గిఫ్డ్డీడ్ కింద రిజిస్ట్రేషన్ కూడా కావడం గమనార్హం. హెచ్ఎండీఏ చేసిన తప్పును ఎత్తిచూపాల్సిన స్థానిక పురపాలక సంఘం.. లేఔట్ కాపీని పట్టించుకోకుండా తమ పేరిట రిజిష్టర్ అయిన ఖాళీ స్థలంలో వేరొకరికి బిల్డింగ్ పర్మిషన్ను జారీ చేసింది. భవన నిర్మాణ అనుమతి సమయంలో స్థల యజమాని ఎవరనేది కూడా చూడకుండా మున్సిపాలిటీ గుడ్డిగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అవినీతి భాగోతం ఐటీ హబ్ సమీపంలోని మణికొండ పురపాలిక పరిధిలో జరిగింది. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమికి స్కెచ్ వేసిన రియల్టర్లకు కొందరు పెద్దలు, అధికారులు కూడా తోడు కావడంతో భవన నిర్మాణానికి పునాది పడింది. పంచాయతీ పేర రిజిస్ట్రేషన్ 17.36 ఎకరాల విస్తీర్ణంలో వేసిన తిరుమలహిల్స్ లేఔట్లో 8,633 గజాలను పార్కు స్థలాలుగా నిర్దేశించారు. ఈ మేరకు ఈ విస్తీర్ణాన్ని స్థానిక పంచాయతీకి 1993లో గిఫ్ట్డీడ్ కూడా చేశారు. మూడేళ్ల క్రితం ఈ పంచాయతీ మణికొండ మున్సిపాలిటీలో విలీనం కావడంతో డాక్యుమెంట్లను ఇక్కడకు బదలాయించారు. విలువైన ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సిన మున్సిపల్ యంత్రాంగం.. కనీసం కంచె కూడా వేయకుండా వదిలేసింది. అంతేగాకుండా.. ఈ స్థలాన్ని చూపుతూ మరో లేఔట్ వెలిసినా చోద్యం చూస్తూ ఉండిపోయింది. దీంతో బిల్డర్ల ఆటలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వేసిన రెండో లేఔట్లో ఇళ్ల నిర్మాణాలకు టౌన్ప్లానింగ్ విభాగం పర్మిషన్లు జారీ చేస్తుండటం విశేషం. స్కెచ్ వేశారు.. చెక్కేశారు పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 87, 119లో 17.36 ఎకరాలలో తిరుమల్హిల్స్ పేరిట 1990లో హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హుడా) 10132/ఎంపీ2/హుడా/1990 పేరిట లేఔట్కు అనుమతి ఇచ్చింది. హుడా అనుమతి ఇచ్చిన వెంచర్ కావడం.. నగరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడి ప్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. క్రమేణా ఈ వెంచర్ కాస్తా సంపన్నుల కాలనీగా మారింది. దీంతో ఖాళీ స్థలాలపై పాత రియల్టర్ల కన్ను పడింది. పాత వెంచర్లోని ఖాళీ స్థలాలకు పక్కనే మరికొంత స్థలాన్ని (వేరే యజమాని) కలుపుకొని రెండో లేఔట్కు ప్రణాళిక రచించారు. హెచ్ఎండీఏ అధికారులతో కుమ్మక్కై 6 వేల గజాల పార్కు స్థలాన్ని (మొదటి లేఔట్లో చూపిన) కాజేసే ఎత్తుగడకు తెర లేపారు. రెండో లేఔట్ ప్రకారం స్థలాలను అమ్మేసి రియల్టర్లు చెక్కేశారు. తాజాగా ఈ ప్లాట్లను కొన్నవారు ఇళ్ల నిర్మాణాలకు రావడం.. మొదటి లేఔట్లో కొనుగోలు చేసినవారు వీరిని అడ్డుకోవడంలో అసలు కథ బయటపడింది. మరో విచిత్రమేమిటంటే.. రెండో లేఔట్లో నిబంధనలకు అనుగుణంగా కేటాయించాల్సిన పార్కు స్థలాన్ని పక్కనే ఉన్న అజయ్హిల్స్ కాలనీ పార్కును చూపడం. అధికారుల వైఫల్యం హుడా అనుమతులతో వచ్చిన లేఔట్లో పార్కు స్థలాలను అప్పటి పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినా వాటిని పరిరక్షించడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలోనే ప్రహరీ నిర్మాణం చేస్తే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – డాక్టర్ పి.అవినాష్, తిరుమలహిల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసు ఉండగా అనుమతులా..? తమ కాలనీ పార్కు స్థలాలుగా చూపిన దాన్నే తిరిగి హెచ్ఎండీఏ అధికారులు లేఔట్కు అనుమతి ఇవ్వటం దారుణం. దాన్ని రద్దుచేశామని ఒకవైపు చెబుతునే మరోవైపు మున్సిపాలిటీ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వటం మరింత దారుణం. సదరు భూమి విషయం కోర్టులో ఉన్నా ఇలాంటి చర్యలు జరగటాన్ని ప్రభుత్వం సమర్ది్థస్తుందా..? లేదంటే అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వం, శాఖలపై నమ్మకం పెరుగుతుంది. – రంగాచారి, తిరుమలహిల్స్ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి నిబంధనల ప్రకారమే అనుమతులు హెచ్ఎండీఏ జారీ చేసిన లేఔట్ కావడంతోనే భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేశాం. సదరు లేఔట్ రద్దు అయిన విషయం తెలియదు. కాలనీవాసులు పేర్కొంటున్న పార్కు భూమి కోర్టు వివాదంలో ఉండటంతో దాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. గతంలో గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచే దానిపై వివాదాలు కోర్టులో ఉన్నాయి. – ఎస్.జయంత్, కమిషనర్, మణికొండ మున్సిపాలిటీ -
మణికొండ: యువతితో క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, మణికొండ: తన క్యాబ్లో వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ సన్సిటీలో మంగళవారం రాత్రి జరిగింది. సన్సిటీలో నివసిస్తున్న ఓ యువతి హైదరాబాద్ నుంచి క్యాబ్లో హైదర్షాకోట్కు వచ్చింది. ఆ తరుణంతో డ్రైవర్ ఆ యువతితో అసభ్యంగా మాట్లాడటం, చేయిపట్టుకుని లాగటంతో ఆమె క్యాబ్ దిగగానే స్థానికులకు ఆ విషయం తెలిపింది. దీంతో అక్కడున్న వారు అతనికి దేహశుద్ధి చేసి నార్సింగి పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేశామని సెక్టార్ ఎస్ఐ అన్వేష్రెడ్డి తెలిపారు. (చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం ) -
మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మణికొండలో రెయిలింగ్ సరిగా ఉంచకపోవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి రజనీకాంత్ మృతిచెందడం బాధాకరమని, ఆ సంఘటనకు పురపాలక శాఖ మంత్రిగా తాము బాధ్యత వహిస్తామని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. ఆ ఘటనపై ఇప్పటికే డీఈఈ, ఏఈఈలను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి కోరిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చామని, మిగతా రూ.5 లక్షలు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణలు అనేవి తమకు వారసత్వంగా వచ్చిన సమస్యలని, ఏడేళ్లలో టీఆర్ఎస్ హయాంలోనూ కొన్ని నాలాల ఆక్రమణలు చోటుచేసుకుని ఉండొచ్చని వివరించారు. మండలిలో సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమంపై జీవన్రెడ్డి అడిగిన ప్రశ్నకు మండలి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్రెడ్డి, ఎంఎస్ ప్రభాకరరావు అనుబంధ ప్రశ్నలు వేశారు. వీటిపై కేటీఆర్ స్పందించారు. చదవండి: నేను గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మార్పు.. కేసీఆర్ రోడ్డుమీదకు -
నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్!
సాక్షి, మణికొండ: వరదలో ఓ వ్యక్తి కొట్టుకు పోయి మృతిచెందిన సంఘటనలో మరో అధికారిపై వేటు పడింది. సెప్టెంబర్ 25న మణికొండ మునిసిపాలిటీ గోల్డెన్ టెంపుల్ ఎదుట నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ కాలువలో కొట్టుకుపోయిన రజినీకాంత్(42) రెండు రోజుల తరువాత నెక్నంపూర్ చెరువులో తేలిన విషయం తెలిసిందే. ఆ సంఘటనకు నిర్లక్ష్యంగా పనులు చేపట్టడమే కారణంగా చూపుతూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ ఏఈ విటోభను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మణికొండ, షాద్నగర్, పరిగి మునిసిపాలిటీలతో పాటు మిషన్భగీరథకు ఇంచార్జిగా పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాజిద్ను సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ శాఖ రాష్ట్ర అధికారులు తమ కార్యాలయానికి పిలిచి సస్పెన్షన్ ఉత్తర్వులను అందించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మణికొండ మునిసిపల్ కమిషనర్ జయంత్ వివరణ కోరగా సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసిందని నిర్ధారించారు. కాగా, మునిసిపల్ కమిషనర్ జయంత్పై కూడా ఆ శాఖ దృష్టి సారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతనిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం కాంట్రాక్టర్తో పాటు సబ్కాంట్రాక్టర్పైనా విచారణ : ఈ సంఘటనపై ఇప్పటికే మునిసిపాలిటి కమిషనర్ కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారికంగా టెండర్ తీసుకున్నది రాజ్కుమార్ కాగా పనులను మాత్రం కుమార్ అనే మరో సబ్ కాంట్రాక్టర్ చేపడుతున్నాడు. దీంతో పూర్తి వివరాలను అందించాలని నార్సింగి పోలీసులు మునిసిపల్ కమిషనర్కు లేఖ రాశారు. వివరాలు అందగానే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామని నార్సింగి సీఐ గంగాధర్ పేర్కొన్నారు. చదవండి: ఇంటి ఆవరణలో నాలుగు లారీల చెత్త జమ చేసి.. ఓ మహిళ వింత ప్రవర్తన -
మణికొండ నాలా విషాదం: బాధిత కుటుంబానికి పరిహారం
హైదరాబాద్: మణికొండ నాలా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా.. నాలాను తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకుండా అశ్రద్ధగా వ్యవహరించినందుకు... కాంట్రాక్టర్ రాజ్కుమార్పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విధుల్లో అలసత్వం వహించినందుకు... మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ వితభానును కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులను జారీచేసింది. మృతుని కుటుంబానికి రూ. 5లక్షలను పరిహారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈనెల 25న రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా మరమ్మతుల కోసం తీసిన గుంతలోపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రజనీకాంత్ గల్లంతయ్యారు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత నెక్నాంపూర్ చెరువులో బాధితుడి మృతదేహం లభించిన విషయం తెలిసిందే. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం -
కెఎస్ఆర్ లైవ్ షో 28 September 2021
-
మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం
-
మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం
సాక్షి, హైదరాబాద్: మణికొండ: డ్రైనేజీ కాలువలో కొట్టుకు పోయిన వ్యక్తిని ఎట్టకేలకు గుర్తించారు. సంఘటనా స్థలానికి పక్కనే ఉండే బాబానివాస్ అపార్ట్మెంట్ నుంచి శనివారం రాత్రి బయటకు వచ్చిన గోపిశెట్టి రజనీకాంత్ (42)నే మృతుడిగా తేల్చారు. డ్రైనేజీ కాలువలో పడిన స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని నెక్నాంపూర్ చెరువు ప్రవేశంలో సోమవారం డీఆర్ఎఫ్ బృందం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి అన్న, బావలు అతని చాతీపై ఉన్న ‘సప్పు’ అనే టాటూ గుర్తించి రజనీకాంత్గా నిర్ధారించారు. 35 గంటల పాటు మురుగునీటిలో ఉండటంతో శవం కుళ్లిపోయింది. నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్, ఎస్సై రాములుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రజనీకాంత్ షాద్నగర్లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, అతని భార్య స్వప్న హైటెక్ సిటీలోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం హైదరాబాద్ నగరంలోని రాంనగర్ కాగా మణికొండలో ఫ్లాట్ కొనుగోలు చేసి ఇక్కడ నివసిస్తున్నట్టు బంధువులు తెలిపారు. చేతిలో పెరుగు ప్యాకెట్తో... డ్రైనేజీ కాలువలో కొట్టుకుపోయిన రజనీకాంత్ చేతిలో పెరుగు ప్యాకెట్ను అలాగే పట్టుకుని ఉన్నాడు. శనివారం రాత్రి ఇంట్లోనుంచి బయటకు వచ్చి ఓ షాపులో పెరుగు ప్యాకెట్ను కొనుగోలు చేసి పక్కనే ఉన్న మరో షాపులో సిగరెట్ కొనుగోలు చేసేందుకు రోడ్డు దాటుతూ వరదనీటిలో పడిపోయారు. అతను దాటిన ప్రదేశంలో అంతకు ముందు మట్టి ఉండటం, వరదకు అది కొట్టుకుపోయిందని గమనించకుండా కాలుపెట్టడంతోనే సంఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. -
Hyderabad: మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు
-
డ్రైనేజీ గుంతలో గల్లంతైన వ్యక్తిని గాలిస్తున్నాం: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: మరోసారి హైదరాబాద్ వరదలో మునిగింది. శనివారం రాత్రి రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. చాలా చోట్ల పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. కాగా మణికొండలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యాడు. బంగారు ఆలయం రోడ్డులో నడుస్తూ వెళ్తున్న ఓ వ్యక్తి ఒక చోట అడుగుపెట్టగా గుంత ఉండడంతో ఆ గుంతలో పడిపోయాడు. వరద భారీగా ఉండడంతో ఆ వరదలో కొట్టుకుపోయాడు. డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు కోసం ఇక్కడ పెద్ద ఎత్తున గుంతలు తవ్వారు. భారీ వర్షం పడడంతో వర్షపు నీరుతో గుంతలు నిండిపోయాయి. అదే సమయంలో అటుగా వచ్చిన వ్యక్తి గుంత ఉన్నట్టు తెలియకపోవడంతో అక్కడ అడుగు పెట్టగా ఒక్కసారిగా నీటిలో పడి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాలిస్తున్నారు. నీటిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. కాగా ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మణికొండ ఘటన దురదృష్టకరమని తెలంగాణ మంత్రి సబితారెడ్డి తెలిపారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఘటన స్థలాన్ని ఆమె సందర్శించి గాలింపు చర్యలను వేగం పెంచారు. వ్యక్తి ఎవరనేది గుర్తిస్తున్నామని, గాలింపు చర్యల్లో ఎక్కడా లోపం లేదని స్పష్టం చేశారు. వర్షాకాలంలో ఎక్కడైనా పనులు చేస్తుంటే అక్కడ బారికేట్లు పెట్టాలని అధికారులను సూచిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనతో అధికారులను అప్రమత్తత చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం గుర్తిస్తే చర్యలు తీసుకుంటాం.. వీలైనంత త్వరగా వ్యక్తిని గాలించి పట్టుకుంటామని వివరించారు. -
కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే..
సాక్షి, మణికొండ: నగర శివారులో ఐటీ జోన్కు, ఔటర్రింగ్ రోడ్డుకు పక్కనే ఎత్తైన కొండలుగా ఒకదానిపై మరొకటి పేర్చినట్టుగా ఉండి చూపరులను ఇట్టే ఆకట్టుకునేవి కోకాపేట కొండలు. ప్రకృతి, రాతి ప్రేమికులను ఆకట్టుకోవటంతో పాటు వందలాది రాతి పనుల కార్మికులకు ఉపాధిని చూపటం, అనేక పక్షి, వృక్ష జాతికి నెలవుగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొండల్లో సగభాగం, పక్కనే ఉన్న భూములను వేలం వేయడంతో రికార్డు స్థాయిలో ఎకరం రూ.14.25కోట్లు పలికాయి. దీంతో వాటిల్లో కొంత మేర కొండలు పోయి అద్దాల మేడలు లేచాయి. రూపురేఖలు కోల్పోతున్న కోకాపేట గుట్టలు ఇటీవల కోర్టు కేసు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రావటంతో మిగిలిన మరింత భూమిని ఇటీవల వేలం వేయడంతో కొనుగోలుదారులు అత్యధికంగా ఎకరం రూ.56కోట్ల వరకు పోటీ పడికొన్నారు. వాటి పక్కనే కొన్ని కులసంఘాలకు భూములను కేటాయించారు. ఇంకేముంది అన్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన వారికి హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం కొండలను చదును చేయడం, రోడ్లు, తాగునీటి సౌకర్యం, తదితర మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు చూడముచ్చటగా ఉన్న రాతి కొండలు వేగంగా కరిగిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా గతంలో కొనుగోలు చేసిన సంస్థలతో పాటు హెచ్ఎండీఏ వారు పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. చదవండి: తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీషీటర్ -
స్నేహితులతో కలిసి ఆకలి తీర్చుకోవడానికి వెళ్తూ.. అంతలో..
సాక్షి, మణికొండ( హైదరాబాద్): గండిపేట పరిధిలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాగ్లాగ్ క్లియర్ చేయడానికి వచ్చిన ఓ విద్యార్థికి తోడుగా మరో నలుగురు స్నేహితులు ఆకలి తీర్చుకోవడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని నార్సింగి పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు భారత్ క్వాలిటీ ఇంజినీర్స్ సంస్థ పేరుతో ఉంది. జీడిమెట్ల సమీపంలోని కొంపల్లి, సుచిత్ర ప్రాంతాలకు చెందిన కౌస్తుభ్ (21) సీబీఐటీలో ఇంజినీరింగ్ (ఈఈఈ) విద్యనభ్యసించాడు. ఉన్నత విద్యనభ్యసించడానికి విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. బ్యాక్లాగ్గా ఉన్న ఒక సబ్జెక్ట్ పూర్తి చేసుకుంటేనే అది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో దానిపై దృష్టి పెట్టాడు. తిని వద్దామని బయల్దేరగా.. గురువారం బ్యాక్లాగ్ సబ్జెక్ట్కు సంబంధించిన పరీక్ష రాయడానికి వస్తున్న కౌస్తుభ్ వెంట అతడి స్నేహితులు జోడెన్ (21), ప్రకాష్, దీపక్, ఆశీష్ వచ్చారు. ఈ నలుగురితో కౌస్తుభ్ తన మారుతి కారులో సీబీఐటీ కళాశాల వద్దకు చేరుకున్నారు. పరీక్ష ప్రారంభం కావడానికి అరగంటకు పైగా సమయం ఉండటంతో ఏదైనా తినివద్దామని కారులో సీబీఐటీ నుంచి ఖానాపూర్లోని దాబాకు బయలుదేరారు. కౌస్తుభ్ వాహనాన్ని నడుపుతుండగా.. పక్కన సీట్లో జోడెన్, వెనుక సీటులో మిగిలిన ముగ్గురూ కూర్చున్నారు. అదుపు తప్పి.. స్తంభాన్ని ఢీకొట్టి.. ఈ అయిదుగురు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళుతోంది. స్నేహితులంతా మాటల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎదురుగా వెళ్తున్న ఆటోను దూరం నుంచి గమనించలేకపోయారు. సమీపంలోకి వచ్చాక హఠాత్తుగా ఆటోను చూసిన కౌస్తుభ్ దానిని తప్పించే ప్రయత్నంలో ఎడమ వైపునకు కట్ చేశాడు. అదుపుతప్పిన వాహనం హైటెన్షన్ కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. దాదాపు సగభాగం విరిగిపోయిన ఆ స్తంభంలోని ఓ భాగం కారుపై పడింది. అది తగలడంతో జోడెన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్రంగా గాయపడిన కౌస్తుభ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో కన్నుమూశాడు. క్షతగాత్రులైన ముగ్గురిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్, నార్సింగి పోలీస్స్టేషన్ అడ్మిన్ ఎస్సై అనిల్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘నాన్న జాగ్రత్త.. టైమ్కి మందులు వేసుకో’
మణికొండ: ముందు రోజు రాత్రి ఫోన్లో నీ ఆరోగ్యం సరిగా చూసుకో.. మందులు సమయానికి వేసుకో అని తండ్రికి జాగ్రత్తలు చెప్పి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని గిరిగిరిగడ్డలో చోటు చేసుకుంది. నార్సింగి సెక్టార్ ఎస్సై బలరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం... జనగాం జిల్లా కుర్చెపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి తిరుపతిరెడ్డి హెచ్ఎండీఏలో 8ఏళ్లుగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గిరిగిరిగడ్డలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి తన తండ్రి వెంకట్రెడ్డికి ఫోన్ చేసి ఆరోగ్యం సరిగా చూసుకోవాలని సూచించి ఫోన్ పెట్టేశాడు. రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
విషాదం: కరోనా వ్యాక్సిన్కు భయపడి యువకుడు..
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు వేస్తున్న టీకాపై ఇంకా ప్రజల్లో భయాలు తొలగడం లేదు. తాజాగా ఓ యువకుడు వ్యాక్సిన్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండ ప్రాంతంలో కుటుంబీకులతో కలిసి శివప్రకాశ్ (21) నివసిస్తున్నాడు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కొద్దిరోజులుగా శివప్రకాశ్కు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి శివప్రకాశ్ జంకుతున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబీకులు కొద్దిగా ఒత్తిడి చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టంలేని శివ ప్రకాశ్ జూన్ 12వ తేదీన విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. -
ఫొటోలు తీశాడని ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి
సాక్షి, మణికొండ: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్పై దాడిచేసి గాయపర్చిన ఓ లారీ డ్రైవర్తో పాటు యజమానిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై బలరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం ఉదయం నార్సింగి చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేశ్ తన విధుల్లో భాగంగా నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్నారు. అదే క్రమంలో అటుగా వచ్చిన టిప్పర్ డ్రైవర్ కానిస్టేబుల్పై దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో లారీ డ్రైవర్ రఫీక్, యజమాని రమణలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
బ్లేడుతో తల్లి బెదిరింపు.. తానే కోసుకున్న బాలుడు
సాక్షి, మణికొండ: గేమ్స్ ఆడుకునేందుకు ఫోన్ ఇవ్వాలని కుమారుడు విసిగిస్తుండటంతో భయపెట్టడానికి తల్లి కుమారుడి కాళ్లను బ్లేడ్తో చిన్నగా కోసింది. అయితే తానే కోసుకుంటానంటూ ఆ బాలుడు బ్లేడుతో గాయాలు చేసుకున్నాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని గంధంగూడ జేఎన్ఎన్ఆర్ఎంయూ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గంధంగూడలో ఉంటున్న చంద్రకళ కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఏడో తరగతి చదువుతున్న ఆమె కుమారుడు శంకర్(12).. సోమవారం రాత్రి ఫోన్ ఇవ్వాలని గొడవచేయసాగాడు. విసిగివేసారిన ఆమె భయపెట్టాలని భావించి బ్లేడ్తో కాలిపై చిన్నగా కోసింది. అయితే, తానే కోసుకుంటానని అదే బ్లేడ్ తీసుకుని పలుమార్లు శంకర్ కోసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా తన తల్లి ఫోన్ ఇవ్వనందుకు తానే బ్లేడుతో కోసుకున్నానని శంకర్ పోలీసులకు రాతపూర్వకంగా తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గంగాధర్ తెలిపారు. -
అమ్మాయిగా ఫేక్ ప్రోఫైల్: సుమంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిలను లోబరుచుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న సుమంత్ను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... నకిలీ ఇన్స్ట్రాగ్రామ్ ప్రోఫైల్తో అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న సుమంత్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సుమంత్ విజయవాడకు చెందిన వాడని, హైదరాబాద్లోని మణికొండలో ఉంటూ అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. రాత్రి అయ్యిందంటే ఇన్స్ట్రాగ్రామ్లో అమ్మాయిలా మారిపోయి మిగతా అమ్మాయిలతో చాటింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడని, ఇంటర్నెట్ నుంచి యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వాటితో నకిలీ ప్రోఫైల్ క్రియోట్ చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: లైంగిక వేధింపులు: అతడు ఆమెగా..) ఇలా అమ్మాయి మాదిరిగా వాళ్లతో చాటింగ్ చేయడంతో అవతల వాళ్లు కూడా అమ్మాయి అనుకొని క్లోజ్గా మాట్లాడేవారన్నారు. ఈ క్రమంలో వారంతా తమ బలహినతలను నిందితుడితో చెప్పుకోవడం చేశారని, అది ఆయుధం చేసుకున్న నిందితుడు వారిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించేవాడన్నారు. అమ్మాయిల అశ్లీల ఫొటోలను నెట్నుంచి డౌన్లోడ్ చేసి అవి వారికి పంపించి బ్లాక్మెయిల్ చేస్తూ నిందితుడు సుమంత్ కామావాంఛలు తీర్చుకునేవాడని తెలిపారు. కాగా ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు అధికం అవుతున్నాయని, ఇలాంటి వారిని గుర్తించడం కష్టం అన్నారు. యువత అపరిచితులతో చాటింగ్ చేయకూడదని, చాలా జాగ్రత్తలు పాటించడం మంచిదని ఏసీపీ హెచ్చారించారు. -
కొడుకుతో కలిసి కూతురి భర్త హత్య
సాక్షి, గచ్చిబౌలి: మణికొండలోని బోటిక్ నిర్వహిస్తున్న యువకుడిని కిడ్నాప్ చేసి మొయినాబాద్ పీఎస్ పరిధిలోని నక్కలపల్లిలో హత్య చేసిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం సీఐ రవీందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎండీలైన్స్ టోలీచౌకీ ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్(25) మణికొండ, షిరిడీ సాయి కాలనీలో బోటిక్ నిర్వహిస్తున్నాడు. అతని సోదరుడు రిజ్వాన్ హఫీజ్పేట్లోని ఓ బట్టల దుకాణంలో సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. ప్రతి రోజు సల్మాన్ తమ్ముడిని ఉదయం షాపు దగ్గర వదిలి రాత్రి ఇంటికి తీసుకెళ్లేవాడు. గత నెల 29న రాత్రి సల్మాన్ తమ్ముడికి ఫోన్ చేసి హఫీజ్పేట్కు వస్తున్నట్లు చెప్పాడు. అయితే అతను రాకపోవడంతో మణికొండకు వెళ్లి చూడగా షాపు మూసి వేసి ఉంది. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో 30న రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా బైక్పై వెళుతున్న సల్మాన్ను గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించి కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ బావమరిది దస్తగిరిని అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలిపారు. సల్మాన్ను కిడ్నాప్ చేసి క్వాలీస్లో తీసుకెళ్లామని, కారులోనే బైక్ క్లచ్ వైరు మెడకు బిగించి హత్య చేసి నక్కలపల్లి శివార్లలోని చెరువు వద్ద పారవేసినట్లు తెలిపాడు. ఆదివారం సల్మాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 2019 డిసెంబర్లో సల్మాన్కు పర్హానాతో వివాహం జరిగింది. గత కొన్ని నెలలుగా భార్యను వేధిస్తుండటంతో ఇరు కుటుంబాల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. దీంతో పర్హానా మూడు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. దీనిని జీర్ణించుకోలేని పర్హానా తండ్రి జిలానీ అల్లుడి హత్యకు పథకం పన్నాడు. తన సమీప బంధువు దస్తగిరి, మరికొందరితో కలిసి సల్మాన్ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. కాగా ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారి వివరాలు వెల్లడికావాల్సి ఉందని సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: రెట్టింపైన క్యాబ్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: పద్మారావునగర్కు చెందిన రోహిత్ నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ నుంచి మణికొండకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సాధారణ రోజుల్లో రూ.350 చార్జీ నమోదు కాగా ప్రస్తుతం రూ.550కి పెరిగింది. అత్యవసరమైన పని కావడంతో తప్పనిసరిగా బయలుదేరవలసి వచ్చింది. బంజారాహిల్స్ నుంచి రాంనగర్ వరకు ప్రతి రోజు క్యాబ్లో ప్రయాణం చేసే గోపీనాథ్కు భారీగా పెరిగిన చార్జీలతో బెంబేలెత్తాడు. లాక్డౌన్కు ముందు రోజుల్లో అయితే ఆ రూట్లో రూ.110 నుంచి రూ.120 వరకు చార్జీ అయ్యేది. కానీ ఇప్పుడు రూ.180 నుంచి రూ.220 వరకు నమోదవుతున్నాయి. ఒక్కోసారి అది రూ.250 వరకు పెరిగిపోతుంది. (హైదరాబాద్-తిరుపతి మధ్య తగ్గనున్న దూరం) ఇది ఏ ఒక్క రూట్కు పరిమితమైన చార్జీలు కాదు. నగరంలోని అన్ని రూట్లలోనూ కొద్ది రోజులుగా క్యాబ్ చార్జీలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. లాక్డౌన్కు ముందు, తరువాత క్యాబ్ చార్జీల్లో గణనీయమైన తేడా నమోదవుతోంది. ఒకవైపు ప్రయాణికుల డిమాండ్కు తగిన విధంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడం, మరోవైపు ఎంఎంటీఎస్ ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో మెట్రోరైళ్లు అందుబాటులో లేని మార్గాల్లో ప్రయాణికులు ఎక్కువ శాతం ఆటోలు, క్యాబ్లపైన ఆధారపడాల్సి వస్తుంది. ప్రయాణికుల అవసరాన్ని, డిమాండ్ను క్యాబ్ సంస్థలు ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్నాయి. అరకొర సదుపాయాలే... అన్లాక్ 4.0 నుంచి క్రమంగా జనజీవన సాధారణ స్థాయికి చేరుకుంది. రాకపోకలు పెరిగాయి. మొదట్లో మెట్రో రైళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అన్లాక్ 5.0 తరువాత పరిమితంగా సిటీ బస్సులను పునరుద్ధరించారు. సాధారణంగానే గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి రోజు సుమారు 30 లక్షల మంది సిటీ బస్సుల్లో తిరుగుతారు. మరో 10 లక్షల నుంచి 15 లక్షల మంది క్యాబ్లు, ఆటోల్లో ప్రయాణం చేస్తారు. కరోనా కారణంగా ప్రయాణాలు తగ్గినప్పటికీ లాక్డౌన్ సడలింపులతో ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. ఉద్యోగ, వ్యాపారాల కోసమే కాకుండా అన్ని రకాల అవసరాల కోసం వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కానీ ఇందుకు తగినట్లుగా రవాణా సదుపాయాల పునరుద్ధరణ జరగలేదు. ఐటీ రంగం ఇంకా ప్రారంభం కాకపోవడంతో క్యాబ్లు తక్కువగా తిరుగుతున్నాయి. గతంలో 1.5 లక్షల క్యాబ్లు ఉంటే ఇప్పుడు 60 వేలకు తగ్గాయి. తిరిగి ఐటీ పుంజుకుంటే తప్ప క్యాబ్ సదుపాయం మెరుగుపడకపోవచ్చునని అంచనా. సాధారణ రోజుల్లో కనీసం 50 లక్షల మంది వివిధ రకాల ప్రజా రవాణా సదుపాయాలను వినియోగించేవారని భావించినా ఇప్పుడు అందులో సగం మందికి సరిపడా ప్రజారవాణా కూడా అందుబాటులో లేదు. 3000 బస్సులకు బదులు 1000 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. మరో 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ఇంకా పునరుద్ధరణకు నోచలేదు. దీంతో అరకొర సదుపాయాలపైన ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తుంది. లేదంటే వ్యక్తిగత వాహనాలపైన ఆధారపడాల్సి వస్తుంది. డ్రైరన్ పేరిట హాఫ్ రిటర్న్... ఈ క్రమంలోనే క్యాబ్ సంస్థలు చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. ప్రయాణికులు కోరుకున్న చోట నుంచి క్యాబ్ అందుబాటులో లేదనే సాకుతో డ్రైరన్ పేరిట అదనపు చార్జీలు విధిస్తున్నారు. ఉప్పల్లో బుక్ చేసుకొనే ప్రయాణికుడికి అక్కడికి దగ్గర్లో క్యాబ్ అందుబాటులో లేదనే కారణంతో తార్నాక నుంచి రప్పిస్తారు. తార్నాక నుంచి ఉప్పల్ వరకు ఖాళీగా వచ్చినందుకు ఆ మొత్తాన్ని ప్రయాణికులపైన మోపుతున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఇదే తరహాలో ప్రయాణికుల డిమాండ్కు తగినట్లుగా క్యాబ్లు అందుబాటులో లేవనే కారణంతో సర్చార్జీలు విధిస్తున్నారు. డ్రైరన్ పేరిట భారం మోపుతున్నారు. ఆటోల్లోనూ అదే దోపిడీ కొనసాగుతోంది. ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగుతున్నారు. కమీషన్లో మార్పు లేదు ఇదంతా క్యాబ్ సంస్థల మాయాజాలమే. డ్రైరన్ వల్ల బలయ్యేది డ్రైవర్లే. ప్రయాణికుల దగ్గర అదనంగా వసూలు చేసే చార్జీలు క్యాబ్ సంస్థలకే వెళ్తున్నాయి. మా దగ్గర మాత్రం ప్రతి రైడ్కు యథావిధిగా 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 20 శాతానికి తగ్గిస్తే డ్రైవర్లకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ క్యాబ్ సంస్థలు ఆ పని చేయడం లేదు. – షేక్ సలావుద్దీన్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ -
లిఫ్ట్లో తండ్రీకూతుళ్ల నరకయాతన
సాక్షి, హైదరాబాద్ : తండ్రి కూతురు లిఫ్ట్లో ఇరుక్కుని నరకయాతన పడిన సంఘటన హైదరాబాద్లోని మణికొండలో చోటు చేసుకుంది. ల్యాంకో హిల్స్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆదివారం తన కూతురుతో కలిసి లిఫ్ట్ ఎక్కాడు. అయితే సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ ఆగిపోయింది. సహాయం కోసం 40 నిమిషాల పాటు అతడు ఆర్తనాదాలు చేశాడు. అయినా ఎవరూ రాకపోవడంతో స్వయంగా లిప్ట్ తలుపులు తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. చివరకి తన ప్రయత్నం ఫలించి తలుపులు తెరచుకోవడంతో లిఫ్ట్ నుంచి కూతురితో క్షేమంగా బయటపడ్డారు. ఆ దృశ్యాలు ఆక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. -
ఇది ఆరంభం మాత్రమే
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ ఐటీరంగం విస్తరణలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతోంది. వరంగల్లో టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ రెండు కంపెనీలు రావడంతోనే సంతృప్తి చెందట్లేదు. హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం వరంగల్. ఇంకా చాలా కంపెనీలు రావాలి. వేలాది మందికి ఉద్యోగాలు లభించాలి. వరంగల్కు తొలుత ఒక్క సైయంట్ కంపెనీ వచ్చింది. ఆ తర్వాత టెక్ మహీంద్రా వచ్చింది. ఒక దాని తర్వాత మరో కంపెనీ వస్తుంది. హైదరాబాద్, వరంగల్ కాదు.. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మంతో పాటు దశల వారీగా అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాలన్నదే సీఎం కేసీఆర్ కల. ఈ కల సాకారం కానుంది’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ సెజ్లో ఏర్పాటు చేసిన టెక్ మహీం ద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంట ర్లను కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మడికొండలోని ఐటీ సెజ్లో టెక్ మహీంద్రా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సీఈఓ గురునాని, మంత్రి కేటీఆర్ పారిశ్రామిక కారిడార్.. ‘రెండేళ్ల కిందట ఆనంద్ మహీంద్రా, బీవీఆర్ మోహన్రెడ్డిని కలిసి వరంగల్లో కంపెనీ పెట్టాలని కోరాం. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారు కంపెనీలు పెట్టారు. ఐటీ తెలం గాణ జిల్లాల కు విస్తరించడం వరంగల్ నుంచి ప్రారంభమైంది. టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీ ల ఏర్పాటు ద్వారా హైదరాబాద్ కాకుండా తెలంగాణ జిల్లాల్లో శ్రీకారం జరిగింది. ఈ కంపెనీల ద్వారా వరంగల్లో 10 వేల మందికి ఉపాధి కల్పించాలి’అని కేటీఆర్ కోరారు. హైదరాబాద్–వరంగల్ మార్గం పారిశ్రామిక కారిడార్గా మారబోతోందని స్పష్టం చేశారు. ఆలేరు, భువనగిరి, జనగామ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్లో ఆహారశుద్ధి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐటీ, వ్యాపార, పరిశ్రమల వరంగల్ ప్రాంతాలను మరింత విస్తరించేందుకు మామునూరు ఎయిర్పోర్టును తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు. జీఎంఆర్ సంస్థనే ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని, సానుకూలంగా స్పందించే అవకాశముందన్నారు. అప్పటి వరకు హెలీపోర్ట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. మరో హరిత విప్లవం.. రాష్ట్రంలో త్వరలోనే రెండో హరిత విప్లవం రాబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సాగు, తాగు నీటి విషయంలో సీఎం కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు విప్లవాత్మకమైన మార్పులతో టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాలు యజ్ఞంలా కొనసాగుతున్నాయని, కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడి నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాల భూమి సాగులోకి రానుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇప్పటికీ 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు. కొరియాకు చెందిన యంగ్టక్ కంపెనీ 8 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు. మరో 18 సంస్థలు టెక్స్టైల్స్ పార్కులో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్లు దాస్యం వినయ్భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్రెడ్డి, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ నాని, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లిఫ్ట్ కిందపడి బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలోని రోడ్ నెంబర్ 10, టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ధనుష్ అనే ఓ బాలుడు ఆడుకుంటూ లిఫ్ట్ కిందపడి చనిపోయాడు. ఈ సంఘటన బాలుడి కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. కాగా ధనుష్ కుటుంబం రెండు నెలల క్రితమే ఈ అపార్ట్మెంట్కు వచ్చింది. -
అయోధ్య కోసం మోదీ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: అయోధ్య భూ సమస్య పరిష్కారానికి పధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని అటల్బిహారీ వాజ్పేయిలు చేసింది ఏమీ లేదని, పీవీ నర్సింహారావు హయాంలోనే అయోధ్య.. శ్రీరామచంద్రునిదని స్పష్టమైందని పూరీ గోవర్ధన పీఠం పీఠాధీశ్వరుడు జగద్గురు శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి మహరాజ్ అన్నారు. ఆయన సోమవారం నగర శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీ సత్యనారాయణస్వామి, శ్రీ శారధామాత (గోల్డన్టెంపుల్)దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లా డారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రామమందిరం గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. ఇప్పటికైనా అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం అయినందుకు హిందువులంతా సంతోషించాలన్నారు. దేశంలో ఆదిశంకరులు స్థాపించిన నాలుగు జగద్గురు పీఠాలు మాత్రమే ధర్మ నిష్టతో అనాదిగా అవిచ్ఛిన్న పరంపరతో ధార్మిక దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. -
మణికొండలో ఎమ్మెల్యే రోజా పూజలు
మణికొండ: ఏపీలని చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజామంగళవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. ఆమె తరచూ ఈ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించి, గోమాతకు ఆహారంఅందజేశారు. -
ఫీజులు పెంచొద్దు
మణికొండ: కళాశాలలో చేరే సమయంలో పేర్కొన్న ఫీజులనే చెల్లిస్తాం తప్ప పెంచిన ఫీజులను చెల్లించే ప్రసక్తే లేదని విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన బాటపట్టారు. రెండు రోజుల పాటు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా యాజమాన్యం దిగిరాకపోవటంతో గురువారం ఏకంగా పరీక్షలను సైతం బహిష్కరించి రోడ్డెక్కారు. గండిపేట మండల కేంద్రంలో ఉన్న చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి రూ.1.20 లక్షల ఫీజు తీసుకుంటామని యాజమాన్యం అప్పట్లో పేర్కొంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల విషయంపై తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తూ కొన్ని కళాశాలల వారు కోర్టును ఆశ్రయించారు. దాంతో రాష్ట్ర హైకోర్టు కళాశాలల్లో అదనపు సౌకర్యాలు ఉన్న పలు కళాశాలలకు అదనపు ఫీజు వసూలు చేసుకునే వీలు కల్పించింది. దాంతో గత సంవత్సరం నుంచి విద్యార్థుల వద్ద రూ.1.20 లక్షలకు బదులుగా కోర్టు సూచించిన విదంగా రూ.2లక్షలు వసూలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలో సీట్లు పొందిన ఎ కేటగిరీ విద్యార్థుల నుంచి యథావిధిగానే ఫీజు వసూలు చేస్తామని సర్క్యులర్ జారీచేయడంతో అప్పట్లో విద్యార్థులు శాంతించారు. ఈ సంవత్సరం నుంచి యాజమాన్యం, ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు పొందిన బి కేటగిరీ విద్యార్థుల నుంచి పెంచిన ఫీజలు చెల్లించాలని నిర్ణయించారు. ఆ విషయం తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా ఆందోళన బాటపట్టారు. కళాశాల ప్రాంగణంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫీజుల చెల్లింపు విషయంలో ప్రశ్నించిన ఒక విద్యార్థిని ప్రిన్సిపాల్ కొట్టడంతో పాటు మరో నలుగురు విద్యార్థుల దుస్తులు విప్పి బంధించారని విద్యార్థులు ఆరోపించారు. -
మన కూరగాయలను సద్వినియోగం చేసుకోండి
మణికొండ: మన తెలంగాణ–మన కూరగాయల పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవా లని భారీ నీటిపారుదల, మార్కెటింగ్శాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. ఆదివారం పథకం ప్రారంభోత్సవానికి ఆయన మణికొండకు వచ్చారు. మర్రిచెట్టు సర్కిల్లో ఏర్పాటు చేసిన స్టాల్ను ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రభు త్వం ప్రతిష్టా త్మకంగా అమలుచేస్తోం దని తెలిపా రు. అనంతరం మణికొండలోని పంచవటి కాలనీ ప్రవేశంలో స్టాల్ను ఏర్పాటు చేయాలని కోరామని, అది అమలు కాలేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హరీష్రావు మార్కెటింగ్ శాఖ అధికారులపై మండిపడ్డారు. మణికొండలో రెండు స్టాళ్లను ఏర్పాటు చేయాలని గతంలో తాను ఆదేశించినా ఒకటే ఎందుకు సిద్ధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం ఆదేశించినా ఇప్పటివరకు ప్రక్రియ పూర్తి చేయకపోవడం ఏంటని నిలదీశారు. సర్వేనెంబర్ 42లోని ప్రభుత్వ భూమిలోని కొంత స్థలాన్ని తమకు కేటాయిస్తామని తహసీల్దార్ చెప్పి.. ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతోనే స్టాల్ ఏర్పాటు చేయలేకపోయామని మార్కెట్ అధికారులు మంత్రికి వివరించారు. దీంతో హరీష్రావు.. సదరు విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కు సూచించారు. పక్కనే ఉన్న ఎంపీపీ తలారి మల్లేశ్ కలగజేసుకుని తహసీల్దార్తో మాట్లాడి ప్రతిపాదనలు పంపించామని, కలెక్టర్ స్థలం కేటాయించాలని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్తో చర్చించి త్వరలోనే స్టాల్ ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మన కూరగాల పథకంలో అటు రైతులతో పాటు ఇటు కొనుగోలుదారులకు న్యాయం జరుగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎంపీపీ తలారి మల్లేశ్, సర్పంచ్లు నరేందర్రెడ్డి, నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, మహేందర్గౌడ్, మార్కెట్ ప్రత్యేక కార్యదర్శి పద్మహర్ష, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మమతాశ్రీనివాస్, వైస్ చైర్మెన్ శ్రీరాములు తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ
-
ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ
-
ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీనటి రోజా నివాసంలో చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దొంగలు అపహరించారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండ గ్రామపంచాయతీ పంచవటి కాలనీలో రోజా కుటుంబం నివసిస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆమె భర్త సెల్వమణి చెన్నైకి వెళ్లారు. ఏపీలోని తన నియోజకవర్గం నగరిలో సాగుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో రోజా ఉండిపోయారు. ఆదివారం రాత్రి రోజా, సోమవారం ఉదయం సెల్వమణి తిరిగి ఇంటికి వచ్చారు. పండుగకు ఊరెళ్లి వచ్చిన పనిమనిషి ఆదివారం సాయంత్రం బీరువా, కప్బోర్డుల తాళాలు తీసి ఉండటాన్ని గమనించింది. దీంతో దొంగతనం విషయం వెలుగులోకి వచ్చింది. చిన్న, చిన్న వెండి వస్తువులు, ప్లేట్లు, లక్ష్మీదేవి దీపాలు, కప్పులు, పన్నీర్పుట్టి, మూడు చేతి గడియారాలు, బంగారు గొలుసు, నెక్లెస్, డైమండ్ కమ్మలు, డైమండ్ బిల్ల, బంగారు గాజులు కలిపి మొత్తం 14 తులాల బంగారం, 2 కిలోల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ నెల 12 నుంచి ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళంచెవుల సెట్టు చాలారోజుల నుంచి కనిపించడంలేదు. దానిని చేజిక్కించుకున్నవారే నేరుగా ఇంట్లోకి ప్రవేశించి ఆభరణాలను తస్కరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు రోజా దంపతులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తమ వద్ద పనిచేసి మానేసిన డ్రైవర్లు, పనివాళ్ల వివరాలను పోలీసులకు అందజేశారు. -
వైభవంగా మణిమకొండ జాతర
వనదేవతలకు మంగళస్నానం మోతుగూడెం (రంపచోడవరం) : ఒడిశా ప్రభుత్వం ఆంధ్రాలోని చింతూరు మండలం పొల్లూరు జలపాతం వద్ద రెండేళ్లకోసారి నిర్వహించే మణిమకొండ జాతరలో సోమవారం గిరిజన పూజారులు వనదేవతల మంగళస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం వనదేవతలైన కన్నమరాజు, బాలరాజు, పోతురాజు, ముత్యాలమ్మ ఉత్సవ మూర్తులను సీలేరు నది దాటించి ఉరేగింపుగా పొల్లూరు గ్రామానికి తీసుకువచ్చి భక్తుల సందర్శన నిమిత్తం గంటసేపు ఉంచారు. అనంతరం ఊరేగింపుగా రథాన్ని పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ గిరిజన పూజారులు గృహ కింద గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేయగా, అమ్మవారు వారి పూజలకు సంతృప్తి చెంది పూజారులకు ‘బంగారు చేప’ అవతారంలో దర్శినమిచ్చిందన్నారు. దాంతో పూజారులు వనదేవతలకు గంగా జలంతో మంగళస్నానం చేయించి రూపంలేని దేవతమూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేయించారు. తిరిగి వనదేవతలను సాయంత్రం మూడు గంటలకు ఒడిశా తరలించారు. ఐటీడీఏ పీవో చినబాబు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీరు ఎల్.మోహన్రావు, లక్కవరం ఫారెస్ట్ రేంజర్ జి.ఉషారాణి, ఎమ్మార్వో జగన్మోహన్రావు, తులసిపాక పీహెచ్సీ డాక్టర్ క్రాంతికిరణ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్యాంప్రసాద్ తదితరులు వనవదేవతలను దర్శించుకున్నారు. -
అరచేతిలో సమాచారం
మణికొండ: సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన అదనపు సమాచారం అరచేతిలో ఉంటుందని ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నార్సింగ్ గురుకుల పాఠశాలలో మూడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కియోస్క్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటీఎంల తరహాలో ఇవి పాఠశాలల ఆవరణలో 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. గూగుల్లో వెతికినట్టు వెతికితే పాఠ్యాంశానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు, యానిమేషన్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎక్కువ సమాచార సేకరణతో పాటు... పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ఇవి దోహద పడతాయని పేర్కొన్నారు. టచ్సీ్క్రన్ రూపంలో ఇవి పని చేస్తాయన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఇలాంటివి ప్రవేశపెడతామన్నారు. పరిరక్షించుకుందాం: పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరం పాటుపడాల్సిన అవసరం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల రాష్ట్ర కమిషనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నార్సింగ్ గురుకుల పాఠశాలలో ఢిల్లీకి చెందిన టెరీ యూనివర్సిటీ విద్యార్థులు పర్యావరణంపై నిర్వహించిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణతో పాటు వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి, షేక్పేట్, మహీంద్రాహిల్స్, ఇబ్రహీంపట్నం కళాశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు, గురుకుల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త ఏవీ రంగారెడ్డి, నార్సింగ్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
మణికొండలో షార్ట్సర్క్యూట్: రూ.కోటి నష్టం
మణికొండ పంచాయతీ పరిధి మణికొండ గార్డెన్ కాలనీలో సోమవారం ఉదయం సోమవారం షార్ట్ సర్క్యూట్ సంభవించింది. 11కేవీ వైరు తెగి మరో వైర్పై పడటంతో కాలనీలోని దాదాపు వంద ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి. వైరింగ్తోపాటు టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు కూలర్లు, మీటర్లు, ఫ్యాన్లు దగ్దమై పోవటంతో కోటి మేర నష్టం వాట్లిందని స్థానికులు తెలిపారు. కాలనీలోని పాఠశాలలో వైర్లు కాలటంతో భయంతో విద్యార్థులు పరుగులు తీశారు. -
జిమ్ 'మాస్టర్'
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జిమ్ 'మాస్టర్'గా మారారు. అదేంటి అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఆయన కొద్దిసేపు జిమ్ లో వ్యాయామం చేసి సందడి చేశారు. చిరు వ్యక్తిగత ట్రైనర్ జి.ప్రవీణ్ రెడ్డి మణికొండలో 'రాగాస్ ఫ్లెక్స్ జిమ్'ను ఏర్పాటు చేయగా, దానిని మెగాస్టార్ ఆదివారం ప్రారంభించారు. అత్యాధునిక ప్రమాణాలతో మోడ్రన్ జిమ్ ను నెలకొల్పాడని ప్రవీణ్ ను చిరంజీవి అభినందించారు. చేతికి కట్టుతోనే ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చిరంజీవి తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. తన కుమార్తె శ్రీజ పెళ్లి వేడుకల్లో భాగంగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిసి పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొన్నట్టు సోషల్ మీడియాలో షేర్ అయిన ఫొటోలోనూ మెగాస్టార్ చేతికి కట్టుతోనే కనిపించారు. -
ఓ ఇంట్లో చోరీ : బంగారం అపహరణ
విజయవాడ : కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో మంగళవారం ఆర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దొంగలు ఓ ఇంట్లో చోరబడి 13 కాసుల బంగారంతోపాటు రూ. లక్ష నగదు అపహరించారు. ఆ విషయాన్ని బుధవారం గుర్తించిన ఇంటి యజమానులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ఇంటికి చేరుకుని... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. -
విరబూసిన బ్రహ్మకమలం
మణికొండ(హైదరాబాద్): సంవత్సరానికి ఒకేసారి పూసే బ్రహ్మకమలం మణికొండలోని ఓ ఇంట్లో విరబూసింది. ఒకే సారి ఐదు పువ్వులు పూయడంతో స్థానికులు దాన్ని చూసేందుకు క్యూ కట్టారు. మణికొండ పంచాయతీ పరిధిలోని సెక్రటేరియట్ కాలనీలో నివసిస్తున్న నీటి పారుదల శాఖ విశ్రాంత ఎస్ఈ ముప్పర కుమారరత్నం గత కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం మొక్కను తెచ్చి పెంచుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా... ఏటా ఒకే పువ్వు పూయగా ఈ ఏడాది మాత్రం మంగళవారం అర్ధరాత్రి ఏకంగా ఐదు పువ్వులు పూసిందని ఆయన తెలిపారు. హిమాలయాల్లోనే ఉండే ఈమొక్క ఇంట్లో ఉంటే మంచిదని తెలపటంతో తెచ్చి పెంచుకుంటున్నామని చెప్పారు. -
జనపథం@ మణికొండ
-
పేకాట స్ధావరాలపై దాడి, మహిళల సహా 8మంది అరెస్ట్
హైదరాబాద్ : పేకాట స్ధావరాలపై సైబారాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు గత కొంతకాలంగా నగర శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ఇష్టానుసారంగా జరుగుతున్న పేకాట స్థావరాలపై నిరంతరంగా దాడులు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా మరో అడ్డా గుట్టురట్టయింది. 15 రోజుల క్రితం రామంతాపుర్లో ఓ ఇంటిపై ఎస్వోటీ సీఐ పుష్పన్కుమార్ అధ్వర్యంలో జరిపిన దాడిలో పురుషులతో పాటు ముగ్గురు మహిళలు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా నిన్నరాతి ఎస్వోటీ సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మణికొండలోని ల్యాంకో హిల్స్ ఫ్లాట్లో జరిపిన దాడిలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిదిమంది ప్రముఖ వ్యక్తులు అడ్డంగా బుక్కయిపోయారు. వీరి వద్ద నుంచి రూ.3.48 లక్షల నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.