Neha
-
సోషల్ మీడియాకు దూరం.. సివిల్స్కు దగ్గర.. ఐఏఎస్ అధికారి నేహా సక్సెస్ స్టొరీ
ఈ ఆధునికయుగంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా.. ఈ రెండూలేని మన రోజువారీ జీవితాన్ని ఊహించలేం. అయితే సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న అద్భుతాలు మన దృష్టిని లక్ష్యాల నుంచి పక్కకు మళ్లీస్తున్నాయి. దీంతో చాలామంది తమ కెరియర్, జీవిత లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. దీనిని గుర్తించిన నేహా బయద్వాల్ తన కెరియర్ ఉన్నతి కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో తన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు నేహా బయద్వాల్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో విజయం సాధించేందుకు మూడేళ్ల పాటు మొబైల్ఫోన్కు దూరంగా ఉంటూ, ప్రిపరేషన్ కొనసాగించాలని ఆమె నిశ్చయించుకున్నారు.రాజస్థాన్లోని జైపూర్లో జన్మించిన నేహా.. జైపూర్లో తన పాఠశాల విద్యను, భోపాల్లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా నేహా తరచుగా పాఠశాలలు మారవలసి వచ్చేది. నేహా తండ్రి, శ్రవణ్ కుమార్ సీనియర్ ఆదాయపు పన్నుశాఖ అధికారి. ఆయనే నేహా ఐఏఎస్ అధికారి కావడానికి ప్రేరణగా నిలిచారు. యూనివర్సిటీ టాపర్గా నిలిచిన ఆమె యూపీఎస్సీ సీఎస్ఈ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. తన మొదటి మూడు ప్రయత్నాలలో నేహా పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యారు.ఈ నేపధ్యంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగం తన దృష్టిని మరలుస్తున్నాయని గ్రహించిన ఆమె వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వాటికి దూరంగా ఉన్నానని నేహా మీడియాకు తెలిపారు. తన ప్రిపరేషన్ సమయంలో నేహా స్నేహితులు, బంధువులకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా అనేక ఒడిదుడుకులతో పోరాడి, తన సామాజిక జీవితాన్ని కూడా త్యాగం చేసిన నేహా.. 2021లో తన నాల్గవ ప్రయత్నంలో యూపీఎస్సీ సీఎస్ఈని ఛేదించి, 569 ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. నేహా ఐఎస్ అధికారిగా ఎంపికైనప్పుడు ఆమె వయసు 24 మాత్రమే. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో నేహా ఇంటర్వ్యూలో 151 మార్కులతో కలిపి మొత్తం 960 మార్కులు సాధించారు. ఈ విజయం తరువాత నేహా బయద్వాల్ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో 28 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.ఇది కూడా చదవండి: ఐపీఎల్లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం -
విలేజ్లో మిస్టరీ
రవితేజ నున్నా, నేహ జురెల్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘‘విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే కమర్షియల్ సబ్జెక్ట్ ఈ చిత్రం. ఎన్నో ఇబ్బందులు పడి ఈ సినిమా పూర్తి చేశాం’’ అన్నారు రవితేజ. ‘‘ఈ సినిమాలో హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు ముత్యాల రామదాసు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సత్యరాజ్. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి. ∙నేహ జురెల్, రవితేజ నున్నా -
దిల్ రాజు చేతికి ఆ యాక్షన్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
లక్ష్ చదలవాడ, నేహా పఠాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ధీర'. వలయం, గ్యాంగ్స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్కు విశేషమైన స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్గా విడుదల కానుంది. అయితే ఈ మూవీ హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతమందించారు. -
వైరల్: అవునండీ... ఇది బిర్యానీ టీ
వేడి వేడిగా బిర్యానీ తింటే ఎంత మజా? ఆ తరువాత వేడి వేడిగా టీ తాగుతుంటే ఎంత మజా! ఆ మజాను ఈ మజాను మిక్స్ చేసి ‘బిర్యానీ టీ’ తయారుచేసింది ‘మాస్టర్ చెఫ్ 4’ విజేత నేహాదీపక్షా. టీ ఆకులు, దాల్చిన చెక్క, సోంపు, నల్లమిరియాలు, యాల కులు... మొదలైన వాటితో నేహా తయారు చేసిన ఈ ‘బిర్యానీ టీ’ చవులూరిస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా నెటిజనులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఆహో ఓహో!’ అని పొగడ్తల దండకం అందుకుంటే, మరి కొందరు ‘బిర్యానీ టీ అంటే ఏమిటో కాదు వేడి వేడి బిర్యానీని వేడి వేడి టీలో కలపడం’ అని జోక్ చేస్తున్నారు. ఐస్క్రీమ్ రోల్ మేకర్ కూలింగ్ పాన్ను ఉపయోగించి ఒక చెఫ్ తయారుచేసిన ‘స్క్రీమ్టీ’కూడా ఈమధ్య నెట్లోకంలో హల్చల్ చేసింది. -
చలిపులికి సవాలు విసురుతూ....
మైనస్ 16 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో చలికి చేతులు కొంకర్లు పోతాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం. అలాంటి వాతావరణంలో పుషప్లు చేయడం అంత వీజీ కాదు. అయితే ప్రముఖ ఫిట్నెస్ కోచ్ నేహా బంగియాకు అలాంటి వాతావరణం అవరోధం కాలేదు. కశ్మీర్కు వెళ్లిన నేహా అక్కడి ఆర్మీ సోల్జర్తో కలిసి స్పీడ్గా పుషప్లు చేస్తున్న వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. ‘ఇలాంటి అతిశీతల వాతావరణంలో కొన్నిరోజులు ఉండడానికే మాకు కష్టంగా అనిపించింది. మన సైనికులు మాత్రం ఇలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకొని దేశంకోసం పనిచేస్తున్నారు’ అని కాప్షన్లో రాసింది నేహా బంగియా. -
ఆ విభాగంలో భారత్కు తొలి పతకం.. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే!
Asian Games 2023- Neha Thakur Silver In Sailing: భారత్ ఖాతాలో మరో ఆసియా క్రీడల పతకం చేరింది. సెయిలింగ్(ఐఎల్సీఏ డింఘీ)లో నేహా ఠాకూర్ సిల్వర్ మెడల్తో మెరిసింది. దీంతో ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. ఇక ఈ మెగా ఈవెంట్లో సెయిలింగ్లో ఇండియాకు ఇదే తొలి మెడల్ కావడం విశేషం. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే? కాగా ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ 2019లో సెయిలింగ్ విభాగంలో ఐఎల్సీఏ డింఘీ పేరిట రేసులకు అనమతినిచ్చింది. ఇక ఐఎల్సీఏ డింఘీ-4 కేటగిరీలో మొత్తం 11 రేసులు ఉంటాయి. ఇందులో సెయిలర్ వరస్ట్ స్కోరును.. మొత్తం రేసు పాయింట్ల నుంచి మైనస్ చేస్తారు. తద్వారా నెట్ స్కోరును నిర్ణయిస్తారు. నేహా 11 రేసులలో మొత్తంగా పోటీ ముగిసేలోపు ఎవరైతే తక్కువ నెట్ స్కోరు కలిగి ఉంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. కాగా 19వ ఆసియా క్రీడల్లో నేహా ఠాకూర్ ఐఎల్సీఏ డింఘీ-4 విభాగంలో 11 రేసులలో కలిపి 32 పాయింట్లు స్కోరు చేసింది. ఐదో ప్రయత్నంలో అత్యల్ప స్కోరు సాధించగా.. నెట్ స్కోరు 27గా నమోదైంది. ఈ క్రమంలో థాయ్లాండ్కు చెందిన నొప్పాస్సాన్ ఖుబూంజాన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించి నేహా వెండి పతకం గెలుపొందింది. ఈ విభాగంలో థాయ్లాండ్కు స్వర్ణం, సింగపూర్కు కాంస్యం(కియారా మేరీ- నెట్ స్కోరు 28) దక్కాయి. ఇప్పటికి ఎన్ని పతకాలంటే? కాగా నేహా మధ్యప్రదేశ్లోని భోపాల్లో గల నేషనల్ సెయిలింగ్ స్కూల్లో సెయిలర్గా ఓనమాలు నేర్చుకుంది. ఇక చైనాలోని హోంగ్జూ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మంగళవారం(సెప్టెంబరు 26) మధ్యాహ్నం నాటికి భారత్ ఖాతాలో 2 పసిడి, నాలుగు రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: వరల్డ్కప్కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ 🥈🌊 Sailing Success! Neha Thakur, representing India in the Girl's Dinghy - ILCA 4 category, secured the SILVER MEDAL at the #AsianGames2022 after 11 races⛵ This is India's 1️⃣st medal in Sailing🤩👍 Her consistent performance throughout the competition has earned her a… pic.twitter.com/0ybargTEXI — SAI Media (@Media_SAI) September 26, 2023 -
రాజుగారి అమ్మాయి ప్రేమకథ
రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా సత్య రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి –నాయుడుగారి అబ్బాయి’. రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మించారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ లవ్ యు..’ అనే లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. రెహమాన్ సాహిత్యం అందించిన ఈ పాటని యాజిన్ నిజర్, నూతన్ మోహన్ పాడారు. ‘‘అందమైన ప్రేమకథతో రూపొందిన చిత్రం ఇది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ అలరిస్తుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
కొత్తవాళ్లు సక్సెస్ అవ్వాలి
విజయ్ రాజ్కుమార్, నేహా పఠాని జంటగా భరత్ మిత్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’. నవీన్ కురవ, కిరణ్ కురవ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ విష్ణు మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో కొత్తవాళ్లు విజయం సాధిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. దర్శకుడు భరత్కు మంచి విజన్ ఉంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘18–30 వయసు మధ్య ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు భరత్ మిత్ర. ‘‘ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా, సెకండాఫ్లో ఆడియన్స్ తల తిప్పుకోలేని సీన్స్ ఉంటాయి’’ అన్నారు విజయ్ రాజ్కుమార్. -
అమెరికాలో శ్రీమంతురాళ్లు.. వీళ్ల సంపద ఎంతో తెలుసా?!
న్యూయార్క్: Forbes Among America's 100 Richest Self Made Women : అమెరికాలోని టాప్ 100 సంపన్న మహిళల్లో (స్వయంగా ఆర్జించిన) నలుగురు భారత సంతతి వనితలకు చోటు లభించింది. పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రా నూయి(67), అరిస్టా నెట్వర్క్స్ (కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ) ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్(62), సింటే (ఐటీ కన్సల్టెంగ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేతి(68), కన్ఫ్లూయెంట్ (క్లౌడ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కడే (38) ఫోర్బ్స్ ‘అమెరికా సంపన్న మహిళల’జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి ఉమ్మడి సంపద 4.06 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33292 కోట్లు)గా ఉంది. 100 మంది మహిళలు ఉమ్మడిగా 124 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారని, ఏడాది క్రితంతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఫోర్బ్స్ తెలిపింది. జాబితాలో జయశ్రీ ఉల్లాల్ 2.4 బిలియన్ డాలర్ల సంపదతో 15వ ర్యాంకులో ఉన్నారు. ఉన్నత విద్యను అమెరికాలో అభ్యసించారు. నీర్జా సేతి 990 మిలియన్ డాలర్ల నెట్వర్త్తో జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. తన భర్తతో కలసి స్థాపించిన సింటెల్ను ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటోస్ ఎస్ఈకి 3.4 బిలియన్ డాలర్లకు 2018లో విక్రయించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన తర్వాత ఆక్లాండ్ వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. నార్కడే 520 మిలియన్ డాలర్ల నెట్వర్త్తో జాబితాలో 38వ స్థానంలో ఉన్నారు. కన్ఫ్లూయెంట్లో ఆమెకు 6 శాతం వాటాలున్నాయి. మరొకరితో కలసి ఆసిలర్ పేరుతో కొత్త కంపెనీని 2023 మార్చిలో స్థాపించారు. ఇంద్రా నూయి 2019లో పెప్సీకో సీఈవోగా రిటైర్ అయ్యారు. 350 మిలియన్ డాలర్ల నెట్వర్త్తో జాబితాలో 77వ స్థానంలో నిలిచారు. -
తొలి అడుగు
భద్ర, పద్మాకర్ రావ్ హీరోలుగా, నేహా, అంజలి హీరోయిన్లుగా ఉప్పలపాటి శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మిస్పా మూవీ మీడియాపై పద్మాకర్రావ్ చిన్నతోట, ఆర్.సువర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం కడపలో ప్రారంభమైంది. పద్మాకర్రావ్ చిన్నతోట మాట్లాడుతూ–‘‘పదహారేళ్లుగా మీడియా రంగంలో రాణిస్తున్న మా మిస్పా మూవీ మీడియా సంస్థ నిర్మాణ రంగంలో తొలి అడుగు వేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’గా గుర్తుండిపోతుంది'
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది. మా చిత్రాన్ని ఇండియాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు చూపించాలనేది మా లక్ష్యం' అని డైరెక్టర్ శివమ్ అన్నారు. బేబీ నేహా, బేబీ ప్రణతి రెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు నటించిన బాలల చిత్రం ‘లిల్లీ’. శివమ్ దర్శకత్వంలో కె. బాబురెడ్డి, సతీష్ కుమార్ .జి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూలై 7న) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సందర్భంగా శివమ్ మాట్లాడుతూ– 'కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి నా స్వస్థలం. డైరెక్టర్ కావాలనుకుని 13ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చా. రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, యాడ్ ఫిల్మ్ మేకర్గా చేశాను. మణిరత్నంగారి ‘అంజలి’ స్ఫూర్తితో చిన్న పిల్లలతో ఓ సినిమా చేద్దామని ‘లిల్లీ’ కథ రాశాను. నేనే డైరెక్టర్గా, నిర్మాతగా ఈ సినిమాని స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్, ఔట్పుట్ బాబురెడ్డిగారికి నచ్చడంతో ‘లిల్లీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేద్దామన్నారు. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరూ కడపకు చెందిన కొత్తవారే. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. నేను డైరెక్టర్ అయ్యేందుకు ప్రోత్సహించిన మా నాన్న నాంచారయ్య, అమ్మ వెంకటలక్ష్మి, నా భార్య సుధా శక్తి, ఫ్రెండ్స్కి, చాన్స్ ఇచ్చిన బాబురెడ్డిగారికి కృతజ్ఞతలు. గోపురం బ్యానర్లోనే నాలుగు సినిమాలు సైన్ చేశాను' అన్నారు. -
లక్షితా... ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?
ప్రతి ఒక్కరికీ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హైస్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నంతగా ప్రైమరీస్కూల్ ఫ్రెండ్స్లో చాలా తక్కువమంది మాత్రమే టచ్లో ఉంటారు. అయితే వారి చిత్రాలు మన మదిలో ప్రింటై పోయి ఉంటాయి. ఏదో ఒక సమయంలో వారు గుర్తుకు వస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేహాకు తన ఎల్కేజీ ఫ్రెండ్ లక్షిత గుర్తుకు వచ్చింది. ‘ఎక్కడ ఉందో? ఎలా ఉందో’ అనే ఆసక్తి మొదలైంది. వెంటనే ‘ఫైండింగ్ లక్షిత’ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఎకౌంట్ క్రియేట్ చేసింది. నేహా ఆన్లైన్ సెర్చ్ జర్నీకి లక్షలాది లైక్ వచ్చాయి అనేది ఒక విషయం అయితే, మరో విశేషం... నేహాను అనుసరిస్తూ ఎంతోమంది తమ ఎల్కేజీ ఫ్రెండ్స్ను వెదుక్కునే పనిలో పడ్డారు. ఇదొక ట్రెండ్గా మారింది. ‘నా ఎల్కేజీ ఫ్రెండ్ జాడ కోసం నేను కూడా నేహాలాగే చేశాను. ఇదొక మంచి ఐడియా. ఏదో ఒకరోజు నా ఫ్రెండ్ గురించి కచ్చితంగా తెలుసుకుంటాను’ అని ఒక యూజర్ రాసింది. -
టాప్ సింగర్స్ జంట.. విడాకుల బాట పట్టనుందా?
బాలీవుడ్ టాప్ సింగర్ లిస్ట్లో నేహా కక్కడ్ కూడా ఉంటుంది. ఆమె పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే! తన గాత్రంతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకుందీ సింగర్. అక్టోబర్ 24, 2020న బాలీవుడ్ సింగర్ రోహన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు జడ్జీలుగా ఉన్న సమయంలో వీరద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అప్పట్లోనే తెలిపారు. తాజాగా నేహా కక్కడ్ తన 35వ పుట్టినరోజు బాష్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. బర్త్డే పార్టీలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసుకుంది. (ఇదీ చదవండి: ప్రభాస్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి) తన తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో కలిసి శాండ్విచ్లు తింటూ పోజులిచ్చిన ఫోటోలు మాత్రమే అక్కడ కనిపించాయి. కానీ ఏ ఫోటోలోనూ నేహా భర్త రోహన్ కనిపించలేదు. దీంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. రోహన్ క్షేమంగానే ఉన్నాడా? అని ఒకరు అడిగితే, మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అని మరొకరు ప్రశ్నించారు. భర్త లేకుండా పార్టీలు చేసుకుందంటే గొడవలు ఉన్నట్లే కదా! అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. ఈ విషయంపై నేహ కక్కడ్తో పాటు రోహన్ కూడా నోరు మెదపక పోవడంతో బాలీవుడ్లో మరో జంట కూడా విడాకుల బాట పడుతుందేమో అనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. (ఇదీ చదవండి: తండ్రికి రెండో పెళ్లి చేస్తున్న బుల్లితెర నటి.. వధువుకు కూడా రెండోదే!) -
Neha Narkhede: టెక్నోస్టార్
పుణెలోని ఆ ఇంట్లో మరాఠీ, హిందీ పాటలతో పాటు పాఠాలు కూడా వినిపించేవి. అయితే అవి క్లాస్రూమ్ పాఠాలు కాదు. ఎన్నో రంగాలలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన మహిళల గురించిన గెలుపు పాఠాలు. ఆ పాఠాలు వింటూ వింటూ ‘నేను కూడా సాధిస్తాను’ అన్నది చిన్నారి నేహ. అవును ఆమె సాధించింది! ఫోర్బ్స్ అమెరికా ‘రిచ్చెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్–2023’ జాబితాలో వివిధ రంగాలకు చెందిన వందమంది మహిళలకు చోటు దక్కింది. వీరిలో పదకొండు మంది నలభై ఏళ్ల వయసులోపు ఉన్నవారు. వారిలో ఒకరు 38 సంవత్సరాల టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ నేహ నర్ఖాడే.... మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నేహ. ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తనకు కంప్యూటర్ కొనిచ్చారు. అప్పుడు టెక్నాలజీపై మొదలైన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్గా కొత్త కొత్త విజయాలు సాధించేలా చేస్తూనే ఉంది. తన బలం ‘తల్లిదండ్రులు’ అని చెప్పుకుంటుంది నేహ. ‘మొదట చదువు విలువ గురించి చెప్పారు. చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఎంతోమంది మహిళా రోల్మోడల్స్ గురించి చెప్పేవారు. నువ్వు కూడా ఏదైనా సాధించాలి అంటూనే... యస్. నువ్వు సాధించగలవు అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించారు’ అంటుంది నేహ. పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో చదువుకున్న నేహ ... జార్జియా (యూఎస్)లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసింది. జార్జియాలో చదువుకునే రోజుల్లో ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అనే విషయంలో ఎంతోమంది స్నేహితులతో చర్చిస్తూ ఉండేది. ‘ఒరాకిల్’లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తొలి ఉద్యోగం చేసిన నేహ ఆ తరువాత ‘లింక్ట్ ఇన్’లో చేరింది. ఆ సమయంలో రకరకాల స్టార్టప్లు, వాటి విజయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘అపాచీ కాఫ్కా’ అనే ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్కు శ్రీకారం చుట్టింది. కంపెనీలు తమ డాటాతో వేగంగా యాక్సెస్ అయ్యే అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ కల్పిస్తుంది. ‘ఎలాంటి జటిలమైన సమస్యను అయినా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి’ అనేది లక్ష్యంగా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల తరువాత ‘కన్ఫ్లూయెంట్’ అనే ఫుల్–స్కేల్ డాటా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది నేహ. ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు ‘కన్ఫ్లూయెంట్’ నుంచి సేవలు పొందుతున్నాయి. కంపెనీకి సంబంధించి భాగస్వాములు, ఉద్యోగులను ఎంచుకోవడంలో నేహ అనుసరించే పద్ధతి ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘తెలివితేటలతో పాటు కష్టపడే స్వభావం ముఖ్యం. వీరితో ఐడియాలు షేర్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించాలి. సమస్య తలెత్తినప్పుడు మెరుపు వేగంతో పరిష్కరించే సామర్థ్యం ఉండాలి’ నేహ ఎంటర్ప్రెన్యూర్గా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు స్టార్టప్ కల్చర్పై ఇప్పుడు ఉన్నంత అవగాహన లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేసినా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుండేది. వెంటనే ఆ తప్పును దిద్దుకొని ముందుకు సాగేది. నేహా నర్ఖాడే విజయరహస్యం ఏమిటి? ‘వ్యూహాలు, ప్రతివ్యూహల సంగతి తరువాత. ఎంటర్ప్రెన్యూర్లకు తప్పనిసరిగా కావాల్సింది మానసిక బలం. ఆ బలం ఉంటే యుద్ధరంగంలో అడుగు ముందుకు వేయగలం. విజయాలు సాధించగలం. ఇది నా దారి... అంటూ పరుగెత్తడం కాదు. చుట్టూ ఏం జరుగుతుందో అనేదానిపై పరిశీలన దృష్టి ఉండాలి. మన తప్పుల నుంచీ కాదు ఇతరుల తప్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. టైమ్మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి’ అంటుంది నేహ. నేహ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు రోల్మోడల్, తన రోల్మోడల్ మాత్రం ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ‘నియో’ ఫౌండర్, సీయివో పద్మశ్రీ వారియర్. ‘రోల్మోడల్ స్థానంలో మనల్ని మనం చూసుకుంటే వారిలా విజయం సాధించడం కష్టం కాదు’ అంటుంది నేహ నర్ఖాడే. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి. – నేహ -
టాయ్లెట్లో కూర్చొని మనం తినగలమా? మరి అలాంటప్పుడు..
టాయ్లెట్లో కూర్చొని మనం తినగలమా? మరి అలాంటప్పుడు తల్లులు తమ పిల్లలకు బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడానికి పబ్లిక్ టాయిలెట్లకు ఎందుకు వెళ్లాలి? సిగరెట్ తాగడం కోసం స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేస్తారు. కానీ, ఆకలితో ఉన్న పిల్లలకు పాలివ్వడానికి ప్రతిచోటా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్లు ఎందుకు లేవు? అందరి ముందు తమ బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రజల చెడు దృష్టిని ఎందుకు ఎదుర్కోవాలి? ఢిల్లీవాసి, న్యాయవాది నేహా రస్తోగి ఈ సమస్యల నుండి తల్లులను రక్షించడానికి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పింక్ టాయిలెట్లు, పిల్లలకు తల్లిపాలు ఇచ్చే గదులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఆమె ఈ దిశగా తన ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే ఉంది. ఇంతకీ నేహా రస్తోగి తల్లిపాల ఆలయాలు ఎందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. దీని ద్వారా ఆమె ఏం సాధిస్తోంది. లాయర్గా ఆమె పోరాటం దేనికి? ముందుగా తను ఎదుర్కొన్న సమస్యను వివరిస్తూ.. ‘‘నేను 2017, అక్టోబరులో మొదటిసారి తల్లిని అయ్యాను. నా బాబుకి మూడు నెలల వయసున్నప్పుడు బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి బయల్దేరాలి. గంటల గంటల ట్రాఫిక్ తాకిడిని తప్పించుకుంటూ విమానాశ్రయానికి చేరుకునేసరికి బాబు ఆకలితో ఏడుపు మొదలెట్టాడు. అక్కడ వాడికి పాలు ఎక్కడ ఇవ్వాలో తెలియలేదు. వాష్రూమ్లో తల్లి పాలు తల్లిపాలు పట్టేందుకు విమానాశ్రయంలోని వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్లైట్లో వాడికి మరోసారి ఆకలి వేసింది. పక్కన కూర్చున్న వ్యక్తిని ‘బిడ్డకు పాలు పట్టాలి, కొద్దిగా స్థలం ఇవ్వమని అడిగాను. కానీ, అతను కాదన్నాడు. ఎయిర్హోస్టెస్ను అడిగితే ‘టాయ్లెట్కి వెళ్లు’ అని చెప్పింది. చాలాసేపు ప్రాధేయపడ్డాక ఎయిర్ హోస్టెస్ కూర్చున్న చోట కూర్చుని, పిల్లవాడికి పాలు పట్టాను. బెంగళూరు విమానాశ్రయంలోనూ బిడ్డకు తల్లి పాలు పట్టేందుకు చోటు లేదు. అలా బిడ్డతో నా మొదటి ప్రయాణం వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా చాలా బాధకారంగా అనిపించింది. గంటల తరబడి నా కొడుకు ఆకలితో ఏడుస్తూ ఉంటే, నేను నిస్సహాయంగా ఉండిపోయాను. విషయ సేకరణ ఈ సంఘటన తర్వాత నేను దేశవ్యాప్త సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాను. దేశంలో ఎక్కడా చంటి బిడ్డలకు తల్లిపాలు పట్టే గదులు లేవని తెలిసింది. ఈ విషయంపై చాలా మంది మహిళలతో మాట్లాడి, వారి బాధాకరమైన అనుభవాలను విన్నాను. నాలాంటి తల్లులకు బహిరంగ ప్రదేశాల్లో పాలిచ్చే హక్కును కల్పించాలని, అందుకు ఎంతకాలం యుద్ధం చేసినా పర్వాలేదని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ఓ ఎంపీ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అప్పుడే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ ఈ కేసు విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో లక్షలాదిమంది చంటిబిడ్డలకు తల్లిపాలు ఇచ్చే ఏర్పాటు లేదని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. రైల్వేస్టేషన్, బస్టాప్, ఎయిర్పోర్ట్, మాల్స్తో సహా ప్రతి బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాల బూత్లు ఏర్పాటు చేయాలని కోర్టును కోరాను. తల్లులు పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలన్నాను. లైంగిక వేధింపులు బిడ్డలకు చనుబాలివ్వడానికి గదులు అందుబాటులో లేకపోవడంతో తల్లులు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే తమ పిల్లలకు పాలివ్వాల్సి వస్తోంది. ఈ సమయంలో వారు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లి గౌరవాన్ని దెబ్బతీసే వారు ఆమెను గౌరవంగా చూడరు. కంప్లైంట్ చేస్తే టాయ్లెట్లో కూర్చొని పాలు ఇవ్వమని సలహా ఇచ్చేవారున్నారు. కానీ, అటువంటి మురికి, దుర్వాసన ఉన్న ప్రదేశంలో కూర్చొని పాలు ఇవ్వడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికీ ప్రమాదకరం. ఈ సమస్యకు సంబంధించి అన్ని శాఖలు, ఏజెన్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2019లో నిర్ణయం తీసుకుని, ఫీడింగ్ రూమ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు పంపారు. హైకోర్టు తీర్పు తర్వాత చైనా, అమెరికా, లండన్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా దానిని కవర్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో కనీస సౌకర్యాలు కూడా లేవని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైకోర్టు నిర్ణయం తర్వాత పింక్ టాయిలెట్, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ప్రారంభమైంది. ఇందులో తల్లులకు ప్రత్యేక భోజన గదులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తల్లి హాయిగా కూర్చొని బిడ్డకు పాలు పట్టచ్చు. స్నానం చేసి, బట్టలు కూడా మార్చుకోవచ్చు. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్లోని పార్లమెంట్ స్ట్రీట్లో మొదటి ఫీడింగ్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సిఆర్లో 700కు పైగా పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఆలయాల నుంచీ.. షిర్డీలో సాయిబాబా ఆలయం నుండి తాజ్మహల్ వరకు తల్లిపాలు ఇచ్చే గదులు నిర్మించారు. బస్టాప్లు, రైల్వే స్టేషన్లలో తల్లిపాల క్యాబిన్లు ప్రారంభించారు. ఇప్పుడు రైల్వేస్టేషన్లలోనే కాదు రైళ్లలో కూడా ప్రత్యేక ఫీడింగ్ క్యాబిన్లను తయారుచేస్తున్నారు. ఈ విజయం ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించింది. తల్లి పాల బ్యాంక్ దేశంలో ఏ ఒక్క తల్లీ బిడ్డ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్ సమస్యను ఎదుర్కోకూడదు. ఈ ఆలోచనతో ‘మాతృ స్పర్ష్ ఇనిషియేటివ్ బై అవ్యన్ ఫౌండేషన్’ పేరుతో ఒక ఎన్జీవోని ప్రారంభించాను. దీని ద్వారా ఫీడింగ్ రూమ్, తల్లి పాల బ్యాంకు సౌకర్యాన్ని కల్పించే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది తల్లి పాలు కావాలనే వాళ్లు కూడా సంప్రదిస్తున్నారు. దీంతో తల్లిపాలను దానం చేయాలనుకుంటున్న తల్లుల నుంచి పాలుతీసుకొని, అవసరమైన పిల్లలకు ఇస్తుంటాం. ఈ పనిలో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే, ప్రతి బిడ్డ తల్లి పాలు సులభంగా పొందుతుంది. ఆ దిశగానే ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. లండన్ యూనివర్శిటీలో జరుగుతున్న పరిశోధనలో నేను వాదించిన తల్లిపాల కేసు చేర్చారు. కేవలం తొమ్మిది నెలల వయసులో పిల్ దాఖలు చేసినందుకు నా కొడుకు అవ్యన్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. రొమ్ము లైంగిక అవయవం కాదు. ఇది తల్లి–బిడ్డల మధ్య పవిత్ర సంబంధాన్ని కలిగిస్తుంది. ఈ పోరాటం అంత సులువు కాలేదు. మాది చిన్న కుటుంబం. నా కొడుకు సిజేరియన్ ద్వారా పుట్టాడు. ఈ పోరాటంలో నేను ఆపరేషన్ నుంచి చాలా రోజుల వరకు కోలుకోలేకపోయాను. ఇంటి నుండి కోర్టు పనులు పూర్తయ్యేవరకు పిల్లాడిని పట్టుకొనేదాన్ని. సమాజంలో పాతకాలపు ఆలోచనలను మార్చడం పెద్ద సవాల్. ఎంతో మంది మహిళలు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా మాట్లాడలేకపోతున్నారు’’ అంటూ ఈ సమస్య గురించి సుధీర్గంగా తన గళం వినిపిస్తారు ఈ లాయర్. చదవండి: రూమ్, ఫుడ్ ఉచితం, మంచి జీతం.. జాబ్ ఏంటని తెలిస్తే షాక్ అవుతారు! -
Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్
ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్ను రీస్టార్ట్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్ ఫర్ హర్’ ప్లాట్ఫామ్కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్ఫామ్ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా... రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్ రీస్టార్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నేహా హెచ్ ఆర్లో ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలలో పనిచేసింది. 2010లో తన కెరీర్కు బ్రేక్ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్ రీస్టార్ట్ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు. ‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్ ఫర్ హర్’ అనే ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసింది నేహా. ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్ఫామ్ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్ ఫర్ హర్’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్ ఫర్ హర్ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్ ఫర్ హర్’ వెంచర్ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసింది నేహా. ‘హర్ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్ ఎసెట్... మొదలైన సంస్థలు ఫండింగ్ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్ ఎసెట్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిధి గుమాన్. -
పెళ్లైన 10 ఏళ్లకు తల్లి కాబోతున్న బుల్లితెర నటి
బుల్లితెర నటి నేహా మాద్ర త్వరలో తల్లి కాబోతుంది. పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో ఆమె ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. తాజాగా నటి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నేహా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నా కడుపులో ఉన్న బిడ్డపై ఎనలేని ప్రేమ కురిపించారు. ఈ సీమంతం అంతా ఒక కలలా అనిపిస్తోంది. నా అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను' అని రాసుకొచ్చింది. ఈ ఫోటోల్లో దంపతులిద్దరూ లావెండర్ కలర్ దుస్తుల్లో మెరిసిపోయారు. కాగా నేహా మాద్ర బిజినెస్మెన్ ఆయుష్మాన్ను 2012లో పెళ్లాడింది. గతేడాది నవంబర్ 24న తను గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా మెటర్నిటీ షూట్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసింది. ఇకపోతే నేహా బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)లో గెహనాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. క్యో రిష్తా మే కత్తి బత్తి, డోలీ అర్మానోకీ వంటి సీరియల్స్లో నటించింది. అలాగే జలక్ దిక్లాజా డ్యాన్స్ షో 8వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) చదవండి: ఘనంగా హీరోయిన్ పూర్ణ సీమంతం -
అప్పట్లో స్టార్ హీరోయిన్.. కానీ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?
సినీ పరిశ్రమలో ఎందరో తారలు కనుమరుగై పోవడం మనం చూస్తుంటాం. అలాగే ప్రతి ఏటా కొత్తగా పదుల సంఖ్యలో ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా? ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ హీరోయిన్ కథేంటో చదివేద్దాం. నేహా పెండ్సే.. ఈ పేరు చాలామందికి తెలియదు. టాలీవుడ్లో సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ముంబయి భామ. ఆమెకిదే తెలుగులో మొదటి సినిమా. ఆ తర్వాత 2003లో వచ్చిన గోల్మాల్, 2008లో వచ్చిన వీధిరౌడీ సినిమాలోనూ కనిపించింది. కానీ సినిమాలతో ఆమె పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు హిందీ, మరాఠీ, తమిళ, మలయాళంలోనూ నటించింది. ఆమె 2018లో బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో కంటెస్టెంట్గా కనిపించింది. కాగా.. మొదట 1995 నుంచి సీరియల్స్లో నటిస్తోంది. ప్రస్తుతం కూడా హిందీలో పలు సీరియళ్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘బాబీజీ ఘర్ పర్ హై’ అనే హిందీ సీరియల్ చేస్తోంది. అనితా విభూతి నారాయణ్ మిశ్రా పాత్ర పోషించినందుకు ఫేమ్ సాధించింది. ఎప్పటికప్పుడు తన ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్లో ఉంటోంది భామ. ఇప్పుడున్న నేహాను చూస్తే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోవచ్చు.. కానీ ముంబై బ్యూటీ టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేసుంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. -
ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..
భార్యాభర్తలు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో ముందడుగు వేస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవనసహచరులు ఒకరికొకరు అండగా నిలిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. భారత రగ్బీ క్రీడాకారుల జంట నేహా పర్దేశీ- గౌతమ్ దాగర్ ఈ కోవకే చెందుతారు. భారత రగ్బీ జట్ల మాజీ కెప్టెన్లు అయిన వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి పీటల దాకా తీసుకువచ్చి 2019, ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ప్రణయ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేహా- గౌతమ్ జీవితంలోని సంతోషాలను రెట్టింపు చేస్తూ గతేడాది నవంబరులో వీరికి కవలలు జన్మించారు. తమ కలల పంటకు దెమీరా దాగర్(కూతురు), కబీర్ దాగర్(కొడుకు)గా నామకరణం చేశారు ఈ క్రీడా దంపతులు. (Photo Credit: Gautam Dagar Facebook) ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన నేహా.. తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమయ్యారు. జాతీయ క్రీడల్లో భాగంగా ఈ ‘సూపర్ మామ్’ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గుజరాత్ వేదికగా 36వ జాతీయ క్రీడలు గురువారం అట్టహాసంగా మొదలైన విషయం తెలిసిందే. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో సుమారు లక్షా 25 వేల మందితో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించిన ఆరంభ వేడుకల సంబరం అంబరాన్నంటింది. 36 క్రీడాంశాలు.. దాదాపుగా 600 మంది గుజరాతీ కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనతో కట్టిపడేశారు. ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య భారత ప్రధాని మోదీ అంగరంగ వైభవంగా ఈ ఆటల పండగను ప్రారంభించారు. జాతీయ క్రీడలు- 2022లో భాగంగా సుమారు 7000 మందికి పైగా అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పాల్గొననున్నారు. ఇందులో నేహా కూడా ఒకరు. మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తూ.. తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న ఆమె దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ రగ్బీ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేహా మాట్లాడుతూ.. సిజేరియన్ తర్వాత 20 రోజులకే ట్రెయినింగ్ ఆరంభించానంటూ ఆట పట్ల అంకిత భావాన్ని చాటుకున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోను ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉంటాను. ఇప్పుడు నా ఆటలో కాస్త వేగం తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ మానసికంగా నేనెంతో దృఢంగా ఉన్నాను. క్రీడాకారిణిగా నా బాధ్యతలను గతంలో కంటే మెరుగ్గా నెరవేర్చగలను. ఎందుకంటే.. నాకిపుడు మల్టీటాస్కింగ్ అలవాటైంది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలనా చూసుకుంటూనే తిరిగి రగ్బీ ఆడేందుకు సిద్ధమయ్యాను. సిజేరియన్ తర్వాత 20 రోజులకే ఫిజికల్ ట్రెయినింగ్ మొదలు పెట్టాను. ఫిట్నెస్ సాధించాను. తల్లిగా.. ప్లేయర్గా నా కర్తవ్యాన్ని నెరవేర్చడాన్ని నేను పూర్తి ఆస్వాదిస్తున్నా’’ అని ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న 29 ఏళ్ల నేహా చెప్పుకొచ్చారు. తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. కాగా 2019లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన నేహా.. శుక్రవారం నాటి మ్యాచ్తో రీఎంట్రీకి సన్నద్ధమయ్యారు. ఇక నేహా భర్త గౌతమ్ దాగర్ గతంలో భారత పురుషుల రగ్బీ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి' -
Bigg Boss- 6 : షాకింగ్ ఎలిమినేషన్: ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..
బిగ్బాస్ సీజన్-6 రసవత్తరంగా ముందుకు సాగుతుంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో.. మూడో వారంలో వచ్చేసరికి మాత్రం రసవత్తరంగా మారింది. నామినేషన్స్ మొదలు.. కెప్టెన్సీ టాస్క్ వరకు ఇంటి సభ్యులు గొడవపడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా గతవారం డబుల్ ఎలిమినేషన్తో షానీ, అభినయలు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయంలో ఆసక్తి మొదలైంది. మూడోవారంలో వాసంతీ కృష్ణన్, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి, నేహా చౌదరి,ఇనయా సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో రేవంత్, గీతూ తమ ఆటతీరుతో ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నారు. ఇక ఆరోహి, నేహా, ఇనయాలు డేంజర్ డోన్లో ఉండగా ఇనయా ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయిందని ఇప్పటికే లీకువీరులు లీక్ చేశారు. అర్థంపర్థం లేని రాద్దాంతం చేస్తూ చీటికిమాటికి గొడవపడుతూ ఇనయా బాగానే కంటెంట్ ఇచ్చింది. దీంతో చివరి నిమిషంలో ఆమె సేవ్ అయి నేహా చౌదరి ఎలిమినేట్ అయిందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే. -
మంచి మంచి పాటల్ని చెడగొడుతున్నారు కదయ్యా!
ముంబై: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్లో అయినా పాత హిట్ సాంగ్స్ను రీమిక్స్లు, రీ-రీమిక్స్లు, రీక్రియేషన్ల పేరుతో ఇప్పటి తరాలకు అందిస్తుండడం చూస్తున్నాం. అదే సమయంలో చాలావరకు కొత్తవాటిపై విమర్శలు వెల్లువెత్తుతుండం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా.. శ్రీలంక గాయని యోహానీతో ‘మనికే మేగే’ సాంగ్ను.. ‘థ్యాంక్ గాడ్’ సినిమా కోసం ఆమెతోనే పాడించి ఓ సాంగ్ను రిలీజ్ చేశారు. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ కంపోజిషన్పై మాములు తిట్లు పడడం లేదు. ఇక ఇప్పుడు మరో క్లాసిక్ పాటను చెడగొట్టే యత్నమూ జరుగుతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ‘మైనే పాయల్ హై ఛన్కాయి’ సాంగ్ గుర్తుందా? అప్పట్లో నార్త్-సౌత్ తేడా లేకుండా ఊపేసిన సాంగ్. ముఖ్యంగా యూత్ను బాగా ఆకట్టుకున్న సాంగ్ అది. సింగర్ నేహా కక్కర్ ‘ఓ సజ్నా’ పేరిట రీమిక్స్ చేయించి వదిలింది టీ సిరీస్. దీంతో మంచి పాటను చెడగొట్టారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే నేహా కక్కర్ పాడిన పలు రీక్రియేషన్స్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి గతంలో. ఇక ఒరిజినల్ కంపోజర్ & సింగర్ ఫాల్గుని పాథక్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఫ్యాన్స్ షేర్ చేసిన కొన్ని మీమ్స్ను, విమర్శలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ రూపంలో షేర్ చేశారంటూ కథనాలు వెలువడుతున్నాయి. video credits: T-Series ఫాల్గుని పాడిన మైనే పాయల్ హై ఛన్కాయి ఒరిజినల్ సాంగ్ 1999లో రిలీజ్ అయ్యింది. వివన్ భాటేనా, నిఖిలా పలాట్లు ఇందులో నటించారు. కాలేజీ షోలో తొలుబొమ్మల ప్రదర్శన మీద ఈ సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుంది. ఇక కొత్త వెర్షన్ ఓ సజ్నాకు తన్షిక్ బాగ్చీ మ్యూజిక్ అందించగా.. ప్రియాంక శర్మ, ధనాశ్రీ వర్మ నటించారు. videoCredits: FalguniPathakVEVO -
ఏక్ నెంబర్ సీరియల్.. రెండేళ్లుగా నటికి డబ్బులెందుకివ్వట్లే?
తారక్ మెహతా కా ఉల్టా చష్మా.. ఈ పేరు తెలియని హిందీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఫేమస్ అయిందీ సీరియల్. ఇందులో నటించిన నటీనటులకు సైతం మంచి పేరుప్రఖ్యాతలు దక్కాయి. అయితే ఈ సీరియల్ నిర్మాతలు తనకు డబ్బులివ్వడం లేదంటూ నటి నేహా పలుమార్లు మీడియా ముందు వాపోయింది. ఈ ధారావాహికలో తారక్ మెహతా భార్య అంజలి మెహతా పాత్రలో నటించిన నేహ 2020లోనే సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ఆరు నెలల నుంచి రెమ్యునరేషన్ అందలేదని, ఈ బకాయిలను ఇంకెప్పుడు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్య కూడా ఓ ఇంటర్వ్యూలో తనకింతవరకు పూర్తిగా పారితోషికం అందనేలేదని అసహనానికి లోనైంది నేహ. తాజాగా ఆమె ఆరోపణలపై తారక్ మెహతా కా ఉల్టా చష్మా నిర్మాతలు స్పందించారు. 'ఆర్టిస్టులను మేము కుటుంబంగా పరిగణిస్తాం. నేహా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాక కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని చెప్పాం. ఈ ధారావాహిక నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లుగా కొన్ని పత్రాలపై సంతకం చేయాలని సూచించాం. కంపెనీ పాలసీ ప్రకారం ఆ సంతకం చేసిన తర్వాతే ఆమెకు సెటిల్మెంట్ చేయగలం. ఆమెతో మాట్లాడేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఆమె ఖాతరు చేయడం లేదు. అంతేకాదు ఈ సీరియల్ నుంచి కూడా చెప్పాపెట్టకుండా తప్పుకుంది. 12 ఏళ్లపాటు ఫేమ్, మంచి కెరీర్ను ఇచ్చిన మేకర్స్పై అసత్య ఆరోపణలు చేయడానికి బదులుగా మెయిల్స్కు స్పందిస్తే బాగుంటుంది' అంటూ నీలా ఫిలిం ప్రొడక్షన్స్ ఓ లేఖను విడుదల చేసింది. ఇకపోతే తారక్ మెహతా కా ఉల్టా చష్మా 2008లో ప్రారంభమైంది. 13 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ నిర్విరామంగా ముందుకు సాగుతోంది. చదవండి: హీరోయిన్ ఇంట్రస్టింగ్ పోస్ట్, ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్ ఘనంగా నాగశౌర్య సోదరుడి వివాహం, ఫొటోలు వైరల్ -
విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో విషం తీసుకున్నారు. దీంతో ప్రియురాలు నేహా (17) మృతిచెందగా, ప్రియుడు కృష్ణ (19) పరిస్థితి విషమంగా ఉంది. యువకుడ్ని కేజీహెచ్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియురాలు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురికీ తరలించారు. చదవండి: (మహిళను లోబర్చుకుని.. రాత్రి తలుపులు పగులకొట్టి..) -
రోజంతా ఇవే మాట్లాడుకుంటున్నాం!
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఇదే గోలా? పొద్దున లేస్తూనే నేను వింటున్న వార్తలు (పెరుగు తున్న ద్రవ్యోల్బణం మినహా యించి) అన్నీ కూడా ఆలయాలు, మసీదుల గురించే. ఇది 2022. అయినా మనం ఇంకా రోజంతా– హిందువులు, ముస్లింలు; గుడులు, మసీదులు ఇవే మాట్లాడుకుంటున్నాం. ఇది ఆందోళనకరం, భయానకం. చెప్పాలంటే శక్తిని నిర్వీర్యం చేస్తోంది. – నేహా ఖన్నా, యాంకర్ నిషేధాల మీద నిషేధాలు తాలిబన్ కొత్త ఉత్తర్వు ప్రకారం– పురుషులు, మహిళలు కలిసి రెస్టారెంట్లో తినడం నిషిద్ధం. పార్కులకు కలిసి వెళ్లడానికి కూడా అనుమతి లేదు, వాళ్లు పెళ్లయిన దంపతులే అయినా సరే. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మహిళా హక్కుల సంక్షోభాన్ని అఫ్గానిస్తాన్ ఎదుర్కుంటోంది. – షబ్నమ్ నసీమీ, బ్రిటన్ ప్రభుత్వ సలహాదారు, ఒకప్పటి అఫ్గాన్ శరణార్థి ఆటవిక చర్య కశ్మీరీ పండిత్ అయినందుకు రాహుల్ భట్ను తీవ్రవాదులు చంపేశారు. కశ్మీరీ పోలీస్ అయినందుకు రియాజ్ ఠోకర్ను తీవ్ర వాదులు చంపేశారు. అసహనం, ఆటవికత, అగాథపు చీకట్లలాంటి దుష్టత్వమే జీవితంగా గడిపే తీవ్రవాదులు మరో రెండు కశ్మీరీ ప్రాణాలను అంతమొందించాయి. – జునైద్ అజీమ్ మట్టూ, శ్రీనగర్ మేయర్ పాత రోజులు కావు మా నాన్నతో మాట్లాడుతున్నాను. ఒక జ్ఞాపకం పంచుకున్నారు. 1960, 70ల ప్రాంతంలో ఆగ్రాలోని హిందూ బట్టల దుకాణదారులు రోడ్ల మీద తమ తాన్లను పరిచేవారట; ముఖ్యంగా జుమా అల్విదా, రంజాన్ రోజుల్లో ముస్లింలు సామూహిక ప్రార్థన చేసేటప్పుడు. వాటి మీద నమాజ్ చేయడం వల్ల బట్టలకు ఆశీర్వాదం దొరికి అమ్మకాలు పెరుగుతాయనీ, ‘బర్కత్’ అవుతుందనీ నమ్మేవాళ్లట. ‘ఆలోచనే మారిపోయిందిప్పుడు,’ అన్నారు. – ఘజాలా వాహబ్, సంపాదకురాలు ట్రంపును తప్పించారంతే... జో బైడెన్ తప్పు ఏమిటంటే, దేశాన్ని మార్చడానికి ఆయనను ఎన్నికల్లో గెలిపించారని అనుకుంటున్నారు. కానీ నిజానికి అందరూ కోరుకున్నది కొద్దిగా నాటకీయత తగ్గాలని! – ఎలాన్ మస్క్, వ్యాపారవేత్త భరించలేని వైరస్ కోవిడ్–19 పాజిటివ్ అని తేలింది. తల నుంచి కాళ్ల వరకు విపరీతమైన నొప్పి. ఏదో ఒక పెద్ద లారీ ఢీకొట్టినట్టు అనిపిస్తోంది. నిజంగా నాకు బాలేదు. నాకోసం ప్రార్థించండి. – రెనీ లిన్, అమెరికా యాక్టివిస్ట్ నిరసనే లేదు వంట గ్యాసుకు నేను 1,048 రూపా యలు కడుతున్నాను. మీరెంత చెల్లిస్తు న్నారు? అది నాలుగు వందల రూపా యలు ఉన్న రోజులు నాకు తెలుసు– అప్పుడు దానిమీద చాలా నిరసన వ్యక్తమైంది. – బబీతా శర్మ, అస్సాం కాంగ్రెస్ ప్రతినిధి -
ఉక్రెయిన్: సారీ అమ్మా.. నేను భారత్కు రాలేను!
ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో అక్కడి పౌరులు సైతం ఆయుధాలు చేతబడ్డి కదనరంగంలోకి దూకారు. ఇక విదేశీ పౌరులేమో ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు భారత్కు క్షేమంగా చేరుకున్నారు. మరికొందరిని రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకొందరు బంకర్లలో(అండర్ గ్రౌండ్ల్లో) తలదాచుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఓ విద్యార్థిని చేసిన పని.. ఆమె కుటుంబంలో ఆందోళన కలిగిస్తుండగా.. మిగిలిన వాళ్లంతా శెభాష్ అని మెచ్చుకుంటున్నారు. Russia-Ukraine crisis: హర్యానాకు చెందిన నేహా .. మెడిసిన్ కోసం ఉక్రెయిన్ వెళ్లింది. కొన్నాళ్లు హాస్టల్లో ఉన్న ఆమె ఆ తర్వాత ఉక్రెయిన్కు చెందిన ఒక సివిల్ ఇంజనీర్ ఇంట్లో ఆశ్రయం పొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. కావాలంటే ఆమె భారత్కు తిరిగి వచ్చేది. కానీ, ఆమె ఉంటున్న ఇంటి యజమాని యుద్ధం కోసం సైన్యంలో చేరాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటిని వీడేందుకు నేహ నిరాకరించింది. తనకు అన్నం పెట్టిన కుటుంబం ఆపదలో ఉంటే ఎలా రావాలంటూ.. అక్కడే ఉండిపోయింది. అదే ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడంలో ఆయన భార్యకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. 17 ఏళ్ల నేహా ప్రస్తుతం సదరు ఇంజనీర్ భార్య, ఆయన ముగ్గురు పిల్లలతో కలిసి బంకర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. నేహా కుటుంబం మాతృభూమి కోసం ఎంతో త్యాగం చేసింది. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేసేవాళ్లు. కొన్నేళ్ల కిందట యుద్ధంలో ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి తల్లి బాధ్యతగా ముందుకెళ్తోంది. ఆమె ప్రస్తుతం హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో టీచర్గా పని చేస్తున్నారు. తన కూతురిని ఉక్రెయిన్ నుంచి రప్పించేందుకు నేహా తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, నేహ మాత్రం ససేమిరా అంది. ‘నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ.. ఈ పిల్లలను వదిలి రాలేను. నాకు జన్మనిచ్చిన తండ్రి దేశం కోసం అమరుడయ్యాడు. తండ్రి లాంటి వ్యక్తి దేశం కోసం పోరాటంలో ఉన్నారు. అన్నం పెట్టిన ఈ అమ్మను ఇలాంటి పరిస్థితిలో వదిలిపెట్టలేను’ అంటూ తన తల్లితో చెప్పేసింది. ఈ విషయాన్ని నేహ కుటుంబానికి దగ్గరైన సవితా జాఖర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు.. చదువు, చావు!
ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి చదువు, రెండవది చావు. చదువుకన్నా ముందు ‘చావు’కు సంబంధించిన ఆలోచనలు పంజాబ్లోని జలంధర్కు చెందిన నేహాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ‘ఇక ఈలోకంలో నేను ఉండలేను’ అనుకుంది ఆమె గట్టిగా. అదే సమయంలో తన బాల్యంలోని కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి. ‘మీ అమ్మాయి తెలివైనది. బాగా చదివించండి’ అని టీచర్లు తన తల్లిదండ్రులతో చెప్పేవాళ్లు. లాయర్ కావాలనేది తన కల. అయితే చిన్న వయసులోనే నేహకు పెళ్లి కావడంతో ఆ కల చెదిరిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత భర్త వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ తనను ఒంటరి చేశాడు. అత్తవారి నుంచి కూడా తనకు మద్దతు కరువైంది. పైగా సూటిపోటి మాటలు. పుట్టింటికి వెళదామా అంటే... పాపం వారి పరిస్థితి అంతంత మాత్రమే. వారికి తాను భారంగా ఉండదల్చుకోలేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల్లోకి వెళ్లింది. అయితే ఈ ప్రతికూల ఆలోచనలు కొద్దిసేపే. ‘నాకో కల ఉంది. ఆ కలను నెరవేర్చుకోవడానికి బతకాలి’ అని గట్టిగా అనుకుంది నేహ చిన్నాచితకా పనులు చేస్తూ ఆగిపోయిన చదువును కొనసాగించింది. దూరవిద్యా విధానంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత... ఎల్ఎల్బీలో అడ్మిషన్ పొందింది. ఆరోజు తన జీవితంలో మరిచిపోలేని రోజు. ఎంత సంతోషించిందో! అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒక కంపెనీలో ఉద్యోగం చేసేది నేహ. అయితే కోవిడ్ వేవ్లో ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. వేరే కంపెనీలో ఉద్యోగం వెదుక్కోవడానికి కాలికి బలపం కట్టుకొని తిరిగింది. (క్లిక్: జీవితాన్ని మలుపు తిప్పిన కెమెరా: మాయ ముక్తై) ‘ఉన్న ఉద్యోగులనే వద్దంటున్నాం. కొత్త ఉద్యోగాలు ఎక్కడివి’ అనే మాటలు వినిపించాయి. ఒకవైపు తాను చదువుకోవాలి, దానికి ముందు తాను బతకాలి! ఒకరోజు తనకు ఒక మార్గం తోచింది. బజ్జీ, దోసె, పరోటా... ఇలా రకరకాల టిఫిన్లు తయారుచేసి అమ్మాలని నిర్ణయించుకుంది. నిజానికి వాటి తయారీ, రుచుల గురించి తనకు పెద్దగా తెలియదు. తెలిసిన వారి దగ్గరకు వెళ్లి ఓపిగ్గా నేర్చుకుంది. జలంధర్లోని ఒక ఆస్పత్రికి సమీపంలో చిన్నగా టిఫిన్ స్టాల్ మొదలుపెట్టింది. ఉల్లిగడ్డలు తరగడం నుంచి పాత్రలు తోమడం వరకు అన్నీ తానే చేసేది. కొద్దిరోజులలోనే టిఫిన్ సెంటర్ పాపులర్ అయింది. ఇప్పుడు తాను ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగంతో వచ్చే జీతం కంటే ఇప్పుడే ఆదాయం ఎక్కువగా వస్తుంది. ‘లా’ పూర్తి చేసి మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకోవాలనేది నేహ ఆశయం. ‘స్త్రీలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి లాయర్గా అండగా నిలవాలనుకుంటున్నాను’ అంటుంది నేహ. -
నేహా కక్కర్ ప్రెగ్నెంటా? ఈ వైరల్ వీడియో చూస్తే సరి..
Is Neha Kakkar Pregnant Then Check Out This Viral Video: బాలీవుడ్ టౌన్లో మోస్ట్ పాపులర్ సింగర్ నేహా కక్కర్. ఈమె గత సంవత్సరం రోహన్ ప్రీత్ సింగ్ను వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే బేబీ బంప్తో ఉన్న నేహా కక్కర్ ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో నేహా గర్భం దాల్చిందని పుకార్లు తెగ చక్కర్లు కొట్టాయి. అకస్మాత్తుగా, ఆమె కుటుంబం నిర్వహించిన కొత్త షో 'లైఫ్ ఆఫ్ కక్కర్స్' యూట్యూబ్లో ప్రసారం చేసినప్పటినుంచి ఈ పుకార్లు పుట్టాయి. వీడియోలో ఆమె కడుపును చూసిన అభిమానులు నేహా గర్భం గురించి చర్చించడం మొదలుపెట్టారు. అయితే ఆ వీడియోలో నేహా, రోహన్ ప్రీత్ ఇద్దరూ ప్రెగ్నెన్సీ గురించి ప్రస్తావించారు. 'ఇద్దరం చాలా సరదాగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి' అని రోహన్ప్రీత్ అంటే, ప్రస్తుతం కెరీర్లో చాలా బిజీగా ఉన్నానని, వచ్చే 2-3 సంవత్సరాలలో పిల్లలను కనే ఆలోచన లేదని నేహా కక్కర్ చెప్పారు. అలాగే 'నెల రోజుల్లో నా కడుపు లావైంది. కొంచెం పొట్ట వచ్చింది. నేహా కొంచెం బొద్దుగా మారింది. అది ప్రెగ్నెన్సీ కాదు. నేను మీకు ప్రేమగా మారానని అనుకుందాం.' అని నేహా తెలిపారు. ఇలా తన ప్రెగ్నెన్సీపై వచ్చిన పుకార్లను నేహా కొట్టిపారేశారు. ఆహారంపై తనకున్న ఇష్టం వల్లే కడుపు వచ్చిందన్నారు. ఇంకా 'ఖ్యాల్ రాఖ్యా కర్' అనే మ్యూజిక్ వీడియో కోసమే నేహా కక్కర్ బేబీ బంప్తో ఫొటోలు దిగిందని స్పష్టం చేశారు. చదవండి: ఒకప్పుడు ఇండియన్ ఐడల్లో పార్టిసిపెంట్.. -
Neha Nialang: 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్గా... సహజమైన పద్ధతిలో
Neha Nialang Success Story In Telugu: ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అమ్మకు ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉంటుంది. ఓ నాలుగురోజులు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా పిల్ల చూసుకుంటుందన్న భరోసా కూడా కల్పిస్తారు కొందరమ్మాయిలు. నేహ నియాలంగ్ భరోసాతోనే ఆగిపోకుండా, తనకు తెలిసిన వంటల తయారీతో ఏకంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్నప్పటినుంచి ఇంటి, వంట పనుల్లో చూరుకుగా పాల్గొనే నేహ ఇంట్లో వాళ్ల కోసం సరికొత్త వంటలు వండడమేగాక, వాటిని బయట మార్కెట్లో విక్రయిస్తూ.. 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్గా ఎదిగి, మేఘాలయ రుచులను ఇతర ప్రాంత వాసులకు అందిస్తోంది. మేఘాలయలోని జోవైకు చెందిన నేహానియాలంగ్ అందరి అమ్మాయిల్లానే ఇంట్లో పనులను ఇలా చూసి అలా పట్టేసింది. అయితే మేఘాలయలో అనేక కుటుంబాలు ఒక దగ్గర కలిసి నచ్చిన వంటకాలు వండుకుని కలసి తినే సంప్రదాయం ఉంది. దీంతో అడపాదడపా జరిగే గెట్ టు గెదర్లలో వండే వంటకాలను నేహ ఆసక్తిగా నేర్చుకునేది. ఇలా నేర్చుకుంటూనే పదహారేళ్లు వచ్చేటప్పటికీ ఇంట్లో అందరికీ వండిపెట్టే స్థాయికి ఎదిగింది. ఇంట్లో తరచూ వంటచేస్తూ ఉండడం వల్ల ఏం ఉన్నాయి ఏం లేవు అనేది జాగ్రత్తగా గమనించేది. సరుకులు నిండుకుంటే వెంటనే మార్కెట్కు వెళ్లి తెచ్చేది. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఎక్కువగా వాడే జామ్ వంటివి దొరికేవి కావు. కానీ అవి లేకపోతే ఇంట్లో నడవదు. చపాతీ, రోస్టెడ్ బ్రెడ్లోకి జామ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. జామ్ దొరకనప్పుడు.. జామ్ను ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది తనకు. దీంతో ఇంట్లో ఉన్న పండ్లతో జామ్లు తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ జామ్లు ఇంట్లో వాళ్లకు నచ్చడంతో రకరకాల జామ్లు తయారుచేసేది. నేహ తయారు చేసిన జామ్ల రుచి నచ్చిన కుటుంబసభ్యులు.. అమ్మకం మొదలు పెడితే ఇవి బాగా అమ్ముడవుతాయి’’ అని చెప్పేవాళ్లు. నేహ మాత్రం ఆ మాటలకు నవ్వేదేగానీ, సీరియస్గా తీసుకునేది కాదు. వృథా కానివ్వద్దని.. లాక్ డౌన్ సమయంలో చాలా రకాల పండ్లు వృథా అయ్యేవి. ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్దేశిత సమయాల్లోనే పండ్లు కూరగాయలు విక్రయించాలి. ఆ సమయంలోపు అమ్మకపోతే, అప్పటికే బాగా పండిన పండ్లు మగ్గిపోయి వృథా అయిపోయేవి. మార్కెట్కు వెళ్లిన ప్రతిసారి నేహ ఈ విషయాన్ని గమనిస్తుండేది. ఒకసారి ఓ రైతు పండ్లను పారబోయడం చూసింది. ఎందుకు పారబోస్తున్నావని అడిగితే..‘‘మార్కెట్ సమయం అయిపోయింది. ఇవి ఇలా ఉంటే రేపటికి ఇంకా మగ్గిపోతాయి. ఎలాగూ అమ్ముడు కావు. ఈ గంపను అద్దెకు తీసుకొచ్చాను. ఈరోజే యజమానికి ఇచ్చేయాలి’’ అని చెప్పాడు. అతని మాటలు నేహ మనసుని తట్టిలేపాయి. ‘ఎంతో చెమటోడ్చి పండిన పంట నేలపాలవుతోంది. ఈ పండ్లే వారి జీవనాధారంం అవి ఎటూగాకుండా పోతున్నాయి’ అనిపించింది తనకు. వీటిని వృథాగా పోనివ్వకుండా వీటితో ఏదైనా తయారు చేయాలనుకుంది. అనుకుందే తడవుగా మార్కెట్లో దొరికే పండ్లను కొని జామ్లు తయారు చేయడం మొదలు పెట్టింది. పండ్లు భారీగా లభ్యమవుతుండడంతో పెద్ద మొత్తంలో జామ్లు తయారు చేసేది. దలాడే ఫుడ్స్.. నేహ తయారుచేసిన జామ్లు ముందుగా స్థానికంగా విక్రయించింది. వాటికి మంచి స్పందన లభించడంతో ‘దలాడే ఫుడ్స్’ ప్రారంభించి భారీ స్థాయిలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లలో విక్రయిస్తుండేది. దలాడే అనేది మేఘాలయలో మాట్లాడే ఖాసీ భాష పదం. దలాడే అంటే ‘మనంతట మనమే’ అని అర్థం. రైతులు ఉత్పత్తి చేసిన దేనిని కూడా వ్యర్థంగా పోనివ్వకుండా..పండ్ల నుంచి తేనె వరకు అన్నింటినీ దలాడే ద్వారా విక్రయిస్తోంది నేహ. ఏడాది తర్వాత స్థానికంగా దొరికే తేనె, మేఘాలయలో ప్రముఖంగా లభించే లకడాంగ్ పసుపు, రుచికరమైన చట్నీలు, జీడిపప్పు బటర్, తేనెతో చేసిన మసాలాల వంటి వాటిని విక్రయిస్తోంది. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్లు వాడకుండా సహజసిద్ధమైన పద్ధతిలో మేఘాలయ రుచులను వివిధ ప్రాంతాలకు అందిస్తోంది. ‘‘కేవలం బీఎస్సీ బయోకెమిస్ట్రీ చదివిన నాకు ఈ వ్యాపారం కాస్త కష్టంగానే ఉంది. అందులోనూ వ్యాపారం అంటే మామూలు విషయం కాదు. ఈ రంగంలో అనుభవం ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి వంట మీద ఆవగాహనతోనే ఈ రంగంలోకి దిగాను. అందుకే ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత అందించే కార్యక్రమాల్లో పాల్గొని తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాను’’ అని నేహ చెబుతోంది. -
సిగరెట్ తాగిన సోహేల్, పాములతో డీల్ అంటున్న దీప్తి సునయన
► సైమా అవార్డుల్లో మెరిసిన శివాత్మిక ► చెట్టు వెనుక దాక్కున్న సీరియల్ నటి నవ్య స్వామి ► మండే మూడ్ అంటున్న తమన్నా ► బాధలో ఉన్నానంటున్న అదితి భాటియా ► కలంకారీ చీరలో మంచు లక్ష్మీ ► ఇమ్ పర్ఫెక్ట్గా ఉండటం కంటే తప్పులు చేయడం మంచిదన్న వితిక ► సిగరెట్ తాగిన సోహేల్, నో స్మోకింగ్ అంటూ క్యాప్షన్ ► పాములతో డీల్ చేస్తానంటున్న దీప్తి సునయన ► ఇవాల్టీ కిలాడీ ఇలా అంటున్న దివ్యాంక View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) -
నేహాకక్కడ్: అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వుమెన్ సింగర్..
‘‘వాళ్లు తొక్కేస్తున్నారు వీళ్లు తొక్కేస్తున్నారు అందుకే కెరియర్లో ఎదగలేకపోతున్నాను. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఫీల్డ్లో గాడ్ ఫాదర్లాంటి వాళ్లు ఎవరూ లేరు’’ అంటూ రకరకాల సాకులతో తమలోని ప్రతిభను గుర్తించకుండా నిరాశపడుతుంటారు కొందరు. కానీ ప్రతిభ ఉంటే పాతాళంలో ఉన్నా పైకి ఎదిగి పాపులర్ అవచ్చని ప్రముఖ గాయని నేహాకక్కడ్ జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. నేహాకక్కడ్.. ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో వచ్చే ప్రతి సినిమాలో నేహా కక్కడ్ పాడిన పాట ఒకటి ఉండాల్సిందే. ఆమె పాడిన ప్రతిపాట సూపర్ హిట్ కావడం విశేషం. దేశంలోనే పాపులర్ సింగర్గా వెలిగిపోతున్న నేహా అదృష్టంతోనో, గాడ్ఫాదర్ల అండతోనో ఎదగలేదు. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటోన్న మహిళా గాయనిగా నిలుస్తోంది. సమోసాలు విక్రయిస్తూ.. ఉత్తరాఖండ్లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి నేహా కక్కడ్. రిషీకేష్లో పుట్టిన నేహాకు ఒక అక్క(సోను కక్కడ్), తమ్ముడు (టోనీ కక్కడ్)లు ఉన్నారు. తండ్రి స్కూల్, కాలేజీల బయట సమోసాలు విక్రయించి కుటుంబాన్ని పోషించేవారు. తల్లి గృహిణి. ఒక చిన్నగదిలో కుటుంబం అంతా సర్దుకుపోయి జీవించేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో నాలుగేళ్ల వయసులోనే నేహా పాడడం మొదలు పెట్టింది. తన అక్క, తమ్ముడుతో కలిసి వివిధ ధార్మిక కార్యక్రమాల్లో కీర్తనలు పాడడానికి వెళ్లేవాళ్లు. అక్కడ వచ్చే కొద్దిపాటి పారితోషకాన్ని ఇంటి ఖర్చులకు వినియోగిస్తూ తండ్రికి చేదోడుగా ఉండేది. నేహా కీర్తనలు విన్నవారు మెచ్చుకుంటుండడంతో గాయనిగా ఎదిగేందుకు రుషీకేష్ నుంచి ఢిల్లీకి కుటుంబం మొత్తం మకాం మర్చారు. అక్కడ కూడా రోజుకు నాలుగైదు కార్యక్రమాల్లో పాల్గొని భజన కీర్తనలు పాడేది. అలా కీర్తనల ద్వారా ఆదాయంతోపాటు, గాత్రాన్నీ మెరుగు పరుచుకుంది. నేహాతోపాటు సోను, టోనీ కక్కడ్లు కూడా మంచిగా పాటలు పాడేవారు. సోను బాబూజీ జర దీరే చాలో పాటతో కెరియర్ను ప్రారంభించింది. తన గొంతుకు జానపదాన్ని జోడించడంతో పాట బాగా పాపులర్ అయింది. నేహాకక్కడ్ ది రాక్ స్టార్... అక్క పాటకు మంచి స్పందన లభించడం చూసిన నేహా తన తమ్ముడితో కలిసి 2006లో ముంబై వెళ్లి ఇండియన్ ఐడల్ సీజన్–2లో పాల్గొంది. కానీ కొన్ని రౌండ్లలోనే ఎలిమినేట్ అయ్యి వెంటనే వెనుతిరిగింది. ఎలాగైనా తన గొంతు అందరికీ చేరాలన్న పట్టుదలతో సొంతంగా ఆల్బమ్స్ చేయడం ప్రారంభించింది. అప్పుడు నేహా వయసు పదహారు. 2008లో మీట్ బ్రదర్స్ మ్యూజిక్తో ‘నేహాకక్కడ్ ద రాక్స్టార్’ పేరిట తొలి ఆల్బమ్ను విడుదల చేసింది. దీనికి పెద్దగా పేరు రాకపోయినప్పటికీ నేహాను ఈ ప్రపంచానికి గాయనిగా పరిచయం చేసింది ఈ ఆల్బమ్. తరువాత 2013లో బాలీవుడ్ సినిమా ‘ఫటా పోస్టర్ నిఖ్లాలో ‘ధాటింగ్ నాచ్’ పాట పాడింది. తరువాత హనీసింగ్తో కలిసి సానీసానీ (2014) పాట పాడింది దీంతో నేహాకు మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి నేహా వెనక్కి తిరిగి చూసుకోలేదు. క్వీన్ సినిమాలో థుమకడ’, హాయ్ రామా (మీరాబాయ్ నాట్ అవుట్), వు కేక్ పాల్ చైన కాల్ (నాట్ ఏ లవ్ స్టోరీ), సెకండ్ హ్యాండ్ జవానీ (కాక్టెయిల్), బోట్లా ఖోల్ (ప్రెగ్) జాదూ కీ జాపీ(రామయ్య వస్తావయ్యా), కాలా ఛష్మా, దిల్బర్ దిల్బర్, బద్రీకి దుల్హనియా, మనాలి ట్రాన్స్ వంటి హిట్ సాంగ్స్తో బాగా పాపులర్ అయ్యింది. ఇవేగాక బంగ్లాదేశ్ సినిమా అగ్నీ–2, కర్ మెయినే మ్యూజిక్ బజా, టుకుర్ టుకుర్, చిట్టా కుక్కడ్లతో ఆడియెన్స్ను ఉర్రూతలూగిస్తోంది. ఈరోజు హనీసింగ్, టోనీ కక్కడ్తో కలిసి ‘కాంటా లాగా..’సాంగ్ను విడుదల చేయనుంది. బెస్ట్ డ్యూయట్ వోకలిస్ట్ అతికొద్దికాలంలోనే తన గాత్రంతో ఇండియాలో ఉన్న ప్రముఖ గాయకుల జాబితాలో నేహా చేరింది. దీంతో ఏ ప్లాట్ఫామ్ మీద అయితే ఎలిమినేట్ అయ్యిందో అదే ప్లాట్ఫాంపై జడ్జిగా గౌరవాన్ని అందుకుంది నేహా. ఇండియన్ ఐడల్ 10, 11కు జడ్జిగా, కామెడీ సర్కస్ కే టెన్సీస్ ప్రోగ్రామ్, సారేగమాపా లిటిల్ చాంప్స్కు జడ్జ్గా వ్యవహరించింది. నేహా గాత్రానికి బెస్ట్ డ్యూయట్ వోకలిస్ట్(2017), ఫేవరెట్ జడ్జ్ అవార్డ్స్ (జీరిష్తే–2017) బాలీవుడ్ ట్రాక్ ఆఫ్ ద ఇయర్ (దిల్బర్)–2018, మిర్చి సోషల్ మీడియా ఐకాన్ ఆఫ్ ది ఇయర్(2020) అవార్డులు వరించాయి. ఇవేకాకుండా సామ్సంగ్, రియల్మి, గివ ఫ్యామిలీ, ఆర్గానిక్ హార్వెస్ట్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా చేసింది. సోషల్ మీడియా ఐకాన్ ఇన్స్టాగామ్లో 6.2 కోట్ల ఫాలోవర్స్తో సోషల్ మీడియా ఐకాన్ గా దూసుకుపోతోంది. అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన ఏకైక మహిళా గాయకురాలిగా నేహా నిలవడం విశేషం. యూట్యూబ్లో దాదాపు కోటీ ముప్ఫై లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. -
హల్చల్ :జోష్లో అషూ..వెకేషన్ అవసరం లేదంటున్న పూజా
► లెహంగాలో ఈషా స్టన్నింగ్ లుక్స్ ► ఫుల్ జోష్లో ఉన్న అషూ రెడ్డి ► బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్చేసిన పూజా హెగ్డే ► అప్పుడు వెకేషన్ అవసరం లేదంటున్న నేహా కక్కర్ ► షటప్ అంటున్న టిక్టాక్ స్టార్ నాయని పావని ► లోలోపన నవ్వేస్తున్న డిజైనర్ శ్రావ్య వర్మ ► జాస్మిన్తో రీల్ షేర్చేసిన కృష్ణ ముఖర్జీ View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Shravya Varma (@shravyavarma) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) -
హల్చల్ : వింటేజ్ లుక్లో సదా..షూట్ మూడ్లో రాశీ
♦ ఎర్రటి చీరలో మెరిసిపోతున్న కొత్త పెళ్లికూతురు దిశ ♦ ట్రెండింగ్ రీల్స్ చేస్తున్న టిక్టాక్ స్టార్ భాను ♦ రష్మీకి ఎవరైనా అబ్బాయినా వెతుకుదాం అంటున్న టిక్టాక్ స్టార్ ♦ వింటేజ్ లుక్లో సదా ♦ వీకెండ్ జోష్లో బిగ్బాస్ ఫేం హారిక ♦ జర్నీ ఎలా ఎండ్ అవుతుందో చెబుతున్న నేహా కక్కర్ ♦ పెట్ లవ్ అంటున్న మెహ్రీన్ ♦ తల్లి సురేఖవాణితో సుప్రీత చిరునవ్వులు ♦ షూట్ లైఫ్ అంటున్న రాశీ ఖన్నా ♦ పచ్చని చీరలో చూడముచ్చటగా ముస్తాబైన హిమజ View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Ivana_Designers (@ivana_designers) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
జీన్స్ వేసుకుంటానంటే బాలికను కొట్టి చంపేశారు
డియోరియా: జీన్స్ ప్యాంట్ వేసుకుంటానని పట్టుబట్టిన ఓ బాలికను ఆమె కుటుంబీకులే కొట్టి చంపారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లా సవ్రేజీ ఖర్గ్ గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నేహా పాశ్వాన్ (17) జీన్స్, టాప్ ధరిస్తానంటూ మొండికేయగా కుటుంబసభ్యులు సోమవారం ఆమెను తీవ్రంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని డియోరియా–కస్య మార్గంలోని పటన్వా వంతెనపై నుంచి విసిరేశారు. అయితే, ఆ మృతదేహం రైలింగ్కు చిక్కుకుని అక్కడే ఉండిపోయింది. గమనించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అమ్మమ్మ, తాత సహా 10 మంది కుటుంబసభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, బాలికను జీన్స్ వేసుకుంటానని చెప్పినందుకే కోపంతో కొట్టి చంపామంటున్న మృతురాలి కుటుంబసభ్యుల మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన వెనుక వేరే కారణాలు ఉండి ఉండొచ్చుననీ, అవేంటో దర్యాప్తులో వెలుగులో చూస్తాయని చెబుతున్నారు. -
నిజం చెప్పండి తారలూ.. మీరు ప్రెగ్నెంట్స్ కదూ!
Is Sonam Kapoor, Neha Kakkar pregnant?: బాలీవుడ్ భామలు కొంచెం లావెక్కితే చాలు గర్భం దాల్చారా? అంటూ అనుమానాలు, కాస్త బక్కచిక్కితే మరీ అంత డైటింగ్ అవసరం లేదంటూ వెటకారాలు సోషల్ మీడియాలో కామన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే మీడియాకు చిక్కిన ఇద్దరు తారలు సోనమ్ కపూర్, నేహా కక్కర్లకు కూడా ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు నెటిజన్లు. కోవిడ్ వల్ల ఏడాది కాలంగా లండన్లోనే ఉండిపోయిన సోనమ్ ఇటీవలే ముంబైకు తిరిగొచ్చింది. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి ముంబై ఎయిర్పోర్టులో దిగింది. ఫ్యాషన్ ఐకాన్గా చెప్పుకునే ఆమె ఈ సమయంలో వదులైన జాకెట్ను ధరించింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె గర్భవతని అభిప్రాయపడుతున్నారు. అందుకే లూజ్ జాకెట్ వేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో సోనమ్ దంపతులకే తెలియాలి. కాగా సోనమ్ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లో పెళ్లాడింది. మరోవైపు బాలీవుడ్ టాప్ సింగర్ నేహా కక్కర్ కూడా గర్భం దాల్చిందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. గతేడాది రోహన్ప్రీత్ను పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా భర్తతో కలిసి ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సమయంలో ఆమె వదులైన టీ షర్టు ధరించింది. పైగా ప్రయాణం చేసి కాస్త అలిసిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె భర్త రోహన్ప్రీత్ ముందుగా నేహాను కారులో కూర్చోబెట్టాకే తను కారెక్కాడు. అయితే నేహా వాలకం, ఆమె మీద రోహన్ కేరింగ్ చూస్తుంటే కన్ఫామ్గా ఆమె గర్భవతే అని డిసైడ్ అయిపోతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు 'ఇండియన్ ఐడల్ 12' షో నుంచి నేహా తప్పుకోవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. #sonamkapoor returns to India after more than a year. She had left with hubby #anandahuja and they have been in London due to to Covid-19. Father #anilkapoor comes to pick her up at the Mumbai airport. pic.twitter.com/qnMiJxPfHA — Viral Bhayani (@viralbhayani77) July 13, 2021 -
హల్చల్ : మలైకా ర్యాంప్ వాక్.. నా లెవల్కి రావాలంటున్న మహి
♦ ర్యాంప్ వాక్ హోయలొలుకుతున్న మలైకా అరోరా ♦ మళ్లీ అలా కనిపించాలనుకుంటున్న నేహా కక్కర్ ♦ నా లెవల్కు రావాలంటున్న మహి ♦ ప్రతీ రోజును ఆస్వాదించాలంటున్న నవ్య స్వామి ♦ పడుచుపిల్లలా శిల్పా శెట్టి.. ♦ భర్త మూవీకి నాజ్రియో ప్రమోషన్ ♦ పాజిటివ్గా ఉంటే లైఫ్ మరింత అందంగా మారుతుందంటున్న హీనా ఖాన్ ♦ మెస్సీ మమ్మా-నాటీ నైరా సిరీస్తో సమీరా View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
ఇండియన్ ఐడల్ : యాంకర్ మారడానికి కారణం అదేనా?
ముంబై : ఇండియన్ ఐడల్ రియాలిటీ షో దేశ వ్యాప్తుంగా ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 12 నిర్విరామంగా కొనసాగుతుంది. నిన్నటి షోలో ముఖ్య అతిధిగా బాలీవుడ్ అందాల తార రేఖ వచ్చారు. తన ఎనర్జీతో షో ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేశారు. అయితే ఈ షోకు మొదటి నుంచి ఆదిత్య నారాయణ్ యాంకర్గా ఉన్నారు. అలాంటిది సడెన్గా ఆదిత్య నారాయణ్ స్థానంలో జయ్ భానుశాలి కనిపించారు. దీంతో అసలు ఆదిత్య నారాయణ్ను ఏమైంది? సడెన్గా హోస్ట్ను ఎందుకు మార్చారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదిత్యను ఎవరూ రీప్లేస్ చేయడం లేదని, కేవలం కొన్ని రోజులకు మాత్రమే ఆయన స్థానంలో జయ్ భానుశాలి ఉంటారని తెలుస్తుంది. ఈ మార్పులన్నింటికీ కారణం కరోనా వైరస్ అని తేలింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా యాంకర్ ఆదిత్య నారాయన్కు సైతం కరోనా సోకింది. దీంతో తాత్కాలికంగా ఈ షో నుంచి తప్పుకున్నారు. ఆదిత్య నారాయణ్తో పాటు ఆయన భార్య శ్వేతా అగర్వాల్కు కరోనా పాజిటివ్ అని తేలిందని స్వయంగా ఆదిత్య నారయణ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు..ప్రస్తుతం కరోనా కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ కొత్త దంపతుతు త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు నెటిజన్లు సహా ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ జడ్జిలో ఒకరైన నేహా కక్కర్ సైతం కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial) చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ భార్యను ఏడిపించిన సింగర్ -
‘నలుగురితో నారాయణ’ అంటున్న అమ్మాయి
నలుగురు అబ్బాయిలతో ఒక అమ్మాయి ఎలా ప్రయాణం చేసింది? ఈ ఐదుగురి మధ్య జరిగిన సంఘటన ఏంటి? అనే కథతో రూపొందిన చిత్రం ‘నలుగురితో నారాయణ’. రంజిత్ రాచకొండ, సిద్ధార్థ, వంశీధర్, జై సంపత్ హీరోలుగా, నేహా హీరోయిన్గా రామ్ యస్. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నలుగురితో నారాయణ’. ‘దేవుడే దిక్కు’ ఉపశీర్షిక. జి.ఎల్.బి. శ్రీనివాస్ సమర్పణలో శ్రీ కల్వకుంట్ల రవీంద్ర రావు సారథ్యంలో ఎమ్డి అస్లాం నిర్మించారు. ఎమ్డి అస్లాం మాట్లాడుతూ– ‘‘రామ్ యస్. కుమార్ దర్శకత్వంలో గతంలో ‘అంతా విచిత్రం’ సినిమా తీశా.. ఇప్పుడు ‘నలుగురితో నారాయణ‘ నిర్మించాను. తన దర్శకత్వంలోనే ‘24 గంటలు’ అనే సినిమా రూపొందించనున్నాం’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన చిత్రమిది. ఇదే బ్యానర్లో మూడో సినిమా చేసే చాన్స్ ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్’’ అన్నారు. -
వైరల్: సింగర్కు భర్త స్పెషల్ గిఫ్ట్
పెళ్లికి ముందు లెక్కలేనన్ని బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు ప్రేమికులు. కానీ ఒక్కసారి ఏడడుగులు నడిచిన తర్వాత గిఫ్ట్ అన్న పదాన్నే గాలికొదిలేస్తుంటారు. కానీ ఈ బాలీవుడ్ జంట నేహా-రోహన్ మాత్రం పెళ్లైనా ఎప్పటికీ నిత్యప్రేమికులమే అంటోంది. ఆదివారం రోజ్డేను పురస్కరించుకుని గాయకుడు, నటుడు రోహన్ ప్రీత్ సింగ్ తన అర్ధాంగి, గాయని నేహా కక్కర్కు ప్రత్యేక బహుమతులు పంపాడు. ఇందులో ఎర్రటి రోజా పూలు, మధ్యలో తీయనైన చాక్లెట్లు ఉన్నాయి. ఈ బహుమతి ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ ప్రేమ పూల వర్షంలో తడిసి ముద్దైన నేహా ఇన్స్టా వేదికగా భర్తకు రోజ్ డే శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు, అతడిచ్చిన గులాబీని ముద్దాడుతూ వీడియో షేర్ చేసింది. కాగా నేహా, రోహన్ ప్రీత్ గతేడాది అక్టోబర్లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తర్వాత దుబాయ్కు హనీమూన్ వెళ్లి అక్కడే దీపావళి జరుపుకున్నారు. అనేక మ్యూజిక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె ఇండియన్ ఐడల్ జడ్జిగా వ్యవహరిస్తోంది. అటు రోహన్ కూడా మ్యూజిక్ ఆల్బమ్స్లో బిజీగా ఉన్నాడు. చదవండి: ఒక్క క్లిక్తో పెళ్లి కుమార్తెలా మెరవవచ్చు.. ఐస్క్రీమ్ తింటున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా? -
విక్రమార్కుడు పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
సినీ పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్టులు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే తమదైన నటనతో మెప్పించి ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు. చేసింది ఒకట్రెండు సినిమాలైనా వారి ముద్దుముద్దుమాటలు, చేష్టలతో ఆ పాత్రలకు ప్రాణం పోస్తారు. అలాంటి అతి కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్ట్లలో నేహా తోట ఒక్కరు. నేహా తోట అంటే గుర్తుపట్టకపోవచ్చ కానీ, విక్రమార్కుడులో నటించిన చిన్నారి అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో అమాయకమైన చూపులతో అందరిని ఆకట్టుకుంది. తల్లిలేని పిల్లగా అద్భుతమైన నటన ప్రదర్శించింది. అలాగే రామ్గోపాల్ వర్మ ‘రక్ష’ సినిమాలో దెయ్యం పట్టిన పాత్రలో నటించి అందరిని భయపెట్టింది. ఆ సినిమాలో నేహ పాత్ర అమోఘమనే చెప్పాలి. తన నటనతో ఆర్జీవీనే మెప్పించింది. ఆ తర్వాత అనసూయ, రాముడు వంటి చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఆ తర్వాత మళ్లీ తెరపైన కనపడలేదు. సినిమా చాన్సులు వచ్చినా కాదనుకుని చదువుపై శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేస్తుంది. ఇప్పుడు అయితే అసలు గుర్తుపట్టనంతగా మారిపోయింది నేహ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నేహా తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతోంది. హీరోయిన్లా ఉన్నావ్.. సినిమాలు ఎందుకు చేయట్లేదని నెటిజన్లు ప్రశ్నిస్తే.. ..స్టడీస్ కంప్లీట్ అయ్యాక సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని,దానికి ఇంకా టైం ఉందని చెప్తోంది నేహ. నటన అంటే తనకు ఇష్టమని భవిష్యత్తులో తప్పకుండా సినిమాలు చేస్తానని చెబుతోంది. -
జనం మెచ్చిన రైతుబిడ్డ
సమస్య...కష్టం అనుకుంటే కష్టమే మిగులుతుంది. సమస్య....ఒక బడి అనుకుంటే పాఠం వినబడుతుంది. పరిష్కారం పది విధాలుగా కనిపిస్తుంది. పదిహేను సంవత్సరాల నేహా భట్ ఎకో–ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్కు రూపకల్పన చేసి శభాష్ అనిపించుకుంది... ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడి ఇచ్చే వక్కతోటను సాగు చేసే రైతులు కర్ణాటక రాష్ట్రం లో ఎక్కువగానే ఉన్నారు. అయితే పంటసంరక్షణలో భాగంగా ‘బోర్డో’లాంటి రసాయనాలను స్ప్రే చేస్తున్నప్పుడు కళ్లు మండడంతో పాటు చర్మ, శ్వాససంబంధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది రైతులు. ‘పెరికో’ అనే నిక్నేమ్తో పిలుచుకునే ‘బోర్డో’ వల్ల శరీరం నీలిరంగులోకి మారుతుంది. చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. ఈ సమస్యకు ఎకో–ఫ్రెండ్లీ అగ్రిస్ప్రేయర్తో పరిష్కారం కనిపెట్టింది దక్షిణ కర్ణాటకలోని పుట్టూరుకు చెందిన నేహాభట్. నేహా తాత నుంచి తండ్రి వరకు ‘స్ప్రే’ పుణ్యమా అని ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కున్నవారే. సమస్య గురించి తెలుసుగానీ పరిష్కారం మాత్రం కనిపించలేదు పదమూడు సంవత్సరాల నేహాకు. రెండు సంవత్సరాల తరువాత ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. 14 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్య ఉన్న విద్యార్థుల కోసం నాలుగు రాష్ట్రాల్లో ఎన్ ఎక్స్ప్లోర్స్(గ్లోబల్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రాం) నిర్వహించే కార్యక్రమం అది. మన దైనందిన జీవిత సమస్యలకు సృజనాత్మకమైన పరిష్కార మార్గాలు అన్వేషించడం ఈ కార్యక్రమ లక్ష్యం. అదృష్టవశాత్తు దీనిలో నేహాభట్కు పాల్గొనే అవకాశం వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్ ‘సమస్య గురించి తెలిసినా పరిష్కారం తోచని పరిస్థితిలో ఎన్ఎక్స్ప్లోర్స్ ఒక దారి చూపింది’ అంటుంది పదిహేను సంవత్సరాల నేహా. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న గాటర్ పంప్కు మూడు స్ప్రేయర్ ఔట్లెట్లను అమర్చడంలాంటి మార్పులతో ఆధునీకరించి సరికొత్త ఆటోమేటెడ్ అగ్రి స్ప్రేయర్కు రూపకల్పన చేసింది. దీనికి పెద్దగా నిర్వహణ ఖర్చు అవసరం లేదు. తక్కువ ఇంధనంతో నడపవచ్చు. శబ్దసమస్య ఉండదు. టైమ్ వృథా కాదు. ఈ యంత్రాన్ని ఉపయోగించడంలో మానవప్రమేయాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే అయిదు గంటల పాటు పని చేస్తుంది. ఈ అగ్రిస్ప్రేయర్ను మరింత ఆధునీకరించి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే దిశగా ప్రయోగాలు చేస్తుంది నేహా భట్. ఈ స్ప్రేయర్కు రూపకల్పన చేసే ప్రయత్నంలో తండ్రి, రైతులు, ఉపాధ్యాయుల నుంచి విలువైన సలహాలు తీసుకుంది. వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఎకోఫ్రెండ్లీ అగ్రి స్ప్రేయర్కు జాతీయస్థాయిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) అవార్డ్ అందుకుంది. ‘ప్రతి రైతు ఆటోమేటెడ్ అగ్రిస్ప్రేయర్ ఉపయోగించాలి అనేది నా కోరిక’ అంటోంది నేహా. రసాయన వ్యర్థాలు, భారలోహాలతో కూడిన నీరు పొలాల్లో పారకుండా ఒక మార్గాన్ని కనిపెట్టింది నేహా. స్థానికంగా ఎక్కువగా కనిపించే ఒక రకం మొక్కను పొలం గట్లలో నాటుతారు. ఆ మొక్క విషకారకాలను పీల్చుకొని నీటిని శుద్ధి చేస్తుంది. చక్కని కంఠంతో పాటలు పాడే నేహా బొమ్మలు గీస్తుంది. రకరకాల ఆటలు ఆడుతుంది. పుస్తకాలు చదువుతుంది. సైన్స్ ఆమె అనురక్తి, పాషన్. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనిపెట్టాలనేది ఆమె కల. కల అంటూ కంటే ఫలితం చేరువ కావడం ఎంతసేపని! -
అది నా జీవితాన్నే మార్చేసింది: సింగర్
ఈ మధ్యే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ప్రముఖ సింగర్లు నేహా కక్కర్- రోహన్ప్రీత్సింగ్ ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు జంటగా వెళ్లారు. అక్కడ రోహన్.. నేహాను కలిశాక తన జీవితం ఎలా మారిపోయిందో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తన స్పీచ్తో అక్కడున్న జడ్జిలతో పాటు సతీమణికి సైతం కంటతడి పెట్టించారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. 'నేను తలపాగా కట్టుకుంటున్న సమయంలో నేహా మేనేజ్మెంట్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేహా తర్వాతి సాంగ్లో మీరు నటిస్తారా అని! అసలు దానికోసం ప్రత్యేకంగా అడగాలా? అని బదులిచ్చాను' (చదవండి: సమంతకు నో చెప్పిన నాగచైతన్య!) 'అలా నేను ఓ రోజు గదిలో అడుగు పెట్టగానే నేహూ తల తిప్పి నావైపు చూసింది. ఆ క్షణం నా జీవితాన్నే మార్చేసింది. ఆమె 'నేహు కా వ్యాహ్' అనే పాట రాసిందని మీరంటారు, కానీ నా తలరాతను కూడా ఆమె రాసిందని నేనంటాను. నేను ఇప్పుడు ఇలా స్టేజీ మీద నిలబడటానికి కారణం నేహూనే అని సగర్వంగా చెప్తాను' అని ముగించడంతో నేహా కక్కర్ కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్ను 'నన్ను ఏడిపించారు' అన్న క్యాప్షన్తో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా నేహు దా వ్యాహ్ సాంగ్ రిలీజైన నెల రోజులకే నేహా కక్కర్- రోహన్ ప్రీత్సింగ్ ముంబైలో రోకా ఫంక్షన్ జరుపుకున్నారు. తర్వాత ఢిల్లీలో హల్దీ, మెహందీ వేడుకలతో పాటు అక్టోబర్ 23న సంగీత్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాతి రోజే వేలు పట్టుకుని ఏడడుగులు నడిచారు. (చదవండి: తాగి ప్రపోజ్ చేశాడు: సింగర్) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) -
తాగి ప్రపోజ్ చేశాడు: సింగర్
బాలీవుడ్ ప్రముఖ సింగర్లు నేహా కక్కర్-రోహన్ప్రీత్ సింగ్ వివాహం అక్టోబర్ 24న స్వల్ప అతిథుల మధ్య ఘనంగా జరిగింది. అయితే మరీ ఇంత తొందరగా పెళ్లి చేసుకునేందుకు రోహన్ రెడీగా లేరట. కానీ ఓ రోజు మాత్రం పూటుగా మద్యం తాగి పెళ్లి చేసుకుందాం అని తన ప్రియురాలు నేహాకు మెసేజ్ పెట్టాడట. మొదట దీన్ని నేహా నమ్మలేదట, కానీ తర్వాత నమ్మక తప్పలేదు. మరి ఇంతలోనే అంత మార్పు రావడానికి కారణమేంటో నేహా మాటల్లోనే తెలుసుకుందాం.. పెళ్లి కుదరదన్నాడు "ఓ రోజు షూటింగ్ పూర్తయ్యాక రోహన్ నా స్నాప్చాట్ ఐడీ అడిగాడు. అలా మా మధ్య మాటలు కలిశాయి. ప్రేమ పాఠాలు కూడా నడిచాయి. జీవితంలో సెటిల్ అవ్వాల్సిన సమయం వచ్చిందనిపించి పెళ్లి చేసుకుందాం అని అడిగాను. దీనికి అతడు ససేమీరా ఒప్పుకోలేదు. నాకింకా పాతికేళ్లే.. అప్పుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరం మాట్లాడుకోవడమే మానేశాం. అలా కొంతకాలం గడిచింది. సడన్గా ఓ రోజు నేహూ, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పాడు. నాకెందుకో నమ్మాలనిపించలేదు" (చదవండి: రాథోర్ పాటలకు పడి పోవాల్సిందే!) తాగిన మత్తులో ప్రపోజ్ చేశాడనుకున్నా "ఎందుకంటే అప్పుడే రెండు, మూడు బీర్లు తాగాడు. తాగిన మత్తులో ఇలాంటి డైలాగులు కొడుతున్నాడు, కానీ తెల్లారేసరికి మర్చిపోతాడు అని లైట్ తీసుకున్నాను. తర్వాతి రోజు నేను షూటింగ్ కోసం ఛండీఘర్ వెళ్లాను. రోహన్ అక్కడ నా రూమ్కు వచ్చి నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుందా? అని అడిగాడు. నువ్వు తాగితే నేనెందుకు మర్చిపోతాను అని చెప్పాను. కానీ ఆ క్షణమే అర్థమైంది. రోహన్ నిజంగానే పెళ్లికి రెడీ అయ్యాడని! వెంటనే నేను మా అమ్మతో మాట్లాడమని చెప్పాను. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు" అని నేహా చెప్పుకొచ్చారు. కాగా ఈ మధ్య నెట్టింట నేహా బేబీ బంప్ ఫొటోలు దర్శనమివ్వడంతో ఆమె తల్లి కాబోతుందంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే అదంతా లేటెస్ట్ సాంగ్ 'ఖ్యాల్ రఖ్యా కర్' కోసమేనని తెలియడంతో అభిమానులు అవాక్కయ్యారు. డిసెంబర్ 22న విడుదలైన ఈ సాంగ్ జనాలను ఆకట్టుకుంటోంది. (చదవండి: నేహా కక్కర్-రోహాన్ ప్రీత్సింగ్ల పెళ్లి) -
బేబి బంప్తో పబ్లిసిటీ స్టంట్
ముంబై : ప్రముఖ బాలీవుడ్ గాయని నేహా కక్కర్ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె భర్త, పంజాబ్ సింగర్ రోహన్ ప్రీత్ సింగ్ సైతం నేహా ఫోటోను రీపోస్ట్ చేస్తూ.. ‘అవును.. ఇప్పడు మరింత కేర్ తీసుకోవాలి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో నేహా తల్లి కాబోతోందని వారి అభిమానులు సంబరపడిపోయారు. ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభకాంక్షలు తెలిపారు. అయితే నేహా గర్భవతి అనే వార్త నిజం కాదని, ఓ సాంగ్ ప్రమోషనల్ టీజర్ అని తెలియడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. ‘ఖ్యాల్ రఖ్యా కర్’ అనే లేటెస్ట్ సాంగ్ కోసం నేహా గర్భవతిగా నటించింది. ఇందుకు సంబంధించి నేహా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టర్ను రిలీజ్ చేసింది. డిసెంబర్22న ఈ పాట విడుదల కానుంది. (తల్లి కాబోతున్న సింగర్ నేహా కక్కర్ ) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) ఈ కొత్తజంట చేసిన పబ్లిసిటీ స్టంట్తో అభిమానులు సహా కొందరు ప్రముఖులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. కపిల్శర్మ సహా మరికొందరు సెలబ్రిటీలు సైతం వీరికి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా కాగా నేహా, రోహాన్లు కొంతకాలంగా ప్రేమించుకుని గత అక్టోబర్ 24న ఢిల్లీలోని గురుద్వార్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి ఎన్నో పాటలు ఆలపించి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం నేహా ప్రముఖ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రోహన్ప్రీత్, ముజ్ సే షాదీ కరోగీ అనే వెడ్డింగ్ రియాలిటీ షోతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. (భారీగా బరువు తగ్గిన స్టార్ హీరో కూతురు ) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) -
తల్లి కాబోతున్న ప్రముఖ సింగర్
ముంబై: బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్, పంజాబ్ సింగర్ రోహాన్ ప్రీత్ సింగ్ల వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేహా శుక్రవారం ఓ ఫొటో షేర్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. భర్త రోహాన్తో కలిసి ఉన్న ఫొటోను నేహా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో నేహా తన బేబీ బంప్ను చూపిస్తూ నిలబడగా.. వెనకాల రోహన్ తనను పట్టుకుని ఉన్నాడు. దీనికి ‘కేర్ టేకర్’ అనే క్యాప్షన్కు హార్ట్ ఎమోజీని జత చేసి షేర్ చేశారు. అయితే ఇందులో తను తల్లి కాబోతున్నట్లు స్పష్టంగా చెప్పకపోవడంతో అభిమానులు కాస్తా గందరగోళానికి గురవుతున్నారు. (చదవండి: వైభవంగా ప్రముఖ గాయని వివాహం) ఇక నేహా పోస్టును రోహాన్ రీపోస్ట్ చేస్తూ.. ‘అవును.. ఇప్పడు మరింత కేర్ తీసుకోవాలి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో నేహా తల్లి కాబోతోందని స్పష్టమవ్వడంతో వారి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక ఈ జంటకు నెటిజన్లు సోషల్ మీడియాలో శుభకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నేహా, రోహాన్లు కొంతకాలంగా ప్రేమించుకుని గత అక్టోబర్ 24న ఢిల్లీలోని గురుద్వార్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నేహా ప్రముఖ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘మీ జంట చూడముచ్చటగా ఉంది’) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) -
ఇండియన్ ఐడల్ 12: పిజ్జా పార్టీ ఇచ్చిన జడ్జి
ముంబై: సోనీ టీవీ నిర్వహిస్తున్న ప్రముఖ రియాల్టీ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్ 12’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూలైలో ప్రారంభమైన ఈ మ్యూజిక్ షో గ్రాండ్ ప్రీమియర్కు చేరుకుంది. డిసెంబర్ 19, 20వ తేదీలో సోని టీవీలో రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న ఈ గ్రాండ్ ప్రిమియర్ షో సందడిగా జరగనుంది. ఇందులోని టాప్ 15 కంటెస్టెంట్స్ ట్రోఫీ కోసం ఒకరితో ఒకరూ పోటీ పడుతూ తమ గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వారాంతంలో జరిగే ఈ షోలో టాప్ 15 ఫైనలిస్టులు అద్భుతమైన ప్రదర్శను ఇవ్వనుండగా.. షో జడ్జిలైన విశాల్ దాద్లానీ, నేహా కక్కర్, హిమేష్ రేష్మియాలు పోటీదారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జడ్జిలంతా వారికి సంబంధించిన కొన్ని సరద క్షణాలను కంటెస్టెంట్స్తో పంచుకొనున్నారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా గ్రాండ్ ప్రీమియర్ సందర్భంగా షోలోని అందరికి పిజ్జా పార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో షో హోస్ట్ అదిత్య నారాయణ్, జడ్జి నేహా కక్కర్లు కంటెస్టెంట్స్ తల్లిదండ్రులతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. (చదవండి: జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం) The Grand Premiere of #IndianIdol2020 unfolds this weekend!@SonyTV #IndianIdol #SonyTV #Tellychakkar https://t.co/RtlXEHHRRV — princess Arisham khan (@p_Arisham_khan) December 16, 2020 ఇండియల్ ఐడిల్ సీజన్ 12 టాప్ 15 కంటెస్టెంట్స్లో ఏపీ నుంచి ముగ్గురు ఈ సీజన్లో మొదటి 12 మంది కంటెస్టెంట్స్ వరుసగా.. ఉత్తరప్రదేశ్కు చెందిన మొహద్ డానిష్, ఆంధ్రప్రదేశ్కు నుంచి.. శిరీష భగవతుల, అంజలి; మహారాష్ట్రకు చెందిన సాయిలీ కిషోర్ కాంబ్లే; న్యూఢిల్లీకి చెందిన సమ్యాక్ ప్రసానా; కేరళకు చెందిన వైష్ణవ్ గిరీశ్; పశ్చిమ బెంగాల్కు చెందిన అరుణీతా కంజీలాల్, అనుష్క బెనర్జీ; కర్ణాటకకు చెందిన నిహాల్ టౌరో; హర్యానాకు చెందిన సాహైల్ సోలంకి; ఉత్తరాఖండ్కు చెందిన పవన్దీప్ రాజన్; రాజస్థాన్కు చెందిన సవాయి భట్; ఆంధ్రప్రదేశ్కు చెందిన షణ్ముఖ ప్రియా; ముంబైకి చెందిన నాచీకెట్ లేలే; పూణేకు చెందిన ఆశీస్ కులకర్ణిలు. (చదవండి: షణ్ముఖప్రియ పాటకు న్యాయనిర్ణేతలు ఫిదా) View this post on Instagram A post shared by Indian idol 2020 (@indian__idol12) -
వైభవంగా ప్రముఖ గాయని వివాహం
న్యూఢిల్లీ: ప్రముఖ గాయని నేహా కక్కర్-రోహాన్ ప్రీత్ సింగ్ల అభిమానులకు శుభవార్త. వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా శనివారం గురుద్వారాలో జరిగింది. ప్రస్తుతం నేహుల వివాహ మహోత్సవ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నేహా కక్కర్ అభిమానుల ఇన్స్టా పేజీలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్లోని పలువురు గాయనిగాయకులు, సినీ సెలబ్రెటీలు, అభిమానుల నుంచి నూతన జంటకు సోషల్ మీడియాలో వివాహ శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. (చదవండి: హల్దీ వేడుక.. ఫొటోలు షేర్ చేసిన సింగర్) View this post on Instagram Finally #NehuPreet is Getting Marriad Today ❤️😍 . . . . #FeelItReelIt #FeelKaroReelKaro . . . . #Postivity #KeepSmiling #SpreadLove #Gratitude #NehaKakkar #NehaKakkarLive #NeHearts #Neheart #NehuDaVyah #NehuPreet #Sushantsinghrajput #RohanpreetSingh #nehakakkarlive #biggboss #biggboss13 #salmankhan #tonykakkar #sonukakkar #bb13 #StayHome #StaySafe #StayPositive #SpreadLove #GharBaithoIndia #its_nehakakkar A post shared by Neha Kakkar (@its_nehakakkar) on Oct 24, 2020 at 3:07am PDT అంతేగాక పెళ్లి రిసెప్షన్ వేడుకకు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలను నేహా సోదరుడు, గాయకుడు టోనీ కక్కర్ షేర్ చేశాడు. పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుకలో నూతన వధూవరులు ఇద్దరూ లేత గులాబీ రంగు దుస్తులను ధరించి చూడముచ్చటైన జంటగా అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఇటీవల రోకా కార్యక్రమం వీడియోను నేహా షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక నిన్న(శుక్రవారం) జరిగిన హల్ది కార్యక్రమం ఫొటోలు, వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. (చదవండి: రోకా వేడుక వీడియో షేర్ చేసిన సింగర్) View this post on Instagram Never Forget Forever #NehuDaVyah 😍❤️ . . . . #FeelItReelIt #FeelKaroReelKaro . . . . . . #Postivity #KeepSmiling #SpreadLove #Gratitude #NehaKakkar #NehaKakkarLive #NeHearts #Neheart #NehuDaVyah #NehuPreet #Sushantsinghrajput #RohanpreetSingh #nehakakkarlive #biggboss #biggboss13 #salmankhan #tonykakkar #sonukakkar #bb13 #StayHome #StaySafe #StayPositive #SpreadLove #GharBaithoIndia #its_nehakakkar A post shared by Neha Kakkar (@its_nehakakkar) on Oct 24, 2020 at 4:35am PDT -
‘మీ జంట చూడముచ్చటగా ఉంది’
బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. నటుడు, గాయకుడు రోహన్ప్రీత్సింగ్తో త్వరలోనే ఆమె వివాహం జరుగనున్న సంగతి తెలిసిందే. పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్న ఈ ప్రేమజంట ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను అభిమానులతో పంచకుంది. ఇక అప్పటి నుంచి #నీహూప్రీత్ హ్యాష్ట్యాగ్తో తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన మెహందీ, హల్దీ ఫంక్షన్ ఫొటోలను నేహా కక్కర్ తన ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. పసుపు రంగు దుస్తుల్లో, సంప్రదాయ వస్త్రధారణతో ఎంతో అందంగా కనిపిస్తున్న నీహూప్రీత్ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ప్యాలెస్ కోసం రూ. 800 కోట్లు చెల్లించిన నటుడు!) ‘‘చూడముచ్చగా ఉన్నారు. బెస్ట్ జోడీ. మరిన్ని సంతోషాలు మీ సొంతం కావాలి’’ అంటూ కామెంట్ల రూపంలో ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. కాగా అక్టోబర్ 26న ఢిల్లీలో వీరి వివాహం జరగనుండగా, పంజాబ్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి ఎన్నో పాటలు ఆలపించి గుర్తింపు దక్కించుకున్నారు. రోహన్ప్రీత్, ముజ్ సే షాదీ కరోగీ అనే వెడ్డింగ్ రియాలిటీ షోతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. View this post on Instagram #NehuPreet Ki Haldi Ceremony! ♥️💛🙏🏼😇 @rohanpreetsingh ♥️😇 Our Outfits : @shilpiahujaofficial Jewellery : @indiatrend @justpeachyindia Styled By : @ritzsony @styledose1 Rohu’s Footwears: @italianshoesco Make up: @vibhagusain Hair: @deepalid10 Photography: @deepikasdeepclicks Mehendi: @rajumehandiwala6 #NehuDaVyah A post shared by Neha Kakkar (@nehakakkar) on Oct 23, 2020 at 5:35am PDT -
రోకా వేడుక వీడియో షేర్ చేసిన సింగర్
ముంబై: కొద్దిరోజులుగా తన వివాహం రేపోమాపో అంటూ వస్తున్న పుకార్లకు బాలీవుడ్ గాయని నేహా కక్కర్ క్లారిటి ఇచ్చింది. రోహన్ ప్రీత్ సింగ్-నేహా కక్కర్లు ఈ నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తేదీ మాత్రం ఖరారు చేయకపోవడంతో ఎప్పడేప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రోకా కార్యక్రమం వీడియోను షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ వీడియోను మంగళవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి వివాహంపై వస్తున్న పుకార్లకు త్వరలోనే చెక్ పెడుతూ.. త్వరలోనే వివాహ వీడియో విడుదల కానుందంటూ స్ఫష్టం చేసింది. ‘రేపు నేహుడావియా వీడియో విడుదల అవుతుంది. అప్పటీ వరకు నా నేహార్ట్స్, నెహుప్రీత్ అభిమానులకు చిన్న బహుమతి. నేను రోహాన్ ప్రీత్ సింగ్, కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నాను. రోకా వేడుకను ఏర్పాటు చేసిన మిస్టర్ అండ్ మిసెస్ కక్కర్, మిస్టర్ కక్కర్(మా అమ్మ-నాన్న)లకు ధన్యవాదాలు’ అంటూ వివాహ హ్యాష్ ట్యాగ్ జత చేసింది. (చదవండి: ఈ నెలలోనే ప్రముఖ సింగర్ పెళ్లి!) View this post on Instagram #NehuDaVyah Video releases Tomorrow 💝 till then here’s a small Gift for My NeHearts and #NehuPreet Lovers. Here’s Our Roka ceremony clip!! ♥️💃🏻😇 I Love @rohanpreetsingh and Family 😍🙌🏼 Thank you Mrs Kakkar and Mr. Kakkar Hehe.. I mean Mom Dad 🥰 Thank youu for throwing the best event 😍🙌🏼 My Outfit: @laxmishriali Make up & Hair: @ritikavatsmakeupandhair Jewellery: @indiatrend Bangles: @sonisapphire Styled by @ritzsony @styledose1 Rohu’s Outfit: @mayankchawla09 Video: @piyushmehraofficial A post shared by Neha Kakkar (@nehakakkar) on Oct 20, 2020 at 2:48am PDT అయితే ఇటీవల నేహా కక్కర్ మొదటిసారిగా రోహాన్ప్రీత్సింగ్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్న వీడియోను షేర్ చేస్తూ త్వరలో వివాహాం తేదీ ఖరారు చేయబోతున్నామంటూ అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వీడియోను ప్రీత్ సింగ్ ‘తను మొదటిసారిగా మా ఇంటికి వచ్చిన రోజు. ఈ రోజుకు ఉన్న ప్రత్యేకతను నేను మాటల్లో చెప్పలేను. ప్రపంచం నా చేతిని పట్టుకున్నట్లు ఉంది’ అంటూ తన ఇన్స్టాలో షేర్ చేశాడు. గాయకుడైన రోహన్ప్రీత్ సింగ్ ప్రముఖ రియాలీటి షోలు ముజ్సే షాదీ కరోగే, ఇండియా రైజింగ్ స్టార్లలో పాల్గొన్నారు. అంతేగాక ప్రస్తుతం నేహా సరిగమప లిటిల్ చాంప్స్. ఇండియన్ ఐడల్ టీవీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అయితే నటుడు హిమాన్ష్ కోహ్లితో నేహా విడిపోయాక వారిద్దరూ ఒకరిపై ఒకరూ పరోక్షంగా పలుమార్లు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంఓ ఇండియన్ ఐడల్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన ఆదిత్య నారాయణతో ఆ షోకు జడ్జీగా వ్వవహరిస్తున్న నేహా కక్కర్ వివాహానికి ఇరుకుంటుబాలు అంగీకరించిన షో లైవ్ లో చూపించిన విషయం తెలిసిందే. అయితే షో స్క్రీప్ట్లో భాగమేననంటూ ఆ తర్వాత నేహా, ఆదిత్యలు స్పష్టం చేశారు. (చదవండి: తనతో నా పెళ్లి ఫేక్.. టీఆర్పీ కోసమే: సింగర్) -
ఈ నెలలోనే ప్రముఖ సింగర్ పెళ్లి!
తన గాత్రంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్న ప్రముఖ గాయని నేహా కక్కర్ త్వరలోనే పెళ్లి కూతురిగా ముస్తాబవనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అది నిజమేనని ధ్రువీకరిస్తూ నేహా.. గత నెలలో పంజాబీ గాయకుడు, నటుడు రోహన్ప్రీత్తో కలిసి దిగి ఉన్న ఫొటోను పంచుకున్నారు. 'నువ్వు నా వాడివి' అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. రోహన్ కూడా వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను నెట్టింట షేర్ చేస్తూ 'నేను నీ వాడినే నేహా' అని క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయని, పెళ్లి ఖాయమేనని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ వార్తలకు మరింత ఊతమిస్తూ తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి పత్రికలు ప్రత్యక్షమయ్యాయి. అందులో అక్టోబర్ 26న ఢిల్లీలో వీరి పెళ్లి జరగనుండగా, పంజాబ్లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: ఈ ఏడాది చివర్లో శ్వేతతో నా పెళ్లి: నటుడు) మరి ఇది నిజమా? కాదా? అనే విషయంపై సింగర్ స్పందించాల్సి ఉంది. కాగా కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి హిట్ పాటలతో నేహా కక్కర్ బాలీవుడ్లో టాప్ సింగర్గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మ్యూజిక్ ఆల్బమ్స్తో అభిమానులను అలరించే ఆమె గతంలో నటుడు హిమన్షు కోహ్లితో ప్రేమాయణం జరిపారు. కానీ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా రోషన్తో కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నారు. (చదవండి: నువ్వు నా వాడివి.. నా జీవితం నువ్వే నేహా!) View this post on Instagram Repost by @gosipgiriblog @nehakakkar @rohanpreetsingh #NehaKakkar #RohanPreetSingh #NehuDaVyah #NehuPreet A post shared by Preeti sahu (@neheartpreeti) on Oct 16, 2020 at 9:54pm PDT -
అవును.. పెళ్లిచేసుకోబోతున్నాం: ఆదిత్య
ముంబై: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, నటి శ్వేతా అగర్వాల్ను మనువాడనున్నాడు. ఈ విషయాన్ని ఆదిత్య నారాయణ్ ధ్రువీకరించాడు. పదేళ్ల తమ ప్రేమ బంధాన్ని పెళ్లిపీటలు ఎక్కించేందుకు సర్వం సిద్ధమైందని పేర్కొన్నాడు. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో తమ వివాహం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్ నటుడిగా, టీవీ షోల హోస్ట్గా అందరికీ సుపరిచితమైన ఆదిత్య నారాయణ్, శ్వేతతో కలిసి ‘షాపిత్’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది.(చదవండి: రణ్బీర్, అలియా వివాహంపై వివరణ) ఈ విషయం గురించి ఆదిత్య ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షాపిత్ సెట్లో తొలిసారి శ్వేతను కలిశాను. తనతో స్నేహం పెంచుకున్నాను. అయితే తనపట్ల నాకున్న ఆరాధనా భావం ప్రేమే అని తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు. కానీ శ్వేత మాత్రం.. మనం కేవలం స్నేహితులం మాత్రమే అని నన్ను దూరం పెట్టేది. అప్పటికి మేం వయసులో చిన్నవాళ్లమే. అంతేకాదు కెరీర్ కూడా అప్పుడే మొదలైంది. అలాంటి సమయంలో రిస్కు చేయడం ఇష్టంలేకనే తను అలా చేసింది. అన్ని ప్రేమ జంటల్లాగే మేం కూడా పదేళ్ల బంధంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశాం. నిజానికి పెళ్లి అనేది కేవలం ఒక తంతు మాత్రమే. నా తల్లిదండ్రులకు కూడా శ్వేత అంటే ఎంతో ఇష్టం. వాళ్ల అంగీకారంతోనే ఈ ఏడాది చివర్లో పెళ్లిచేసుకోబోతున్నాం. నా సోల్మేట్ జీవిత భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉంది’’అంటూ చిరునవ్వులు చిందించాడు.(చదవండి: నువ్వు నా వాడివి.. నా జీవితం నువ్వే నేహా! ) వాళ్లిద్దరూ నా స్నేహితులు.. ఇక ఇండియన్ ఐడల్ షో స్క్రిప్టులో భాగంగానే సింగర్ నేహా కక్కర్తో తన పెళ్లి అంటూ ఓ ఎపిసోడ్ను చిత్రీకరించారని, తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని ఆదిత్య చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా సోషల్ మీడియా వేదికగా తాము ప్రేమలో ఉన్నట్లు బహిర్గతం చేసిన నేహా, ఆమె ప్రియుడు, నటుడు రోహన్ప్రీత్ సింగ్కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. వాళ్లిద్దరూ తనకు మంచి స్నేహితులని, త్వరలోనే వారి పెళ్లి కూడా జరగబోతుందని హర్షం వ్యక్తం చేశాడు. -
నువ్వు నా వాడివి: నేహా కక్కర్
ముంబై: బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. నటుడు రోహన్ప్రీత్ను ఆమె మనువాడనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనెలాఖరున ఢిల్లీలో వీరి వివాహం జరుగనుందని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వీరిద్దరు చేస్తున్న పోస్టుల ఆధారంగా ఈ వదంతులు వ్యాప్తిస్తున్నాయి. వాటికి మరింత బలం చేకూర్చే విధంగా తాజాగా నేహా, రోహన్తో ఉన్న ఫొటోను షేర్ చేసి.. ‘‘నువ్వు నా వాడివి’’అంటూ క్యాప్షన్ జతచేశారు. (చదవండి: ఆదిత్యను అలా ఆటపట్టించాను: ఉదిత్ నారాయణ్) అంతేగాక నేహూప్రీత్ అంటూ హ్యాష్ట్యాగ్ జతచేసి తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఇందుకు స్పందించిన రోహన్ సైతం అదే ఫొటోను నెటిజన్లతో పంచుకున్నాడు. ‘‘ నా జిందగీ నేహా కక్కర్’’ అంటూ ఆమెపై ప్రేమ కురిపించాడు. ‘‘నేహా.. లవ్ యూ సో మచ్.. నేను నీ వాడినే’’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో వీళ్లిద్దరి పెళ్లి ఖాయమైనట్లేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు అంటూ ఇప్పటి నుంచే విషెస్ చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడక తప్పదని, గతంలో ఇండియన్ ఐడల్ 10 హోస్ట్ ఆదిత్య నారాయణ్తో, నేహా పెళ్లి వార్తలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. (విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్) కాగా ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి ఎన్నో పాటలు ఆలపించి ప్రముఖ గాయనిగా గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో ఆమె నటుడు హిమాన్షు కోహ్లితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తడంతో బ్రేకప్ చెప్పుకొన్నారు. ఆ తర్వాత కెరీర్పై దృష్టి సారించిన నేహా, పలు ఆల్బమ్స్తో అభిమానుల ముందుకొచ్చారు. ఇక రోహన్ప్రీత్, ముజ్ సే షాదీ కరోగీ అనే వెడ్డింగ్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు. View this post on Instagram You’re Mine @rohanpreetsingh ♥️😇 #NehuPreet 👫🏻 A post shared by Neha Kakkar (@nehakakkar) on Oct 8, 2020 at 7:58pm PDT -
నేహా పెళ్లిపై స్పందించిన మాజీ ప్రియుడు!
ప్రముఖ గాయని నేహా కక్కర్ పంజాబీ గాయకుడు, నటుడు రోహన్ప్రీత్ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేనప్పటికి అక్టోబర్లోనే వీరి వివాహం జరగనుందని బీటౌన్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేహా గతంలో చాలా మందితో డేటింగ్లో ఉన్నట్లు కథనాలు ఉన్నాయి. గత సంవత్సరం ఇండియన్ ఐడల్ 10 హోస్ట్ ఆదిత్య నారాయణ్తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పగా, అది పీఆర్ స్టంట్ అని తేలింది. దీనికి ముందు, నేహా, నటుడు హిమాన్ష్ కోహ్లీ రిలేషన్లో ఉన్నట్లు కథనాలు బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ విషయం చాలా మందిని ఆకర్షించింది. నేహా వివాహానికి సంబంధించి పుకార్లు రావడంతో ఈ విషయం గురించి హిమాన్ష్ కోహ్లీని ప్రశ్నించగా రోహన్ ప్రీత్తో ఉన్న సంబంధం గురించి తనకు తెలియదని, కానీ ఆమె జీవితంలో ముందుకు సాగడంపట్ల తనకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. హిమాన్ష్ మాట్లాడుతూ, ‘నేహా నిజంగా వివాహం చేసుకుంటే, నేను సంతోష పడతాను. దాని తరువాత ఆమె జీవితంలో ముందుకు సాగుతోంది, ఆమెకంటూ ఒకరుంటారు. అది చూడటానికి చాలా బాగుటుంది’ అని అన్నారు. ఇక నేహాను వివాహం చేసుకోబోతున్న రోహన్ప్రీత్ తెలుసా అని అడిగినప్పుడు, లేదు, నిజంగా తెలియదు అని హిమాన్ష్ సమాధానం ఇచ్చారు. హిమాన్ష్, నేహా కక్కర్ 2014 నుంచి 2018 వరకు 4 సంవత్సరాలు సంబంధంలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఒక మ్యూజిక్ వీడియోలో కూడా కలిసి నటించారు. ఒక రియాలిటీ షోలో నేహా, హిమాన్ష్ పట్ల తనకున్న ప్రేమను కూడా ప్రకటించింది. చదవండి: పాడినందుకు పైసా ఇవ్వరు: ప్రముఖ సింగర్ -
పాడినందుకు పైసా ఇవ్వరు: ప్రముఖ సింగర్
ఉత్తిపుణ్యానికి ఎవరూ ఏ పని చేసి పెట్టరు. ముఖ్యంగా సెలబ్రిటీలు. తమ పారితోషికం విషయంలో పైసా తక్కువైనా ఒప్పుకోరు. అలాంటిది ఓ సింగర్ మాత్రం తను పాటలు పాడినందుకు పైసా కూడా ముట్టదంటోంది, సినిమాల్లో ఉచితంగానే పాటలు పాడతానంటోంది. తానొక్కరే కాదని, బాలీవుడ్లో దాదాపు అందరి పరిస్థితి ఇంచుమించుగా ఇదే విధంగా ఉందని చెప్పుకొచ్చింది. ఓ గర్మీ, ఆంఖ్ మేరే, సాఖి, దిల్బర్ రీమిక్స్, కాలా చష్మా.. వంటి బ్లాక్బస్టర్ పాటలతో అందరికీ సుపరిచితురాలిగా నిలిచిన బాలీవుడ్ గాయని నేహా కక్కర్ ఈ సంచలన విషయాలను వెల్లడించింది. బాలీవుడ్లో పాటలు పాడినందుకు గానూ గాయనీ గాయకులకు చిల్లిగవ్వ ఇవ్వరని చెప్పుకొచ్చింది. (‘దారుణం, అతడి ప్రతిభను కొట్టేశారు’) తాము పాడిన పాట సూపర్ హిట్ అయ్యిందంటే ఆ తర్వాత ఎన్నో షోలు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని తద్వారా ఎంతో డబ్బు సంపాదిస్తామని భావిస్తారని చెప్పుకొచ్చింది. తానైతే లైవ్ కన్సర్ట్, టీవీ ప్రోగ్రామ్స్ ఇలా ఎన్నో మార్గాల ద్వారా మంచి ఆదాయాన్ని గడిస్తున్నానంది. కానీ అందరి పరిస్థితి అలా లేదని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఆమె ర్యాప్ సింగర్ యోయో హనీ సింగ్తో కలిసి "మాస్క్యో సుక" అనే పాటలో కనిపించనుంది. ఇది రష్యన్, పంజాబీ భాషల కలయికలో రూపొందుతోంది. ఇదిలా ఉండగా ఆమె ఇటీవలే ఉత్తరాఖండ్లో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. (విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్) -
విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్
అద్దె ఇంట్లో అష్టకష్టాలు పడిన పరిస్థితుల నుంచి విలాసవంతమైన బంగ్లా కొనగలిగే స్థాయికి ఎదిగితే ఆ కిక్కే వేరు. అది కూడా.. కష్టార్జితంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటే హృదయం సంతోషంతో నిండిపోతుంది. బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ ప్రస్తుతం అలాంటి ఆనందకర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. సాధారణ వ్యక్తిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నేహా.. ప్రస్తుతం సెలబ్రిటీ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆమె.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్నారు. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి ఎన్నో పాటలు ఆలపించి ప్రముఖ గాయనిగా గుర్తింపు దక్కించుకున్నారు.(రెండు వేల నోట్లను పంచిన సింగర్) ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నేహా కక్కర్.. తాజాగా తాను ఉత్తరాఖండ్లో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘‘నేను పుట్టినచోట .. రిషికేష్లో... ఇది ఇప్పుడు మా బంగ్లా.. గతంలో ఇక్కడే మా కుటుంబం ఒకే ఒక్క గదిలో ఉండేది. అందులోనే ఓ టేబుల్ విస్తీర్ణంలో మా ‘కిచెన్’ ఉండేది. అది మా సొంత గది కూడా కాదు. దానికి మేం అద్దె కట్టేవాళ్లం. ఇప్పుడు అదే సిటీలో నా సొంత బంగ్లా చూస్తుంటే... ఉద్వేగం ఉప్పొంగుతోంది’’ అంటూ తమ పాత ఇంటి ఫొటోతో పాటు.. కొత్త బంగ్లా ముందు నిల్చున్న ఫొటోను షేర్ చేశారు. తను ఈ స్థాయికి చేరడానికి కారణమైన, ఎల్లవేళలా తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, మాతా రాణి(అమ్మవారు), శ్రేయోలాభిలాషులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో.. నేహాపై ఇన్స్ట్రాగ్రామ్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘సెల్ఫ్ మేడ్ వుమెన్. మీ కాళ్లపై మీరు నిలబడ్డారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు’’ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. (‘నేహను క్షమాపణలు కోరుతున్నా’) View this post on Instagram This is the Bungalow we Own now in #Rishikesh and Swipe Right to see the house where I was Born ❤️🙏🏼 In the same house We Kakkar’s used to stay in a 1 Room inside which My Mother had put a table which was our kitchen in that small room. And that Room also was not our own, we were paying rent. And Now Whenever I see Our Own Bungalow in the Same City, I always get Emotional 🥺 . #SelfMade #NehaKakkar ❤️💪🏼 Biggest Thanks to My Family @sonukakkarofficial @tonykakkar Mom Dad Mata Rani (God) ❤️🙏🏼 and Ofcourse My NeHearts and All My Well wishers ❤️🙌🏼 . #NehuDiaries #Utrakhand #KakkarFamily A post shared by Neha Kakkar (@nehakakkar) on Mar 6, 2020 at 3:04am PST -
తనతో నా పెళ్లి ఫేక్.. టీఆర్పీ కోసమే: సింగర్
గత కొంతకాలంగా ప్రముఖ గాయని నేహా కక్కర్ ఇండియన్ ఐడల్ సీజన్ 11 మ్యూజిక్ షో యాంకర్ అదిత్య నారాయణ్లు త్వరలో వివాహం చేసుకోబుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించినట్లు ఇండియన్ ఐడల్ షోలో స్పష్టం చేశారు. ఇక అప్పటి నుంచి నేహా, అదిత్యల జోడి కుదరినట్లేనని అందరూ ఫిక్సైపోయారు. నేహా అభిమానులైతే ఆమె పెళ్లి తేదీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేహా అందరికి షాకిస్తూ... వారి పెళ్లి అంతా అబద్ధమని, కేవలం టీఆర్పీ కోసమే.. పెళ్లి ఎపిసోడ్ పేరుతో షోలో అలా నటించామని వెల్లడించింది. ఇక అదిత్య ఈ ఏడాది చివరిలో తన చిరకాల ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పింది. అదే విధంగా దీనిపై అదిత్య తండ్రి, గాయకుడు ఉదిత్ నారాయణ్ ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘అదిత్యను కావాలనే నేహాను పెళ్లి చేసుకోమ్మంటూ ఆటపట్టించేవాడిని.. కానీ అదిత్య కొట్టిపారేస్తూ.. ప్రస్తుతం తన కెరియర్పై దృష్టి పెడుతున్నానని.. ఇప్పట్లో పెళ్లి చేసుకొనని చెప్పేవాడు. అయినా వినకుండా అదిత్యతో, నేహాను పెళ్లి చేసుకొమ్మంటూ ఏడిపిస్తూనే ఉంటాను’ అని చెప్పాడు. ఆ షో జడ్జ్తో హోస్ట్ పెళ్లి! కాగా ఇండియన్ ఐడల్ షోకి నేహా జడ్జీగా వ్యవహరించగా.. ఆదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పెషల్ వెడ్డింగ్ ఎపిసోడ్ పేరుతో టెలికాస్ట్ చేసిన ఈ షోలో ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్, తల్లి దీప నారాయణ్లతో పాటు నేహా తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో షోలో అందరి ముందు నేహాను తమ కోడలిగా చేసుకుంటామని ఉదిత్ నారాయణ్ దంపతులు ప్రకటించగడంతో.. నేహా తల్లిదండ్రులు కూడా తమ కూతురిని వారింటికి కోడలిగా పంపించడానికి ఒప్పుకున్నట్లుగా షోలో చూపించారు. అంతేగాక ఇటీవల న్యూ ఈయర్ వేడుకలో భాగంగా గోవా బీచ్లో నేహా, ఆదిత్యలు సందడి చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక నేహా, ఆదిత్యల పెళ్లి ఎపిసోడ్ ఫేక్ అని తెలిసి ఆమె అభిమానులు నిరాశ పడుతుంటే.. మరికొందరు తమని ఫూల్ చేసినందుకు షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. ‘గుర్తింపు కోసమే.. నా పేరు వాడుకుంటున్నారు’ -
ఆమె గొంతు తీయన, మనసేమో చల్లన
-
రెండు వేల నోట్లను పంచిన సింగర్
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ పేద పిల్లలకు సాయం చేస్తూ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. చేయి చాచి అడిగిన పిల్లలకు లేదనకుండా సాయం చేసి అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన నేహా దగ్గరికి ఇద్దరు వీధిబాలలు చేరుకుని టిష్యూ పేపర్లు కొనమని కోరారు. దీంతో ఈ గాయని ఏ మాత్రం సంకోచించకుండా వెంటనే రూ.2 వేల నోట్లను తీసి వారి చేతిలో పెట్టింది. ఇలా వీధిబాలలకు సాయం చేస్తుండగా క్లిక్మనిపించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె దాతృత్వానికి పొంగిపోయిన అభిమానులు నేహాను పొగడ్తలతో ముంచెత్తారు. ‘కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి’, ‘ఆమెది బంగారం లాంటి మనసు. చిన్నపిల్లలు అడగగానే ఏ మాత్రం సంకోచించకుండా, చిరాకు పడకుండా సహాయం చేసింది’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. (ఉదిత్ నారాయణ్ కొడుకుతో సింగర్ పెళ్లి!!) ఇక కార్యక్రమం అనంతరం బయటకు వచ్చిన నేహాను మీ పెళ్లెప్పుడంటూ ఓ విలేఖరి ప్రశ్నించాడు. దీనికి ఆమె ఏమీ బదులివ్వకుండా చిరునవ్వుతో అక్కడ నుంచి నిష్క్రమించింది. సోషల్ మీడియాలో మాత్రం తన పెళ్లివార్తలపై స్పందించింది. సింగర్ ఆదిత్య నారాయన్ను పెళ్లాడనుందన్న వార్తలను ఖండించింది. తాను సింగిల్గానే ఎంతో హ్యాపీగా ఉన్నానంటూ. పెళ్లి.. గిల్లీ ఏమీ లేదని స్పష్టం చేసింది. కాగా గతంలోనూ ఐడల్ సింగర్ ప్రోగ్రామ్లో ఆదిత్య నారాయణ తల్లిదండ్రులు స్టేజీపైకి వచ్చి నేహాను కోడలిగా చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది కేవలం టీఆర్పీల కోసమే చేశామని చెప్పడంతో ప్రేక్షకులు ఒకింత నిరుత్సాహానికి గురికాగా మమ్మల్ని ఫూల్ చేశారంటూ వారిపై మండిపడ్డారు. ఇక వీరిద్దరూ కలిసి ఆడిపాడిన ‘గోవా బీచ్ సాంగ్’ ఈమధ్యే రిలీజ్ కాగా అది యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. (నేహాను ఇప్పటికీ గౌరవిస్తున్నా: మాజీ ప్రియుడు) -
ఆ షో జడ్జ్తో హోస్ట్ పెళ్లి!
ఇండియన్ ఐడల్ సీజన్ 11 హోస్ట్ ఆదిత్య నారాయణ్, జడ్జ్ నేహా కక్కర్లు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్లో ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిత్య, నేహాల మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోంది. దీనికి ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇటీవల ఆదిత్య నేహాకు ప్రపోజ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. వృత్తిరీత్యా ఇద్దరు సింగర్లు కావడంతో వారి మధ్య మంచి అవగాహన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆదిత్య, నేహా తల్లిదండ్రులు ఇండియన్ ఐడల్ షోకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్.. నేహాను ఆటపట్టించాడు. నేహాను తన కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆదిత్య తల్లి దీప కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ షోను ప్రసారం చేస్తున్న చానల్ కూడా నేహా, ఆదిత్యలు ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోనున్నట్టు ఓ ప్రొమోలో తెలిపింది. అయితే ఇది షో ప్రమోషన్ కోసం చేసిందా లేక నిజంగానే ఫిబ్రవరి 14న నేహా, ఆదిత్యలు పెళ్లి చేసుకోనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది మాత్రం నేహా, ఆదిత్యలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా తాము పెళ్లి చేసుకోనున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు వీరిద్దరు కలిసి గోవా బీచ్లో నేహా సోదరుడు టోని కక్కర్ రూపొందించిన ఓ సాంగ్ షూట్లో పాల్గొన్నారు. ఈ వీడియోను ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నేహా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. View this post on Instagram #GoaBeach 🏖 Out on 10th feb ❤️😇 . . #TonyKakkar #NehaKakkar #AnshulGarg #AdityaNarayan #KatKritian #DesiMusicFactory A post shared by Neha Kakkar (@nehakakkar) on Feb 1, 2020 at 11:19pm PST -
ఉదిత్ నారాయణ్ కోడలు కాబోతున్న సింగర్!
ముంబై: ప్రముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్-11 వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బాలీవుడ్ టాప్ సింగర్ ఉదిత్ నారాయణ్, గాయని అల్కా యాగ్నిక్ అతిథులుగా సందడి చేశారు. అయితే వీరిద్దరితో పాటు ఈ షో జడ్జి నేహా కక్కర్ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకు రావడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. షో హోస్ట్, ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ తమకు బాగా నచ్చాడని.. అతడిని అల్లుడిగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పడంతో నేహా కంగుతిన్నారు. నటుడు, బుల్లితెర హోస్ట్గా గుర్తింపు పొందిన ఆదిత్య నారాయణ్ ప్రస్తుతం ఇండియన్ ఐడల్ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా జడ్జి నేహా కక్కర్ను ప్రేమిస్తున్నానంటూ తరచుగా ఆమెకు ప్రపోజ్ చేయడం... ఆమె సమాధానం ఇవ్వకుండా దాటవేయడం వంటి పరిణామాలతో షో సందడిగా సాగుతోంది. (‘జరిగిందేదో జరిగిపోయింది..గతాన్ని మార్చలేను’) ఈ క్రమంలో ఆదివారం నాటి షోకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉదిత్ నారాయణ దంపతులతో పాటు నేహా కక్కర్ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకు వచ్చారు. నేహను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని భావిస్తున్నట్లు ఉదిత్ నారాయణ పేర్కొన్నారు. ఆయన భార్య దీపా నారాయణ్ సైతం ఇదే ఆకాంక్షను వెలిబుచ్చారు. అంతేగాక నేహా తల్లిదండ్రులు కూడా పెళ్లి ఖాయం చేశామంటూ వ్యాఖ్యానించడంతో నేహా సహ జడ్జీలు ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 14న నేహా-ఆదిత్యల వివాహం జరుగనుందంటూ ప్రోమోలో పేర్కొనడంతో..ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే.. ‘ఇదంతా నిజమా లేదా షో రేటింగ్ను పెంచే క్రమంలో భాగంగానో తెలియదు గానీ.. మీ జంట బాగుంటుంది నేహా- ఆదిత్య’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ ఆలపించిన నేహా.. నటుడు హిమాంశు కోహ్లితో ప్రేమలో ఉన్నట్టు ఇండియన్ ఐడల్ వేదికపై గతంలో ప్రకటించారు. అయితే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడిపోయారు. Taareekh teh ho chuki hai, Mummy-Papa ne bhi apni haan de di hai! Kya Aditya finally Neha ko apni dulhan banaane mein kaamiyaab hoga? Dekhiye #IndianIdol11 #AlkajiUditjiSpecial mein, iss Sunday raat 8 baje. #AlkaYagnik #UditNarayan #AdityaNarayan @iAmNehaKakkar @VishalDadlani pic.twitter.com/odf47CSwMH — Sony TV (@SonyTV) January 9, 2020 -
ఇదే చివరి ముద్దు: నటి
ప్రముఖ నటి నేహా పెండ్సే పెళ్లి సమయం సమీపిస్తోంది. ఇక ఆమె సింగిల్ లైఫ్కు గుడ్బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో నేహా పెండ్సే ఈ కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా ప్రారంభించింది. తనకు కాబోయే భర్తకు గాఢంగా ముద్దుపెడుతూ లోకాన్ని మరిచిపోయిన నేహా ‘లాస్ట్ సింగిల్ గర్ల్ కిస్’ అంటూ దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తన పెళ్లి గురించి చెప్తూ సిగ్గుల మొలకవుతోంది. ‘ప్రస్తుతం నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను కోరుకున్న వ్యక్తితో మనువాడి కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నాను. అక్కడ అందమైన వ్యక్తుల మధ్యకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను. అసలు ఇప్పుడు నాకు కలుగుతున్న ఫీలింగ్ నా జీవితంలోనే గొప్పది’ అంటూ సంతోషంలో తేలియాడుతోంది. కాగా నేహా పెండ్సే ప్రముఖ బిజినెస్మెన్ షాదుల్ సింగ్తో గతేడాది ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులక్రితం పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో నేహా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను నేహా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంది. ఇక ‘కేప్టన్ హౌస్’ షోతో బుల్లితెరకు పరిచయమైన నేహా తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఎన్నో హిట్ షోలతో పాటు బిగ్బాస్ 12 హిందీలోనూ తళుక్కున మెరిసింది. తెలుగులో కేవలం సొంతం, వీధి రౌడీ చిత్రాల్లో మాత్రమే నటించింది. నేహా పెండ్సే జనవరి 5న పెళ్లికి సిద్ధమవుతుండగా ఏప్రిల్లో హనీమూన్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. -
‘నేహను క్షమాపణలు కోరుతున్నా’
‘దిల్బర్’ సింగర్ ఫేమ్, ఇండియన్ ఐడల్ షో జడ్జి నేహా కక్కర్ ఎత్తు, టాలెంట్పై విమర్శలు చేసిన కమెడియన్ గౌరవ్ గేరా క్షమాపణలు చెప్పాడు. ఓ కామెడీ షోలో భాగంగా పొట్టిగా ఉన్న అమ్మాయిని నేహా కక్కర్గా పేర్కొన్న గౌరవ్... నేహా పాడిన పాటలను సైతం ప్రస్తావించాడు. ఈ విషయంపై నేహా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గౌరవ్ మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలకు నేహా ఈ స్థాయిలో బాధపడుతుందని ఊహించలేదన్నాడు. తాను నేహకు పెద్ద అభిమానినని, ఆమె ఒక గొప్ప ప్రతిభావంతురాలని కొనియాడాడు. నేహ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా ఆమె టాలెంట్ను అంచనా వేసే స్థాయి కూడా తనకు లేదని వ్యాఖ్యానించాడు. నేహా టాలెంట్.. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ను చూస్తే అర్థమవుతుందన్నాడు. 3 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారని తెలిపాడు. కాగా నేహాను కించపరుస్తున్నట్లుగా గౌరవ్ మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వీడియోను పోస్ట్ చేసిన చానెల్ వెంటనే తొలగించినప్పటికీ నేహా అభిమానుల అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గౌరవ్ వివరణ ఇచ్చుకున్నాడు. నేహా దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చిందని తెలిపారు. తాను అసలు ఎత్తు గురించి పట్టించుకోనని.. అసలు తన ఎత్తు కూడా తనకు తెలియదని పేర్కొన్నాడు. -
‘జరిగిందేదో జరిగిపోయింది..గతాన్ని మార్చలేను’
తన మాజీ ప్రేయసి నేహా కక్కర్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ నటుడు హిమాంశ్ కోహ్లి పేర్కొన్నాడు. విడిపోయిన తర్వాత కూడా ఆమెపై ఏమాత్రం గౌరవం తగ్గలేదని... తనను ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉంటానన్నాడు. నేహా వంటి గొప్ప ఆర్టిస్టుతో వేదికను పంచుకోవడం ఎవరికైనా ఆనందంగానే ఉంటుందని ప్రశంసలు కురిపించాడు. సింగింగ్ ప్రోగ్రామ్ ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ ఆలపించిన నేహా.. నటుడు హిమాంశు కోహ్లితో ప్రేమలో ఉన్నట్టు ఇండియన్ ఐడల్ వేదికపై ప్రకటించారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో తన సోషల్ మీడియా అకౌంట్లలో హిమాంశును అన్ఫాలో చేసిన నేహా.. తాను డిప్రెషన్లో ఉన్నానంటూ వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె అభిమానులు హిమాంశును టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే నేహా మాత్రం తన పరిస్థితికి తానే కారణమని.. ఎవరినీ నిందించవద్దని వారికి విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హిమాంశు...‘ నాకు నేహపై ఎటువంటి కోపం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని నేను మార్చలేను. అయితే ఒక విషయం.. నేను ఎల్లప్పుడూ నేహాను గౌరవిస్తూనే ఉంటాను. మేము గొడవ పడిన రోజుల్లో కూడా ఒకరినొకరం గౌరవించుకోవడం మానలేదు. తను అద్భుతమైన వ్యక్తిత్వం కలది. అంతకుమించి గొప్ప కళాకారిణి. తనకు ఆ దేవుడు అన్ని సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి తను తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నాడు. అదే విధంగా తమ హిట్ సాంగ్...‘ఓహ్ హమ్ సఫర్’ గురించి చెబుతూ.. మేము రూపొందించిన ఈ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. విడిపోయినంత మాత్రాన తనతో కలిసి పనిచేయకూడదని అనుకోను. మంచి ప్రాజెక్టు వస్తే ఇద్దరం కలిసి పనిచేస్తాం. ప్రస్తుతం నా జీవితంలో ప్రేమ, పెళ్లికి చోటులేదు. వాటి గురించి ఆలోచించడం లేదు. కేవలం నటన మీదే దృష్టి సారించాను అని వ్యాఖ్యానించాడు. -
‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’
న్యూఢిల్లీ : పాపులర్ రియాలిటీ షో హిందీ ‘బిగ్ బాస్ 12’లో కంటెస్టెంట్, బుల్లితెర నటి నేహా పెండ్సే ప్రేమలో పడింది. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించింది. నేహ తన స్నేహితుడు షార్దూల్ సింగ్ బయాస్తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఫొటోలకు క్యాప్షన్గా హార్ట్ ఎమోజీని ఉంచింది. ఈ క్రమంలో.. ‘నెటిజన్లు అత్యంత ముచ్చటైన జంట’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలో నేహ నిశ్చితార్థపు వేలికి ఉంగరం ఉండటంతో... వీరిద్దరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై నేహా స్పందిస్తూ ‘ప్రస్తుతానికి మేమిద్దరం రిలేషన్షిప్ ఉన్నాం. పెళ్లి ఎప్పుడనేది మాకే స్పష్టత లేదు’ అని ఓ ఇంటర్యూలో వెల్లడించింది. ఇక ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 12లో కంటెస్టెంట్లు దీపికా కాకర్, కరణ్వీర్ బొహ్రాలతో పాటు పాల్గొన్న బుల్లితెర నటి నేహా కూడా ఫేమస్ అయ్యారు. కాగా నేహా 1999లో వచ్చిన ‘ప్యార్ కోయ్ ఖేల్ నహీ’ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీ, తమిళం,మలయాళం, కన్నడతో పాటు మరాఠీ సినిమాల్లోనూ కనిపించింది. View this post on Instagram ❤️ A post shared by NEHHA PENDSE (@nehhapendse) on Aug 13, 2019 at 11:02pm PDT -
ఆ రికార్డు ఈరోజు బద్దలైంది: సచిన్
ముంబై: ఉత్తరప్రదేశ్కు చెందిన ‘బార్బర్ షాప్ గాల్స్’ జ్యోతికుమారి, నేహలను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు అబ్బాయిల్లా మారి సెలూన్ నడిపిస్తున్న వీరికి జిల్లెట్ స్కాలర్షిప్ను సచిన్ అందజేశారు. అంతేకాదు వారితో స్వయంగా షేవింగ్ చేయించుకుని మురిసిపోయారు. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. (చదవండి: నాన్నకు వారసులు) ‘ఎవరి ముందు షేవింగ్ చేయించుకోవడానికి నేను ఇష్టపడను. కానీ ఈరోజు రికార్డు చెరిగిపోయింది. జ్యోతికుమారి, నేహలను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. వీరికి జిల్లెట్ స్కాలర్షిప్ అందజేశాన’ని సచిన్ ట్వీట్ చేశారు. గోరఖ్పూర్ నగరానికి సమీపంలోని భన్వారీతోలి గ్రామానికి చెందిన జ్యోతి, నేహ జీవన పోరాటం గురించి మీడియాలో ప్రముఖంగా రావడంతో జిల్లెట్ సంస్థ వీరిని ఆదుకునేందుకు వచ్చింది. వీరిద్దరిపై లఘు చిత్రాన్ని కూడా రూపొందించింది. A First for me! You may not know this, but I have never gotten a shave from someone else before. That record has been shattered today. Such an honour to meet the #BarbershopGirls and present them the @GilletteIndia Scholarship.#ShavingStereotypes#DreamsDontDiscriminate pic.twitter.com/DNmA8iRYsb — Sachin Tendulkar (@sachin_rt) May 3, 2019 -
అది అందరి బాధ్యత
శ్రనిత్ రాజ్, కల్యాణి పటేల్, అనిరుధ్, నేహా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గేమర్’. బి.జి.వెంచర్స్ పతాకంపై రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘గేమర్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. తడకల రాజేష్ నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ ఈ సినిమా తీశారు. ఇలాంటి చిన్న సినిమాల దర్శక, నిర్మాతలను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపైనా, సమాజంపైనా ఉంది. వీళ్లందరికీ థియేటర్లు దొరకడం కష్టంగా ఉంది. కొత్త టాలెంట్ రావాలంటే చిన్న దర్శక–నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. అప్పుడే గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు దక్కుతాయి’’ అన్నారు. తడకల రాజేష్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఆరు చిత్రాలు చేసిన నాకు ‘గేమర్’ ఏడో సినిమా. బి.జి.యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవకాశం ఇస్తున్నాను. ఈ చిత్రంలోని ప్రతి సీన్ డిఫరెంట్గా ఉంటూ ఆసక్తి రేపుతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 1న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. హీరో శ్రనిత్, హీరోయిన్ కల్యాణి, అనిరు«ద్, నరేందర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నకు వారసులు
దీపక్, రాజు అని పేర్లు మార్చుకుని, మగవాళ్లలా హెయిర్ కట్ చేసుకుని, ప్యాంటు షర్ట్ వేసుకుని జ్యోతి, నేహ చేస్తున్న జీవిత పోరాటం అసాధారణం మాత్రమే కాదు.. సాహసవంతమైన జీవన విన్యాసం కూడా! అమ్మానాన్న, ఇద్దరమ్మాయిలు. ‘పదిలంగా అల్లుకొన్న పొదరిల్లు మాది’.. అన్నట్లే వాళ్లది ముచ్చటైన కుటుంబం. ఆ ముచ్చట అలాగే కొనసాగితే ఆ ఇద్దరు అమ్మాయిలు అందరు అమ్మాయిల్లాగే ఉండేవాళ్లు.అబ్బాయిలుగా వారే వాళ్లే కాదు. ‘మారడం’ అంటే.. అబ్బాయిలుగా నటించాల్సి రావడం. ఆ నటన కూడా వెండి తెర మీదో, రంగస్థలం మీదో కాదు, నిత్య జీవితంలో! తెర మీద నటిస్తే చప్పట్లు కొడతారు. హర్షిస్తారు. నిజ జీవితంలో నటిస్తే అవేం ఉండవు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. జీవితంలో నటించక తప్పని ఆ ఇద్దరు అమ్మాయిల్ని సమాజం గౌరవించింది. ప్రభుత్వం కూడా వాళ్లను సత్కరించింది. ఆ గౌరవాన్ని, ఆ సత్కారాన్ని అందుకున్న అమ్మాయిలే జ్యోతికుమారి, నేహ. షాపు తెరిచారు.. వేషం మార్చారు జ్యోతి కుమారి వయసు 18, నేహకు పదహారేళ్లు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నగరానికి దగ్గరగా ఉన్న భన్వారీతోలి వాళ్లుండే గ్రామం. వాళ్ల నాన్న ధృవ నారాయణ. సెలూన్ నడిపేవాడు. నాలుగేళ్ల కిందటి వరకు ఆయన సెలూన్ నడుపుతూనే ఇంటిని పోషించాడు. పిల్లలిద్దరినీ చదివించాడు. 2014లో ఉన్నట్లుండి అనారోగ్యం పాలయ్యాడు. మంచం మీద నుంచి లేచి సెలూన్కు రావడానికి కూడా వీల్లేని పరిస్థితి.సెలూన్ మూతపడింది. అతడు మంచాన పడటంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. ఇల్లు జరగాలంటే సెలూన్ తెరవాలి. తెరిచినా సెలూన్లో పని ఎవరు చేయాలి? ఇంట్లో ఒక్క మగపిల్లాడు కూడా లేడు. ధృవ నారాయణ భార్యకు భర్తను చూసుకోవడంతోనే సరిపోతోంది. పైగా సెలూన్ అన్నది ఆడపిల్లలు చేసే పని కాదు. మరి.. ఇల్లు గడవాలంటే, ఆ ఇద్దరే ఏదో ఒక పని చేయాలి. వేరే మార్గం లేదు. బాగా ఆలోచించాక ఓ రోజు.. అక్కాచెల్లెళ్లిద్దరూ వెళ్లి సెలూన్ తలుపులు తెరిచి శుభ్రం చేశారు. నాన్న పని చేసేటప్పుడు చూసిన అనుభవం తప్ప స్వయంగా చేసిన అనుభవం లేదు. ‘సవ్యంగా చేస్తారా ఈ ఆడపిల్లలు’ అని సెలూన్కి వచ్చే మగవాళ్లకు భయం. ‘‘జాగ్రత్తగా చేస్తాం’’ అని బతిమిలాడి వచ్చిన వాళ్లకు హెయిర్కటింగ్లు, షేవింగ్లు చేశారు. ‘ఫర్వాలేదు, పిల్లలకు పని సులువుగానే పట్టుపడింది’ అనుకున్న పెద్దవాళ్లు భరోసాగా వీళ్ల సెలూన్కు రావడం మొదలు పెట్టారు. కొత్త వాళ్లు సెలూన్ వరకు వచ్చి అమ్మాయిలను చూసి వెనుదిరిగి వెళుతున్నారు. వెళ్లేవాళ్లు వెళ్లిపోతుంటే, ‘ఈ సెలూన్లో అయితే అమ్మాయిలు షేవ్ చేస్తార్రా’ అని వచ్చే పోకిరీ కుర్రాళ్లతో వాళ్లకు కష్టాలొచ్చిపడ్డాయి. హెయిర్ కటింగ్ చేసేటప్పుడు, షేవ్ చేసేటప్పుడు ఆకతాయిలు వెకిలి వేషాలు వేసేవాళ్లు. అప్పుడు తీసుకున్నారా అమ్మాయిలు ఓ నిర్ణయం. సెలూన్కి వచ్చిన వాళ్ల హెయిర్ కట్ చేయడం కాదు, ముందు తమ హెయిర్ కట్ చేసుకోవాలని. ఒకరికొకరు హెయిర్ కట్ చేసుకుని, జీన్స్, టీ షర్టులు వేసుకున్నారు. రాజు, దీపక్ అని పేర్లు పెట్టుకున్నారు. ఊరికి దూరంగా హైవేకు దగ్గరగా ఉన్న సెలూన్ కావడంతో కస్టమర్లలో సొంతూరి వాళ్లకంటే బయటి వాళ్లే ఎక్కువ. అమ్మాయిలే అబ్బాయిలుగా మారారనే వాస్తవం త్వరగానే మరుగున పడిపోయింది. ఊర్లో ఉన్న వంద కుటుంబాల వాళ్లకూ వీళ్లు అబ్బాయిలు కాదు అమ్మాయిలని తెలుసు. ఆ నిజాన్ని పనిగట్టుకుని సెలూన్కి వచ్చే వాళ్లకు చెప్పి ఆడపిల్లల పొట్టకొట్టే అనైతికానికి ఎవరూ పాల్పడలేదు. చదువును కుంటుపడనివ్వలేదు దీపక్, రాజు (జ్యోతి, నేహ)ల సంపాదన రోజుకు నాలుగు వందలు. ఇంట్లో నలుగురూ కడుపు నిండా తింటున్నారు, ధృవ నారాయణకు మందులకూ డబ్బులు ఉంటున్నాయి. ఇదే మాట చెబుతూ ‘‘ఆడపిల్లలను సెలూన్కి పంపించేటప్పుడు మనసు మెలిపెట్టినట్లయింది. ఇప్పుడు నా కూతుళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. సెలూన్ నడుపుతూ మమ్మల్ని పోషించడమే కాదు, వాళ్లు చదువుకుంటున్నారు కూడా’’ అని సంతోషిస్తున్నారు ధృవ నారాయణ. జ్యోతి డిగ్రీ పూర్తి చేసింది. నేహ ఉదయం కాలేజీకెళ్లి, మధ్యాహ్నం నుంచి సెలూన్లో పని చేస్తుంది. ‘‘మగవాళ్లకు హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నామని, మగవాళ్లలాగ హెయిర్ కట్ చేసుకుని, షర్టు–ప్యాంటు వేసుకుంటున్నామని మమ్మల్ని వెక్కిరించిన వాళ్లున్నారు. వాళ్లు వెక్కిరించారని పని మానుకునే పరిస్థితి కాదు మాది. అందుకే ఎవరు ఏమన్నా ఈ పనిని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మేము ఎవరికీ భయçపడటం లేదు. ధైర్యంగా పని చేసుకుపోతున్నాం. మాకు అబ్బాయిల్లా నటించాల్సిన అవసరం కూడా లేదిప్పుడు. మేము అమ్మాయిలం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అక్క కూడా జుట్టు పెంచుకుంటోందిప్పుడు’’ అంటోంది నేహ. వీళ్లకు ఒక అవార్డు కూడా వచ్చింది! ఆ వివరాలు చెబుతూ ‘‘ఓ రోజు గోరఖ్పూర్ నుంచి ఓ విలేఖరి ఇటువైపు వచ్చినప్పుడు మా సెలూన్కొచ్చారు. మమ్మల్ని చూసి ఆశ్చర్యంగా మా వివరాలడిగారు. మా కథనాన్ని పత్రికలో రాశారు. ఆ క«థనాన్ని చూసిన ప్రభుత్వ అధికారులు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అభినందించారు.అది మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది’’ అంటోంది జ్యోతి.ఆర్థిక అవసరాలు వెంటాడినప్పుడు మహిళలు ఇంటి అవసరాలను తీర్చడానికి ఎన్నో పనులు చేస్తుంటారు. గ్రామాల్లో పొలం పనులకు పోతుంటారు.ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉపాధి అనగానే కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ అనే అనుకుంటాయి. ఈ అమ్మాయిలు వాళ్ల ఇంటి వృత్తిలోనే ఉపాధి పొందుతున్నారు. తండ్రికి వారసులుగా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త మార్గాన్ని నిర్మించుకున్నారు. చేసింది చిన్న యుద్ధం కాదు జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను మించిన శత్రువులుండరు. ఆ శత్రువుతో పోరాడాలంటే దృఢమైన సంకల్పబలం ఉండాలి. టీనేజ్ దాటని ఈ అమ్మాయిలు చేసిన యుద్ధం చిన్నది కాదు. స్ఫూర్తిదాయకమైన ఈ సిస్టర్స్ గురించి సమాజానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. – అభిషేక్ పాండే, అవార్డును అందజేసిన ప్రభుత్వాధికారి – మంజీర అవార్డు అందుకుంటున్న అక్కచెల్లెళ్లు : నేహ (ఎడమ), జ్యోతి -
‘డిప్రెషన్లో ఉన్నా... దయచేసి నన్ను బతకన్విండి’
‘అవును.. నేను డిప్రెషన్లో ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతికూల భావాలు గల ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన, ఘోరమైన రోజులు కల్పించి మీరు విజయం సాధించారు. అందుకు మీకు శుభాభినందనలు’ అంటూ గాయని నేహా కక్కర్ తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సింగింగ్ ప్రోగ్రామ్ ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ ఆలపించిన నేహా ప్రస్తుతం డిప్రెషన్లోకి వెళ్లిపోయాననడం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే నేహా బాధ పడటానికి కారణం నటుడు హిమాంశ్ కోహ్లి అంటూ అతడిపై విమర్శలు రావడంతో... ‘ ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏ ఒక్కరి కారణంగానో నేను ఈ స్థితికి రాలేదు. నా వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడపడం ఈ ప్రపంచానికి ఇష్టం లేనట్టుంది. నాలో ఉన్న ప్రతిభను ప్రేమించే, ప్రోత్సహించే ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను. కానీ కొంతమంది మాత్రం నా గురించి వారికి ఏమీ తెలియకపోయినా బురద చల్లాలని చూస్తున్నారు. మిమ్మల్ని అడుక్కుంటున్నా. దయచేసి నన్ను సంతోషంగా బతకనివ్వండి. ఒకరి జీవితాన్ని నిర్ణయించే అధికారం తీసుకోకండి. ప్లీజ్ నన్ను బతకనివ్వండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేహా రాసుకొచ్చారు. కాగా నేహా కక్కర్, హిమాంశు ఇండియన్ ఐడల్ 10 వేదిక మీద తమ మధ్య ఉన్న అనుబంధం గురించి రివీల్ చేశారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనే రూమర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో హిమాంశును అన్ఫాలో చేసిన నేహా... ప్రస్తుతం ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీతో ఆ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చారు. -
దివ్యదృష్టి
చూపున్నవాళ్లమే లోకాన్ని ఈదుకుంటూ సాయంత్రానికి ఇంటì ఒడ్డుకి సరిగా కొట్టుకు రాలేకపోతున్నాం. ఇక నేహా తనెలా బతుకుతుంది? కూతుర్నెలా బతికిస్తుంది? దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తాడా? చెప్పగల విషయం కాదు. పెద్దాయన పైన ఉంటాడు. ఆయన లోపల ఏముంటుందో కింద ఉండేవాళ్లం మనకు ఎలా తెలుస్తుంది? అయినా, ఇవ్వడానికి తీసుకోవడం ఎందుకూ అనిపిస్తుంది! మనుషులం, మన భయం కొద్దీ దేవుణ్ని పాజిటివ్గా తీసుకుంటాం. ‘కులుకుతూ కూర్చున్నావ్, ఏం పట్టించుకోకుండా’ అని దేవుణ్ని పట్టుకుని రామదాసులా తిట్టేస్తే.. ఇంకోటేదైనా ఆయన మన నుంచి తీసేసుకుంటే మళ్లీ అదొక బాధ జీవితానికి. రెండేళ్ల క్రితం నేహా సూరి కి ఆ కాస్త కంటి చూపు కూడా పోయింది. ఒంటరి తల్లి. ఒక టీనేజ్ బిడ్డ. నైరాశ్యం. ఉండడం ఢిల్లీలో. చూపున్నవాళ్లమే లోకాన్ని ఈదుకుంటూ సాయంత్రానికి ఇంటì ఒడ్డుకి సరిగా కొట్టుకు రాలేకపోతున్నాం. ఇక నేహా తనెలా బతుకుతుంది? కూతుర్నెలా బతికిస్తుంది? ఏడాది పాటు ఎలాగో నెట్టుకొచ్చింది. తర్వాత ఆ చీకట్లోకి ఒక వెలుతురు రేఖ ప్రసరించింది. చూపు రాలేదు. చూపుతో పనిలేని ఉద్యోగం వచ్చింది. చేతివేళ్లతో తడిమి బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ను కనిపెట్టే ఉద్యోగం అది. నేహా ఇప్పుడు ‘మెడికల్ టాకై్టల్ ఎగ్జామినర్’ (ఎం.ఇ.టి)! స్పర్శజ్ఞాని. గత మూడు నెలలుగా తన స్పర్శజ్ఞానంతో వట్టి చేతులతో వైద్య పరీక్షలు చేస్తున్నారు నేహా. వక్షోజాలలో, ఆ చుట్టుపక్కల బాహుమూలాల్లో అర సెంటీమీటరు కణితి ఉన్నా ఆమె వేళ్లు కనిపెట్టేస్తాయి. అయితే ఇది తనకై తను వృద్ధి చేసుకున్న జ్ఞానం కాదు. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందే కనిపెట్టేందుకు వసంత్కుంజ్లోని ఫోర్టిస్ ఆసుపత్రి శిక్షణ ఇప్పించిన ఏడుగురు అంధ మహిళా ఎం.ఇ.టి.లలో నేహా ఒకరు. వీళ్లది మొదటి బ్యాచ్. వీళ్లతోనే ఎం.ఇ.టి. అనే ఒక కోర్సు మొదలైంది! గాంధీ జయంతి రోజు వీరు విధుల్లో చేరారు. ‘ఆప్టిమల్ సెన్సరీ టచ్’తో.. చెకప్ కోసం వచ్చిన మహిళల వక్షోజ భాగాలలోని చిన్నపాటి కణితులను సైతం వీరు గుర్తించగలుగుతారు. వేళ్లతో తగుమాత్రంగానే వక్షోజాలపై ఒత్తిyì కలిగిస్తూ లోపల ఏమైనా గడ్డల్లాంటివి ఉన్నాయేమో తడిమి చూస్తారు. అదే.. ఆప్టిమల్ సెన్సరీ టచ్. కనీసం 35 నుంచి 45 నిమిషాలపాటు వీరి వేళ్లు సునిశితంగా, సూక్ష్మంగా పరీక్ష జరుపుతాయి. మరి బ్రెస్ట్ సరిగ్గా ఎక్కడుందో వీళ్లకు లె లిసేదెలా? బ్రెయిలీ చుక్కలు ఉన్న టాకై్టల్ రేకులు ఛాతీని నాలుగు భాగాలుగా విభజిస్తూ వీరి వేళ్లకు దారి చూపుతాయి. ఒక్క బ్రెస్టు, ఆ చుట్టుపక్కలే కాకుండా.. వీపులో, మెడభాగంలో కూడా గడ్డలు, కణితుల కోసం వేళ్లు గాలిస్తాయి. శిక్షణలో భాగంగా నేహా, మిగతావాళ్లు గుర్గావ్లోని మేదంతా సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక్కొక్కరూ 30 మంది మహిళలకు పైగా వేళ్లతో వక్షోజ పరీక్షలు జరిపారు. కచ్చితమైన ఫలితాలను రాబట్టారు. ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వసాధారణం అయింది. ప్రతి లక్ష మందిలో 24 మందిలో కనిపిస్తోంది. ముందుగా కనిపెట్టగలిగితే ఈ ఇరవై నాలుగు మంది ప్రాథమిక దశలోనే గట్టెక్కేయొచ్చు. అలా గట్టెక్కించేవారే ఈ ఎం.ఇ.టి.లు. దేవుడు ఒకటి తీసుకుని ఇంకొకటి ఇస్తాడన్న మాట నిజమే అయితే.. పది మందికి ఇవ్వడం కోసం దేవుడు నేహా దగ్గర్నుంచి, ఆమె బ్యాచ్మేట్స్ నుంచీ తీసుకున్నాడనుకోవాలి. నేçహా అయితే అలాగే అనుకుంటోంది. -
టీఎస్సార్ వారి పెళ్లి సందడి
ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత సుబ్బరామి రెడ్డి మనవడు అనిరుద్ వివాహం నేహాతో ఆదివారం హైదరా బాద్లో ఘనంగా జరిగింది. సుబ్బరామిరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి, సరిత దంపతుల కుమారుడు అనిరుద్. హితా, నవీన్ రెడ్డి దంపతుల కుమార్తె నేహా. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవి, మోహన్బాబులతో సుబ్బరామిరెడ్డి సంగీత్లో టీఎస్సార్, రెహమాన్, అనిరుద్ వధూవరులను అభినందిస్తున్న కృష్ణ రామ్చరణ్, ఉపాసన -
కాపురాలు కూలిస్తే.. తస్మాత్ జాగ్రత్త!
‘‘కొందరు హీరోయిన్స్ కుటుంబాలను నాశనం చేస్తున్నారు. వాళ్లు సెక్స్ వర్కర్స్ కంటే దారుణంగా తయారయ్యారు’’ అంటూ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీలకు బంధువు అవుతారు జ్ఞానవేల్ రాజా. సూర్య హీరోగా జ్ఞానవేల్ నిర్మించిన ‘సింగం 3’ సినిమాకు నేహా కాస్ట్యూమ్ డిజైనర్గా చేశారు. కొందరి హీరోయిన్ల ధోర ణిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ – ‘‘అందర్నీ జన్రలైజ్ చేయటమో లేదా ఫ్రొఫెషనల్గా ఉండేవాళ్లను హర్ట్ చేయటానికో ఈ విషయం ప్రస్తావించట్లేదు. హీరోయిన్లను ఇండస్ట్రీలో అడ్జస్ట్ అవ్వమని అడుగుతారో లేదో తెలీదు కానీ కొందరు మాత్రం ‘బెడ్ రెడీ’ అన్నట్లు ఉంటారు. పెళ్లయిన వాళ్లను వెంబడిస్తుంటారు. ఒకవేళ అడ్జస్ట్ అవ్వమని ఇండస్ట్రీ అడిగితే ‘నో’ చెప్పి వెళ్లిపోలేరా? పెద్ద హీరోయిన్ అయిపోదామని, డబ్బులు సంపాదించే ప్రక్రియలో, లైమ్ లైట్లో ఉందామని చేసే ప్రయత్నమే ఇదంతా. మనమంతా ఫెమినిజమ్, స్త్రీ సాధికారత గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ అసలైన నిజం ఏంటంటే ఆడదానికి ఆడదే శత్రువు. కొన్నిసార్లు ఓ స్త్రీ ఇంకో స్త్రీ జీవితం నాశనానికి కారణమవుతుంది. అవును.. కథకు రెండు వైపులా మాట్లాడాలి. కొందరు మగవాళ్లే వాళ్ల ఆటలు సాగనిచ్చి, వాళ్ల కుటుంబంలోకి వచ్చేదాకా చేస్తున్నారు. మనందరం ఇలా ఇళ్లను కూల్చేవాళ్లందరినీ బయటపెట్టి ఓపెన్ వార్నింగ్ ఇవ్వాలి. అమ్మాయిని మోసం చేసిన మగాడిని ఎలా శిక్షిస్తామో వీళ్లనూ అలానే దండించాలి. అవును... మగాళ్లు ఏమీ పసి పిల్లలు కాదు. కొందరు మగాళ్లు వీళ్లను లిమిట్లో ఉంచినా కూడా వీళ్లు హద్దులు దాటుతుంటారు. ఎమోషనల్ డ్రామాతో కట్టేస్తుంటారు. మొగుడిని కంట్రోల్ చేయటం, శిక్షించటమే కాదు.. భార్యల డ్యూటీ. ఇలాంటివాళ్లను హద్దుల్లో పెట్టడం కూడా. పబ్లిక్లో కుక్కని కొట్టినట్టు కొట్టాలి. కొందరు హీరోయిన్లను ఇలాంటి చర్యలను ఆపమని బతిమాలా. కానీ మారేలా లేరు. వాళ్లను కచ్చితంగా రోడ్డుకి ఈడుస్తాను. (అలాంటివాళ్లను హీరోయిన్స్ కాదు.. వ్యభిచారులు అనాలేమో).ఈ రేంజ్లో మాటల తూటాలు వదిలిన నేహా ఆ తర్వాత ఆ ట్వీట్ మొత్తాన్ని తీసేశారు. ‘‘నాకు,నా భర్తకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నా చుట్టూ జరిగిన సంఘటనలు చూసి స్పందించాను. ఏదో డ్రామా క్రియేట్ చేయాలనో, ఇతరుల దృష్టి ఆకర్షించాలనో రాయలేదు. ఇక్కడ స్పందించటం వల్ల ఉపయోగం లేదని అర్థం అయింది. అందుకని తీసేశాను’’ అని నేహా పేర్కొన్నారు. -
హీరోయిన్లపై నిర్మాత భార్య దారుణ వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: సుచీ లీక్స్ పేరుతో సింగర్ సుచిత్ర గతేడాది హీరో, హీరోయిన్ల శృంగార చిత్రాలు, ఆంతరంగిక విషయాలు బయటపెట్టడం అప్పట్లో కలకలం రేపింది. కొంతమంది కోలీవుడ్ తారల గుండెల్లో ఆ లీకైన ఫొటోలు, వీడియోలు రైళ్లు పరుగెత్తించాయి. తాజాగా నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. కొందరు హీరోయిన్లు వేశ్యల కంటే దారుణమని, వాళ్లు సంసారాలు కూల్చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. గతేడాది సుచీ లీక్స్ తర్వాత నేహా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మౌనంగా ఎందుకుండాలి.. తుపానులా సమస్యలపై విజృంభించాలని నేను భావిస్తున్నాను. మహిళలకు మహిళలే ఎందుకు శత్రువులుగా మారుతున్నారు. తప్పుడు దారులు ఎంచుకుంటూ.. ఎన్నో కుటుంబాల్లో కుంపట్లు పెట్టడం వారికి తగునా అని ప్రశ్నిస్తూ ఇటీవల తాను చేసిన ట్వీట్లు డిలీట్ చేశారు నేహా. భార్యను నియంత్రించడం భర్త బాధ్యతని, అదే సమయంలో భర్త తప్పుచేస్తే భార్యలు కూడా అదే స్థాయిలో స్పందించాలన్నారు. బరితెగించిన ఆడవాళ్లను పబ్లిక్లో కొట్టినా తప్పులేదన్నారు. తాజాగా చేసిన ట్వీట్లో ఆమె ఏమన్నారంటే.. నాకు, నా భర్తతో ఎలాంటి సమస్య, విభేదాలు లేవు. చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలపై నేను స్పందిస్తున్నాను. వివాహం చేసుకున్న మగవాళ్ల జీవితాల్లోకి కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారు. దాంతో కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. ప్రచారం లాంటి వాటి కోసం నేను ఈ ట్వీట్లు చేయడం లేదు. ఓ మాధ్యమంగా ఎంచుకుని ట్వీట్లు చేసి విషయాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చాను. కొందరు లీక్స్.. అంటున్నారు. కానీ ఎవరి దృష్టినో ఆకర్షించేందుకు నేను ఈ పని చేయలేదు. కొందరు విషయం తెలియకుండా నా భర్తను అపార్థం చేసుకుని కామెంట్లు చేయడం బాధించింది. ఇది నా వ్యక్తిగత సమస్య కానే కాదంటూ పోస్ట్ చేశారు నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా. నేహా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సింగం 3, గ్యాంగ్, తదితర సినిమాలకు జ్ఞానవేల్ నిర్మాతగా వ్యవహరించారు. Let ppl do their job with ease🙏 it’s ain’t any cheap leaks!! pic.twitter.com/MryNoaKMZ6 — neha nehu:) (@NehaGnanavel) 20 March 2018 -
‘అమ్మ’గా మైదానంలోకి!
సాక్షి క్రీడావిభాగం మేరీకామ్...! భారత బాక్సింగ్లో ఆమె ఓ సంచలన చాంపియన్. ముగ్గురు పిల్లలకు తల్లయినా... ఇప్పుడు ఓ ఎంపీ అయినా... రింగ్లో మాత్రం చాంపియన్ అయ్యే అలవాటును మార్చుకోలేదు. బహుశా ఈమె స్ఫూర్తితోనే ఏమో... భారత మహిళా క్రికెటర్ నేహా తన్వర్ కూడా ఓ అబ్బాయికి అమ్మయినా... మళ్లీ ఆటకు సై అంటోంది. భారత ‘ఎ’ మహిళల జట్టు తరఫున బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో వన్డే, టి20 సిరీస్కు సిద్ధమైంది. ఢిల్లీకి చెందిన నేహా ఆరేళ్ల (2011) క్రితం భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున వెస్టిండీస్పై అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అదే ఏడాది ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్లాడింది. 2014లో ఆమె రిటైరయ్యే నాటికి చెప్పుకోదగ్గ గణాంకాలేవీ లేకపోయినా... గర్భం దాల్చడంతో ఆటకు దూరమైంది. అక్టోబర్లో ఓ పండటి మగ శిశువుకు జన్మనిచ్చిన 31 ఏళ్ల నేహా... పుత్రోత్సాహంతో పూర్తిగా ఇంటికే పరిమితమైంది. కానీ ఆట లేని లోటు ఆమెను తొలచివేయడంతో మళ్లీ బ్యాట్ పట్టాలని నిర్ణయించుకుంది. డాక్టర్ల సలహాతో కాన్పు జరిగిన ఆరు నెలల తర్వాత మెల్లగా ప్రాక్టీస్కు దిగింది. దీంతో అప్పుడు గానీ అసలు సమస్యలేవో తెలియలేదు. కడుపులో పిల్లాడి కోసం బలవర్ధమైన పోషకాహారం వల్ల ఆమె బరువు పెరిగింది. దీంతో ఆట అంత ఈజీ కాదని అర్థమైంది. అయినా పట్టుదల కొద్దీ ఫిట్నెస్పై దృష్టి పెట్టింది. 60 కేజీల నుంచి ప్రెగ్నెన్సీ సమయంలో 80 కేజీలకి చేరిన ఆమె క్రమం తప్పని ప్రాక్టీస్తో ఇప్పుడు అటు ఇటూగా తన పూర్వస్థాయికి వచ్చేసింది. ఇక ఇప్పుడు బరిలోకి దిగడమే తరువాయి. నిజమే...ఆడాలన్న తపనే ఉంటే ఏదైనా సాధ్యమే కదా!! నా భర్త సహకారం వల్లే మళ్లీ బరిలోకి దిగుతున్నాను. మాతృత్వం వరమే. మహిళలకు అది పునర్జన్మ. అమ్మతనం అన్నీ మార్చేస్తుంది. జీవితంలో ప్రాధాన్యతలు మారిపోతాయి. కానీ కొన్ని విషయాలే ఎప్పటికీ మారవు. సాధించాలను కుంటే సాధ్యం కానిదేదీ ఉండదు. – నేహ తన్వర్ -
వ్యవస్థ పిక్కటిల్లేలా గట్టిగా అరవాలనుంది!
రెండు చెవులూ బాగా పని చేస్తున్న మన పిల్లలు సివిల్స్లో టాప్ ర్యాంకులు కొడుతున్నారా? టెన్త్లో, ఇంటర్లో, డిగ్రీలో అదరగొట్టేస్తున్నారా? అప్పుడేం చేస్తాం? దండలేస్తాం.. కిరీటం పెడతాం.. ఊరేగిస్తాం.. సభ పెట్టించి చప్పట్లు కొడతాం! నేహాకు చిన్నప్పుడే చిన్న వినికిడి లోపం వచ్చింది. కానీ క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చింది! సివిల్స్లోనూ మంచి ర్యాంక్ సాధించింది. అయితే తనని ‘పోస్టింగ్’కి ఫెయిల్ చేసేశారు!! తనెంత బతిమాలినా, బామాలినా, ప్రాధేయపడినా... చివరికి కాళ్లావేళ్లా పడినా.. ప్చ్... వాళ్లకు వినిపించలేదు. కనీసం.. వినిపించుకోలేదు! వినికిడి లోపం నేహాకా? వినిపించుకోని వ్యవస్థకా? అదే మన బిడ్డ అయితే మనం ఊరుకుంటామా? పోరాడమా? నేహ కోసం కూడా మనందరం పోరాడదాం. ఆమెకు అండగా ఉందాం. ఆ అమ్మాయి పేరు నేహ. చిన్నప్పుడు ఒక జ్వరం కారణంగా వినికిడి శక్తి కోల్పోయింది. అయితే కాక్లియర్ శస్త్రచికిత్సతో ఆ లోపాన్ని అధిగమించింది. కష్టపడి సివిల్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంది. ఆ ర్యాంక్కు ఆమెకు ఉద్యోగం వచ్చి తీరాలి. కానీ ఆమె ఉద్యోగానికి అనర్హురాలంటూ వినికిడి పరీక్షల ద్వారా అధికారులు నిర్ణయించారు. అయితే తన వినికిడి సామర్థ్యం ఇప్పుడు పూర్తి నార్మల్గా ఉందంటూ నేహ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైద్య పరీక్షను మరోమారు నిర్వహించాలంటూ న్యాయస్థానం ఆదేశించడంతో ఇంకోసారి వినికిడి పరీక్ష నిర్వహించారు. చిత్రం ఏమిటంటే ఈసారి నేహ మునుపటి కంటే మెరుగ్గానే వింటోందని స్వయంగా ఆ వైద్యాధికారులే చెప్పారు. కానీ ఆ సామర్థ్యమూ సరిపోదంటూ మళ్లీ మెలిక పెట్టారు. అయితే వివిధ హాస్పిటల్స్లో పలుమార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ ఆమె వినికిడి సామర్థ్యం నార్మల్గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. అదే విషయాన్ని సంబంధిత అధికారులకు తెలుపుతూ... మునుపు వారే రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన తేడాను ఎత్తి చూపారు నేహ. వినికిడి పరీక్ష నిర్వహణలోనే తేడా ఉంది తప్ప తన వినికిడి సామర్థ్యంలో తేడా లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి నిర్లిప్త వ్యవస్థ పట్ల నేహ మనసులో నిస్పృహ ఏర్పడితే అందుకు బాధ్యులెవరు? నేహ తల్లి శిరీష మాటల్లో నేహ ఆవేదన ఇది. ‘‘అది 2000 సంవత్సరం. అప్పుడు నేహకు ఏడేళ్లు. ఆ పసి వయసులో మెనింజైటిస్ అనే జ్వరం వచ్చింది. జ్వరం తగ్గిపోయినా అది పోతూ పోతూ నేహ వినికిడి శక్తిని పట్టుకెళ్లిపోయింది. అప్పట్లో నేహ ఏమీ వినలేదు. కళ్ల ముందు క్లాసులో పాఠం జరుగుతున్నా ఏమీ అర్థం కాదు. ఏ వినికిడి ఉపకరణమూ ఆమెకు పనిచేయలేదు. దాంతో మా నెత్తి మీద కొండ విరిగిపడినట్టుగా అనిపించింది. మనసు దిటవు చేసుకొని... నా భర్త వైజాగ్ స్టీల్ప్లాంట్లో అసిస్టెంట్ ఇంజనీర్. నేను సాధారణ గృహిణిని. నా భర్త ఉద్యోగబాధ్యతల రీత్యా వైజాగ్లోనే ఉండాల్సి రావడం వల్ల నేహ కోసం నేను తొలిసారి గడప బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది. బెంగుళూరు వెళితే అక్కడి డాక్టర్లు నేహను పరీక్షించి వినికిడి శక్తి పూర్తిగా పోయిందన్నారు. అయితే కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చితే వినడం సాధ్యమేనని చెప్పారు. కాక్లియర్ ఇంప్లాంట్స్ అప్పుడప్పుడే విదేశాల నుంచి దేశంలోకి కొత్తగా వస్తున్న రోజులవి. వాటిని అమర్చే నైపుణ్యం హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్లో సీనియర్ ఈఎన్టీ వైద్యనిపుణులు డాక్టర్ ఈసీ వినయకుమార్కు ఉందని తెలిసి ఆయన దగ్గరకు వచ్చాం. 2003 డిసెంబరులో నేహకు శస్త్రచికిత్స చేసి కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చారు. నేహ మళ్లీ వినగలిగేలా చేశారు. నిరుత్సాహం నింపుతూ... వివక్షకు గురిచేస్తూ... చికిత్సకు ముందు నేహకు 100 శాతం వినికిడి లేదు. చికిత్స తర్వాత 100 శాతం వినికిడి ఉంది. అయితే గొడవ గొడవగా ఉండే క్లాస్ రూమ్లలో అంత స్పష్టంగా వినగలిగేది కాదు. క్లాసును పూర్తిగా నిశ్శబ్దంగా ఉంచడం నేహకు సాధ్యం కాదు కదా. అందుకే తనకు తానే పాఠాలు చెప్పుకుంది. దానికి తోడు తోటి పిల్లల నుంచి ఎదురయ్యే వివక్ష. అవకరాన్ని భూతద్దంలో చూపిస్తూ నోటితో కాకుండా నొసటితో వెక్కిరింపులు. టెన్త్ పాసైన తర్వాత ఒక రోజు నేహ కెమిస్ట్రీ టీచర్ నన్ను పిలిపించారు. ‘ఇప్పటివరకు నేహ బాగానే చదివింది. కానీ ఇప్పుడామె పై క్లాసులకు వచ్చింది. ఇక నుంచి కెమిస్ట్రీ చాలా టఫ్గా ఉంటుంది. ఆమెను ఏ డెఫ్ స్కూల్కో పంపితే మంచిది కదా’ అంది. ఆ మాటల్లో నీ కూతురు చెవిటిది సుమా అనే ఎగతాళి ఉంది. తొలిసారి నేహ తన వినికిడి శక్తి కోల్పోయిందని తెలిసిన రోజున కూడా నేను అంత భోరున విలపించలేదు. టీచర్ ఆ మాట చెప్పి రోజు వెక్కెక్కి ఏడ్చి ఇంటికి వచ్చాను. ‘టీచర్ ఎందుకు పిలిచారు?’ అని అడిగింది నేహ. ఆమెకు ఇవన్నీ చెప్పకుండా ‘ఈ ఏడాది నుంచి కెమిస్ట్రీ బాగా కఠినంగా ఉంటుందట. బాగా చదవమని చెప్పడానికి పిలిపించార’ని అన్నాను. ఆ ఏడాది నేహ ఇంటర్లో కెమిస్ట్రీ, బయాలజీలో టాపర్గా నిలిచింది. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ చేతుల మీదుగా ప్రత్యేకంగా ఒక అవార్డును అందుకుంది. ప్లస్ టూ పూర్తి కావడాన్నే సివిల్స్ గడపగా భావిస్తూ... ప్లస్ టూ పూర్తయ్యాక ఎలాగైనా సివిల్స్ సాధించాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకు అనుగుణంగా ఎంబీబీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సు కాకుండా బీఎస్సీని ఎంచుకుంది. డిగ్రీలో ఉన్నప్పుడే తనను తాను పరీక్షించుకునేందుకు ఇంటర్మీడియెట్ ప్రాతిపదికగా నిర్వహించే బ్యాంక్ క్లరికల్ ఎగ్జామ్స్ రాసింది. అలా 2012లో డిగ్రీ సెకండియర్లో ఉండగానే జాబ్ సంపాదించింది. జాబ్లో చేరి,‡ గ్యాడ్యుయేషన్ కోర్సును కొనసాగించింది. అయితే డ్యూటీలోని తీరిక సమయాల్లో తాను చదువుకుంటూ ఉండటాన్ని కొందరు మాటిమాటికీ అభ్యంతర పెట్టారు. దాంతో ఏడాది తర్వాత ఉద్యోగం మానేసింది. 2013లో డిగ్రీ పూర్తయ్యింది. వెంటనే సివిల్ సర్వీసెస్కు తొలి అటెంప్ట్ చేసింది. ఫ్రెషర్ అయినప్పటికీ ఇంటర్వ్యూ వరకు వచ్చింది. ఈ స్ఫూర్తితో 2014లో మళ్లీ సీరియస్గా సివిల్ సర్వీసెస్కు ప్రయత్నం చేసింది. ఈసారి జనరల్ ర్యాంకు 1221. ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ విభాగంలో మూడో ర్యాంకు. నిజానికి ఆ ర్యాంకుకు తనకు ఐఎఫ్ఎస్ వస్తుంది. అయితే విదేశాలకు వెళ్లే ఉద్దేశం లేని నేహ... ప్రాధాన్యక్రమంలో దాని తర్వాతిదైన ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్)ను కోరుకుంది. ఈ దశ నుంచి అన్నీ సాకులూ... చిక్కులూ యూపీఎస్సీలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ లాంఛనంగా మెడికల్ టెస్ట్కు అటెండ్ కావాలి. ఈ దశ నుంచి నేహకు అభ్యంతరాలు, అవరోధాలు, అడ్డంకులూ ఒకదాని తర్వాత మరొకటి ఎదురొచ్చి నిలిచాయి. వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని గురు తేజ్బహదూర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రిలో వినికిడిని నిర్ణయించే పరీక్షలు చేసే వసతులూ లేవు. ఉపకరణాలూ లేవు. దాంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు వెళ్లి పరీక్షలు చేయించమని చెప్పారు. కానీ అక్కడ ఆరుబయట ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించారు. అన్ని రకాల చప్పుళ్లతో ఉన్న అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆమె 50 డెసిబుల్స్ పైబడిన శబ్దాలనే వినగలుగుతోందన్నారు. అప్పుడు నేహ వినికిడి సామర్థ్యాన్ని తెలుసుకునేందకు మళ్లీ మేం హైదరాబాద్ అపోలోలో, వైజాగ్లోని రాణి చంద్రమతి హాస్పిటల్లో వినికిడి పరీక్షలు చేయించాం. వాస్తవం ఏమిటో తెలుసా...? నేహ 25 – 30 డెసిబుల్స్ శబ్దాలను సైతం వినగలుగుతోంది. ఈ విషయాన్ని అధికారులకు తెలిపితే వారు ససేమిరా అన్నారు. దాంతో మేం హైకోర్టును ఆశ్రయించాం. అక్కడ ఇలాంటి సర్వీస్ను పరిష్కరించే ‘సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్’ నేహ కేసు విన్నది. నేహకు మరోమారు వినికిడి పరీక్ష నిర్వహించి, నెలలోపు నియామకం ప్రక్రియను పూర్తి చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మళ్లీ కోర్టు డైరెక్షన్స్ మేరకు నేహను ఎయిమ్స్కు పంపారు. ఈసారి కూడా అలాగే బయట చిన్నపిల్లల ఏడుపులూ, రోగుల రణగొణధ్వనులూ, ఇతరత్రా చప్పుళ్లు ఉన్నచోట పరీక్ష నిర్వహించారు. ఈసారి 40 డెసిబుల్స్ పైబడిన శబ్దాలనే వినగలుగుతోందని నివేదిక ఇచ్చారు. నిబంధనల ప్రకారం 30 డెసిబుల్స్ వినగలిగితేనే ఉద్యోగం ఇస్తామన్నారు. ‘మీరు నిర్వహించిన పరీక్షలోనే మొదటిసారికీ, రెండోసారికీ 10 తగ్గింది కదా. మరోమారు ఆమెకు అనువైన వాతావరణంలో పరీక్ష చేయమ’ని కోరాను. కాళ్లావేళ్లాపడుతూ బతిమాలాను. ప్రభుత్వ గెజిట్ ప్రకారం 30 డెసిబుల్స్ వింటేనే ఉద్యోగ నియామకం జరపగలమంటూ, నిబంధనలను సాకుగా చూపుతూ మళ్లీ ఆమెకు ఉద్యోగాన్ని నిరాకరించారు. ఈ ప్రహసనాలను వివరిస్తూ మళ్లీ మేం ‘క్యాట్’ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)ను ఆశ్రయించక తప్పలేదు. నేనొక సాధారణ గృహిణినే అయినా, మాకు తగిన వనరులు లేకపోయినా ఎంతో మంది పెద్దలు, శ్రేయోభిలాషుల సహాయంతో న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నాం. కొందరి మౌన మద్దతు ఉన్నా... ఏదో తెలియని వివక్ష... ఎందుకోగానీ అక్కడి మెడికల్ బోర్డులో కొందరు నేహ పట్ల వివక్షతో ఉన్నారని అనిపిస్తోంది. ఎందుకంటే తొలుత నేహపై సానుభూతితో మాకు సలహాలూ, సూచనలు ఇచ్చిన ఎందరో ఆ తర్వాత చిత్రంగా నిశ్శబ్దం పాటిస్తున్నారు. మానవీయ కోణంలో ముందుగా నేహకు సహాయం చేద్దామని వచ్చిన చాలామంది ఆ తర్వాత నోరు విప్పడం లేదు. ఒక అజ్ఞాత శ్రేయోభిలాషి ఫోన్ చేసి చెప్పిన మాట మాకెంతో మానసిక నిబ్బరాన్ని ఇచ్చింది. నైతిక స్థైర్యాన్ని పెంచింది. అదేమిటంటే... విజేతగా నిలిచినా మా నేహలాగే వినికిడి శక్తి లేదనే సాకుతో మణిరామ్ శర్మ అనే అభ్యర్థిని మొదట కాదన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ... ఇప్పుడు మణిరామ్ శర్మ రాజస్థాన్లోని మేవాడ్లో కలెక్టర్గా సేవలందిస్తున్నారు. ఇలాంటి అజ్ఞాత ఫోన్కాల్స్తో మాకు నైతికమద్దతు తెలిపేవారి నుంచి స్ఫూర్తి పొందుతూ మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. తాజా పరిస్థితి ఇదీ... నేహకు తొలుత అమర్చిన ప్రోసెసర్ కంటే ఇప్పుడు మరింత మెరుగైన క్యాన్సో ప్రోసెసర్ అందుబాటులోకి వచ్చాయి. వాటి సహాయంతో గత నాలుగైదు రోజుల క్రితం నిర్వహించిన ఆడియోమెట్రీ పరీక్షలో నేహ ఇప్పుడు 20 డెసిబుల్స్ను సైతం వినగలుగుతోంది. సరైన వాతావరణంలో పరీక్ష నిర్వహిస్తే... నేహ కూడా నార్మల్ వ్యక్తి లాగే వినగలదు. అందుకే ఈ న్యాయపోరాటంలో నేహ గెలవాలనీ, ఆమెకు న్యాయం జరగాలని ఆశీర్వదించండి. మీ నైతికమద్దతుతో పోరాటాన్ని కొనసాగిస్తాం. మా అమ్మాయికి మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అంటూ వేడుకుంటున్నారు నేహ తల్లి శిరీష. వైఎస్ అప్పటి ప్రోత్సాహం... ఇప్పటికీ నేహాకు నిత్య స్ఫూర్తి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి నేహకు చేసిన సహాయం అంతా ఇంతా కాదు. నేహకు ఒక దశలో ప్రోసెసర్ మార్చాల్సి వచ్చింది. కొత్త ప్రోసెసర్కు లక్ష రూపాయలు కావాలి. మాకది చాలా పెద్ద మొత్తం. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాం. చుట్టూ జనం... సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమూహంలో మా వంతు కోసం ఎదురుచూస్తూ మేమున్నాం. ఆయన మా దగ్గరికి వచ్చారు. మా అర్జీ విన్నారు. తాను తప్పక సహాయం చేస్తానన్నారు. నేహ భుజం మీద చెయ్యేసి ‘నువ్వు బాగా చదువుకో. భవిష్యత్తులోనూ నీకు కావాల్సిన సహాయం అందిస్తాన’ని అన్నారు. అన్నట్లుగానే ఆ సాయంత్రానికే రూ. లక్ష మంజూరు చేశారు. అప్పుడాయన నాకు తండ్రిలా కనిపించారు. ఆయన చనిపోయినప్పుడు రక్తసంబంధీకులు దూరమైనట్లు బాధపడ్డాను. అలాగే డాక్టర్ ఈసీ వినయకుమార్. ఏడేళ్ల పాప దగ్గర్నుంచి ఇప్పుడు నేహ ఇంతగా ఎదిగాక కూడా తన సొంత బిడ్డలా చేయూతనిస్తున్నారు. – శిరీష, నేహ తల్లి వినికిడి కోల్పోవడం అవకరం కాదు... చిన్నప్పుడే పూర్తిగా వినికిడి కోల్పోయిన పిల్లలకు కాక్లియర్ శస్త్రచికిత్స చేస్తే వారు అందరిలాగే వినగలుగుతారు, మాటలూ వస్తాయి. అయితే ఎంత చిన్న వయసులో ఈ శస్త్రచికిత్స చేస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే వినికిడి కోల్పోవడం అన్నది వారి వికాసానికి ఏ మాత్రం ప్రతిబంధకం కాబోదు. వినికిడి లేకపోవడం వారికి ఎంతమాత్రమూ అవకరం కాబోదు. కాక్లియర్ అమర్చిన పిల్లలు నేహలాగా బాగా చదువుకొని ఏదైనా సాధించగలరు. వినికిడి లేని పిల్లలను అలాగే వదిలేసి వారిని వినకుండా, మాట్లాడకుండా... మూగచెవిటి వారిగా చేయడం సరికాదు. కాక్లియర్ ఇంప్లాంట్స్ అమర్చితే ఆ పిల్లలూ అందరిలాగే రాణిస్తారని చెప్పడానికి నేహ వృత్తాంతమే మంచి ఉదాహరణ. నేహలాగే ఎందరో పిల్లలు ఈ సమాజంలో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు, సమాజం కూడా వారికి చేయూత ఇవ్వాలి. తగిన తోడ్పాటును అందించాలి. – డాక్టర్ ఇ.సి. వినయ కుమార్, హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ – యాసీన్, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
త్రిభాషా చిత్రంలో ముంబయి నటి
చెన్నై: ‘విన్నైతాండి వంద ఏంజల్’ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలింస్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి కథనం, నిర్మాణ బాధ్యతలను చేపట్టిన ఈ చిత్రానికి బాహుబలి కె.పళని దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు రాజమౌళి వద్ద బాహుబలి చిత్రానికి సహాయదర్శకుడిగా పని చేశారు. నాగఅన్వేష్ కథానాయకుడిగానూ ముంబయి బ్యూటీ నేహా పటేల్ నాయకిగానూ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సుమన్, శాయాజీషిండే, ప్రదీప్రావత్ తదితర భారీ తారాగణం నటిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ..‘ జీవితం చాలా చిన్నది. త్వరగా సంపాదించి బాగా ఎంజాయ్ చేయాలని భావించే కథానాయకుడు, సరిగ్గా అలాంటి భావాలు కలిగిన అతని స్నేహితుడి మధ్య కలలో కూడా ఊహించని విధంగా ఒక యువతి వచ్చి చేరుతుంది. తను కూడా ఈ భూమిపై ఉన్న అన్ని సంతోషాలను అనుభవించాలని కోరుకుంటుంది. అలాంటి ఈ ముగ్గురూ అనూహ్యంగా ఒక ఆపదలో చిక్కుకుంటారు. అది ఆ అమ్మాయి కారణంగానే కలుగుతుందన్నది చిత్ర కథలో మలుపు..’ అని తెలిపారు. అయితే అది ఎలాంటి ఆపద? అందులోంచి వారు ఎలా బయట పడగలిగారన్న పలు ఆసక్తి కరమైన ఆశాలతో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. బాహుబలి తరువాత తమిళం, తెలుగు, హిందీలో తెరకెక్కుతున్న చిత్రం ఇదేనని అన్నారు. చారిత్రక నేపథ్యంలో హైటెక్నాలజీతో సోషల్ ఫాంటసీ అంశాలతో రూపొందిన బాహుబలి చిత్రం తరహాలో తమ చిత్రంలోనూ గ్రాఫిక్స్ సన్నివేశాలుంటాయని తెలిపారు. దీనికి బీం సంగీతాన్ని అందిస్తున్నట్లు నిర్మాత కృష్ణారెడ్డి తెలిపారు. -
అంతర్జాతీయ శాంతి బహుమతికి నేహా నామినేట్
ది హేగ్: అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి -2014కి భారతీయ సంతతికి చెందిన నేహా అనే టీనేజీ బాలిక యూఎస్ నుంచి నామినేట్ అయింది. ఆమెతో పాటు రష్యా నుంచి అలెక్స్, ఘనా నుంచి అండ్రూలు కూడా నామినేట్ అయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. చిన్నారులకు హక్కులను కాపాడటంలో చురుకైన పాత్ర పోషించే టీజేజీ బాలికలకు ఈ అవార్డును అందజేస్తారని తెలిపింది. 18 ఏళ్ల నేహా యూఎస్లో సొంతంగా ఓ ఫౌండేషన్ స్థాపించి... దీని ద్వారా చిన్నారుల హక్కులపై చైతన్యం కలిగిస్తుందని పేర్కొంది. అలాగే 17 ఏళ్ల అలెక్స్... హోమో సెక్య్సువల్, ట్రాన్స్జెండర్పై రష్యాలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. 13 ఏళ్ల అండ్రూ దేశంలో కరువుపై పోరాడుతూ... ఫుడ్ ఎయిడ్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారని వెల్లడించింది. 2005 నుంచి అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఈ అవార్డు విజేత పేరును నవంబర్ 18న ది హేగ్లో ప్రకటిస్తారని మీడియా తెలిపింది.