RCom
-
ఆర్కామ్ టవర్, ఫైబర్ కోసం రూ.3,720 కోట్లు
న్యూఢిల్లీ: లిక్విడేషన్లో ఉన్న ఆర్కామ్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం (రిలయన్స్ ఇన్ఫ్రాటెల్) రూ.3,720 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేస్తామని రిలయన్స్ జియో ప్రతిపాదన చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) టవర్, ఫైబర్ ఆస్తుల కోసం రూ.3,720 కోట్ల బిడ్ను రిలయన్స్ 2019 నవంబర్లోనే సమర్పించం గమనార్హం. దీరికి రుణదాతల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జియో అనుబంధ కంపెనీ రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు తెలిపింది. ఆలస్యం చేయడం వల్ల ఆస్తుల విలువ క్షీణిస్తుందంటూ.. దివాలా పరిష్కార ప్రణాళిక మేరకు వెంటనే చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిపింది. -
రంగంలోకి బ్యాంకులు : చిక్కుల్లో అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి మరోఎదురు దెబ్బ తగిలింది. 717 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,354 కోట్లు) విలువైన బాకీలపై మూడు చైనా బ్యాంకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా బ్యాంకులు ఇప్పుడు అనిల్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను వివరాలను అంచనా వేసేందుకు సిద్ధపడుతున్నాయి. లండన్ కోర్టు ఉత్తర్వుల మేరకు బకాయిల వసూలుకు రంగంలోకి దిగాయి. తమకు రావాల్సిన రుణ బకాయిలకోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన అన్నిమార్గాలను ఉపయోగించుకుంటామని ప్రకటించాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో చైనా బ్యాంకుల చర్యలకు అడ్డంకులు తప్పవని భావిస్తున్నారు. (కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ) అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అంబానీ పర్సనల్ గ్యారంటీతో, చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 925 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. కానీ దివాలాతీసిన ఆర్కామ్ ఈ రుణాన్ని పూర్తిగా చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఈ బకాయిల వసూలు కోసం కోర్టును ఆశ్రయించగా, చైనా బ్యాంకులకు రూ .5,226 కోట్లు చెల్లించాలని మే 22 న కోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది. జూన్ 29 నాటికి, అంబానీ చెల్లించాల్సిన అప్పు 717.67 మిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే తన దగ్గర చిల్లిగవ్వలేదనీ, బాకీ చెల్లించే స్తోమత లేదని అంబానీ వాదిస్తున్నారు. కోర్టు ఫీజుల కోసం తనభార్య నగలు అమ్మి, అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నానంటూ తాజాగా వాదించిన సంగతి తెలిసిందే. అయితే అంబానీ వాదనతో విబేధిస్తున్న బ్యాంకులు అప్పులు కట్టాల్సిందేనని స్పష్టం చేశాయి. -
నాది సాదాసీదా జీవితం: అనిల్ అంబానీ
లండన్: ప్రపంచ దేశాలను చైనా వణికిస్తుంటే..రిలయన్స్ అనిల్ అంబానీ చైనాకే ఝలక్ ఇచ్చారు. చైనాకు చెందిన మూడు బ్యాంకు రుణాల చెల్లింపునకు తనది పూచీ కాదన్నారు. తనది చాలా విలాసవంత జీవితమంటూ వస్తున్నవన్నీ వదంతులేనన్నారు. ‘నాది చాలా క్రమశిక్షణాయుత జీవితం. అవసరాలు చాలా పరిమితం. ఒకే ఒక్క కారు వాడుతున్నాను. కోర్టు ఫీజులు చెల్లించేందుకు బంగారాన్ని అమ్ముకున్నాను’ అని వివరించారు. చైనా బ్యాంకులతో తలెత్తిన రుణ ఒప్పందం వివాదంపై లండన్ కోర్టుకు ఆయన ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. తనకు ఖరీదైన చాలా కార్లున్నాయనీ, విలాసవంతమైన జీవితమంటూ లాయర్ అడిగిన ప్రశ్నకు అనిల్.. అవన్నీ మీడియా సృష్టించిన కల్పిత వార్తలని కొట్టిపారేశారు. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాల నుంచి 2012లో 925 మిలియన్ డాలర్ల మేర ఆర్కామ్ రుణం తీసుకుంది. పూచీకత్తుగా ఉన్న అనిల్ అంబానీయే ఆ మొత్తం చెల్లించాలంటూ బ్యాంకులు కోరుతున్నాయి. ఈ మేరకు బ్రిటన్ కోర్టులో దావా వేశాయి. ఆ రుణంలో కొంత మొత్తం చెల్లించాలంటూ కోర్టు ఈ ఏడాది మేలో ఆదేశించింది. అనిల్ చెల్లించకపోవడంతో ఆయన్ను వీడియో లింక్ ద్వారా క్రాస్ ఎగ్జామిన్ చేసి, ఆస్తుల వివరాలు రాబట్టేందుకు బ్యాంకు తరఫు లాయర్లకు కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు శనివారం జరిగిన విచారణలో అనిల్ పై విషయాలను వెల్లడించారు. -
అనిల్ అంబానీకి ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్టీఐఎల్)కు ఇచ్చిన రూ.1,200 కోట్ల రుణాల రికవరీకి సంబంధించి ఆయనపై వ్యక్తిగత దివాలా చర్యలు చేపట్టడానికి అనుమతించాలని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న స్టేను తొలగించాలనీ ఎస్బీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయమూర్తులు ఎల్ఎన్ రావు, హేమంత్ గుప్తా, ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ హై కోర్టుకు సూచించడం ఈ కేసులో మరో కీలకాంశం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏదైనా మార్పు కోరుకుంటే, సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చని కూడా ఎస్బీఐకి ధర్మాసనం సూచించింది. వివరాల్లోకి వెళ్తే..: ఆర్కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణం మంజూరు చేసింది. ఆర్కామ్కు రూ. 565 కోట్లు, ఆర్టీఐఎల్కు రూ. 635 కోట్లు రుణం అందింది. ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీనితో ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్ని ఆశ్రయించింది. గ్యారంటర్పైనా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. దీంతో ఏకీభవిస్తూ, ఎన్సీఎల్టీ అనిల్ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమి స్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27న స్టే ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
అంబానీపై దివాలా చర్యలు : సుప్రీంకు ఎస్బీఐ
సాక్షి, ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అధినేత అనిల్ అంబానీ దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పును అమల్లోకి తెస్తే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఎస్బిఐ తన పిటిషన్లో పేర్కొంది. (అనిల్ అంబానీపై దివాలా చర్యల నిలుపుదల) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి హైకోర్టు తమకు అవకాశం ఇవ్వలేదని ఎస్బీఐ వాదించింది. సుమారు 1707 కోట్లు ప్రజాధనం బ్యాంకుకు రుణపడి ఉన్న అంబానీకి వ్యతిరేకంగా దివాలా తీర్పును నిలిపివేయడాన్ని సమర్థించలేమని తెలిపింది. ఆగస్టు 27 న జస్టిస్ విపిన్ సంఘీ, రజ్నీష్లతో కూడిన త్రిసభ్య ధర్మానసం మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేసింది. -
ఎస్బీఐ లోన్ : అనిల్ అంబానీకి ఊరట
సాక్షి,న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీ ఊరట లభించింది.1200 కోట్ల రూపాయల రుణం విషయంలో ఎస్బీఐ చేపట్టనున్న దివాలా చర్యలను ఢిల్లీ హైకోర్టు అడ్డుకుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సోదరుడు, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై దాఖలైన దివాలా పిటిషన్ను కోర్టు గురువారం నిలిపివేసింది. అలాగే ఆస్తులను విక్రయించకుండా అనిల్ అంబానీని నిలువరిస్తూ ఆదేశాలు జారీచేసింది. (చదవండి : అనిల్ అంబానీకి ఎస్బీఐ షాక్) అడాగ్ గ్రూప్నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ తీసుకున్న కార్పొరేట్ రుణాలపై అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇవి మొండి బకాయిలుగా మారటంతో దివాలా చట్టం ప్రకారం అంబానీ నుంచి రూ.1200 కోట్లను రాబట్టేందుకు ఎస్బీఐ రంగంలోకి దిగింది. కార్పొరేట్ రుణాల చెల్లింపుల ప్రక్రియకు ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ను నియమించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఎస్బీఐ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మొబైల్ సేవల్ సంస్థ ఆర్కామ్ 2002లో అనిల్ అంబానీ ప్రారంభించారు. కానీ పోటీకి నిలబడలేక, భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ఆ తరువాత 2016లో ముకేశ్ అంబానీ సృష్టించిన జియో సునామీతో మరింత కుదేలై దివాలా తీసింది. అటు 2017 జనవరిలో రుణ చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో ఆర్ఐటిఎల్ రుణాన్ని 26 ఆగస్టు 2016 నుండి నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది బ్యాంకు. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు మూతపడ్డాయి. మరోవైపుఈ విషయం కార్పొరేట్ రుణానికి సంబంధించినదని, వ్యక్తిగత రుణానికి చెందినది కాదని అడాగ్ గ్రూపు గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే రుణ పరిష్కార ప్రణాళికలకు రుణదాతలు అంగీకరించారని, ట్రైబ్యునల్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు తెలిపింది. -
టెలికం బాకీలు... రిజర్వ్లో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఆర్కామ్ తదితర సంస్థల నుంచి స్పెక్ట్రం తీసుకున్నందుకు గాను రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కూడా అదనంగా బాకీలు కట్టాల్సి ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టతనివ్వనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములా ప్రకారం టెలికం సంస్థలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీలకు సంబంధించిన కేసుపై సోమవారం కూడా విచారణ కొనసాగింది. ఒకవేళ స్పెక్ట్రం విక్రేత గానీ బాకీలు కట్టకుండా అమ్మేసిన పక్షంలో ఆ బకాయీలన్నీ కొనుగోలు సంస్థకు బదిలీ అవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒకవేళ టెల్కోలు గానీ బాకీలు కట్టేందుకు సిద్ధంగా లేకపోతే స్పెక్ట్రం కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అయితే, స్పెక్ట్రం రద్దు చేసిన పక్షంలో ప్రభుత్వానికి గానీ బ్యాంకులకు గానీ దక్కేది ఏమీ ఉండదని జియో తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తెలిపారు. విక్రేత, కొనుగోలుదారు నుంచి విడివిడిగా లేదా సంయుక్తంగా బాకీలను తాము వసూలు చేసుకోవచ్చని టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. ఈ వాదనల దరిమిలా దివాలా చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు.. స్పెక్ట్రంను విక్రయించవచ్చా అన్న అంశంతో పాటు వాటి నుంచి ప్రభుత్వం ఏజీఆర్పరమైన బాకీలను ఎలా రాబట్టాలి అన్న దానిపైన సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్లో ఉంచింది. ఏజీఆర్ బకాయిల విషయంలో సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునకు విజ్ఞప్తి మరోవైపు, ఏజీఆర్ బకాయిలపై సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కేంద్రాన్ని కోరింది. అదనంగా లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను కట్టాల్సి రానుండటంతో దీనికి సర్వీస్ ట్యాక్స్ కూడా తోడైతే మరింత భారం అవుతుందని జూలై 17న కేంద్ర టెలికం శాఖకు రాసిన లేఖలో సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2016 – మార్చి 2017 మధ్యకాలంలో సర్వీస్ ట్యాక్స్ బాకీల కింద టెలికం సంస్థలు రూ. 6,600 కోట్లు కట్టినట్లు తెలిపారు. -
చైనా బ్యాంకులకు వ్యక్తిగత హామీ ఇవ్వలేదు
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) మూడు చైనా బ్యాంకుల నుంచి 2012లో తీసుకున్న రుణాలకు తాను ఎటువంటి వ్యక్తిగత హామీ ఇవ్వలేదని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరోసారి స్పష్టం చేశారు. అనిల్ అంబానీకి వ్యతిరేకంగా చైనా బ్యాంకులు బ్రిటన్ కోర్టును ఆశ్రయించగా.. వ్యక్తిగత హామీ ఇచ్చినందుకు చైనా బ్యాంకులకు 717 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5వేల కోట్లకుపైగా) చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్బీఐ సైతం ఆర్కామ్ రుణానికి సంబంధించి వ్యక్తిగత హామీ ఇచ్చిన అనిల్ అంబానీ నుంచి రూ.1,200 కోట్లు వసూలు చేసుకునేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించింది. ఈ విషయాలపై రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ కంపెనీల వాటాదారుల వార్షిక సమావేశంలో (ఆన్లైన్ ద్వారా నిర్వహించారు) అనిల్ అంబానీ స్పష్టతనిచ్చారు. ఈ రెండు కేసుల్లోనూ (ఎస్బీఐ, చైనా బ్యాంకులు) రుణాలను గ్రూపు కంపెనీ (ఆర్కామ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్) తీసుకున్నవే కానీ, తనకోసం కాదని అనిల్ పేర్కొన్నారు. చైనీ బ్యాంకులతో నాన్ బైండింగ్ లెటర్ ఆఫ్ కంఫర్ట్ కుదుర్చుకునేందుకు తాను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చానే కానీ, హామీపై సంతకం చేయలేదని చెప్పారు. ఆర్కామ్ దివాలా కేసులో తుది ఫలితం ఆధారంగా చైనా బ్యాంకులకు ఎంత ఇచ్చేదీ తేలుతుందన్నారు. వాటాలు పెంచుకుంటాం: గ్రూపు కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్లో ప్రమోటర్లు వాటాల పెంచుకోవాలని నిర్ణయించినట్టు అనిల్ అంబానీ వాటాదారులకు తెలిపారు. మార్చి నాటికి రిలయన్స్ పవర్లో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 19.29 శాతం వాటా ఉండగా, రిలయన్స్ ఇన్ఫ్రాలో 14.7 శాతం మిగిలి ఉంది. -
రూ.1200 కోట్లు చెల్లించండి: ఎస్బీఐ
అనిల్ అంబానీ నుంచి రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసేందుకు ఎస్బీఐ సిద్ధమైంది. గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్ తీసుకున్న రుణాలకు అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారని., ఇప్పుడు వ్యక్తిగత హామి ఇచ్చిన రుణాన్ని అతనే చెల్లించాలంటూ ఎస్బీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బీఎస్వీ ప్రకాష్ కుమార్ అధ్యక్షతన ఎన్సీఎల్టీ బెంచ్ గురువారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనిల్ తరుపున న్యాయవాదులు తమకు కొన్ని రోజుల గడువు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన బెంచ్ వారికి వారం రోజుల గడువు ఇచ్చింది. "ఈ విషయం రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ సంస్థలు పొందిన కార్పొరేట్ రుణానికి సంబంధించినది. అంతేకాని ఇది అంబానీ వ్యక్తిగత రుణానికి సంబంధించనది కాదు. ఈ అంశంపై అంబానీ తగిన విధంగా స్పందిస్తారు.’’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి ఒక ఈ-మెయిల్ ద్వారా స్పందించారు. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ఇచ్చిన రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆర్కామ్ దివాళా కేసు ఎన్సీఎల్టీ విచారణలో ఉంది. వ్యక్తిగత హామి ఇచ్చిన రుణాన్ని రాబట్టాలనే యోచనలో ఉన్నట్లు ఎస్బీఐ అధికారి ఒకరు తెలిపారు. వ్యక్తిగత దివాలా కేసులపై నిషేధం లేనందున, ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాల్సిందిన ఎన్సీఎల్టీని కోరినట్లు అతను తెలిపారు. అలాగే వ్యక్తిగత ఖాతాలు వివరాలు, వాటి పనితీరు లాంటి అంశాలపై వ్యాఖ్యానించకూడదనేది బ్యాంక్ పాలసీ కాబట్టి పూర్తి వివరాలను తాను వెల్లడించలేనని ఎస్బీఐ అధికారి చెప్పుకొచ్చారు. -
ఆర్కామ్ దివాలా ప్రణాళికకు ఆమోదం
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్కామ్ రుణదాతల కమిటీ (సీవోసీ)లోనూ ఎస్బీఐ బోర్డు సానుకూలంగా ఓటు వేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. సీవోసీలో ఆర్కామ్ పరిష్కార ప్రణాళికపై ఓటింగ్ మొదలైందని, ఈ నెల 4న ముగుస్తుందని పేర్కొన్నాయి. పరిష్కార ప్రణాళిక కింద బ్యాంకులకు రూ.23,000 కోట్లు వసూలు కానున్నాయి. యూవీ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రూ.14,700 కోట్లకు బిడ్ వేయగా, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం రిలయన్స్ జియో రూ.4,700 కోట్ల బిడ్ వేసింది. -
అనిల్ అంబానీకి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్) వివాదంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్కామ్కు రూ.104 కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పిలేట్ ట్రైబ్యునల్(టీడీఎస్ఏటీ) తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. కేంద్రం అప్పీల్లో ఎలాంటి యోగ్యత కనిపించడం లేదని జస్టిస్ ఆర్ ఎఫ్ నారీమన్, జస్టిస్ రవీంద్ర భట్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం కేంద్రం అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం రూ .104 కోట్లను ఆర్కామ్కు తిరిగి చెల్లించాల్సి వుంది. బకాయిలకు సంబంధించి ఆర్కామ్, టెలికాం విభాగం మధ్య ఉన్నఅనేక వివాదాల్లో ఇదొకటి కావడం గమనార్హం. కాగా స్పెక్ట్రం కోసం బ్యాంక్ గ్యారెంటీ బ్యాలెన్స్గా అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్కామ్ చెల్లించిన రూ.908 కోట్ల పూచీకత్తులో.. రూ.774కోట్ల ఛార్జీల మొత్తం పోనూ మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఆర్కామ్ డిసెంబర్ 2018లో టీడీఎస్ఏటీని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ ఇంకా దాదాపు రూ.104కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే రూ.30.33 కోట్లు ఆర్కామ్కు చెల్లించింది. ఈ ఆదేశాన్ని ప్రభుత్వం సవాలు చేసింది. కాగా భారీ వ్యాపార నష్టాలు, పెరుగుతున్న అప్పుల కారణంగా ఆర్కామ్ 3 సంవత్సరాల క్రితం కార్యకలాపాలను మూసివేసింది. 2019 లో దివాలా తీసిన సంగతి తెలిసిందే. -
జీసీఎక్స్ దివాలా పిటిషన్
అనిల్ అంబానీకి చెందిన మరో కంపెనీ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. అనిల్ అంబానీ టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కు చెందిన యూనిట్ దివాలా రక్షణ కోసం దాఖలు చేసింది. ప్రపంచలోనే అతిపెద్ద అండర్ వాటర్ కేబుల్ నెట్వర్క్కు యజమాని జీసీఎక్స్ లిమిటెడ్ 350 మిలియన్ డాలర్లు విలువైన బాండ్ల చెల్లింపులు చేయడంలో విఫలం అయింది. ఈ బాండ్లకు ఆగస్టు 1 మెచ్యూర్ తేదీగా ఉంది. మరోవైపు అంబానీ నియంత్రణలో ఉన్న అడాగ్కు చెందిన రిలయన్స్ నావెల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కూడా తీవ్రమైన నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీనికితోడు బాండ్లకు చెల్లింపులు చేసేందుకు జీసీఎక్స్ చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలం అయ్యాయి. దీంతో రుణాన్ని వాటాలుగా మార్చే అంశాన్ని కూడా పరిశీలించారు. చివరకు అదీ విఫలం కావడంతో డెలావర్ కోర్టులో దివాలాకు సంబంధించి చాప్టర్ 11 పిటిషన్ను దాఖలు చేసింది. కాగా అనిల్ అంబానీ అప్పుల సంక్షోభంలో కొ ట్టుమిట్టాడుతున్నసంగతి తెలిసిందే. ఆస్తుల విక్రయం ద్వారా 3.1బిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. -
అనిల్ అంబానీపై మరో పిడుగు
సాక్షి, ముంబై : అప్పులు, దివాలా ఊబిలో కూరుకుపోయి అస్తులను అమ్ముకుంటున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మరో భారీ షాక్ తగిలింది. చైనాకు చెందిన పలు బ్యాంకులు ఆర్కాం బకాయిలకు సంబంధించి కనీసం 2.1 బిలియన్ డాలర్లు అప్పు కట్టాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఇప్పటికే భారీగాసంపదను కోల్పోయి ప్రపంచ బిలియనీర్ల జాబితాలోంచి కిందికి పడిపోయిన అనిల్ అంబానీ నెత్తిన మరో పిడుగు పడినట్టైంది. చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు అనిల్ అంబానీ కంపెనీకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చాయి అప్పులు ఇచ్చాయి. ప్రస్తుతం ఇవి అప్పులను రాబట్టేందుకు సిద్ధమయ్యాయి. జూన్ 13 నాటికి ఏడు టాప్ బ్యాంకులకు కంపెనీలు చెల్లించాల్సిన రుణాల వివరాలు ఇలా ఉన్నాయి. చైనా ప్రభుత్వరంగ బ్యాంకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్.. రూ.9,860 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు). ఎగ్జిమ్ బ్యాంక్ ఆప్ చైనా రూ.3,360 కోట్లు, కమర్షియల్ బ్యాంక్ ఆప్ చైనా రూ.1,554 కోట్లుగా ఉంది. దీనికితోడు దేశీయంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ. 4910 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ. 2 700 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ. 2090 కోట్లు మాడిసన్ పసిఫిక్ ట్రస్ట్కు రూ.2350 కోట్లు బకాయి ఉంది. ఈ మొత్తం అప్పులు రూ.57,382 కోట్లుగా ఉంది. ఇది కాకుండా రష్యాకు చెందిన బీటీబీ కేపిటల్ ఆఫ్ రష్యాకు రూ.511 కోట్లు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (లండన్), డాయిష్ బ్యాంక్ (హాంగ్కాంగ్) డీబీఎస్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్లతో పాటు ఇతరులకు బకాయిలు పేరుకుపోయాయి. రుణాలకు సంబంధించిన వివరాలను రిలయన్స్ కమ్యూనికేషన్స్ సోమవారం విడుదల చేసింది. కాగా ఆర్కామ్, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో మధ్య రూ.17,300 కోట్ల కొనుగోలు ఒప్పందానికి సిద్ధమయ్యాయి. కానీ రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఈ డీల్కు బ్రేక్పడింది. ఇది ఇలా వుంటే ఆస్తులు అమ్మి అయినా మొత్తం అప్పులు తీర్చేస్తామని ఇటీవల అనిల్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అప్పులన్నీ తీర్చేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ : అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. అప్పులు చెల్లించడానికి తాము పూర్తిగా కట్టుబడి వున్నామని ప్రకటించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అనిల్ అంబానీ ఈ మేరకు హామీ ఇచ్చారు. 2018 ఏప్రిల్ మరియు మే 2019 మధ్య కాలంలో ఇప్పటికే వడ్డీ సహా రూ. 35వేల కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లించామని పేర్కొన్నారు. ఆస్తులు విక్రయం, తనఖా ద్వారా ఈ అప్పులను తీర్చినట్టు తెలిపారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి తమకు ఎటువంటి సహాయం అందలేదని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా రుణాలను పూర్తిగా తీర్చడానికి కట్టుబడి వున్నామన్నారు. ఈ పక్రియ వివిధ దశల్లో ఇప్పటికే అమల్లో ఉందని చెప్పారు. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2014 నాటి ఆర్కాం- ఎరిక్సన్ ఇండియా డీల్కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన ఆర్కాం 1,500 కోట్ల రూపాయల నగదు చెల్లించలేదని నేషనల్ కంపెనీ లా అప్పెల్లేట్ ట్రిబ్యునల్ ముందు ఎరిక్సన్ ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 15 లోగా ఎరిక్సన్ అప్పులు తీర్చివేయాలని లేదంటే, 12 శాతం వడ్డీతో మొత్తం చెల్లించాల్సి వుంటుందని గత ఏడాది అక్టోబర్లో ఆర్కాంను సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రూ.25వేల కోట్ల విలువైన ఆస్తులు (స్పెక్ట్రమ్, ఫైబర్, టెలికాం టవర్లు, కొన్ని రియల్ ఎస్టేట్) విక్రయానికి అనుమతిని మంజూరు చేసింది. అయినా ఈ చెల్లింపుల్లో సంస్థ పదే పదే విఫలం కావడంతో కోర్టు ధిక్కరణ, జరిమానాను కూడా ఎదర్కోవాల్సి వచ్చింది. దీంతో 453 కోట్ల రూపాయలను తక్షణమే ఎరిక్సన్కు చెల్లించాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఆర్కాం దివాలా ప్రక్రియ షురూ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కాం) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అలాగే దివాలా ప్రక్రియనుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను ఎన్సీఎల్టీ గురువారం అంగీకరించింది. దివాలా ప్రక్రియలో 357రోజుల (మే 30, 2018 నంచి ఏప్రిల్ 30 2019) కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్కామ్ కోరగా ట్రైబ్యునల్ ఇందుకు సమ్మతించింది. అనంతరం తదుపరి విచారణను మే30వ తేదీకి వాయిదా వేసింది. ఎస్బీఐతో పాటు వివిధ బ్యాంకులకు ఆర్కామ్ రూ.50వేల కోట్ల వరకు అప్పు ఉంది. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చెల్లించని పరిస్థితికి దిగజారింది. దీంతో దివాలా పెట్టేందుకు కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. గురువారం మరోసారి విచారణ జరిపిన ట్రైబ్యునల్ కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతి ఇస్తూ సంస్థ బోర్డును రద్దు చేసింది. కొత్త రిసొల్యూషన్ ప్రొఫెషనల్ను అపాయింట్ చేసింది. అంతేకాకుండా ఎస్బీఐ నేతృత్వంలోని 31 బ్యాంకు కన్సార్షియానికి క్రెడిటర్స్ కమిటీ ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇప్పటికే దాఖలైన దివాలా పిటిషన్ పైన నేషనల్ కంపెనీ లా అప్పెలట్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు స్టే విధించాయి. ఈ నేపథ్యంలో ఈ 357 రోజుల కాలానికి మినహాయింపు ఇవ్వాలని ఆర్కాం కోరింది. ఇందుకు ట్రైబ్యునల్ ఒప్పుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. అప్పటి లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రిసొల్యూషన్ ప్రొఫెషనల్కు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఆర్కాం గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిపేసింది. దీంతో ఆర్.కామ్ స్పెక్ట్రంను జియోకు విక్రయించేందుకు సిద్ధపడింది. కానీ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదు. -
అబ్బే... అదెలా కుదురుతుంది!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వీడన్ టెలికం సంస్థ ఎరిక్సన్కు బాకీ చెల్లింపునకు ఆదాయ పన్ను రిఫండ్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను వినియోగించాలన్న ఆర్కామ్ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఇందుకు అనుమతించాలంటూ ఆర్కామ్ చేసిన విజ్ఞప్తిని ఫైనాన్షియల్ క్రెడిటార్స్ (రుణ దాతలు) తోసిపుచ్చారు. ఈ మేరకు తమ వాదనలను ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో వినిపించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్కామ్.. ప్రస్తుతం దివాలా ప్రక్రియ అమలు కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించాలని నిర్ణయించింది. దీనితో సంస్థ ఏ చెల్లింపులు జరపాలన్నా తప్పనిసరిగా రుణదాతల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిఫండ్స్ ఆర్కామ్ వినియోగంపై విధించిన మారటోరియంను తొలగించాలని అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆర్కామ్ ఆశ్రయించింది. ఆయితే మారటోరియం తొలగించరాదని రుణ గ్రహీతలు తమ వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ మార్చి 11న జరుగుతుంది. 8వ తేదీలోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)సహా కంపెనీ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది. ఎరిక్సన్కు బకాయిల కేసులో ఇప్పటికే ఆర్కామ్ 118 కోట్లు డిపాజిట్ చేసింది. మిగిలిన మొత్తం రూ.453 కోట్లను నాలుగు వారాల్లో చెల్లించకుండా మూడు నెలలు కంపెనీ చీఫ్ అనిల్ అంబానీ, మరో ఇరుగ్రూపు సంస్థల డైరెక్టర్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ నెల 20వ తేదీన అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీనితో కంపెనీ నిధుల సమీకరణ ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. -
బాకీ కట్టకపోతే జైలు శిక్షే!
న్యూఢిల్లీ: ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిల కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్, వ్యాపారవేత్త అనిల్ అంబానీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎరిక్సన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో బుధవారం తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... రూ.550 కోట్ల బకాయి చెల్లించకుండా తన ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఇది పూర్తిగా ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో రూ.453 కోట్లు కనక ఎరిక్సన్కు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆర్కామ్ చైర్మన్ అనిల్తో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీశ్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ చిరహా విరాణికి కూడా సుప్రీంకోర్టు ఇదే హెచ్చరికలు చేసింది. తన మునుపటి ఉత్తర్వులకు సంబంధించి ఇచ్చిన హామీలను వీరు నిలబెట్టుకోలేదని, తద్వారా ముగ్గురూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘‘ఉద్దేశపూర్వకంగానే వీరు ఎరిక్సన్కు నిధులివ్వలేదని భావించాల్సి వస్తోంది’’ అని సుప్రీం పేర్కొంది. ధర్మాసనం ఈ హెచ్చరిక చేస్తున్న సమయంలో అనిల్ అంబానీ సహా ముగ్గురూ కోర్టు హాల్లోనే ఉన్నారు. అనిల్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. రూ.453 కోట్లు చెల్లించడం ద్వారా ‘కోర్టు ధిక్కరణ’ వేటు నుంచి తప్పుకోగలుగుతారని న్యాయమూర్తులు ఎఫ్ఎఫ్ నారిమన్, వినీత్ సరన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. రిలయన్స్ ఎటువంటింటి బేషరతు క్షమాపణలు చెప్పినా, దాన్ని ఆమోదించాల్సిన పనిలేదని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. కోటి డిపాజిట్ చేయకపోతే మరో నెల జైలు ఆర్కామ్, రిలయన్స్ టెలికమ్యూనికేషన్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ రూ.కోటి చొప్పున 4 వారాల్లో రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. లేదంటే ఈ కంపెనీల చైర్ పర్సన్లు మరో నెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద రిలయన్స్ గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.118 కోట్లను వారం రోజుల్లో ఎరిక్సన్కు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘రూ.550 కోట్లు ఎరిక్సన్కు చెల్లించడానికి మూడు రిలయన్స్ కంపెనీలకూ 120 రోజుల గడువిచ్చాం. తర్వాత దీనిని మరో 60 రోజులూ పొడిగించాం. అయినా దీనిని కంపెనీలు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి రూ.118 కోట్లు చెల్లిస్తామనడం సరికాదు. బకాయి మొత్తం కట్టాల్సిందే.’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయపాలనకు అడ్డంకులని పేర్కొంది. సుప్రీం ఉత్తర్వుల్ని గౌరవిస్తాం: రోహత్గీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల తరువాత అనిల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విలేకరులతో మాట్లాడుతూ, ‘‘అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులపట్ల గౌరవం ఉంది. ఎరిక్సన్కు బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను గ్రూప్ పాటిస్తుందన్న విశ్వాసం ఉంది. బకాయిల చెల్లింపుల విషయంలో ఇబ్బందులున్నా, ఉన్నత న్యాయస్థానం తన ఆదేశాలను తాను ఇచ్చింది’’ అని అన్నారు. జియోతో ఒప్పందం వైఫల్యంవల్లే: అనిల్ తనకు రావాల్సిన డబ్బుపై ఎరిక్సన్ తీవ్ర విమర్శలే చేసింది. రిలయన్స్ గ్రూప్కు రఫేల్ జెట్ డీల్లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉందికానీ, తన రూ.550 కోట్ల బకాయి తీర్చడానికి మాత్రం లేదని విమర్శించింది. అయితే అనిల్ గ్రూప్ దీనిని తీవ్రంగా ఖండించింది. తన సోదరుడు ముకేశ్ అంబానీ నియంత్రణలోని రిలయన్స్ జియోతో తన ఆస్తుల విక్రయ ఒప్పందం విఫలమైందని, తన కంపెనీ దివాలా ప్రొసీడింగ్స్లోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఎరిక్సన్కు బకాయిలు చెల్లిండానికి చేయాల్సిందంతా చేసినా, ఫలితం రాలేదని తెలిపారు. గ్రూప్ షేర్ల పతనం తాజా పరిణామంతో రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. రిలయన్స్ కమ్యూనికేషన్: రూ.5.45– రూ.6.15 కనిష్ట, గరిష్ట స్థాయిల్లో తిరిగిన ఈ షేర్ ధర చివరకు 4.17 శాతం (0.25పైసలు) నష్టపోయి రూ.5.75 వద్ద ముగిసింది. రిలయన్స్ క్యాపిటల్: రూ.135.10–రూ.152.50 మధ్య తిరిగిన ఈ షేర్ ధర చివరకు 4.30 శాతం నష్టంతో చివరకు 144.95 వద్ద ముగిసింది. నష్టపోయిన ఇతర షేర్లను చూస్తే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (4.07 శాతం), రిలయన్స్ నావెల్ అండ్ ఇంజనీరింగ్ (2.34 శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (2.29 శాతం), రిలయన్స్ పవర్ (0.92 శాతం) ఉన్నాయి. ఈ స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 10.3 శాతం వరకూ కూడా పడటం గమనార్హం. కేసు క్రమం ఇదీ... ►ఆర్కామ్ దేశవ్యాప్త టెలికం నెట్వర్క్ నిర్వహణకు అనిల్ గ్రూప్తో 2014లో ఎరిక్సన్ ఇండియా ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,500 కోట్లకుపైగా బకాయిలు చెల్లించలేదని ఆరోపించింది. ► రూ.47,000 కోట్లకుపైగా రుణ భారంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, తనకు బకాయిలు చెల్లించలేకపోవడంతో, ఎరిక్సన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ పిటిషన్ను ట్రిబ్యునల్ అడ్మిట్ చేసుకుంది. ► అయితే ఈ కేసును ఆర్కామ్ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంది. ఇందుకు వీలుగా రూ.550 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. 2018 సెప్టెంబర్ 30 లోపు ఈ చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. ► ఈ హామీకి కట్టుబడకపోవడంతో ఎరిక్సన్ సెప్టెంబర్లో సుప్రీంను ఆశ్రయించింది. ► ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిలపై గతేడాది అక్టోబర్ 23న ఆర్కామ్కు అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోపు బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. జాప్యం జరిగితే ఇందుకు సంబంధించి మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ►డిసెంబర్ 15లోపు ఆర్కామ్ బకాయిలు చెల్లించలేకపోతే, ఎరిక్సన్ కోర్టు ధిక్కరణ కేసు ప్రొసీడింగ్స్ను ప్రారంభించవచ్చని సూచించింది. ►అయితే ఆ లోపూ బకాయిలు చెల్లించలేకపోవడంతో జనవరి 4న ఎరిక్సన్ మళ్లీ సుప్రీం కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ► దీనిపై బుధవారం సుప్రీం కోర్టు తన తీర్పును ప్రకటించింది. -
అనిల్ అంబానీ పని అయిపోయిందా..?
అన్నదమ్ములిద్దరూ దాదాపు ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్ అంబానీతో పోటీపడిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆ లిస్టులో ఎక్కడో కిందికి పడిపోయారు. అన్న ముకేశ్ అంబానీ 47 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా రాజ్యమేలుతుండగా.. 2 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంపదతో తమ్ముడు అనిల్ అంబానీ కనీసం దేశీ కుబేరుల లిస్టులోనూ చోటు కోసం తంటాలు పడే పరిస్థితికి తగ్గిపోయారు. దశాబ్ద కాలంలో అన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు ఎగిసినప్పటికీ... అడ్డదిడ్డంగా ఎడాపెడా కంపెనీలు ఏర్పాటు చేస్తూ, సంబంధంలేని రంగాల్లోకి దూరేస్తూ.. అప్పులు పెంచుకుంటూ పోయిన అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ విలువ వేల కోట్ల స్థాయికి పడిపోయింది. పదేళ్ల క్రితం రూ. 1.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ప్రస్తుతం దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుదేలై.. దివాలా తీసింది. గ్రూప్లోని మిగతా కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఆర్కామ్ దివాలా ప్రకటనతో సోమవారం అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. గ్రూప్లో కీలకమైన అయిదు సంస్థల మార్కెట్ విలువ ఒక్క రోజే ఏకంగా రూ.5,831 కోట్ల మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న అనిల్, అడాగ్ గ్రూప్ కంపెనీలు, కారణాలపై ‘సాక్షి’ బిజినెస్ విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనమిది... సరి సమానంగా విభజన... వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవటంతో 2005లో దాదాపు రూ.90,000 కోట్ల రిలయన్స్ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇందులో ముడిచమురు కంపెనీ అన్న ముకేశ్కు రాగా.. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రా, పవర్ వంటి కీలక సంస్థలు అనిల్ చేతికి దక్కాయి. అవిభాజ్య గ్రూప్లో అనిల్ అంబానీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా (సీఎఫ్ఓ) వ్యవహరించేవారు. వ్యాపార భారాన్ని భుజాలపై మోయడం కన్నా.. డీల్స్ కుదర్చడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే విభజన తరవాత భారీ సామ్రాజ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీద పడటంతో.. ఆయన సామర్థ్యాలకు పరీక్ష మొదలైంది. సవాళ్లూ ఒక్కొక్కటిగా ఎదురవటం మొదలెట్టాయి. వ్యాపార విస్తరణ కాంక్షతో సంబంధం లేని రంగాల్లోకి కూడా చొచ్చుకుపోయారు అనిల్. చివరకు అప్పుల భారం పేరుకుపోయిన ఆర్కామ్ రూపంలో సంక్షోభం బయటపడింది. వచ్చే ఆదాయాలు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోని పరిస్థితుల్లోకి గ్రూప్ దిగజారిపోయింది. ముంబైలో తొలి మెట్రో లైన్ నిర్మించిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ... గతేడాది ఆగస్టులో బాండ్లను చెల్లించలేక చేతులెత్తేసింది. 2008లో రికార్డ్ ఐపీవోకి వచ్చిన రిలయన్స్ పవర్ షేరు.. అప్పట్నుంచీ పడుతూనే ఉంది. కాస్త లాభసాటిగా ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం రిలయన్స్ క్యాపిటల్కి కూడా కష్టాలు తప్పలేదు. మొత్తానికి సంక్షోభంలోకి పడిపోయిన కొన్ని గ్రూప్ కంపెనీలను చూస్తే.. ఆర్కామ్: కాల్ డిస్కనెక్ట్.. 2010లో 17% మార్కెట్ వాటాతో దేశీ టెలికంలో ఆర్కామ్ రెండో స్థానంలో ఉండేది. 2016లో అన్న ముకేశ్ ఎంట్రీ తర్వాత ఇది పదవ స్థానానికి పడిపోయి.. టాప్ కంపెనీల లిస్టు నుంచి తప్పుకుంది. ఒకప్పుడు రూ.1.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో వెలుగొందిన ఆర్కామ్ ఇప్పుడు రూ.45 వేల కోట్ల పైచిలుకు రుణ భారంలో ఉంది. చివరికి ప్రధానమైన మొబైల్ వ్యాపారాన్ని అన్న కంపెనీకే అమ్మేసినా.. స్పెక్ట్రం బాకీల వివాదంతో డీల్ ముందుకు సాగడం లేదు. బాకీలు ఎగ్గొట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్ వంటి కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. 1.8 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని వసూలు చేసుకునేం దుకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా దివాలా పిటిషన్ వేసింది. సినిమా... అట్టర్ ఫ్లాప్ ఒకప్పటి సినీతార టీనా మునీమ్ను వివాహం చేసుకున్న అనిల్ అంబానీ .. తన అడాగ్ గ్రూప్ ద్వారా గ్లామర్ ప్రపంచ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. ఫిలిమ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, పంపిణీ రంగాల్లోని యాడ్ ల్యాబ్స్ సంస్థ కొనుగోలుతో ఆరంభంలో భారీగానే విస్తరించారు. 2008 నాటికి దాదాపు 700 స్క్రీన్స్తో దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్గా అనిల్ ఎదిగారు. కానీ 2014 నాటికి ఈ మీడియా వైభవం తగ్గిపోయింది. రుణాల భారం తగ్గించుకోవడానికి వందల కొద్దీ స్క్రీన్స్ను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. సంబంధం లేని గ్లామర్ బిజినెస్లోకి దూకి అనిల్ దానిపై దృష్టి పెట్టడం వల్ల ప్రధాన గ్రూప్ కంపెనీల పనితీరు దెబ్బతిన్నదనే విమర్శలూ ఉన్నాయి. అసెట్స్ అమ్మకాలకు ఆటంకాలు.. మరోపక్క, అప్పుల భారాలను తగ్గించుకోవడానికి అనిల్ అంబానీ పెద్ద ఎత్తున అసెట్స్ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే సిమెంట్, టెలికం టవర్స్ మొదలైన వాటిని అమ్మేశారు. కానీ.. ఒక్కో వ్యాపార విభాగంలో ఒక్కో సమస్య కారణంగా అసెట్స్ విక్రయం పూర్తి స్థాయిలో ముందుకు జరగడం లేదు. రూ. 1,00,000 కోట్లు.. 2018 మార్చి ఆఖరు నాటికి అడాగ్ రుణభారం ఇది. ఏటా వడ్డీల కిందే రూ. 10,000 కోట్లు. రూ. 4,00,000 కోట్లు.. గరిష్ట స్థాయిలో అడాగ్ గ్రూప్లోని 5 ప్రధాన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్. ప్రస్తుతం రూ. 50 వేల కోట్ల కన్నా తక్కువకి పడిపోయింది. రక్షణ... బ్యాక్ ఫైర్! ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు.. అనిల్ అంబానీ 2016లో పిపావవ్ మెరైన్ అండ్ ఆఫ్షోర్ (రిలయన్స్ నేవల్గా పేరు మారింది) యాజమాన్య వాటాలను కొనుక్కున్నారు. ఇది భారతీయ నేవీ కోసం యుద్ధనౌకల నిర్మాణం, మరమ్మతుల సర్వీసులు అందిస్తుంది. సమస్యల్లో ఉన్న ఇన్ఫ్రా నుంచి పుష్కలమైన అవకాశాలున్న డిఫెన్స్ వైపుగా వెడితే అడాగ్ను కాపాడుకోవచ్చని అనిల్ భావించారు. కానీ, ఈ ప్రయోగమూ దెబ్బతింది. అయినా.. అసలు భారీ నష్టాలు, అప్పులతో కుదేలైన ఈ సంస్థను ఎందుకు కొన్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్తో ఈ కంపెనీ జట్టు కట్టడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అనిల్ అంబానీకి మేలు చేసేందుకు ప్రభుత్వమే ఈ రెండింటి మధ్య డీల్ కుదిర్చిందంటూ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. 45 బిలియన్ డాలర్ల వ్యత్యాసం.. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం 2007లో అనిల్ సంపద 45 బిలియన్ డాలర్లు. అన్న ముకేశ్ సంపద 49 బిలియన్ డాలర్లు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2018కి వస్తే ఫోర్బ్స్ ఇండియా కుబేరుల లిస్టులో ముకేశ్ 47.3 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 2.44 బిలియన్ డాలర్ల సంపదతో అనిల్ 66వ స్థానానికి పడిపోయారు. అసలెక్కడ తేడా కొట్టింది..? కేవలం దశాబ్దం కాలంలో అనిల్ సామ్రాజ్యం కుప్పకూలడానికి దారి తీసిన కారణాలేంటి. డీల్ మేకర్గా, వ్యాపార నిర్వహణలో ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న అనిల్ అంబానీ గ్రాఫ్ ఎందుకిలా పడిపోయింది? 2008లో రికార్డు స్థాయిలో రిలయన్స్ పవర్ రూ.11,500 కోట్ల నిధుల కోసం ఐపీఓకు వచ్చినపుడు... అది రికార్డు స్థాయిలో 70 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. మరలాంటప్పుడు.. ఎక్కడ తేడా కొట్టింది? నిర్వహణ లోపమా? సమర్థమంతమైన టీమ్ లేకపోవడం వల్లా? లేదా ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా కుప్పతెప్పలుగా కంపెనీలు పెట్టేయడం వల్లా? లేదా ఎకాయెకిన ఆకాశానికి నిచ్చెనలేసేయాలన్న అత్యుత్సాహంతో దొరికిన చోటల్లా అడ్డగోలుగా అప్పులు చేసేసి.. రుణభారం పెంచేసుకోవడం వల్లా? వ్యాపార పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడం వల్లా? తరచి చూస్తే సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ప్రధాన కారణాల గురించి వెతుక్కుంటూ పోతే అంతు ఉండదన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే, అన్నింటికీ వ్యాపార పరిస్థితులు బాగా లేకపోవడం, దురదృష్టం అనుకోవడానికి ఉండదని.. ఆయన ప్రారంభించిన అనేక కంపెనీలే ఒకదాన్ని మరొకటి దెబ్బతీశాయని.. వాటాదారుల ప్రయోజనాలను ఘోరంగా దెబ్బతీశాయని విమర్శలు వస్తున్నాయి. కాస్తంత ఇబ్బందికరమైనదే అయినా.. సోషల్ మీడియా యాప్స్లో అన్నదమ్ములపై ఒక సెటైర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అన్న ముకేశ్ అంటే ’ము–క్యాష్’ (డబ్బుల మూట) అని, తమ్ముడు అనిల్ అంటే ’అ–నిల్’ (సున్నా) అంటూ వ్యంగ్యోక్తులు కూడా నడిచాయి. -
ఆర్కాం సంచలన నిర్ణయం : షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) సంచలన నిర్ణయం తీసుకుంది. దివాళా పిటిషన్ దాఖలు చేయాలని అనూహ్యంగా నిర్ణయించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరనున్నామని కంపెనీ రెగ్యులేటరీ సమాచారంలో తెలియజేసింది. దీంతో సోమవారం నాటి మార్కెట్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) కంపెనీ షేర్లకు భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో అన్ని షేర్లు భారీగా నష్టపోతున్నాయి. సుమారు రూ.40వేల కోట్ల మేర రుణ పరిష్కారాలకు సంబంధించిన అంశంలో 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించకపోవడంతో ఆర్కామ్ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18నెలలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుణ పరిష్కార అంశం ముందుకు సాగలేదని ఆర్కామ్ తెలిపింది. దీంతో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించనున్నట్లు పేర్కొంది. దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇతర గ్రూపు కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా నెలకొన్న అమ్మకాలతో ముఖ్యంగా ఆర్కామ్ షేరు 48 శాతం పతనమైంది. ఒక దశలో54.3 శాతం కుప్పకూలి, 5.30 రూపాయల వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. దీంతోపాటు అడాగ్ గ్రూప్లోని రిలయన్స్ కేపిటల్ (12.5శాతం), రిలయన్స్ పవర్ (13శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్, రిలయన్స్ నావల్ తదితర కౌంటర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. -
అంబానీకి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎరిక్సన్ ఇండియా దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్పై స్పందన కోరుతూ సోమవారం నోటీసులు జారీ చేసింది. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం అంబానీ, ఇతరులను ఆదేశించింది. అయితే బకాయి కింద రూ.118కోట్లను అంగీకరించాల్సిందిగా ఆర్కాం తరపున వాదించిన న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహతగి కోర్టును కోరారు. అయితే ఎరిక్సన్దీనికి ససేమిరా అంది. మొత్తం బకాయిని డిపాజిట్ చేయాలని తేల్చి చెప్పింది. దీంతో కోర్టు రిజిస్ట్రీలో రూ. 118 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ను డిపాజిట్ చేయాల్సింగా ఆర్కాంను కోరింది. అలాగే రిలయన్స్ జియోతో కూర్చొని చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ఆర్కాంకు నారిమన్ సూచించారు. పరస్పరం సమస్యను పరిష్కరించుకోని పక్షంతో తామేమి చేయలేమని వ్యాఖ్యానించారు. మరోవైపు స్పెక్ట్రం ట్రేడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఆర్కాం కొనుగోళ్లపై సిద్ధంగా ఉన్నారా అని జియోను కూడా కోర్టు ప్రశ్నించింది. అయితే ముందస్తు బకాయిలతో ఉన్న సమస్యల నేపథ్యంలో, ఆర్కాంకు ఫిజికల్ గ్యారంటీ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని జియో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ ఇటీవల ఆర్కాంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. అనిల్ అంబానీని అరెస్టు చేయాలని, దేశం విడిచి పారిపోకుండా నియంత్రించాలంటూ ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించింది. బకాయిల చెల్లింపునకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన అనిల్ అంబానీ గడువు తీరినా స్పందించడం లేదని, తద్వారా కోర్టు గడువును కూడా ఉల్లంఘించారని ఎరిక్సన్ తన పిటిషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అనిల్ అంబానీని జైలుకు పంపండి!
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అప్పులు చెల్లించకుండా విదేశాలకు పారిపోకుండా చూడాలని సుప్రీంను కోరింది. ఆర్కాం ఛైర్మన్ అనిల్ అంబానీని జైలుకు పంపి, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తద్వారా రూ.550 కోట్ల బాకీని వడ్డీతో సహా చెల్లించేలా చూడాలంటూ గురువారం రెండవ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ అనిల్ సహా ఈ కంపెనీలకు చెందిన ఇతర అధికారులు దేశం విడిచిపోకుండా నివారించేలా హోం మంత్రిత్వశాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు గడువులోపు బాకీ చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకుగాను అనిల్ అంబానీని జైలుకు పంపాలని డిమాండ్ చేసింది. చాలాకాలంగా ఆర్కాం చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నాం..550 కోట్ల రూపాయల చెల్లింపునకు అంబానీ కోర్టులో వ్యక్తిగత హామీ ఇచ్చారు, కానీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ఇది రెండవసారి. ఈ నేపథ్యంలో ఆర్కాంపై దివాలా చర్యలు చేపట్టాలని ఎరిక్సన్ సీనియర్ అడ్వకేట్ అనిల్ ఖేర్ వ్యాఖ్యానించారు. -
జియో, ఆర్కామ్ ఒప్పంద గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: వైర్లెస్ ఆస్తుల విక్రయానికి సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం గడువును పొడిగించుకుంటున్నట్లు ఆర్కామ్, జియో ప్రకటించాయి. ఆర్కామ్కు చెందిన స్పెక్ట్రం డీల్కు టెలికం శాఖ నుంచి అనుమతులు రాని నేపథ్యంలో ఈ డీల్ను పొడిగించుకోవాలని ఇరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ‘‘రిలయన్స్ కమ్యూనికేషన్స్తో కుదుర్చుకున్న ఆస్తుల కొనుగోలు ఒప్పంద కాలపరిమితిని 2019 జూన్ 28 వరకు ఆర్జియో పొడిగించుకుంది’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించింది. ప్రభుత్వపరమైన అన్ని రకాల అనుమతులు, ఆమోదాలు, రుణదాతల అంగీకారం పొంది సదరు ఆస్తులపై ఉన్న చిక్కులన్నీ తీరాకే కొనుగోలు జరుగుతుందని తెలిపింది. టవర్లు, ఫైబర్, ఎంసీఎన్, స్పెక్ట్రమ్ విక్రయానికి సంబంధించి ఆర్జియోతో కుదుర్చుకున్న ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నట్లు ఆర్కామ్ సైతం విడిగా ప్రకటించింది. పలు సందేహాల నేపథ్యం... జియోకు స్పెక్ట్రం విక్రయానికి సంబంధించి తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను జారీ చేయాలని ఆర్కామ్ చాలా రోజులుగా టెలికం శాఖను అభ్యర్థిస్తూ వస్తోంది. కానీ ఇరు కంపెనీల మధ్య ఈ డీల్కు సంబంధించిన చెల్లింపులపై టెలికం శాఖ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. వీటిపై సమాధానమిచ్చేందుకు ఆర్జియో, ఆర్కామ్ ప్రతినిధులు ఈ నెలలో టెలికం సెక్రటరీతో సమావేశమయ్యారు. ఈ విషయంలో బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలన్న టెలికం శాఖ డిమాండ్ను టెలికం ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు ఆర్కామ్ గుర్తు చేసింది. బ్యాంకు గ్యారెంటీ బదులు తమ అనుబంధ సంస్థ ఆర్రియల్టీ ద్వారా అవసరమైన కార్పొరేట్ గ్యారెంటీ ఇస్తామని తెలిపింది. అందువల్ల ఇక అభ్యంతరాలకు ఎలాంటి అవకాశం లేదని ఆర్కామ్ పేర్కొంది. టెలికం శాఖ మాత్రం డీల్కు ఆమోదముద్ర వేసేందుకు ఇంకా అంగీకరించలేదు. ముఖ్యంగా చెల్లింపుల బకాయిలు, ఇతర చార్జీలపై ఇంకా స్పష్టత రావాలని టెలికం శాఖ భావిస్తోంది. ముఖ్యంగా డీల్కు సంబంధించి ఆర్కామ్కు ఎలాంటి గ్యారెంటీ కూడా ఇవ్వటానికి జియో అంగీకరించలేదు. అందుకని టెలికం శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు కంపెనీలు ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నాయి. -
స్పెక్ట్రం డీల్ : అంబానీకి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కాం)కు సుప్రీంకోర్ టుభారీ ఊరట కల్పించింది. సోదరుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ జియోకు స్పెక్ట్రం అమ్మకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా జియోకు ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం తొలగించింది. అయితే గ్యారంటీ నగదు చెల్లించిన తరువాత మాత్రమే తుది ఆమోదం లభిస్తుందంటూ నిబంధన విధించింది. డాట్ వద్ద గ్యారంటీ నగదు చెల్లించిన అనంతరం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లభిస్తుందని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. సేల్కున్నఅడ్డంకులను తొలగిస్తూ సుప్రీం శుక్రారం కీలక తీర్పునిచ్చింది. రెండు రోజుల్లో 1400 కోట్ల రూపాయల కార్పొరేట్ గ్యారంటీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం చెల్లించిన అనంతరం వారం రోజుల్లో ఎన్వోసీ జారీ చేయాల్సిందిగా టెలికాం విభాగం (డాట్)ను సుప్రీం కోరింది. రూ.46వేల కోట్ల రుణభారం అప్పుల భారం నుంచి బయటపడేందుకు వైర్లెస్ స్పెక్ట్రం, టవర్, ఫైబర్, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించేందుకు ఆర్కాం సిద్ధమైంది. సుమారు రూ.46వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో స్పెక్ట్రం ఆస్తుల అమ్మకం ఆర్కాంకు చాలా ముఖ్యం. -
అంబానీ బ్రదర్స్ డీల్కు సుప్రీం బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్కు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్సకు చెందిన ఆస్తుల విక్రయ ఒప్పందానికి సుప్రీం బ్రేక్ వేసింది. దీనికి సంబంధించి ఇటీవల ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన ఆర్డర్పై స్టే విధించింది. ఆర్కాం టవర్ సంస్థలో 4శాతం వాటా వున్న హెచ్ఎస్బీసీ డైసీ ఇన్వెస్ట్మెgట్స్ (మారిషియస్) లిమిటెడ్ సవాల్ను కోర్టు స్వీకరించింది. దీనిపై మైనారిటీ వాటాదారుల వాదనలు వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దఈ వార్తలతో స్టాక్మార్కెట్లో ఆర్కాం కౌంటర్ 2శాతానికిపైగా నష్టాలతో కొనసాగుతోంది. ఆస్తుల విక్రయానికి ఎన్సీఎల్టీ ఆమోదం లభించిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏప్రిల్ 5న ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీని ద్వారా 25,000 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించనున్నామని తెలిపింది. కాగా స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్,మల్టీ ఛానెల్ నెట్వర్క్(ఎంసీఎన్ఎస్)విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్లో రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
అంబానీకి సుప్రీంకోర్టు ఊరట
న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులు విక్రయించకుండా బొంబై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో స్వీడిష్ గేర్ మేకర్ ఎరిక్సన్కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చట్ట ప్రకారం ఆర్కామ్ ఆస్తులను విక్రయించుకోవచ్చని క్రెడిటార్లకు టాప్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్కామ్ స్పెక్ట్రమ్, ఫైబర్, రియల్ ఎస్టేట్, స్విచ్చింగ్ నోడ్స్ వంటి వాటిని విక్రయించుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్కామ్ షేర్లు లాభాల జోరు కొనసాగిస్తోంది. ఆర్కామ్ షేర్లు దాదాపు 2.5 శాతం లాభపడ్డాయి. మార్చి మొదట్లో తమ ఆస్తులు విక్రయించకుండా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ విధించిన ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ బొంబై హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. కానీ ఫిర్యాదును హైకోర్టు కొట్టిపారేసి, ఆర్బిట్రేషన్ అనుమతి లేకుండా ఎలాంటి ఆస్తులు విక్రయించకూడదని, ఆస్తుల విక్రయంపై స్టే విధించింది. ఎరిక్సన్ ఏబీకి చెందిన ఇండియన్ విభాగానికి రిలయన్స్ కమ్యూనికేషన్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన విషయమే ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ విక్రయిద్దామన్న ఆస్తులు విక్రయించకుండా.. డీల్స్ బదలాయింపులు చేయడానికి వీలులేకుండా కోర్టు మార్చిలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆస్తులు విక్రయించుకునే విషయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్కు భారీ ఊరట లభించింది. అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఆస్తులను అన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు అమ్మేసి, ఆ అప్పులను కొంతమేర తగ్గించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం ఆర్కామ్కు దాదాపు రూ.45వేల కోట్ల అప్పులున్నాయి. -
అంబానీ బ్రదర్స్ మెగా డీల్కు బ్రేక్: షేర్లు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిలయన్స్ జియోకు ఆస్తుల అమ్మకంపై స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ విక్రయం తన తుది ఆదేశానికి లోబడి ఉంటుందని కోర్టు తెలిపింది, తుది ఆదేశాలవరకు యథాతధ స్థితిని కొనసాగించాలని సుప్రీం ఆదేశించింది. తద్వారా తన అనుమతిలేనిదే ఈ డీల్ను పూర్తి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సుమారు రూ.39వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తన వైర్లెస్ స్పెక్ట్రం, టవర్, ఫైబర్, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించనున్నట్టు ఆర్కాం ప్రకటించింది. అయితే ట్రిబ్యునల్ ఆర్డర్కు భిన్నంగా ముందస్తు అనుమతి లేకుండా దాని ఆస్తుల విక్రయం లేదా బదిలీకి కుదరదంటూ ఈ నెల 8న ముంబై హైకోర్టు ఈ డీల్ను తిరస్కరించింది. ఆర్కాంనుంచి వెయ్యికోట్లకుపైగా బకాయి రావాల్సిన దేశీయ చిప్ మేకర్ ఎరిక్సన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. అయితే ఆర్కాంకు మద్దతుగా నిలిచిన ఎస్బీఐ ట్రిబ్యునల్ ఆర్డర్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల అమ్మకానికి అనుమతి నివ్వాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన సుప్రీం ముంబై హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తాజా ఆదేశాలిచ్చింది. కాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ( జియో) కు కంపెనీ ఆస్తులను విక్రయించాలని ఆర్కాం అధినేత అనిల్ అంబానీ నిర్ణయించారు. అప్పుల ఊబినుంచి బయటపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గత ఏడాది డిసెంబర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఆదేశాల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో ఆర్కాం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో 5శాతానికి పైగా నష్టపోయింది. -
తమ్ముడు ఆస్తులు కొనుగోలు : రేటింగ్పై ప్రభావమెంత?
తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తుల కొనుగోలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్పై ఏ మాత్రం ప్రభావం చూపదని గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. రూ.25వేల కోట్ల కంటే తక్కువకే జరిగే ఈ డీల్, రిలయన్స్ రేటింగ్ను పెంచదని పేర్కొంది. ఇప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద నగదు, నగదుతో సమానమైనవి రూ.77వేల కోట్ల వరకు ఉన్నాయని, ఈ ఫండ్లను వాడుతూ ఈ కొనుగోలు చేపడుతుందని గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్, వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలాన్ చెప్పారు. ప్రస్తుతం స్టేబుల్ అవుట్లుక్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్ 'బీఏఏ2'గా కొనసాగుతోందని తెలిపారు. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్ రేటింగ్ను గత నవంబర్లో మూడీస్ ఉపసంహరించింది. కంపెనీ డాలర్ బాండ్హోల్డర్స్కు చెల్లింపులు చేయడంలో ఆలస్యం చేసిన కారణంగా రేటింగ్ను ఉపసంహరించినట్టు తెలిపింది. ఆర్కామ్కు చెందిన టవర్లు, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్స్, స్పెక్ట్రమ్, మీడియా కన్వర్జెన్సీ నోడ్స్ వంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ముందుకొచ్చింది. దీని కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.25వేల కోట్ల కంటే తక్కువగానే ఖర్చు చేస్తుందని ఏజెన్సీ అంచనావేస్తోంది. అయితే మున్ముందు కొనుగోళ్లను పెంచితే రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్ కింద కంపెనీ పరిపుష్టిని తగ్గిస్తామని, ముఖ్యంగా టెలికాం వ్యాపారాల్లో తను ప్రణాళిక బద్ధమైన మూలధన ఖర్చులను తగ్గించకపోతే, ఈ చర్యలు చేపడతామని ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. ఆర్కామ్ ఆస్తులను తాము కొనుగోలు చేయబోతున్నామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మార్చి వరకు ఈ డీల్ను ముగించవచ్చని తెలిపింది. ఈ కొనుగోలు, ఆర్కామ్కు చెందిన టెలికాం మౌలిక సదుపాయాల ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోవడానికి సాయపడుతుందని, అయితే ఆర్కామ్ 4జీ స్పెక్ట్రమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రత్యర్థుల చేతుల్లోకి పోదని మూడీస్ తెలిపింది. -
జియోఫైబర్ త్వరలోనే వచ్చేస్తుంది
జియోఫైబర్ వచ్చేస్తోంది.. ఎప్పుడొస్తోంది అంటే ఎవరికీ సరియైన తేదీలు తెలియవు. ప్రస్తుతం రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్కు చెందిన ఆస్తులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉంది. ఈ ఆస్తులు కొనుగోలు అవగానే, జియోఫైబర్ లాంచ్ డేట్ను ప్రకటిస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. జియోకు, ఆర్కామ్కు మధ్య జరుగుతున్న ఈ డీల్లో ఆర్కామ్కు చెందిన 850, 900, 1800, 2100 మెగాహెడ్జ్ బ్యాండ్స్లో 122.4 యూనిట్ల 4జీ ఎయిర్వేవ్స్ను జియో కొనుగోలు చేస్తోంది. 1,78,000 కిలోమీటర్ల ఫైబర్, 43వేల టవర్లు ఈ డీల్లో భాగమే. ఇప్పటికే వైర్లెస్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న జియో, 1,78,000 కిలీమీటర్లకు పైగా ఫైబర్ నెట్వర్క్తో భవిష్యత్తులో మరింత దూసుకెళ్తుందని తెలుస్తోంది. ఫైబర్ నెట్వర్క్ కేవలం ఖరీదైనవి మాత్రమే కాక, ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఫైబర్ నెట్వర్క్ లేకుండా... జియోఫైబర్ 100ఎంబీపీఎస్ స్పీడును ఆఫర్ చేయలేదు. ప్రారంభంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిరూపించుకోవాలంటే, జియో కచ్చితంగా తన ఫైబర్ నెట్వర్క్ను మరింత విస్తరించాల్సిందే. అంతకముందు రిపోర్టుల ప్రకారం జియోకు 3,00,000 కిలోమీటర్ల ఫైబర్ నెట్వర్క్ ఉంది. ఆర్కామ్ ఫైబర్ నెట్వర్క్ను దక్కించుకున్న అనంతరం ఎక్కువ ప్రాంతాల్లో, చాలా వేగవంతంగా దీన్ని లాంచ్ చేయడానికి వీలవుతుందని టెక్ వర్గాలు తెలిపాయి. ఉచితంగా మూడు నెలల ట్రయల్ నేపథ్యంలో జియో ఎంపికచేసిన ప్రాంతాల్లో జియోఫైబర్ను అందుబాటులో ఉంచింది. జియోఫైబర్ ద్వారా కనీసం 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ను వాడుకోవచ్చు. -
ఆర్కామ్–జియో డీల్ బ్యాంకులకు మంచిదే
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), రిలయన్స్ జియో మధ్య కుదిరిన డీల్ ఆహ్వానించదగ్గ పరిణామమని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ‘ఆర్కామ్–జియో డీల్ బ్యాంకులకు ప్రయోజనకరమైనది. పూర్తి రక్షణ లభిస్తుంది. టెలికం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ వీటికి దాదాపు ఎలాంటి నష్టాలు ఉండకపోవచ్చు’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. రుణ ఒత్తిడిలో ఉన్న ఇతర కంపెనీల ప్రమోటర్లకు ఈ డీల్ ఒక మంచి ఉదాహరణలాంటిదని పేర్కొన్నారు. కాగా ఆర్కామ్కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, మీడియా కన్వర్జెన్స్ నోడ్స్ను (ఎంసీఎన్) రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.24,000– 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆర్కామ్కు రూ.45,000 కోట్లమేర రుణాలున్నాయి. ఎస్బీఐ సహా పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి డజనుకుపైగా బ్యాంకులు ఆర్కామ్కు రుణాలిచ్చాయి. -
అన్న చేతికి తమ్ముడు : దూసుకెళ్తున్న రిలయన్స్
ముంబై : రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు భారీగా దూసుకెళ్తున్నాయి. తమ్ముడు అనిల్ అంబానీ చెందిన ఆర్కామ్ వైర్లెస్ ఆస్తులను అన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దక్కించుకోబోతున్నట్టు ప్రకటించగానే, ఆర్కామ్ షేర్లు మరింత దూకుడుగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఆర్కామ్ షేర్లు దాదాపు 35 శాతం పైకి ఎగిశాయి. అంతేకాక గత మూడు వారాల్లో ఆర్కామ్ షేరు 280 శాతం లాభాలు పండించింది. ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా స్వల్పంగా 0.6 శాతం లాభపడ్డాయి. ఇరు కంపెనీలు ఈ డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ డీల్ విలువ రూ.24,000 -25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆస్తుల విక్రయం రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్కామ్కు కొంత ఊరట లభించనుంది. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగు కేటగిరీలు స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్ను (ఎంసీఎన్) ఆర్కామ్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ దక్కించుకోబోతుంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో తెలిపింది. డీల్ ప్రకారం జియో దక్కించుకోబోతున్న ఆర్కామ్ ఆస్తులు 800/900/1800/2100 మెగాహెడ్జ్ బ్యాండ్స్లో 122.4 మెగాహెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్ 43వేలకు పైగా టవర్లు సుమారు 1,78,000 ఆర్కేఎం ఫైబర్ 248 మీడియా కన్వర్జన్స్ నోడ్స్ -
అంబానీ సరికొత్త ప్లాన్స్: ఆర్కాం హై జంప్
సాక్షి, ముంబై: అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీ మీడియా సమావేశం నిర్వహించారు. రుణభారాన్ని తగ్గించుకోవడానికి అనుసరించనున్న ప్రణాళికలు, వ్యూహాలను ఆయన వివరించారు. ఇన్ స్పెక్ట్రమ్, టవర్, రియల్ ఎస్టేట్ ఆస్తుల అమ్మకం ద్వారా మొత్తం అప్పులను రూ.45వేలకోట్లనుంచి రూ.6వేలకోట్ల దిగువకు తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. జనవరి -మార్చి నాటికి అన్ని అప్పులను దశలవారీగా చెల్లిస్తామని వెల్లడించారు. ప్రీ పేమెంట్స్ ద్వారా రూ.25వేల కోట్లను అప్పులను తగ్గించుకోనున్నామని తెలిపారు. ఈ విషయంలో రుణదాతలు, బాండ్ హోల్డర్లు, వాటాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) ప్లాన్స్పై మంగళవారం నిర్వహించిన ఈ సమావేశం నేపథ్యంలో ఆర్కాం షేర్ విలువ 41 శాతానికిపైగా లాభపడింది. కంపెనీ వైర్లెస్ డివిజన్, 39.98 శాతం ఎస్.డి.ఆర్ మెకానిజం నుండి బయటికి వస్తోందని, దీంతో రుణభారాన్ని రూ .25,000కోట్ల మేర తగ్గించుకుంటామని పేర్కొన్నారు. కష్టకాలం ముగిసింది..ఇక ముందున్నదంతా మంచికాలమే అన్ని సంకేతాలివ్వడంతో మిగిలిన అడాగ్ గ్రూపు షేర్లు కూడా ఇదే బాటపట్టాయి. రిలయన్స్ కేపిటల్ 5 శాతం , రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 శాతం రిలయన్స్ పవర్ 3.2 శాతం పుంజుకున్నాయి. -
తమ్ముడు ఆస్తులన్నీ అన్న చేతికి...
ముంబై : నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) ఆస్తులను, అన్న ముఖేష్ అంబానీ కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యారు. ఆర్కామ్ ఆస్తులను రిలయన్స్ జియో కొనుగోలు చేయబోతున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్కామ్ తన అన్ని ఆస్తులను అమ్మేయాలనుకుంటే, వాటిని కొనుగోలు చేసేందుకు రిలయన్స్జియో ముందంజలో ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. దీంతో పలు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఇతర వ్యూహాత్మక పెట్టుబడిదారులు కలత చెందుతున్నట్టు కూడా పేర్కొన్నాయి. నావి ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ(డీఏకేసీ) క్యాంపస్లో విదేశీ రుణదాతలతో కంపెనీ చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలిసింది. రూ.19వేల కోట్ల విలువైన ఆర్కామ్ స్పెక్ట్రమ్ను రిలయన్స్ జియో కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతుందని, అదేవిధంగా ఆర్కామ్ టెలికాం టవర్ పోర్ట్ఫోలియోను దక్కించుకునే చర్చలు తుది దశలో ఉన్నట్టు కూడా సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆర్కామ్కు మొత్తం 43,600 టవర్లున్నాయి. వీటి విలువ రూ.8వేల కోట్ల నుంచి రూ.9వేల కోట్ల వరకు ఉంటుంది. అంతేకాక రూ.1.72 లక్షల కిలోమీటర్ల ఆర్కామ్ దేశీయ ఫైబర్ను కూడా రిలయన్స్జియో కొనుగోలు చేయాలనుకుంటోంది. ఈ విషయంపై ఆర్కామ్, రిలయన్స్ జియో రెండూ కూడా స్పందించలేదు. మరోపక్క రుణదాత సంస్థలు ఆర్కామ్కు ఇచ్చిన రుణాలలో కొంతమేర ఈక్విటీగా మార్పు చేసుకునే అంశంపై ఈ వారంలో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. -
అంబానీకి దెబ్బమీద దెబ్బ
సాక్షి,ముంబయి: అనిల్ ధీరూబాయి అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. భారీ అప్పులతో సంక్షోభంలో పడిపోయిన ఆర్కాంపై చైనా డెవలప్మెంట్ బ్యాంకు (సీడీబీ) కేసు ఫైల్ చేసింది. భారీ రుణాలను చెల్లించడంలో ఆర్కాం విఫలం కావడంతో సీడీబీ ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.11,593 కోట్ల మేర ఇన్ సాల్వెన్సీ కేసు దాఖలు చేసినట్టు బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ఆర్కాంకు నోటీసులు పంపినట్టు తెలిపింది. రిలయన్స్కమ్యూనికేషన్స్కు 1.78 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చిన చైనా డెవలప్మెంట్ బ్యాంక్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబయి బెంచ్ లో దావా వేసింది. ఇప్పటికే రుణ పరిష్కారంపై పనిచేస్తున్న భారతీయ రుణదాతలు తమ పిటిషన్ను వ్యతిరేకించే అవకాశం ఉందని సీడీబీ వర్గాలు అంచనా వేశాయి. ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో ఆర్కాం కౌంటర్ భారీగా నష్టపోయింది. దివాలా నియమావళి (ఐబిసి) ప్రకారం, ఒక సంస్థపై ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేస్తే.. ఆ ఫిర్యాదును కోర్టు సానుకూలంగా స్వీకరిస్తే.. ప్రొఫెషనల్ పరిష్కార కమిటీనీ ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఆర్కాం డైరెక్టర్ల బోర్డును రద్దు చేస్తుంది. అనంతరం ఈ కంపెనీ ఆర్కాం ఆస్తుల వేలానికి పిలుపునిచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలపై ఆర్కామ్ వివరణ ఇచ్చింది. చైనా డెవలప్మెంట్ బ్యాంకు దరఖాస్తు చేసినట్టు ట్రైబ్యునల్ నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొంది. -
‘ఆర్కామ్’పై ఎయిర్టెల్ కన్ను!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఇటీవల వరుస కొనుగోళ్లతో దూసుకుపోతున్న భారతి ఎయిర్టెల్ .. తాజాగా మరో టెల్కో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) స్పెక్ట్రంపై దృష్టి సారించింది. 4జీ సేవలకు ఉపయోగపడే 850 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంతో పాటు ఆర్కామ్కి చెందిన కొన్ని పరికరాలను కూడా కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్కామ్ నుంచి కొంత స్పెక్ట్రం, కొన్ని పరికరాల కొనుగోలుపై తాము ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎయిర్టెల్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో రిలయన్స్ జియోతో ఎయిర్టెల్ పోటీపడనుంది. దాదాపు రూ. 45,000 కోట్ల మేర రుణభారం పేరుకుపోయిన ఆర్కామ్ మొబైల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బకాయిల్లో కొంత మొత్తమైనా రాబట్టుకునేందుకు రుణదాతలు ఆర్కామ్కి చెందిన అసెట్స్ను విక్రయించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్కామ్ టవర్లను కొనుగోలు చేసేందుకు ఇతర టవర్ సంస్థలైన ఇండస్, భారతి ఇన్ఫ్రాటెల్, బ్రూక్ఫీల్డ్ మొదలైనవి పోటీపడుతున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ జోరు.. టెలికం రంగంలో పోటీ తీవ్రమయిన నేపథ్యంలో మరింత స్పెక్ట్రంను చేజిక్కించుకునేందుకు ఎయిర్టెల్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్పెక్ట్రం హోల్డింగ్కి సంబంధించి రిలయన్స్ జియో, త్వరలో విలీనం కాబోయే వొడాఫోన్–ఐడియాలతో దీటుగా నిల్చే దిశగా ఇటీవల కొనుగోళ్ల జోరు పెంచింది. ఈమధ్యే టెలినార్ కార్యకలాపాలను కొనుగోలు చేసిన ఎయిర్టెల్.. అటు టాటా టెలీసర్వీసెస్ మొబైల్ కార్యకలాపాలు కూడా విలీనం చేసుకోనుంది. టెలినార్తో నగదు రహిత లావాదేవీ ద్వారా ఎయిర్టెల్కు అదనంగా 4.4 కోట్ల మంది యూజర్లతో పాటు 1,800 మెగాహెట్జ్ బ్యాండ్లో 43.4 మెగాహెర్జ్ మేర స్పెక్ట్రం కూడా లభించింది. అలాగే నగదు, రుణబదిలీ ప్రసక్తి లేని టాటా టెలీ డీల్ ద్వారా ఎయిర్టెల్కి 19 సర్కిళ్లలో కన్జూమర్ మొబైల్ బిజినెస్ దక్కుతోంది. 4జీకి ప్రధానంగా ఉపయోగపడే 1,800.. 2,100, 850 మెగాహెట్జ్ బ్యాండ్స్లో స్పెక్ట్రం కూడా లభిస్తోంది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్సెల్ నుంచి 8 సర్కిళ్లలో 2,300 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసేందుకు కూడా గతేడాదే డీల్ కుదుర్చుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో టికోనా డిజిటల్ కొనుగోలు ద్వారా ఆ సంస్థకి 5 సర్కిళ్లలో ఉన్న 4జీ స్పెక్ట్రం కూడా ఎయిర్టెల్ దక్కించుకుంది. మిగిలేది మూడు కంపెనీలే: సునీల్ మిట్టల్ మరో ఏడాది, రెండేళ్లలో టెలికం రంగంలో మూడే సంస్థలు మిగులుతాయని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. టెలికంలో సంక్షోభం ఇంకా ఎన్నాళ్లు కొనసాగవచ్చన్న ప్రశ్నకు.. ‘‘కొత్తగా వచ్చిన ఆపరేటరు సయోధ్య సంకేతాలిచ్చేదాకా ఇది కొనసాగుతుంది. అదంతా ఆయనపైనే ఆధారపడి ఉంది. ఆయనకు ఆర్థిక బలం ఉంది... కానీ నంబర్ వన్ స్థానంలోనే ఉండాలని మేమూ కృతనిశ్చయంతో ఉన్నాం. బహుశా 2018 మార్చి లేదా 2019 మార్చి నాటికి.. టెలికం రంగం మూడు సంస్థలకు పరిమితం కావొచ్చు’’ అని సునీల్ పేర్కొన్నారు. ఇక టాటా టెలీ, టెలినార్ కార్యకలాపాల కొనుగోలుతో వాటి మార్కెట్ వాటాలో తమకు సగభాగం దక్కినట్లు అనుకున్నా కూడా.. తమ నంబర్ వన్ హోదా పదిలంగానే ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఐడియా–వొడాఫోన్ డీల్తో ఎయిర్టెల్ అగ్రస్థానం కోల్పోయే అవకాశాలు లేవన్నారు. 4జీ పైనా, ఎయిర్టెల్ బ్యాంక్, మ్యూజిక్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు తమకు తోడ్పడగలవని తెలిపారు. మార్జిన్లు, ఆదాయాలు తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తాము ఎంతో కొంత వృద్ధి సాధిస్తూనే ఉన్నామన్నారు. ఆర్కామ్ కస్టమర్లలో 45% యూజర్లు ఎయిర్టెల్కి మారుతున్నారని చెప్పారు. -
ఆర్కామ్ స్పెక్ట్రమ్పై టెలికాం దిగ్గజం కన్ను
వరుస కొనుగోళ్లతో జోరు మీదున్న టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, మరో టెలికాం సంస్థపై కన్నేసింది. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్కు చెందిన ఎంపికచేసిన స్పెక్ట్రమ్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రూ.45వేల కోట్ల రుణంతో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఆర్కామ్, ప్రస్తుతం తన ఆస్తుల అమ్మకానికి చర్యలు చేపడుతోంది. ఆర్కామ్ ఆస్తులను కొనుగోలు చేసేందకు ఆసక్తితో ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆ కంపెనీకి చెందిన ఎంపికచేసిన స్పెక్ట్రమ్, కొన్ని పరికరాలను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఎయిర్టెల్ అధికారి ప్రతినిధి చెప్పారు. రిపోర్టుల ప్రకారం ఎయిర్టెల్ ఎక్కువగా 850 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్పై రిలయన్స్ జియోకు పోటీ ఇవ్వాలనుకుంటుంది.. ఇతర కంపెనీలు ఇండస్, భారతీ ఇన్ఫ్రాటెల్, బ్రూక్ఫీల్డ్లు కూడా ఆర్కామ్ టవర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా సెల్యులార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎయిర్టెల్ తన స్పెక్ట్రమ్ హోల్డింగ్స్ను పెంచుకుంటోంది. ఈ క్రమంలో నష్టాలతో ఉన్న కంపెనీల ఆస్తులను కొనుగోలు చేస్తోంది. ఇటీవల ఎయిర్టెల్ చేసిన కొనుగోళ్లలో టెలినార్ ఇండియా, ఎయిర్సెల్ 4జీ స్పెక్ట్రమ్, టికోనా, టాటా టెలిసర్వీసులున్నాయి. -
ఆర్కాంకు భారీ ఉపశమనం
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకోవడం, టవర్ బిజినెస్ విక్రయం తదితర పరిణామాలతో ఇటీవల భారీగా పతనమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) గత రెండు రోజులుగా లాభాలను నమోదు చేస్తోంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్కాంకు రుణ ఉపశమనం లభించనుండటంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మంగళవారం దాదాపు 12శాతానికిపైగా లాభపడిన ఆర్ కాం కౌంటర్ నేడు 5శాతం లాభాలతో కొనసాగుతోంది. ఢిల్లీ, చెన్నైలలో ఆర్కామ్కు గల ఆస్తుల విక్రయానికి రుణదాతలు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ కంపెనీ ఈ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించేందుకు అనిమితినిచ్చిందని రిపోర్టులు వెలువెడ్డాయి. దీంతో రూ. 801 కోట్లవరకూ సమకూర్చుకోనుంది. ఈ నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు అంచనా. దీంతో ఇప్పటికే భారీ రుణాలు, నష్టాలతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ టెలికం సంస్థ ఆర్కామ్కు ఇది కొంతమేర రిలీఫ్నిచ్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
అంబానీకి మూడీస్ షాక్
ముంబై : రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీకి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ షాకిచ్చింది. రిలయన్స్ కమ్యూనికేషన్ క్రెడిట్ రేటింగ్ను విత్డ్రా చేసుకుంటున్నట్టు మూడీస్ శుక్రవారం ప్రకటించింది. తన బాండ్లపై వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ఈ టెలికాం ఆపరేటర్ డిఫాల్ట్ అయిందనే కారణంతో మూడీస్ క్రెడిట్ రేటింగ్ను విత్డ్రా చేసింది. ''రిలయన్స్ కమ్యూనికేషన్స్ కా కార్పొరేట్ రేటింగ్ను విత్డ్రా చేస్తున్నాం. ఇది ప్రస్తుతం నెగిటివ్ అవుట్లుక్లో ఉంది. అదేవిధంగా ఆర్కామ్ సీనియర్ సెక్యుర్డ్ నోట్స్ కా రేటింగ్ను విత్డ్రా చేస్తున్నాం'' అని మూడీస్ ప్రకటించింది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ వరుసగా నాలుగో క్వార్టర్లోనూ భారీ నష్టాలను నమోదుచేసింది. కొన్ని డెబెంచర్లపై ఈ సంస్థ వడ్డీలు చెల్లించలేకపోతుంది. నిర్దారించిన సమయానికి వడ్డీలను చెల్లించకలేకపోవడంతో రేటింగ్స్ను ఉపసంహరిస్తున్నట్టు మూడీస్ తెలిపింది. సరియైన సమయంలో వడ్డీలు చెల్లించకపోవడాన్ని మూడీస్ అర్థంలో డిఫాల్ట్గా పరిగణనలోకి తీసుకుంటామని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. మార్చి ముగింపు వరకు ఆర్కామ్ నికర అప్పు రూ. 44,300 కోట్లు ఉంది. తన అన్న ముఖేష్ అంబానీ, రిలయన్స్ జియో పేరుతో టెలికాం మార్కెట్లోకి ప్రవేశించడంతో ఆర్కామ్కు ఈ పరిస్థితి ఎదురైంది. జియో నుంచి వస్తున్న తీవ్రమైన ధరల యుద్ధాన్ని ఈ సంస్థ తట్టుకోలేకపోతుంది. -
చేసేదేమీ లేక మూసేస్తున్న ఎయిర్సెల్
ముంబై : రిలయన్స్ కమ్యూనికేషన్తో డీల్ రద్దై పోయింది. ఇంక చేసేదేమీ లేక, మెల్లమెల్లగా ఎయిర్సెల్ తన భారత ఆపరేషన్ల నుంచి వైదొలగాలని చూస్తోంది. ఫండ్స్ లోటు, ఎక్కువ రుణాల నేపథ్యంలో ఎయిర్సెల్ తన ఆపరేషన్లను మూసి వేయాలని చూస్తోంది. రిలయన్స్ కమ్యూనికేషన్తో విలీన డీల్ రద్దు అయిన తర్వాత ఎయిర్సెల్ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తాను కలిగి ఉన్న స్పెక్ట్రమ్ను మినహాయించి ఎయిర్సెల్ ఓ ఒప్పందాన్ని రూపొందించుకోవాలని చూస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్లో కంపెనీ తన వైర్లెస్ ఆస్తులను విక్రయించేయాలని చూస్తున్నట్టు తెలిసింది. అంతేకాక 89 మిలియన్ సబ్స్క్రైబర్లను కూడా దేశీయ అతిపెద్ద టెలికాం ప్లేయర్కు తరలించనుందట. తన 40వేల టవర్లను ఓ ప్రత్యేక సంస్థకు విక్రయించేయాలని చూస్తున్నట్టు విశ్లేషకులు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ రుణం రూ.20వేల కోట్లు ఉంది. ఈ రుణాన్ని తగ్గించుకోవడం కోసం ఎయిర్సెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీకి కేవలం 2జీ, 3జీ స్పెక్ట్రమ్లు మాత్రమే ఉన్నాయి. 4జీ స్పెక్ట్రమ్ను లేదు. 17 సర్కిళ్లలో ఎయిర్సెల్ తన కార్యకలాపాలు సాగిస్తుండగా.. దానిలో 13 సర్కిళ్లు 3జీకి సంబంధించినవి. కంపెనీ ఎక్కువ రెవెన్యూలను తమిళనాడు నుంచి ఆర్జిస్తోంది. అంతకముందు ఎయిర్సెల్ తన 2జీ, 3జీ స్పెక్ట్రమ్ను విక్రయించాలని చూడగా.. వాటిని విక్రయించకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. -
బిగ్ టీవీని విక్రయించిన ఆర్కామ్
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) సోమవారం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) సర్వీసుల రంగంలో ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమించిన సంస్థగా పేరొందిన బిగ్ టీవీ విక్రయాన్ని కూడా ఆర్ కాం పూర్తి చేసింది. నష్టాలను తగ్గించుకునే పనిలో ఇప్పటికే 2,3జీ సేవలకు గుడ్ బై చెప్పిన ఆర్కాం బిగ్ టీవీని అమ్మేసింది. తన ప్రత్యక్ష-హోం (డిటిహెచ్) అనుబంధ సంస్థ రిలయన్స్ బిగ్ టీవీని వీకాన్ మీడియాకు విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వీకాన్ మీడియా అండ్ టెలివిజన్ లిమిటెడ్ (VMTL)తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. రిలయన్స్ బిగ్ టీవీలోని మొత్తం వాటా వీకాన్ సొంతమవుతుందని వెల్లడించింది. అన్ని వర్తక బాధ్యతలతో పాటు కాంట్రాక్ట్ రుణాలు కూడా కొనుగోలు సంస్థకే చెందుతాయని ఆర్కాం ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ బిగ్ టీవీ మొత్తం వాటాతో పాటు, దాదాపు 500 మంది ఉద్యోగులను కూడా వీకాన్ సొంతం చేసుకుటుందని భరోసా ఇచ్చింది. ఈ ఒప్పందం మార్కెట్ రెగ్యులేటరీ సంస్థలు, ఆర్కామ్ లెండర్లు, ఇతర సంబంధిత సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని చెప్పింది. అవసరమైన బ్యాంకు హామీలను సమర్పించిన తరువాత ప్రస్తుత డీటీహెచ్ లైసెన్స్ సమాచార మరియు బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా పునరుద్ధరించబడుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. 1.2 మిలియన్ల కస్టమర్ల బిగ్ టీవీ సేవలను వినియోగదారులు నిరంతరాయంగా సేవలను పొందుతారనీమ వివరించింది. ఈ విక్రయం ద్వారా వచ్చే నిధుల ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోనున్నట్టు తెలిపింది. అలాగే కంపెనీ రుణదాతలు, వాటాదారులతో సహా షేర్ హోల్డర్స్ అందరికి లబ్ది చేకూరుతుందని చెప్పింది. మరోవైపు ఈ వార్తలతో ఆర్కాం ఇవాల్టి మార్కెట్లో 6శాతానికిపైగా నష్టపోయింది. -
ఆర్కామ్ యూజర్లకు బ్యాడ్న్యూస్
న్యూఢిల్లీ : నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టెలికాం ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్ తన వాయిస్ కాల్ సర్వీసులను మూసివేస్తోంది. డిసెంబర్ 1 నుంచి తమ ఈ సర్వీసులను క్లోజ్ చేస్తున్నట్టు ఆర్కామ్ పేర్కొంది. తమ కస్టమర్లను ఈ ఏడాది చివరి నుంచి ఇతర నెట్వర్క్లకు తరలించనున్నట్టు కూడా వెల్లడించింది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఆదేశాల మేరకు ఆర్కామ్ ఈ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ కేవలం 4జీ డేటా సర్వీసులను మాత్రమే తన కస్టమర్లు అందించనుందని, తన సబ్స్క్రైబర్లకు ప్రస్తుతం అందిస్తున్న వాయిస్ సర్వీసులను 2017 డిసెంబర్ 1 నుంచి మూసివేస్తున్నట్టు ట్రాయ్ అన్ని టెలికాం ఆపరేటర్లకు చెప్పింది. ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, యూపీ ఈస్ట్, వెస్ట్, తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి ఎనిమిది టెలికాం సర్కిళ్లలో 2జీ, 4జీ సర్వీసులను అందించనున్నట్టు ఆర్కామ్, ట్రాయ్కు తెలిపింది. సిస్టెమా శ్యామ్ టెలిసర్వీసెస్లో విలీనమైన తర్వాత సీడీఎంఏ నెట్వర్క్ను అప్గ్రేట్ చేస్తామని, ఢిల్లీ, రాజస్తాన్, యూపీ వెస్ట్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కోల్కత్తాలకు 4జీ సర్వీసులను అందించనున్నట్టు అనిల్ అంబానీకి చెందిన ఈ సంస్థ తెలిపింది. అయితే సబ్స్క్రైబర్లు పెట్టుకునే ఎలాంటి పోర్టింగ్ అభ్యర్థనను కూడా సంస్థ నిరాకరించరాదని రెగ్యులేటరీ, ఆర్కామ్ను ఆదేశించింది. వాయిస్ సర్వీసులను మూసివేయాలని నిర్ణయించిన ఈ సంస్థ రూ.46వేల కోట్ల రుణాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎయిర్సెల్ విలీన ఒప్పందం బెడసికొట్టడంతో, తన వైర్లెస్ సర్వీసులను మూసివేసేందుకు సిద్ధమైంది. -
ఆర్కామ్–సిస్టెమా డీల్కు డాట్ అంగీకారం
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్తో (ఆర్కామ్) సిస్టెమా శ్యామ్(ఎస్ఎస్టీఎల్) విలీనానికి టెలికం విభాగం (డాట్) తాజాగా ఆమోద ముద్ర వేసింది. సిస్టెమా శ్యామ్ వైర్లెస్ వ్యాపార విలీనానికి డాట్ అంగీకారం లభించినట్లు ఆర్కామ్ తెలిపింది. అక్టోబర్ 20న ఈ డీల్కు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. విలీన ఒప్పందం ప్రకారం.. ఎస్ఎస్టీఎల్కు సంబంధించిన వైర్లెస్ బిజినెస్ అసెట్స్ అన్నీ ఆర్కామ్ పరిధిలోకి వస్తాయి. విలీనానం తరం ఆర్కామ్లో సిస్టెమాకు 10 శాతం వాటా వస్తుంది. ఎయిర్సెల్ డీల్ అటకెక్కిన నేపథ్యంలో సిస్టెమా శ్యామ్ విలీన ఒప్పందానికి డాట్ ఆమోదం లభించడం ఆర్కామ్కు కొంత ఊరటనిచ్చే అంశం. డీల్కు సంబంధించిన లావాదేవీలు నవంబర్ తొలివారానికల్లా పూర్తి కావొచ్చని ఆర్కామ్ అంచనా వేస్తోంది. -
టెలికంలో రాంగ్ సిగ్నల్స్..!
సాక్షి, బిజినెస్ విభాగం: లాభాలొస్తాయి.. సంపాదించుకోవచ్చు కదా అని ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే..!! లాభాల సంగతేమో కానీ.. టెలికం కంపెనీలకు పెట్టుబడే పోయేట్లుంది!!. ఒకటి కాదు... రెండు కాదు... దేశీ టెలికంలోకి ప్రవేశించిన విదేశీ కంపెనీలు చాలావరకూ చాప చుట్టేస్తున్నాయి. వాటి కార్యకలాపాలకు మంగళం పాడేసి ఇంటికెళ్లిపోతున్నాయి. కొన్నాళ్లుగా టెలికం పరిశ్రమలో జరుగుతున్న విలీనాలు గమనిస్తే ఈ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఏదో నాలుగు రాళ్లు వెనకేసుకుందామని వచ్చిన విదేశీ సంస్థలు.. ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్లపై గట్టిగా ఎలాంటి ప్రతిఫలం పొందలేదు. చేతులు కాలి... పెట్టిన పెట్టుబడులను సైతం వదులుకోవాల్సిన పరిస్థితి. రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్, నార్వేకు చెందిన టెలినార్, మలేసియాకు చెందిన మాక్సిస్, జపాన్కు చెందిన ఎన్టీటీ డొకొమో వంటి కంపెనీలు టెలికంలోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నాయి. రూ.23,000 కోట్లకు రూ.420 కోట్లు.. రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ కంపెనీ ఎంటీఎస్ బ్రాండ్తో 2010లో భారత్లో సీడీఎంఏ (కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్) సర్వీసులను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటుకు దాదాపు రూ.22,750 కోట్లు (3.5 బిలియన్ డాలర్లు) ఖర్చుపెట్టింది. తగిన కస్టమర్లు రాక... ఆశించిన వ్యాపారం జరక్క... ఇప్పుడిది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్లో (ఆర్కామ్) విలీనం అవుతోంది. చాలావరకూ అనుమతులు ఇప్పటికే వచ్చాయి కూడా. దీని ప్రకారం.. 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్తో సహా సిస్టెమా కార్యకలాపాలన్నీ ఆర్కామ్ చేతికి వెళ్తాయి. విలీనాంతరం సిస్టెమాకు ఆర్కామ్లో 10 శాతం వాటా వస్తుంది. ప్రస్తుత ఆర్కామ్ మార్కెట్ క్యాప్ ఆధారంగా చూస్తే ఈ వాటా విలువ కేవలం రూ.420 కోట్లు. టెలినార్కు మిగిలిందేమీ లేదు.. నార్వేకు చెందిన టెలినార్ (ఒకప్పుడు యూనినార్) కూడా భారత్లో తన ఇన్వెస్ట్మెంట్లను కోల్పొయింది. ఇది తన ఇండియాలో దాదాపు రూ.19,515 కోట్లు (3 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసింది. భాగస్వామి యూనినార్ చేతులెత్తేయటంతో కొన్నాళ్లు సొంతగానే వ్యాపారం చేసింది. చివరికిది తన వ్యాపారాన్ని ఎయిర్టెల్కు విక్రయించింది. ఈ డీల్ ఇటీవలే పూర్తయ్యింది. ఇక్కడ టెలినార్కు ఎయిర్టెల్ నుంచి ఎలాంటి నగదు లభించలేదు. అయితే ఎయిర్టెల్.. టెలినార్కు చెందిన రూ.1,650 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లించడానికి అంగీకరించింది. టెలినార్ తన రుణ బాకాయిలను చెల్లించనుంది. వొడాఫోన్ కష్టాలు.. యూకేకు చెందిన వొడాఫోన్కు కూడా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. దీనికి ఐడియా సెల్యులర్కి మధ్య విలీనం ఒప్పందం కుదిరింది. విలీనాంతం ఏర్పడే కంపెనీ భారత్లోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవిస్తుంది. నిజానికి వొడాఫోన్ పదేళ్ల క్రితం హచిసన్–ఎస్సార్ వాటా కొనుగోలుకు 10.9 బి. డాలర్లను వెచ్చించింది. ప్రస్తుత ఫారెక్స్ రేట్ల ప్రకారం దీని విలువ రూ.71,000 కోట్లు. 2007 నాటి ఫారెక్స్ రేట్ల ప్రకారం చూసినా ఇది రూ.47,000 కోట్లు. వొడాఫోన్ భారత్లో మొత్తంగా రూ.1,50,000 కోట్లు వెచ్చించినట్లు అంచనా. ఇక 2016లో మళ్లీ కొత్తగా రూ.47,700 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇటీవల ఐడియాతో విలీనం సందర్భంగా వొడాఫోన్ ఎంటర్ప్రైజ్ విలువను దాదాపు రూ.82,800 కోట్లుగా లెక్కించారు. అంటే లక్ష కోట్లకుపైగా గాల్లో కలిసిపోయాయన్న మాట!!. దిక్కు తోచని మాక్సిస్.. మాలేసియా కంపెనీ మాక్సిస్ మాత్రం ఇపుడు ఆయోమయంలో ఉంది. దీనికి ఎయిర్సెల్లో 74 శాతం వాటా ఉంది. భారత్లో ఇది ఇప్పటిదాకా దాదాపు రూ.47,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ సంస్థ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం 2017 క్యూ1లో ఏకంగా 32 శాతానికి పైగానే తగ్గింది. దీనికి కారణం జియో. దీంతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఆర్కామ్తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ ఒప్పందం రద్దయ్యింది. దీంతో మరిన్ని నిధుల కోసం ప్రయత్నిస్తోంది. కాగా రుణ భారాన్ని తగ్గించుకోవడానికి గతేడాది ఎయిర్టెల్తో స్పెక్ట్రమ్ డీల్ కుదుర్చుకుంది. దీని ద్వారా రూ.3,500 కోట్లు పొందింది. అయినా కూడా ఎయిర్సెల్కు రూ.15,500 కోట్లకుపైగా రుణ భారం ఉంది. డొకొమోకు 1.3 బిలియన్ డాలర్లు నష్టం!! టాటా డొకొమో గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. టాటా సన్స్, జపాన్కు చెందిన ఎన్టీటీ డొకొమో కలిసి 2008లో టాటా డొకొమో వెంచర్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చౌక ధరలకే డేటా, కాలింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఈ కంపెనీ.. స్వల్ప కాలంలోనే అధిక యూజర్లకు చేరువైంది. కానీ తర్వాత నెట్వర్క్ కవరేజ్ లోపాలు, ఇష్టానుసార డిడక్షన్లు వల్ల డొకొమోపై ప్రతికూల ప్రభావం పడింది. జియో రాకతో పరిస్థితి మరింత దారణంగా మారింది. చేసేదేమీలేక ఎన్టీటీ డొకొమో తన వాటాను టాటా సన్స్కు విక్రయించింది. ఈ వెంచర్లో ఎన్టీటీ డొకొమోకు 1.3 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇక టాటా టెలీ మొబైల్ వ్యాపారాన్ని దాదాపు ఉచితంగా ఎయిర్టెల్కు ఇచ్చేసేందుకు ఇటీవలే టాటాలు డీల్ కుదుర్చుకోవడం టెలికం సమస్యలకు అద్దంపడుతోంది. 4.5 లక్షల కోట్ల రుణ భారం విదేశీ సంస్థలే కాదు. దేశీ టెలికం రంగం పరిస్థితులు కూడా అంత ఆశాజనంగా ఏమీ లేవు. టెలికం పరిశ్రమ రుణ భారం 4.5 లక్షల కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే మూలధనంపై రాబడి 1 శాతంగా ఉంది. కంపెనీలు వాటి డబ్బుల్ని భారత టెలికం రంగంలో ఇన్వెస్ట్ చేయడం కన్నా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం ఉత్తమనేది మార్కెట్ విశ్లేషకుల మాట!!. -
ఆఫర్ అదుర్స్ : రూ.70కే ఏడాదంతా అపరిమిత డేటా
రిలయన్స్ జియో ఎప్పుడైతే టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిందో ఇక అప్పటి నుంచి కస్టమర్లకు డేటా పండుగ ప్రారంభమైంది. జియో దెబ్బకు కంపెనీలన్నీ వరుస పెట్టి డేటా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నుంచి వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్సెల్, ఆర్కామ్ వరకు అన్నీ డేటా ఆఫర్లతో అదరగొడుతున్నాయి. తాజాగా ఇండిపెండెన్స్ డేకి ముందస్తుగా రిలయన్స్ మొబైల్ 'డేటా కీ ఆజాదీ' ఆఫర్ను ప్రకటించింది. ఈ ప్లాన్ కింద 70 రూపాయలకే ఏడాదంతా అపరిమిత 2జీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు 56 రూపాయల టాక్ టైమ్ను అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 14 నుంచి ఆగస్టు 16 మధ్యలోనే ఉంటుంది. రిలయన్స్ డేటా కీ ఆజాదీతో 70 రూపాయలకే ఏడాది పాటు అపరిమిత 2జీ డేటాను పొందుతూ, ఫ్రీడంతో ఆనందం వ్యక్తంచేయడంటూ రిలయన్స్ మొబైల్ సోమవారం ఓ ట్వీట్ చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఆఫర్ను అందిస్తున్నట్టు తన యాడ్లో పేర్కొంది. మరోవైపు జియోకి పోటీగా 4 రోజుల క్రితమే రూ.299 నెలవారీ రెంటల్ ప్లాన్ను ఆర్కామ్ ప్రకటించింది. దీని కింద అపరిమిత కాల్స్, టెక్ట్స్, డేటాను అందించనున్నట్టు పేర్కొంది. కాగ, జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఆర్కామ్ భారీగా రూ.1,210 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాలను మూటగట్టుకుంది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్కామ్ ఈ నష్టాలను ప్రకటించడం ఇది మూడోసారి. Freedom to express the joy of sharing with Reliance’s Data Ki Azadi at Rs.70 unlimited 2G Data for 1 year. Buy- https://t.co/fFeoVHe5FO pic.twitter.com/PSLZ8rIsGl — Reliance Mobile (@RelianceMobile) August 14, 2017 -
అన్న ఎఫెక్ట్: ఆర్కాం సరికొత్త ఆఫర్
రిలయన్స్ జియో ఎఫెక్ట్తో టెలికాం కంపెనీలన్నీ రోజుకో కొత్త ఆఫర్ను ప్రకటిస్తున్నాయి. జియోకు కౌంటర్గా కంపెనీలు తమ ప్లాన్లను మార్కెట్లోకి ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా అన్న ముఖేష్ అంబానీకి కౌంటర్గా తమ్ముడు అనిల్ అంబానీ కంపెనీ ఆర్కామ్ కూడా సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. కొత్తగా రూ.299 రెంటల్ ప్లాన్ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, టెక్ట్స్, డేటాను తమ సబ్స్క్రైబర్లకు అందించనున్నట్టు ఆర్కామ్ పేర్కొంది. '' రిలయన్స్ మొబైల్ ఇప్పటివరకు అత్యంత చౌకైన రేట్లను ప్రవేశపెట్టింది. 299 రూపాయలతో నెలవారీ రెంటల్ ప్లాన్ను ప్రారంభింస్తోంది'' అని ఆర్కామ్ ట్వీట్ చేసింది. అయితే దీనికి సంబంధించి మిగతా ఏ వివరాలను ఆర్కామ్ పేర్కొనలేదు. కేవలం ఒక్క ట్వీట్ మాత్రమే చేసింది. గతవారమే ఆర్కామ్ ఏడాది మొత్తానికి సరిపడా ఓ సరికొత్త ప్లాన్ను ఆవిష్కరించింది. ఆ కొత్త ఆఫర్ను రూ.5199కి లాంచ్ చేసింది. దాని కింద యూజర్లు ఏడాదంతా రోజుకు 1జీబీ 4బీ డేటాను వాడుకోవచ్చు. అదనంగా రూ.3,200 విలువైన వైఫై డోంగల్ ''వైఫ్-పాడ్'' ను కస్టమర్లు ఉచితంగా పొందనున్నారు. దీనికి కూడా 365 రోజుల వాలిడిటీని కంపెనీ అందిస్తోంది. Reliance Mobile introduces the lowest rates ever! Starting at Rs. 299 monthly rental. Buy here: https://t.co/fFeoVGWuOg pic.twitter.com/jX2nCIXJOe — Reliance Mobile (@RelianceMobile) August 9, 2017 -
అంబానీ బ్రదర్స్ మధ్య జియో చిచ్చు
న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లో ప్రకంపనలు రేపిన జియో అంబానీ బ్రదర్స్ మధ్య చిచ్చు పెట్టింది. జియో పై ఆర్కాం సంచలన ఆరోపణలు గుప్పింది. ముకేష్ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ల వల్లే పరిశ్రమ తీవ్ర నష్టాలపాలైందని, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆరోపించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు, మార్కెట్ షేర్ పెంచుకునేందుకు జియో అనుసరించిన విధానాలపై సంచలన ఆరోపణలు చేసింది. దేశీయ టెలికాం కంపెనీల నష్టాలకు జియో అనుసరించిన ఫ్రీ ఆఫర్లు కొంతమేరకు ప్రభావం చూపించాయంటూ ఆర్కాం రెగ్యులేటరీ ఫైలింగ్లో ఆరోపించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ఆర్కాం జియోపై పలు ఆరోపణలు గుప్పించింది. మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో కారణంగానే టెలికాం కంపెనీలో భారీగా నష్టపోయాయని ఆర్కాం ఆరోపించింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా టెలికాం ఆపరేటర్ల అప్పులు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ మించిపోయిందని పేర్కొంది. రుణ పెరుగుదల, రాబడి క్షీణించడం ఫలితంగా, టెలికాం కంపెనీల రుణ సేవల సామర్థ్యాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని తెలిపింది. -
గట్టెక్కడానికి ఆర్కామ్ మరో ప్లాన్
న్యూఢిల్లీ: అన్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో దెబ్బకు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంక్షోభంలో ఉన్న ఆర్కాం, ఢిల్లీలోని తన కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 3.18 లక్షల చదరపు అడుగుల గల ఈ ఆఫీసును ఆర్కామ్ అమ్ముతున్నట్టు వార్తలొస్తున్నాయి. ముంబై, ఢిల్లీలోని క్యాంపస్ లను విక్రయించి, రుణాలు తిరిగి చెల్లించాలని ఆర్కామ్ అంతకముందే భావించింది. వీటి విలువను కూడా లెక్కగట్టే ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం ఢిల్లీలోని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో ఇటీవలే రిలయన్స్ గ్రూప్ అధినేతగా ఉన్న అనిల్ అంబానీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి దాకా ఎలాంటి వేతనం తీసుకోకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో నిర్ణయం ఆర్కామ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాక గుదిబండలా మారిన ఈ అప్పుల నుంచి గట్టెక్కడానికి ఆర్కామ్ కు బ్యాంకులు డిసెంబర్ దాకా సమయమిచ్చినట్టు ఈ నెల మొదట్లో జరిగిన మీడియా సమావేశంలో అనిల్ అంబానీ చెప్పారు. రుణాన్ని తగ్గించుకునే ప్రణాళికలను బ్యాంకర్లు ఆమోదించారని కూడా చెప్పారు. ఎయిర్ సెల్ విలీనం, బ్రూక్ ఫీల్డ్ కు టవర్ ఆస్తుల విక్రయం ద్వారా 60 శాతం తగ్గిస్తామని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ తెలిపారు. కాగ, దాదాపు రూ.45 వేల కోట్ల రూపాయలను ఆర్కామ్ లెండర్లకు బాకీ పడింది. -
జియోకు పోటీ : ప్లాన్స్ పై ఆర్కామ్ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : అన్న ముఖేష్ అంబానీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు తమ్ముడు అనిల్ అంబానీ టెలికాం రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్) భారీగా అప్పులో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నష్టాల్లోంచి బయటపడటానికి ఓ వైపు నుంచి వ్యూహాత్మక ప్లాన్స్ అమలు చేస్తూనే.. మరోవైపు నుంచి కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్కామ్ తమ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ పై ఏడాది పాటు డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఎంపికచేసిన పోస్టు పెయిడ్ ప్లాన్స్ పై 28 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ కొత్త ఆర్కామ్ ప్లాన్స్ ఢిల్లీ, ముంబై, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లోని 4జీ యూజర్లకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త ఆఫర్స్ తో 1జీబీ 4జీ డేటా అతి తక్కువకు రూ.11.1కే అందుబాటులోకి రానుంది. ఈ డిస్కౌంటెడ్ ఆర్కామ్ ప్లాన్స్ కూడా ఎవరైతే కంపెనీ పోర్టల్ rcom-eshop.com ద్వారా సబ్ స్క్రైబ్ అవుతారో వారికి మాత్రమేనని తెలిపింది. ఎంపికచేసిన నెలవారీ ప్లాన్స్ లో ఈ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్ తర్వాత నెలవారీ ప్లాన్స్ రూ.333, రూ.499కు అందుబాటులోకి వచ్చాయి. సబ్ స్క్రైబర్ కు ఈ డిస్కౌంటెడ్ ధరలు 12 నెలల పాటు ఆఫర్ చేయనున్నామని, డిస్కౌంట్ విలువ ఏడాదికి రూ.2400గా కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో రూ.509 ప్లాన్ కు పోటీగా రూ.499 ప్లాన్ ను ఆర్కామ్ ఆఫర్ చేస్తోంది. దీనికింద 30జీబీ 3జీ,4జీ,2జీ డేటా, హోమ్ సర్కిల్ లో అపరిమిత వాయిస్ కాల్స్, 3000 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ అందుబాటులో ఉంటున్నాయి. రూ.333 ప్లాన్ ను జియో రూ.309 ప్యాక్ కు పోటీగా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో కూడా 30జీబీ 4జీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత ఇన్ కమింగ్ రోమింగ్ కాల్స్, 1000 అవుట్ గోయింగ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ ను ఆఫర్ చేస్తోంది. అవుట్ గోయింగ్ కాల్స్ పరిమితి దాటితే నిమిషానికి 50 పైసలు వసూలు చేయనుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లతో తన నెట్ వర్క్ లోకి కొత్త సబ్ స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఆర్కామ్ ప్రయత్నిస్తోంది. వొడాఫోన్, ఎయిర్ టెల్, జియోల నుంచి వచ్చే పోటీని కూడా అధిగమించాలని చూస్తోంది. -
ఆర్కామ్లో వేతనం వద్దనుకున్న అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అధినేతగా ఉన్న అనిల్ అంబానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నుంచి ఏ విధమైన వేతనం గానీ, కమిషన్ గానీ తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. అలాగే కంపెనీలోని టాప్ మేనేజ్మెంట్ సైతం తమ వ్యక్తిగత చెల్లింపులను 21 రోజలు పాటు ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ వాయిదా వేసుకుంటూ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ‘‘రిలయన్స్ అనిల్ దీరూభాయి అంబానీ గ్రూపు చైర్మన్ అయిన అనిల్ అంబానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేతనం, కమిషన్ తీసుకోరాదని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్కామ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.45,000 కోట్ల మేర ఆర్కామ్ బకాయిలు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేటింగ్ సంస్థలు ఆర్కామ్ పరపతి రేటింగ్ను తగ్గించాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి రూ.25,000 కోట్ల బకాయిలు తీర్చేస్తామని అనిల్ అంబానీ ఆయా సంస్థలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
అనిల్ అంబానీ సంచలన నిర్ణయం
ముంబై: రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ ధీరూబాయ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి ఎలాంటి వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకన్నారు. అప్పల ఊబిలో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న ఆర్కామ్ను అదుకునేందుకు ఈ చర్యకు దిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి జీతం లేదా కమిషన్ గానీ స్వీకరించకూడదని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారని సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వ్యూహాత్మక పరివర్తన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ల బాధ్యతతో పాటు, ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో ఆర్కాం మేనేజ్మెంట్ కూడా ముందుకు సాగుతుందని తెలిపింది. సంస్థ బోర్డు సభ్యులు కూడా 21 రోజుల వేతనం వదులుకోవాలని నిర్ణయించారు. డిశెంబర్ 2017 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. -
మరోసారి కుప్పకూలిన ఆర్ కామ్
రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు మరో సారి కుప్పకూలాయి. రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, మూడీస్ మంగళవారం మళ్లీ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను తగ్గించడంతో బుధవారం కంపెనీ షేర్లకు భారీగా దెబ్బకొట్టింది. నేటి ట్రేడింగ్ లో 4 శాతం పైగా పడిపోయిన ఆర్ కామ్ షేర్లు, కనిష్టంగా రూ.19 వద్ద నమోదయ్యాయి. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో కంపెనీ రూ.948 కోట్ల నష్టాలను ప్రకటించిన దగ్గర్నుంచి ఆర్ కామ్ 24 శాతం మేర పడిపోయింది. అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు ఆర్ కామ్ కోలుకోలేని నష్టాలను ఎదుర్కొంటోంది. ముందటి ఆర్థిక సంవత్సరంలో 79 కోట్ల లాభాలను ఆర్ కామ్ నమోదుచేయగా.. ముగిసిన ఈ ఏడాదిలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. రుణభారం నుంచి గట్టెక్కడానికి బ్యాంకర్లు తమకు ఏడు నెలల సమయమిచ్చారని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ చెప్పడంతో, ఆర్ కామ్ షేర్లు సోమవారం ట్రేడింగ్ లో 4.6 శాతం మేర లాభపడ్డాయి. కానీ పెరుగుతున్న రుణాలపై మళ్లీ ఆందోళనలు రేకెత్తడంతో సోమవారం వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. మంగళవారం రోజు ఫిచ్, మూడీస్ లు మరోసారి కంపెనీ రేటింగ్ ను డౌన్ గ్రేడింగ్ చేశాయి. ఫిచ్ ఈ సంస్థను కనిష్ట కేటగిరిలోకి డౌన్ గ్రేడ్ చేయగా.. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు రెండో కనిష్ట కేటగిరీలోకి డౌన్ గ్రేడ్ చేసింది. కంపెనీ అవుట్ లుక్ నెగిటివ్ గా ఉందంటూ మూడీస్ తన ప్రకటనలో పేర్కొంది. వారం క్రితమే మూడీస్ ఆర్ కామ్ రేటింగ్ ను బీ2 నుంచి సీఏఏ1 కు తగ్గించింది. ఫిచ్, మూడీస్ మాత్రమే కాక, ఐక్రా, కేర్ లు కూడా కంపెనీ రేటింగ్స్ ను సవరించాయి. ఈ ఏడాది మార్చి 31 వరకు ఆర్ కామ్ నికర రుణం రూ.45వేల కోట్లకు పెరిగింది. -
భారాన్నితగ్గించేందుకు అనిల్ ప్లాన్స్ ఇవే!
-
ఆర్కామ్కు డిసెంబర్ వరకు గడువు
అప్పటి వరకు రుణ చెల్లింపులు వాయిదా ⇔ అంగీకరించిన బ్యాంకర్లు ⇔ సెప్టెంబర్ నాటికి రూ.25వేల కోట్ల చెల్లింపులు ⇔ అంతర్జాతీయ వ్యాపార విక్రయాన్ని పరిశీలిస్తాం ⇔ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబై: గత కొన్ని రోజులుగా ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్)కు కాస్తంత ఊరట లభించింది. రుణాల చెల్లింపులకు ఏడు నెలల గడువు లభించింది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.45,000 కోట్ల రుణ బకాయిలకు సంబంధించి వాయిదాల్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైన ఆర్కామ్ రేటింగ్ను క్రెడిట్ రేటింగ్ సంస్థలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి తగ్గిస్తుండడంతో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీ స్వయంగా రంగంలోకి దిగారు. పరిస్థితి చేయిదాటి పోకుండా చూసేందుకు రుణాలిచ్చిన బ్యాంకర్లతో శుక్రవారం ముంబైలో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ అంబానీ వివరాలు వెల్ల డించారు. దేశ, విదేశీ రుణదాతలు వ్యూహాత్మక పునరుద్ధరణ ప్రణాళికకు అంగీకరించారని, రూ.45,000 కోట్ల రుణాలకు సంబంధించి చెల్లింపులకు గాను ఈ ఏడాది డిసెంబర్ వరకు ఏడు నెలల గడువు ఇచ్చినట్టు తెలిపారు. సెప్టెంబర్ నాటికి రూ.20,000 కోట్లకు రుణ భారాన్ని తగ్గించుకుంటామన్నారు. ‘‘రుణాలిచ్చిన సంస్థలు కంపెనీ సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకున్నాయి. నూతనంగా వైర్లెస్ కంపెనీ ఎయిర్కామ్ను విడిగా ఏర్పాటుచేయడం, ఎయిర్సెల్తో ఒప్పందం, ఇన్ఫ్రాటెల్లో వాటాను కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ సంస్థకు విక్రయించడడం వంటివన్నీ ఇందులో భాగం. ఈ రెండు లావాదేవీల ద్వారా వచ్చే నిధులతో రూ.25,000 కోట్ల మేర రుణాలను తీర్చేస్తాం. మొత్తం రుణంలో 60 శాతానికి సమానం’’ అని అనిల్ అంబానీ వివరించారు. మిగిలిన రూ.20,000 కోట్ల రుణం సంగతేంటన్న ప్రశ్నకు... అంతర్జాతీయ వ్యాపార విక్రయాన్నీ పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సోదరుడితో సత్సంబంధాలే సోదరుడు ముకేశ్ అంబానీతో తన సంబంధాలు సహృద్భావంగానే ఉన్నాయని అనిల్ అంబానీ స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా వినిపించే వదంతులన్నీ అర్థంలేనివిగా కొట్టి పడేశారు. ‘‘నా సోదరుడితో నా అనుబంధం సహజంగానే ఉంది. అర్థవంతంగా, పూర్తి గౌరవంగా ఉంటుంది. ఈ విషయంలో ఊహాగానాలు అనవసరం’’ అని అనిల్ అంబానీ తెలిపారు. తండ్రి ధీరూభాయి అంబానీ మరణం తర్వాత దశాబ్దం క్రితం అంబానీ సోదరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పంచుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆర్కామ్, రిలయన్స్ జియో మధ్య సంబంధాలపై ఎదురైన ప్రశ్నకు... రెండూ వేర్వేరు సంస్థలని, అవి అలానే కొనసాగుతాయని అనిల్ అంబానీ చెప్పారు. ‘‘స్పెక్ట్రం, ఫైబర్, ఇంట్రా సర్కిల్ రోమింగ్, టవర్లు, మరికొన్ని అంశాల్లో వ్యూహాత్మక సహకారం ఉంటుంది. దీనివల్ల వ్యయాలు తగ్గుతాయి’’ అని పేర్కొన్నారు. -
తెలుగువారికి బంపర్ ఆఫర్: 70జీబీ 4జీ డేటా
న్యూఢిల్లీ : అన్న ముఖేష్ అంబానీకి పోటీగా తమ్ముడు కూడా టెలికాం మార్కెట్లో సంచలన ఆఫర్లతో దుమ్మురేపుతున్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ నేడు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 148 రూపాయలకే 70జీబీ 4జీ డేటా అందించనున్నట్టు తెలిపింది. ''సూపర్ వాల్యు'' టారిఫ్ ప్లాన్ లో భాగంగా ఈ ఆఫర్ ను ఆర్కామ్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని సర్కిళ్ల యూజర్లకు మాత్రమేనని తెలిపింది. రోజుకు 1జీబీ డేటా చొప్పున 70 రోజుల వరకు ఈ డేటా ప్యాక్ అందించనుంది. దీంతో పాటు 50 రూపాయల టాక్ టైమ్ కూడా యూజర్లకు కల్పించనుంది. ఈ ప్లాన్ లో బెనిఫిట్స్ కింద యూజర్లకు ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే వాయిస్ కాల్స్ కు నిమిషానికి 25 పైసల ఛార్జీని వసూలు చేయనుంది. రిపోర్టుల ప్రకారం ఎఫ్ఆర్సీ 54, ఎఫ్ఆర్సీ 61 ప్లాన్స్ ను కూడా కంపెనీ లాంచ్ చేయనున్నట్టు తెలిసింది. 54 రూపాయల ప్లాన్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను 28 రోజుల వరకు అందించనుంది. ఈ టారిఫ్ ప్యాక్ లోనే రిలయన్స్ టూ రిలయన్స్ కాల్స్ కు నిమిషానికి 10 పైసలు, ఇతర లోకల్, ఎస్టీడీ కాల్స్ కు నిమిషానికి 25 పైసలు ఛార్జీ పడనుంది. అదేవిధంగా 61 రూపాయల ప్లాన్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను, రిలయన్స్ టూ రిలయన్స్ కాల్స్ కు ఆరు సెకన్లకు 1 పైసా, లోకల్, ఎస్టీడీ కాల్స్ కు రెండు సెకన్లకు 1 పైసా ఆఫర్ చేయనుంది. అచ్చం ఆర్కామ్ ప్లాన్ మాదిరిగానే, ఎయిర్ టెల్ రూ.399 రీఛార్జిపై రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్ ను 56 రోజుల వరకు ఆఫర్ చేస్తోంది. ఐడియా సెల్యులార్ ప్లాన్ 447 కూడా ఇదేమాదిరి ఉండనుంది. వీటికి పోటీగా, అన్నకు ధీటుగా ఆర్కామ్ తన ప్లాన్స్ ను ప్రకటించింది. -
ఆర్కామ్ వైర్లెస్ డీమెర్జర్కు సెబీ ఆమోదం
ఓకే చెప్పిన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) కంపెనీ వైర్లెస్ కార్యకలాపాల డీమెర్జర్కు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం లభించింది. అంతే కాకుండా ఈ డీమెర్జర్కు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల ఆమోదాలు కూడా లభించాయి. ఈ డీమెర్జర్ స్కీమ్కు ఆమోదం తెలపాలంటూ తాజాగా ఆర్కామ్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ముంబై ధర్మాసనానికి దరఖాస్తు చేసింది. ఆర్కామ్ తన వైర్లెస్ వ్యాపారాన్ని ఎయిర్సెల్తో కలసి ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ కంపెనీ, ఎయిర్సెల్ లిమిటెడ్ అండ్ డిష్నెట్ వైర్లెస్ లిమిటెడ్కు బదిలీ చేస్తోంది. ఈ కంపెనీలో ఆర్కామ్కు, ఎయిర్సెల్ వాటాదారులు(మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హద్)కు చెరో 50% వాటా ఉంటుంది. డైరెక్టర్ల బోర్డ్, కమిటీల్లో సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. వైర్లెస్ టెలికం వ్యాపారాన్ని ఎయిర్సెల్ కంపెనీలో విలీనం చేయనున్నామని గత ఏడాది సెప్టెంబర్, 14న ఆర్కామ్ వెల్లడించింది. రూ.65,000 కోట్ల ఆస్తులతో రూ.35,000 కోట్ల నెట్వర్త్తో దేశంలో నాలుగో అతి పెద్ద టెల్కోగా విలీన సంస్థ అవతరిస్తుంది. ఈ వార్తలతో ఆర్కామ్ షేర్ 1.5% లాభంతో రూ.36.80 వద్ద ముగిసింది. -
రూ.49కే 1 జీబీ 4జీ డేటా: ఆర్కామ్
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) తాజాగా కొత్త 4జీ యూజర్లకు రూ.49లకే 1 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అలాగే 3 జీబీ డేటాను రూ.149లకు పొందొచ్చని పేర్కొంది. ‘జాయ్ ఆఫ్ హోలీ’ ఆఫర్లో భాగంగా ఆవిష్కరించిన ఈ ప్లాన్లలో వినియోగదారులు ఆర్కామ్ నుంచి ఆర్కామ్కు ఉచిత అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ప్లాన్స్ వాలిడిటీ 28 రోజులని పేర్కొంది. అలాగే ఏపీ సర్కిల్లోని కొత్త 2జీ కస్టమర్లు రూ.49లకే అపరిమిత 2జీ డేటాను వినియోగించుకోవచ్చని, రూ.20ల టాక్టైమ్ పొందొచ్చని, నిమిషానికి 25 పైసలు కాల్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులని పేర్కొంది. ‘మేం ఇంకా 3జీ, 2జీ మార్కెట్లో వృద్ధి అవకాశాలున్నాయని భావిస్తున్నాం. అం దుకే ప్రత్యేకమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చాం’ అని ఆర్కామ్ కొ–సీఈవో గుర్దీప్ సింగ్ తెలిపారు. -
ఆర్కాం హోలీ జాయ్ ఆఫర్స్:అన్ లిమిటెడ్ కాల్స్
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా టారిఫ్ వార్ లోకి మరింతగా దూసుకొస్తోంది. వివిధ పథకాలతోపాటు అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ అంటూ శుక్రవారం కొత్త ప్లాన్లను ప్రకటించింది. ముఖ్యంగా 4జీ కొత్త కస్టమర్లకు రూ.49 లకు 1 జీబీ డాటాను ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు రూ.149ల రీచార్జ్పై 3 జీబీ డాటాతో పాటు అదనంగా తన నెట్వర్క్ లోఉచిత కాలింగ్ (లోకల్ అండ్ ఎస్టీడీ) సదుపాయం కల్పిస్తోంది. అలాగే 2జీ, 3 జీ ఖాతాదారుల కోసం కొత్తప్లాన్లను ఆర్కాం ప్రకటించింది. 'హోలీ జాయ్' కింద అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్లలో ఆఫర్ 28 రోజుల పాటు చెల్లుబాటవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.99 అన్లిమిటెడ్ 3 జీ డేటా, రూ.49 లకే అన్ లిమిటెడ్ 2 జీ డేటాను అందిస్తోంది. 3జీ, 2జీ మార్కెట్లలో తమకు అపారమైన సామర్థ్యం ఉందని, అందుకే స్పెషల్ ఆపర్లను అందిస్తున్నామిన ఆర్ కాం కో సీఈవో గురుదీప్ సింగ్ తెలిపారు. ఢిల్లీ, ముంబై, కోలకతా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో కొత్త 3జీ వినియోగదారులు ఇప్పుడు రు 99 తో రీఛార్జ్ పై అపరిమిత 3జీ డేటాతో పాటు రూ. 20 విలువ చేసే టాక్ టైం ఉచితం. అలాగే ఈ ప్లాన్ లో ని.25 పైసల కాల్ చార్జ్. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, చెన్నై లో కొత్త 2 జి వినియోగదారులకు 28 రోజుల చెల్లుబాటుతో రూ.49ల ప్లాన్ లో అపరిమిత 2జీ డేటా రూ.20 ఇన్ బిల్ట్ టాక్ టాం, నిమిషానికి 25 పైసలు కాల్ చార్జ్. ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్ సభ్యులకు ఇప్పటికే రూ.303 తో రీఛార్జ్ పై 28జీబీ అందిస్తోంది. అలాగే వన్ ప్లప్ ఆఫర్ కింద అదనంగా 5జీబీ అదనంగా ఆఫర్ చేస్తోంది. -
రూ.149లకే అపరిమిత వాయిస్ కాలింగ్: ఆర్కామ్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్’ (ఆర్కామ్) తాజాగా కస్టమర్ల కోసం అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్ను ప్రకటించింది. యూజర్లు ఈ ప్లాన్ను పొందాలంటే రూ.149లతో రీచార్జ్ చేసుకోవాలి. తాజా ప్లాన్లో 2జీ/3జీ/4జీ యూజర్లు దేశంలోని ఏ నెట్వర్క్కు అరుునా అన్లిమిటెడ్గా కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దేశంలోని అధిక సంఖ్యాక 2జీ యూజర్లను తమ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్లాన్ను ఆవిష్కరించామని వివరించింది. ఈ అన్లిమిటెడ్ ప్లాన్లో యూజర్లు అదనంగా 300 ఎంబీ డేటాను పొందొచ్చని పేర్కొంది. జియో కూడా ఉచిత కాల్స్ను అందిస్తోంది కదా అంటే ఆ సౌలభ్యం కేవలం వీఓఎల్టీఈ సపోర్ట్ 4జీ హ్యాండ్సెట్స్కు మాత్రమే అందుబాటులో ఉందన్న విషయాన్ని గుర్తించాలి. -
ఆర్కామ్పై ఐటీ కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు!
న్యూఢిల్లీ: రిలయన్స కమ్యూనికేషన్స (ఆర్కామ్)కు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాఖలు చేసిన ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. మంగళవారం కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, 2006-07 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1.5 బిలియన్ డాలర్ల (రూ.6,485 కోట్లు) సమీకరణకు సంబంధించి ఫారిన్ కరెన్సీ కన్వెర్టబుల్ బాండ్లను (ఎఫ్సీసీబీ) జారీ చేసింది. అరుుతే ఈ మొత్తాన్ని ‘అన్ఎక్స్ప్లైన్డ క్యాష్ క్రెడిట్’ (వివరణ ఇవ్వన్ని నగదు వసూళ్ల) కింద పరిగణిస్తూ, దీనిపై ఐటీ శాఖ రూ.4,800 కోట్ల పన్ను డిమాండ్ చేసింది. దీనిని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో ఆర్కామ్ సవాలు చేసింది. కంపెనీకి అనుకూలంగా తీర్పు రావడంతో ఐటీ శాఖ బొంబారుు హైకోర్టును ఆశ్రరుుంచింది. అక్కడా తీర్పు వ్యతిరేకంగా రావడంతో సుప్రీంను ఆశ్రరుుంచింది. ఇప్పుడు అక్కడా పిటిషన్ వీగిపోరుుంది. -
జియో 4జీ వేగం ఇంత తక్కువా?
కొత్తగా 4జీ మార్కెట్లోకి అరంగేట్రం చేసిన రిలయన్స్ జియో ఇంటర్నెట్ స్పీడ్, ఇతర టెలికాం కంపెనీలు ఆఫర్ చేసే నెట్ స్పీడ్ లతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని ట్రాయ్ వెల్లడించింది. జియో కంటే వేగవంతమైన ఇంటర్నెట్ను ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్లే అందిస్తున్నాయని ట్రాయ్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఎయిర్టెల్ 4జీ వేగం 11.4 ఎంబీపీఎస్, ఐడియా 7.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ 7.3 ఎంబీపీఎస్, ఆర్కామ్ 7.9ఎంబీపీఎస్లు ఉన్నట్టు తెలిపింది. అదే ముఖేష్ అంబానీ జియో విషయానికి వస్తే 4జీ నెట్వర్క్పై కేవలం 6.2ఎంబీపీఎస్ స్పీడ్లోనే ఇంటర్నెట్ ను అందిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ట్రాయ్ డేటాతో రిలయన్స్ కంపెనీ విభేదిస్తోంది. యూజర్ డౌన్లోడ్ చేసుకునే 4జీబీ డేటా ఫేర్ యూసేజ్ పాలసీ(ఎఫ్యూపీ) లిమిట్ మొత్తాన్ని వినియోగదారులు ఖర్చుచేశాక వేగాన్ని ట్రాయ్ను లెక్కగట్టిందని పేర్కొంటోంది. ఒక్కసారి వినియోగదారులు ఎఫ్యూపీ లిమిట్ మొత్తాన్ని వాడుకున్నాక, వేగం 256 కేబీపీఎస్ వరకు పడిపోతుందని జియో ఓ ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు 4జీ స్పీడ్ను బాగా సద్వినియోగ పరుచుకుంటున్నారని, వేగం తగ్గిపోయిందనడంలో ఎలాంటి నిజం లేదని కంపెనీ పేర్కొంటోంది. మరోవైపు జియో వచ్చిన తొలి రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ 40 ఎంబీపీఎస్ వరకూ ఉండేదని, క్రమంగా ఆ వేగం తగ్గిపోతుందని వినియోగదారులూ వాపోతున్నారు. జియో సర్వీసులన్నీ 4జీలో ఉండడంతో చార్జింగ్ కూడా త్వరగా అయిపోతోందని, దీంతో మాటిమాటికి బ్యాటరీని రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 31 వరకు ఉచిత డేటా, ఉచిత వాయిస్ వంటి సంచలన ప్రకటనలు చేస్తూ జియో సెప్టెంబర్లో టెలికాం పరిశ్రమలోకి అడుగు పెట్టింది. వాయిస్ కాల్స్పై అసలు వినియోగదారులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయమని, రూ.50కు 1జీబీ డేటాను ఆఫర్ చేస్తామని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనానికి ఓకే
ఒప్పందంపై ఇరు కంపెనీల సంతకాలు • దేశీ టెలికంలో అతిపెద్ద డీల్ • విలీన సంస్థలో ఆర్కామ్,మ్యాక్సిస్లకు చెరిసగం వాటా • రూ.65,000 కోట్ల విలువైన కంపెనీ ఆవిర్భావం • దేశీయంగా నాలుగో స్థానం న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో అతిపెద్దడీల్ సాకారమైంది. అనిల్ అంబానీ అడాగ్ గ్రూప్నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్), ఎయిర్సెల్ల విలీన ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. వైర్లెస్ మొబైల్ సర్వీసుల కార్యకలాపాలను విలీనం చేస్తున్నట్లు ఇరు కంపెనీలు బుధవారం ప్రకటించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించాయి.తద్వారా రూ.65,000 కోట్ల విలువైన సంస్థగా ఆవిర్భవిస్తున్నట్లు వెల్లడించాయి. అంతేకాదు ఈ డీల్ పూర్తయితే.. వినియోగదారులు, ఆదాయం పరంగా ప్రతిపాదిత విలీన సంస్థ భారత్లో నాలుగో అతిపెద్ద టెలికం ఆపరేటర్గా నిలుస్తుంది. ఆదాయ పరంగా 12 ప్రధాన సర్కిళ్లలో మూడో స్థానానికి చేరుతామని ఆర్కామ్, ఎంసీబీలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. విలీనం ఇలా... ప్రతిపాదిత విలీనం ద్వారా ఆవిర్భవించే కొత్త సంస్థలో ఆర్కామ్కు... ఎయిర్సెల్ ప్రస్తుత యాజమాన్య సంస్థ, మలేసియాకు చెందిన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్(ఎంసీబీ)కు చెరో 50 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. డెరైక్టర్ల బోర్డులో ఇరు కంపెనీలకు సమాన ప్రాతినిథ్యం లభిస్తుంది. ఇరు కంపెనీలు తమకున్న రుణాల్లో రూ.14,000 కోట్లను విలీనం తర్వాత ఏర్పాడే కొత్త సంస్థకు బదలాయిస్తాయి. దీంతో కొత్త కంపెనీ మొత్తం రుణ భారం రూ.28,000 కోట్లుగా ఉంటుంది. స్పెక్ట్రం చెల్లింపుల కోసం వెచ్చించాల్సిన రూ.6 వేల కోట్లు దీనికి అదనం. కాగా, ఈ లావాదేవీ పూర్తయితే, ఆర్కామ్ రుణభారంలో రూ.20 వేల కోట్ల మేర తగ్గనుంది(ప్రస్తుత రుణాల్లో దాదాపు 40 శాతం). అదేవిధంగా ఎయిర్సెల్ రుణ భారం కూడా రూ.4 వేల కోట్లు దిగిరానుంది. కొత్తగా ఏర్పడే విలీన సంస్థ ఆస్తులు రూ.65,000 కోట్లుగా, నెట్వర్త్ రూ.35,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక ఆర్కామ్ తన డేటా సెంటర్స్, ఆప్టిక్ ఫైబర్, ఇతర టెలికం ఇన్ఫ్రాతో పాటు దేశీ-గ్లోబల్ ఎంటర్ప్రైజ్ విభాగంలో వ్యాపారాలను ఈ విలీనంలో చేర్చలేదు. వాటిని తమ బ్రాండ్తోనే యథాతథంగా కొనసాగిస్తుంది. అదేవిధంగా రియల్టీ ఆస్తులు కూడా ప్రస్తుత ఆర్కామ్ చెంతనే ఉంటాయి. కాగా, రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్ టెలికం(ఎస్ఎస్టీఎల్/ఎంటీఎస్) వైర్లెస్ బిజినెస్ను ఆర్కామ్ ఇప్పటికే విలీనంచేసుకున్న సంగతి తెలిసిందే. ఎంటీఎస్కు ఆర్కామ్లో 10 శాతం వాటా కొనసాగుతుంది. బోర్డులో మాత్రం ప్రాతినిథ్యం ఉండదు. కాగా, విలీనం తర్వాత భవిష్యత్తు విస్తరణ కోసం ఆర్కామ్, ఎంసీబీలు కొత్త సంస్థలో అదనపు ఈక్విటీ నిధులను వెచ్చించేందుకు కట్టుబడి ఉంటాయని సంయుక్త ప్రకటన పేర్కొంది. విలీన లావాదేవీ మొత్తం వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశం ఉంది. గురువారం బీఎస్ఈలో ఆర్కామ్ షేరు ధర 3 శాతం లాభంతో రూ.51 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిశాఖ డీల్ ప్రకటించారు. 19% స్పెక్ట్రం.. 19 కోట్ల యూజర్లు.. తాజా డీల్తో దేశంలో అత్యధిక స్పెక్ట్రం కలిగిన కంపెనీగా కూడా విలీన సంస్థ ఆవిర్భవిస్తుంది. 800; 900; 1,800; 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్లలో కలిపి దేశీ టెలికం పరిశ్రమకు ఉన్న మొత్తం స్పెక్ట్రంలో 19 శాతం దీనికి ఉంటుంది. తద్వారా 2జీ, 3జీ, 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ఆర్కామ్కు 11 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నా రు. సబ్స్క్రయిబర్ల పరంగా నాలుగో స్థానంలో ఉంది. ఇక 8.4 కోట్ల మంది యూజర్లతో ఎయిర్సెల్ ఐదో స్థానంలో నిలుస్తోంది. ఆర్కామ్ మార్కెట్ షేర్ 9.8 శాతం కాగా, ఎయిర్సెల్ వాటా 8.5 శాతం. ఇక ఆర్కామ్లో ఇదివరకు విలీనమైన సిస్టెమా(ఎంటీఎస్) మార్కెట్ వాటా 0.7 శాతంగా ఉంది. ఎయిర్సెల్(ఎంసీబీ)తో భాగస్వామ్యం ద్వారా భారత్ టెలికం రంగంలో అతిపెద్ద విలీనాన్ని సాకారం చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే సిస్టెమా(ఎస్ఎస్టీఎల్)ను ఆర్కామ్ చేజిక్కించుకుంది. ఇప్పుడు ఎయిర్సెల్తో విలీనం ద్వారా ఎంసీబీతో 50:50 జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ లావాదేవీ ద్వారా ఆర్కామ్, ఎంసీబీ వాటాదారులకు దీర్ఘకాలంలో మరింత మెరుగైన విలువను సృష్టించనున్నాం. - అనిల్ అంబానీ, అడాగ్ గ్రూప్ చైర్మన్ భారత్లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామనేందుకు ఆర్కామ్తో విలీనం డీల్ మరో నిదర్శనం. 2006లో మేం ఎయిర్సెల్ను కొనుగోలు చేసినప్పటినుంచి ఇక్కడ రూ.35,000 కోట్లకు పైగానే పెట్టుబడులను వెచ్చించాం. ఇది ఒక్క టెలికం రంగంలోనే కాకుండా.. భారత్కు ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. - మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్(ఎంసీబీ) -
ఒక్క రూపాయికే 300 ని.ల డాటా కాల్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ మంగళవారం వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాల్ డ్రాప్స్ సమస్యను అధిగమించే లక్ష్యంతో మంగళవారం 4 జీ యాప్ టు యాప్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రకటించింది. 30రోజులపాటు వర్తించేలా ఒక్కరూపాయి కే 300 నిమిషాల 4జీ డాటాకాలింగ్ సదపాయాన్ని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంత వాసులకు మాత్రమే వర్తిసుంది. ముప్పయి రోజులు.. రోజుకు పదినిముషాలు..ఒక్క రూపాయికే అందిస్తున్నామని, ఆర్ కాం కన్జ్యూమర్ బిజినెస్ సీఈవో గురుదీప్ సింగ్ వెల్లడించారు. దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంత(ఎన్సీఆర్) ప్రజలకు ఇది భారతలోనే మొదటి ఆఫర్ అనీ, కాల్ డ్రాప్ సర్వీసులనుంచి విముక్తి లభించేందుకే ఈసౌకర్యమని గురుదీప్ తెలిపారు. -
ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనంపై వచ్చే వారం ఒప్పందం!!
న్యూఢిల్లీ: ఇరు కంపెనీల విలీనానికి సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), ఎయిర్సెల్ల మధ్య వచ్చే వారంలో సంతకాలు జరిగే అవకాశముంది. ఈ రెండు కంపెనీల మధ్య టర్మ్ షీట్ ఖరారయ్యింది. ఆర్కామ్, ఎయిర్సెల్ కంపెనీల విలీనం విజయవంతమైతే మూడో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భవిస్తుంది. దీని యూజర్ల సంఖ్య 19.6 కోట్లకు పైగా చేరుతుంది. ఆర్కామ్, ఎయిర్సెల్ కంపెనీలు విలీన ఒప్పందంపై సంతకాలు చేస్తే.. తర్వాత ఈ విలీనాన్ని నియంత్రణ సంస్థల ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. విలీన ప్రక్రియ పూర్తికావడానికి 4-6 నెలల సమయం పట్టే అవకాశముంది. -
ఆర్కామ్ నుంచి కొత్త వ్యాన్ ప్రొడక్ట్
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) తాజాగా సాఫ్ట్వేర్ ఆధారిత వ్యాన్ (వైడ్ ఏరియా నెట్వర్క్) ప్రొడక్ట్ ‘క్లౌడ్ ఎక్స్ వ్యాన్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీన్ని కంపెనీ అనుబంధ సంస్థ గ్లోబల్ క్లౌడ్ ఎక్స్చేంజ్ రూపొం దించింది. బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, ఇతర కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఆర్కామ్ ఈ ప్రొడక్ట్ను మార్కెట్లోకి తెచ్చింది. మేకిన్ ఇండియా తొలి క్లౌడ్ సెంట్రిక్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఇది. హెడ్ ఆఫీస్లోని క్లౌడ్ సర్వర్ నుంచి వచ్చే అప్డేట్స్తో నిమిత్తం లేకుండా కంపెనీ బ్రాంచులు ఈ కొత్త ప్రొడక్ట్ సాయంతో స్వతహాగా కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని ఆర్కామ్ ఎంటర్ప్రైజ్, జీసీఎక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్రహమ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఎస్డీ వ్యాన్లకు డిమాండ్ పెరుగుతోందని, తమ ‘క్లౌడ్ ఎక్స్ వ్యాన్’తో కంపెనీల డేటా సేవింగ్ వ్యయం తగ్గుతుందని ఆర్కామ్ ఎంటర్ప్రైజ్, జీసీఎక్స్ సీఈవో బిల్ బర్నే పేర్కొన్నారు. -
మొబైల్ యూజర్లకు మెగా ఆఫర్!
రూ. 93కు 10 జీబీ 4జీ డాటా రిలియన్స్ కమ్యూనికేషన్ ప్రటకన నిర్ణీత సర్కిళ్లలో ఈ వారం నుంచి అమలు ప్రముఖ టెలికం ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్ తన వినియోగదారులకు భారీ ఆఫర్ ఇవ్వబోతున్నది. రిలయన్స్ జియో నెట్వర్క్ ఉపయోగించే సీడీఎంఏ వినియోగదారులకు ఈ వారం నుంచి రూ. 93కే 10 జీబీ 4జీ డాటా అందివనున్నట్టు తెలిపింది. కొన్ని ఎంపికచేసిన సర్కిళ్లలో ఈ ధరకు 4జీ డాటాను ఇవ్వనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం చాలా మొబైల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు ఇస్తున్న బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కన్నా ఇది ఎంతో తక్కువ కావడం గమనార్హం. ‘వచ్చేవారం నుంచి తన సీడీఎంఏ వినియోగదారుల కోసం రిలయన్స్ జీయో ఇన్ఫోకామ్ 4జీ నెట్వర్క్ను వినియోగించబోతున్నట్టు ఆర్ కామ్ కేంద్ర టెలికం డిపార్ట్మెంట్ (డీవోటీ)కు తెలియజేసింది. సీడీఎంఏ వినియోగదారులు 4జీకి అప్గ్రేడ్ చేయించుకుంటే వారికి ఈ సేవలు లభించనున్నాయి’ అని విశ్వసనీయ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఆర్కామ్కు 80 లక్షలమంది సీడీఎంఏ వినియోగదారులు ఉండగా, అందులో 90శాతం 4జీ సేవలను అప్గ్రేడ్ చేసుకోవడానికి అంగీకరించారని డీవోటీ అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. పోటీ మొబైల్ ఆపరేటర్ల కన్నా చాలా తక్కువ ధరకు ఆర్ కామ్ తన వినియోగదారులకు 4జీ ఆఫర్ అందిస్తుండటం గమనార్హం. కేవలం రూ. 93 10 జీబీ 4జీ డాటాను ఇవ్వబోతుండటం పోటీ ఆపరేటర్ల కన్నా 90 శాతం తక్కువ ధరకు ఇచ్చినట్టు అవుతుందని పరిశీలకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలు, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్ తదితర 12 సర్కిళ్లలో 4జీ లాంచ్ కానుంది. ఈ సర్కిళ్లలో ఈ ఆఫర్ ను ఆర్ కామ్ వినియోగదారులకు అందివ్వబోతున్నది. -
ఆర్కామ్, రిలయన్స్ జియో.. స్పెక్ట్రం ఒప్పందం
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్కు సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), రిలయన్స్ జియో (ఆర్జియో) ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు కంపెనీలు 17 సర్కిళ్లలో స్పెక్ట్రంను పరస్పరం పంచుకుంటాయి. 9 సర్వీస్ ఏరియాల్లో ఆర్కామ్కు చెందిన సీడీఎంఏ గ్రేడ్ 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ఆర్జియో ఉపయోగించుకుంటుంది. తద్వారా .. త్వరలో దేశంలోనే అతి పెద్ద 4జీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను ప్రారంభించనున్న ఆర్జియోకు 18 టెలికం సర్కిళ్లలో 1800 మెగాహెట్జ్ బ్యాండ్లో, 17 సర్కిల్స్లో 800 మెగాహెట్జ్ బ్యాండ్లో, మొత్తం 22 టె లికం సర్కిల్స్లో 2300 మెగాహెట్జ్ బ్యాండ్లో స్పెక్ట్రం దక్కినట్లవుతుంది. అటు స్పెక్ట్రం ట్రేడింగ్తో ఆర్కామ్కు దాదాపు రూ. 4,500 కోట్లు లభించనున్నాయి. 16 సర్కిల్స్లో స్పెక్ట్రం లిబరలైజేషన్ (ట్రేడింగ్, షేరింగ్ తదితర అవసరాలకు ఉపయోగించుకునేందుకు అనుమతించినందుకు గాను) కోసం టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ. 5,384 కోట్ల ఫీజుకి ఆర్కామ్ ఈ నిధులను ఉపయోగించుకోనుంది. మిగతా మొత్తాన్ని ఇతరత్రా స్థిరాస్తి అసెట్స్ విక్రయాల ద్వారా సమకూర్చుకోనుంది. పరస్పర సహకారం కారణంగా ఇరు కంపెనీల నెట్వర్క్ సామర్థ్యాలు మెరుగుపడటంతో పాటు వ్యయాలు గణనీయంగా తగ్గగలవని ఆర్కామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, స్పెక్ట్రం ట్రేడింగ్కి సంబంధించి టెలికం రంగంలో ఇది రెండో ఒప్పందం. దాదాపు రూ. 3,310 కోట్లు చెల్లించి రెండు సర్కిల్స్లో స్పెక్ట్రం కొనుక్కునేందుకు వీడియోకాన్తో ఐడియా ఒప్పందం కుదుర్చుకుంది. -
రూ. 5,600 కోట్లు కట్టాలి
స్పెక్ట్రం ‘సరళీకరణ’పై ఆర్కామ్కు డాట్ ఆదేశం న్యూఢిల్లీ: పదహారు సర్కిళ్లలో 800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ట్రేడింగ్, షేరింగ్ మొదలైన వాటికి ఉపయోగించుకునేందుకు వీలుగా షరతులు సడలించడం కోసం రూ. 5,600 కోట్లు చెల్లించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్కు (ఆర్కామ్) టెలికం విభాగం (డాట్) సూచించింది. అలాగే వన్ టైమ్ స్పెక్ట్రం చార్జ్ (ఓటీఎస్సీ) కింద రూ. 1,569 కోట్లకు బ్యాంకు గ్యారంటీని నెలరోజుల్లోగా సమర్పించాలని పేర్కొంది. -
ఆర్కామ్, ఎయిర్సెల్ విలీనం!
► మొబైల్ వ్యాపారాల విలీనానికి ఇరు కంపెనీల చర్చలు ► ఎంటీఎస్ను విలీనం చేసుకోనున్నట్లు ఇప్పటికే చెప్పిన ఆర్కామ్ ► మూడింటినీ కలిపి కొత్త సంస్థను ఏర్పాటు చేసే యోచన... ► 20 కోట్ల యూజర్లతో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించే అవకాశం.. న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమవుతోంది. అనిల్ అంబానీ గ్రూప్నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), ఎయిర్సెల్తో విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కంపెనీల మొబైల్/వైర్లెస్ వ్యాపారాలను విలీనం చేయడానికి ఎయిర్సెల్ వాటాదారులతో చర్చలు జరుపుతున్నట్లు ఆర్కామ్ మంగళవారం ప్రకటించింది. ప్రతిపాదిత విలీనానికి సంబంధించిన చర్చల కోసం ఎయిర్సెల్ మెజారిటీ వాటాదారు అయిన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హార్డ్ (ఎంసీబీ), మరో వాటాదారు సిండ్యా సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లతో 90 రోజుల ప్రత్యేక గడువు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కూడా ఆర్కామ్ తెలియజేసింది. సిస్టెమా శ్యామ్ కూడా... ఎంటీఎస్ బ్రాండ్తో దేశీయంగా టెలికం సేవలు అందిస్తున్న సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ భారతీయ వ్యాపారాన్ని విలీనం చేసుకునే ప్రక్రియలో ఆర్కామ్ నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్కామ్, ఎంటీఎస్, ఎయిర్సెల్.. మూడు సంస్థల మొబైల్ వ్యాపార కార్యకలాపాలనూ కలిపి ఆర్కామ్ నేతృత్వంలో ఒక కొత్త సంస్థను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈక్విటీ డీల్ రూపంలో ఈ విలీన సంస్థను నెలకొల్పనున్నారని... ఆర్కామ్ వాటాదారులు తమ వద్దనున్న ఒక్కో షేరుకి కొత్తగా ఆవిర్భవించే సంస్థలో మూడు షేర్లను ఆశిస్తున్నట్లు కూడా ఆయా వర్గాల సమాచారం. టవర్ల విభాగం అమ్మకం తర్వాత ఆర్కామ్ మొత్తం రుణ భారం రూ.10 వేల కోట్ల దిగువకు చేరుతుందని అంచనా. కొత్తగా ఏర్పాటయ్యే సంస్థకు ఈ రుణాన్ని బదలాయించడం ద్వారా రుణ రహిత సంస్థగా మారాలనేది ఆర్కామ్ ప్రణాళికగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అనుకున్నట్లు జరిగితే ఆర్కామ్, ఎయిర్సెల్, ఎంటీఎస్ల వైర్లెస్ వ్యాపారాలను కలపడం ద్వారా ఆవిర్భవించే కొత్త సంస్థ బ్రాండ్ ఇతర వివరాలు కొద్ది రోజుల్లో ఖరారయ్యే అవకాశాలున్నాయి. వైర్లెస్ వ్యాపారాన్ని కొత్త సంస్థకు బదలాయించాక ఆర్కామ్ మున్ముందు పూర్తిగా ఎంటర్ప్రైజ్ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టిపెట్టాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. అతిపెద్ద స్పెక్ట్రం వాటా... ఈ మూడు కంపెనీల మొబైల్ వ్యాపారాన్ని విలీనం చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే... మొత్తం దేశీ టెలికం పరిశ్రమకు కేటాయించిన స్పెక్ట్రంలో 19.3% ఈ కొత్త సంస్థ గుప్పిట్లోకి వస్తుంది. అప్పుడు దేశంలో అత్యధిక స్పెక్ట్రం వాటా కలిగిన సంస్థ ఇదే అవుతుంది. 2జీ, 3జీ, 4జీ సర్వీసులన్నింటిలోనూ (అన్ని బ్యాండ్విడ్త్లూ) ఈ ప్రతిపాదిత కొత్త సంస్థకు స్పెక్ట్రం ఉంటుంది. కాగా, నిర్వహణ వ్యయాలు, మూలధన పెట్టుబడుల విషయంలో మెరుగైన సమన్వయంతో పాటు ఆదాయాలను పెంచుకునేందుకు కూడా ఈ విలీనం ఉపకరిస్తుందని ఆర్కామ్ పేర్కొంది. ఈ ప్రతిపాదనలు ఇంకా చర్చల స్థాయిలోనే(నాన్-బైండింగ్) ఉన్నాయని.. పూర్తిస్థాయి మదింపు, నియంత్రణ సంస్థల అనుమతి, వాటాదారులు, సంబంధిత పక్షాల(థర్డ్పార్టీ) ఆమోదాలకు లోబడే విలీన లావాదేవీ జరుగుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని కూడా ఆర్కామ్ పేర్కొంది. విలీన వార్తల నేపథ్యంలో ఆర్కామ్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 2.39 శాతం లాభపడి రూ.85.70 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ.87.10 గరిష్టాన్ని కూడా తాకింది. నంబర్ 2 టెల్కోగా.. ఈ డీల్ పూర్తయితే దేశంలో రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్గా నిలిచే అవకాశం ఉంది. తాజా విలీనం ప్రతిపాదన కార్యరూపం దాల్చితే యూజర్ల సంఖ్యాపరంగా దేశంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఆపరేటర్గా కొత్త సంస్థ ఆవిర్భవిస్తుంది. ప్రస్తుతం ఆర్కామ్ 11 కోట్ల మంది యూజర్లతో దేశంలో నాలుగో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది. ఎయిర్సెల్ 8.4 కోట్ల మంది సబ్స్క్రయిబర్లతో అయిదో స్థానంలో ఉంది. ఇక ఆర్కామ్ విలీనం చేసుకోనున్నట్లు ప్రకటించిన సిస్టెమా శ్యామ్కు భారత్లో 83.6 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ మూడూ కలిస్తే కొత్తగా ఏర్పాటయ్యే సంస్థ యూజర్లు దాదాపు 20 కోట్లకు చేరుతారు. టవర్ల వ్యాపారానికి సంబంధం లేదు.. ఆర్కామ్ మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ మౌలిక సదుపాయాలకు ఈ ప్రతిపాదిత విలీనంతో సంబంధం లేదని కంపెనీ తెలియజేసింది. టవర్ల విభాగాన్ని విక్రయిస్తున్నట్లు ఈ నెల 4న ఆర్కామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు తిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్, టీపీజీ ఆసియా ఇంక్లతో నాన్-బైండింగ్ ఒప్పందంపై ఆర్కామ్ సంతకాలు కూడా చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.30 వేల కోట్లుగా అంచనా. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని రుణ భారం తగ్గించుకోవడం కోసం ఆర్కామ్ ఉపయోగించుకోనుంది. -
ఆర్కామ్ చేతికి ‘సిస్టెమా’
ఒప్పందం విలువ దాదాపు రూ. 4,500 కోట్లు * స్టాక్, స్పెక్ట్రమ్ ఫీజు చెల్లింపు రూపంలో డీల్ న్యూఢిల్లీ: దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) .. తాజాగా సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ను (ఎస్ఎస్టీఎల్) కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ దాదాపు 690 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,500 కోట్లు)గా ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. స్టాక్ మార్పిడి, రూపంలో ఈ డీల్ ఉంటుందని ఆర్కామ్ సోమవారం తెలిపింది. దీని ప్రకారం సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్ఎస్టీఎల్)కు ఆర్కామ్లో 10 శాతం వాటాలు దక్కుతాయి. డీల్ పూర్తి కావడానికి ముందు తనకున్న దాదాపు 500 మిలియన్ డాలర్ల రుణాలను తీర్చేసేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఎస్ఎస్టీఎల్ ద్వారా వచ్చే స్పెక్ట్రమ్కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాయిదాలను ఏటా రూ. 392 కోట్లు చొప్పున పదేళ్ల పాటు ఆర్కామ్ కడుతుంది. సిస్టెమా శ్యామ్ ప్రస్తుతం తొమ్మిది సర్కిల్స్లో ఎంటీఎస్ బ్రాండ్ కింద సర్వీసులు అందిస్తోంది. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ దేశీ టెలికం రంగం పురోగమిస్తోందనడానికి రెండు సంస్థల విలీన మే నిదర్శనమని సిస్టెమా ప్రెసిడెంట్ మిఖాయిల్ షమోలిన్ పేర్కొన్నారు. విలీనంతో రెండు కంపెనీలకు పరస్పర ప్రయోజనం చేకూరగలదని ఆర్కామ్ సీఈవో గుర్దీప్ సింగ్ చెప్పారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో డీల్ పూర్తి కాగలదని అంచనా. ఆర్కామ్కు ప్రయోజనాలు.. ఈ ఒప్పందంతో ఆర్కామ్ ఖాతాలో సుమారు 90 లక్షల కస్టమర్లు, దాదాపు రూ. 1,500 కోట్ల వార్షికాదాయాలు దఖలుపడతాయి. తద్వారా సంస్థ మొత్తం యూజర్ల సంఖ్య 11.8 కోట్లకు చేరుతుంది. అలాగే, 4జీ సేవలకు ఉపయోగపడే 850 మెగాహెట్జ్బ్యాండ్ స్పెక్ట్రం కూడా ఆర్కామ్కు లభిస్తుంది. భారీ ఆదాయాన్నిచ్చే ఢిల్లీ, గుజరాత్ తదితర 8 సర్కిల్స్లో సంస్థ లెసైన్సు కాలం సైతం 12 సంవత్సరాల మేర 2021 నుంచి 2033 దాకా పెరుగుతుంది. ఇక డీల్ ముగిసిన తర్వాత ఎస్ఎస్టీఎల్లోని మైనారిటీ ఇన్వెస్టర్లు.. తమ షేర్లకు బదులుగా ప్రో-రేటా ప్రాతిపదికన ఆర్కామ్ షేర్లను పొందే వెసులుబాటు ఉంటుంది. ఎస్ఎస్టీఎల్లో రష్యాకు చెందిన ఏఎఫ్కే సిస్టెమాకు 56.68 శాతం, రష్యా ప్రభుత్వానికి 17.14%, భారతీయ సంస్థ శ్యామ్ గ్రూప్నకు 23.98% వాటాలు ఉన్నాయి. మిగతా వాటాలు చిన్న ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. ఎస్ఎస్టీఎల్ రుణభారం, ఇతరత్రా చెల్లించాల్సినవి సుమారు రూ. 3,200 కోట్ల మేర ఉండగా, ఆర్కామ్ రుణ భారం రూ. 32,000 కోట్లుగా ఉంది. 2014-15లో ఆర్కామ్ ఆదాయాలు రూ. 21,423 కోట్లు కాగా, నికర లాభం రూ. 620 కోట్లు. అన్లిస్టెడ్ కంపెనీ అయిన ఎస్ఎస్టీఎల్ 2014 ఆదాయాలు రూ. 1,347 కోట్లు. -
ఐఎస్డీ కాల్ రేట్లు తగ్గే చాన్స్...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కాల్ ధరలు తగ్గనున్నాయి. ఇంటర్నేషనల్ సబ్స్క్రైబర్ డయలింగ్(ఐఎస్డీ)కు సంబంధించి దేశీయ టెలికాం సంస్థలకు ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్(ఐఎల్డీఓ)లు చెల్లించే యాక్సెస్ చార్జీలను ట్రాయ్ ఖరారు చేసింది. ఈ యాక్సెస్ చార్జీలు వైర్లెస్ సర్వీసులకు నిమిషానికి 40 పైసలు, వైర్లైన్ సర్వీసులకు నిమిషానికి రూ.1.20గా ట్రాయ్ నిర్ణయించింది. ఇప్పటివరకూ ఉన్న విధానంలో ఎవరైనా వినియోగదారులు ఐఎస్డీ కాల్స్ చేయాలనుకుంటే, ఐఎల్డీఓను సొంతంగా ఎంచుకోవడానికి లేదు. యాక్సెస్ ప్రొవైడర్స్పై ఆధారపడి ఉండాల్సి వచ్చేది. తాజా ట్రాయ్ నిబంధనల ప్రకారం, వినియోగదారులు కాలింగ్ కార్డ్స్ను ఏ ఐఎల్డీఓ నుంచైనా కొనుగోలు చేయవచ్చు. లాంగ్ డిస్టెన్స్ సెక్టర్లో ఉన్న పోటీ కారణంగా వినియోగదారులకు తక్కువ ధరలకే ఈ కార్డ్స్ లభిస్తాయని అంచనా. కాలింగ్ కార్డ్ సర్వీసులకు సంబంధించి ఆదాయాన్ని పంచుకునే ఒప్పందంపై ట్రాయ్ గత నవంబర్లోనే ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. తుది నిబంధనలను మంగళవారం వెల్లడించింది. ఐఎస్డీ సర్వీసులందించడానికి 27 ఐఎల్డీఓలు, ఎస్టీడీ సర్వీసులందజేయడానికి 34 నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్స్ రంగంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఎయిర్టెల్, ఆర్కామ్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్కు చెందినవి. ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ టెలికాం సేవలందిచేందుకు లెసైన్స్ ఉన్న కంపెనీలకు నేరుగా కస్టమర్లకే కాలింగ్ కార్డ్స్ జారీ చేయడానికి కేంద్రం అనుమతినిచ్చింది. పోటీని పెంచి తక్కువ ధరలకే సేవలందేలా చేయడమే ఈ చర్యల ప్రధానోద్దేశం. -
ఆంధ్రప్రదేశ్లో ఆర్కామ్ 3జీ సేవలు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ మరో 5 టెలికం సర్కిళ్లలో 3జీ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తూర్పు ఉత్తర ప్రదేశ్- ఈ ఐదు సర్కిళ్లలో 3జీ సర్వీసులను ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తేనున్నామని ఆర్కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో తాము 3జీ సర్వీసులందజేస్తున్న మొత్తం టెలికం సర్కిళ్ల సంఖ్య 18కు పెరిగిందని ఆర్కామ్ సీఈఓ (కన్సూమర్ బిజినెస్) గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ విస్తరణ కారణంగా 3జీ మార్కెట్లో డేటా విషయమై తమ అగ్రస్థానం మరింత పటిష్టమవుతుందని వివరించారు. 2 లక్షల కి.మీ. ఫైబర్ నెట్వర్క్తో అత్యున్నతమైన. అత్యంత వేగవంతమైన 3జీ సేవలను చౌక ధరలకే కార్పొరేట్, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు, వినియోగదారులకు అందిస్తున్నామని గుర్దీప్ సింగ్ వివరించారు. కాగా ఎయిర్సెల్తో 3జీ ఇంట్రా-సర్కిల్ రోమింగ్ ఒప్పందాన్ని ఆర్కామ్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్కామ్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 3.74 కోట్లకు చేరింది. వీరిలో 3జీ వినియోగదారుల సంఖ్య 1.29 కోట్లు. -
ఇక దేశమంతా ఒకటే!
ఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) ‘వన్ ఇండియా వన్ రేట్’ పేరుతో ఉచిత రోమింగ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఎస్టీడీ, లోకల్, రోమింగ్ కాల్స్కు ఇక ఒకటే రేటు. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం ఈ సంస్థ 599 రూపాయలు, 350 రూపాయలతో రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. లోకల్, ఎస్టీడి, రోమింగ్ వివిధ రకాల టారిఫ్లు, టారిఫ్లలో వ్యత్యాసాలు లేకుండా వినియోగదారులకు సౌకర్యంగా ఉండేవిధంగా ఈ కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురుదీప్ సింగ్ చెప్పారు.