Reverse Tendering
-
దోపిడీకి అడ్డొస్తుందనే.. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో ఖజానాను అప్పటి ప్రభుత్వ పెద్దలు దోచేశారు. ప్రజా ధనాన్ని ఇలా దోపిడీ చేయకుండా అడ్డుకట్ట వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను తెచ్చింది. ఈ చట్టం ద్వారా టెండర్లలో పారదర్శకత, సూచనలు చేయడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రవేశ పెట్టింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసింది. కానీ, ఇటీవలి ఎన్నికల్లో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు కూటమే మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ దోపిడీ పర్వానికి తెర తీస్తూ చంద్రబాబు కూటమి జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ప్రతిపాదనను బుధవారం మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రివ్యూ అడ్డునూ తొలగించుకుంది. మళ్లీ 2014–19 తరహాలోనే అడ్డగోలుగా అంచనాలు పెంచేసి.. కమీషన్లు ఎక్కువ ఇచ్చే కాంట్రాక్టర్కే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్లు పిలిచి, కోరుకున్న కాంట్రాక్టర్కు కట్టబెట్టి, మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చి, కమీషన్లు వసూలు చేసుకునేందుకు మళ్లీ సిద్ధమయ్యారని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.జ్యుడిషియల్ ప్రివ్యూకు నీతి అయోగ్ ప్రశంసలురాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చుతూ 2019 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్ట్రాస్టక్చర్ యాక్ట్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) – 2019 చట్టాన్ని నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిని జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జిగా నియమించింది. ఈ చట్టం ప్రకారం.. రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్ను ముందుగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. ఆ ముసాయిదాపై జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జడ్జి మార్పులు సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే.. దానిని యధాతథంగా ఆమోదిస్తారు. ఇలా జ్యూడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్తోనే రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులన్నింటినీ ఇదే విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్లే కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పోటీ పడి.. కాంట్రాక్టు విలువకంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. దీని వల్ల రూ.7,500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యింది. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఈ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.అంచనాల్లో వంచనకు, దోపిడీకి అవకాశం ఉండదనే..విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఇప్పటిలానే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. కోట్లాది రూపాయలు వెదజల్లి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని ఓ అస్త్రంగా మల్చుకున్నారు. 2014 – 19 మధ్య బాబు సర్కారు దోపిడీకి సాక్ష్యాలు ఇవిగో..» గాలేరు–నగరి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మాత్రమే మిగిలింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి, దొడ్డిదారిన తన సన్నిహితుడైన సి.ఎం. రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు అప్పగించారు.»హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో 2–బీ ప్యాకేజీలో 2014 నాటికి కేవలం రూ.99 లక్షల విలువైన పనులు, 3–బి ప్యాకేజిల్లో రూ.రూ.8.69 కోట్ల విలువైన పను మిగిలాయి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. 2–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.115.08 కోట్లకు పెంచేశారు. 3–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.149.14 కోట్లకు పెంచేశారు. ఈ రెండింటినీ సి.ఎం. రమేష్కే అప్పగించారు. ఇలా 2–బి ప్యాకేజీలో రూ.114.09 కోట్లు, 3–బి ప్యాకేజీలో 140.45 కోట్లు పెంచేసి, సి.ఎం.రమేష్కు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. »హంద్రీ–నీవా రెండో దశ 4–బి ప్యాకేజీలో 2014 నాటికి రూ.1.34 కోట్లు, 5–బీ ప్యాకేజీలో రూ.11.87 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటి కాంట్రాక్టర్లను కూడా 60–సీ నిబంధన కింద చంద్రబాబు తొలగించారు. 4–బి ప్యాకేజీ పనుల వ్యయాన్ని రూ.73.26 కోట్లకు, 5–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.97.40 కోట్లకు పెంచేసి, తన సన్నిహితుడైన ఆర్.మహేశ్వరనాయుడు, ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.»వెలిగొండ రెండో టన్నెల్లో 2014 నాటికి రూ.299.48 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటిని చేస్తున్న కాంట్రాక్టర్పై 60–సీ నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. జీవో 22, జీవో 63ను వర్తింపజేసి.. అంచనా వ్యయాన్ని రూ.597.11 కోట్లకు పెంచేశారు. వాటిని సి.ఎం. రమేష్కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి, సి.ఎం. రమేష్ సంస్థకంటే రూ.61.76 కోట్లకు తక్కువ ధరకు మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఆ టన్నెల్ పనిని పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కాVŠ జీవో 22, జీవో 63ను వర్తింపజేయడం ద్వారా కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లను దోచిపెట్టినట్లు తేల్చడం బాబు అవినీతికి తార్కాణం.» 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకాశం బ్యారేజ్కు 21 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేశారు. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నవయుగకు అప్పగించారు. అంటే.. అంచనాలు పెంచడం ద్వారా, అధిక ధరకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ప్రభుత్వ ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 2019లో ప్రభుత్వం రద్దు చేసింది. » ఇప్పుడూ అదే రీతిలో ఖజానాను కొల్లగొట్టేందుకు జ్యుడిషియల్ ప్రివ్యూను ప్రభుత్వం రద్దు చేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
శ్రీవారి నిధుల దోపిడీకి బాబు సర్కారు స్కెచ్
సాక్షి, అమరావతి: ధర్మో రక్షతి రక్షితః.. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే.. ఆ ధర్మమే మనల్ని సంరక్షిస్తుందన్న ఆర్యోక్తి తిరుమల కొండల్లో కనుమరుగైపోతోంది. ధర్మాన్ని రక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలే దానికి పాతరేశారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోని ముఖ్యులు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఖజానాను కాంట్రాక్టర్లతో కలిసి దోచేసిన తరహాలోనే ఇప్పుడూ దోపిడీకి తెరతీశారు. ఇందుకోసం అత్యంత పారదర్శకమైన, ప్రజా ధనాన్ని ఆదా చేసే రివర్స్ టెండరింగ్ను టీటీడీలో రద్దు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టు 16న రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వం గత నెల 15న రద్దు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఉత్తర్వులను టీటీడీలోనూ అమలు చేస్తూ.. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈవో జె.శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.దీనిద్వారా 2019 ఆగస్టు 16కు ముందు టీటీడీలో అమల్లో ఉన్న పాత పద్ధతి ప్రకారమే నెయ్యి, ముడిసరుకుల కొనుగోలు, నిర్మాణ పనులు తదితర పనులకు టెండర్లు నిర్వహించడానికి మార్గం సుగమమైంది. అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లతో టెండర్లకు ముందే కుమ్మక్కై, అంచనా వ్యయాన్ని పెంచేసి, ఆపై అధిక ధరలకు కాంట్రాక్టులు అప్పగించడం ద్వారా శ్రీవారి ఖజానాను మళ్లీ దోచేయడానికి స్కెచ్ వేసినట్లు బాబు సర్కారు తాజా చర్యలు చెబుతున్నాయి. రివర్స్ టెండరింగ్తో శ్రీవారి ఖజానాకు భారీగా ఆదా రాష్ట్ర విభజన తర్వాత జనసేన, బీజేపీతో కూటమి కట్టి 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అప్పట్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక ధరలకు పనులు అప్పగించడం ద్వారా శ్రీవారి ఖజానా నుంచి రూ.వందలాది కోట్లు, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.20 వేల కోటుŠల్ ఆ ప్రభుత్వంలోని ముఖ్య నేతలు, పలువురు కాంట్రాక్టర్లు దోచేశారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దోపిడీ వ్యవస్థకు తెరదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. చట్టం చేసి మరీ జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం రూ. వంద కోట్లు అంతకంటే ఎక్కువ ఖర్చయ్యే పనుల టెండర్ ముసాయిదాను జ్యుడిíÙయల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. దానిపై జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ముసాయిదా మార్పులు ఉంటే సూచిస్తారు. లేదంటే యథాతధంగా ఆమోదిస్తారు. జడ్జి ఆమోదించిన ముసాయిదా షెడ్యూలుతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. రూ.కోటి అంత కంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 ఆగస్టు 16న జీవో 67 జారీ చేసింది. దీని ద్వారా టెండర్ల వ్యవస్థను వైఎస్ జగన్ అత్యంత పారదర్శకంగా మార్చారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం దోపిడీలో భాగంగా అనుసరించిన కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చే నిబంధనను కూడా వైఎస్ జగన్ తొలగించారు. ఇలా రివర్స్ టెండరింగ్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. 2019–24 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకు పైగా ఆదా చేశారు. శ్రీవారి ఖజానాకు రూ.వందలాది కోట్ల రూపాయలు మిగిల్చారు.రివర్స్ టెండరింగ్ ఇలా.. » టెండర్లో ఆర్థిక బిడ్ తెరిచాక తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ను ఎల్–1గా ఖరారు చేస్తారు. » ఎల్–1 కాంట్రాక్టర్ కోట్ చేసిన మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. ఆన్లైన్లో 2.30 గంటలపాటు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. » రివర్స్ టెండరింగ్ సమయం ముగిసేసరికి అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్కు సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు పనులు అప్పగిస్తారు. » 2016 ఆగస్టు 16 నుంచి శుక్రవారం వరకూ టీటీడీలో ఇదే విధానం ప్రకారం టెండర్లు నిర్వహించారు. » టెండర్లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యమైన ముడిసరుకులు, స్వచ్ఛమైన నెయ్యిని తక్కువ ధరకే కొనుగోలు చేసి శ్రీవారి ఖజానాను పరిరక్షించారు. » టెండర్లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ముడిసరుకులు, నెయ్యి లేనట్లు పరీక్షల్లో తేలితే ఆ సరుకులు తెచ్చిన లారీ, నెయ్యి తెచ్చిన ట్యాంకర్ను సరఫరా సంస్థకే వెనక్కి పంపేశారు. » తద్వారా అత్యంత నాణ్యమైన ముడి సరుకులు, స్వచ్ఛమైన నెయ్యిని కాంట్రాక్టు సంస్థలు టీటీడీకి సరఫరా చేశాయి. -
ఖజానా దోపిడీకి లైన్ క్లియర్
ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన సర్కారే.. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ చేసింది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి (2003 జూలై 1న జారీ చేసిన జీవో 94) ప్రకారమే టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆగస్టు 28న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానిని అమలు చేస్తూ ఆదివారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 40) జారీ చేశారు. దీంతో 2014–19 మధ్య కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ ఖజానాను దోచేసినట్లుగానే ఇప్పుడూ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. సీబీఎస్ఈ సిలబస్ రద్దు.. ఇంగ్లిష్ మీడియం రద్దు.. టోఫెల్ వ్యవస్థ రద్దు.. సెబ్ రద్దు.. వలంటీర్ వ్యవస్థ రద్దు.. ఇలా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వ్యవస్థలన్నీంటినీ చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఈ పరంపరలో పొరుగు రాష్ట్రాల ప్రశంసలు పొందిన రివర్స్ టెండరింగ్ విధానాన్నీ తాజాగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ప్రతిపాదన దశలోనే బేరసారాలు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఒక పని ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో బేరసారాలాడి కమీషన్లు ఖరారు చేసుకునేవారు. ఈ మేరకు అంచనాలు పెంచేయించడం.. ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్కే ఆ పని దక్కేలా నిబంధనలను రూపొందించి టెండర్లు పిలవడం.. అదే కాంట్రాక్టర్కు అధిక ధరకు పనులు కట్టబెట్టడం.. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కాంట్రాక్టర్కు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చేసి.. వాటినే కమీషన్లుగా రాబట్టుకుని తమ జేబులో వేసుకోవడం రివాజుగా మార్చుకున్నారు. అప్పట్లో కేవలం టెండర్ల వ్యవస్థను నీరుగార్చి ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.20 వేల కోట్లను దోచేశారు. 7,500కోట్లు ఆదా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం వంటి విప్లవాత్మక సంస్కరణలను అమల్లోకి తెస్తూ 2019, ఆగస్టు 16న ఉత్తర్వులు(జీవో 67) జారీ చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులను పూర్తిగా రద్దు చేశారు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించడంతో కాంట్రాక్టర్లు భారీ ఎత్తున పోటీ పడ్డారు. దీంతో కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. 2019 ఆగస్టు 16 నుంచి 2024 మే వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ 2019, జూలై 26న నివేదిక ఇచ్చిన బీవోసీఈతోనే... ఆ విధానం రద్దు చేయాలంటూ గత నెల 21న చంద్రబాబు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. ఆ నివేదికను అదే నెల 28న కేబినెట్లో ఆమోదించి.. పాత విధానంలో టెండర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి0ది.– సాక్షి, అమరావతి -
ఖజానాకు కన్నం!
ఇలాంటి దోపిడీకి మళ్లీ రాచమార్గంపట్టిసీమ టెండర్లలో రూ. 257.45 కోట్ల లూటీ..2017–18లోనే కడిగేస్తూ కాగ్ నివేదికవైకుంఠపురం బ్యారేజ్ పనుల వ్యయాన్ని రూ.400 కోట్లు పెంచేసి 13.19 శాతం అధిక ధరలకు నవయుగకు ధారాదత్తంపోలవరం హెడ్వర్క్స్లో జల విద్యుత్ కేంద్రం పనులను నవయుగకు 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు అప్పగించిన బాబు మళ్లీ ఇప్పుడూ అదే రీతిలో కాంట్రాక్టర్లతో కలిసి ఖజానా దోచేసేందుకు సిద్ధంనీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకతకాంట్రాక్టర్లు రింగ్గా ఏర్పడి అధిక మొత్తం కోట్ చేయకుండా ఉంటారు.ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు.రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపుతారు.ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్ను ఎల్–1గా నిర్ణయిస్తారు. రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదంకంచే చేను మేస్తే?.. ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు గేట్లెత్తితే? రివర్స్ టెండరింగ్ విధానం రద్దుతో ఇప్పుడు అదే పునరావృతమవుతోంది!! ఖజానాకు టెండర్ పెట్టేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్తో టెండర్ల వ్యవస్థలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులకు మంగళం పాడింది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు రాష్ట్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. 2014–19 మధ్య ఉన్న పాత టెండర్ విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనుల అంచనా వ్యయాన్ని లెక్కకట్టక ముందే కమీషన్ ఎక్కువ ఇచ్చేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్తో కుమ్మక్కై తర్వాత అంచనా వ్యయాన్ని భారీగా పెంచడం.. ఆ కాంట్రాక్టర్కే పనులు దక్కే నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ .. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు పనులు అప్పగింత.. ఆ తర్వాత ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుల సంతర్పణ.. వాటినే కమీషన్లుగా వసూలు చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. – సాక్షి, అమరావతిఖజానాపై రూ.20 వేల కోట్ల భారం..రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఖజానా లూటీకి టెండర్ విధానాలను ఓ అస్త్రంగా మల్చుకున్నారు. పనుల ప్రతిపాదన దశలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాన్ని పెంచడం.. అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్కు పనులు దక్కేలా నోటిఫికేషన్ జారీ చేయడం.. సగటున 4.85 శాతం అధిక ధరలకు పనులను కట్టబెట్టి ఖజానాకు కన్నం వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కు మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాన్నే కమీషన్గా జేబులో వేసుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.⇒ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో 2015 మార్చిలో రూ.1,170.25 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. 21.999 శాతం అధిక ధరలకు అంటే రూ.1,427.70 కోట్లకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థ ఎల్–1గా నిలిచింది. ఆ సంస్థకు పనులు అప్పగించేశారు. దేశ చరిత్రలో కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు అత్యధికంగా అప్పగించిన టెండర్ ఇదే కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే అధిక ధరలకు కోట్ చేస్తే ఆ టెండర్ను రద్దు చేయాలి. అయితే చంద్రబాబు మాత్రం ఐదు శాతం అధిక ధరలు, ఏడాదిలో ఎత్తిపోతల పూర్తి చేస్తే 16.999 శాతం బోనస్గా ఇస్తామంటూ టెండర్ ఆమోదించేశారు. 2016 మార్చి నాటికి ఆ పథకం పూర్తయినా అప్పుడు గోదావరిలో ప్రవాహం లేనందున ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీటినేవి పరిగణనలోకి తీసుకోకుండా అక్రమంగా 21.999 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్కు అప్పగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.257.45 కోట్ల భారం పడింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కు పది శాతం నిధులను మొబిలైజేషన్ అడ్వాన్సులుగా అప్పగించి కమీషన్లు రాబట్టుకున్నారు. పట్టిసీమ టెండర్లో నాటి చంద్రబాబు సర్కార్ ఖజానాను కాంట్రాక్టర్కు దోచిపెట్టిందని కాగ్ 2017–18లో ఇచ్చిన నివేదికే ఇందుకు నిదర్శనం.⇒ ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని అమాంతం రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 13.19% అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు అప్పగించారు. అంచనాలు పెంచడం, అధిక ధరలకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ సిపార్సు మేరకు వైకుంఠపురం బ్యారేజీ పనుల టెండర్ను రద్దు చేయడంతో నవయుగ దోపిడీకి బ్రేక్ పడింది.⇒ 2014–19 మధ్య వివిధ శాఖల్లో మొత్తం రూ.3.51 లక్షల కోట్ల విలువైన పనులకు చంద్రబాబు సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఎన్నికల సంవత్సరం 2018–19లోనే రూ.1.27 లక్షల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. అధిక ధరలకు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం ద్వారా ఖజానాపై రూ.20 వేల కోట్ల మేర భారం వేసి ఆ మేరకు కమీషన్ల రూపంలో చంద్రబాబు తన జేబులో వేసుకున్నారు.⇒ 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ 2014–19 తరహాలోనే కాంట్రాక్టర్లతో కలిసి ఖజానాను దోచేసేందుకు సిద్ధమైనట్లు తాజాగా రివర్స్ టెండరింగ్ విధానం రద్దు నిర్ణయంతో స్పష్టమవుతోంది.రివర్స్ టెండరింగ్ ఇదీ..బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ (బీవోసీఈ) నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్పై 2019 ఆగస్టు 16న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబరు 67 జారీ చేసింది. ఈ విధానంలో జ్యూడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన కాంట్రాక్టు విలువను ఖరారు చేస్తూ టెండర్ షెడ్యూలు ముసాయిదాతోనే నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనివల్ల ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. టెండర్లో ఆర్థిక బిడ్ తెరిచాక తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ను ఎల్–1గా ఖరారు చేస్తారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ కోట్ చేసిన మొత్తానే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఆన్లైన్లో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్కు సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు పనులు అప్పగిస్తారు. గత ప్రభుత్వం 59 నెలల పాటు ఇదే పద్ధతిలో టెండర్లు నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా చేసింది.రివర్స్ టెండరింగ్తో పగిలిన అక్రమాల పుట్ట..2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రూ.వంద కోట్లు అంతకంటే అధిక వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్ను జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపాలని ఆదేశించారు. దీనిపై జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేలా విధాన నిర్ణయం తీసుకున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని టెండర్ ముసాయిదా షెడ్యూలులో మార్పుచేర్పులను జడ్జి సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే ముసాయిదా షెడ్యూల్ను యథాతధంగా ఆమోదిస్తారు. జ్యూడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూలుతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపట్టారు. ఇక రూ.కోటి అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించేలా విధానాన్ని రూపొందించారు. దీనిద్వారా టెండర్ల వ్యవస్థను అత్యంత పారదర్శకంగా మార్చారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే నిబంధనను తొలగించారు.⇒ రాష్ట్రంలో 2014–19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్కు వైఎస్ జగన్ ఆదేశించారు. తొలుత పోలవరం ఎడమ కాలువ అనుసంధానం (ప్యాకేజీ–65) పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ పనులను 2018లో రూ.278 కోట్ల అంచనా వ్యయంతో టీడీపీ సర్కార్ నిర్వహించిన టెండర్లలో 4.8 శాతం అధిక ధరలకు అంటే రూ.292.09 కోట్లకు మ్యాక్స్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై రూ.14.09 కోట్ల భారం పడింది. చంద్రబాబు సర్కార్ కాంట్రాక్టర్కు అప్పగించిన పనుల విలువ మొత్తం రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించి వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఆరు సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి. టీడీపీ హయాంలో రూ.292.09 కోట్లకు పనులను దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థే రివర్స్ టెండరింగ్లో రూ.231.47 కోట్లకే పనులు చేయడానికి ముందుకొచ్చింది. దాంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా చంద్రబాబు సర్కార్ అక్రమాలు బట్టబయలయ్యాయి.⇒ పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం)లో రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు చంద్రబాబు నామినేషన్పై కట్టబెట్టారు. ఇందులో 2019 మే 30 నాటికి రూ.1,771.44 కోట్ల విలువైన పనులు మిగిలాయి. హెడ్ వర్క్స్కు అనుసంధానంగా 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను కూడా నవయుగకే 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు చంద్రబాబు అప్పగించారు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వైఎస్ జగన్ ఈ రెండు పనులను రద్దు చేశారు. నవయుగకు అప్పగించిన విలువనే కాంట్రాక్టు విలువగా పరిగణించి రెండింటినీ కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్లతో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ పనులను 12.6 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,358.11 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629.44 కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు సర్కార్ గతంతో జలవిద్యుత్కేంద్రం పనులను 4.8 శాతం అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై రూ.154 కోట్ల భారం పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రివర్స్ టెండరింగ్ వల్ల రూ.783.44 కోట్లు ఆదా అవడంతో చంద్రబాబు అక్రమాలు మరోసారి నిరూపితమయ్యాయి.⇒ ఒక్క సాగునీటి ప్రాజెక్టుల పనుల్లోనే రివర్స్ టెండరింగ్ ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2,500 కోట్లకుపైగా ఆదా చేసింది. రహదారులు, భవనాలు, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర శాఖల్లో మొత్తం రూ.3,60,448.45 కోట్ల విలువైన 4,36,164 పనులకు టెండర్లు నిర్వహించగా రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.7,500 కోట్లకుపైగా ఖజానాకు ఆదా అయ్యాయి. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పారదర్శకమైన టెండర్ల విధానం అమల్లో ఉందని, ఇది దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని నాడు నీతి అయోగ్ ప్రశంసించడం గమనార్హం. -
Fact Check: ఎందుకీ ‘తొందరపాటు’?
సాక్షి, అమరావతి: ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 2022 సెపె్టంబరులో తయారైంది. అప్పటి ధరల ప్రకారం వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. అంటే ఈ ప్రాజెక్టు డీపీఆర్ 18 నెలల క్రితం ధరలతో తయారైంది. ఏ ప్రాజెక్టుకైనా ఏటా 6 శాతం ధరల పెరుగుదల ఉంటుంది. ఎగువ సీలేరు పీఎస్పీకి అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి, రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరిగింది. ఇందులో 9.87 శాతం ఎక్కువకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్–1 (తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థ)గా ఎంపికైంది. దానికే ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ధరల పెరుగుదల 6 శాతం పోగా మేఘా సంస్థ కోట్ చేసిన మొత్తం ఎక్కువేమీ కాదు. ఈ విషయం విష పత్రిక ఈనాడు అధినేత రామోజీకి తెలియనిదీ కాదు. పైగా, గత ఏడాది జూన్లో టెండర్లు పిలిచి, అన్ని నిబంధనలను పాటిస్తూ, రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లను ఏపీ జెన్కో ఖరారు చేసింది. అంటే 8 నెలలపాటు టెండర్ల ప్రక్రియ సాగింది. ఇందులో తొందరపాటేమీ లేదన్నదీ రామోజీకి తెలుసు. అయినా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏదోలా విషం చిమ్మి, ప్రజలను మభ్య పెట్టేయాలన్న తొందరపాటులో విషయం లేని ఈ కథనాన్ని అచ్చేశారు. ఈనాడు ప్రచురించిన ఈ అసత్య కథనాన్ని ఏపీ జెన్కో, ఇంధన శాఖ ఖండించాయి. ఆ రెండు సంస్థలు అసలు టెండర్లలో పారదర్శకత, నిబంధనలు అమలు తీరును ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు.. ♦ 2022 సెప్టెంబరు ధరల ప్రామాణికంగా ఈ పీఎస్పీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘‘వ్యాప్కోస్’ డీపీఆర్ తయారు చేసింది. డీపీఆర్ తయారై 18 నెలలు గడిచిపోయింది. డీపీఆర్ ఆధారంగా ఈ ప్రాజెక్టుకు టెండరు పిలిచిన మొత్తం రూ. 6,717 కోట్లు కాగా మేఘా రూ.7,380 కోట్లకు (9.87 శాతం ఎక్కువకు) టెండరు పొందింది. ఏడాదిన్నర క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు మేఘా కోట్ చేసిన బిడ్లో ఏడాదికి 6 శాతం పెరుగుదలా ఉంది. అందువల్ల ప్రతిపాదిత టెండరు మొత్తంకంటే 9.87 శాతం ఎక్కువనడానికి లేదు. అన్ని అంశాలను విశ్లేషించిన తర్వాతే ప్రభుత్వ ఆమోదంతో ఏపీజెన్కో ఈ టెండరును ఆమోదించింది. ♦ ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ అవసరాలు తీర్చడం ద్వారా గ్రిడ్ను స్థిరీకరించడం, అధిక ధరకు మార్కెట్లలో విద్యుత్ కొనుగోళ్లు తగ్గించడం, కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలుగా ప్రభుత్వ ఆదేశంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిరి్మంచాలని ఏపీజెన్కో నిర్ణయించింది. ♦ కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలకు ఈ ప్రాజెక్టు అనుమతికి సంబంధించిన అన్ని పత్రాలు అందజేసి, త్వరితగతిన వివరణలు ఇవ్వడం ద్వారా ఏపీజెన్కో చట్టబద్ధమైన అనుమతులు సాధించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అనుమతి పొందిన తర్వాత గత ఏడాది జూన్లో పీఎస్పీ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. పూర్తిగా నిబంధనలు, విధివిధానాలను అనుసరించి ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండరు ఖరారు చేసింది. అన్ని నిబంధనలు పాటించినందునే టెండరు ఖరారుకు ఎనిమిది నెలలు పట్టింది. టెండర్ల ఖరారులో ఎలాంటి తొందరపాటు లేదనడానికి ఇదే నిదర్శనం. ♦ ఈ ఏడాది జనవరికల్లా పనులు ప్రారంభించి 2028 డిసెంబరుకల్లా ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా ఐఎన్డీసీ, సీఓపీ మార్గదర్శకాల ప్రకారం కర్బన ఉద్గారాలను, భూతాపాన్ని తగ్గించాలని సీఈఏ షెడ్యూలు ఇచ్చింది. కర్బన ఉద్గారాల తగ్గింపు, భూతాపం (వేడి) నియంత్రణకు 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాదనకు పీఎస్పీ, బ్యాటరీలే మార్గాలు. ఇంత పెద్ద పరిమాణంలో బ్యాటరీల ఏర్పాటు సాధ్యంకానందున పీఎస్పీల నిర్మాణమే ఉత్తమ మార్గం. అందువల్లే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఈ పీఎస్పీ నుంచి డిస్కంలు విద్యుత్ తీసుకునేందుకు ఏపీఈఆర్సీ, ఏపీపీసీసీ అనుమతులు కూడా లభించాయి. భూసేకరణ ప్రణాళిక కూడా రూపొందించిన తర్వాత సీఈఏ అనుమతించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మొదటి దశ పర్యావరణ అనుమతి ఇచ్చింది. ♦ భూసేకరణ, జీఎస్టీ, ఐడీసీ, ధరల పెరుగుదల వల్ల పెరిగే వ్యయం, చట్టబద్ధమైన అనుమతులు అన్నీ కలిపి 2022 ధరల ప్రాతిపదికన ఈ పీఎస్పీ నిర్మాణానికి రూ. 11,881.50 కోట్లవుతుందన్న అంచనాతో 2022సెప్టెంబర్ లో వ్యాప్కోస్ డీపీఆర్ రూపొందించింది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 6,717 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహా్వనించి రూ. 7,380 కోట్లకు (జీఎస్టీ కాకుండా).. అంటే 9.87 శాతం ఎక్కువకు కాంట్రాక్టు ఖరారు చేసింది. -
రామోజీ మార్కు స్మార్ట్ బ్లండర్!
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి రివర్స్ టెండర్లు కూడా నిర్వహించాకే ఖరారు చేస్తే అదేదో ఘోరమైనట్లుగా ఈనాడు రామోజీ చిత్రీకరిస్తున్నారు. కడప జిల్లా వాసులు అసలు వ్యాపారాలే చేయకూడదన్నట్లుగా స్మార్ట్ మీటర్ల టెండర్ దక్కించుకున్న సంస్థపై ఈనాడు పదేపదే విషం గక్కుతోంది. ఈనాడు కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు స్పష్టం చేశారు. కోవిడ్లో అధిక ధర.. అందుకే రద్దు వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ అందించడం, ప్రమాదాలకు తావు లేకుండా, మీటర్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫార్మర్ల భద్రతని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ లేదా ఐఆర్డీఏ మీటర్లను రక్షణ పరికరాలతో అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు టెండర్ రూపొందించిన డిస్కమ్లు న్యాయ సమీక్షకు పంపించాయి. 15 రోజుల సలహాలు, అభ్యంతరాలను సేకరించిన అనంతరం ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా డిస్కమ్లు టెండర్లను పిలిచాయి. ఎల్1 గా నిలిచిన బిడ్డర్కు టెండర్ అప్పగించాయి. అయితే ఈ ప్రక్రియ కోవిడ్ సమయంలో జరిగినందువల్ల సంస్థలు, ఫ్యాక్టరీలు మూతపడి ఉండడం, టెండర్ విలువ అధికంగా ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేసింది. మళ్లీ పిలవడంతో ఆదా.. ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నది అక్షర సత్యమే. రీ టెండరింగ్ ద్వారా ధర మొదటి సారి కంటే 15.75% తగ్గింది. ఏర్పాటుకు 27 నెలలు, నిర్వహణకు 93 నెలలుగా కేంద్ర ప్రభుత్వం వ్యవధి పెంచింది. దీనివల్ల మీటర్ గ్యారంటీ పీరియడ్ 10 ఏళ్లకు పెరిగింది. నిర్వహణ సమయం పెరగడం డిస్కమ్లకు వ్యయంలో 2 శాతం ఆదా అవుతుంది. షిరిడీ సాయి, అదాని లాంటి పెద్ద సంస్థలు పోటీ పడటం వల్ల ఈ ప్రాజెక్టుకు సరైన ధర వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోలికలా?.. హవ్వ! స్మార్ట్ మీటర్ల విధానాన్ని దేశంలో మొదటిగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టలేదు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లను పట్టణ ప్రాంతాల్లోని స్మార్ట్ మీటర్ విధానంతో పోల్చడం, ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు చేయడం ‘ఈనాడు’ ద్వంద్వ నీతికి నిదర్శనం. ఏదైనా ఓ వ్యవస్థను మరో సమానమైన దానితో పోల్చడానికి అవి రెండూ ఒకే వ్యవస్థలు అయి ఉండాలి కదా? ఆ మాత్రం కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లకు సంబంధించి రైతులపై బిల్లులు, ట్రూఅప్ లాంటి భారమేదీ మోపట్లేదు. రక్షణ పరికరాలతో సహా మొత్తం ఉచితంగానే ప్రభుత్వం అందచేస్తోంది. -
పూర్తవని ఈ–టెండర్పై.. ఈ తప్పుడు రాతలేంటి.!
సాక్షి, అమరావతి: వెన్నంటి ఉండేవారిని సన్నిహితులంటారు. వదిలేసి వెళ్లిపోయిన వారిని సన్నిహితులని ఈనాడు రామోజీరావు మాత్రమే అనగలరు. న్యాయ సమీక్షను తప్పుబట్టగలరు. రివర్స్ టెండరింగ్ చెడ్డదని రాయగలరు. ఆయన అనుకున్నది సాధించడానికి ఏదైనా అచ్చేయగలరు. నిస్సిగ్గుగా అబద్ధాలను జనంపై రుద్దేయగలరు. అంతమాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియవనుకుంటే పొరపాటే. అసలు ఈనాడు రామోజీరావు దృష్టిలో అవినీతి అంటే ఏమిటి? ఎక్కడా లేని రీతిలో రూ.2.28 లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో రాష్ట్ర ప్రజలకు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది అవినీతా? లేక గత ప్రభుత్వంలా దోచుకోవడం పంచుకోవడం అవినీతా? సీఎం స్థానంలో చంద్రబాబును కూర్చోబెట్టాలనే ఆరాటంలో పత్రిక విలువలను దిగజార్చి, జర్నలిజం నియమాలను తుంగలో తొక్కి, సొంత అజెండాతో కథనాలు రాయడం ఈనాడుకు నిత్యకృత్యమైంది. ఇదే ధోరణితో ఇంకా పూర్తి కాని భూగర్భ విద్యుత్ లైన్ల టెండర్లపై ఓ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఆ రాతల వెనుక అసలు నిజాలు ఇలా ఉన్నాయి.. ఆరోపణ: అది జగన్కు అత్యంత సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వాస్తవం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నిహితుడు అయితే వైఎస్సార్సీపీని ఎందుకు విడిచిపెట్టి వెళ్లారు? జగన్ మీద రాజకీయ ప్రతీకారంగా కేసులు పెట్టి, జైల్లోకి పంపిన కాంగ్రెస్లోకి ఎలా వెళ్తారు? ఏ రకంగా సన్నిహితుడని చెప్తారు? అసలు ఎవరు ఎవరికి సన్నిహితులో ఈనాడుకు తెలియంది కాదు. రామోజీ వియ్యంకుడు నవయుగ వారికి చెందిన సంస్థ కాదా? ఆర్వీఆర్ అనే సంస్థ వారికి చెందిన వారిది కాదా? సుధాకర్ యాదవ్ యనమలకు వియ్యంకుడు కాదా? అందుకే పోలవరంలో నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టు దక్కలేదా? సీఎం రమేష్ మీవాడు కాదా? వారి సంస్థ రిత్విక్కు నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టలేదా? నామా నాగేశ్వరరావు, గరికపాటి మోహన్రావు మీ వాళ్లు కాదా? రామోజీరావు ఓన్ చేసుకోవాలంటే వీళ్లని ఓన్ చేసుకోవాలి. ఆరోపణ: ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంస్థల్లో దేనికి ఏ కాంట్రాక్టు వెళ్లాలో ముందే ఖరారైపోతుంది. వాస్తవం: రాష్ట్రంలోని జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. ముందుగా టెండర్లు తీసుకుని 2 వారాల సమయం ఇచ్చి పబ్లిక్ డొమైన్లో వాటిని పెట్టి అభ్యంతరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి స్వీకరిస్తారు. ఆ మేరకు మార్పులు చేస్తారు. మళ్లీ టెండర్లు పిలుస్తారు. టెండర్లు ఖరారు చేశాక రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. ఇంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ దేశంలో ఎక్కడాలేదు. మరి భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల టెండర్ల ప్రక్రియలో రామోజీరావు ఎందుకు పాల్గొనలేదు? ఆరోపణ: టెండర్ నిబంధనలు ఎలా ఉండాలో అధికారులకు ఆయనే నిర్దేశిస్తారు. వాస్తవం: ‘ఆర్డీఎస్ఎస్’ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పటిష్టత కోసం భూగర్భ విద్యుత్ కేబుళ్లు అమర్చాలని ప్రణాళిక రూపొందించారు. రూ..1,165.41 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు నివేదికను 2022 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.699.25 కోట్లు గ్రాంట్ రూపంలో వస్తుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన నోడల్ ఏజెన్సీ పీఎఫ్సీ ఆమోదించిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్కి అనుగుణంగా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. దీని నిబంధనలను ఎవరో ఒకరు మార్చేసే అవకాశం లేదు. ఆరోపణ: పనులు అవే.. అంచనాలు పెంచేయడం వల్ల అదనంగా ఖర్చు వాస్తవం: భూగర్భ విద్యుత్ పనుల్లో అధికంగా వినియోగించే కేబుల్స్ ధరల్లో భారీ వ్యత్యాసం కారణంగా టెండర్ ధర అధికంగా వచ్చింది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను 2021లో తయారు చేశారు. ఆ సమయంలో కేబుల్ ధరలు 2018–19 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరంలో డిస్కం కొనుగోలు చేసిన ధరలకు అనుగుణంగా తీసుకున్నారు. అయితే కోవిడ్ మహమ్మారి తెచ్చిన సంక్షోభం, విధించిన ఆంక్షల కారణంగా సరఫరా వ్యవస్థ బాగా ప్రభావితమైంది. ముడిసరుకులైన అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి వాటి ధరలు బాగా పెరిగాయి. కవర్ కండక్టర్, ఎక్స్ఎల్పీఈ కేబుల్స్, 33 కేవీ, 11 కేవీ ఆర్ఎంయూలు మొదలైనవి, అలాగే లేబర్ రేట్లు కూడా పెరిగాయి. వీటి ఆధారంగా మంజూరైన ధరతో పోలిస్తే బిడ్డర్లు కోట్ చేసిన రేట్లలో సహజంగానే పెరుగుదల ఉండవచ్చు. ఆరోపణ: పోటీలో ఆ రెండు కంపెనీలే వాస్తవం: రింగ్ మెయిన్ యూనిట్లు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం పోర్టల్లో టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇందులో బీహెచ్ఎల్, ఏబీబీ, సీమెన్స్, స్పైడర్ వంటి తయారీ సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ టెండర్ ప్రక్రియ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా పూర్తి పారదర్శకంగా జరుగుతోంది. ఆసక్తి కలిగిన గుత్తేదారులందరూ ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఈ సాధారణ ప్రక్రియలో కనీస ధర ప్రతిపాదించి ఎల్ 1గా అర్హత పొందిన గుత్తేదారుకు మాత్రమే పనులు దక్కించుకొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ గ్రాంటును పొందడానికి టెండర్ను నిర్ణీత వ్యవధిలో ఖరారు చేయవలసి ఉంది. ఈ కారణంగా టెండర్ వివరాలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ పరిశీలనకు పంపించారు. వాస్తవాలు ఇలా ఉంటే అడ్డగోలుగా కట్టబెట్టేశారని రామోజీ గగ్గోలు దేనికో..!! ఆరోపణ: రివర్స్ టెండరింగ్ ఓ బూటకం వాస్తవం: 2022 డిసెంబర్ 9న జ్యుడిషియల్ ప్రివ్యూ ఇచ్చిన ఆమోదం మేరకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా 2022 డిసెంబర్ 12న మొదటి టెండర్ ప్రకటన జారీ చేశారు. ఈ బిడ్ నెం.09/2022–23లో ఇద్దరు గుత్తేదార్లు పాల్గొన్నారు. సాంకేతిక పరిశీలన అనంతరం షిర్డీ సాయి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీల బిడ్లు అర్హత సాధించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రైస్ బిడ్స్లో ఎల్ 1 బిడ్డర్గా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆర్సీఐఎల్ అర్హత సాధించింది. గుత్తేదార్లు కోట్ చేసిన రేటు అధికంగా ఉండటం వల్ల రివర్స్ టెండర్ ప్రక్రియ కొనసాగించారు. గుత్తేదార్ల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో టెండర్ను రద్దు చేశారు. తిరిగి ఏప్రిల్లో రెండోసారి టెండర్ ఆహ్వానించారు. ఈ రీ టెండరీంగ్ సమయంలో రింగ్ మెయిన్ యూనిట్ల పరికరాలను టెండర్ నుంచి మినహాయించారు. ఈ పరికరాల నాణ్యత, దీర్ఘకాల గ్యారెంటీ సౌకర్యం కోసం వాటిని డిస్కం ప్రత్యేకంగా కొనాలని నిర్ణయించింది. రింగ్ యూనిట్లు మినహాయించిన ఈ టెండర్లలో నలుగురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు. ఇందులో ఇద్దరు అర్హత సాధించగా సంబంధిత ధర నిర్ణయం కోసం రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ధరల ప్రకారం 2022–23 ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) ఆధారిత అంచనాలకు మించి 8 శాతం అధికంగా ఎల్1 బిడ్డర్ ఆర్సీఐఎల్ దాఖలు చేసింది. ఇంత పక్కాగా, పూర్తి పారదర్శకంగా ఈ టెండర్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో బూటకం ఏముంది? -
సీఎం జిల్లా వారైతే అనర్హులా.!
సాక్షి, అమరావతి: విదేశీయులు మన దేశంలో కంపెనీలు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఎంతో మంది దేశ, విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఆ ఊరు, ఈ ఊరు అనే తేడా లేదు. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు ఎక్కడైనా అర్హత ఉన్న ఎవరైనా చట్టం, నిబంధనల మేరకు ఏదైనా చేయవచ్చు. దీనిని విశ్యవ్యాప్తంగా ఎవరూ కాదనరు. కానీ ఈనాడుకు మాత్రం సీఎం సొంత జిల్లా వారు ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని, టెండర్లు దక్కించుకోకూడదన్న అభిప్రాయం నరనరానా జీర్ణించుకుపోయింది. అందుకే వారు వ్యాపారాలకు అనర్హులనేలా కథనాలు అల్లుతోంది. పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చ డానికి సీలేరులో రెండు అదనపు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) టెండర్లు పిలిచింది. అత్యంత పారదర్శకంగా బిడ్లు ఆహ్వానించి, రివర్స్ టెండరింగ్ ద్వారా టెండరు ఖరారు చేసింది. కానీ ఇదంతా తప్పన్నట్టు ‘ఈనాడు’ శుక్రవారం ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక అధినేత రామోజీరావు పచ్చళ్లు అమ్ముకోవచ్చు.. పత్రికనూ నడుపుకోవచ్చు.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి మాత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు టెండర్ ఇవ్వకూడదు. వారికి, వారు కొమ్ముకాస్తున్న వారికి ఒక న్యాయం.. సీఎం సొంత జిల్లా వారైతే మరో న్యాయం.. ఇదేం రామోజీ జర్నలిజం. ఏపీ జెన్కో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ టెండర్లలో వాస్తవాలు అంశాల వారీగా ఇలా ఉన్నాయి. ఆరోపణ: వైఎస్సార్ జిల్లాకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టింది. ఈ సంస్థ వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యక్తికి సంబంధించినది కావడమే దానికి ఉన్న ఏకైక అర్హత. వాస్తవం: ఏపీ జెన్కో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారానే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఈ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఇందులో ఏపీ జెన్కో, ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. ఈ కన్సార్టియం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రతిష్టాత్మక బీహెచ్ఈఎల్తో ఈ ప్రాజక్టు యంత్ర పరికరాల సరఫరాకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న యూనిట్లకు కూడా బీహెచ్ఈఎల్ యంత్ర పరికరాలు సరఫరా చేసింది. కన్సార్టియంలోని మరో కంపెనీ పీఈఎస్కు ఇదివరకే ఈ ప్రాజక్టులో సివిల్ పనులు చేసిన అనుభవముంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని, కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసింది. ఈ ప్రాజక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2024కల్లా పూర్తవుతాయి. ఆరోపణ: దిగువ సీలేరులో రెండు అదనపు యూనిట్ల నిర్మాణానికి అయ్యే వ్యయం, జీఎస్టీ, ఆలస్యానికి అయ్యే వడ్డీతో కలిపి రూ. 571 కోట్ల రుణాన్ని గ్రామీణ విద్యుత్ సంస్థ (ఆర్ఈసీ) నుంచి ప్రభుత్వం తీసుకుంది. వాస్తవం: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ప్రాజెక్టుల నిర్మాణం కోసం రుణం తీసుకో వడం సర్వసాధారణం. ఇందులో తప్పేముంది? ఆరోపణ: ఇప్పటికే షిర్డీ సాయి, దాని అనుబంధ సంస్థలకు రూ. 92 వేల కోట్ల విలువైన వివిధ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం కట్టబెట్టింది. వాస్తవం: ఏపీ జెన్కోగానీ, డిస్కంలు గానీ నామినేషన్ పద్ధతిలో ఏ పనులూ ఎవరికీ కేటాయించలేదు. వివిధ ప్రాజెక్టుల కోసం పారదర్శకంగా టెండర్లు నిర్వహించాయి. అర్హతల మేరకు పోటీ బిడ్డింగ్లో పాల్గొని ఏ సంస్థ అయినా పనులు దక్కించుకోవచ్చు. ఆరోపణ: ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం కట్టబెట్టింది. వాస్తవం: అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ (గ్లోబల్ టెండర్లు– ఇ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారం) ద్వారా ఏపీ జెన్కో టెండర్లు పిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జుడిషియల్ కమిషన్ కూడా సమీక్షించి ఈ ప్రాజెక్టు టెండర్లకు ఆమోదం తెలిపింది. రాఘవ ఎంటర్ప్రైజెస్, ఎన్సీసీ, పీఈఎస్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిపి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ జాయింట్ వెంచర్ సంస్థ బిడ్లు దాఖలు చేసింది. టెండర్లలో కోట్ అయిన అతి తక్కువ మొత్తాన్ని గరిష్టంగా తీసుకుని ఏపీజెన్కో రివర్స్ టెండర్లు నిర్వహించింది. ఈ రివర్స్ టెండరింగ్లో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ తక్కువ మొత్తానికి ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చి కాంట్రాక్టు దక్కించుకుంది. రెండు దశల (సాంకేతిక, ఆర్ధిక) బిడ్డింగ్ ప్రాతిపదికన ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు సంస్థను ఎంపిక చేసింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వల్ల ఏపీ జెన్కోకు దాదాపు రూ.10 కోట్లు ఆదా అయ్యింది. ఆరోపణ: ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతులు రాకముందే హడావుడి చేసింది. వాస్తవం: విద్యుత్ కేంద్రం ప్రతిపాదనను ఏపీఈఆర్సీకి ముందే చెప్పారు. ప్రతిపాదనను పరిశీలించి డిస్కంలు, జెన్కో కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుని కమిషన్ అనుమతి కోసం అప్పుడు పంపాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఈ నెల 7న వచ్చింది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం రూ.1000 కోట్లు దాటనందున కేంద్ర విద్యుత్ ప్రాధికారిక సంస్థ (సీఈఏ) అనుమతి అవసరం లేదు. ఆరోపణ: రెండు కొత్త యూనిట్లు నిర్మించడం వల్ల దిగువ సీలేరు ప్రాజెక్టు నుంచి అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. వాస్తవం: జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మన గ్రిడ్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు 115 మెగావాట్ల యూనిట్లు ఏటా దాదాపు 1100 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. దిగువ సీలేరు విద్యుత్ కేంద్రం మొట్టమొదట నిర్మించినప్పుడే ఆరు యూనిట్ల ఏర్పాటుకు కావలసిన ప్రధాన మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో అదనంగా మరో రెండు 115 మెగావాట్ల యూనిట్లు నిర్మించాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. కొత్త యూనిట్లు నెలకొల్పడం వల్ల ఈ విద్యుత్ కేంద్రం గరిష్ట లోడ్ సామర్ధ్యం పెరుగుతుంది. దాంతో మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనవలసిన అవసరం తగ్గుతుంది. ప్రతి 115 మెగావాట్ల యంత్రం పీక్ డిమాండ్ సమయంలో సగటున 175 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల డిస్కంలకు ఏటా 350 మిలియన్ యూనిట్లు విద్యుత్ మార్కెట్లో కొనాల్సిన అవసరం తగ్గి, ఆ మేరకు లాభం చేకూరుతుంది. పీక్ సమయాల్లో మార్కెట్ రేటు యూనిట్కు దాదాపు రూ.10 ఉంటోంది. సరాసరి పీక్ లోడ్ విద్యుత్ ధర రూ.8.0 అనుకున్నా ఈ రెండు యూనిట్ల వల్లా ఏటా దాదాపు రూ .280 కోట్లు ఆదా అవుతుంది. -
రివర్స్ టెండరింగ్తో రూ.44.15 కోట్లు ఆదా
బి.కొత్తకోట: జలవనరుల శాఖలో రివర్స్ టెండరింగ్తో కోట్లు ఆదా అవుతున్నాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో సాగే ఏవీఆర్ హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల ప్రారంభంలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 20న ప్రాజెక్టు మదనపల్లె ఎస్ఈ సీఆర్ రాజగోపాల్ కంపెనీల సాంకేతిక అర్హతలను పరిశీలించగా సోమవారం కంపెనీలు దాఖలుచేసిన ప్రైస్బిడ్ను తెరిచారు. ఇందులో హైదరాబాద్కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ రివర్స్ టెండరింగ్లో లెస్కు టెండర్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె నుంచి హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)పై కిలోమీటరు 79.600 నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో కిలోమీటరు 220.350 వరకు కాలువను విస్తరించే పనులకు ప్రభుత్వం రూ.1,219,93,02,150 అంచనాతో టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులు దక్కించుకునేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెండర్లు దాఖలు చేశాయి. తొలుత టెండర్లను దాఖలు చేసిన కంపెనీల సాంకేతిక అర్హత, అనుభవం, సామర్థ్యంపై డాక్యుమెంట్లను ఈనెల 20న పరిశీలించగా రెండింటీకి అర్హత ఉన్నట్లు నిర్ధారౖణెంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ప్రైస్బిడ్ను తెరిచారు. ఇందులో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ అంచనాకంటే 3.42 శాతం అదనంతో రూ.1,261,65,18,283.53కు టెండర్ దాఖలు చేసింది. అనంతరం దీనిపై ఎస్ఈ రాజగోపాల్ రివర్స్ టెండరింగ్ ప్రారంభించి సా.5.30 గంటలకు ముగించారు. ఇందులో రెండు కంపెనీలు పోటీపడినా చివరికి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వ అంచనా విలువకంటే 0.1997 శాతం తక్కువకు అంటే..రూ.1,217,49,40,146.53తో టెండర్ దాఖలుచేసి ఎల్–1గా నిలిచింది. ఈ రివర్స్ టెండర్ నిర్వహణవల్ల ప్రభుత్వానికి రూ.44,15,78,137 ఆదా అయ్యింది. ఇక ఎల్–1గా నిలిచిన కంపెనీకి పనుల అప్పగింత కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. -
263 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) మరో 263 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ‘ఈ’ కామర్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టెండర్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని ఆర్టీసీ ఈడీ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కేటగిరీల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు ఏసీ స్లీపర్ 4, నాన్ ఏసీ స్లీపర్ 6, సూపర్ లగ్జరీ 12, అల్ట్రా డీలక్స్ 15, ఎక్స్ప్రెస్ 30, అల్ట్రా పల్లె వెలుగు 95, పల్లె వెలుగు 72, మెట్రో ఎక్స్ప్రెస్ 27, సిటీ ఆర్డినరీ 2. జిల్లాల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు శ్రీకాకుళం జిల్లా 23, పార్వతీపురం మన్యం 29, విజయనగరం 12, విశాఖపట్నం 42, అనకాపల్లి 16, కాకినాడ 35, తూర్పుగోదావరి 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 24, పశ్చిమ గోదావరి 29, కృష్ణా 4, ఎన్టీఆర్ 3, గుంటూరు 2, పల్నాడు 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5, తిరుపతి 8, అన్నమయ్య 5, నంద్యాల 3, అనంతపురం 8, శ్రీసత్యసాయి జిల్లా 11. బస్సు రూట్లు, టెండరు నిబంధనల కోసం సంప్రదించాల్సిన ఆర్టీసీ వెబ్సైట్: https:// apsrtc.ap.gov.in -
హంద్రీ–నీవా సామర్థ్యం పెంపునకు శ్రీకారం
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులతో కృష్ణా నదికి వరద ప్రవాహం వచ్చే రోజులు తగ్గినందున.. గతం కంటే తక్కువ రోజుల్లో శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వర్షాభావ ప్రాంతమైన రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో –4.806 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,450 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచబోతోంది. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా కాలువ విస్తరణ, 8 చోట్ల ఎత్తిపోతలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి ఈనెల 1న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. –4.806 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు రూ.2,487.02 కోట్లు, 88 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు చేయాల్సిన పనులకు రూ.2,165.46 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ విధానంలో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు నెలాఖరులోగా పనులు అప్పగించి.. మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 73 రోజుల్లోనే ఒడిసిపట్టేలా.. శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించేలా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా పనులు చేపట్టారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో కృష్ణా నదికి వరద వచ్చే రోజులు గణనీయంగా తగ్గాయి. అనేకసార్లు వరద ఒకేసారి గరిష్ట స్థాయిలో వస్తోంది. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టేలా కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం లేకపోవడంతో ఏటా వందలాది టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే 73 రోజుల్లోనే హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. -
పేదల ఇళ్ల సామగ్రిలో రూ.5,120 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ సామగ్రిలో (మెటీరియల్) రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా గృహ నిర్మాణశాఖ భారీగా ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసింది. తొలిదశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు ఇసుకను మినహాయించి మిగతా 12 రకాల మెటీరియల్కు రివర్స్ టెండర్లను నిర్వహించగా ఏకంగా రూ.5,120 కోట్ల మేర ఆదా అయింది. సిమెంట్, స్టీలు, డోర్లు, శానిటరీ, పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, టాయిలెట్ సామాన్లు, నీటి సరఫరా తదితర 12 రకాల మెటీరియల్కు జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం అనంతరం టెండర్లను ఆహ్వానించడమే కాకుండా అనంతరం రివర్స్ టెండర్లను గృహ నిర్మాణ శాఖ నిర్వహించింది. ఈ రివర్స్ టెండర్లు సత్ఫలితాలనిచ్చాయి. ఐఎస్ఐ మార్కు కలిగిన నాణ్యమైన మెటీరియల్ తక్కువ ధరకే లభ్యమయ్యాయి. 12 రకాల మెటీరియల్కు ఒక్కో ఇంటికి రివర్స్ టెండర్కు ముందు రూ.1,31,676 చొప్పున వ్యయం కానుండగా రివర్స్ టెండర్ల ద్వారా రూ.98,854కే లభించాయి. అంటే ఒక్కో ఇంటికి 12 రకాల మెటీరియల్లో రూ.32,822 చొప్పున ఆదా అయింది. తొలిదశలో నిర్మించనున్న 15.60 లక్షల ఇళ్లను పరిగణలోకి తీసుకుంటే మొత్తం రూ.5,120 కోట్లు ఆదా అయింది. లబ్ధిదారుల ఐచ్ఛికమే మన ఇంటికి ఎలాంటి నాణ్యమైన మెటీరియల్ వినియోగిస్తామో పేదల ఇళ్లకు కూడా అలాంటి మెటీరియలే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుకు అనుగుణంగా నాణ్యమైన మెటీరియల్ తక్కువ ధరకు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నాం. 12 రకాల మెటీరియల్కు రివర్స్ టెండర్లు నిర్వహించగా ఒక్కో ఇంటి మెటీరియల్లో రూ.32,822 చొప్పున ఆదా అయింది. ప్రభుత్వం సరఫరా చేసే నాణ్యమైన, తక్కువ ధరకు దొరికే మెటీరియల్ను తీసుకోవాలా వద్దా అనేది ఇళ్ల లబ్ధిదారుల ఇష్టమే. వలంటీర్లు లబ్ధిదారుల వద్దకు వెళ్లి ప్రభుత్వం సరఫరా చేసే మెటీరియల్ వివరాలను తెలియచేస్తారు. లబ్ధిదారులు కోరిన మెటీరియల్ సరఫరా చేస్తాం. 12 రకాల మెటీరియల్లో ఒకటి లేదా రెండు కావాలన్నా కూడా అంతవరకే సరఫరా చేస్తాం. ఇది పూర్తిగా లబ్ధిదారుల ఐచ్ఛికమే. ఎక్కడా బలవంతం లేదు. – అజయ్జైన్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
ఏపీ గృహ నిర్మాణశాఖ రివర్స్ టెండరింగ్తో భారీగా ఆదా
సాక్షి, అమరావతి: ఏపీ గృహ నిర్మాణ శాఖలో చేపట్టిన రివర్స్ టెండరింగ్ సత్పాలితాలనిస్తోంది. తాజాగా వెల్లడైన నివేదికల్లో భారీగా ఆదా అయినట్టు గృహ నిర్మాణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం తొలివిడతలో 6500 కోట్ల రూపాయలు మిగలనున్నాయి. ఒక్కో ఇంటి వ్యయంపై రూ.32,821 ఆదా అవుతున్నాయి. ఒక్కో ఇంటికి 14 వస్తువులకు రూ. లక్షా 31 వేల 676 ఖర్చు అవుతుండగా.. రివర్స్ టెండరింగ్లో రూ. 88 వేల 854కు భారం తగ్గింది. లబ్ది దారులు కోరుకున్న ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులే ఏపీ ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఉచిత ఇసుక సరఫరాతో కలిపి లబ్ధిదారులకు 6500 కోట్ల రూపాయలు ఆదా అవనుంది. ఇసుక కాకుండా 14 రకాల వస్తువులపై 5 వేల 120 కోట్ల రూపాయలు ఆదా అవనుంది. చదవండి: ఆంధ్రప్రదేశ్లో 20న మొహర్రం సెలవు -
2 Years YSJagan ane nenu: ‘రివర్స్’లో అదుర్స్
వెబ్డెస్క్: సాగునీటి ప్రాజెక్టులంటే అవినీతికి ఆనవాళ్లు అనే పేరు. గత ప్రభుత్వం ఆ నానుడిని నిజం చేసి చూపింది. అవినీతికి కేరాఫ్ అడ్రస్ పోలవరం పనులు అనేట్టుగా మార్చేసింది. ఇకపై కూడా అదే పంథా కొనసాగుతుంది.. ప్రజా ధనాన్ని దోచేసుకుందాం.. అనుకులే వాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది జగన్ సర్కారు. పారదర్శకతకు పెద్ద పీట ప్రాజెక్టులు, పనులు, కాంట్రాక్టుల్లో అత్యంత పారదర్శక విధానాన్ని ప్రవేశ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అక్రమార్కుల తప్పుడు అంచనాలకు అడ్డుకట్ట వేశారు. ఫలితంగా రివర్స్ టెండరింగ్ ద్వారా రెండేళ్ల కాలంలో రూ. 5,070 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా నిలువరించ గలిగారు. ప్రజా ధనానికి కాపలా జాతీయ ప్రాజెక్టయిన పోలవరంతో రివర్స్ టెండరింగ్ మొదలు పెట్టి ఇతర సాగునీటి ప్రాజెక్ట్లతో పాటు మున్సిపల్, విద్య, వైద్య, విద్యుత్, హౌసింగ్, పంచాయతీరాజ్ సహా పలు శాఖల్లో అమలు చేశారు. కాంట్రాక్టుల్లో పారదర్శక విధానాలు అమలు చేయడం ద్వారా భారీగా ప్రజా ధనాన్ని ఆదాచేయగలిగారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవనరుల శాఖలో 26 పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1824.65 కోట్ల ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం ఆదా చేయగలిగింది. ఇళ్ల నిర్మాణంలో రూ. 1203 కోట్లు రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం అందించే పక్కా గృహాల నిర్మాణంలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. అధిక రేట్లకు టెండర్లకు ఆమోదం తెలపడం ద్వారా అటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. అంతేకాదు సబ్సిడీ తరువాత లబ్దిదారులు తమవంతుగా తిరిగి చెల్లించాల్సిన సొమ్మును కూడా అధికం అయ్యేలా చేశారు. అధికారం చేపట్టిన వెంటనే సీఎం జగన్ దీనిపై దృష్టి సారించారు. ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (టిడ్కో) లో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దీంతో గృహనిర్మాణశాఖ (ఏపీ టిడ్కో)లో చేపట్టిన 12 పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 392.23 కోట్ల రూపాయల ఆదా అయ్యింది. మరోవైపు గహనిర్మాణశాఖలో గ్రామీణ ప్రాంతాల్లో 5 పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్టెండరింగ్లో రూ.811.32 కోట్లు మిగులు వచ్చేలా చేసింది ఏపీ ప్రభుత్వం. ఒకదాని వెంట ఒకటి పంచాయితీరాజ్ శాఖకు సంబంధించి 7 పనులకు గాను రివర్స్ టెండరింగ్ నిర్వహించగా రూ.605.08 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. ఏపీ జెన్కోలో 4 పనులకు గాను రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా రూ.486.46 కోట్ల ప్రజా ధనం పక్కదారి పట్టకుండా ఆపగలిగారు. విద్యాశాఖలో కూడా గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా కాగా వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 పనులుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించగా ఏకంగా రూ. 325.15 కోట్లు ఆదా అయ్యాయి. వైద్యశాఖకు రివర్స్ చికిత్స వైద్య ఆరోగ్య శాఖలో కూడా గత ప్రభుత్వ హయాంలో టెండర్లలో చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ మెడికిల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎంఎస్ఐడీసీ)లో చేపట్టిన 34 పనులకు రివర్స్ టెండర్లు నిర్వహించారు. వీటి ద్వారా రూ.625.54 కోట్లు ప్రజాధనం ఆదా అయింది. మొత్తంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా 7 ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.5070.43 కోట్లు ప్రజాధనం ఆదా అయింది. రివర్స్ టెండర్ ఫలితాలు శాఖల వారీగా 1. పోలవరం ప్రాజెక్టు సహా జలవనరులశాఖ : రూ.1824.65 కోట్లు 2. ఏపీ టిడ్కో : రూ.392.23 కోట్లు 3. గృహనిర్మాణశాఖ (రూరల్) : రూ.811.32 కోట్లు 4. పంచాయతీరాజ్శాఖ : రూ. 605.08 కోట్లు 5. ఏపీ జెన్కో : రూ. 486.46 కోట్లు 6. విద్యాశాఖ : రూ. 325.15 కోట్లు 7. APMSIDC : రూ. 625.54 కోట్లు ............................................................................................. మొత్తం రూ.5070.43 కోట్లు -
రివర్స్ టెండరింగ్లో మరో మైలురాయి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో మరో మైలు రాయి నమోదైంది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) డిజైన్లలో డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేసిన మార్పుల మేరకు చేపట్టిన అదనపు పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో ఖజానాకు రూ.13.53 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకతను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు చాటి చెప్పింది. మొత్తంగా ఒక్క పోలవరం ప్రాజెక్టు పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లోనే ఖజానాకు రూ.843.53 కోట్లు ఆదా అయినట్లయింది. కాంట్రాక్టు ఒప్పందంలో లేని పనులను ప్రభుత్వం అదనంగా చేపట్టడానికి సంబంధించిన టెండర్ షెడ్యూల్ను జల వనరుల శాఖ మార్చి 2న జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. రూ.683 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టడానికి జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూల్తోనే జల వనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్ను శనివారం తెరిచారు. మేఘా, హెచ్ఈఎస్ ఇన్ఫ్రా సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఆర్థిక బిడ్లో రూ.676.24 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ గడువు ముగిసే సమయానికి రూ.669.47 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్–1గా నిలిచింది. ఈ టెండర్ను ఈఎన్సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని ఎస్ఎల్టీసీ (రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ) పరిశీలించి, ఆమోదించింది. దాంతో ఈ టెండర్లో ఖజానాకు రూ.13.53 కోట్లు ఆదా అయ్యాయి. పారదర్శకతకు గీటురాయి ► పోలవరంలో 194.6 టీఎంసీలను నిల్వ చేసే ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్)ను గోదావరి ఇసుక తిన్నెలపై నిర్మిస్తున్నారు. నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి తీరానికి అవతల కుడి వైపున స్పిల్వే నిర్మిస్తున్నారు. ► అత్యంత పటిష్టంగా ప్రాజెక్టును నిర్మించేందుకు డీడీఆర్పీ ప్రతిపాదనల మేరకు సీడబ్ల్యూసీ పలు డిజైన్లను మార్చింది. ఈ క్రమంలో కాంట్రాక్టు ఒప్పందంలో లేని పనులను కొత్తగా చేపట్టడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం రీయింబర్స్ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ స్పష్టమైన హామీ ఇచ్చింది. ► దీంతో సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల మేరకు అదనంగా చేపట్టాల్సిన పనులకు రూ.683 కోట్లతో ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక ప్రాజెక్టులో అదనంగా చేపట్టాల్సిన పనులకూ రివర్స్ టెండరింగ్ విధానం పాటించడం పారదర్శకతకు గీటురాయిగా నిలుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ► 2018 సెప్టెంబర్ 18న చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచినప్పుడు అదనంగా చేపట్టాల్సిన రూ.563.4 కోట్ల విలువైన పనులను అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు నామినేషన్పై కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకోవటాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ► పోలవరం హెడ్వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనుల్లో రూ.7,984.93 కోట్ల విలువైన పనులను టీడీపీ హయాంలో నామినేషన్పై అప్పగించడాన్ని ఉదహరిస్తున్నారు. -
రివర్స్ టెండర్స్.. అదుర్స్
సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని రీతిలో విప్లవాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జ్యుడీషియల్ ప్రివ్యూ.. రివర్స్ టెండరింగ్ నిర్ణయం కారణంగా భారీ ఎత్తున ప్రజా ధనం ఆదా అవుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే టెండర్ల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. తద్వారా ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.3885.47 కోట్లు ఆదా అయినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. పది లక్షల రూపాయలకు మించి ప్రభుత్వ కొనుగోళ్లు, పనులకు సంబంధించి ఈ విధానాన్ని అమలు చేయాల్సిందిగా 2019లో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీంతో గత ఆర్థిక (2020–21) ఏడాదిలో వివిధ పనులకు సంబంధించి 271 టెండర్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్ నిర్వహించగా 1,838.67 కోట్ల ప్రభుత్వ ధనం ఆదా అయిందని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కొనసాగుతున్న పనులతో పాటు కొత్త పనులకు టెండర్ కమ్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. పనులకు సంబంధించి తొలుత టెండర్లలో ఎల్–1గా నిలిచిన ఏజెన్సీ కోట్ చేసిన ధరపై తిరిగి రివర్స్ టెండరింగ్ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఎల్–1 ఏజెన్సీ కోట్ చేసిన ధర కన్నా తక్కువ కోట్ చేసిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తున్నారు. వస్తువుల కొనుగోళ్లలోనూ ఇదే విధానం – రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల అవసరాలకు వస్తువులు, ఫర్నీచర్, కంప్యూటర్లు తదితర కొనుగోళ్లకు కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్) ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా రివర్స్ టెండరింగ్ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. – గత ఆర్థిక ఏడాది (2020–21)లో ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు, సేవలకు సంబంధించి రూ.32,777 కోట్ల విలువగల 45,500 టెండర్లకు రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేశారు. తద్వారా రూ.2,046.80 కోట్లు ఆదా చేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. – గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర కొనుగోళ్లకు కూడా ఇదే విధానం అమలు చేసినట్లు సర్వే పేర్కొంది. ప్రభ్వుత్వ స్కూళ్లలో నాడు–నేడు కింద చేపట్టిన పనులకు, ఫర్నీచర్, టీవీలు, అల్మారాలు తదితర పరికరాల కొనుగోళ్లకు కూడత్వీ విధానం అమలు చేశారు. – ఎక్కడా టెండర్ల ప్రక్రియలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తుండటంతో ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ సర్కారు హయాంలో నామినేషన్ దందా – గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముందుగానే ఏ టెండర్ ఎవరికి ఇవ్వాలో నిర్ధారించేసుకుని, వారికి టెండర్ వచ్చేలా నిబంధనలు రూపొందించే వారు. కొన్ని పనులను గత సీఎం చంద్రబాబు చెప్పిన కంపెనీకి టెండర్లు పిలవకుండానే నామినేషన్పై కట్టబెట్టేశారు. – నోటి మాటతో, ఎటువంటి పరిపాలన అనుమతులు లేకుండానే నామినేషన్పై ఆరీ్టజీఎస్లో టెండర్ను కట్టిబెట్టిన వైనం కూడా గత సర్కారు హయాంలో చోటు చేసుకుంది. గత ప్రభుత్వం నీరు–చెట్టు పేరుతో అస్మదీయులకు ఏకంగా 13 వేల కోట్ల రూపాయల పనులను నామినేషన్పై పందేరం చేసింది. – నీరు–చెట్టు అంటే మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తవ్వడం.. ఇందుకోసం ఏకంగా రూ.13 వేల కోట్లు ఇవ్వడం అంటే ఇందులో 90 శాతం నిధులను ఆ పార్టీ నేతలు జేబుల్లో వేసుకున్నారు. నిపుణుల ప్రశంసలు – గత తెలుగుదేశం ప్రభుత్వం టెండర్ల ప్రక్రియలో అనుసరించిన ఇష్టారాజ్య విధానాలతో రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడింది. అప్పటి ప్రభుత్వ పెద్దలకు, బడా కాంట్రాక్టర్లకు భారీ ప్రయోజనం కలిగింది. – ఇవన్నీ గమనించిన సీఎం వైఎస్ జగన్.. గత ప్రభుత్వానికి పూర్తి భిన్నంగా టెండర్ ప్రక్రియ విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేశారు. పారదర్శకతను పెంచారు. దీంతో ఖజానాకు ప్రతి పని విషయంలో భారీగా ఆదా అవుతోందని వివిధ రంగాల నిపుణులు ప్రశంసిస్తున్నారు. -
రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.5.64 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: సోమశిల–కండలేరు వరద కాలువ, సోమశిల నార్త్ ఫీడర్ చానల్ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.5.64 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక బిడ్లో తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ పేర్కొన్న మొత్తంతో పోల్చితే.. ఖజానాకు రూ.26.5 కోట్లు ఆదా అయ్యాయి. పెన్నా నది నుంచి వచ్చే వరద జలాలను ఒడిసిపట్టి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 41,810 ఎకరాలకు నీళ్లందించడం, 4,66,521 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం ద్వారా మొత్తం 5,08,331 ఎకరాలను సస్యశ్యామలం చేయడం, 10 లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా సోమశిల–కండలేరు వరద కాలువ, సోమశిల నార్త్ ఫీడర్ చానల్ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టడానికి జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతోనే జల వనరుల శాఖ అధికారులు ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సోమశిల–కండలేరు వరద కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు, సోమశిల నార్త్ ఫీడర్ చానల్ ప్రవాహ సామర్థ్యాన్ని 772 నుంచి 1,540 క్యూసెక్కులకు పెంచేలా పనులు చేపట్టేందుకు రూ.1,304.11 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఆ టెండర్లను ఈ నెల 20న తెలుగు గంగ సీఈ హరినారాయణరెడ్డి తెరిచారు. ఈ పనులకు వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్స్, రాఘవ కనస్ట్రక్షన్స్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక బిడ్ మదింపులో ఎంఆర్కేఆర్ సంస్థ అర్హత సాధించలేదు. దాంతో ఆ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్ను తోసిపుచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్ను తెరిచారు. రూ.1,324.97 కోట్లకు షెడ్యూల్ కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఆ మొత్తాన్నే కాంట్రాక్ట్ విలువగా పరిగణించి బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహించారు. గడువు ముగిసే సమయానికి వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.1,298.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. దాంతో ఆ సంస్థకే పనులు అప్పగించాలని ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ)కి తెలుగు గంగ సీఈ ప్రతిపాదనలు పంపారు. ఈ టెండర్ను ఎస్ఎల్టీసీ లాంఛనంగా ఆమోదించనుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ టెండర్లో అంతర్గత అంచనా విలువతో పోల్చితే ఖజానాకు రూ.5.64 కోట్లు ఆదా అయ్యాయి. -
రివర్స్ టెండరింగ్తో చౌకగా సౌర విద్యుత్
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా చౌకగా సౌర విద్యుత్ అందబోతోంది. ఇందుకు సంబంధించిన టెండర్లు బుధవారం ఖరారయ్యాయి. గతంలో రూ.3 వరకు ఉన్న యూనిట్ విద్యుత్ ధర ఇకపై గరిష్టంగా 2.58కే లభించనుంది. ప్రభుత్వం వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా అమలు చేసేందుకు 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా బిల్డ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్(బీవోటీ) విధానంలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తొలి విడతలో భాగంగా 6,400 మెగావాట్లకు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. పూర్తి పారదర్శకంగా న్యాయ సమీక్ష చేపట్టిన కార్పొరేషన్.. రివర్స్ టెండరింగ్ కూడా చేపట్టి అతి తక్కువకు విద్యుత్ ఇచ్చే సంస్థలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని పది ప్రాంతాలకు సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థల వివరాలను గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ బుధవారం మీడియాకు విడుదల చేసింది. -
ఇళ్ల నిర్మాణంపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో టెండర్ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్గా 10 మందితో టెండర్ కమిటీని నియమించింది. కమిటీ వీసీగా జేసీ (అభివృద్ధి), మెంబర్ కన్వీనర్గా గృహనిర్మాణ జిల్లా స్థాయి అధికారి.. సభ్యులుగా పరిశ్రమలు, గ్రామీణ నీటి సరఫరా, ఆర్అండ్బీ, విద్యుత్, పంచాయతీరాజ్, కార్మిక, గనుల శాఖల జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. ఇళ్ల నిర్మాణం ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ పద్ధతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్ -
‘సుజల స్రవంతి’ టెండర్లలో 17.5 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండు ప్యాకేజీల పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.17.50 కోట్లు ఆదా అయ్యాయి. మొదటి ప్యాకేజీ పనుల అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే 0.24 శాతం తక్కువకు వీపీఆర్–పయనీర్–హెచ్ఈఎస్ (జేవీ), రెండో ప్యాకేజీ పనులను 0.67 శాతం తక్కువకు గాజా–ఎన్సీసీ(జేవీ) సంస్థలు దక్కించుకున్నాయి. టెండర్ ప్రక్రియపై పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఎస్ఈ శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ)కి నివేదిక పంపారు. ఈఎన్సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని ఎస్ఎల్టీసీ సోమవారం సమావేశమై టెండర్ ప్రక్రియను పరిశీలన అనంతరం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న ఆ సంస్థలకు వర్క్ ఆర్డర్ జారీ చేయనున్నారు. భారీ మొత్తంలో ఆదా పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. వద్ద నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.50 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. తొలి దశలో రూ.2,022 కోట్లతో పనులను ఇప్పటికే ప్రారంభించింది. ఇదే పథకంలో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో చేపట్టిన గ్రావిటీ కెనాల్లో 3.150 కి.మీ. నుంచి 23.200 కి.మీ. వరకూ కాలువ తవ్వకం, పాపయ్యపాలెం ఎత్తిపోతలతోపాటు 0 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకూ లిఫ్ట్ కెనాల్ పనులకు మొదటి ప్యాకేజీ కింద రూ.2,512.96 కోట్ల ఐబీఎంతో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్ను శనివారం అధికారులు తెరిచారు. రూ.2558.20 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.24 శాతం తక్కువకు అంటే రూ.2,507.04 కోట్లకు కోట్ చేసిన వీపీఆర్–పయనీర్–హెచ్ఈఎస్(జేవీ) సంస్థ ఎల్–1గా నిలిచింది. దాంతో మొదటి ప్యాకేజీలో ఖజానాకు రూ.5.93 కోట్లు ఆదా అయ్యాయి. లిఫ్ట్ కెనాల్ 40 కి.మీ. నుంచి 102 కి.మీ. వరకూ చేపట్టే పనులకు రెండో ప్యాకేజీ కింద రూ.1,722.39 కోట్ల ఐబీఎంతో టెండర్ పిలిచింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్ను శనివారం అధికారులు తెరిచారు. 1,763.73 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–గా నిలిచింది. అదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.67 శాతం తక్కువకు అంటే రూ.1,710.82 కోట్లకు కోట్ చేసిన గాజా–ఎన్సీసీ (జేవీ) పనులను దక్కించుకుంది. దాంతో ఖజానాకు రూ.11.57 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక బిడ్లో ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధరలతో పోల్చితే.. మొదటి ప్యాకేజీలో రూ.51.16 కోట్లు, రెండో ప్యాకేజీలో రూ.52.91 కోట్లు వెరసి రూ.104.07 కోట్లు ఆదా అయ్యాయి. -
పేదల ఇళ్లలో నాణ్యతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా పేదలు ఎదురు చూస్తున్న సొంతింటి కల త్వరలో సాకారం కానుంది. రెండేళ్లలో పేదల కోసం ప్రభుత్వం 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,080 కోట్లతో 15.60 లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న 224 చదరపు అడుగులకు బదులుగా ప్రస్తుతం కొత్తగా చేపట్టనున్న ఇళ్లను 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న దృష్ట్యా అందుకు అవసరమయ్యే సామగ్రి, ఇతర పరికరాలను రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేసేందుకు గృహ నిర్మాణ సంస్థ టెండర్లను ఆహా్వనించిన విషయం తెలిసిందే. స్టీల్, ఆర్సీసీ డోర్లు, విండో ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్, పీవీసీ టాయిలెట్ డోర్, గ్లేజ్డ్ విండో షట్టర్స్, వైట్ లైమ్, పెయింట్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, శానిటరీ, నీటి సరఫరా పరికరాలు, ఏసీ షీట్స్, గాల్వాల్యూమ్ షీట్స్, మైల్డ్ స్టీల్ సెక్షన్స్, ఒరిస్సా పాన్ ఫ్రీ టాప్ సేకరణ కోసం రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా టెండర్లు పిలిచారు. నాణ్యతతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ప్రీ–బిడ్ సమావేశాలు ఈ నెల 2వ తేదీతో ముగియనున్నాయి. మండలాల వారీగా బాధ్యతలు ► నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా ఖాళీగా ఉన్న స్థానాల్లో టెక్నికల్ సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు. డివిజనల్ ఇంజనీర్ స్థాయి నుండి అసిస్టెంట్ ఇంజనీర్, వర్క్ ఇన్స్పెక్టర్లకు అవసరమైతే మరికొన్ని మండలాల బాధ్యతలను అప్పగించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. ► సగం జిల్లాల్లో ఇప్పటికే సిబ్బంది సర్దుబాటు పని పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమయ్యారు. మరికొంత మందికి పదోన్నతులు కూడా కల్పించారు. పునాదుల కోసం మార్కింగ్ వేయడం మొదలు.. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ► ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం పేదల కోసం నిర్మించే ప్రతి ఇంటిలో ఒక బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, సింటెక్స్ ట్యాంక్, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తారు. నాణ్యత పరిశీలనకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ► ఇళ్ల నిర్మాణానికి వినియోగించే పరికరాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. ► గృహ నిర్మాణ శాఖ అధికారులే కాకుండా ఇతర శాఖలకు చెందిన సిబ్బంది కూడా ఈ కమిటీలో ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. ప్రతి 25 ఇళ్లకు ఒక క్లస్టర్ – అజయ్ జైన్, ముఖ్యకార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రతి 25 ఇళ్లను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయిలో పరిశీలన కోసం ఒక కమిటీ వేస్తాం. కమిటీ పర్యవేక్షణలోనే ఆ 25 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. కొత్తగా నిర్మించే ప్రతి లే అవుట్ వద్ద గృహ నిర్మాణానికి ఉపయోగించే వస్తువులను డిస్ ప్లే చేస్తాం. వాటి వివరాలను, ధరలను తెలియజేసే పట్టికనూ అందుబాటులో ఉంచుతాం. నాణ్యతపై ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చాం. -
రూ.కోటి దాటిన ప్రతి లావాదేవీలపై రివర్స్ టెండరింగ్
సాక్షి,విజయవాడ: అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టనుంది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా ఆదేశించింది. కోటి రూపాయల విలువదాటిన ప్రతీ లావాదేవీని రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది. టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ పనుల్లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అయ్యిందని ప్రభుత్వం పేర్కొంది. టెండర్ కమ్ రివర్స్ ఆక్షనింగ్ లేదా రివర్స్ టెండర్ల విధానాన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రివర్స్ టెండరింగ్ లో ఈ-ప్రోక్యూర్ మెంట్ విధానం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ను ప్రభుత్వం ఆదేశించింది. చెల్లింపుల విధానంలోనూ మార్పులు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం సీఎఫ్ఎస్ఎస్కు సూచనలు చేసింది. ఛధవండి: కరోనా బారిన మంత్రి: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ -
అవినీతిపై బ్రహ్మాస్త్రం
పై స్థాయిలో 50 శాతం అవినీతిని నిర్మూలించాం. మిగిలిన స్థాయిల్లో ఉన్న 50 శాతం అవినీతిని నిర్మూలించాలి. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలి. టీటీడీతో సహా అన్ని విభాగాలు టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్కు వెళ్లాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసుల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో చట్టం చేసేందుకు వీలుగా బిల్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోందంటే.. అవినీతి కేసుల విషయంలో సీరియస్గా లేమనే సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదని, కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ‘గత ఏడాది నవంబర్లో అవినీతికి సంబంధించి కాల్ సెంటర్ 14400 ప్రారంభించాం. ఇప్పటి వరకు 44,999 కాల్స్ వచ్చాయి. ఇందులో అవినీతికి సంబంధించిన అంశాలు 1,747 కాగా..1,712 పరిష్కరించాం. 35 పెండింగ్లో ఉన్నాయి’ అని అధికారులు వివరించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదుల మానిటరింగ్ బలంగా ఉండాలి ► 1902 నంబర్ను ఏసీబీతో (14400) అనుసంధానం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి. ఫిర్యాదులను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలి. దీనికి కలెక్టర్ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలి. ► టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎంపీడీఓ, టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదు. దీనిపై అవినీతికి ఆస్కారం లేని విధానాలతో మనం ఫోకస్గా ముందుకు వెళ్లాలి. అవినీతికి పాల్పడాలంటే భయపడే పరిస్థితి రావాలి. ► 14400 నంబర్పై మరింత ప్రచారం నిర్వహించాలి. పర్మినెంట్ హోర్డింగ్స్ పెట్టాలి. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికీ ఇదీ తేడా ► కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని ఇచ్చింది. అప్పట్లో ఎకరాకు కంపెనీ చెల్లించే మొత్తం రూ.2.5 లక్షలు మాత్రమే. మన ప్రభుత్వం సంప్రదింపులు జరిపి, ఆ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. దీని వల్ల అదనంగా రూ.119 కోట్ల ఆదాయం వస్తోంది. ► సోలార్/విండ్ కింద ఉత్పత్తి చేసే 1550 మెగావాట్ల ఉత్పత్తికి గాను మెగావాట్కు రూ.1 లక్ష చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. దీని వల్ల ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్లలో రూ.322 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి. ► రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్పత్తి చేయనున్న 1680 మెగావాట్ల కరెంట్కు సంబంధించి.. మెగావాట్కు మొదటి పాతికేళ్లలో రూ.లక్ష, తద్వారా ఏడాదికి రూ.16.8 కోట్లు, 25 ఏళ్ల తర్వాత రూ.2 లక్షలు చొప్పున ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.2,940 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీతో సంప్రదింపుల కారణంగా రూ.3,381 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందిస్తున్నా. ► భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 2703 ఎకరాలను కేటాయిస్తే.. అదే కంపెనీతో ఈ ప్రభుత్వం సంప్రదింపులు జరపగా, 2203 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఒప్పుకుంది. తద్వారా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరాకు రూ.3 కోట్లు వేసుకున్నా రూ.1500 కోట్లు మిగిలినట్లే. 788 పనులకు రివర్స్ టెండరింగ్ ► ‘మొత్తంగా 788 పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని, సాధారణ టెండర్ల ప్రక్రియ ద్వారా 7.7 శాతం మిగులు ఉండగా, రివర్స్ టెండరింగ్ ద్వారా 15.01 శాతం మిగులు ఉందని అధికారులు వివరించారు. ► రూ.100 కోట్లు దాటిన ఏ ప్రాజెక్టుకైనా జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్తున్నాం. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు రూ.14,285 కోట్ల విలువైన 45 పనులు జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లాయి’ అని అధికారులు తెలిపారు. సీఎంకు అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక ► అవినీతిని నిరోధించడానికి సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గుడ్ గవర్నెన్స్పై ప్రతిష్టాత్మక సంస్థ అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి సమీక్షకు ముందు సీఎం జగన్కు నివేదిక సమర్పించారు. ► ఎమ్మార్వో, ఎంపీడీఓ, సబ్ రిజిస్టార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ కార్యాలయాలను యూనిట్గా తీసుకుని, సిబ్బంది విధులు, బాధ్యతల్లో స్పష్టత ఇవ్వడంతో పాటు, అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించి ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ► ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు, ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'సీమ' ఎత్తిపోతల టెండర్ 19న ఖరారు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను రూ.3,307.07 కోట్లకు సుభాష్ ప్రాజెక్ట్స్ మాన్యుఫాక్చరర్స్ లిమిటెడ్ (ఎస్పీఎంఎల్) జాయింట్ వెంచర్ (జేవీ) దక్కించుకుంది. ఈ పనుల టెండర్లో ‘ప్రైస్’ బిడ్ను సోమవారం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్రెడ్డి తెరిచారు. అంతర్గత అంచనా విలువ రూ.3,278.18 కోట్ల కంటే 1.9 శాతం అధిక ధరకు (రూ.3,340.47 కోట్లు) కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి, సోమవారం మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహించారు. రివర్స్ టెండరింగ్లో 0.88 శాతం అధిక ధర (రూ.3,307.07 కోట్లు)కు కోట్ చేసిన ఎస్పీఎంఎల్ (జేవీ) సంస్థ ఎల్–1 నిలిచింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ)కి పంపుతామని, కమిటీ అనుమతి మేరకు ఈ నెల 19న టెండర్ ఖరారు చేసి వర్క్ ఆర్డర్ జారీ చేస్తామని సీఈ మురళీనాథ్రెడ్డి చెప్పారు. కరువును రూపుమాపే లక్ష్యంతో.. ► శ్రీశైలం జలాశయంలో వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కరువును రూపుమాపాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ► శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎత్తిపోసి.. తెలుగు గంగ, కేసీ కెనాల్, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్రతిపాదించారు. -
‘బాబు 104, 108లను నిర్వీర్యం చేశాడు’
సాక్షి, విజయవాడ: 104, 108 అంబులెన్స్ వాహనాల కొనుగోలు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా వ్యవహరించామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన హయాంలో 104, 108లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 108, 104 వాహనాల విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అనవసరపు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలతో దేశం మొత్తం ఆంద్రప్రదేశ్ వైపు చూస్తోందని తెలిపారు. గత టీడీపీ హయాంలో 108లు మూలన పడ్డాయని, అవి సరిగ్గా పని చేయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 108, 104 వాహనాల కొనుగోలు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా వ్యవహారించిందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుజాతరావు కమిటీ సిఫార్సుల మేరకు 108,104 వ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. 2019 జూన్లో కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం) చంద్రబాబు హయాంలో కాలయాపన కమిటీలు చాలా చూశామని కానీ, సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కమిటీ ఏర్పాటు చేశారని ఆళ్ల నాని చెప్పారు. 676 మండలాల్లో 108, 104 నూతన వాహనాలు తీసుకువచ్చారని చెప్పారు. గతంలో 108 వాహనాలు చిన్నపాటి రిపేర్లు వచ్చినా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. 332 పాత 108 వాహనాలు ఉన్నాయని అదనంగా 432 నూతన వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. అదే విధంగా 676 కొత్త 104 వాహనాలు తీసుకున్నామని తెలిపారు. సర్వీసు ప్రొవైడర్ విషయంలో అరబిందో ఫౌండేషన్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనవరి నెలలో రివర్స్ టెండరింగ్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్కు దక్కిందని రూ. 2,04 074 కోట్ చేశారని తెలిపారు. 28 వాహనాలకు రూ.1,78,072 ఆదా చేశామని తెలిపారు. రివర్స్ టెండర్ ద్వారా మొత్తం రూ.180 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు. (‘చంద్రబాబు జీవితంలో మారడు’) నవంబర్ 21 నాడు టెండర్లు పిలిచామని ఎంకేపీ, అరబిందో ఫార్మా సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. బీవీజీ కంపెనీ సమయంలో 1068 మంది పైలెట్లు ఉండేవారని పైలెట్కు 10 వేలు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లకు 12 వేలు జీతం ఇచ్చారని చెప్పారు. పాత వాహనాల్లో రూ.10 వేలు నుంచి రూ.28వేలు వరకు 1690 మంది పైలెట్లకు జీతాలు పెంచామని తెలిపారు. పాత వాహనాల్లో టెక్నిషియన్లకు రూ.12వేలు నుంచి రూ. 30వేలకు పెంచామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవరించిందని తెలిపారు. అగ్రిమెంట్ జరిగిన తర్వాత రూ.9 పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని చెప్పారు. 1800 వాహనాలు కొనుగోలు చేశామని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ఉన్నత ఆశయంతో సీఎం వైఎస్ ప్రభుత్వం 16 మెడికల్ ఆస్పత్రులను తీసుకురాబోతోందని తెలిపారు. మహాప్రస్థానం పేరుతో సేవలందిస్తున్న వాహనాలు టీడీపీ తన ఖాతాలో వేసుకుంటుందని మండిపడ్డారు. -
పోలవరం శరవేగం
అది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం.. భారీ క్రేన్లు.. రెడీమిక్సర్లతో సందడి సందడిగా ఉంది.. వందల కొద్దీ కార్మికులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు చకచకా సాగిపోతున్నాయి. పనులు పర్యవేక్షిస్తున్న ఎస్ఈ నాగిరెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధి పలకరించారు. స్పిల్ వేలో రోజుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పనులు చేస్తున్నామని, మే, 2021 నాటికి 48 గేట్లను బిగించి, స్పిల్వేను పూర్తి చేస్తామని చెప్పారు. ‘వరదలు తగ్గాగానే.. నవంబర్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల ఖాళీని భర్తీ చేసి.. నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి.. గోదావరి డెల్టాల పంటలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను జూలై, 2021 నాటికి పూర్తి చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ప్రారంభించి.. 2021, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం’ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, పకడ్బందీ ప్రణాళిక, అకుంఠిత దీక్షకు పోలవరం ప్రాజెక్టు పనులు అద్దం పడుతున్నాయి. దశాబ్దాల స్వప్నం శరవేగంగా చేరువవుతోంది. ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమవుతోంది. ఉరకలెత్తే గోదారమ్మకు బ్రేకులేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా, ప్రచారార్భాటాలకు దూరంగా.. స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు చకచకా సాగుతున్నాయి. కరోనా భయపెడుతున్న వేళ సైతం కట్టుదిట్టమైన చర్యలతో రికార్డు స్థాయిలో పనులు పరుగులు పెడుతున్నాయి. (రామగోపాలరెడ్డి ఆలమూరు) పోలవరం ప్రాజెక్టు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలం రామయ్యపేట వద్ద ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదన 1941లో బ్రిటీష్ సర్కార్ ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలుగు నేల సుభిక్షమవుతుందని రాష్ట్ర ప్రజలు కలలుగన్నారు. కానీ.. ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా 2004 వరకూ ఏ ముఖ్యమంత్రీ సాహసించలేదు. 2004లో దివంగత సీఎం వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. కానీ.. వైఎస్సార్ హఠాన్మరణంతో పోలవరం పనులు మందగించాయి. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని గత ప్రభుత్వం అందిపుచ్చుకుని, ప్రాజెక్టును పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో విఫలమైంది. కమీషన్ల కోసం జీవధార పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేసి.. రివర్స్ టెండరింగ్ ద్వారా ఖాజనాకు రూ.838.51 కోట్లను ఆదా చేశారు. టీడీపీ సర్కారు ఐదేళ్లలో రోజుకు సగటున 131.59 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించినప్పటి నుంచి రోజుకు సగటున 3,000 క్యూబిక్ మీటర్ల పనులు చేస్తోంది. ప్రణాళికాయుతంగా పనులు ► టీడీపీ సర్కార్ ప్రణాళిక లోపం.. అవగాహన రాహిత్యం, చిత్తశుద్ధి లేమి పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారాయి. పనులు గందరగోళంగా మారాయి. ఈ పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టును డిసెంబర్, 2021లోగా పూర్తి చేయడానికి సీఎం జగన్ కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రచించారు. స్పిల్ వే, స్పిల్ చానల్, నిర్వాసితులకు పునరావాసం, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్రణాళిక అమలును సీఎం జగన్, మంత్రి అనిల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటం వల్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిజైన్లకు సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) నుంచి ఆమోదం తెచ్చారు. దాంతో పనులు చేపట్టడానికి మార్గం సుగమమైంది. కరోనా కోరలు చాస్తున్నా నిర్విఘ్నంగా పనులు ► గత సీజన్లో వరదలు తగ్గాక.. స్పిల్ వే, స్పిల్ చానల్ మధ్యలో నిలిచిన నీటిని డీవాటరింగ్ చేసి నవంబర్లో పనులు ప్రారంభించారు. ► కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించింది. దాంతో కార్మికులు బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వారి ఊళ్లకు వెళ్లారు. సొంతూళ్లకు చేరుకున్న రెండు వేల మందికిపైగా కార్మికుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ మేఘా (మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్) భరోసా కల్పించి.. ప్రాజెక్టు పనుల్లోకి తిరిగి రప్పించాయి. కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ స్పిల్ వేలో వెయ్యి క్యూబిక్ మీటర్లు.. స్పిల్ చానల్లో రెండు వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో కాంక్రీట్ పనులు రోజూ చేస్తున్నారు. బుధవారం వరకూ 2.77 లక్షల క్యూబిక్ మీటర్ల (స్పిల్ వేలో 1.29, స్పిల్ చానల్లో 0.98 లక్షల) పనులు చేశారు. స్పిల్ వేలో 2.62 లక్షలు, స్పిల్ చానల్లో 6.98 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేస్తే స్పిల్ వే, స్పిల్ ఛానల్ పూర్తవుతాయి. ఈ పనులు 2021 మే నాటికి పూర్తవుతాయి. ► గోదావరిలో వరదలు తగ్గుముఖం పట్టగానే ఎగువ కాఫర్ డ్యామ్లో మిగిలిన 35.82 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను నవంబర్లో ప్రారంభించి.. 2021 జూలై నాటికి పూర్తి చేసేలా చేపడతారు. దిగువ కాఫర్ డ్యామ్లో మిగిలిన 22.09 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను 2021 జూలై నాటికి పూర్తి చేస్తారు. గోదావరి డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్ వే మీదుగా నవంబర్ నుంచే మళ్లిస్తారు. ► ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య ప్రధాన డ్యామ్ ఈసీఆర్ఎఫ్ పనులను ప్రారంభించి.. 117.69 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారు. ఆలోగా కాలువలకు జలాశయంతో అనుసంధానం చేసే పనుల (కనెక్టివిటీస్)ను పూర్తి చేసి.. 2022 జూన్లో ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించింది. ఇది మీకు తెలుసా? ప్రస్తుతం ప్రపంచంలో గరిష్టంగా 35 లక్షల క్యూసెక్కుల వరద జలాలను విడుదల చేసే సామర్థ్యంతో త్రీగోర్జెస్ డ్యామ్ను చైనా నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం ‘డ్రాగన్’ను తలదన్నేలా అత్యధికంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను నిర్మిస్తోంది. గోదావరి నదికి అడ్డంగా మూడు కొండల మధ్యన ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మిస్తున్నారు. ప్రపంచంలో ఇసుక తిన్నెలపై అతి పొడవైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఇదే. పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీపై కుడి, ఎడమ కాలువల కింద 7.2 లక్షల ఎకరాలు.. గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎనిమిది లక్షల ఎకరాలకు వెరసి 38.70 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. ప్రపంచంలో గరిష్టంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగా రికార్డు సృష్టించనుంది. వరదలు వచ్చినా పనులు కొనసాగించేలా ప్రణాళిక ► గోదావరి నదికి ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తేనే స్పిల్ వే, స్పిల్ చానల్కు వరద జలాలు చేరుతాయి. జూలై ఆఖరుకు ఆ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ పనులను కొనసాగించనున్నారు. ► స్పిల్ వే పియర్స్ 52 మీటర్లకు పూర్తి చేసి.. వాటికి గడ్డర్లు బిగించి.. వాటిపై స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ను వేసే పనులు చేపట్టి.. నవంబర్ నాటికి వాటిని పూర్తి చేస్తారు. నవంబర్ తర్వాత స్పిల్ వే బ్రిడ్జి మీదుగా వెళ్లి ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–3 పనులు చేపడతారు. నవంబర్లో డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభించి.. 2021 డిసెంబర్కు పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు. నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి ► టీడీపీ సర్కార్ నిర్వాకం వల్ల గతేడాది 41.15 మీటర్ల కాంటూర్కు ఎగువన ఉన్న గ్రామాల ప్రజలూ.. వరద ముప్పును ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై నాటికి 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 15,444 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సర్కార్ నిర్ణయించింది. ► పునరావాసం కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. 45.72 మీటర్ల పరిధిలో కాంటూర్ 82 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. సహాయ, పునరావాసం పనులకే రూ.30 వేల కోట్లకుపైగా సర్కార్ వ్యయం చేస్తోంది. మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నాం – మంత్రి అనిల్ పోలవరం ప్రాజెక్టుకు మహానేత వైఎస్సార్ నడుం బిగించారు. విభజన నేపథ్యంలో వంద శాతం ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. టీడీపీ సర్కార్ కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం పనుల్లో రూ.838.51 కోట్లు ఆదా చేశాం. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించి, ఆ దిశగా చర్యలు చేపట్టాం. 2022 జూన్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా వైఎస్సార్ ప్రారంభించిన పోలవరాన్ని ఆయన తనయుడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. పొక్లెయిన్తో టన్నుల కొద్దీ మట్టిని తవ్వి.. టిప్పర్లలోకి పొసి.. తరలిస్తున్నారు. మరో వైపు ఇసుక, కంకర పోస్తూ రోలర్తో తొక్కించి.. గట్టిపరిచి.. వాటిపై రెడీ మిక్సర్లతో తెచ్చిన కాంక్రీట్ను పోసి.. స్పిల్ వేలో బ్లాక్లు వేస్తున్నారు. ఒక్కో బ్లాక్లో వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తామని.. రోజుకు 20 బ్లాక్ల పనులు చేస్తున్నామని స్పిల్ చానల్ పనులు పర్యవేక్షిస్తున్న డీఈ శ్రీనివాసరావు చెప్పారు. స్పిల్ చానల్ను మార్చి, 2021 నాటికి పూర్తి చేస్తామని వివరించారు. -
ఏపీ: ఖజానాకు భారీ ఆదాయం
సాక్షి, అమరావతి: ఉన్న వనరులతో రాష్ట్రానికి మరింత మేలు చేకూర్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పం అద్భుత ఫలితాలిస్తోందని సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం పేర్కొన్నారు. ‘రౌతు సరైనోడైతే గుర్రం దౌడు తీస్తుంది. పాలకుడు సరైనోడైతే పాలన పరుగులు పెడుతుంది’ అన్నది రాష్ట్రంలో నిజమవుతోందని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో అజేయకల్లం మాట్లాడుతూ సమర్థతకు సరికొత్త నిర్వచనంగా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. (త్వరలో సీఎం జగన్ పల్లె బాట) గ్రీన్కోతో సంప్రదింపుల ద్వారా.. ►గ్రీన్కో గ్రూప్ విద్యుత్ ప్రాజెక్ట్పై సంప్రదింపుల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చారు. భూమి ధర పెంపు వల్ల దాదాపు రూ.250 కోట్లు, గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జీ విధింపు వల్ల రూ.3,375 కోట్లు కలిపి మొత్తంగా రూ.3,625 కోట్లు రాష్ట్రానికి అదనంగా లబ్ధి చేకూరనున్నది. ►టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ►సౌర, పవన విద్యుత్తో కలిపి జల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ ఇది. 1,000 మెగావాట్ల సౌర విద్యుత్, 550 మెగావాట్ల పవన విద్యుత్, 1,680 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ►టీడీపీ ప్రభుత్వం ఎకరాకు రూ.2.50 లక్షల చొప్పున గ్రీన్కో గ్రూప్నకు 4,600 ఎకరాల భూమిని కేటాయించింది. సీఎం వైఎస్ జగన్ పునఃసమీక్ష జరపగా.. ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించేందుకు ఆ సంస్థ సమ్మతించింది. ►ఇక గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జీ కింద.. ఉత్పత్తి చేసే ప్రతి మెగావాట్కు 25 ఏళ్ల పాటు రూ.లక్ష చొప్పున చెల్లించేందుకు గ్రీన్కో సంస్థ సమ్మతించింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.31 కోట్లు ఆదాయం వస్తుంది. ►25 ఏళ్ల తరువాత ప్రాజెక్ట్ కొనసాగినంత కాలం మెగావాట్కు రూ.2లక్షల చొప్పున చెల్లించేందుకు గ్రీన్కో అంగీకరించింది. ►హైడ్రో ప్రాజెక్ట్ల జీవిత కాలం వందేళ్లు అని నిపుణుల అంచనా. ఆ ప్రకారం గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జి ద్వారా ప్రాజెక్ట్ జీవిత కాలంలో రూ.3,375 కోట్ల ఆదాయం వస్తుంది. ►ఈ ప్రాజెక్ట్పై గ్రీన్ కో గ్రూప్తో కేవలం సంప్రదింపులు జరపడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొత్తమ్మీద రూ.3,625 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చి నట్టయింది. ►గ్రీన్కో గ్రూప్ ప్రపంచంలో రెండో అతిపెద్ద సావెరిన్ వెల్త్ ఫండ్స్ మద్దతు గల సంస్థ. ►అందులో సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడుల కార్పొరేషన్, అబుదాబి పెట్టుబడుల అథారిటీలు భాగస్వామిగా ఉన్న అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ కంపెనీ. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ ►భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ నిర్మించేందుకు జీఎంఆర్ గ్రూప్తో గతంలో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ►ఇందుకోసం 2,700 ఎకరాల భూమిని కేటాయించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్పై జీఎంఆర్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. ►విమానాశ్రయం నిర్మాణాన్ని 2,200 ఎకరాలను పరిమితం చేసింది. దాంతో ప్రభుత్వానికి 500 ఎకరాల భూమి మిగిలింది. ఆ భూమి విలువ రూ.1,500 కోట్లు. తద్వారా ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఆదా చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2,072.29కోట్లు ఆదా టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ ప్రాజెక్ట్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2,072.29 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ►నీటి పారుదల రంగంలో ప్రాజెక్ట్ల రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1,130.18కోట్లు, పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ల రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.200 కోట్లు, ఏపీ టిడ్కో ప్రాజెక్ట్ల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.361కోట్లు, జెన్కో ప్రాజెక్ట్ల్లో రూ.190 కోట్లు, విద్యా శాఖలో రూ.181.29 కోట్లు.. ఇలా రివర్స్ టెండరింగ్ ద్వారా భారీగా ప్రజాధనాన్ని ఆదా చేయడం సీఎం వైఎస్ జగన్ సమర్థతకు నిదర్శనం. ►టెండర్లలో పారదర్శకత కోసం జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేశారు. విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో టెండర్లను పరిశీలించి అనుమతులు ఇస్తున్నారు. ►అలా ఆదా చేసిన ప్రజాధనంతో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, పింఛన్లు తదితర పథకాల నిధులన్నీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అనుకున్న సమయానికి పడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలను సమగ్రంగా అమలు చేస్తున్నారు. ►విలేకరుల సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, సమాచార, పౌర సంబంధాల కమిషనర్ విజయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
అవినీతికి.. నిజాయితీకి ఇదీ తేడా
సాక్షి, అమరావతి : ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేసే సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి, వందిమాగధుల అభ్యున్నతే లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబు సర్కార్కూ వ్యత్యాసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని మంత్రి పేర్ని నాని చెప్పారు. గురువారం మంత్రివర్గ భేటీ ముగిశాక విలేకరులతో మాట్లాడారు. ► టీడీపీ సర్కార్ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి రాజ్యమేలింది. వైఎస్సార్సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు హయాంలో కట్టబెట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే రూ.2,200 కోట్లు ఖజానాకు ఆదా అయింది. ► భోగాపురం ఎయిర్పోర్టులో రూ.1,500 కోట్ల విలువైన 500 ఎకరాల భూమిని సర్కార్ ఆస్తిగా మిగిల్చాం. కర్నూలు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో సర్కార్కు అదనంగా రూ.4వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వచ్చేలా చేశాం. ► ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను చంద్రబాబు తన సన్నిహితుడు, ఈవీఎంల దొంగ అయిన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. ► చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకల కింద అధిక ధరలకు నాసిరకం సరుకులు, హెరిటేజ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి.. రూ.150 కోట్లు దోచుకున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. ► తన సర్కార్ అక్రమాలకు పాల్పడి ఉంటే నిరూపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సిట్ వేస్తే కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబూ.. నువ్వు కోరుకున్నట్లే.. ఫైబర్ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, హెరిటేజ్ మజ్జిగ సరఫరా అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది కక్ష సాధింపు కాదు. చదవండి : చంద్రన్న గోల్మాల్పై సీబీఐ -
అవినీతికి అడ్డుకట్ట
-
బీఎస్సార్కు రివర్స్ పంచ్
సాక్షి, అమరావతి: పోలవరం ఎడమ కాలువ 6ఏ ప్యాకేజీలో బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుని, దానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించడానికి పోలవరం ప్రాజెక్టు సీఈకి అనుమతిస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. - పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో ఆరో ప్యాకేజీ పనులను రూ.196.20 కోట్లకు 2005లో నామా నాగేశ్వరరావు సంస్థ దక్కించుకుంది. - 2018 నాటికి రూ.112.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ఈ సంస్థకు ధరల సర్దుబాటు కింద రూ.11.45 కోట్లను అదనపు బిల్లుగా టీడీపీ సర్కార్ చెల్లించింది. - కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం నామా సంస్థ రూ.83.72 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. - ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ పనుల్లో రూ.70.29 కోట్ల విలువైన పనులను ఏపీడీఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ డిటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్)లో 60సీ నిబంధన కింద తొలగించింది. - వాటి వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచి.. రాజమండ్రికి చెందిన టీడీపీ నేత, తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్కు నామినేషన్ పద్ధతిలో అప్పటి ప్రభుత్వ పెద్ద కట్టబెట్టారు. - వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల ప్రక్షాళనకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ టీడీపీ సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని తప్పుబట్టింది. - బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్కు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనుల ఒప్పందాన్ని రద్దు చేసి.. దానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సర్కార్కు సూచించింది. - ఈ మేరకు 6ఏ ప్యాకేజీ కాంట్రాక్టు ఒప్పందాన్ని ప్రీ–క్లోజ్ (ముందుగా రద్దు) చేసుకుని, రివర్స్ టెండరింగ్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ పోలవరం సీఈ పంపిన ప్రతిపాదనలకు సర్కార్ ఆమోద ముద్ర వేసింది. -
భావి తరాల బాగుకే వికేంద్రీకరణ
నిధులు లేవన్న వాస్తవాన్ని దారి మళ్లించాలనుకోవడం లేదు. ఎక్కువ ఖర్చు కాదని నేను వాస్తవాన్ని కప్పి పుచ్చలేను. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదు. బాహుబలి గ్రాఫిక్సో, సింగపూర్ సిటీనో చూపించాలనుకోవడం లేదు. జపాన్ నగరాలనో, షాంఘై సిటీలనో చూపించి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం లేదు. నిధులను బట్టి క్రమానుగతంగా వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకుంటున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతి ప్రాంతంలో అన్నీ పంట భూములు కావడంతో ఎటువంటి కనీస మౌలిక వసతులు ఉండవు. అంటే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీరు వంటి వాటి కోసమే గత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరాకు రూ.2 వేల కోట్లు వ్యయం చేయాలి. అంటే 53 వేల ఎకరాల అభివృద్ధికి సుమారు రూ.1.09 లక్షల కోట్లు కావాలి. ఇదంతా కనీస మౌలిక వసతుల కోసమే. ఇందుకోసమే అంత డబ్బు ఖర్చు చేస్తే మిగతా పనుల మాటేమిటి? ఇవాళ ప్రభుత్వం వద్ద అమరావతి లాంటి అద్భుతమైన నగరాలు కట్టేందుకు ఫండ్స్ లేవు. మరి ఇక్కడే 5 ఏళ్లు ఉన్న తర్వాత కూడా పరిస్థితి మారదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అమరావతిలో పెట్టే ఖర్చులో 10 శాతం మాత్రమే విశాఖకు అవసరం. ఇప్పుడిలా విమర్శలు చేస్తున్నారని చెప్పి విశాఖకు రాజధాని తరలించకుండా ఉంటే.. ఐదేళ్ల తర్వాత మన రాజధాని ఏదో చూపించమంటే.. ఏ పల్లెటూరునో.. తుళ్లూరు మండలాన్నో రాజధానిగా చూపించాలి. ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. రాబోయే తరాల వారు అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటారు. డిగ్రీ పూర్తి చేసుకొని, చేతుల్లో పట్టాలు పట్టుకొని యువత ఉద్యోగాల కోసం వెతుకుతారు.. వారంతా ఎక్కడకు వెళ్లాలి? సాక్షి, అమరావతి : భవిష్యత్ తరాలకు మేలు చేసేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబులా బాహుబలి సినిమా చూపించ లేనని, గ్రాఫిక్స్ మాయాజాలంతో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పలేనన్నారు. విజయవాడలో బుధవారం ‘ది హిందూ’ గ్రూపు నిర్వహించిన ‘ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ సదస్సులో ఆయన మాట్లాడారు. రాజధానిపై రాష్ట్రానికి ఓ తండ్రిగా ఏమి నిర్ణయం తీసుకోవాలో అది తీసుకున్నానని, ఏమీ లేని చోట లక్ష కోట్లను మౌలిక వసతుల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో వ్యయం చేసే స్థితిలో లేమని చెప్పారు. ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజల మేలు కోసం కొన్ని నిర్ణయాలు తప్పదు ‘‘సదస్సుకు ముందు ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ గారితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. మా చర్చలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను ఈ వేదికపై నుంచి పంచుకోమని ఆయన కోరారు. అందులో ఒకటి రాజధానికి సంబంధించింది. ఒక సీఎంగా కొన్ని అధికారాలతో పాటు బాధ్యతలూ ఉంటాయి. కొన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకోవాలి. లేకపోతే, భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది. ఈ కోవలో మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోకపోతే భావి తరాలకు అన్యాయం, నష్టం జరుగుతుంది. ఎటు చూసినా 30, 40 కిలోమీటర్ల దూరమే... ఇప్పుడున్న అమరావతి ఇటు విజయవాడకు కానీ, అటు గుంటూరుకు కానీ దగ్గరగా లేదు. ఎటుచూసినా 30, 40 కిలోమీటర్ల దూరం. పైగా అవన్నీ పంట భూములు. అక్కడికి కనీసం రెండు లైన్ల రోడ్డు కూడా లేదు. అంతా సింగిల్ లైన్ రోడ్డే. అయినా ఆయన (చంద్రబాబు) ఆ ప్రాంతంపై ఎందుకంత ఆసక్తి చూపారో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన, ఆయన ఆశ్రితుల (క్రోనీ – అత్యంత ఇష్టమైన వ్యక్తులు)కు అక్కడ భారీ ఎత్తున భూములున్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక రాజ ధాని ప్రకటనకు ముందే, ఈ గ్రామాలు పబ్లిక్ డొమైన్లోకి రాక ముందే భూములు కొనుగోలు చేయడం వల్ల అక్కడ పెట్టారు. రూ.2,300 కోట్ల అప్పు మిగిల్చారు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? కేవలం రూ. 5,677 కోట్లు. పైగా మరో రూ.2,300 కోట్ల అప్పు 10.32 శాతం వడ్డీతో తెచ్చి ఈ ప్రభుత్వం నెత్తిన వేసింది. కేంద్రం నుంచి రూ.1,500 కోట్లు వచ్చింది. దాన్ని మించి వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. మహా అయితే మరో రూ.1,000 కోట్లు ఇస్తారేమో. ఈ పరిస్థితుల్లో ఏ రాష్ట్ర సీఎం అయినా ఏం చేస్తారు? అమరావతిలో కనీస మౌలిక వసతులు కల్పించడానికే దాదాపుగా రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. ఇక్కడ నేను రూ.5,000 కోట్లు లేక రూ.6,000 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. అదయినా సముద్రంలో నీటి చుక్క చందమే. ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే తప్పనిసరిగా రుణాలకు వెళ్లాల్సిందే. లెజిస్టేటివ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుంది.. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా తప్పనిసరిగా కొనసాగుతుంది. ఇక్కడే ఏటా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 60 నుంచి 70 రోజుల పాటు ఎమ్మెల్యేలంతా వస్తారు. అందువల్ల అమరావతి అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలోనే నంబర్ వన్ సిటీ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అవుతుంది. సీఎం, మంత్రులు అక్కడ ఉంటారు. సచివాలయం, హెచ్వోడీ కార్యాలయాలు కూడా పని చేసాయి. ఇప్పటికే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక మూడో అంశం జ్యుడిషియల్ కేపిటల్. రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఉంటుంది. తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు 1953 నుంచి 1956 వరకు కర్నూలు రాష్ట్ర రాజధానిగా కొనసాగిందనే విషయం మీకందరికీ తెలుసు. అప్పట్లో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేశారు. వికేంద్రీకరణ జరగాలని, పాలన మూలాలను విడగొట్టాలని (సీడ్స్ ఆఫ్ గవర్నెన్స్ స్ప్లిట్) కావాలని ఆనాడే పెద్దలు నిర్ణయించారు. అందుకే అక్కడ జ్యుడిషియల్ కేపిటల్ను ఏర్పాటు చేస్తున్నాం. అసలు ఎంత ఖర్చవుతుంది? అమరావతికి రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. అది కూడా అప్పు తీసుకొచ్చి పెట్టాలి. ఓ 20 ఏళ్ల తర్వాత ఈ రూ.లక్ష కోట్లకు వడ్డీతో కలుపుకుని రూ.3 లక్షల కోట్లు లేదా 4 లక్షల కోట్లు అవుతుంది. చంద్రబాబు చెబుతున్నట్టుగా కేపిటల్ నిర్మించేందుకు అనువైన ల్యాండ్ బ్యాంక్ లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నది పరీవాహక చట్టం ప్రకారం లీగల్గా భవనాలు కట్టేందుకు మిగిలింది 5,200 ఎకరాలు మాత్రమే. ఇందులో మాత్రమే రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడితే అది 20 ఏళ్ల తర్వాత రూ.3 లక్షల కోట్లు లేదా 4 లక్షల కోట్లు అవుతుంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి ప్రభుత్వాలు తీసుకురాగలుగుతాయి? ఇదే మనకున్న క్లిష్టమైన పరిస్థితి. అందుకే విశాఖను పరిపాలన రాజధానిగా ఎంచుకున్నాం. ఓ తండ్రిగా తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నా.. మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అందరూ విప్లవాత్మకంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒక తండ్రి తన పిల్లలకు ఏదైతే చేయాలనుకుంటాడో అలాగే చేశాను. ఈ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉంటూ నిర్ణయం తీసుకునే అవకాశం నాకు ప్రసాదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఒక తండ్రి నెరవేర్చాల్సిన బాధ్యత నెరవేరుస్తున్నాను. నాకున్న సామర్థ్యం మేరకు ఎంత వరకు చేయగలనో అదంతా ఉత్తమంగా చేస్తున్నాను. వర్షాలు పడినా డ్యామ్లు నిండలేదు.. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డాయి. కానీ రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో డ్యామ్స్ నిండనే లేదు. కాల్వల సామర్థ్యం లేక పోవడమే ఇందుకు కారణం. కాల్వల ఆధునికీకరణ చేయాలంటే సహాయ పునరావాస (ఆర్ అండ్ ఆర్) సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించాలంటే రూ.33 వేల కోట్లు అవసరం అవుతాయని ఇంజనీర్లు అంటున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చూసినా, పోలవరం చూసినా రూ.16,000 కోట్లు అవసరం. వీటిలో నేను వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి? దశాబ్దాలుగా పూర్తి కాని ప్రాజెక్టులు, నా తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన ప్రాజెక్టులను గత ప్రభుత్వంలో చంద్రబాబు విస్మరించారు. వాటిని పూర్తి చేయాలంటే మాకు మరో 25,000 కోట్లు కావాలి. 47 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులు పరిశీలిస్తే 1,200 టీఎంసీల నీరు శ్రీశైలం చేరుతుందని ఉంది. కానీ గత పదేళ్ల రికార్డు చూస్తే 1,200 టీఎంసీల నుంచి అది 600 టీఎంసీలకు పడిపోయింది. అదే ఐదేళ్ల రికార్డులు చూస్తే 400 టీఎంసీలకు క్షీణించినట్టు అర్థం అయ్యింది. అంటే నీరందక కృష్ణా ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. మరోపక్క గోదావరి వరద 3,000 టీఎంసీలు వృథాగా సముద్రం పాలవుతోంది. వ్యవసాయ ఆధారితమైన ఈ రాష్ట్రంలో 62 శాతం మంది దానిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడం తప్ప వేరే దారిలేదు. ఇంజనీర్లు ఇందుకు రూ.68,000 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. దీనికంటే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి అయ్యే మరో మంచి మోడల్ సూచించాలని వారిని కోరాను. అదైనా రూ.40,000 కోట్ల నుంచి 45,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి పట్టా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. సుమారు 25 లక్షల మందికి ఈ ఉగాదికి ఇంటి పట్టాలు ఇవ్వబోతున్నాం. వీటిలో కనీసం ఏడాదికి 6 లక్షల మందికి ఇళ్లు కట్టించి.. నాలుగేళ్లలో మొత్తం ఇళ్లు పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.9,000 కోట్లు అవుతుంది. ఇవన్నీ చేయడానికి రాష్ట్రంలో నిధులు ఉన్నాయా? అలా చేసే స్వేచ్ఛ, అవకాశం లేదు’ అని సీఎం జగన్ వివరించారు. విశాఖే ఎందుకంటే.. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన నంబర్ వన్ సిటీ. ఇప్పటికే అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. లక్ష కోట్లలో పది శాతం విశాఖపట్నంలో ఖర్చు చేస్తే ఐదేళ్లు కాకపోయినా పదేళ్లలోనైనా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి దీటుగా తయారవుతుంది. మన రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం ఉండదు. అదే విశాఖను అభివృద్ధి చేస్తే అది మా నగరం, మా రాజధాని, మా ఊరు అనుకుంటారు. మీరే నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో ఆలోచించండి? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే అందరూ సంతోషంగా ఉండాలని.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలనీ.. అందుకోసం పాలనను (గవర్నెన్స్) మూడు ప్రాంతాలకు విస్తరించేలా విడగొట్టాం. పారదర్శకతకు పెద్దపీట దేశంలోనే తొలిసారిగా రివర్స్ టెండరింగ్తో ఓ మార్పునకు శ్రీకారం చుట్టాం. (రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటన్న ది హిందూ గ్రూప్ చైర్మన్ రామ్ ప్రశ్నకు సమాధానమిస్తూ..) మూలాల నుంచి అవినీతిని నిర్మూలించే మార్పును ప్రారంభించాం. దేశం అంతా ఆదర్శంగా తీసుకునే నిర్ణయం తీసుకున్నాం. రూ.100 కోట్లకు పైబడిన ఏ టెండర్ అయినా ముందు జ్యుడిషియల్ ప్రివ్యూ కోసం జడ్జి ముందుకు వెళుతుంది. దీన్ని వారు పబ్లిక్ డొమైన్లో వారం రోజులు ఉంచుతారు. కాంట్రాక్ట్లో ఉన్న నిబంధనలపై విమర్శకులు సహా ఎవరైనా అభ్యంతరాలు తెలపచ్చు.. సలహాలు ఇవ్వొచ్చు. చాలా వరకు అవినీతికి ఆస్కారం ఎక్కడుంటుందంటే ప్రాజెక్టుల టెండర్లు టైలర్ మేడ్గా (కమీషన్లు ఇచ్చే వారికే పనులు దక్కేలా నిబంధనలు పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం) ఉంటాయి. కొందరు మాత్రమే అర్హత పొందేలా వాటిని తయారు చేస్తుంటారు. దీన్ని నివారించడానికే మేము ఈ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేశాం. న్యాయమూర్తి ఆధ్వర్యంలో టెండర్ నిబంధనలు ఖరారవుతాయి. టెండర్లో అతి తక్కువ కోట్ చేసిన మొత్తాన్ని చూపిస్తూ రివర్స్ టెండరింగ్కు వెళతాం. దాని కంటే తక్కువకు ఆ టెండర్ చేస్తామని ఎవరు పోటీ పడినా వారికి ప్రాజెక్టు కాంట్రాక్టు అప్పగిస్తాం. ఈ ఏడు నెలల కాలంలో దాదాపుగా రూ.2000 కోట్లు రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఆదా చేయగలిగాం. పేదల ఇళ్లకు సంబంధించిన టిడ్కో ప్రాజెక్టు అందుకు ఓ ఉదాహరణ. గతంలో సుమారు రూ.2,700 కోట్లుగా నిర్ణయమైన ఈ టెండర్ను రద్దు చేసి రివర్స్ టెండరింగ్కు వెళ్లడం ద్వారా దానిని రూ.2,300 కోట్లకు తీసుకురాగలిగాం. పోలవరంలో గత టెండర్తో పోలిస్తే రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.830 కోట్లు ఆదా చేయగలిగాం. రాష్ట్రంలో ఇక ఏ టెండర్ అయినా ఇప్పుడు ఇదే పద్ధతిలో చేయబోతున్నాం. త్వరలో దీన్ని దేశమంతా అమలు చేస్తుందని నేను నమ్ముతున్నాను. పారదర్శకతకు పెద్ద నిదర్శనంగా ఉంటుందని భావిస్తున్నా. -
టిడ్కో 12వ విడత రివర్స్ టెండరింగ్లో 30.91 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి : పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టులలో 12వ విడత రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ఏపీ టిడ్కో రూ.30.91కోట్లు ఆదా చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 5,088 హౌసింగ్ యూనిట్ల (ఇళ్ల) నిర్మాణానికి టిడ్కో బుధవారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తం రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.275.70 కోట్లతో బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.30.91 కోట్లు భారం తగ్గింది. దీంతో ఏపీ టిడ్కో ఇంత వరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి రూ.3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించగా, రూ.2,847.16 కోట్లతో పనులను ఖరారు చేశారు. రూ.392.23 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.156 నుంచి రూ.316 వరకు వ్యయం తగ్గిందని వివరించారు. వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన వివిధ పనుల్లో మొత్తంగా రూ.1,869.51 కోట్లు ఆదా అయ్యింది. -
మద్యం షాపుల అద్దెలపై రివర్స్ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మద్యం దుకాణాల అద్దెలకు సంబంధించి రివర్స్ టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. తొలుత విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరులో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అద్దె టెండర్లలో గోల్మాల్ కొత్త మద్యం విధానంలో భాగంగా సంయుక్త కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు గదుల అద్దెలు ఖరారు చేశారు. అయితే ఈ టెండర్లలో గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. గతంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలనే అధిక ధరలకు అద్దెకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తం కావటంతో విచారణకు ఆదేశించారు. అద్దె టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. విశాఖలో మద్యం షాపుల అద్దె చదరపు అడుగుకి ఎక్కడా లేని విధంగా రూ.566 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా పట్టణాల్లో/నగరాల్లో అద్దెలు చదరపు అడుగుకి రూ.22 నుంచి గరిష్టంగా రూ.40 వరకు మాత్రమే ఉన్నాయి. మద్యం షాపులకు రూ.50 నుంచి రూ.70 వరకు చెల్లించవచ్చనుకుంటే ఏకంగా రూ.250 నుంచి రూ.560 వరకు చెల్లించేలా భవన యజమానులతో ఎక్సైజ్ అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మద్యం దుకాణాన్ని 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. విశాఖలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మద్యం దుకాణానికి నెలకు రూ.1.70 లక్షలు అద్దె చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల ఉచితంగా ఇచ్చిన స్థానికులు మరోవైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాల గదులకు ఎలాంటి అద్దె లేకుండా ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. కృష్ణా జిల్లా నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం తదితర ప్రాంతాల్లో మద్యం షాపులకు అద్దె లేకుండా స్థానికులు గదుల్ని అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూపాయి అద్దె చొప్పున భవనాలు అప్పగించారు. మద్యం వ్యసనాన్ని ప్రజలకు దూరం చేసేందుకు ప్రభుత్వమే షాపుల్ని నిర్వహిస్తుండటంతో ఉచితంగా భవనాలు అప్పగించారు. విజయవాడలో రూ.లక్షల్లో అద్దె విజయవాడలో గతంలో లిక్కర్ మార్ట్లు నిర్వహించిన చోట ఏపీఎస్బీసీఎల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఓ దుకాణానికి నెలకు రూ.3.50 లక్షలు, మరో షాపునకు రూ.2.70 లక్షలు చొప్పున అద్దె నిర్ణయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను నిర్వహించిన చోటే ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు సూచించడంతో అధిక ధరలతో అద్దెకు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయించాల్సిన అధికారులు హడావుడిగా అధిక మొత్తంలో అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు వీటికి రివర్స్ టెండర్లు నిర్వహించి ఖజానాకు ఆదా చేయనున్నారు. -
‘రివర్స్ టెండరింగ్లో మరో రూ. 30.91 కోట్లు ఆదా’
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో టిడ్కోలో(టౌన్ షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ) సత్ఫలితాలు సాధించామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ కార్యక్రమాల నిమిత్తం టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియలో తాజాగా మరో రూ. 30.91 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన 5088 యూనిట్ల నిర్మాణాలకు రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.275.7 కోట్లకు ఈ పనులను చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ బిడ్ దాఖలు చేసి ఎల్ 1 గా నిలిచిందని తెలిపారు. (రూ.103.89 కోట్లు ఆదా) ఈ ప్యాకేజిలో రూ.30.91 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గి.. ప్రజా ధనాన్ని ఆదా చేశామని తెలిపారు. ఇంతవరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించగా, రూ.2,847.16 కోట్లతో ఆ పనులను చేపట్టడానికి వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి వివరించారు. ఇలా 12 ప్యాకేజిల్లో మొత్తం రూ. 392.23 కోట్ల మేర ప్రజా ధనం ఆదా అయ్యిందని ఆయన వివరించారు. వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 156 నుంచి రూ.316 వరకు ఖర్చు తగ్గి, ప్రభుత్వంపై భారం తగ్గిందని ఆయన తెలిపారు. చదవండి : ‘రివర్స్’తో మొత్తం రూ.1,532.59కోట్లు ఆదా ‘రివర్స్ టెండరింగ్తో ప్రజాధనం ఆదా చేస్తున్నాం’ -
గుంటూరు చానల్ పనుల్లో రూ.27.76 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ విజయవంతమైంది. అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే 3.92 శాతం తక్కువ ధరకే రూ.318.81 కోట్లకు సుధాకర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ఈ పనులను దక్కించుకుంది. టీడీపీ అధికారంలో ఉండగా ఇవే పనులను ఐబీఎం కంటే 4.44 శాతం అధిక ధరకు అప్పటి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సన్నిహితుడికి చెందిన ఎమ్మెస్సార్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అస్మదీయులకు అధిక ధరలకు అప్పగించే ఎత్తుగడలపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడంతో సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్) ఈ టెండర్ను ఆమోదించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ టెండర్ను రద్దు చేసిన అధికారులు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో గతంతో పోల్చితే మొత్తంమ్మీద 8.36 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ముందుకు రావడంతో ఖజానాకు రూ.27.76 కోట్లు ఆదా అయ్యాయి. - గుంటూరు చానల్ 47 కి.మీ. మేర ఆధునికీకరణ పనులకు రూ.331.81 కోట్ల అంచనా వ్యయంతో 2018 జనవరి 19న టీడీపీ సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - ఫిబ్రవరి 4న సాంకేతిక బిడ్ తెరవగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్, జీవీవీ కన్స్ట్రక్షన్స్, సూర్య కన్స్ట్రక్షన్స్, ఎమ్మెస్సార్ కన్స్ట్రక్షన్స్, శ్రీసాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్, సుధాకర్ ఇన్ఫ్రాటెక్ షెడ్యూళ్లు దాఖలు చేశాయి. - ఎమ్మెస్సార్ కన్స్ట్రక్షన్స్కే పనులు అప్పగించాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు. - అనర్హత వేటుకు గురైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్, సుధాకర్ ఇన్ఫ్రాటెక్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగానే నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ప్రైస్ బిడ్ను ఫిబ్రవరి 8న తెరిచారు. ఎమ్మెస్సార్ ఇన్ఫ్రా 4.44% అధిక ధరలకు (రూ. 346.57 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. - టెండర్ నిబంధనల్లో అక్రమాలకు పాల్పడటం, ఎమ్మెస్సార్ కన్స్ట్రక్షన్స్కు పనులు చేసిన అనుభవం లేకపోవడం, తప్పుడు ధ్రువీకరణపత్రాలు సమర్పించడం, ముడుపులు చేతులు మారడంపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడంతో ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, వై.రాజీవ్రెడ్డి, సీఈ ఏజీ మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ వి.శ్రీనివాస్ నేతృత్వంలోని సీవోటీ ఈ టెండర్లను ఆమోదించలేదు. - తాజాగా ఈ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించగా సుధాకర్ ఇన్ఫ్రాటెక్, రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ సంస్థలు షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ప్రైస్ బిడ్లో 0.92 శాతం తక్కువకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఈ ధరనే అంచనా విలువగా నిర్ణయించి ఈ–ఆక్షన్ నిర్వహించగా 3.92 శాతం తక్కువ ధరకు కోట్ చేసిన సుధాకర్ ఇన్ఫ్రాటెక్ పనులను దక్కించుకుంది. ఈ టెండర్లను ఆమోదించాలని గుంటూరు జిల్లా ఎస్ఈ శుక్రవారం సీవోటీకి ప్రతిపాదనలు పంపారు. ’రివర్స్’తో ఇప్పటిదాకా రూ.1,838.67 కోట్లు ఆదా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక విధానం రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటిదాకా రాష్ట్ర ఖజానాకు రూ.1,838.67 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటిదాకా ఈ విధానం వల్ల వివిధ అంశాల్లో ఆదా అయిన మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి. -
విజయాల బాటలో రివర్స్ టెండరింగ్..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అభివృద్ధి పనుల పేరుతో... తమకు అనుకూలమైన సంస్థలకు... ఎక్సెస్ రేట్లకు టెండర్లను కట్టబెట్టిన గత సర్కార్ అవినీతికి ''రివర్స్ టెండరింగ్'' ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెక్ పెట్టింది. వేల కోట్ల రూపాయల పనులను ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థలకు విచ్చలవిడిగా అధిక రేట్లకు అప్పగించడం ద్వారా... సదరు సంస్థల నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకున్న గత ప్రభుత్వంలోని పెద్దల ధనదాహంకు అడ్డుకట్ట పడింది. అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలోనే ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా వందల కోట్ల రూపాయల వరకు ప్రజాధనం ఆదా అయ్యింది. సాగునీటి ప్రాజెక్ట్ల నుంచి మొదలు... పేదలకు అందించే పక్కాగృహాల వరకు... ఇష్టారాజ్యంగా ఎక్కువ కోట్ చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు పనులను అప్పగించడం ద్వారా గతంలోని చంద్రబాబు ప్రభుత్వం భారీగా ప్రజాధనంను దోచిపెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి పనుల నిర్మాణ వ్యయం కన్నా పదినుంచి ఇరవై అయిదు శాతం వరకు అధికంగా కోట్ చేసిన సంస్థలకు కూడా ఆనాటి ప్రభుత్వం కాంట్రాక్ట్లను ఖరారు చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. ఒకవైపు అధిక రేట్లను అంగీకరించడం... మరోవైపు అందుకు ప్రతిఫలంగా సదరు సంస్థల నుంచి భారీగా కమీషన్లను దండుకోవడం కోసం ఈ అక్రమాలకు ప్రభుత్వ పెద్దలు తెగబడ్డారనే విమర్శలు వినిపించాయి. దీనివల్ల తక్కువ వ్యయంతో పూర్తి కావాల్సిన నిర్మాణాలకు కోట్లాది రూపాయల ప్రజాధనం భారీగా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి విభాగంలోనూ ఈ రకంగా జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించింది. ప్రజాధనంను కొల్లగొడుతున్న సంస్థలు, వారి వెనుక వున్న అవినీతి రాజకీయనేతల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రివర్స్ టెండరింగ్ విధానంను ముందుకు తీసుకు వచ్చింది. రాష్ట్రంలో తొలిసారి రివర్స్ టెండరింగ్ విధానం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రైవేటు వ్యక్తుల ద్వారా పనులను చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తుంది. దీనిలో ఓపెన్ టెండర్లు, బిడ్డింగ్ లు, ఈ ప్రోక్యూర్మెంట్, ఈ టెండర్లు, నామినేటెడ్ పనులు ఇలా వివిధ విధానాల్లో పనులను అప్పగిస్తూ వుంటారు. అయితే ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ పనులను నిర్వహించడంలో విఫలమైనా, అలక్ష్యంగా వ్యవహరించినా సదరు పనులను రద్దు చేసే అధికారం ప్రభుత్వంకు ఉంటుంది. అంతేకాకుండా సదరు పనులను దక్కించుకున్న విధానంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులతో కుమ్మకై అధిక ధరలను కోట్ చేయడం కూడా ప్రజాధనం దుర్వినియోగానికి కారణమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ పనుల్లో అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఎంచుకుంది. గతంలోని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం మొదలు అనేక సాగునీటి ప్రాజెక్ట్లు, మున్సిపల్, ఆర్ అండ్ బీ, హౌసింగ్, పంచాయతీరాజ్ పనుల్లో ఎక్సెస్ రేట్లు కోట్ చేసిన సంస్థలకు కూడా పనులను కట్టబెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ముందుకు తీసుకువచ్చింది. ఏ పనులపై అయితే ఆరోపణలు ఉన్నాయో... వాటిని వెంటనే నిలుపుదల చేయడం, మరోసారి సదరు పనులకు టెండరింగ్ నిర్వహించడం.. తక్కువ కోట్ చేసిన సంస్థను పేర్కొంటూ.. అంతకంటే తక్కువకు ఎవరైనా పనులు చేసేందుకు ముందుకు వస్తారా అంటూ నిర్మాణ సంస్థలను ఆహ్వానించడం రివర్స్ టెండరింగ్ ప్రకియలో భాగం. ప్రజాధనంను దుర్వినియోగం కాకుండా చూసేందుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు జరిగిన అవినీతిని ప్రక్షాళన చేసేందుకు తొలి అడుగుగా మారింది. ‘రివర్స్’ తో రూ. వందల కోట్లు ఆదా పోలవరం హెడ్వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం రూ.782.80 కోట్లు లెఫ్ట్ కనెక్టివిటీ (65వ ప్యాకేజీ ) పనులకు రూ.58.53 కోట్లు జెన్కో బొగ్గు రవాణా రూ. 186 కోట్లు వెలిగొండ రెండో టన్నెల్ మిగిలిన పనులకు రూ. 61.76 కోట్లు డెస్క్ టాప్ కంప్యూటర్లు , ప్రింటర్ల కొనుగోలు రూ. 65 .47 కోట్లు జెన్కో బొగ్గు పర్యవేక్షణ రూ. 25 కోట్లు 4 జీ సిమ్ కార్డులు పోస్ట్ పైడ్ రూ. 33 .77 కోట్లు పోతురాజు నాలా డ్రైన్ అభివృద్ధి రూ. 15 .62 కోట్లు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల స్మార్ట్ ఫోన్లు కొనుగోలుకు రూ.83.80 కోట్లు ఏపీ టీడ్కోలో రివర్స్ టెండరింగ్ రూ. 303.31 కోట్లు అల్లూరుపాడు ప్రాజెక్ట్ పనుల్లో రివర్స్ టెండరింగ్ రూ. 67.81 కోట్లు అదా రూ.503 కోట్ల సోమశిల ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ రూ. 67.9 కోట్లు గాలేరు-నగరి రెండో దశ తొలి ప్యాకేజీలో రూ.35.3 కోట్లు ఆదా గాలేరు-నగరి రెండోదశ రెండో ప్యాకేజీలో రూ.33.57 కోట్లు ఆదా పోలవరంలో రివర్స్ టెండరింగ్ తో రూ.782.80 కోట్లు ఆదా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా ప్రాధాన్యతను సంతరించుకున్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లోనూ గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. ప్రాజెక్ట్ టెండర్ల వ్యవహారంలో ప్రజాధనంను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేందుకు ప్రయత్నించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయడంతో పాటు, కాంట్రాక్ట్ సంస్థలకు కట్టబెట్టిన ఎక్సెస్ పనులను పరిశీలించారు. అందుకోసం ప్రత్యేకంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాధమిక పరిశీలనలోనే వేల కోట్ల రూపాయల మేరకు పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు బయటపడింది. దీంతో రాష్ట్రంలోనే తొలిసారిగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ నుంచి ఎడమ కాలువకు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ పద్దతిని వర్తింపచేశారు. దాని ద్వారా ఏకంగా రూ. 58 కోట్ల రూపాయాలు ప్రజాధనం ఆదా అయ్యింది. ఈ రివర్స్ టెండరింగ్లో మొత్తం ఆరు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, అందులో ఎల్ 1 సంస్థ రూ.260.26 కోట్లకు టెండర్ దాఖలు చేసింది. రూ.274 కోట్ల విలువ చేసే పనులను 6.1 శాతం తక్కువకు పూర్తి చేయడానికి అంగీకరించిన ఎల్ 1 కన్నా ఎవరైనా తక్కువకు చేస్తారా అంటూ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. దీంతో రూ.231.47 కోట్లతో ఈ పనులు పూర్తి చేసేందుకు మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఇది అంచనా విలువ కన్నా 15.66 శాతం తక్కువ కావడం గమనార్హం. ఈ ఒక్క టెండర్ లోనే గతంలో నిర్వహించిన టెండర్తో పోలిస్తే రూ.58.53 కోట్ల ప్రజాధనం ఆదా అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హెడ్ వర్క్స్, పవర్ స్టేషన్ టెండర్ల ద్వారా భారీగా ప్రజాధనం ఆదా తాజాగా కీలకమైన పోలవరం హెడ్ వర్క్స్, పవర్ స్టేషన్ పనులకు టెండర్లు పిలిచారు. రూ. 4,987.55 కోట్ల విలువచేసే పనులకు టెండర్లు పిలువగా.. 12.6 శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు 'మేఘా' సంస్థ ముందుకు వచ్చింది. ఈ పనుల కోసం రూ. 4,358.11 కోట్లు కోట్ చేస్తూ మేఘా సంస్థ బిడ్డింగ్ వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా అవుతుందని ప్రాజెక్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో 4.8 శాతం అధిక ధరకు కాంట్రాక్టు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వానికి రూ.154 కోట్ల అదనపు భారం పడిందని, ఇప్పుడు ఆ భారం కూడా తగ్గడంతో ప్రభుత్వానికి మొత్తం రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అధికారులు పేర్కొంటున్నారు. పోలవరం ప్రధాన డ్యాం వద్ద మిగిలిన రూ. 1,771.44 కోట్ల పనులు, 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ. 3,216.11 కోట్ల విలువైన పనులకు సైతం రివర్స్ టెండరింగ్ ద్వారానే టెండర్లు నిర్వహించారు. పేదల ఇళ్ళ నిర్మాణంలోనూ భారం తగ్గించిన రివర్స్ టెండరింగ్ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం అందించే పక్కాగృహాల నిర్మాణంలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. అధికరేట్లకు టెండర్లకు ఆమోదం తెలపడం ద్వారా అటు ప్రజాధనంను దుర్వినియోగం చేయడంతో పాటు, ఇటు సబ్సిడీ తరువాత లబ్దిదారులు తమవంతుగా తిరిగి చెల్లించాల్సిన సొమ్మును కూడా అధికం అయ్యేలా చేశారు. ఈ విధానంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి సారించింది. దీంతో ఏకంగా రూ. 303.31 కోట్ల రూపాయల ఆదా జరిగింది. ఏపీ టౌన్ షిప్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (టీడ్కో)లో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడ్కో ద్వారా చేపట్టిన గృహనిర్మాణాలకు సంబంధించి తొలిదశలో 14,368 ఇళ్ల నిర్మాణంకు నిర్వహించిన రివర్స్ టెండరిగ్ ద్వారా రూ. 105.91 కోట్లు, రెండో దశ లో 6,596 ఇళ్ళ నిర్మాణం కోసం జరిగిన రివర్స్ టెండరింగ్ లో రూ. 46.03 కోట్లు, మూడోదశలో 19,296 ఇళ్లకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో రూ. 103.89 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. తాజాగా నాలుగోదశలో 8,448 ఇళ్ళ నిర్మాణం కోసం రూ.431.62 కోట్ల పనులకు చేపట్టిన రివర్స్ టెండరింగ్ లో ఇంద్రజిత్ మెహతా కన్ స్ట్రక్షన్ కంపెనీ రూ.384.14 కోట్లకు బిడ్ ను దక్కించుకుంది. ఫలితంగా రూ.47.48 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదా అయ్యింది. మొత్తం 48,608 పక్కాగృహాలకు గానూ రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ.303.31 కోట్ల రూపాయలు ఆదా కావడం గమనార్హం. పాతరేట్లకే టెండర్లను అంగీకరించి ఉంటే... టీడ్కో ఇళ్ళను పొందిన పేదలు ఒక్కొక్కరి మీద దాదాపు రూ.75 వేల నుంచి రూ. 95 వేల వరకు భారం పడేది. సాగునీటి ప్రాజెక్టుల్లో.. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్ట్ ల్లోనూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలుగు గంగ లైనింగ్ పనులకు గత ప్రభుత్వం అధిక ధరలకు పనులను కట్టబెట్టడం వల్ల దాదాపు 30.81 కోట్ల రూపాయల వరకు భారం పడిందని అధికారులు అంచనా వేశారు. రివర్స్ ద్వారా ఈ భారంను తగ్గించేందుకు అవకాశం ఉందని సాగునీటి అధికారులు భావిస్తున్నారు. సోమశిల రెండోదశ కెనాల్ పనుల్లో కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా 67.9 కోట్ల రూపాయలు ఆదా అయింది. బీవీఎస్సార్ కన్స్ట్రక్షన్ ఈ టెండరింగ్ లో 8.69 శాతం తక్కువకు ఈ పనులను దక్కించుకుంది. గాలేరు-నగరి రెండో దశ తొలి ప్యాకేజీలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 35.3 కోట్ల రూపాయల మేరకు ఆదా అయింది. మొత్తం రూ. 391.13 కోట్ల వ్యయంతో ఈ పనులకు టెండర్లు నిర్వహించారు. దీనిలో 5.04 శాతం తక్కువతో రూ. 371.43 కోట్లకే కాంట్రాక్ట్ సంస్థ పనులను దక్కించుకుంది. ఇవే పనులను గతంలో అప్పటి ప్రభుత్వం తమ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన సంస్థకు రూ. 406.73 కోట్లకు కట్టబెట్టింది. దీనివల్ల ఖజానాపై రూ.15.6 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. అలాగే గాలేరు-నగరి రెండోదశ ప్యాకేజీకి సంబంధించి తాజాగా రూ. 349.97 కోట్ల రూపాయల పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ టెండర్లలో 5శాతం తక్కువకే పనులను కాంట్రాక్టు సంస్థ బిడ్డింగ్ దక్కించుకుంది. ఫలితంగా రూ. 33.57 కోట్లు ఆదా అయ్యింది. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇవే పనులను 4.76 శాతం అధిక ధరలకు పనులను కట్టబెట్టింది. అల్తూరుపాడు ప్రాజెక్ట్ పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 67.81 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనం ఆదా అయింది. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ అంతర్భాగమైన అల్తూరుపాడు రిజర్వాయర్ పనులకు గానూ రూ. 253.77 కోట్లతో గతంలో టిడిపి ప్రభుత్వం టెండర్లను ఆమోదించింది. ఇదే పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో 14.06 శాతం తక్కువకు అంటే రూ. 218.09 కోట్లకు ఖరారు అయ్యింది. దీనిద్వారా ఖజానాపై దాదాపు 35.68 కోట్ల రూపాయలు భారం తగ్గింది. సెల్ ఫోన్లు, సిమ్ కార్డుల కొనుగోళ్లలో.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల సిబ్బంది, గ్రామ, వార్డు వాలంటీర్లకు సెల్ ఫోన్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సెల్ ఫోన్లు, సిమ్ కార్డులకు టెండర్లు నిర్వహించింది. అయితే ఇందులోనూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను అనుసరించింది. మొత్తం 2.64 లక్షల ఫోన్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిర్వహించిన టెండర్లలో ఒక సంస్థ రూ. 317.61 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. మరోసంస్థ రూ. 233.81 కోట్లుతో బిడ్ దాఖలు చేసింది. దీంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా 26.4శాతం తక్కువకే టెండర్ ఖరారు అయ్యింది. దీనివల్ల దాదాపు రూ. 83.80 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. అలాగే 4-జీ సిమ్ కార్డుల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ ద్వారా.. 33 కోట్ల 76 లక్షల రూపాయలు ఆదా అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రభుత్వం.. 2,64,920 ఫోన్ లకు 4-జీ సిమ్ కార్డులు కొనుగోలు చేస్తోంది. ఎల్-1 గా వచ్చిన సంస్థ రూ. 121.54 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ నిర్వహించగా రూ. 87.77 కోట్లకే ఒప్పందం ఖరారు చేశారు. -
రివర్స్ అదుర్స్
బొబ్బిలి: ఆశ్రిత పక్షపాతం, స్వప్రయోజనం గత ప్రభుత్వ విధానమైతే... ప్రజా సంక్షేమం, ఖజానాపై భారం తగ్గడం తాజా పాలకుల లక్ష్యం. అదే ఉద్దేశంతో రూపొందించిన రివర్స్ టెండరింగ్ విధానం జిల్లాలో మంచి లాభాలను చేకూర్చింది. గత ప్రభు త్వం జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలు, ఒక నగ ర పంచాయతీలో చేపట్టిన అర్బన్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం ఖజానాపై పెనుభారం మోపింది. ఎంతోమంది నిరుపేదలు ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నా... వారిని పట్టించుకోకుండా కేవలం జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన తమ సొంతవారికే వాటిని కట్టబెట్టింది. అలా మంజూరైన ఇళ్ల కాంట్రాక్టును అప్పట్లో విజయ్నిర్మాణ్ సంస్థకు పెద్ద మొత్తానికి అప్పగించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 20శాతం లోపు నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టును రద్దు చేసి రివర్స్ టెండర్కు పిలవాలని నిర్ణయించడంతో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మునిసిపాలిటీల్లోని ఇళ్లను కొత్త కంపెనీ తక్కువకు దక్కించుకుని ఖజానాకు రూ. 22కోట్లు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆ మూడు మున్సిపాలిటీల్లో గతంలో రూ.148 కోట్లకు విజయనిర్మాణ్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంటే రివర్స్ టెండరింగ్లో రూ.126 కోట్లకే ఇంద్రజిత్ మెహర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ పరిణామంతో ఇక పట్టణ గృహ నిర్మాణాలు వేగవంతం అవుతాయని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20శాతం లోపు పనులు నిలుపుదల జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణ బాధ్యతను గతంలో విజయనిర్మాణ్ సంస్థ దక్కించుకుంది. అందులో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మునిసిపాలిటీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణం 20శాతానికి మించలేదు. అందుకే ఈ మూడింటికి కొత్తగా రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కాంట్రాక్ట్ పొందిన ఇంద్రజిత్ మెహర్ కంపెనీ పాత కంపెనీ ధరల కంటే 14.78 శాతం తక్కువకు కోట్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీకి టెండర్లు ఖరారు చేసింది. ప్రభుత్వం క్లియరెన్స్ లెటర్ ఇచ్చాక పనులు ప్రారంభించేందుకు కొత్త సంస్థ సిద్ధంగా ఉంది. గత కాంట్రాక్టు పెద్ద మొత్తానికి వెళ్లినట్టు గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్మాణాలపై పలుమార్లు నివేదికలు కోరింది. మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో ఇంజినీర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా వారి అనుమానం నిజమన్న విషయం తేటతెల్లమైంది. వెంటనే 20శాతం కంటే తక్కువ పనులు చేపట్టిన మూడు మునిసిపాలిటీలకు రివర్స్ టెండరింగ్ అమలు చేసింది. ఊపందుకోనున్న నిర్మాణాలు జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు అర్బన్ హౌసింగ్ నిర్మాణాలకు కొత్త కాంటాక్టరుకు అప్పగించడంతో ఇక పనులు చురుకుగా సాగే అవకాశం ఉందని లబి్ధదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు మునిసిపాలిటీల్లో ఈ సంస్థ 3072 ఇళ్లను నిర్మించనుంది. జిల్లా వ్యాప్తంగా 7,677 ఇళ్లను నిర్మించేందుకు అప్పట్లో పనులు చేపడితే మూడు మున్సిపాలిటీల్లో 3072 ఇళ్లకు మాత్రమే రివర్స్ టెండరింగ్కు పిలిచారు. విజయనగరంలో పనులు పూర్తవగా, నెల్లిమర్లలో అసలు టెండర్లు పిలవలేదు. కొద్ది రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అర్బన్ ఇళ్ల నిర్మాణానికి గత కాంట్రాక్టును నిలిపివేసిన ప్రభుత్వం కొత్తగా రివర్స్ టెండరింగ్ పిలిచింది. కొత్తగా మూడు మున్సిపాలిటీల్లో 3072 ఇళ్ల నిర్మాణానికి 14.78 శాతం తక్కువకు కోట్ చేసిన ఇంద్రజిత్ మెహర్ కన్స్ట్రక్షన్స్కు టెండర్ దక్కింది. ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఏక్సెప్టెన్సీ వచ్చాక సంస్థ పనులు ప్రారంభించనుంది. మరి కొద్ది రోజుల్లో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కానుంది. – మామిడి శ్రీనివాస్, ఈఈ, టిడ్కో హౌసింగ్ -
గాలేరు – నగరి రెండో దశ రెండో ప్యాకేజీలో రూ.33.57 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండో ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.33.57 కోట్లు ఆదా అయ్యాయి. ఎన్నికలకు ముందు ఈ పథకం రెండో దశలో ఏడు ప్యాకేజీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించి ప్రీ–క్లోజర్ చేసుకునేలా చక్రం తిప్పిన గత ప్రభుత్వ పెద్ద.. ఆ పనుల అంచనా వ్యయాన్ని పెంచి, అధిక ధరకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. రెండో ప్యాకేజీ (గాలేరు–నగరి ప్రధాన కాలువ 66.15 కిలోమీటర్ల నుంచి 96.50 కిలోమీటర్ల వరకు తవ్వడం, 12 వేల ఎకరాలకు నీళ్లందించడానికి పిల్ల కాలువలు తవ్వడం) పనుల అంచనా వ్యయాన్ని రూ.343.97 కోట్లకు పెంచి లంప్సమ్–ఓపెన్ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్లను జారీ చేయించారు. తాను ఎంపిక చేసిన కాంట్రాక్టర్ను కాదని బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లపై అనర్హత వేటు వేయించారు. ఆ కాంట్రాక్టర్లు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఆ కేసు విచారణలో ఉండగానే సింగిల్ బిడ్గా దాఖలు చేసిన టెండర్ను ఆమోదించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి 4.76 శాతం అధిక ధర (రూ.360.35)కు ఎంపిక చేసిన కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టారు. దాంతో ఖజానాపై రూ.16.38 కోట్ల భారం పడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలా చేసింది.. పనులు ప్రారంభించకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిన గాలేరు–నగరి అధికారులు.. రూ.343.97 కోట్ల అంచనా వ్యయంతో 36 నెలల్లో ఆ పనులు పూర్తిచేయాలనే షరతుతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనాన్స్ బిడ్ను శుక్రవారం ఉదయం 11 గంటలకు తెరిచారు. నాలుగు సంస్థలు (ఎమ్మార్కేఆర్, ఎస్సీఎల్, బీవీఎస్సార్, బృందా ఇన్ఫ్రాటెక్) పోటీ పడుతూ బిడ్లు దాఖలు చేశాయి. 4.5 శాతం తక్కువ ధర (రూ.328.50 కోట్లు)కు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. దాంతో ప్రైస్ బిడ్ స్థాయిలోనే రూ.15.47 కోట్లు ఆదా అయ్యాయి. రూ.328.50 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించిన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఐదు శాతం తక్కువ ధర(రూ.326.78 కోట్లు)కు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచించింది. దాంతో ఆ సంస్థకే పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు గాలేరు–నగరి అధికారులు నివేదిక పంపనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.17.19 కోట్లు ఆదా అయ్యాయి. గతంతో 4.76 శాతం అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై రూ.16.38 కోట్ల భారం పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం ఖజానాకు రూ.33.57 కోట్లు ఆదా అయినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా 9.76 శాతం తక్కువ ధరకు పనులు అప్పగించినట్లయింది. కాగా, ఈ నెల 19న రెండో దశలోని మొదటి ప్యాకేజీ పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వల్ల రూ.35.3 కోట్లు ఖజానాకు ఆదా అయిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు ఇప్పటి దాకా రూ.1752.83 కోట్లు ఆదా అయ్యాయి. టిడ్కో నాలుగో దశ రివర్స్టెండరింగ్లో రూ.47.48కోట్లు ఆదా ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) నిర్వహించిన నాలుగో దశ రివర్స్టెండరింగ్లో రూ.47.48 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8,448 ఇళ్ల నిర్మాణానికి ఏపీ టిడ్కో శుక్రవారం రూ.431.62 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండర్లు పిలవగా ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ రూ.384.14 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. దాంతో రూ.47.48 కోట్ల ప్రజాధానం ఆదా అయ్యింది. ఇంతకు ముందు మూడు దశల్లో 40,160 ఇళ్ల నిర్మాణానికి ఈ విధానం ద్వారా రూ.255.83 కోట్ల ప్రజాధనం మిగిలిన విషయం తెలిసిందే. మొత్తంగా నాలుగు దశల్లో 48,608 ఇళ్ల నిర్మాణానికి రూ.2,399 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండర్లు నిర్వహించగా రూ.303.31 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తున్నందున మరిన్ని ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. -
రూ.103.89 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి : ఏపీ టౌన్ షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో)లో గురువారం తాజాగా ఖరారు చేసిన మూడో దశ రివర్స్ టెండరింగ్లో రూ.103.89 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 19,296 ఇళ్ల నిర్మాణానికి రూ.942.90 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండర్లను ఆహ్వానించారు. డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.839.01 కోట్లతో బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. దాంతో రూ.103.89 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. గతంలో తొలి దశలో 14,368 ఇళ్ల నిర్మాణానికి నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో రూ.105.91కోట్లు, రెండో దశలో 6,496 ఇళ్ల నిర్మాణంలో రూ.46.03 కోట్లు ఆదా అయిన విషయం తెలిసిందే. తాజాగా మూడో దశతో కలుపుకుంటే మొత్తంగా 40,160 ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ వల్ల రూ.255.83 కోట్ల ప్రజాధనం మిగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తోందని ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కాగా, ఇప్పటిదాకా అన్ని పనుల్లో రాష్ట్ర ఖజానాకు ఈ విధానం వల్ల రూ.1,671.78 కోట్లు ఆదా అయ్యాయి. ఏపీ టిడ్కోకు రూ.135 కోట్లు సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో)కు ప్రభుత్వం రూ.135కోట్లు మంజూరు చేసింది. పట్టణ గృహ నిర్మాణ పథకం అమలు కోసం బడ్జెట్ కేటాయింపుల నుంచి ఈ నిధులను మంజూరు చేస్తూ పురపాలక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటిడ్కో ఎండీకి మరో రెండు బాధ్యతలు ఏపీ టిడ్కో ఎండీ బీఎం దివాన్ మైదీన్కి ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ల ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ రెండు పోస్టుల్లో ఉన్న ఎన్. చంద్రమోహన్రెడ్డి సెలవుపై వెళ్లినందున ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాకు రూ.50 కోట్లు సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్ర చికిత్సలు చేయించుకుని డిశ్చార్జి అనంతరం కోలుకునే సమయంలో ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పేరుతో బాధితులకు ఇచ్చే ఆర్థిక సాయానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు 2019–20 సంవత్సరానికి ఈ నిధులు మంజూరు చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
గాలేరు–నగరి రెండో దశలో రూ.35.3 కోట్లు ఆదా
-
గాలేరు–నగరిలో రూ.35.3 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశ తొలి ప్యాకేజీ పనులకు రూ.391.13 కోట్ల అంచనా వ్యయంతో గురువారం ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ విజయవంతం అయ్యింది. 5.04 శాతం తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థ ఆ పనులను దక్కించుకుంది. ఎన్నికలకు ముందు ఇదే పనులను 3.99 శాతం అధిక ధరకు తన బినామీ అయిన సీఎం రమేష్కు చెందిన సంస్థకు అప్పటి సీఎం చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో అప్పట్లో ఖజానాపై రూ.15.60 కోట్ల భారం పడింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సర్కారు ఈ పనులను రద్దు చేసి, తాజాగా టెండర్లు నిర్వహించి.. 9.03 శాతం తక్కువ ధరకే కాంట్రాక్టర్కు పనులు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.35.3 కోట్లు ఆదా అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి 2 నెలల ముందు సీఎం రమేష్కు లబ్ధి చేకూర్చేంచేందుకు గాలేరు–నగరి రెండో దశలోని ఏడు ప్యాకేజీల కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి ఒప్పందాలను ‘ప్రీ–క్లోజ్’ చేసుకునేలా చంద్రబాబు చక్రం తిప్పారు. ఇదీ టెండర్ కథాకమామిషూ ►మొదటి ప్యాకేజీ (ప్రధాన కాలువ 32.64 కిలోమీటర్ల నుంచి 66.15 కిలోమీటర్ల వరకు తవ్వకం.. పది వేల ఎకరాలకు నీళ్లందించేలా పిల్ల కాలువలు తవ్వడం) పనుల వ్యయాన్ని 2018–19 ధరల ప్రకారం రూ.391.13 కోట్లుగా నిర్ణయించి గత ప్రభుత్వం లంప్సమ్–ఓపెన్ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ►తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థలపై సాంకేతిక కారణాలతో అనర్హత వేటు వేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఈ వ్యవహారంపై కాంట్రాక్టు సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయ విచారణ జరుగుతున్నా లెక్క చేయకుండా.. మొదటి ప్యాకేజీ పనులను 3.99 శాతం అధిక ధర (రూ.406.73 కోట్లు)కు సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు అప్పగించారు. ►రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారు చేసి.. పనులు ప్రారంభించని కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసింది. గత ప్రభుత్వం నిర్ణయించిన రూ.391.13 కోట్ల విలువైన పనులకు ఈ నెల 2న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం ఉదయం ప్రైస్ బిడ్ తెరవగా రెండు సంస్థలు షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ►ప్రైస్ బిడ్, రివర్స్ టెండరింగ్లో 5.04 శాతం తక్కువ ధరకు (రూ.371.43 కోట్లు) కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు ప్రతిపాదనలు పంపుతామని ఎస్ఈ మధుసూదన్రెడ్డి తెలిపారు. మొత్తమ్మీద 9.03 శాతం తక్కువ ధరలకే ప్రస్తుతం కాంట్రాక్టర్కు పనులు అప్పగించనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.35.3 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి దాకా రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిన మొత్తం రూ.1567.89 కోట్లకు చేరింది. -
మధ్యాహ్న భోజనం.. వెరీ ‘గుడ్డు’
సాక్షి, విశాఖపట్నం : మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల సరఫరాలో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు మధ్యాహ్న భోజనంతోపాటు నాణ్యమైన కోడిగుడ్డు అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలన్నింటినీ రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్ర వాతావరణంలో రుచిగా అందించడంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విమర్శలకు చెక్ చెప్పేందుకు యత్నం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ఇప్పటికీ అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చెయ్యడం లేదనీ, రుచిపచీ లేకుండా పిల్లలకు భోజనం పెడుతున్నారనీ, ఉడకని అన్నం, నీళ్ల చారు అందిస్తున్నారంటూ ఎక్కడో ఒక చోట నిత్యం ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతోపాటు అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి కావనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ చెప్పేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించడంతోపాటు నిర్వాహకులకు డ్రెస్ కోడ్ ఉండాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు మైక్రో స్కోప్లని వినియోగించాలని సూచించింది. తాజాగా భోజనంలో అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీలకు మేలు జరిగేలా.. ఇప్పటిదాకా కోడిగుడ్ల టెండర్ల దాఖలు అర్హతలో రకరకాల నిబంధనలు ఉండేవి. బడా వ్యాపార వేత్తలు మాత్రమే టెండర్లలో పాల్గొనేవారు. నిజమైన పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు, రైతులు టెండర్లలో పాల్గొనేందుకు వీలుండేది కాదు. ఈ ప్రక్రియలో అనేక లోపాలున్నాయని, రవాణా ఖర్చులు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత విధానంలో కొనుగోలు చేయడం ద్వారా ప్రతి కోడిగుడ్డుకు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. వీటన్నింటినీ పరిశీలించిన ముఖ్యమంత్రి లోపభూయిష్టమైన అంశాలను సవరించి సన్నకారు రైతులు కూడా కోడిగుడ్ల సరఫరాలో పాల్గొనే విధంగా చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో రైతుల నుంచే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నామని డీఈవో లింగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తాజాగా కోడిగుడ్ల సరఫరాలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ నుంచి వెలువడే ఉత్తర్వులు మేరకే తదుపరి కార్యచరణ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యా డివిజన్ యూనిట్గా టెండర్లు జిల్లాలో 5,397 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1 నుంచి పదో తరగతి వరకూ 6,48,162 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మంచి భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారానికోసారి స్కూళ్లకు గుడ్లు సరఫరా చేయాలనే నిబంధన దాదాపు ఎక్కడా అమలు కావడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి. అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. కోడిగుడ్ల సరఫరాపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సైజు, నాణ్యత, సరఫరాపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా యూనిట్గా కాకుండా విద్యా డివిజన్ యూనిట్గా టెండర్లు అప్పగించేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సరఫరా చేస్తున్న గుడ్డు కనీసం 50 గ్రాముల బరువు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఏజెన్సీల ఎంపికలో రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లా యూనిట్గా కాకుండా డివిజన్ యూనిట్గా ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో నాలుగు (విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు) విద్యా డివిజన్లు ఉన్నాయి. ఇందుకోసం డివిజన్కో టెండర్ ప్రొక్యూర్మెంట్ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీకి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, డీఈఓ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఐసీడీఎస్ నుంచి ఒకరు, డిప్యూటీ డీఈఓ, ఒక ఎంఈఓ, హెచ్ఎం (ఆయా డివిజన్లలో డీఈఓ నియమిస్తారు), రవాణా శాఖ నుంచి ఒకరు (జేసీ నియమిస్తారు) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏజెన్సీలను ఖరారు చేయనుంది. అయితే ఏజెన్సీలకు అర్హత, ఇతర విధివిధానాలు రావాల్సి ఉంది. -
‘రివర్స్’తో మొత్తం రూ.1,532.59కోట్లు ఆదా
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక విధానం రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటిదాకా రాష్ట్ర ఖజానాకు రూ.1,532.59 కోట్లు ఆదా అయ్యాయి. అత్యధికంగా పోలవరం హెడ్వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్ వల్ల రూ.782.80 కోట్లు ఆదా అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్తూరుపాడు రిజర్వాయర్ పనుల్లో 67.9 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలాయి. -
‘రివర్స్ టెండరింగ్తో ప్రజాధనం ఆదా చేస్తున్నాం’
సాక్షి, అమరావతి : రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.55వేల కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.17వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేవలం 35శాతం పనులు పూర్తి చేసి తమ హయంలో 65శాతం ప్రాజక్టులు పనులు పూర్తి చేశామని టీడీపీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం మొదటి మూడేళ్లు పోలవరంకు సంబంధించి ఎటువంటి పనులను ప్రారంభించలేదని ఆరోపించారు. పోలవరం కుడి ప్రధాన కారులవ టన్నెల్కు టీడీపీ ప్రభుత్వం 4.67శాతం ఎక్సెస్కు మాక్స్ అనే కంపెనీకి టెండర్లు కట్టబెడితే.. రివర్స్ టెండరింగ్ ద్వారా తమ ప్రభుత్వం అదే కంపెనీకి 15శాతం లెస్కు కోట్ చేశామన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ పనుల్లోనూ 4.95శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెడితే.. తమ ప్రభుత్వం వచ్చాకా అదే సంస్థ 25శాతం లెస్కు టెండర్లు వెశారని మంత్రి గుర్తు చేశారు. ఇలా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అరికడుతుంటే టీడీపీ వారికి ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అధికారులు చెప్పిన సమయంలోగా పూర్తి చేశామని చెప్పారు. వచ్చే సీజన్ నాటికి ముంపు ప్రాంతాలలోని 18వేల ఇళ్లను ఖాళీ చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభిచామని మంత్రి తెలిపారు. -
పేదల ఇళ్లల్లో మళ్లీ ఆదా
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో)లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రజాధనాన్ని భారీగా ఆదా చేస్తోంది. మొదటి దశలో ఇప్పటికే దాదాపు రూ.106 కోట్ల మేర ప్రజాధనం ఆదా కాగా తాజాగా శుక్రవారం రెండో దశ రివర్స్ టెండరింగ్లో రూ.46.03 కోట్లు ఖజానాకు మిగలడం గమనార్హం. 6,496 ఇళ్లకు రివర్స్... అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,496 ఇళ్ల నిర్మాణానికి రూ.317.45 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టారు. అంచనా వ్యయం కంటే 14.50 శాతం తక్కువకు అంటే రూ.271.42 కోట్లతో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. తద్వారా ఖజానాకు రూ.46.03 కోట్లు ఆదా అయ్యాయి. ఆదా ఇలా.. ►అనంతపురం జిల్లాలో (ఫేజ్ – 2) రూ. 220.69 కోట్ల అంచనాతో 4,608 ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్స్ రూ.188.69 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. ఇదే ప్రాజెక్టుకు గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.1,596 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేసింది. అంతకంటే 14.50% తక్కువకు అంటే చదరపు అడుగు రూ. 1,365కే ప్రస్తుతం రివర్స్ టెండరింగ్లో బిడ్ దాఖలు చేయడంతో రూ.32 కోట్లు ఆదా అయ్యాయి. ►పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.96.76 కోట్ల అంచనా వ్యయంతో 1,888 ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. శ్రద్ధ శబూరి సంస్థ 14.50 శాతం తక్కువకు అంటే రూ.82.73 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1 గా నిలిచింది. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టులో చదరపు అడుగుకు రూ. 1,602 చొప్పున కాంట్రాక్టు ఇచ్చారు. ప్రస్తుతం రివర్స్ టెండరింగ్లో రూ.1,370 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేయడంతో రూ.14.03 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. ‘రివర్స్’ విజయవంతం ‘ ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానం విజయవంతమవుతోంది. ఏపీ టిడ్కోరెండో దశ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.46.03 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాం. మొదటి దశలో సుమారు రూ. 106 కోట్లు ఆదా అయ్యాయి. ఇదే స్ఫూర్తితో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కొనసాగిస్తాం’ – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి మలిదేవి డ్రెయిన్ పనుల్లో రూ.3.02 కోట్లు ఆదా మలిదేవి డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు జలవనరుల శాఖ శుక్రవారం నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో ఖజానాకు రూ.3.02 కోట్లు ఆదా అయ్యాయి. 4.19 శాతం తక్కువ ధర (రూ. 69.09 కోట్లు) కోట్ చేసిన ఆర్కేఎన్ ప్రాజెక్ట్స్ ఈ పనులు దక్కించుకుంది. సంస్థ అర్హతలను మరోసారి పరిశీలించాక పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్)కి నెల్లూరు నీటిపారుదల విభాగం ఎస్ఈ ప్రసాదరావు ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రైస్ బిడ్లోనే 2.67 కోట్లు ఆదా నెల్లూరు జిల్లాలో మలిదేవి డ్రెయిన్, మరో 3 అనుబంధ డ్రెయిన్ల ఆధునికీకరణకు రూ.72.11 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్–ఓపెన్ విధానంలో జలవనరుల శాఖ గత నెల 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్కేఎన్ ప్రాజెక్ట్స్, టీఎస్సార్ కన్స్ట్రక్షన్స్ షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ప్రైస్బిడ్ శుక్రవారం తెరవగా 3.69 శాతం తక్కువ ధర కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. దీంతో ప్రైస్ బిడ్ స్థాయిలోనే రూ.2.67 కోట్లు ఆదా అయ్యాయి. ప్రైస్ బిడ్లో ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన రూ.69.44 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. గడువు ముగిసే సమయానికి రూ.69.09 కోట్లకు పనులు చేయడానికి ముందుకొచ్చిన ఆర్కేఎన్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎల్–1గా నిలిచి పనులు దక్కించుకుంది. -
పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు
-
రాష్ట్ర ఖజానాకు రూ.67.81 కోట్లు ఆదా
-
అల్తూరుపాడు ప్రాజెక్ట్ పనుల్లో ‘రివర్స్’ సక్సెస్
సాక్షి, అమరావతి: సోమశిల–స్వర్ణముఖి లింక్ కెనాల్లో అంతర్భాగమైన అల్తూరుపాడు రిజర్వాయర్ పనులకు బుధవారం నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో రాష్ట్ర ఖజానాకు రూ.67.81 కోట్లు ఆదా అయ్యాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులను రూ.253.77 కోట్లకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసిన కాంట్రాక్టర్కే కట్టబెట్టి.. కమీషన్లు దండుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జల వనరుల శాఖ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. అప్పట్లో ఉన్నదాన్నే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. నవంబర్ 11న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం ప్రైస్ బిడ్ను తెరవగా, 14.06 శాతం తక్కువ ధర రూ.218.09 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. దాంతో ప్రైస్ బిడ్ స్థాయిలోనే రూ.35.68 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదా అయ్యాయి. అనంతరం రూ.218.09 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహించారు. తీవ్ర పోటీ మధ్య రూ.185.96 కోట్ల (26.72 శాతం తక్కువ ధర)కు కోట్ చేసిన బీవీఎస్సార్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎల్–1గా నిలిచింది. -
తెలుగుగంగలో ‘రివర్స్’
సాక్షి, అమరావతి: తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనులకు రూ.239.04 కోట్లతో సోమవారం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో షెడ్యూళ్ల డౌన్లోడ్, దాఖలుకు ఈనెల 23వ తేదీ తుదిగడువు. 24న ప్రీ–క్వాలిఫికేషన్ బిడ్ తెరుస్తారు. 27న ఉదయం 11 గంటలకు ప్రైస్ బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ కోట్ చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి అదేరోజు మధ్యాహ్నం రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్కు పనులు కేటాయించాల్సిందిగా సూచిస్తూ సీవోటీ(కమిషనర్ ఆఫ్ టెండర్స్)కి ప్రతిపాదనలు పంపనున్నారు. గతంలో సీఎం రమేష్ సంస్థకు పనులు.. - తెలుగుగంగ ప్రధాన కాలువలో లైనింగ్ పనులకు రూ.239.04 కోట్లతో ఎన్నికలకు రెండు నెలల ముందు టీడీపీ సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - మాజీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ పాటు ష్యూ (ఎస్ఈడబ్ల్యూ) ఇన్ఫ్రా సంస్థ షెడ్యూళ్లు దాఖలు చేయగా సాంకేతిక బిడ్లో ‘ష్యూ’పై అనర్హత వేటు వేశారు. - అనుభవం ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన రిత్విక్పై వేటు వేయాలని ‘ష్యూ’ సంస్థ ఆధారాలతో ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను తుంగలో తొక్కి అధిక ధరలకు కోట్ చేసిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సింగిల్ బిడ్ను ఆమోదించింది. దీనివల్ల ఖజానాపై రూ.6.91 కోట్ల భారం పడింది. - పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువ ధరలకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చి ఖజానాకు రూ.23.90 కోట్లు మిగిలేవి. కానీ గత సర్కార్ అధిక ధరలకు పనులు కట్టబెట్టడం వల్ల మొత్తమ్మీద ఖజానాపై రూ.30.81 కోట్ల భారం పడింది. - వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అక్రమాలను గుర్తించి ఈ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు తెలుగుగంగ అధికారులు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పనుల్లో ఖజానాకు భారీ ఎత్తున ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. -
రెండో దశలో 35,000 ఇళ్లకు ‘రివర్స్’
సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండో దశ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో) వేగవంతం చేసింది. మొదటి దశలో 14,368 ఇళ్లకు ఇప్పటికే రివర్స్ టెండరింగ్ నిర్వహించగా ప్రభుత్వ ఖజానాకు రూ.105.91 కోట్లు ఆదా కావడం తెలిసిందే. రెండు, మూడో దశలను జనవరి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధమైంది. రెండో దశలో 35,000 ఇళ్లకు ఈ నెల 20 నుంచి 22 తేదీ వరకు రివర్స్ టెండర్లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో కూడా ప్రజాధనం ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. ఉగాదికి పనులు ప్రారంభం మూడో దశ కింద మరో 14,000 ఇళ్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు టిడ్కో ప్రణాళిక రూపొందించింది. మొత్తం టెండరింగ్ ప్రక్రియను జనవరి చివరికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు ఇప్పటికే స్పష్టం చేసింది. ఏడాదిన్నరలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించింది. -
స్మార్ట్ ఫోన్లలోనూ ‘రివర్స్’ జోరు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విప్లవాత్మక విధాన పరమైన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా భారీగా ప్రజా ధనం ఆదా అవుతోంది. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల కోసం స్మార్ట్ ఫోన్లు కొనుగోలుకు సంబంధించిన రివర్స్ టెండరింగ్లో రూ.83.80 కోట్ల ప్రజా ధనం ఆదా అయింది. ప్రజలకు వేగంగా సేవలు అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 30వ తేదీన 2,64,920 స్మార్ట్ ఫోన్ల కోసం దాఖలైన టెండర్లలో రూ.317.61 కోట్లు కోట్ చేస్తూ ఒక సంస్థ ఎల్-1గా నిలిచింది. ఈ సంస్థ కోట్ చేసిన ధరపై ఈ నెల 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్) రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. ఇందులో మరో సంస్థ రూ.233.81 కోట్లు కోట్ చేసి ఎల్ృ1గా నిలిచింది. దీంతో రివర్స్ టెండరింగ్కు ముందు ఎల్-1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధర కంటే ఇది రూ.83.80 కోట్లు తక్కువ. ఈ మేరకు 26.4 శాతం ప్రజా ధనం ఆదా అయింది. కాగా, 3జీబీ రామ్, 32 జీబీ మెమొరీ, ఆక్టాకోర్ ప్రాసెసర్తో పాటు రిమోట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, యూఎస్బీ కన్వర్టర్, టెంపర్డ్ గ్లాస్, బ్యాక్ కవర్తో కూడిన ఈ ఫోన్లకు మూడు సంవత్సరాల సర్వీసు అందిస్తారు. -
రివర్స్ టెండరింగ్ మరోసారి బిగ్ హిట్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రివర్స్ టెండరింగ్ మరోసారి బిగ్ హిట్గా నిలిచింది. స్మార్టఫోన్ల కొనుగోలులో రూ. 83.8 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం 2,64,920 స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్) టెండర్లు పిలిచింది. అందులో భాగంగా ఏపీటీఎస్ నవంబర్ 30వ తేదీన తొలిదశ బిడ్డింగ్ తెరువగా.. ఎల్-1 సంస్థ రూ. 317.61 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. అయితే ఎల్-1 ధరపై ఏపీటీఎస్ రివర్స్ టెండరింగ్లో బహిరంగ వేలం నిర్వహించింది. ఇందులో అదే ఎల్-1 సంస్థ రూ. 233.81 కోట్లకు కోడ్ చేసి బిడ్ దక్కించుకోంది. తొలిదశ బిడ్డింగ్తో పోల్చితే ఎల్-1 కంపెనీ రూ. 83.8 కోట్ల తక్కువకు కోడ్ చేసింది. గతంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహించిన రివర్స్ టెండరింగ్లలో ఏపీ ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని ఆదా చేసిన సంగతి తెలిసిందే. -
హౌసింగ్లోనూ రివర్స్ టెండరింగ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వం నిర్వహించే ప్రతి అభివృద్ధి పనిని ఎక్కువ ధరలకు అప్పజెప్పి కమీషనర్లు తీసుకోవడం... కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడం... నాణ్యత లేకుండా పనులు నిర్వహించినా పట్టించుకోకపోవడం... ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ తమ అనుయాయుల జేబులు నింపడం... ఇదీ.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు చేసిన నిర్వాకం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ద్వారా నిర్వహించే ప్రతి అభివృద్ధి పనికి పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా గతంలో పెండింగ్లో ఉన్న పనులకు సైతం టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో ఏకంగా రూ.104 కోట్లకు పైగా ప్రభుత్వానికి మిగిల్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు దక్కించుకుని ఇళ్ల నిర్మాణ పనులు బేస్మెంట్ లెవల్లో ఉన్నవాటిని గుర్తించి రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న 3,984 ఇళ్లకు సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు గతనెల 28వ తేదీ నుంచి ఈనెల 15వ తేదీ వరకు ఏపీ టిడ్కో రివర్స్టెండరింగ్కు అవకాశం కల్పించింది. ఈనెల 15వ తేదీ రివర్స్టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదా అయిందనే విషయం తేటతెల్లం కానుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాలో నగరం, పట్టణ ప్రాంతాల్లో పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు లబ్ధిదారుల వాటాతో కలిపి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఓ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. ఇళ్ల నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఏపీ టిడ్కో)కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, గిద్దలూరు పట్టణాల్లో 300 ఎస్ఎఫ్టీ, 365 ఎస్ఎఫ్టీ, 430 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంతో 13,024 ఇళ్లను నిర్మించేందుకు పనులు కట్టబెట్టారు. అయితే వీటిలో కేవలం 6,628 ఇళ్లు మాత్రమే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 3,984 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో ఉండగా 2,412 ఇళ్లు అసలు మొదలే పెట్టని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లిఫ్ట్లు ఏర్పాటు చేయక పోవడం, నిర్మించిన ఇళ్లకు సైతం నీటి సౌకర్యం లేకపోవడం, ఇళ్లలో ఇంటీరియర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వీటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరచని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు మిగతా పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు వారి వాటా డబ్బులు చెల్లించడం కానీ, బ్యాంకు రుణాలు పొందడం కానీ చేయకుండా వదిలేశారు. ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్: జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు వివిధ పట్టణాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల పనుల్లో రివర్స్టెండరింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. దీనికి సంబంధించి ఏపీ టిడ్కో ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 13,024 ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే మూడేళ్లు దాటినా కాంట్రాక్టు సంస్థ కేవలం 6,628 ఇళ్లను మాత్రమే వివిధ దశల్లో నిర్మిస్తుండడంతో ప్రస్తుతం బేస్మెంట్ లెవల్లో ఉన్న 3,984 ఇళ్లకు సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు రివర్స్టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రివర్స్టెండరింగ్ ప్రక్రియను ఏపీ టిడ్కో ప్రారంభించింది. గత నెల 28వ తేదీ నుంచి ప్రారంభమైన రివర్స్టెండరింగ్ ఈనెల 15వ తేదీ వరకు జరగనుంది. 15వ తేదీ ఈ పనులకు సంబంధించి ప్రభుత్వానికి ఎంత ఆదా అయిందనే విషయం స్పష్టం కానుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రెండు రోజుల క్రితం ముగిసిన రివర్స్టెండరింగ్లో 15 శాతం తక్కువకు టెండర్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. జిల్లాలో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదా అవుతుందనే దానిపై అంతా చర్చించుకుంటున్నారు. రివర్స్టెండరింగ్కు ఈనెల 15 వరకు గడువు: టిడ్కో ఈఈ వెంకటేశ్వర్లు జిల్లాలో బేస్మెంట్ లెవల్లో ఉన్న 3,984 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు గత నెల 28వ తేదీ నుంచి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించాం. ఈనెల 15వ తేదీ వరకు టెండర్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. మొదటి విడత నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో 15 శాతం వరకు తక్కువ ధరకు టెండర్లు వేయడంతో ప్రభుత్వానికి భారీగా ఆదా అయిన విషయం తెలిసిందే. జిల్లాలో జరిగే రివర్స్ టెండరింగ్కు సైతం ఇదే స్థాయిలో ఆదా అవుతుందని ఆశిస్తున్నాం. -
పోలవరం ఎడమ కాలువ పనులకు రివర్స్ టెండరింగ్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం.. లెఫ్ట్ కనెక్టివిటీ(65వ ప్యాకేజీ) పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి దాకా రూ.841.33 కోట్ల మేర ప్రజాధనం ఆదా చేసింది. ఎడమ కాలువలో మిగిలిన పనులకూ రివర్స్ టెండరింగ్ నిర్వహించడానికి సిద్ధమైంది. పనులు చేయడానికి మొండికేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని.. అప్పటికీ దారికి రాకపోతే ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్లోని (ఏపీడీఎస్ఎస్) 61సీ నిబంధన కింద వేటు వేసి, ఆ పనులకు అయ్యే అదనపు వ్యయంలో 95 శాతం సొమ్మును సదరు కాంట్రాక్టర్ నుంచి జరిమానా కింద వసూలు చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది. పోలవరం ఎడమ కాలువ పనులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎడమ కాలువను 213.49 కిలోమీటర్ల పొడవున తవ్వి లైనింగ్ చేయాలి. 4 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలి. 2005 నుంచి ఇప్పటివరకు కేవలం 69 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేయడానికి జలవనరుల శాఖ ప్రణాళిక రచించింది. యనమల వియ్యంకుడికి రివర్స్ పంచ్ - పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ నుంచి 60సీ నిబంధన కింద విడదీసి.. వాటి వ్యయాన్ని రూ.181.87 కోట్లకు పెంచేసి, 2016లో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన పీఎస్కే–హెచ్ఈఎస్(జాయింట్ వెంచర్) సంస్థకు టీడీపీ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో అప్పగించింది. ఇప్పటివరకూ రూ.119.23 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రూ.62.64 కోట్ల పనులు మిగిలాయి. పుట్టా సుధాకర్ యాదవ్తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న జలవనరుల శాఖ.. ఆ పనులకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయడానికి సన్నద్ధమైంది. - రూ.196.20 కోట్ల విలువైన ఆరో ప్యాకేజీ పనులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితునికి చెందిన మధుకాన్–సినో హైడ్రో సంస్థ 2005లో దక్కించుకుంది. 2018 నాటికి రూ.112.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ఈ సంస్థకు ధరల సర్దుబాటు కింద రూ.11.45 కోట్లను అదనపు బిల్లుగా టీడీపీ సర్కార్ చెల్లించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పనుల్లో రూ.70.29 కోట్ల విలువైన పనులను 60సీ నిబంధన కింద తొలగించి.. వాటి వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచి, రాజమండ్రి టీడీపీ నేతకు చెందిన బీఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టారు. మిగిలిన రూ.13.43 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.119.81 కోట్లకు పెంచేసి, మధుకాన్కు భారీగా లబ్ధి చేకూర్చారు. రివర్స్ టెండరింగ్కు సర్కార్ సిద్ధమవడంతో.. తమకు అప్పగిస్తే పాత ధరలకే పనులు చేస్తామని మధుకాన్ సంస్థ వినతి పత్రం ఇవ్వడం గమనార్హం. - ఏడో ప్యాకేజీలో రూ.52.04 కోట్లు, ఎనిమిదో ప్యాకేజీలో రూ.53.19 కోట్ల విలువైన పనులు మిగిలాయి. నిర్దేశిత గడువులోగా పనులు చేయడానికి కాంట్రాక్టు సంస్థలు అంగీకరిస్తే వాటితోనే పనులు చేయించాలని.. మొండికేస్తే 61సీ కింద వేటు వేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. -
టిడ్కో మిగతా ఇళ్లకు డిసెంబర్లో రివర్స్ టెండర్లు
సాక్షి, అమరావతి: టిడ్కో (ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో రివర్స్ టెండరింగ్ చేపట్టామని, ఇప్పటికే తొలిదశ టెండర్ల ప్రక్రియ పూర్తైందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలి దశ టిడ్కో ఇళ్ల రివర్స్ టెండర్లలో రూ.105.91 కోట్లు ఆదా అయినట్లు వివరించారు. బొత్స శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 65,968 ఇళ్లకు రూ.3,253 కోట్లతో రివర్స్ టెండర్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమరావతి పర్యటనలో అన్నీ అబద్దాలే.. చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా అన్నీ అబద్ధాలే వల్లె వేశారని బొత్స పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.9,060 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఆయన హయాంలో ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమేనన్నారు. ఇందులో కన్సల్టెంట్లకు రూ.845 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని రూ.321 కోట్లు చెల్లింపులు జరిపారన్నారు. రాజధాని బాండ్లు, హడ్కో రుణాలకు వడ్డీ కింద తాము రూ.330 కోట్లు చెల్లించామని తెలిపారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారని, సీఆర్డీఏ పేరుతో అప్పులు తెచ్చి పసుపు–కుంకుమ కింద పప్పు బెల్లాల్లా పంచారని విమర్శించారు. బాబు సర్కారు దోపిడీకి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? బొత్స - గత ప్రభుత్వం 14,368 ఇళ్ల నిర్మాణానికి రూ.707.03 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోగా తాజాగా వీటికి రివర్స్ టెండర్లలో రూ.601.12 కోట్లకు కోట్ చేసి నిర్మాణ సంస్ధలు ఎల్ – 1గా నిలిచాయి. అంటే రివర్స్ టెండర్ల ద్వారా రూ.105.91 కోట్లు ఆదా అయ్యాయి. - పేదల ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? - మిగతా ఇళ్లకు డిసెంబరు 13, 20, 26వతేదీల్లో మూడు విడతలుగా రివర్స్ టెండర్ల నిర్వహణ. - గత సర్కారు మాదిరిగా ఇళ్ల నిర్మాణానికి పాత రేట్లతో టెండర్లు పిలిచి ఉంటే ప్రతి లబ్ధిదారుడికి రూ.75 వేల నుంచి రూ.95 వేల వరకు భారం పడేది. - టీడీపీ సర్కారు అవినీతిని ఎండగట్టి పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించే పథకానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. - టిడ్కోలో రివర్స్ టెండర్ల ద్వారా ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి రూ.250 చొప్పున ప్రజాధనం ఆదా. -
ఇళ్లలో రివర్స్టెండరింగ్ రూ.105.91కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజాధనాన్ని ఆదా చేసింది. ఏపీ టిడ్కోలో(ఏపీ టౌన్షిప్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) మొదటి దశలో 14,368 హౌసింగ్ యూనిట్లకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.105.91 కోట్లు ఆదా అయ్యాయి. ఈమేరకు రివర్స్ టెండర్లను గురువారం ఖరారు చేశారు. నాలుగు జిల్లాల్లో రివర్స్ టెండర్లు టీడీపీ హయాంలో పట్టణాల్లో ’అందరికీ ఇళ్ల పథకం’ కింద ఏపీ టిడ్కో 65,969 హౌసింగ్ యూనిట్లతో ప్రాజెక్టులు చేపట్టింది. టీడీపీ పెద్దలకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించేలా ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇతర రాష్ట్రాల్లో కంటే అత్యధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాధనాన్ని ఆదా చేస్తూ పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ టిడ్కోలోని 65,969 హౌసింగ్ యూనిట్లకు దశలవారీగా రివర్స్ టెండరింగ్ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రధాన టెండర్లు పిలిచిన మర్నాడే రివర్స్ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. అందులో భాగంగా ఏపీ టిడ్కో మొదటి దశలో చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 14,368 హౌసింగ్ యూనిట్లకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టింది. తద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ‘రివర్స్’తో ఆదా ఇలా.. ►చిత్తూరు జిల్లాలో 5,808 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెండర్లు దాఖలు చేశాయి. డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎల్–1గా నిలిచింది. రూ.271.03 కోట్ల విలువైన పనులకు 15 శాతం తక్కువకు అంటే రూ.2309.18 కోట్లకే ఆ సంస్థ బిడ్ దాఖలు చేసింది. చదరపు అడుగు రూ.1,321 చొప్పున టెండరు ఖరారు చేశారు. తద్వారా రూ.40.85 కోట్లు ఆదా అయ్యాయి. ►కృష్ణా జిల్లాలో 2,064 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్స్, కేఎంవీ ప్రాజెక్ట్స్, ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ బిడ్లు దాఖలు చేశాయి. ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్స్ ఎల్–1గా నిలిచింది. రూ.95.65 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.81.30 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. తద్వారా ఖజానాకు రూ.14.35 కోట్లు ఆదా అయ్యాయి. చదరపు అడుగు రూ.1,312 చొప్పున టెండరు ఖరారు చేశారు. ►విశాఖపట్నం జిల్లాలో 3,424 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి టాటా ప్రాజెక్టŠస్ లిమిటెడ్, ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్స్, ఇంద్రజిత్ మెహతా కన్ స్ట్రక్షన్స్ రివర్స్ టెండరింగ్లో పాల్గొనగా ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ ఎల్–1గా నిలిచింది. రూ.192.23 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.163.40 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. తద్వారా రూ.28.83 కోట్ల ప్రజాధానం ఆదా అయ్యింది. చదరపు అడుగుకు రూ1,304 చొప్పున ఈ టెండరు ఖరారు చేశారు. ►విజయనగరం జిల్లాలో 3,072 హౌసింగ్ యూనిట్ల నిర్మాణానికి వీఎన్సీ లిమిటెడ్, ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్స్, ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ రివర్స్ టెండర్లలో పాల్గొనగా ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ ఎల్–1గా నిలిచింది. ఆ సంస్థ రూ.148.12 కోట్ల విలువైన పనులకు 14.78 శాతం తక్కువకు అంటే రూ.126.24 కోట్లకు కోట్ చేసింది. తద్వారా ఖజానాకు రూ.21.88 కోట్లు ఆదా అయ్యాయి. ఈ సంస్థకు చదరపు అడుగు రూ.1,315 చొప్పున టెండరు ఖరారు చేశారు. -
కిలోమీటర్కు రూ. 27 కోట్లు ఎక్కువ వ్యయం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో అత్యంత భారీ వ్యయంతో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులను పున:సమీక్షించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) కసరత్తు చేస్తోంది. పనులన్నింటినీ విడివిడిగా సమీక్షించి, రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చు తగ్గించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆర్భాటాలు, అనవసర ఖర్చులను తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఆర్డీఏ అధికారులను ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రాధాన్యత ప్రకారం రోడ్ల నిర్మాణం ప్రస్తుతం రాజధానిలో జనాభా పెద్దగా లేదు కాబట్టి రోడ్లను మొదట రెండు వరుసలుగా నిర్మించాలని, అవసరాన్ని బట్టి విస్తరించేందుకు భూమిని అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ రహదారికి అనుసంధానం చేసే రోడ్ల నిర్మాణానికి తొలుత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకనుగుణంగా ఆయా రోడ్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రైతులకిచ్చిన ప్లాట్ల లేఔట్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. అనవసర వ్యయాన్ని తగ్గించి, వీటిలో కొన్నింటి విషయంలో రివర్స్ టెండరింగ్కు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల కోసం నిర్మిస్తున్న 115 బంగ్లాల పనులు 25 శాతం కంటే తక్కువే జరిగాయి. ఇప్పటికే 75 శాతం పూర్తయిన ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాస భవనాల పనులు మరో రూ.2,830 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే పరిస్థితి ఉండడంతో వాటిని మొదలుపెట్టనున్నారు. వచ్చే నెలలో ఈ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రహదారుల నిర్మాణంలో అవినీతి పర్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) రాజధానిలో దాదాపు రూ.13 వేల కోట్ల విలువైన 34 రోడ్ల పనులను 23 ప్యాకేజీలుగా విభజించి, వివిధ సంస్థలకు అప్పగించింది. కిలోమీటర్కు సగటున రూ.42 కోట్ల భారీ వ్యయంతో ఈ రోడ్ల పనులను చేపట్టడంపై అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది. జాతీయ రహదారుల సంస్థ కిలోమీటర్కు కేవలం రూ.15 కోట్ల వ్యయంతో రోడ్లు నిర్మిస్తుండగా, రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం అందుకు రెండు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం గమనార్హం. అంటే ఒక్కో కిలోమీటర్కు రూ.27 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజధానిలో పనుల విషయంలో సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గించాలని, అవసరాన్ని బట్టి రివర్స్ టెండరింగ్ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నిధుల లభ్యతను బట్టి పనులు ‘‘రాజధానిలో ప్రాధాన్యతను బట్టి దశల వారీగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అనవసర వ్యయం తగ్గించాలని స్పష్టం చేశారు. రాజధానిలో పనుల విషయంలో నిధుల లభ్యతను బట్టి ముందుకెళతాం’’ – లక్ష్మీనరసింహం, సీఆర్డీఏ కమిషనర్ -
ఆర్భాటాలొద్దు పనులు చేయండి
సాక్షి, అమరావతి : సీఆర్డీఏ పరిధిలో ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, భవనాల నిర్మాణంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు తగినట్లు ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పనులు, చేసిన ఖర్చులు, వివిధ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, అనవసర ఖర్చులకు పోకుండా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. పూర్తికావస్తున్న పనులపై తొలుత దృష్టి పెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్కు వెళితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందన్నారు. రోడ్ల డిజైన్కు ఐఐటీల సలహా సీఆర్డీఏ పరిధిలో రోడ్ల డిజైన్లపై అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ప్లానింగ్లో ఎక్కడా తప్పుల్లేకుండా చూడాలని ఆదేశించారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో ఖర్చు, డిజైన్ల వంటి అంశాలపై ఐఐటీ వంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కృష్ణా నది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. వైకుంఠపురం రిజర్వాయర్ నిర్మాణం, నీటి వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణానికి పోగా మిగిలిన భూమిని సుందరీకరించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనలో అనవసర వ్యయం తగ్గించి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రధాన టెండర్లు తెరిచిన మర్నాడే రివర్స్ టెండర్
సాక్షి, అమరావతి: ఏపీ టిడ్కో ప్రధాన టెండర్లు తెరిచిన మరుసటి రోజే రివర్స్ టెండర్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాన టెండర్లకు, రివర్స్ టెండర్కు మధ్య ఎక్కువ సమయం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ టిడ్కో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏపీ టిడ్కో పరిధిలోని 65,969 ఫ్లాట్ల నిర్మాణాలపై రివర్స్ టెండరింగ్ అంశాన్ని ఆయన సమీక్షించారు. మొదటిదశ కింద ఈ నెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు తెరుస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఆ మరుసటిరోజే రివర్స్ టెండరింగ్ను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ఇళ్లకూ త్వరలోనే టెండర్లు పిలుస్తామని అధికారులు చెప్పారు. గతంలో నిర్దేశించిన నిర్మాణ ప్రమాణాలను అలాగే ఉంచి రివర్స్ టెండరింగ్ పిలవాలని సీఎం స్పష్టంచేశారు. భవిష్యత్తులో పట్టణ పేదలకు ఫ్లాట్లకు బదులు ఇళ్ల స్థలాలివ్వాలని సీఎం చెప్పారు. దీనివల్ల ఫ్లాట్లలో నిర్వహణ పరంగా ప్రస్తుతం ఉన్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా.. పేదలకు మరింత మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఏపీ టిడ్కో ఎండీ దివాన్ మైదూన్ తదితరులు పాల్గొన్నారు. -
‘రివర్స్’ మరోసారి సూపర్హిట్
సాక్షి, అమరావతి: అంచనా వ్యయం రూ.పది లక్షలు దాటిన ప్రతి పనికీ ‘రివర్స్ టెండరింగ్’ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విధానపరమైన నిర్ణయం తిరుగులేనిదని మరోసారి నిరూపితమైంది. ఒంగోలును ముంపు నుంచి తప్పించే పోతురాజు నాలా డ్రెయిన్ అభివృద్ధి పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో తాజాగా ఖజానాకు రూ.15.62 కోట్లు ఆదా అయ్యాయి. ఇక వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు ఖజానాకు మొత్తం రూ.1,228.95 కోట్లు ఆదా అయ్యాయి. ప్రైస్ బిడ్లోనే రూ.3.91 కోట్లు ఆదా తొలిదశలో పోతురాజు నాలా వెడల్పు పనులను రూ.12.50 కోట్లతో చేపట్టారు. రెండో దశలో రూ.89.75 కోట్లతో అభివృద్ధి పనులకు జూలై 23న జలవనరులశాఖ పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ పనులకు రూ.78.14 కోట్ల అంచనా వ్యయంతో సెప్టెంబరు 28న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయగా ఎనిమిది సంస్థలు షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ఒంగోలు ప్రాజెక్ట్స్ ఎస్ఈ నగేష్ మంగళవారం ప్రైస్ బిడ్ తెరవగా ఐదు శాతం తక్కువ ధరకు అంటే రూ.74.24 కోట్లకు కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థ ఎల్–1గా నిలిచింది. ప్రైస్ బిడ్ స్థాయిలోనే ఖజానాకు రూ.3.91 కోట్లు ఆదా అయ్యాయి. ఆ తర్వాత ప్రైస్ బిడ్లో ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధర అంటే రూ.74.24 కోట్లను అంచనా విలువగా పరిగణించి ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. షెడ్యూళ్లు దాఖలు చేసిన ఎనిమిది సంస్థలు ఈ–ఆక్షన్లో నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. ఈ–ఆక్షన్ కాల పరిమితి ముగిసే సమయానికి 20 శాతం తక్కువకు అంటే రూ.62.52 కోట్లకు కోట్ చేసిన సిరి కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎల్–1గా నిలిచింది. అదే సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలంటూ సీవోటీ(కమిషనర్ ఆఫ్ టెండర్స్)కి బుధవారం ప్రతిపాదనలు పంపారు. రూ.78.14 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో ఖజానాకు రూ.15.62 కోట్లు ఆదా కావడం గమనార్హం. -
రివర్స్ మళ్లీ అదుర్స్
-
సిమ్ కార్డుల్లోనూ ‘రివర్స్’ ఆదా
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విధాన పరమైన నిర్ణయం రివర్స్ టెండరింగ్ వల్ల ప్రజాధనం భారీగా ఆదా అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు ప్రజలకు సేవలందించేందుకు 4జీ సిమ్ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయడంతో రూ.33.77 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. 4జీ సిమ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఓపెన్ మార్కెట్లో నెలకు రూ.199 ఉండగా రివర్స్ టెండరింగ్ ద్వారా కేవలం రూ.92.04కే ఇచ్చేందుకు వీలు కలిగింది. అంటే ఒక్క సిమ్ కార్డుపై నెలకు దాదాపు రూ.107 ఆదా అయింది. 4జీ సిమ్ కార్డులు 2,64,920 కొనుగోలు చేసేందుకు ఈ నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ఫైనాన్స్ బిడ్ను ఓపెన్ చేసింది. ఈ టెండర్లో 4జీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ మూడేళ్లకు 2,64,920 సిమ్లకు రూ.121.54 కోట్లు కోట్ చేసిన ఒక సంస్థ ఎల్–1గా నిలించింది. దీనిపై ఏపీటీఎస్ ఈ నెల 7వ తేదీన రివర్స్ టెండరింగ్ నిర్వహించగా ఇదే నియమిత కాలానికి మరో సంస్థ రూ.87.77 కోట్లే కోట్ చేసింది. అంటే టెండర్ విధానంలో ఎల్–1గా నిలిచిన సంస్థ కన్నా రివర్స్ టెండరింగ్లో మరో సంస్థ రూ.33.77 కోట్లు తక్కువకు కోట్ చేసింది. ఈ మొత్తం ప్రజాధనం ఆదా అయినట్లే. ఈ ప్యాకేజీలో జాతీయ, స్థానిక వాయిస్ కాల్స్కు పరిమితి లేదు. రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు 1జీబీ డేటా సౌకర్యం ఉంటుంది. కాగా, రివర్స్ టెండరింగ్ వల్ల 27.8 శాతం.. అదే ఓపెన్ మార్కెట్ ధరతో పోల్చి చూస్తే ఏకంగా 53.6 శాతం ప్రజాధనం ఆదా అయింది. -
రివర్స్ టెండరింగ్లో మరో రూ.33.76 కోట్లు ఆదా..
సాక్షి, అమరావతి: రివర్స్ టెండరింగ్లో రాష్ట్రానికి మరో రూ.33.76 కోట్లు ఆదా అయింది. గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చే సిమ్కార్డుల కొనుగోలులో ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్ళింది. ఓపెన్ మార్కెట్లో నెలవారీ పోస్ట్పెయిడ్ ఛార్జీలు రూ.199 ఉండగా, రివర్స్ ఆక్షన్లో రూ.92.04లకే ఎయిర్టెల్ బిడ్డింగ్ దక్కించుకుంది. ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్ ప్రక్రియ ఏపీప్రభుత్వం నిర్వహించింది. ఫైనాన్షియల్ బిడ్లను ఈనెల 6న ఏపీటీఎస్ తెరిచింది. ఎల్1 కంపెనీ, 4జీ సిమ్లకు మూడేళ్లకు రూ.121.54 కోట్ల టెండర్ దాఖలు చేసింది. ఈ నెల 7న రూ. 121.54 కోట్ల ప్రారంభ ధరగా రివర్స్టెండరింగ్ ఆక్షన్లో రూ.87.77 కోట్లకు ఎయిర్టెల్ టెండర్ దక్కించుకుంది. దీంతో రివర్స్ ఆక్షన్లో ప్రభుత్వానికి రూ.33.76 కోట్లు ఆదా అవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 4జీ సీమ్లకు చెల్లించే నెలవారీ పోస్ట్పెయిడ్ ఛార్జీలు రూ.92.04కి తగ్గిందని ఏపీటీఎస్ తెలిపింది. అన్లిమిటెడ్ నేషనల్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు, 4జీ వేగంతో 1 జీబీ డేటాను ఎయిర్ టెల్ కంపెనీ ఇవ్వనుంది. -
పోలవరం పనులు ప్రారంభించిన ‘మేఘా’
సాక్షి, పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు మేఘ ఇంజనీరింగ్ సంస్థ శుక్రవారం భూమి పూజ చేసింది. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తరువులు ఇవ్వడంతో మేఘా సంస్థ పనులు ప్రారంభించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ అధికారులు ఇవాళ ఉదయం స్పిల్వే బ్లాక్ నంబర్ 18 వద్ద జలవనరుల శాఖ ఈఈ ఏసుబాబు సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా అన్ని వనరులు ఉపయోగించి నిర్ణీత గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేఘా సంస్థ అన్ని ఏర్పాటు చేసుకుంటోంది. కాళేశ్వరం లాంటి క్లిష్టమైన ప్రాజెక్టులు నిర్మించిన అనుభవంతో ఆంధ్రప్రదేశ్లోనూ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని ఒప్పంద గడువు ప్రకారం పూర్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఇన్ని రోజులు పోలవరం పనులు చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో పనులు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. హైకోర్టు ఉత్తరువులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో పనులు ప్రారంభిస్తూ హెడ్వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్ వారిగా అప్పగించారు. అదే సమయంలో ఆయన కీలకమైన అన్ని అనుమతులను సాధించారు. పాత కాంట్రాక్టును రద్దు చేసి మళ్లీ రివర్స్ టెండర్కు వెళ్లి పోలవరం హెడ్ వర్కులతో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. మేఘా ఇంజనీరింగ్ గతంలో ఈ టెండర్లో పనులు చేపట్టిన సంస్థల కంటే తక్కువ -12.6 శాతానికి రూ. 4358 కోట్ల మొత్తానికి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వానికి దీనివల్ల రూ 628 కోట్ల మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఎంఈఐఎల్ వడివడిగా అడుగులు వేస్తోంది. -
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: అనిల్కుమార్
సాక్షి, తాడేపల్లి : అనుకున్న సమయానికల్లా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖా మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. నవంబర్ 1 తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పినట్లుగానే శుక్రవారం నుంచి పోలవరం పనులు మొదలు కానున్నాయని హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని... తమ ప్రభుత్వ సంకల్పం మంచిది కాబట్టే తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడిందన్నారు. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు(పీహెచ్ఈపీ) పనులను థర్డ్ పార్టీకి అప్పగించేందుకు అడ్డుగా ఉన్న ఉత్తర్వులను హైకోర్టు తొలగించిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్ కింద ఆగస్టులో జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీకి అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గురువారం ఎత్తి వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు కానున్నాయి.(చదవండి : పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు పనుల అప్పగింతకు హైకోర్టు ఓకే) ఈ సందర్భంగా మంత్రి అనిల్ యాదవ్ మాట్లాడుతూ... రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వ ఖజానాకు రూ. 800 కోట్లు మిగిలాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత తీర్పు నేపథ్యంలో టీడీపీ నేతలు కోర్టును కూడా తప్పుపడతారేమోనంటూ చురకలు అంటించారు. ‘70 శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశామని చంద్రబాబు అబద్దాలు చెపుతున్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని దేవినేని ఉమా సవాల్ చేశారు. మాట తప్పడం అనేది చంద్రబాబుకు అలవాటు. తమ వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం.. వారి దగ్గర నుంచి కమీషన్లు తీసుకోవడం చేశారు. ఇప్పుడు పోలవరం సబ్ కాంట్రాక్టర్లుకు సమస్యలు ఏమైనా ఉంటే వాళ్లు నవయుగతో తేల్చుకుంటారు అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబులా మాట తప్పే నైజం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదని.. అనుకున్న సమయానికల్లా ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు. ‘పోలవరం పనులు ఆగిపోతాయని ప్రతిపక్ష పార్టీలు కలలు గన్నాయి. 86 శాతం రిజర్వేయర్లు పూర్తిగా నీటితో నిండాయి. ఆర్ అండ్ ఆర్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును భగవంతుడి ఆశీసులతో సీఎం జగన్ పూర్తి చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
పోలవరం ప్రాజెక్ట్ పనులకు తొలగిన అడ్డంకి
-
పోలవరం పనులకు తొలగిన అడ్డంకి
సాక్షి, అమరావతి: పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు(పీహెచ్ఈపీ) పనులను థర్డ్ పార్టీకి అప్పగించేందుకు అడ్డుగా ఉన్న ఉత్తర్వులను హైకోర్టు తొలగించింది. రివర్స్ టెండరింగ్ కింద 17.08.19న జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీకి అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గురువారం ఎత్తేసింది. థర్డ్ పార్టీకి పనులను అప్పగించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్(ఐఏ)ను కొట్టేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని కోరుతూ ఏపీ జెన్కో దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించింది. జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ నవయుగ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్కు విచారణార్హత లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నవయుగ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఒప్పందం రద్దు ఉత్తర్వుల అమలును నిలిపేయడంతోపాటు ప్రాజెక్ట్ పనులను థర్డ్ పార్టీకి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ మధ్యంతర పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నవయుగ కోరిన విధంగా గత ఆగస్టు 22న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్ట్ పనులను థర్డ్ పార్టీకి అప్పగించే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ జెన్కో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదు.. ఈ పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజు ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో గుర్తు చేశారు. ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజు ఉన్నప్పటికీ.. దాని జోలికెళ్లకుండా హైకోర్టులో అధికరణ 226 కింద పిటిషన్ దాఖలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజు ఉన్న నేపథ్యంలో, ఈ న్యాయస్థానం కూడా ఆ క్లాజువైపే మొగ్గు చూపుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారం మధ్యవర్తిత్వానికి సంబంధించిందని, అందువల్ల ఒప్పందం రద్దును సవాలు చేస్తూ నవయుగ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒప్పందం రద్దు ఉత్తర్వుల అమలు నిలుపుదలకు.. ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీకి అప్పగించకుండా ఆదేశాలివ్వాలన్న మధ్యంతర పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో పనుల అప్పగింతకు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు గ్యారెంటీ కేసులోనూ... ఇదిలా ఉంటే, పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో నవయుగ సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకోరాదంటూ అటు బ్యాంకులను, ఇటు జెన్కోను ఆదేశిస్తూ విజయవాడ కోర్టు ఆగస్టు 13న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ జెన్కో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. బ్యాంకు గ్యారెంటీల విషయంలో మధ్యవర్తిత్వ చట్టం కింద నవయుగ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్ ఓపీని రెండు వారాల్లో తేల్చాలని విజయవాడ 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిని ఆదేశించింది. అప్పటివరకు బ్యాంకు గ్యారెంటీల విషయంలో యథాతథస్థితి(స్టేటస్కో)ని కొనసాగించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. -
పంచాయతీరాజ్ శాఖలో రివర్స్ టెండరింగ్ సక్సెస్
-
సచివాలయాల్లోనూ సూపర్ ‘రివర్స్’
సాక్షి, అమరావతి: అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజాధనాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు అవసరమైన డెస్క్టాప్ కంప్యూటర్లు, యూపీఎస్ సిస్టమ్స్, ప్రింటర్ల కొనుగోళ్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టింది. డెస్క్టాప్ కంప్యూటర్లు, యూపీఎస్ సిస్టమ్స్, ప్రింటర్లకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో ఎల్–1, ఎల్–2, ఎల్–3గా నిలిచిన సంస్థలతో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దీంతో మొత్తం రూ.65.47 కోట్ల ప్రజాధనం ఆదా కావడం గమనార్హం. డెస్క్టాప్ కంప్యూటర్లు, యూపీఎస్ సిస్టమ్స్ కొనుగోళ్లలో.. రాష్ట్రంలోని 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలకు అవసరమైన 29,888 డెస్క్టాప్ కంప్యూటర్లు, 14,944 యూపీఎస్ సిస్టమ్స్ కొనుగోలుకు ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించారు. ఒక సంస్థ రూ.191.10 కోట్లు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. మరో సంస్థ రూ.235.58 కోట్లు కోట్ చేసి ఎల్–2గా, ఇంకో సంస్థ రూ.326.58 కోట్లు కోట్ చేసి ఎల్–3గా నిలిచాయి. ఈ మూడు సంస్థలతో రివర్స్ టెండరింగ్ను నిర్వహించారు. ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధర రూ.191.10 కోట్ల కంటే ఇంకా తక్కువ ధరకు వచ్చేందుకు రివర్స్ టెండరింగ్ను చేపట్టారు. ఇందులో తొలుత ఎల్–2గా నిలిచిన సంస్థ రూ.139.95 కోట్లు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. అంటే డెస్క్టాప్ కంప్యూటర్లు, యూపీఎస్ సిస్టమ్స్ కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ వల్ల రూ.51.15 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. 26.77 శాతం తక్కువ ధరకే ఆయా పరికరాలు గ్రామ, వార్డు సచివాలయాలకు అందనున్నాయి. ప్రింటర్ల కొనుగోళ్లలో.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,944 ప్రింటర్ల కొనుగోళ్ల కోసం తొలుత ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ టెండర్లు పిలిచింది. ఒక సంస్థ రూ.38.92 కోట్లు కోట్ చేసి ఎల్–1గా, మరో సంస్థ రూ.47.12 కోట్లు కోట్ చేసి ఎల్–2గా నిలిచాయి. ఎల్–1 కోట్ చేసిన రూ.38.92 కోట్ల కంటే తక్కువ ధరకు వచ్చేందుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించగా, తొలి టెండర్లో ఎల్–2గా నిలిచిన సంస్థ కేవలం రూ.24.60 కోట్లు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. తద్వారా రూ.14.32 కోట్ల నిధులు ఆదా అయ్యాయి. 36.80 శాతం తక్కువ ధరకే ప్రింటర్లు లభిస్తున్నాయి. -
పంచాయతీ రాజ్ శాఖలో రివర్స్ టెండరింగ్ సక్సెస్
సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా, ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం పూర్తిగా విజయవంతమైంది. పంచాయతీ రాజ్ శాఖలో రివర్స్ టెండరింగ్ విధానంతో గ్రామ సచివాలయ కంప్యూటర్ పరికరాల కొనుగోలులో ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డెస్క్టాప్ కంప్యూటర్లు, సీపీయూ కొనుగోలులో రూ. 51.15 కోట్లను ఆదా చేశామన్నారు. ప్రింటర్ల కొనుగోలు టెండర్లలో రూ. 14.32 కోట్లను కలిపి మొత్తంగా రూ. 65.47 కోట్లను ఆదా చేసినట్లు ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ డబ్బులతో సంక్షేమ పథకాల అమలు చేపట్టవచ్చన్నారు. -
రివర్స్ టెండరింగ్పై అమిత్ షా అభినందనలు
-
కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు
సాక్షి, న్యూఢిల్లీ: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి వరద జలాలను తరలించి కృష్ణా డెల్టాలో తాగు, సాగు నీటి కొరత తీర్చే ప్రాజెక్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్షాను కోరారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు వైఎస్ జగన్ ఆయనతో సమావేశమయ్యారు. ఇదే రోజు అమిత్ షా పుట్టిన రోజు కావడంతో కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరగడం విశేషం. రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై సానుకూల చర్చ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణాలో తగ్గిన నీటి లభ్యత గోదావరి జలాల తరలింపు అంశం గురించి అమిత్ షాతో వైఎస్ జగన్ కీలకంగా చర్చించారు. కృష్ణానదిలో గత 52 ఏళ్లలో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరోవైపు గోదావరిలో గత 30 ఏళ్లుగా సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. ఈ దృష్ట్యా కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణా డెల్టాల్లో తాగు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు ఉపయోగపడేలా గోదావరి వరద జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలకు సూచించాలని ముఖ్యమంత్రి కోరారు. దీంతో రాష్ట్రంలో సాగు, తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆరి్థక పరిస్థితులు అనూహ్యంగా మారతాయని సీఎం వివరించారు. సవరించిన అంచనాను ఆమోదించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఈ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు విన్నపాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా హెడ్ వర్క్స్, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టన్నెల్ పనుల్లో రూ.58 కోట్లు ఆదా అయిన విషయాన్ని స్పష్టంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులకే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదల చేయాలని, ఈ ఆరి్థక సంవత్సరంలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనుల కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరలో నిధులు ఇచ్చేలా సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రెవిన్యూ లోటును సవరించండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు మరోసారి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు, సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందని వివరించారు. వీటి వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని, పొరుగు రాష్ట్రాల రాజధానులతో సమానంగా పారిశ్రామిక వర్గాలను, పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలంటే హోదా అవసరమని వివరించారు. 2014 – 2015లో రెవిన్యూ లోటును కాగ్తో సంప్రదించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22,948.76 కోట్లు రెవిన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18,969.26 కోట్ల మేర కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ఈ నిధులు తక్షణమే విడుదలయ్యేలా చొరవ చూపాలని కోరారు. మౌలిక వసతుల కల్పనకు నిధులివ్వండి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి వీలుగా కడపలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి చేయూత ఇవ్వాలని కోరారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్ని కూడా ప్రస్తావించారు. విశాఖపట్నం – చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులను సమకూర్చాలని విన్నవించారు. వెనకబడిన జిల్లాలకు ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులు చాలా స్వల్పమని, రాష్ట్ర విభజన హామీ మేరకు.. కలహండి – బొలంగిర్ – కోరాపుట్ (కేబీకే ), బుందేల్ఖండ్ తరహాలో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఏపీలో వెనకబడిన జిల్లాల్లో తలసరి రూ.400 ఇస్తే, బుందేల్ఖండ్, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4,000 ఇస్తున్నారని వివరించారు. ఏడు జిల్లాలకు ఏడాదికి రూ.350 కోట్లు చొప్పున ఇప్పటి వరకు రూ.2,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.1,050 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. సీఎం వెంట వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభా పక్ష నేత పీవీ మిథున్రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రఘురామకృష్ణం రాజు, రెడ్డప్ప మార్గాని భరత్, నందిగం సురేష్ తదితరులు ఉన్నారు. రివర్స్ టెండరింగ్పై అమిత్ షా అభినందనలు పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వల్ల రూ.838 కోట్లు ఆదా అయ్యాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. దీంతో వైఎస్ జగన్ను అమిత్ షా అభినందించినట్టు సమాచారం. పోలవరంపై ఇలాగే ముందుకు వెళ్లాలని అమిత్ షా ప్రోత్సహించారని, ఏపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని భరోసా ఇచ్చారని తెలిసింది. -
2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
‘రివర్స్’ సక్సెస్
సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా, ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం పూర్తిగా విజయవంతమైందని, సాగునీటి ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు సుమారు రూ.1,000 కోట్లు ఆదా అయిందని జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఈ స్ఫూర్తితో మున్సిపల్, గృహ నిర్మాణ శాఖల్లో సైతం రివర్స్ టెండరింగ్కు వెళతామని చెప్పారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన శాఖలో రివర్స్ టెండరింగ్ వల్ల మరో రూ.500 కోట్లు ఆదా అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.62 కోట్లు ఆదా అయ్యాయన్నారు. బొగ్గు రవాణాలో కూడా రూ 25 కోట్లు ఆదా అయిందన్నారు. బాబు ముంచితే మేం ఆదా చేస్తున్నాం.. రివర్స్ టెండరింగ్కు వెళ్లకుండా టీడీపీ సర్కారు హయాంలో కేటాయించిన వారికే పనులు అప్పగిస్తే దాదాపు రూ.1,500 కోట్ల మేర ప్రజా ధనానికి గండిపడి ఐదుగురు లేదా పదిమంది జేబుల్లోకి వెళ్లేవని మంత్రి అనిల్ పేర్కొన్నారు. రివర్స్ టెండర్ల ద్వారా ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు ఆదా చేయగా మరో రూ.500 కోట్ల దాకా ఆదా జరిగే అవకాశం ఉందని మంత్రి గుర్తు చేశారు. ఈ డబ్బులతో సంక్షేమ పథకాల అమలు చేపట్టవచ్చన్నారు. టీడీపీ 2014లో అధికారంలో చేపట్టాక రెండేళ్ల పాటు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా కాలయాపన చేసిందని పేర్కొన్నారు. తాము కొద్ది నెలల్లోనే అన్నింటినీ సమీక్షించి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు రూ 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ముంచితే తాము రూ.వేల కోట్లు ఆదా చేస్తున్నామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన హంద్రీ–నీవా రాయలసీమను సస్యశామలం చేసేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సాగు, తాగునీటి కష్టాలను తీరుస్తామని అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో పథకంపై సమీక్ష సందర్భంగా మంత్రి అనిల్కుమార్ ప్రకటించారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు బీటీపీ, ఎగువ పెన్నార్ ఎత్తిపోతలకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం ఇక పరుగులు
సాక్షి, అమరావతి: గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టగానే పోలవరం పనులను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) రాష్ట్ర జలవనరుల శాఖను ఆదేశించింది. మే నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయాలని, 41.5 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని నిర్దేశించింది. పీపీఏ సీఈవో ఆర్కే జైన్ అధ్యక్షతన సంస్థ సర్వ సభ్య సమావేశం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ప్రస్తుత సీజన్లో పూర్తి చేయాల్సిన పనులు, నిపుణుల కమిటీ నివేదిక, నిర్వాసితులకు పునరావాసం కల్పన తదితర అంశాలపై ఇందులో సమగ్రంగా చర్చించారు. పోలవరం హెడ్వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ‘రివర్స్ టెండరింగ్’ వల్ల రూ.782.8 కోట్లు ఆదా అయిందని, 65వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ వల్ల రూ.58.53 కోట్లు ఆదా అయిందని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ పీపీఏకి వివరించారు. పోలవరం పనులకు సంబంధించి హైకోర్టు తీర్పు అతి త్వరలోనే వస్తుందని, కోర్టు ఆదేశాల మేరకు కొత్త కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పెండింగ్ డిజైన్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), డీడీఆర్పీ(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్)తో చర్చించి ఆమోదం పొందాలని పీపీఏ పేర్కొంది. పోలవరం పనుల్లో అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందంలో కేంద్ర జల్ శక్తి శాఖ సూచించే అధికారిని సభ్యుడిగా చేర్చాలని పీపీఏ సీఈవో సూచించారు. పర్యావరణానికి ఎలాంటి హాని లేదు.. పోలవరం పనుల వల్ల పర్యావరణానికి హాని వాటిల్లుతోందంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన వ్యాజ్యంపై సమావేశంలో ఆర్కే జైన్ ప్రస్తావించారు. దీనిపై ఆదిత్యనాథ్దాస్ స్పందిస్తూ పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు చేయడానికి తవ్విన మట్టి నిల్వ కోసమే భూసేకరణ చేశామని తెలిపారు. ఇదే మట్టిని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్లో వినియోగిస్తామని, దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని ఎన్జీటీకి నివేదించామన్నారు. పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారని, ఆ మేరకు పనులు జరిగేలా ప్రణాళిక సిద్దం చేశామన్నారు. ఇప్పటికే చేసిన పనులకు రూ.5,103 కోట్లు విడుదల చేయాలని కోరారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించగలుగుతామని స్పష్టం చేశారు. సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా, పీపీఏ సభ్య కార్యదర్శి పాండే, సీఈ ఏకే ప్రధాన్, పోలవరం సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: మంత్రి అనిల్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో నిర్వహించిన రివర్స్ టెండర్ల వల్ల ఇప్పటివరకు రూ. 1500 కోట్లు ఆదా చేశామని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సోమవారం వెల్లడించారు. తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన తాము రివర్స్ టెండర్లు వేయకపోతే ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లేదని ప్రశ్నించారు. మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ..‘వెలిగొండలో రూ. 61 కోట్లు మిగిలాయి. రాబోయే రోజుల్లో మరో రూ. 500 కోట్లు మిగులుతాయని భావిస్తున్నాం. అన్ని శాఖల్లోనూ రివర్స్ టెండరింగ్ చేపడితే నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. ఇలా ఆదా అయిన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం. ప్రజాధనం ఆదా అవుతుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా? రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం మంచిదా? రేట్లు తగ్గించి ఆ డబ్బుతో పేదలను ఆదుకోవడం మంచిదా?’ అంటూ ప్రతిపక్షాన్ని నిలదీశారు. చంద్రబాబు తన హయాంలో ఇలా చేసుంటే అంత డబ్బు మిగిలేది కదా? అలా కాకుండా ఎక్సెస్ టెండర్లు నిర్వహించి, ఇష్టమొచ్చిన నిబంధనలు పెట్టి తనకు అనుకూలంగా ఉన్నవారికి దోచిపెట్టారు. ఇసుక సమస్యపై రాద్ధాంతం చేస్తున్నారు. దేవుడి దయ వల్ల సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో మంచి వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. అయితే కృష్ణా, గోదావరి నదులకు వరదలు రావడం వల్ల ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిందని మంత్రి అనిల్ వివరించారు. మరోవైపు జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వెళ్తే తప్పులేదు కానీ, ముఖ్యమంత్రి వెళ్తే తప్పా? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లే చంద్రబాబు మాకొద్దంటున్నారని స్పష్టం చేశారు. -
ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ సక్సెస్
-
జెన్కోలో మరోసారి రివర్స్ టెండరింగ్
సాక్షి, అమరావతి: రివర్స్ టెండరింగ్లో ఏపీ జెన్కో మరో రికార్డు నమోదు చేసింది. బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషించే సూపర్ విజన్ కాంట్రాక్టులో రూ.23.30 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయగలిగింది. జెన్కో రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఈ నెలలో ఇది రెండోది. ఇటీవల ఒడిశాలోని తాల్చేరు నుంచి మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్) బొగ్గు చేరవేత కాంట్రాక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.164 కోట్లు మిగిల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో సింగరేణి బొగ్గు రవాణా సూపర్ విజన్ కాంట్రాక్టులో సైతం విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి నుంచి ఏటా 90 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అందుతుంది. దీన్ని కడపలోని ఆర్టీపీపీ, విజయవాడలోని ఎన్టీటీపీఎస్ ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు చేరవేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో బొగ్గు లోడింగ్, రవాణా సమాచారం, తూకం, పరీక్ష కోసం శాంపుల్స్ కలెక్షన్, రైల్వే వ్యాగన్ల ద్వారా వేగంగా ముందుకెళ్లేందుకు ఓ సంస్థను పర్యవేక్షణ కింద తీసుకుంటారు. ఇ–ప్రొక్యూర్మెంట్ ద్వారా పిలిచిన ఈ కాంట్రాక్టుకు టెండర్లు దాఖలు చేసిన వారిలో ఆరు కంపెనీలు మాత్రం అన్ని అర్హతలు సంపాదించాయి. ఇందులో కరమ్చంద్ తాపర్ అండ్ బ్రాస్కోల్ సేల్స్ లిమిటెడ్, ఏకెఏ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లోక్నాథ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద్ ట్రాన్స్పోర్ట్స్, నాయర్ కోల్ సర్వీస్ లిమిటెడ్, బీఎస్ఎన్ జోషి కంపెనీలున్నాయి. ఎన్టీటీపీఎస్కు టన్నుకు రూ.32 చొప్పున, ఆర్టీపీపీకి టన్నుకు రూ.34 చొప్పున కోట్ చేసిన నాయర్ కోల్ సర్వీసెస్ ఎల్–1గా నిలిచింది. ఎల్–1 ధరతో రివర్స్ టెండరింగ్ చేపట్టడంతో ఇదే సంస్థ ఎన్టీటీపీఎస్కు టన్నుకు రూ.17.50, ఆర్టీపీపీకి టన్నుకు రూ.23తో సరఫరా చేస్తామని దిగి వచ్చింది. ఈ లెక్కన విజయవాడ థర్మల్ కేంద్రానికి వచ్చే బొగ్గు సూపర్ విజన్ చార్జీలు టన్నుకు రూ.14.50 చొప్పున, లక్ష టన్నులకు రెండేళ్ల కాంట్రాక్టు కాలానికి రూ.14.50 కోట్లు ఆదా అయింది. అదే విధంగా ఆర్టీపీపీలో టన్నుకు రూ.11 చొప్పున 80 లక్షల టన్నులకు రెండేళ్లల్లో రూ.8.80 కోట్లు తగ్గాయి. రెండింట్లో కలిపి మొత్తం రూ.23.30 కోట్ల ప్రజాధనం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయింది. పోటీ బాగా పెరుగుతోంది.. జెన్కో కాంట్రాక్టుల్లో పోటీ పెరుగుతోంది. ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలను సరళతరం చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల తక్కువ లాభాలతో పనులు చేసే వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా జెన్కోకు ప్రయోజనం కలుగుతోంది. ఎంసీఎల్ బొగ్గు రవాణా విషయంలోనూ ముందుకొచ్చే ప్రతి ఒక్కరికీ సరిపడా అర్హత ఉండేలా చూశాం. ఇప్పుడు సూపర్ విజన్కు కావాల్సిన వాస్తవ అర్హతలే పొందుపరిచాం. రివర్స్ టెండరింగ్లోనూ పోటీ బాగా కన్పిస్తోంది. – శ్రీధర్, జెన్కో ఎండీ -
రివర్స్ టెండరింగ్తో రూ.900 కోట్లు ఆదా..
-
రివర్స్ టెండరింగ్తో రూ.900 కోట్లు ఆదా..
సాక్షి, నెల్లూరు: రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అయిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాజెక్టుల్లో దాదాపు రూ.4 నుంచి 5వేల కోట్ల వరకు నిధులు ఆదా అవుతాయన్నారు. పోలవరం రివర్స్ టెండర్లలో నవయుగ సంస్థను కూడా పాల్గొనాలని ఆహ్వానించామని తెలిపారు. టీడీపీ హయాంలో టెండర్ పొందిన రిత్విక్ సంస్థ వెలుగొండ రివర్స్ టెండరింగ్లో తక్కువకే టెండర్ వేసిందని పేర్కొన్నారు. నిధులు ఆదా చేసిన ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు అభినందించాలన్నారు. రివర్స్ టెండరింగ్ లేకపోతే ఈ నిధులు ఏ బాబు జేబులోకి వెళ్లేవో అందరికీ తెలుసునన్నారు. మంచి మనసున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం వలనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడుతున్నాయని మంత్రి అనిల్కుమార్ అన్నారు.