SLBC Tunnel
-
ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్
-
ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే?
-
SLBC ప్రమాదం.. ఎనిమిది మంది ప్రాణాలతో ఉన్నారా?
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. రెస్క్యూ బృందంలో ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలుటన్నెల్ సైట్ దగ్గర 23 మంది ఆర్మీ నిపుణులుఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలుప్రమాద స్థలిలో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉంది: కలెక్టర్ సంతోష్రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లేందుకు ఆటంకం ఏర్పడిందిభారీ మోటార్ల ద్వారా నీటిని బయటకి పంపుతున్నాంప్రమాదంలో చిక్కుకున్న వారి కనెక్టివిటీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ావాడుతున్నాం రేవంత్కు రాహుల్ ఫోన్..SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీసొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరాదాదాపు 20 నిమిషాలు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివెంటనే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో తెలిపిన సీఎంమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంఘటన స్థలానికి చేరుకొని తరలించడం, NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్లను మోహరించామన్న రేవంత్గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్న సీఎంప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను అభినందించిన రాహుల్ గాంధీ మంత్రి ఉత్తమ్ కామెంట్స్.. టన్నెల్ చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. రాత్రి నుంచి కేంద్ర బృందాలు రాష్ట్ర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 14 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళగలిగాం. టెన్నెల్ బోర్ మెషిన్ లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. టన్నెల్ నీటిమయం..ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, సీనియర్ ఐఏఎస్ శ్రీధర్.మరోసారి తన లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందం.12వ కిలోమీటర్ నుంచి పూర్తిగా బురదమయం.నీటితో కూడుకున్న టన్నెల్.నీటిని బయటికి తీసేందుకే సమాలోచనలు.నీరంతా బయటకి తోడిన తర్వాతే భవిష్యత్తు సహాయక చర్యలు చేపట్టే అవకాశం.వారంతా ప్రాణాలతో ఉన్నారా? లేదా?లోపలికి ఆక్సిజన్ అందుతోందా?.అనే అనుమానాలు వ్యక్తమువుతున్నాయి. రాత్రి పరిస్థితి ఇది..👉ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న రాత్రి 12 గంటలకు వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల లోపలికి వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్బంగా మోకాళ్ల లోతు బురద ఉన్నట్టు వారు గుర్తించారు. 👉ఇక, ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. చిక్కుకున్నది వీరే.. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. జేపీ సంస్థకు చెందిన మనోజ్కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్ఈ), రోజువారీ కార్మికులు సందీప్సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడిన వారు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే.మంత్రుల పర్యవేక్షణ..👉మరోవైపు.. దోమలపెంట వద్దకు నేడు మంత్రులు ఉత్తమ్, జూపల్లి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షించనున్నారు.ఇటీవలే పనులు పునః ప్రారంభమై... 👉శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. 👉ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. 👉శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా..👉సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. -
కొత్త లిఫ్టులతో 62 వేల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: దేవరకొండ, మిర్యాలగూడ నియోజక వర్గాల్లోని కొత్త ఎత్తిపోతల పథకాలతో మొత్తం 62,742 ఎక రాలకు సాగునీరు అందుతుందని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కృష్ణా, మూసీ నుండి నీళ్లను తరలించడం ద్వారా కొత్త ఆయకట్టు సృష్టించడంతో పాటు ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టులు దోహదప డతాయని చెప్పారు. ఈ నియోజకవర్గాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై బుధవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వ హించారు. కొత్త ఎత్తిపోతల జాబితాలో దేవర కొండలోని పొగిళ్ల, కంబాలపల్లి, అంబభవాని, ఏకేబీఆర్, పెద్దగట్టు లిఫ్టులు, మిర్యాలగూడలో దున్నపోతులగండి– బాల్నేపల్లి – చంప్లతండా, టోపుచెర్ల, వీర్లపాలెం, కేశవాపూర్ – కొండ్రాపూర్ ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటితో 47,708 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని చెప్పారు. 2026 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయాలిశ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనుల ను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. 30 టీఎంసీలను తరలించడానికి వీలుగా సొరంగం పనులను వేగవంతం చేయాలన్నారు. మొత్తం 44 కి.మీ సొరంగంలో 9.55 కి.మీలు ఇంకా పెండింగ్లో ఉందని, టన్నెల్ బోర్ మిషన్కు అవసరమైన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రికి తెలి పారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మధ్యవర్తిత్వ పర్యవేక్షణ లేకుండా నిర్మించిన అతిపెద్ద సాగునీటి సొరంగంగా ఇది మారుతుందని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.4,637 కోట్లతో సవరించిన అంచనాలకు పరిపాలన అనుమతి జారీ చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ ప్రభావిత నల్లగొండ జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. చెక్డ్యామ్ల కుంభకోణంపై విచారణగత ప్రభుత్వంలో చెక్డ్యామ్ల నిర్మాణంలో అవకతవకతలు జరిగాయని, పెద్ద సంఖ్యలో చెక్డ్యామ్లు దెబ్బతిన్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణకు మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నీటి లభ్యత, సామర్థ్యంపై సరైన అంచనా లేకుండా చెక్డ్యామ్లు నిర్మించడంతో అవి దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. కాగా సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులను పూర్తి చేసి పటిష్టం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, బి.లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
ఇక సాఫీగా సొరంగం పనులు!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాలపై ఆధారపడి చేపట్టిన ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులకు కరెంట్ కష్టాలు తొలగనున్నాయి. ఇన్లెట్ సొరంగంలోకి చేరే నీటిని తొలగించడానికి (డీ వాటరింగ్) అయ్యే కరెంటు చార్జీలను ఇకపై ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో సొరంగం పనులు సాఫీగా ముందుకు సాగేందుకు మార్గం సుగమం అయ్యింది. గడిచిన రెండేళ్లుగా నీటిని తోడుతున్న ఏజెన్సీ కరెంట్ బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తోంది. ఈ కారణంగా టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో, సొరంగం పనులు ముందుకు సాగడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వలు సమృధ్ధిగా పెరగడంతో అటువైపుగా ఉన్న ఇన్లెట్ సొరంగంలోకి భారీగా నీరు చేరింది. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)కు ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మరో 10 కిలోమీటర్లు తవ్వాలి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పదిహేనేళ్లయినా సరి గా ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టును 2005లో రూ.2,813 కోట్లతో చేపట్టగా, 15 ఏళ్లయినా పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం రూ.3,152 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. ఒక సొరంగం పూర్తి కాగా రెండో టన్నెల్ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్నగర్లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.93 కి.మీ. కాగా, మరో 10.10 కి.మీలకు పైగా టన్నెల్ను తవ్వాల్సి ఉంది. అయితే ఈ టన్నెల్ తవ్వకానికి శ్రీశైలం ప్రాజెక్టులో చేరే నీటి నిల్వలతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గడిచిన రెండేళ్లుగా ప్రాజెక్టుకు విపరీతమైన వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండి ఇన్లెట్ టన్నెల్లోకి భారీగా సీపేజీ నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిల్వ ఎక్కువ ఉన్నప్పుడు నిమిషానికి 5 వేల నుంచి 7 వేల లీటర్ల మేర నీరు ఉబికి వస్తోంది. దీంతో రెండు, మూడు స్టేజీల్లో 20 హెచ్పీ, 30 హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. దీంతో నెలకు రూ.2 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఏజెన్సీ బిల్లులు చెల్లించడంలో విఫలమవుతోంది. ఇప్పటికి రూ.58 కోట్ల మేర బిల్లులు (ఇరిగేషన్ శాఖ నుంచి ఏజెన్సీకి రావాల్సినవి) పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో డీ వాటరింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. రెండేళ్లుగా సొరంగం తవ్వకం పనులు కూడా నిలిచిపోయాయి. టీబీఎంకు ముప్పు నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ ప్రక్రియ జరగక, ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో టన్నెల్లో నీటిమట్టం పెరుగుతోంది. ఇది మరింత పెరిగితే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న టీబీఎం మునగడం ఖాయం. ఇదే జరిగితే టీబీఎం ముఖ్యమైన పరికరాలతోపాటు విద్యుత్ వ్యవస్థ, కన్వేయర్ వ్యవస్థలు బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో భారీ ఆర్థిక నష్టంతో పాటు పనులు కొనసాగించేందుకు మరింత గడువు అవసరమవు తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం కేబినెట్ భేటీ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఈ అంశాన్ని ప్రభు త్వం దృష్టికి తెచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన కేబినెట్ ఇకపై ఏజెన్సీ కాకుండా ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని, కరెంట్ కట్ చేయరాదని విద్యుత్ శాఖను ఆదేశించింది. టన్నెల్ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖకు సూచించింది. కాగా ఎస్ఎల్బీసీ టన్నెల్, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు జి. దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్ప్రసాదరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డిండి ఎత్తిపోతలను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. -
విత్తన సదస్సుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ నుంచి జులై మూడు వరకు హైదరాబాద్లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం దానిపై ఏర్పాటైన కార్యనిర్వాహక కమిటీ తొలి సమావేశం జరిగింది. సాధ్యమైనంత త్వరలో పనులన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్కు వస్తున్నందున భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ విత్తన పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సదస్సులో భారతదేశం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. ఎఫ్ఏవో సహకారంతో సదస్సుకు ముందు జూన్ 24, 25 తేదీలలో ఆఫ్రికా దేశాల విత్తన ప్రతినిధులతో విత్తనోత్పత్తిపై ప్రత్యేక సదస్సు ఉంటుందని, దీనికి తెలంగాణ విత్తన పరిశ్రమ నుంచి కూడా విత్తన ప్రతినిధులు పాల్గొంటున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. విత్తన ఎగుమతులు, దిగుమతులకు మంచి వేదిక కానున్నదన్నారు. జూన్ 27న విత్తన రైతుల ప్రత్యేక సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విత్తనోత్పత్తి, విత్తన నాణ్యతపై రైతులకు మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, తెలంగాణ నుంచి 1500మంది విత్తన రైతులు, గుజరాత్, కర్ణాటకలకు చెందిన విత్తన రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు. అంతర్జాతీయ విత్తన సదస్సు ముఖ్యాంశాలు.. విశేషాలు - వేదిక – హెచ్ఐసీసీ, నోవాటెల్, హైదరాబాద్ - ప్రపంచంలో విత్తన నాణ్యత ఎలా ఉందనే అంశంపై చర్చలు - తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులకు ప్రోత్సాహకం - జూన్ 26 నుంచి 28 వరకు విత్తన ప్రదర్శన - జూన్ 27న తెలంగాణ విత్తన రైతుల ప్రత్యేక సమావేశం - 70 దేశాల నుంచి 800 మంది విత్తన ప్రముఖులు - ఆఫ్రికా ఖండపు దేశాల ప్రతినిధులతో తెలంగాణ విత్తన పరిశ్రమ ప్రతినిధుల ప్రత్యేక సమావేశం - 94 ఏళ్ల ఇస్టా చరిత్రలో తొలిసారిగా ఆసియా ఖండంలో హైదరాబాద్లోనే నిర్వహణ - సదస్సుకు నోడల్ ఆఫీసర్గా కేశవులు నియామకం. ఎస్ఎల్బీసీపై వివరణ కోరిన సీఎస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో అవాంతరాలు, ఆగిన పనులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నీటి పారుదల శాఖ నుంచి వివరణ అడిగారు. ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటివరకు జరిగిన పనులు, పెండింగ్ పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరారు. టన్నెల్ పనులు ఏడాదిగా ఆగాయని, దీనికి తోడు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ప్రాజెక్టు అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్న వైనంపై ‘సాక్షి’ప్రచురించిన కథనాలపై ఆయన స్పందించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఇంకా అవసరమైన నిధులు, ఏజెన్సీ ఇదివరకు అడ్వాన్సులు కోరుతూ పెట్టిన అర్జీల అంశాలతో నీటి పారుదల శాఖ నోట్ సిద్ధం చేస్తోంది. పనుల పూర్తికి కనీసం రూ.80కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఏజెన్సీ కోరుతోంది. దీనిపై త్వరలోనే జరిగే కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఎస్ఎల్బీసీ పూర్తికి మరో రెండేళ్లు
సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్బీసీ) సొరంగ పనుల పూర్తికి మరో రెండేళ్లకుపైగా పట్టే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీజలాలను వినియోగించుకొని తెలంగాణలోని అవిభాజ్య మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకున్నది. 2020 అక్టోబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపూర్తి చేసి తీరుతామంటూ పనులు చేపట్టిన జయప్రకాశ్ అసోసియేట్ అనే సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి సొరంగం పనుల్లో ఎప్పుడూ ఓ ఆటంకం ఎదురవుతోంది. తాజాగా టన్నెల్ బోరింగ్ మిషన్ పాడవడంతో దాని మరమ్మతులకు మరో రూ.60కోట్లు అడ్వాన్స్ కోరగా ప్రభుత్వం అందుకు సమ్మతించింది. అవాంతరాలు.. జాప్యం 2004లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు రూ.2,813 కోట్లతో టెండర్లు పిలవగా 2005 ఆగస్టులో రూ.1,925 కోట్లకు జయప్రకాశ్ అసోసియేట్ ఏజెన్సీ పనులు దక్కించుకుంది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదల కారణంగా పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. పనుల ఆలస్యం కారణంగా వ్యయం రూ.4,200 కోట్లకు పెరిగింది. ఇందులో ఇప్పటివరకు రూ.2,200 కోట్లు ఖర్చు చేశారు. మిగతా పనులు కొనసాగుతుండగా, ఇటీవల ఔట్లెట్ టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురైంది. ఈ బోరింగ్ మిషన్ బేరింగ్, కన్వెయర్బెల్టు పాడవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ బోరింగ్ మిషన్ మరమ్మతులకే ఏడు నెలలు పట్టనున్న నేపథ్యంలో డెడ్లైన్లో పనుల పూర్తి సాధ్యమా అన్నదానిపై అనేక సందేహాలున్నాయి. -
రెండున్నరేళ్లు.. 4.5 కిలోమీటర్లు!
• నత్తనడకన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు • ఇంకా రూ.650 కోట్ల పనులు ఎక్కడికక్కడే సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వినియోగించుకుని మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందించేం దుకు చేపట్టిన ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ –ఎస్ఎల్బీసీ)’ సొరంగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి పన్నెండేళ్లు గడుస్తున్నా 70% పనులు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. మొత్తం టన్నెల్ పనులు పూర్తయ్యేందుకు మరో ఎనిమిదేళ్లు పట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. 30 టీఎంసీల నీటిని తీసుకునేలా.. ఎస్ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీల నీటిని తీసుకునేలా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారు. 2005 ఆగస్టులో దీనికి టెండర్లు పిలవగా రూ.1,925 కోట్లకు ప్రముఖ కాంట్రాక్టు సంస్థ పనులు దక్కించుకుంది. 2010 నాటికే ఈ పనులను పూర్తి చేయాల్సి ఉన్నా... భూసేకరణ సమస్యలు, వరదలు పనులను ఆలస్యం చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉండగా... మొదటి టన్నెల్ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్నగర్లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా.. ఇప్పటికి 27.91 కి.మీ. టన్నెల్ పూర్తయింది. ఏడాదికి 2 కిలోమీటర్ల కన్నా తక్కువే..! రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కిలోమీటర్ల టన్నెల్ పూర్తవగా.. తర్వాత రెండున్నరేళ్లలో తవ్వింది 4.83 కిలోమీటర్లే. అంటే ఏడాదికి సగటున 2 కి.మీ. కన్నా తక్కువగానే పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన మిగతా 15.98 కి.మీ. పనులు జరిగేందుకు మరో 8 ఏళ్లు పడతాయన్నది నీటి పారుదల వర్గాల అంచనా. ఈ టన్నెల్ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుం డగా... శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు 3 నెలలుగా నిలిచిపోయాయి. కన్వెయర్ బెల్ట్ మార్చా ల్సి ఉండటం, ఇతర యంత్రాలను మార్చాల్సి రావ డంతో వాటిని తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. పైగా టన్నెల్ తవ్వకం ఆలస్యమవుతోంది. ఇక నల్లగొండ జిల్లా పరిధిలో తవ్వాల్సిన రెండో సొరంగం పూర్త యినా.. కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం గా ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 1,298.91 కోట్లు ఖర్చు చేయగా.. 67.46 శాతం పనులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రాజెక్టుకు 343.35 కోట్లు కేటాయించినా.. ఎస్కలేషన్ చెల్లింపుల కోసమే రూ.235.16 కోట్లు ఇచ్చారు. మొత్తంగా మరో రూ.635 కోట్ల పనులు పూర్తి చేయాలి. అమెరికా పర్యటన రద్దు..టన్నెల్ ఆసియా సదస్సుకు హాజరు! టన్నెల్ పనులను సీరియస్గా తీసుకున్న ప్రభు త్వం... టన్నెల్ పనులు ఎక్కువగా జరుగుతున్న అమెరికాకు ఈఎన్సీ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది. కానీ వీసా సంబం ధిత కారణాలతో అది రద్దయింది. డిజైన్, కన్స్ట్రక్షన్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) ముంబైలో నిర్వహిస్తున్న టన్నెల్– ఆసియా సదస్సుకు ఇంజనీర్ల బృందాన్ని పంపిం ది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు గురువారం ఈఎన్సీ మురళీధర్, నాగార్జున సాగర్ సీఈ సునీల్, ప్రాణహిత సీఈ హరిరామ్, మరో ఇద్దరు ఇంజనీర్లు హాజరయ్యారు. టన్నెల్ నిర్మాణాల్లో తీసుకోవాల్సిన చర్యలు, వేగంగా పనులు వంటి అంశాలపై ఇందులో చర్చించారు.