South Africa vs Pakistan
-
పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. సఫారీలు ఇచ్చిపడేశారుగా! వీడియో
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగింట పాకిస్తాన్-న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ముక్కోణపు వన్డే సిరీస్లో తలపడుతున్నాయి. పాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే కివీస్ ఫైనల్కు ఆర్హత సాధించగా.. మరో స్ధానం కోసం పాక్, ప్రోటీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కరాచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేశారు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా(Temba Bavuma)పై తమ దూకుడును పాక్ ప్లేయర్లు ప్రదర్శించారు.అసలేం జరిగిందంటే?టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ప్రోటీస్కు ఓపెనర్లు టెంబా బావుమా, డీజోర్జీ తొలి వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కేతో కలిసి బావుమా ప్రోటీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అద్బుతమైన షాట్లతో సెంచరీ దిశగా బావుమా దూసుకెళ్లాడు.కానీ ప్రోటీస్ ఇన్నింగ్స్ 29వ ఓవర్లో బావుమాను దురదృష్టం వెంటాండింది. ఆ ఓవర్ చివరి బంతికి రనౌట్ రూపంలో టెంబా పెవిలియన్కు చేరాడు. ఆ ఓవర్లో ఆఖరి బంతిని మహ్మద్ హస్నైన్ గుడ్ లెంగ్త్ డెలివరీగా బావుమాకి సంధించాడు. ఆ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. వెంటనే సింగిల్ కోసం బావుమా ప్రయత్నించగా.. నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న మాథ్యూ బ్రీట్జ్కే సైతం పరుగు కోసం ముందుకు వచ్చాడు. కానీ బ్రీట్జ్కే కొంచెం ముందుకు వచ్చి వెంటనే తన మనసును మార్చకుని నో అని కాల్ ఇచ్చాడు.అప్పటికే సగం దూరం పరిగెత్తిన బావుమా తిరిగి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న సౌద్ షకీల్ స్ట్రయికర్ ఎండ్లో వికెట్లను గిరాటేశాడు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్ల సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. పాక్ ఆల్రౌండర్ కమ్రాన్ గులామ్.. బావుమా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు.ఆ తర్వాత సల్మాన్ అఘా, సౌద్ షకీల్ అదే రియాక్షన్ ఇచ్చాడు. బావుమా మాత్రం అలా సైలెంట్గా ఉండిపోయాడు. అయితే ఇదే విషయంపై అంపైర్లు పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్తో చర్చించారు. అలా ప్రవర్తించడం సరికాదని రిజ్వాన్ను అంపైర్లు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్కు సఫారీలు బ్యాట్తో సమాధనమిచ్చారు.క్లాసెన్ విధ్వంసం.. బావుమా కెప్టెన్ ఇన్నింగ్స్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బావుమా 96 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 82 రన్స్ సాధించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. THE SEND-OFF BY KAMRAN GHULAM AND SAUD SHAKEEL. 🔥pic.twitter.com/zhv7iIgwvm— 𝙎𝙝𝙚𝙧𝙞 (@CallMeSheri1) February 12, 2025 -
Pak vs SA: హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసర ఇన్నింగ్స్
పాకిస్తాన్తో వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దంచికొట్టారు. త్రైపాక్షిక సిరీస్లో భాగంగా కరాచీ వేదికగా ప్రొటిస్ జట్టు 352 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. నేషనల్ స్టేడియంలో నాలుగో నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్తో వన్డే సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్, సౌతాఫ్రికా అక్కడకు వెళ్లాయి. ఈ క్రమంలో ట్రై సిరీస్లో భాగంగా తొలుత పాక్- న్యూజిలాండ్ మధ్య లాహోర్లో శనివారం మ్యాచ్ జరిగింది. ఇందులో కివీస్ జట్టు పాక్ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.ఫైనల్లో న్యూజిలాండ్అనంతరం సౌతాఫ్రికాతో సోమవారం తలపడ్డ న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్కు చేరుకుంది. ఈ క్రమంలో మరో ఫైనల్ బెర్తు కోసం సౌతాఫ్రికా- పాకిస్తాన్ కరాచీలో మంగళవారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. 96 బంతుల్లో పదమూడు ఫోర్ల సాయంతో 82 రన్స్ సాధించాడు.మరో ఓపెనర్ టోనీ డి జోర్జి(22) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే( Matthew Breetzke) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసర ఇన్నింగ్స్కేవలం 38 బంతుల్లోనే యాభై పరుగులు అందుకున్న ఈ విధ్వంసకర వీరుడు.. మొత్తంగా 56 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. క్లాసెన్ ఇన్నింగ్స్లో పదకొండు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో వియాన్ ముల్దర్(2) విఫలం కాగా.. కైలే వెరెన్నె(32 బంతుల్లో 44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కార్బిన్ బోష్(9 బంతుల్లో 15 నాటౌట్) అతడికి సహకరించాడు.ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో సౌతాఫ్రికా కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 352 పరుగులు సాధించింది. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో ఆఖరి పది ఓవర్లలో పాకిస్తాన్ ఏకంగా 110 పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టు బౌలర్ల చెత్త ప్రదర్శనకు నిదర్శనం. ఇటీవల న్యూజిలాండ్తో వన్డేలోనూ చివరి పది ఓవర్లలో పాక్ బౌలర్లు 123 పరుగులు ఇచ్చుకున్నారు.శుక్రవారం ఫైనల్ మ్యాచ్ కాగా.. పాకిస్తాన్- సౌతాఫ్రికా మధ్య కరాచీ మ్యాచ్లో గెలిచిన జట్టు న్యూజిలాండ్తో శుక్రవారం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది.ఈ మెగా టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఈ ఈవెంట్లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్-‘ఎ’ నుంచి.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ గ్రూప్-‘బి’ నుంచి పోటీపడనున్నాయి.కాగా ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆతిథ్య జట్టును 3-0తో వన్డే సిరీస్లో క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ను వారి సొంతగడ్డపై ఓడించాలనే పట్టుదలతో కరాచీలో చితక్కొట్టిన సౌతాఫ్రికా.. బౌలింగ్లోనూ రాణించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డు -
పాక్ ఫీల్డర్ సంచలనం.. క్రికెట్ చరిత్రలో సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా కరాచీ వేదికగా మూడో మ్యాచ్లో దక్షిణాఫ్రికా-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్కు ఆర్హత సాధించగా.. మరో స్ధానం కోసం ప్రోటీస్, పాక్ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో పాక్ ఆటగాడు అఘా సల్మాన్ తన ఫీల్డింగ్ విన్యాసంతో దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ను గుర్తు చేశాడు. సల్మాన్ సంచలన క్యాచ్తో మెరిశాడు.అద్బుతమైన క్యాచ్తో దక్షిణాఫ్రికా యువ సంచలనం మాథ్యూ బ్రీట్జ్కేను సల్మాన్ పెవిలియన్కు పంపాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన పాక్ స్పిన్నర్ కుష్దిల్ షా.. తొలి బంతిని బ్రీట్జ్కేకి షా టాస్డ్అప్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బ్రీట్జ్కే కాస్త ముందుకు వచ్చి కవర్స్పై నుంచి ఆడేందుకు ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి కవర్స్లో ఉన్న ఆఘా సల్మాన్ అద్బుతం చేశాడు. సల్మాన్ తన కుడివైపునకు గాల్లోకి దూకుతూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. అతడి క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో ఎన్నాళ్లకు పాక్ ఫీల్డర్ల నుంచి గుడ్ క్యాచ్ చూశాము నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బ్రీట్జ్కే సూపర్ ఇన్నింగ్స్..కాగా ఈ మ్యాచ్లో కూడా బ్రీట్జ్కే దుమ్ములేపాడు. 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్తో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ టెంబా బావుమా(82), క్లాసెన్(87) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు సాధించగా.. నసీం షా, కుష్దిల్ షా తలా వికెట్ సాధించారు.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డు Salman " Superman" Ali Agha 👏🏻🥵Salman Ali Agha with a jaw-dropping one-handed grab! 🤯#3Nations1Trophy | #PAKvSA pic.twitter.com/AKe4TmgaEY— Abdullah Zafar (@Arain_417) February 12, 2025 -
CT 2025: పాకిస్తాన్కు ఎదురుదెబ్బ! ఓవైపు క్రికెట్ పండుగ.. మరోవైపు..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ సయీమ్ అయూబ్(Saim Ayub) గాయం కారణంగా సొంతగడ్డపై ఈనెల 19 నుంచి జరిగే ఈ మెగా వన్డే టోర్నమెంట్కు దూరమయ్యాడు. గత నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. టెస్టు సిరీస్ సందర్భంగా అతడి చీలమండకు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో.. అప్పటి నుంచి అతడు ఇంగ్లండ్లోనే పునరావాస శిబిరంలో గడుపుతున్నాడు.అయితే గాయం తీవ్రత దృష్ట్యా కనీసం పది వారాలు విశ్రాంతి తీసుకోవాలని బోర్డు వైద్య సిబ్బంది నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి ఆయూబ్ గైర్హాజరు కానున్నాడు. నిజానికి గాయపడటానికి ముందు ఈ 22 ఏళ్ల ఎడంచేతి వాటం బ్యాటర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనలలో అదరగొట్టాడు.ఆ సిరీస్కూ దూరంముఖ్యంగా సఫారీ జట్టుతో జరిగిన వన్డేల్లో సెంచరీలతో కదంతొక్కిన అయూబ్ జింబాబ్వేతో టీ20లో ‘శత’క్కొట్టాడు. ఇక వచ్చే నెల న్యూజిలాండ్ పర్యటనకు అతడు అందుబాటులో ఉండేది అనుమానమేనని తెలిసింది. మెడికల్ రిపోర్టులు, ఫిట్నెస్ టెస్టులను పరిశీలించాకే కివీస్ పర్యటనకు ఎంపిక చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా న్యూజిలాండ్లో పాకిస్తాన్ ఐదు టీ20లు, మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొంటుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్లు జరుగుతాయి.క్రికెట్ పండుగఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత క్రికెట్ పండగ జరగబోతోన్న విషయం తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం నవీకరించిన స్టేడియాల సామర్థ్యం, ఆ టోర్నీకి ముందు సిద్ధమైన మూడు మేటి జట్ల సత్తా ఏంటో పరీక్షించుకునేందుకు సన్నాహక ముక్కోణపు టోర్నీ శనివారం నుంచి మొదలుకానుంది. లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలపై ఆతిథ్య పాక్ సహా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లు ఈ ముక్కోణపు సిరీస్లో తలపడనున్నాయి.ఇందులో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ల మధ్య లాహోర్లోని గడాఫీ స్టేడియంలో తొలి పోరు జరుగనుంది. 35 వేల సీట్ల సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నవీకరించింది. వందల సంఖ్యలో రోజుల తరబడి కారి్మకులు శ్రమించి నిర్ణీత సమయానికల్లా మైదానాలకు అందుబాటులోకి తెచ్చారని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ కితాబిచ్చారు.ఇటు ఆతిథ్య దేశంతో పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలు మెగా ఈవెంట్కు సరైన సన్నాహక టోర్నీగా ఈ ముక్కోణపు టోర్నీ మ్యాచ్ల్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి. తద్వారా స్థానిక పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు ఐసీసీ మెగా టోర్నీకి వేదికలైన స్టేడియాల పిచ్పై కూడా అవగాహన పెంచుకోవచ్చని కివీస్, సఫారీలు భావిస్తున్నాయి. ఇరుజట్లలోని ఆటగాళ్లలో కొందరు మినహా దాదాపు మెగా ఈవెంట్లో పాల్గొనే క్రికెటర్లతోనే ఈ టోర్నీ ఆడేందుకు వచ్చాయి. ఫిబ్రవరి 14న కరాచీలో జరిగే ఫైనల్స్తో ఈ ముక్కోణపు టోర్నీ ముగుస్తుంది. తర్వాత ఐదు రోజుల వ్యవధిలోనే 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుంది. చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. 122 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. పాకిస్తాన్ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఛేదించింది.దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 194 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. ఫాలో ఆన్(రెండో ఇన్నింగ్స్)లో మాత్రం అద్బుతమైన పోరాటం కనబరిచింది.421 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన పాకిస్తాన్ 478 పరుగుల భారీ స్కోర్ సాధించింది. షాన్ మసూద్ (145) సెంచరీ చేయగా.. బాబర్ ఆజాం (81) హాఫ్ సెంచరీతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోర్కే పరిమితం కావడంతో పాక్ జట్టు సఫారీల ముందు మెరుగైన టార్గెట్ను ఉంచలేకపోయింది.దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 615 పరుగులు చేసింది. ప్రోటీస్ తొలి ఇన్నింగ్స్లో ర్యాన్ రికెల్టన్ (259) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా (106), కైల్ వెర్రెన్న్ (100) శతకాలతో మెరిశారు. పాక్ బౌలర్లు అబ్బాస్, సల్మాన్ అఘా మూడేసి వికెట్లు పడగొట్టారు.చరిత్ర సృష్టించిన పాక్..కాగా ఫాలో ఆన్లో ధీటుగా ఆడిన పాకిస్తాన్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై ఫాల్ ఆన్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1902లో జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడి 372/7 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్తో 122 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియా (372/7) తర్వాత వెస్టిండీస్ (348/10), న్యూజిలాండ్ (342/10), శ్రీలంక (342/10) జట్లు ఉన్నాయి.చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్తో సిరీస్లలోనైనా ఆడిస్తారా? -
రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్
దక్షిణాఫ్రికా(South Afrcia) గడ్డపై వన్డే సిరీస్ ‘క్లీన్స్వీప్’ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు... టెస్టు సిరీస్లో మాత్రం తేలిపోయింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పర్యాటక పాకిస్తాన్ ‘వైట్వాష్’కు గురైంది. కేప్టౌన్ వేదికగా సోమవారం(జనవరి 6) ముగిసిన రెండో టెస్టులో పాక్పై 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్ను 2-0 తేడాతో సౌతాఫ్రికా సొంతం చేసుకుంది.ఫాలో ఆన్లో అదుర్స్..కాగా తొలి ఇన్నింగ్స్లో నిరాశపరిచిన పాకిస్తాన్ ఫాలో ఆన్లో మాత్రం అద్భుతమైన పోరాటం పటమకనబరిచింది. ఓవర్నైట్ స్కోరు 213/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆఖరికి 122.1 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీల ముందు పాకిస్తాన్ కేవలం 58 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచగల్గింది.పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాన్ మసూద్ (251 బంతుల్లో 145; 17 ఫోర్లు) భారీ సెంచరీతో ఆకట్టుకోగా... ఆఘా సల్మాన్ (95 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 41; 2 ఫోర్లు), ఆమేర్ జమాల్ (34; 7 ఫోర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, కేశవ్ మహరాజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఊదిపడేసిన సౌతాఫ్రికా..ఇక 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఊదిపడేసింది. డేవిడ్ బెడింగ్హమ్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), మార్క్రమ్ (14 నాటౌట్) ధాటిగా ఆడి మ్యాచ్ను ముగించారు.దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 615 పరుగుల భారీ స్కోరు చేయగా... పాకిస్తాన్ మాత్రం తమ మొదటి ఇన్నింగ్స్లో 194 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలోనే పాక్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఇక తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో చెలరేగిన రికెల్టన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.కాగా దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న తుది పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.చదవండి: Jasprit Bumrah: భయం పుట్టించాడు! -
బాబర్పైకి బంతి విసిరిన ముల్దర్.. పాక్ బ్యాటర్ రియాక్షన్ వైరల్
సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు సందర్భంగా వియాన్ ముల్దర్(Wiaan Mulder)- బాబర్ ఆజం(Babar Azam) మధ్య వాగ్వాదం జరిగింది. తన పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు బాబర్ వియాన్ ముల్దర్ వైపునకు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ముదరగా.. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మిశ్రమ ఫలితాలుకాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య జట్టు 2-0తో నెగ్గింది. అనంతరం వన్డే సిరీస్లో మాత్రం పర్యాటక పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. చరిత్రలోనూ ఎన్నడూ లేనివిధంగా.. సౌతాఫ్రికా గడ్డపై 3-0తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.అరుదైన ఘనతతద్వారా ప్రొటిస్ దేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జట్టుగా మహ్మద్ రిజ్వాన్ బృందం నిలిచింది. అయితే, టెస్టు సిరీస్లో మాత్రం పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో రెండు వికెట్ల తేడాతో షాన్ మసూద్ బృందం ఓటమిపాలైంది. ఇక శుక్రవారం మొదలైన రెండో టెస్టులోనూ కష్టాల్లో కూరుకుపోయింది.రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీకేప్టౌన్లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీ(259)తో విరుచుకుపడగా.. కెప్టెన్ తెంబా బవుమా(106), వికెట్ కీపర్ బ్యాటర్ వెరియెన్నె(100) కూడా శతక్కొట్టారు. మార్కో జాన్సెన్(62) అర్ధ శతకంతో రాణించగా.. కేశవ్ మహరాజ్ తన వంతుగా 40 పరుగులు సాధించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఏకంగా 615 పరుగులు స్కోరు చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 194 పరుగులకే కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్లో బాబర్ ఆజం 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. ప్రొటిస్ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీయగా.. క్వెనా మఫాకా, కేశవ్ మహరాజ్ చెరో రెండు, మార్కో జాన్సెన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.షాన్ మసూద్ శతకం.. సెంచరీ మిస్ అయిన బాబర్ ఆజంఈ నేపథ్యంలో.. మొదటి ఇన్నింగ్స్లో 200కు పైగా ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా పాకిస్తాన్ను ఫాలో ఆన్ ఆడిస్తోంది. దీంతో వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు శుభారంభం చేయగలిగింది. కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీ(145)తో చెలరేగగా.. బాబర్ ఆజం కూడా శతకం దిశగా పయనించాడు. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జాన్సెన్ బౌలింగ్లో బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, అంతకంటే ముందు అంటే.. ఆదివారం నాటి ఆటలో భాగంగా బాబర్ ఆజం- ప్రొటిస్ పేసర్ వియాన్ ముల్దర్ మధ్య గొడవ జరింది. తన బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి బాబర్ విఫలం కాగా.. ముల్దర్ బంతిని చేజిక్కించుకుని బ్యాటర్ వైపు బలంగా విసిరాడు.సౌతాఫ్రికా పేసర్ దూకుడు.. ఉరిమి చూసిన బాబర్ ఆజంఅప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన బాబర్ ఆజం వికెట్లకు కాస్త దూరంగానే ఉన్నా బంతి అతడికి తాకింది. దీంతో బాబర్ కోపోద్రిక్తుడై.. చూసుకోవా అన్నట్లుగా ముల్దర్వైపు ఉరిమి చూశాడు. అయితే, అతడు కూడా ఏమాత్రం తగ్గకుండా బాబర్ను చూస్తూ దూకుడుగా మాట్లాడాడు. దీంతో గొడవ పెద్దదయ్యే సూచన కనిపించగా అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించాడు. ఇక ఈ మ్యాచ్లో 352 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది.Fight moment between Babar Azam and Wiaan Mulder. 🥵Wiaan Mulder unnecessary throws the ball at Babar Azam & showing him verbal aggression. #BabarAzam𓃵 #PAKvsSA #SAvPAK pic.twitter.com/PZnPNTWELZ— Ahtasham Riaz (@ahtashamriaz22) January 5, 2025 -
సూపర్ సెంచరీతో సత్తా చాటిన రికెల్టన్
కేప్టౌన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్ట్లో సౌతాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (Ryan Rickelton) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రికెల్టన్ 134 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సల్మాన్ అఘా బౌలింగ్లో బౌండరీ బాది రికెల్టన్ సెంచరీ మార్కును అందుకున్నాడు. టెస్ట్ల్లో రికెల్టన్కు ఇది రెండో సెంచరీ. మరోవైపు కెప్టెన్ టెంబా బవుమా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బవుమా 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ విరామం సమయానికి రికెల్టన్ (106), బవుమా (51) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహజాద్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు.కాగా, పాక్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్లో జయభేరి మోగించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో 211, రెండో ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 301, రెండో ఇన్నింగ్స్లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.పాక్ తొలి ఇన్నింగ్స్లో కమ్రాన్ గులామ్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 5, కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఎయిడెన్ మార్క్రమ్ (89), కార్బిన్ బాష్ (81 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. పాక్ రెండో ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్ 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడింది. మార్క్రమ్ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. -
CT 2025: పాకిస్తాన్కు భారీ షాక్!
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్లో ఉన్న యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్(Saim Ayub) తీవ్రంగా గాయపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఫిజియోలు వచ్చి పరీక్షించినా ఫలితం లేకపోయింది.ఫలితంగా ఆయుబ్ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. కాగా 2023లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 22 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. గతేడాది వన్డే, టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 27 టీ20లలో 498 పరుగులు చేసిన ఆయుబ్.. ఏడు టెస్టుల్లో 364 రన్స్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు.సౌతాఫ్రికా గడ్డపై పాక్ చరిత్రఅయితే, వన్డేల్లో మాత్రం ఆయుబ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు శతకాల సాయంతో.. 515 పరుగులు సాధించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్లో ఓడిపోయిన పాక్.. వన్డేల్లో మాత్రం 3-0తో క్లీన్స్వీప్ చేసి.. సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.ఇక ఈ టూర్లో భాగంగా ఆఖరిగా టెస్టు సిరీస్లో తలపడుతున్న పాకిస్తాన్.. తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం ఆఖరిదైన రెండో టెస్టు మొదలైంది. కేప్టౌన్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్కు దిగింది.ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆయుబ్ఈ క్రమంలో ప్రొటిస్ ఇన్నింగ్స్లో ఏడో ఓవర్ను పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ వేయగా.. క్రీజులో ఉన్న రియాన్ రెకెల్టన్ షాట్ బాదాడు. బంతి గల్లీ, బ్యాక్వర్డ్ పాయింట్ల మీదుగా దూసుకుపోతుండగా.. ఫీల్డర్లు జమాల్- ఆయుబ్ దానిని ఆపే ప్రయత్నం చేయగా... బంతి జమాల్ చేజిక్కింది. సౌతాఫ్రికాలో వరుస సెంచరీలుఅయితే, ఈ క్రమంలో ఆయుబ్ కుడికాలి మడిమ మెలిక పడింది. తీవ్ర నొప్పితో అతడు మైదానం వీడాడు. అతడి స్థానంలో అబ్దుల్లా షఫీక్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చాడు. కాగా సయీమ్ ఆయుబ్ మడిమ విరిగినట్లు సమాచారం. దీంతో అతడు సొంతగడ్డపై జరిగే ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే పాక్కు మాత్రం గట్టి షాక్ తగిలినట్లే. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుపై పరుగుల వరద పారించడంతో పాటు సౌతాఫ్రికా గడ్డపై కూడా రెండు శతకాలతో చెలరేగాడు. ఇలాంటి ఇన్ ఫామ్ ఓపెనర్ సేవలను కోల్పోతే మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బలు తప్పవు! చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
చరిత్ర సృష్టించిన కగిసో రబాడ.. 108 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో సంచలనం విజయం సాధించిన ప్రోటీస్.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించింది.ఈ విజయంలో సౌతాఫ్రికా స్పెషలిస్టు సీమ్ బౌలర్ కగిసో రబాడ (26 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. 148 పరుగుల సులువైన లక్ష్య చేధనలో ప్రోటీస్ 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రబాడ, మార్కో జానెసన్ విరోచిత పోరాటం కనబరిచారు.వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 51 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ఊహించని విధంగా మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో స్పెషలిస్టు బ్యాటర్ అవతరమెత్తిన రబాడ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.రబాడ అరుదైన ఘనత..విజయవంతమైన లక్ష్య చేధనలో పది లేదా అంతకంటే ఎక్కువ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రబాడ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం పెర్సీ షెర్వాల్ పేరిట ఉండేది. అతడు 1906లో జోహన్నెస్బర్గ్లో ఇంగ్లండ్పై పదో వికెట్కు బ్యాటింగ్కు వచ్చి ఆజేయంగా 22 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో 108 ఏళ్ల షెర్వాల్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు.చదవండి: IND vs AUS: బెయిల్స్ మార్చిన స్టార్క్.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్! వీడియో వైరల్ -
పాకిస్తాన్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్కు సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2023-25 ఫైనల్కు ఆర్హత సాధించింది.సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 11 మ్యాచ్లు ఆడిన ప్రోటీస్.. 7 మ్యాచ్ల్లో విజయం సాధించగా, మరో మూడింట ఓటమి, ఒకటి డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో 66.670 విన్నింగ్ శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన ఒక స్ధానం కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు పోటీపడుతున్నాయి.రబాడ, జాన్సెన్ విరోచిత పోరాటం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమించింది. మార్కో జాన్సెన్, కగిసో రబడా విరోచిత పోరాటంతో తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. స్వల్ప లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కేవలం 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ 6 వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జాన్సెన్(16), కగిసో రబాడ(31)లు అడ్డుగా నిలుచునున్నారు. అచితూచి ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌటైంది.బాబర్ ఆజం (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో రాణించారు. అదేవిధంగా సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో 301 పరుగులు చేయగా.. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్లో 211 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కేప్టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs IND: మెల్బోర్న్ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు! -
పాక్ బ్యాటర్లకు చుక్కలు.. అరంగేట్రంలోనే నిప్పులు చెరిగిన పేసర్
పాకిస్తాన్తో మొదటి టెస్టులో సౌతాఫ్రికా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డేన్ పాటర్స(Dane Paterson)న్తో కలిసి అరంగేట్ర పేసర్ కార్బిన్ బాష్(Corbin Bosch) పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరి దెబ్బకు పాక్ బ్యాటింగ్ఆర్డర్ కుదేలైంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 211 పరుగులకే ఆలౌట్ అయింది.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లిన పాకిస్తాన్.. పరిమిత ఓవర్ల సిరీస్లో మిశ్రమ ఫలితాలు అందుకుంది. టీ20 సిరీస్ను ఆతిథ్య జట్టుకు 0-2తో కోల్పోయినా.. వన్డే సిరీస్లో మాత్రం 3-0తో క్లీన్స్వీప్ చేసి సత్తా చాటింది.టాపార్డర్ కుదేలుఈ క్రమంలో సౌతాఫ్రికా- పాకిస్తాన్(South Africa vs Pakistan) మధ్య సెంచూరియన్లో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. షాన్ మసూద్ బృందాన్ని బ్యాటింగ్ ఆహ్వానించింది.ఆది నుంచే సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో పాక్ టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(14), వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(4)ను పెవిలియన్కు పంపి పాటర్సన్ శుభారంభం అందించాడు.రాణించిన కమ్రాన్ గులామ్మరో ఓపెనర్, కెప్టెన్ షాన్ మసూద్(17)ను అవుట్ చేసిన కార్బిన్ బోష్.. సౌద్ షకీల్(14), అమీర్ జమాల్(28), నసీం షా(0)లను కూడా వెనక్కి పంపించాడు. మరోవైపు.. టాపార్డర్లో రెండు కీలక వికెట్లు తీసిన డేన్ పాటర్సన్.. డేంజరస్గా మారుతున్న కమ్రాన్ గులామ్(54)కు కూడా చెక్ పెట్టాడు. అదే విధంగా.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(27), సల్మాన్ ఆఘా(18) వికెట్లు కూడా కూల్చాడు. డేన్ పాటర్సన్పాటర్సన్ సరికొత్త చరిత్ర.. ఆల్టైమ్ రికార్డు సమంఈ క్రమంలో డేన్ పాటర్సన్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా తరఫున 35 వయస్సులో.. ఒక టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్గా నిలిచాడు. రెండుసార్లు ఈ ఘనత సాధించి.. రెగ్గీ స్వార్జ్(1910- 1912), గాఫ్ చబ్(1951)ల రికార్డును సమం చేశాడు.కార్బిన్ బాష్ అరుదైన ఘనతమరోవైపు.. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన 30 ఏళ్ల కార్బిన్ బాష్ కూడా ఓ అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్లో మొట్టమొదటి టెస్టులో తొలి బంతికే వికెట్ తీసిన ఐదో సౌతాఫ్రికా బౌలర్గా నిలిచాడు. షాన్ మసూద్ను అవుట్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. అంతకు ముందు.. హర్దూస్ విల్జోన్, డేన్ పెట్, బెర్ట్ వోగ్లర్, షెపో మోరేకీ సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించారు.పాక్ తొలి ఇన్నింగ్స్లో డేన్ పాటర్సన్ ఐదు వికెట్లు కూల్చగా.. కార్బిన్ బోష్ నాలుగు, మార్కో జాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో కమ్రాన్ గులామ్(54) టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్ -
చరిత్ర సృష్టించిన బాబర్.. ప్రపంచంలోనే మూడో ప్లేయర్గా..
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం(Babar Azam) పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేశాడు. ఈ క్రమంలో పాక్ అభిమానులు సైతం బాబర్ ఆట తీరుపై మండిపడుతున్నారు. పునరాగమనంలోనూ పాత కథే పునరావృతం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విఫలమైనా.. ఓ అరుదైన రికార్డుఇలా ఓవైపు బాబర్పై విమర్శల వర్షం కురుస్తుండగా.. అతడి ఫ్యాన్స్ మాత్రం బాబర్కు మరెవరూ సాటిరారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రొటిస్ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఓ అరుదైన రికార్డు సాధించడమే ఇందుకు కారణం.మూడు ఫార్మాట్లలోనూకాగా ఈ మ్యాచ్లో బాబర్ ఆజం చేసిన నాలుగు పరుగుల కారణంగా.. టెస్టుల్లో అతడు నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా పాక్ తరఫున.. టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.కోహ్లి, రోహిత్ తర్వాతఅంతేకాదు.. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగానూ బాబర్ ఆజం అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) మాత్రమే ఈ ఘనత సాధించారు.కాగా బాబర్ ఆజం ఇప్పటి వరకు 56 టెస్టుల్లో కలిపి 4001 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. 123 వన్డేల్లో 19 సెంచరీలు, 34 ఫిఫ్టీల సాయంతో బాబర్ 5957 రన్స్ పూర్తి చేసుకున్నాడు. కష్టాల్లో పాక్ జట్టుఅంతేకాదు.. 128 అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలు, 36 హాఫ్ సెంచరీ సాయంతో 4223 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సెంచూరియన్లో గురువారం మొదలైన తొలి టెస్టులో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ప్రొటిస్ బౌలర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలగా.. కమ్రాన్ గులామ్(54) అర్థ శతకంతో ఆదుకున్నాడు. ఇక మహ్మద్ రిజ్వాన్(27), అమీర్ జమాల్(28) మాత్రమే ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా వాళ్లంతా చేతులెత్తుశారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 195 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది షాన్ మసూద్ బృందం. కాగా ఇంగ్లండ్తో స్వదేశంలో తొలి మ్యాచ్ తర్వాత బాబర్ ఆజంపై వేటు పడగా.. మళ్లీ సౌతాఫ్రికా గడ్డపై అతడు టెస్టుల్లో పునరాగమనం చేశాడు.చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్ -
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. తుది జట్టును ప్రకటించిన పాకిస్తాన్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు అదే జట్టుతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా గురువారం నుంచి మొదలు కానుంది.ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టు(క్రిస్ట్మస్ తర్వాతి రోజు జరిగే మ్యాచ్) కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ తుది జట్టును ప్రకటించింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అక్టోబర్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో బాబర్ చివరిసారిగా పాక్ తరపున ఆడాడు.ఆ తర్వాత సిరీస్లో మిగిలిన రెండు టెస్టులకు పీసీబీ బాబర్ను పక్కన పెట్టింది. ఇప్పుడు మరోసారి అతడికి పాక్ క్రికెట్ బోర్డు అవకాశమిచ్చింది. మరోవైపు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేసిన అబ్దుల్లా షఫీక్పై పీసీబీ వేటు వేసింది.అతడి స్దానంలోనే బాబర్కు చోటు దక్కింది. ఈ మ్యాచ్లో నలుగురు పేసర్లతో పాక్ బరిలోకి దిగుతోంది. కాగా ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా జరుగుతోంది.తుది జట్లుపాకిస్థాన్: షాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ముహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, అమీర్ జమాల్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, ముహమ్మద్ అబ్బాస్.దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రేన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడా, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
పాక్తో తొలి టెస్టు.. తుది జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
స్వదేశంలో పాకిస్తాన్తో టెస్టు సిరీస్ను కోల్పోయిన సౌతాఫ్రికా(South Africa).. ఇప్పుడు అదే జట్టుతో టెస్టు సిరీస్లో తలపడేందుకు సిద్దమైంది. ఈ రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది.ఈ క్రమంలో మొదటి టెస్టు కోసం తమ తుది జట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ ప్రకటించింది. ఈ మ్యాచ్తో ఐడెన్ మార్క్రామ్ బెస్ట్ ఫ్రెండ్ కార్బిన్ బాష్ దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టనున్నాడు. బాష్ ఇటీవలే పాకిస్తాన్తో జరిగిన రెండో వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు.కాగా దక్షిణాఫ్రికాకు ఈ సిరీస్ చాలా కీలకం. ప్రోటీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు. సౌతాఫ్రికా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాతి స్ధానాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి.తొలి టెస్టుకు దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్: ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), కార్బిన్ బాష్, మార్కో జాన్సెన్, కగిసో రబడా, డేన్ ప్యాటర్సన్.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్లు ఎక్కడంటే? -
చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 36 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో పాక్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.94 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత ఓవర్లలో పాకిస్తాన్ 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో 271 పరుగులకు ప్రోటీస్ ఆలౌటైంది.కాగా ఈ సిరీస్లో అయూబ్కు రెండో సెంచరీ కావడం గమనార్హం. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా అయూబ్ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో అయూబ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన అయూబ్..వన్డే క్రికెట్లో దక్షిణాఫ్రికాపై రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడిగా అయూబ్ రికార్డులెక్కాడు. 22 సంవత్సరాల, 207 రోజుల వయస్సులో అయూబ్ ఈ ఫీట్ను నమోదు చేశాడు.ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనతను సాధించలేకపోయారు. కాగా వన్డేల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అతి వయష్కుడి రికార్డు మాత్రం అయూబ్ సహచరుడు అబ్దుల్లా షఫీక్ పేరిట ఉంది. 22 ఏళ్ల 4 రోజుల వయస్సులో షఫీక్ ఈ ఘనత సాధించాడు.వన్డేల్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు వీరేవన్డేల్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు వీరేఅబ్దుల్లా షఫీక్(పాకిస్తాన్)- 22 ఏళ్ల, 4 రోజుకేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 22 ఏళ్ల, 167 రోజులుసైమ్ అయూబ్ 22 ఏళ్ల, 207 రోజులుసైమ్ అయూబ్ 22 ఏళ్ల, 212 రోజులు రహ్మానుల్లా గుర్బాజ్ 22 ఏళ్ల 297 రోజులుచదవండి: IND vs AUS: ఆసీస్తో నాలుగో టెస్టు.. ముంబై యువ సంచలనానికి పిలుపు!? -
పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత
సౌతాఫ్రికా గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. వన్డే సిరీస్లో ఆతిథ్య ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సౌతాఫ్రికా 2-0తో నెగ్గింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో జయభేరి మోగించిన పాకిస్తాన్.. తాజాగా మూడో వన్డేలోనూ విజయం సాధించింది. జొహన్నస్బర్గ్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది.సయీమ్ అయూబ్ శతకంఇక వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో రిజ్వాన్ బృందం తొమ్మిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఓపెనర్ సయీమ్ అయూబ్(94 బంతుల్లో 101) శతకంతో చెలరేగగా.. బాబర్ ఆజం(52), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(53) హాఫ్ సెంచరీలు సాధించారు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(48), తయ్యబ్ తాహిర్(28) రాణించారు. టాపార్డర్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్(0)తో పాటు లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైంది. ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబడ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, క్వెనా మఫాకా, కార్బిన్ బాష్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. క్లాసెన్ ఒక్కడేఅయితే, లక్ష్య ఛేదనలో మాత్రం సౌతాఫ్రికా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఓపెనర్లలో టోనీ డి జోర్జి(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తెంబా బవుమా 8 పరుగులకే నిష్క్రమించాడు. వన్డౌన్లో వచ్చిన రాసీ వాన్ డెర్ డసెన్ 35 రన్స్తో రాణించగా.. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్(19) నిరాశపరిచాడు.ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్తో ప్రొటిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కేవలం 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించాడు. అయితే, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో తయ్యబ్ తాహిర్కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ పెవిలియన్ చేరడంతో ప్రొటిస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.36 పరుగుల తేడాతో పాక్ గెలుపుమార్కో జాన్సెన్(26), కార్బిన్ బాష్(40 నాటౌట్) కాసేపు పోరాడగా.. జార్న్ ఫార్చూన్(8), కగిసో రబడ(14), మఫాకా(0) విఫలమయ్యారు. ఫలితంగా 42 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికాపై.. డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీం నాలుగు వికెట్లు కూల్చగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా చెరో రెండు.. మహ్మద్ హొస్నేన్, సయీమ్ ఆయుబ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాను వన్డేల్లో వైట్వాష్ చేసిన తొలి జట్టుగాకాగా 1991లో అధికారికంగా తొలిసారి వన్డే సిరీస్ ఆడిన సౌతాఫ్రికా.. స్వదేశంలో క్లీన్స్వీప్ కావడం ఇదే మొదటిసారి. తద్వారా ప్రొటిస్ గడ్డపై సౌతాఫ్రికాను వైట్వాష్ చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంతవరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఫీట్ నమోదు చేసింది.అంతేకాదు.. సౌతాఫ్రికాపై పాకిస్తాన్కు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్ విజయం. ఈ ఘనత సాధించిన తొలి జట్టు కూడా పాకిస్తాన్ కావడం విశేషం. ఇక మూడో వన్డేలో సెంచరీ చేసిన సయీమ్ ఆయుబ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.చదవండి: VHT 2024: అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్ను ఊదిపడేసిన కర్ణాటక -
పాకిస్తాన్తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ
పాకిస్తాన్తో మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్ సమర్పించుకున్న ప్రొటిస్.. కీలక పేసర్ సేవలను కోల్పోనుంది. ఫాస్ట్ బౌలర్ ఒట్నీల్ బార్ట్మన్ గాయం కారణంగా పాక్తో మూడో వన్డేకు దూరం కానున్నాడు.వన్డే సిరీస్లో విఫలంకాగా సొంతగడ్డపై టీ20 సిరీస్లో పాకిస్తాన్ను 2-0తో చిత్తు చేసిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. తొలి వన్డేలో మూడు వికెట్లు, రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో పాక్ చేతిలో ఓటమి పాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కోల్పోయింది.ఇక జొహన్నస్బర్గ్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని తెంబా బవుమా బృందం పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్కు ముందు ప్రొటిస్ జట్టుకు షాక్ తగిలింది. పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ గాయం బారినపడ్డాడు. దీంతో అతడు మూడో వన్డేకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.మోకాలి నొప్పి వల్లరెండో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే బార్ట్మన్కు మోకాలి నొప్పి వచ్చింది. దీంతో ఆ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పటికీ అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. కాగా టీ20 సిరీస్లో మూడు వికెట్లు తీసిన బార్ట్మన్.. తొలి వన్డేలోనూ రాణించాడు. ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.ఆల్రౌండర్కు పిలుపుఇక పాకిస్తాన్ చేతిలో వైట్వాష్ గండం నుంచి తప్పించుకునేందుకు సౌతాఫ్రికా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బార్ట్మన్ స్థానంలో ఆల్రౌండర్ కార్బిన్ బాష్ను వన్డే జట్టులో చేర్చింది. కాగా బార్ట్మన్ కంటే ముందే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా గాయం వల్ల సిరీస్కు దూరమయ్యాడు.పాకిస్తాన్దే వన్డే సిరీస్కేప్టౌన్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్ జట్టు... దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. పాకిస్తాన్ జట్టుకు విదేశాల్లో ఇది వరుసగా రెండో సిరీస్ విజయం కావడం విశేషం.టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80; 7 ఫోర్లు, 3 సిక్స్లు), మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (95 బంతుల్లో 73; 7 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి దూకుడుతో పాకిస్తాన్ చివరి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎమ్పాకా 4, యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97; 8 ఫోర్లు, 4 సిక్స్లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా... తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోయారు.కెప్టెన్ తెంబా బవుమా (12), టోనీ (34), డసెన్ (23), మార్క్రమ్ (21), మిల్లర్ (29) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4, నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టిన కమ్రాన్ గులామ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
'నోరు మూసుకొని వెళ్లి ఆడు'.. రిజ్వాన్ ఓవరాక్షన్! వీడియో వైరల్
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది.అయితే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది.అసలేం ఏమి జరిగిందంటే?దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన పాక్ పేసర్ హారీస్ రవూఫ్ ఆఖరి బంతిని క్లాసెన్కు బౌన్సర్గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో క్లాసెన్ను రవూఫ్ ఏదో అన్నాడు. అందుకు ప్రోటీస్ వికెట్ కీపర్ బ్యాటర్ సైతం గట్టిగా బదులిచ్చాడు. దీంతో అంపైర్లు జోక్యం చేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మహ్మద్ రిజ్వాన్ అనవసరంగా జోక్యం చేసుకుని క్లాసెన్ వైపు వేలు చూపిస్తూ ముందు వెళ్లి సైలెంట్గా ఆడు అన్నట్లు సైగ చేశాడు.దీంతో చిర్రెత్తిపోయిన క్లాసెన్ సైతం తన నోటికి పని చెప్పాడు. క్లాసన్ సైతం రిజ్వాన్ పై మాటలతో మండిపడ్డాడు. ఈ క్రమంలో అంపైర్లు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.క్లాసెన్కు ఫైన్..కాగా ఈ మ్యాచ్లో క్లాసెన్ ఒంటరి పోరాటం చేశాడు. 97 పరుగులు చేసిన క్లాసెన్ ఆఖరి వికెట్గా వెనుదిరగాడు. దీంతో ఔటైన కోపంలో క్లాసెన్ తన కాలితో స్టంప్స్ను పడగొట్టాడు. ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్గా తీసుకుంది. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు మేరకు క్లాసెన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. Fight on the field between Mohammad Rizwan and Heinrich Klaasen.💀😭 pic.twitter.com/XRb4yjYCl4— MEER YASIR🇵🇸 (@MY_EDITS_56) December 19, 2024 -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వన్డే క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. గత నెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు సౌతాఫ్రికా గడ్డపై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గురువారం కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై 81 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది.తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో రిజ్వాన్ సేన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఓ వరల్డ్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. 21వ శతాబ్దంలో సౌతాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డేల సిరీస్ను గెలుచుకున్న తొలి జట్టుగా పాక్ చరిత్ర సృష్టించింది.దక్షిణాఫ్రికాలో పాక్కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ విజయం. ఇంతకుముందు 2013, 2021లో పాక్ వన్డే సిరీస్లను పాక్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన మెన్ ఇన్ గ్రీన్.. మరో వన్డే సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది.ఓవరాల్గా 7 సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు.. మూడు సార్లు వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. పాక్ తర్వాత ఆస్ట్రేలియా 10 పర్యటనల్లో మూడు సార్లు సఫారీ గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కానీ ఆసీస్ మాత్రం వరుసగా సిరీస్ విజయాలు సాధించలేకపోయింది. ఇకు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే డిసెంబర్ 22న జోహాన్స్బర్గ్ వేదికగా జరగనుంది.చదవండి: జాకెర్ అలీ మెరుపు ఇన్నింగ్స్.. వెస్టిండీస్ క్లీన్స్వీప్ -
SA vs Pak: పాక్ ఆల్రౌండ్ ప్రదర్శన.. సౌతాఫ్రికా చిత్తు
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. సమిష్టిగా రాణించి 81 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా టీ20, వన్డే, టెస్టులు ఆడేందుకు పాక్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య సౌతాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. పర్ల్ వేదికగా మంగళవారం నాటి తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో గెలిచిన రిజ్వాన్ బృందం.. కేప్టౌన్ మ్యాచ్లోనూ ఆకట్టుకుంది.ఓపెనర్లు విఫలంన్యూలాండ్స్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫీక్ అబ్దుల్లా డకౌట్ కాగా.. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ 25 పరుగులకే వెనుదిరిగాడు.కమ్రాన్ గులామ్ మెరుపు అర్ధ శతకంఅయితే, వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(95 బంతుల్లో 73) మెరుగ్గా రాణించగా.. రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్(82 బంతుల్లో 80)తో మెరిశాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(33) ఫర్వాలేదనిపించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 329 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది.ప్రొటిస్ జట్టు బౌలర్లలో యువ పేసర్ క్వెనా మఫాకా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ మూడు, బిజోర్న్ ఫార్చూన్, పెహ్లూక్వాయో తలా ఒక వికెట్ తీశారు. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్లో ఓపెనర్లు కెప్టెన్ తెంబా బవుమా(12), టోనీ డి జోర్జీ(34), వన్డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(23) విఫలమయ్యారు.హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్ఇక మిడిలార్డర్లో ఐడెన్ మార్క్రమ్(21) నిరాశపరచగా.. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. 74 బంతుల్లో అతడు 8 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 97 పరుగులు సాధించి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక డేవిడ్ మిల్లర్(29) కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు.సిరీస్ పాక్ కైవసంఈ క్రమంలో 43.1 ఓవర్లకే సౌతాఫ్రికా కథ ముగిసిపోయింది. ఆతిథ్య ప్రొటిస్ను 248 పరుగులకే పరిమితం చేసిన పాకిస్తాన్.. 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది నాలుగు, నసీం షా మూడు, అబ్రార్ అహ్మద్ రెండు, సల్మాన్ ఆఘా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జొహన్నస్బర్గ్లో జరుగుతుంది.చదవండి: IND W Vs WI W: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం -
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్
కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 19) రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్కు శుభారంభం లభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో మూడో టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. పాక్ క్రికెట్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది.ధోని రికార్డుపై కన్నేసిన బాబర్ ఆజమ్గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ లాంగ్ స్టాండింగ్ బ్యాటింగ్ రికార్డుపై కన్నేశాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో బాబర్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఏడు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4732 పరుగులు చేశాడు. మరోవైపు ధోని SENA దేశాల్లో 38 హాఫ్ సెంచరీ సాయంతో 5273 పరుగులు చేశాడు. SENA దేశాల్లో ధోని, బాబర్ ప్రస్తుతం 38 యాభై ప్లస్ స్కోర్లు కలిగి ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డేలో బాబర్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. SENA దేశాల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని అధిగమిస్తాడు.తొలి వన్డేలో పాక్ ఘన విజయంతొలి వన్డేలో అఘా సల్మాన్ ఆల్రౌండర్ షో, సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డేలో బాబర్ ఆజమ్ 23 పరుగులు చేసి ఓట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో బాబర్కు శుభారంభం లభించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. బాబర్ గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమవుతున్నాడు. అతను హాఫ్ సెంచరీ మార్కు తాకి కూడా చాన్నాళ్లవుతుంది. -
పాక్తో టెస్టులు: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు కూడా ప్రొటిస్ బోర్డు వెనుకాడటం లేదు.గాయం బారినపడ్డ కేశవ్ మహరాజ్, వియాన్ ముల్దర్లను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. కాగా పాకిస్తాన్తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్ బోర్డు బుధవారం తమ జట్టును ప్రకటించింది.తొలి పిలుపుపదహారు మంది సభ్యులున్న ఈ టీమ్లో అన్క్యాప్డ్ ప్లేయర్కు చోటిచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కార్బిన్ బాష్కు తొలిసారి పిలుపునిచ్చింది. అదే విధంగా.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వేలి నొప్పి నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ను కూడా ఈ జట్టులో చేర్చింది.కాగా తొలి వన్డే సందర్భంగా గాయపడ్డ కేశవ్ మహరాజ్ కోలుకోని పక్షంలో.. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సెనూరన్ ముత్తుస్వామిని జట్టుకు ఎంపిక చేయనున్నారు. అదే విధంగా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ముల్దర్ ఫిట్నెస్ సాధిస్తే.. బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కు ఉద్వాసన పలుకనున్నారు.క్వెనా మఫాకా కూడాఇక తెంబా సారథ్యంలో పాక్తో టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించిన బాష్.. ఇప్పటి వరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 40.46 సగటుతో పరుగులు రాబట్టడంతో పాటు.. 72 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. మరో పేసర్, పద్దెమినిదేళ్ల క్వెనా మఫాకా కూడా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.అయితే, పేస్ సూపర్స్టార్లు లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జిలతో పాటు నండ్రీ బర్గర్, లిజాడ్ విలియమ్స్ తదితరులు సెలక్షన్కు అందుబాటులో లేరు. మరోవైపు.. కగిసో రబడ, మార్కో జాన్సెన్ పాక్తో తొలి వన్డే ఆడినా.. ఆ తర్వాత నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు. టెస్టుల నేపథ్యంలో బోర్డు వారికి రెస్ట్ ఇచ్చింది. కాగా పాక్తో ఒక్క టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందు వరుసలో ఉంటుంది. ఇక పాక్తో సౌతాఫ్రికా టెస్టులకు సెంచూరియన్, కేప్టౌన్ వేదికలు. పాకిస్తాన్తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టుతెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనురన్ ముత్తుస్వామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్).చదవండి: WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా? -
సల్మాన్ ఆల్రౌండ్ షో.. సౌతాఫ్రికాపై పాక్ విజయం
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు మాత్రమే చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(97 బంతుల్లో 86 7 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. మార్క్రమ్(35), రికెల్టన్(36), టోనీ డీజోర్జీ(33) రాణించారు. పాక్ బౌలర్లలో పార్ట్టైమ్ స్పిన్నర్ సల్మాన్ ఆఘా 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ ఆర్బర్ ఆహ్మద్ రెండు, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ తలా వికెట్ సాధించారు.అయూబ్ సూపర్ సెంచరీ..ఇక 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 119 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 109 పరుగులు చేశాడు.మరోవైపు బంతితో మాయ చేసిన సల్మాన్ అలీ అఘా బ్యాట్తో కూడా సత్తాచాటాడు. 90 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, బార్టమన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమ్సీ, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 19న కేప్టౌన్ వేదికగా జరగనుంది. -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ను అధిగమించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పాక్కు చేదు అనుభవంసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా టూర్కు వెళ్లింది. ఈ పర్యటన టీ20 సిరీస్తో మొదలుకగా.. పాక్కు చేదు అనుభవం ఎదురైంది.డర్బన్లో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ప్రొటీస్ జట్టు చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. సెంచూరియన్లో శుక్రవారం నాటి రెండో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. సౌతాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది పాక్.సయీమ్ ఆయుబ్ ధనాధన్ ఇన్నింగ్స్ వృథాఓపెనర్ సయీమ్ ఆయుబ్(57 బంతుల్లో 98 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్కు తోడు.. బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ సూపర్ సెంచరీ(63 బంతుల్లో 117), రాసీ వాన్ డెర్ డసెన్(38 బంతుల్లో 66) అద్భుత అర్ధ శతకం కారణంగా పాక్కు ఓటమి తప్పలేదు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఘనంగా(31, 3 ఫోర్లు, ఒక సిక్సర్)నే ఇన్నింగ్స్ను ఆరంభించినా.. దానిని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ పొట్టి ఫార్మాట్లో అతడు అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.గేల్ ప్రపంచ రికార్డును బద్దలుసౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం షార్టెస్ట్ క్రికెట్లో ఓవరాల్గా 11,020 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. పదకొండు వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్కు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ 298 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే, ఓవరాల్గా మాత్రం అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో గేల్ యూనివర్సల్ బాస్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 14562 టీ20 రన్స్ ఉన్నాయి.టీ20 క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లో 11000 పరుగులు సాధించిన ఆటగాళ్లు1. బాబర్ ఆజం- 298 ఇన్నింగ్స్2. క్రిస్ గేల్- 314 ఇన్నింగ్స్3. డేవిడ్ వార్నర్- 330 ఇన్నింగ్స్4. విరాట్ కోహ్లి- 337 ఇన్నింగ్స్.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
SA Vs PAK: రీజా హెండ్రిక్స్ విధ్వంసకర సెంచరీ.. పాక్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
పాకిస్తాన్తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాక్తో టీ20 సిరీస్ను 2-0తో ప్రొటీస్ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్.. సెంచరీ మిస్ఇందులో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా పదకొండు పరుగుల తేడాతో పాక్పై గెలిచింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా రెండో టీ20లో ఇరుజట్లు శుక్రవారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(11) విఫలం కాగా.. సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్తో అదరగొట్టాడు.మొత్తంగా యాభై ఏడు బంతులు ఎదుర్కొన్న ఆయుబ్ పదకొండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 98 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఆరో స్థానంలో వచ్చిన ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఒట్నీల్ బార్ట్మన్, డయాన్ గాలియెమ్ రెండేసి వికెట్లు తీయగా.. జార్జ్ లిండే ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.రీజా హెండ్రిక్స్ విధ్వంసం.. ‘తొలి’ శతకంపాక్ యువ పేసర్ జహన్బాద్ ఖాన్ ఓపెనర్ రియాన్ రికెల్టన్ను రెండు పరుగుల వద్దే పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్(12)ను కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ విధ్వంసం ముందు పాక్ బౌలర్లు తలవంచకతప్పలేదు.రీజా 63 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్స్ల సాయంతో ఏకంగా 117 పరుగులు సాధించాడు. కాగా అంతర్జాతీయ టీ20లలో 35 ఏళ్ల రీజా హెండ్రిక్స్కు ఇదే తొలి శతకం కావడం విశేషం.సిరీస్ సౌతాఫ్రికా కైవసంఇక రీజాకు తోడుగా రాసీ వన్ డెర్ డసెన్ మెరుపు ఇన్నింగ్స్(38 బంతుల్లో 66)తో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రీజా విధ్వంసకర సెంచరీ, డసెన్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా సౌతాఫ్రికా 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించిన ప్రొటీస్.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక పాక్ బౌలర్లలో జహన్బాద్ ఖాన్కు రెండు, అబ్బాస్ ఆఫ్రిదికి ఒక వికెట్ దక్కాయి.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో టీ20 శనివారం జరుగనుంది. జొహన్నస్బర్గ్లోని ది వాండరర్స్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
పాక్తో వన్డే సిరీస్.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుల రీఎంట్రీ
పాకిస్తాన్తో వన్డే సిరీస్కు క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. తెంబా బవుమా సారథ్యంలోని ఈ జట్టులో క్వెనా మఫాకాకు తొలిసారి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్తో కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్ పునరాగమనం చేయనుండగా.. టీ20 వీరులు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ సైతం తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డిసెంబరు 10న తొలి టీ20 జరుగగా.. ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో పాక్పై గెలిచింది. ఇక డిసెంబరు 13న రెండో, డిసెంబరు 14న మూడో టీ20 జరుగునుండగా.. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.‘అన్క్యాప్డ్’ ప్లేయర్కు చోటుఈ నేపథ్యంలో సౌతాఫ్రికా గురువారం తమ వన్డే జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్తో పద్దెమినిదేళ్ల లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫాకా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్వెనా మఫాకా.. పాక్తో తొలి టీ20లో అదరగొట్టాడు. తన అద్భుత బౌలింగ్తో బాబర్ ఆజంను అవుట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.గాయాల బెడదమరోవైపు.. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కాలి గాయం కారణంగా.. మిగిలిన రెండు టీ20లు, వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇక వేలు విరిగిన కారణంగా వియాన్ ముల్దర్, తుంటినొప్పి వల్ల లుంగి ఎంగిడి, గజ్జల్లో గాయం కారణంగా గెరాల్డ్ కోయెట్జి, వెన్నునొప్పితో బాధపడుతున్న నండ్రీ బర్గర్ సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయారు.వారికి పునఃస్వాగతంఇదిలా ఉంటే.. పాక్తో టీ20 సిరీస్లో విశ్రాంతి తీసుకున్న రబడ, స్టబ్స్, కేశవ్ మహరాజ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. తాము తమ వన్డే జట్టు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. క్వెనా మఫాకాకు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని.. క్లాసెన్, మిల్లర్లకు వన్డే జట్టులోకి తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.పాకిస్తాన్తో వన్డే సిరీస్కు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుతెంబా బవుమా (కెప్టెన్), ఒట్ట్నీల్ బార్ట్మన్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే- డిసెంబరు 17- పర్ల్- బోలాండ్ పార్క్రెండో వన్డే- డిసెంబరు 19- సెంచూరియన్- సూపర్స్పోర్ట్ పార్క్మూడో వన్డే- డిసెంబరు 22- జొహన్నస్బర్గ్- ది వాండరర్స్ స్టేడియం.చదవండి: భారత్తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్పై వేటు! -
షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు..
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో పాక్ ఓడినప్పటకి ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ పీటర్ను ఔట్ చేయడంతో అఫ్రిది వందో టీ20 వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఈ పాకిస్తానీ స్పీడ్ స్టార్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆల్ ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాలుగో ప్లేయర్గా అఫ్రిది రికార్డులకెక్కాడు. అఫ్రిది ఇప్పటివరకు టెస్టుల్లో 116 వికెట్లు పడగొట్టగా.. వన్డేల్లో 112, టీ20ల్లో 100 వికెట్లు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ అగ్రస్ధానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ కూడా అఫ్రిదినే కావడం గమనార్హం.👉మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్లు వీరేబౌలర్టెస్టు వికెట్లువన్డే వికెట్లుటీ20 వికెట్లుటిమ్ సౌథీ(న్యూజిలాండ్)389221164షకీబ్ అల్హసన్(బంగ్లాదేశ్)246317149లసిత్ మలింగ(శ్రీలంక)101338107షాహీన్ అఫ్రిది(పాక్)116112100 -
సౌతాఫ్రికా టూర్కు పాక్ జట్టు ప్రకటన: బాబర్ రీ ఎంట్రీ! అతడికి నో ఛాన్స్
సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మూడు టీమ్లలోనూ చోటు దక్కించుకోగా.. టెస్టు జట్టులో ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిది పేరు మాత్రం లేదు.కాగా మూడు వన్డే, మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. డిసెంబరు 10న తొలి టీ20తో ఈ టూర్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పీసీబీ బుధవారం ఈ సిరీస్లకు సంబంధించి మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది.టెస్టులలో బాబర్ పునరాగమనం.. అతడికి మాత్రం చోటు లేదుటెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్గా కొనసాగనుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్లకు మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మూడు జట్లలో స్థానం సంపాదించాడు. కాగా ఇంగ్లండ్తో సొంతగడ్డపై తొలి టెస్టులో విఫలమైన తర్వాత.. మిగిలిన రెండు టెస్టులు ఆడకుండా బాబర్పై వేటు పడింది. అతడితో పాటు షాహిన్నూ తప్పించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. యువ పేసర్ నసీం షా కేవలం టెస్టు, వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది టీ20, వన్డేలు మాత్రమే ఆడి.. టెస్టులకు దూరంగా ఉండనున్నాడు.తప్పించారా? రెస్ట్ ఇచ్చారా?వచ్చే ఏడాది సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షాహిన్కు పీసీబీ ఈ మేర పనిభారం తగ్గించి.. విశ్రాంతినివ్వాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల క్వైద్-ఇ-ఆజం ట్రోఫీలో ఐదు మ్యాచ్లలో 31 వికెట్లతో సత్తా చాటిన రైటార్మ్ సీమర్ మహ్మద్ అబ్బాస్ దాదాపు మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.తొలిసారి వన్డే జట్టుకు సూఫియాన్ ఎంపికఅదే విధంగా.. ఖుర్రం షెహజాద్, మీర్ హంజా కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. షాజిద్ ఖాన్ మాత్రం మిస్సయ్యాడు. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా నొమన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక లెగ్ స్పిన్నర్ సూఫియాన్ మోకీం తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య డిసెంబరు 10, 13, 14 తేదీల్లో టీ20... డిసెంబరు 17, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అదే విధంగా.. డిసెంబరు 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్కు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికాతో టెస్టులకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, నొమన్ అలీ, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.సౌతాఫ్రికాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సుఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).సౌతాఫ్రికాతో టీ20లకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సూఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
WC 2023: దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
ICC WC 2023- Baba Azam And Co. Fined: వన్డే వరల్డ్కప్-2023లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికాతో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి పాక్ జట్టుకు భారీ జరిమానా విధించింది. కాగా చెన్నైలోని చెపాక్ వేదికగా బాబర్ ఆజం బృందం శుక్రవారం సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో పాక్ విధించిన లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా టాపార్డర్ విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ 91 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, అతడు అవుటైన తర్వాత ఆఖరి వరకు హైడ్రామా నెలకొంది. గెలుపునకు చేరువగా వచ్చిన సఫారీలు 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో చిక్కుల్లో పడింది. సెమీస్ ఆశలపై నీళ్లు! మరోవైపు.. తొమ్మిదో వికెట్ పడగొట్టిన పాకిస్తాన్ ఆఖరి వికెట్ కోసం 11 బంతులపాటు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేశవ్ మహరాజ్ 48వ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాది సౌతాఫ్రికా విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో ఓటమిపాలైన పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి. View this post on Instagram A post shared by ICC (@icc) వరుసగా నాలుగో పరాజయంతో సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించే స్థితికి చేరుకుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనట్లు తేలడంతో ఐసీసీ ఫైన్ వేసింది. జట్టు మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రతీ ఓవర్కు ఐదు శాతం చొప్పున.. మొత్తంగా ‘‘నిర్ణీత సమయంలో వేయాల్సిన దానికంటే నాలుగు ఓవర్లు తక్కువగా వేసినందుకు.. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి సంబంధించిన ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆలస్యమైన ప్రతీ ఓవర్కు ఐదు శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించడం జరుగుతుంది’’ అని తెలిపింది. ఈ విషయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తమ తప్పును అంగీకరించడంతో ఎటువంటి విచారణ అవసరం లేకుండా ఫైన్ వేసినట్లు వెల్లడించింది. జీతాల్లేవు.. ఆ విషయంలో పీసీబీ వెనుకడుగు కాగా వరుస ఓటముల నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా బోర్డు నుంచి మద్దతు కరువైనట్లు ఆటగాళ్లు ఆవేదన చెందుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో క్రికెటర్లతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న పాక్ క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గే ఆలోచనలో ఉందని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు చెప్తున్నారు. అంతేకాదు ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదని సమాచారం. తాజాగా ఇలా మ్యాచ్ ఫీజులో కోత పడటంతో పాక్ జట్టు పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే! -
WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా?
ICC WC 2023- Pakistan Semis Chances Still Alive?: వన్డే వరల్డ్కప్-2023 ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన పాకిస్తాన్.. ఇప్పుడు కనీసం సెమీస్ చేరుతుందా లేదా అన్న స్థాయికి పడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి.. విమర్శలు మూటగట్టుకుంటోంది. ఉప్పల్లో వరుస విజయాలు వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్లో తొలుత పసికూన నెదర్లాండ్స్తో తలపడింది బాబర్ ఆజం బృందం. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 81 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐసీసీ టోర్నీలో శుభారంభం చేసింది. ఆ తర్వాత అదే వేదికపై శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఎప్పుడైతే దాయాది టీమిండియా చేతిలో పాక్ చిత్తైందో అప్పటి నుంచి జట్టు రాత మారిపోయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చరిత్రను పునరావృతం చేస్తూ భారత జట్టు పాకిస్తాన్ను 8వసారి మట్టికరిపించింది. టీమిండియా దెబ్బ తర్వాత అన్నీ ఓటములే సొంతగడ్డపై చిరకాల ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇది మొదలు.. టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్కు వరుసగా ఓటములే ఎదురయ్యాయి. చెపాక్లో ఘోర పరాభవాలు.. ఎన్నడూ లేని విధంగా బెంగళూరులో ఆస్ట్రేలియా చేతిలో 62 పరుగుల తేడాతో ఓడిన బాబర్ బృందం.. వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ ముందు కూడా తలవంచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరీ దారుణంగా 8 వికెట్ల తేడాతో అఫ్గన్ భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ సీన్ రిపీట్ అయింది. చెపాక్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్లో అదృష్టం సౌతాఫ్రికాను వరించడంతో పాకిస్తాన్కు మరో ఓటమి తప్పలేదు. ఈ శతాబ్దంలో వరల్డ్కప్లో పాక్ తొలిసారి సఫారీల చేతిలో పరాజయం పాలైంది. దీంతో సెమీస్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే! అయితే, సాంకేతికంగా పాకిస్తాన్ ఇంకా రేసులో ఉన్నట్లే! ఎలా అంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్తో జరుగనున్న మ్యాచ్లలో పాక్ భారీ విజయాలు సాధించి రన్రేటును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. తద్వారా పాకిస్తాన్ ఖాతాలో 10 పాయింట్లు చేరతాయి. అయినప్పటికీ నేరుగా సెమీస్ చేరే ఛాన్స్ ఉండదు. ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే సౌతాఫ్రికా(భారీ రన్రేటు), టీమిండియా 10 పాయింట్లో పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడిన పాక్ భవితవ్యం న్యూజిలాండ్ 8, ఆస్ట్రేలియా 6 పాయింట్లతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మిగిలిన మ్యాచ్లన్నింటి(ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాక్, శ్రీలంక)లో ఓడిపోతే.. కేవలం ఎనిమిది పాయింట్లతో ఉంటుంది. అప్పుడు పాక్కు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే విధంగా.. ఆస్ట్రేలియా కూడా తమకు మిగిలిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిపోతే పాక్కు ఛాన్స్ ఉంటుంది. తమ తదుపరి మ్యాచ్లలో ఆసీస్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి.. బంగ్లాదేశ, అఫ్గనిస్తాన్లలో ఏదో ఒకదానిపై గెలిచినా 8 పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఈ అవకాశం పాక్కు దక్కుతుంది. ఇంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? చూద్దాం అలా కాక కేవలం న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో కంగారూలు ఓడి అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లపై గెలుపొందితే.. పాకిస్తాన్తో పాటు రన్రేటుతో పోటీపడాల్సి ఉంటుంది. ఇదేమీ కాకుండా ఆసీస్ మూడూ గెలిచినా.. న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికా, టీమిండియా తమకు మిగిలిన మ్యాచ్లలో కనీసం రెండు గెలుపొందినా పాక్ ఇంటిబాటపట్టాల్సిందే! అదీ సంగతి.. గత నాలుగు మ్యాచ్లలో ఒక్కటి గెలిచినా పాకిస్తాన్కు ఈ పరిస్థితి దాపురించేది కాదు! కెప్టెన్ బాబర్ ఆజం అన్నట్లు ఏం జరుగుతుందోనంటూ పాక్ అభిమానులు వేచి చూడాల్సిందే. చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే! View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు లేవు.. ఎలా ఆడుతారు మరి?
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ వరుసగా నాలుగో మ్యాచ్లో ఓటమి చవిచూసింది. ధర్మశాల వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో పాక్ ఓటమి పాలైంది. దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి. కాగా ఈ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడింది. కానీ చివరకు విజయం మాత్రం ప్రోటీస్నే వరించింది. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్ల్లో గెలిచినా పాక్ సెమీస్ చేరే అవకాశం ఐదు శాతమే ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఐదు నెలలుగా ఆటగాళ్లకు జీతం చెల్లించడం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జీతాలు చెల్లించడం లేదని లతీఫ్ ఆరోపించాడు. అదే విధంగా పీసీబీ నుంచి ఆటగాళ్లకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా అంతకుముందు పాక్ డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు ఉన్నాయని పాకిస్తాన్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీటీవీతో లతీఫ్ మాట్లాడుతూ.. “పాకిస్తానీ మీడియాలో చాలా విషయాలు చక్కెర్లు కొడుతున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలే. మీకు అస్సలు నిజాలను నేను చెబుతాను. గత రెండు రోజులుగా పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్తో మాట్లాడేందుకు బాబర్ ఆజం ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడు స్పందించడం లేదు. బాబర్ పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్, డైరెక్టర్ ఉస్మాన్ వాల్హాలకు కూడా ఆజం మెసేజ్ చేశాడు. వారు కూడా అతడికి రిప్లే ఇవ్వలేదు. అస్సలు కెప్టెన్ కాల్ చేస్తే ఎందుకు స్పందించడం లేదు? అందుకు కారణం ఏమిటి? పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఏదో జరుగుతోంది" అంటూ పేర్కొన్నాడు. అదే విధంగా ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు గురించి లతీప్ మాట్లాడుతూ.. "వరల్డ్కప్కు ముందు ఆటగాళ్లు సంతకం చేసిన సెంట్రల్ కాంట్రాక్టులను పునఃపరిశీలిస్తామని పీసీబీ చెప్పింది. దీంతో సెంట్రల్ కాంట్రాక్ట్ల ఒప్పందం ఇంకా ఒక కొలిక్కి కాలేదు. ఈ క్రమంలో గత ఐదు నెలలుగా ఆటగాళ్లకు జీతాలు అందలేదు. అటువంటిప్పుడు వారు ఎలా ఆడుతారు? నేను ఈ విషయాన్ని మరి పెద్దది చేయాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్లో ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెట్బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్లను ఇచ్చింది. మెన్స్ టీమ్లోని క్రికెటర్లతో మూడేళ్ల ఒప్పందానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ద్వారా లభించే ఆదాయంలో మూడు శాతం మేర చెల్లించేందుకు అంగీకరించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని పునఃపరిశీలిస్తామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: World Cup 2023: ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. వరల్డ్కప్ అరంగేట్రంలోనే! -
అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే!
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: ‘‘మ్యాచ్ సాగుతూ.. ఉంది. ఎనిమిది వికెట్లు పడ్డాయి.. ఆ తర్వాత తొమ్మిదో వికెట్ కూడా తీశారు. అయినా.. గెలుపు కోసం అంతలా తంటాలు.. అసలు ఇదేం కెప్టెన్సీ? అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమైందా? టెయిలెండర్లకు సింగిల్స్ తీసే అవకాశం ఇచ్చావు. నీ ఆలోచన ఏంటో అర్థం కాలేదు. ఇందుకు మీరు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అందరికీ అర్థమైపోయింది. ఇంకా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా.. ప్రధాన బౌలర్ల కోటా పూర్తయ్యేటప్పటికే మ్యాచ్ ముగించాల్సింది. ఆఖర్లో మీకు మిగిలిన ఆప్షన్లు స్పిన్ బౌలర్లు మాత్రమే. ఇదంతా తెలిసి కూడా లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సింగిల్స్కు అనుమతించేలా ఫీల్డింగ్ సెట్ చేశావంటే నిన్ను ఏమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నలుగురైదుగురు సర్కిల్ లోపల.. మిగిలిన వాళ్లు బౌండరీ వద్ద.. ఇలా ఫీల్డ్ సెట్ చేసి నువ్వేం సాధించావు? ఒకవేళ సౌతాఫ్రికా ఆటగాళ్లను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చి మ్యాచ్ను కాపాడుకుందామని భావించావా? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నీ కెప్టెన్సీ నాకైతే అంతుపట్టలేదు. ప్రధాన బౌలర్లు బరిలోకి దిగినపుడు స్లిప్ పెట్టాలి.. సర్కిల్ లోపల ఎక్స్ట్రా ఫీల్డర్లను సెట్ చేయాలి అని తెలియదా?’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కెప్టెన్సీపై మండిపడ్డాడు. చెత్త కెప్టెన్సీ సౌతాఫ్రికాతో మ్యాచ్లో సారథిగా బాబర్ పూర్తిగా విఫలమయ్యాడంటూ విమర్శలు గుప్పించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చేజేతులా ఓటమిని ఆహ్వానించావంటూ బాబర్ తీరును తప్పుబట్టాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ మైదానంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పాక్పై సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కి టేబుల్ టాపర్గా నిలిచింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం సెమీ ఫైనల్ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి. నీ వల్లే ఓటమి! ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. హైడ్రామా నెలకొన్న మ్యాచ్లో టెయిలెండర్లను కూడా కట్టడి చేయలేక చతికలపడ్డ పాకిస్తాన్ ఓటమికి బాబర్ కెప్టెన్సీనే ప్రధాన కారణమని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. అతడి రాతే అంత ఈ సందర్భంగా పాకిస్తాన్ స్పిన్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నవాజ్ రాతే అంత. దుబాయ్ గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా.. మెల్బోర్న్లో రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు ఇక్కడ చెన్నై గ్రౌండ్లో కేశవ్ మహరాజ్.. అతడి బౌలింగ్లో అద్భుతం చేశారు. పాపం ప్రతిసారి నవాజ్ ఎందుకో ఇలా కఠిన పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా సానుభూతి వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా విజయలక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఉసామా మిర్, మహ్మద్ నవాజ్లలో ఒకరిని బరిలోకి దింపాల్సి రాగా బాబర్ ఆజం నవాజ్ వైపు మొగ్గు చూపాడు. ఊహించని షాకిచ్చిన కేశవ్ మహరాజ్ అప్పటికి పేసర్ల కోటా పూర్తవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే, 48 ఓవర్లో నవాజ్ బౌలింగ్లో మొదటి బంతికి తబ్రేజ్ షంసీ సింగిల్ తీసి కేశవ్ మహరాజ్కు స్ట్రైక్ ఇచ్చాడు. అంతే.. రెండో బంతిని ఫోర్గా మలిచిన కేశవ్ ఊహించని రీతిలో సౌతాఫ్రికాను గెలుపుతీరాలకు చేర్చాడు. పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నవాజ్ మరోసారి బలిపశువు అయ్యాడు. చదవండి: ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా? View this post on Instagram A post shared by ICC (@icc) -
ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో బిగ్ షాక్..!
కవ్దలకలవన్డే ప్రపంచకప్-2023లో వరుస ఓటములతో సతమతవుతున్న పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో షాదాబ్ ఖాన్ గాయపడ్డాడు. ప్రోటీస్ ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని అపే క్రమంలో షాదాబ్ తలకు గాయమైంది. అనంతరం ఫిజియో సాయంతో ఫీల్డ్ను వదిలి వెళ్లాడు. గాయం కొంచెం తీవ్రమైనది కావడంతో అతడు తిరిగి మళ్లీ మైదానంలోకి రాలేదు. ఈ క్రమంలో షాదాబ్ స్ధానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా ఉసామా మీర్ వచ్చాడు. కాగా మ్యాచ్ అనంతరం షాదాబ్ను స్కానింగ్ తరలించగా అతడి గాయం తీవ్రమైనది తేలినట్లు సమాచారం. దీంతో అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అతడు వరల్డ్ కప్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నడాని పాకిస్తాన్ మీడియా కథనాలు వెలువరిస్తోంది. కాగా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను గల్లంతు చేసింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో పాక్ ఓటమి పాలైంది. చదవండి: WC 2023: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. నవాజ్పై కోపంతో ఊగిపోయిన బాబర్ ఆజం! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. నవాజ్పై కోపంతో ఊగిపోయిన బాబర్ ఆజం! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో పాక్ ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో పాక్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిందే అనే చెప్పాలి. మిగిలిన మూడు మ్యాచ్ల్లో గెలిచినా పాక్ సెమీస్ చేరే అవకాశం ఐదు శాతమే ఉంది. దక్షిణాఫ్రికా విజయంలో మార్క్రమ్(91) పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ మార్క్రమ్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే విజయానికి మరో 21 పరుగులు అవసరమైన సమయంలో ఉసామా మిర్ బౌలింగ్లో మార్క్రమ్ అవుటయ్యాడు. ఆ వెంటనే షాహిన్ ఆఫ్రిది.. కొయెట్జిని అవుట్ చేయడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడిలో కేశవ్ మహారాజ్ ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. దక్షిణాఫ్రికా 47. 2 ఓవర్లలో 271 లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. ఉసామా మీర్, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. బాబర్ సీరియస్.. కాగా ఈ మ్యాచ్ అనంతరం స్పిన్నర్ మహ్మద్ నవాజ్పై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కోపంతో ఊగిపోయాడు. ఫస్ట్ బౌలర్ల బౌలింగ్ కోటా ముగియడంతో నవాజ్ చేతికి బంతి అందించాడు. బాబర్ నమ్మకాన్ని నవాజ్ నిలబెట్టుకోలేకపోయాడు. తన వేసిన 48 ఓవర్లో రెండో బంతికే ఫోర్ ఇచ్చి మ్యాచ్ను ప్రోటీస్కు సమర్పించుకున్నాడు. ఫీల్డర్లు మొత్తం ఆఫ్ సైడ్ ఉంటే నవాజ్ మాత్రం బంతిని లెగ్ సైడ్ వైపు వేశాడు. మహారాజ్ ఈజీగా స్వ్కెర్ లెగ్ వైపు బంతిని బౌండరీకి తరిలించాడు. ఈ క్రమంలో నవాజ్పై బాబర్ ఆజం కోపంతో ఊగిపోయాడు. అతడి దగ్గరకు వెళ్లి ఆ ఒక్క బాల్ వేయడం తప్ప ఇంకేమీ రాదా? అంటూ సీరియస్ అయ్యాడు. అందుకు బదులుగా నవాజ్ సమాధానం ఏమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: WC 2023: గ్రీన్ అవుట్.. ట్రవిస్ హెడ్ వచ్చేశాడు! ఒక్క మార్పుతో కివీస్ #SorryPakistan You deserve a better captain #PAKvsSA pic.twitter.com/t8fwddhoWg — The Right Wing Guy (@T_R_W_G) October 27, 2023 -
WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్
ICC WC 2023- Pak Vs SA- Babar Azam Comments On Loss: ‘విజయానికి అత్యంత చేరువగా వచ్చాం.. కానీ సరైన ముగింపు ఇవ్వలేకపోయాం. జట్టు మొత్తం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఆఖరి ఓవర్లలో మేము తిరిగి పుంజుకున్న తీరు.. కనబరిచిన పోరాట పటిమ అద్భుతం. కానీ ఇలా జరిగిపోయింది’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విచారం వ్యక్తం చేశాడు. అలా అయితే ఫలితం వేరేలా ఉండేది తాము మరో 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్కప్-2023లో హ్యాట్రిక్ ఓటములతో డీలాపడిన పాకిస్తాన్.. శుక్రవారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ప్రొటిస్ టెయిలెండర్ కేశవ్ మహరాజ్ ఫోర్ బాదడంతో.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ రేసులో ముందుకు వెళ్లాలనుకున్న పాకిస్తాన్కు భంగపాటు ఎదురైంది. అందుకే ఓడిపోయాం ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం.. తమ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారని.. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాబట్టలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. అతడు అవుట్ అయితే సెమీస్ రేసులో ఉండేవాళ్లం అదే విధంగా.. 46వ ఓవర్ ఆఖరి బంతికి సౌతాఫ్రికా టెయిలెండర్ తబ్రేజ్ షంసీ విషయంలో ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేసిన పాకిస్తాన్కు ప్రతికూల ఫలితం వచ్చిన విషయాన్ని బాబర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘డీఆర్ఎస్ ఆటలో భాగం. ఒకవేళ అతడిని అవుట్గా పరిగణించినట్లయితే.. ఫలితం మాకు అనుకూలంగా ఉండేది. సెమీస్ రేసులో నిలిచేందుకు మాకు అవకాశాలు ఉండేవి. కానీ అలా జరుగలేదు’’ అని అంపైర్ కాల్ వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి మూడు మ్యాచ్లలో బాగా ఆడి పాకిస్తాన్ను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్న బాబర్.. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో ఎక్కడి వరకు చేరుకుంటామో చూద్దామంటూ నిర్వేదంగా మాట్లాడాడు. హైడ్రామా.. కాగా పేసర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో షంసీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు నమ్మకంగా ఉన్న పాకిస్తాన్కు అంపైర్స్ కాల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. రవూఫ్ సంధించిన ఇన్స్వింగర్ లెగ్ స్టంప్స్ను తాకినట్లుగా అనిపించింది. అయితే, బాల్ ట్రాకింగ్లో తృటిలో మిస్ అయినట్లు కనిపించగా.. నాటౌట్గా పేర్కొన్న అంపైర్స్ కాల్ వల్ల సౌతాఫ్రికా బతికిపోయింది. మరుసటి రెండో ఓవర్ వరకు హైడ్రామా నడవగా కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికా విజయ లాంఛనం పూర్తి చేశాడు. పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లు: ►వేదిక: చెన్నై చెపాక్ స్టేడియం ►టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ ►పాక్ స్కోరు: 270 (46.4) ►సౌతాఫ్రికా స్కోరు: 271/9 (47.2) ►ఫలితం: ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తబ్రేజ్ షంసీ(4 వికెట్లు) చదవండి: WC 2023: అతడు లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి! గిల్ కూడా.. View this post on Instagram A post shared by ICC (@icc) -
పాకిస్తాన్ క్రికెటర్ అరుదైన ఘనత.. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా షాదాబ్ ఖాన్ తలకు గాయమైంది. బంతిని ఆపే క్రమంలో షాదాబ్ తల నేలకు బలంగా తాకింది. దీంతో అతడి నొప్పితో మైదానంలో విల్లావిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి పరిశీలించినప్పటికీ ఫలితం లేదు. గాయం తీవ్రం కావడంతో ఫిజియో సాయంతో షాదాబ్ మైదానాన్ని వీడాడు. ఉసామా మీర్ ఎంట్రీ.. మైదానాన్ని వీడిన షాదాబ్ ఖాన్ తిరిగి మళ్లీ ఫీల్డ్లోకి రాలేదు. అతడి స్ధానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా ఉసామా మీర్ మైదానంలో వచ్చాడు. తద్వారా ఉసామా మీర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన మొదటి ఆటగాడిగా మీర్ రికార్డులకెక్కాడు. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన మీర్.. ఓ వికెట్ కూడా సాధించాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్! -
డూ ఆర్ డై మ్యాచ్లో రాణించిన పాక్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 271 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 300 పరుగుల మార్క్ను దాటేలా కన్పించిన పాక్.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో 270 పరుగులకు పరిమితమైంది. పాక్ బ్యాటర్లలలో బాబర్ ఆజం(50), సౌధ్ షకీల్(52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆఖరిలో షదాబ్ ఖాన్(43), నవాజ్(24) పర్వాలేదనపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ షంసీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జానెసన్ మూడు, గెరాల్డ్ కోయెట్జీ రెండు, లుంగీ ఎంగిడి ఒక్క వికెట్ సాధించారు. చదవండి: WC 2023 PAK vs SA: పాపం బాబర్ ఆజం.. అస్సలు ఊహించలేదు! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
పాపం బాబర్ ఆజం.. అస్సలు ఊహించలేదు! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరో హాఫ్ సెంచరీను తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్లో బాబర్ అర్ధ శతకం సాధించాడు. 65 బంతులు ఎదుర్కొన్న ఆజం.. 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 50 పరుగులు చేశాడు. కాగా జట్టు బాధ్యతను తన భుజాన వేసుకుని ఆడిన బాబర్.. దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 28 ఓవర్ వేసిన స్పిన్నర్ షంసీ బౌలింగ్లో ఐదో బంతిని బాబర్ ల్యాప్ స్వీప్ షాట్ ఆడాడు. అయితే ఆ షాట్ ఆడటంలో బాబర్ విఫలమయ్యాడు. బంతి లెగ్ స్టంప్ను మిస్స్ అవుతూ వికెట్ కీపర్ డికాక్ చేతికి వెళ్లింది. అదే విధంగా బంతి బ్యాట్కు దగ్గరగా కూడా వెళ్లున్నట్లు అన్పించింది. దీంతో డికాక్ క్యాచ్కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. డికాక్ అప్పీల్లో అంత కాన్ఫిడెన్స్ కనిపించలేదు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఆఖరి సెకెండ్లో రివ్యూ తీసుకున్నాడు. అయితే రిప్లేలో బాబర్ చేతి గ్లావ్కు బంతి తాకినట్లు తేలింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఔట్గా ప్రకటించాడు. అయితే బాబర్ మాత్రం నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Virat Kohli: విరాట్ మాంసం అస్సలు తినడు.. వాళ్లు మాత్రం అవే తింటారు! కోహ్లి డైట్ ఇదే.. -
రిజ్వాన్, దక్షిణాఫ్రికా బౌలర్ మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్ కీలక మ్యాచ్లో చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పవర్ప్లే లోపే ఓపెనర్లు షఫీక్, ఇమామ్ ఉల్-హాక్ వికెట్లను పాక్ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్లో పాక్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, ప్రోటీస్ స్పీడ్ స్టార్ మార్కో జానెసన్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? ఇమామ్ ఉల్-హాక్ ఔటైన తర్వాత మహ్మద్ రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. అయితే జానెసన్ బౌలింగ్లో తన ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి రిజ్వాన్ తప్పించుకున్నాడు. రిటర్న్ క్యాచ్ను అందుకోవడంలో జానెసన్ విఫలమయ్యాడు. ఆ తర్వాతి బంతిని రిజ్వాన్ బౌండరీగా మలిచాడు. ఈ క్రమంలో జానెసన్ రిజ్వాన్ వద్దకు వెళ్లి ఏదో అన్నాడు. అందుకు బదులుగా రిజ్వాన్ నీ పని చూసుకో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం, ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో 27 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: WC 2023: ఇంగ్లండ్తో మ్యాచ్కు హార్దిక్ పాండ్యా లేడు.. ఒకవేళ బుమ్రా కూడా.. Heated conversation between Marco Jansen and Mohammed Rizwan...!!#SAvsPAK #PAKvSA #kykyurdu #พรหมลิขิตep4 #ธี่หยด #crymua #bbcqt #ENGvsSL #Maine pic.twitter.com/JzJguEp0eq — Oxygen X (@imOxYo18) October 27, 2023 -
WC 2023: తప్పక గెలవాల్సిన మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ షాక్!
వన్డే వరల్డ్కప్-2023 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ స్టార్ పేసర్ హసన్ అలీ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జ్వరంతో బాధపడుతున్న కారణంగా సౌతాఫ్రికాతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ‘‘ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి సౌతాఫ్రికాతో పాకిస్తాన్ మ్యాచ్కు అతడు దూరమయ్యాడు’’ అని ప్రకటన విడుదల చేసింది. కాగా యువ పేసర్ నసీం షా గాయం కారణంగా వరల్డ్కప్-2023 టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో అనూహ్యంగా హసన్ అలీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో 29 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ తాజా ప్రపంచకప్ ఈవెంట్లో ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి 5.82 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. కాగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్) వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో పాకిస్తాన్.. సౌతాఫ్రికాతో తలపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న ప్రొటిస్ జట్టు ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగనుండగా.. వరుస ఓటములతో డీలా పడ్డ పాక్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి! ఇక ఈ మ్యాచ్లో హసన్ అలీ స్థానంలో మహ్మద్ వసీం జూనియర్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: WC 2023: కోహ్లిలా ఉండాలన్నందుకు.. నాపై ద్రోహి అనే ముద్ర వేశారు! కానీ.. -
పాక్ గడ్డపై ప్రిటోరియస్ రికార్డు! నాటి మ్యాచ్లో ఏకంగా..
జొహన్నెస్బర్గ్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ పాకిస్తాన్ గడ్డపై తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (5/17) నమోదు చేయడం విశేషం. 2021లో పాక్ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడింది ప్రొటిస్. టెస్టులో సిరీస్ పాక్ 2-0తో క్లీన్స్వీప్ చేయగా.. మొదటి టీ20లోనూ ప్రొటిస్ను దురదృష్టం వెక్కిరించింది. నేనున్నానని.. మూడు పరుగుల తేడాతో పర్యాటక సౌతాఫ్రికా ఓటమి పాలైంది. ఈ క్రమంలో లాహోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో ప్రిటోరియస్ విశ్వరూపం ప్రదర్శించాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. అరుదైన ఘనత పాక్ ఇన్నింగ్స్లో కీలక వికెట్లు తీసి ప్రొటిస్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్గా ప్రిటోరియస్ ఘనత వహించాడు. అయితే, ఆ తర్వాతి మ్యాచ్లో పాక్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను 2-1తో గెలుచుకుంది. కాగా సోమవారం రిటైర్మెంట్ ప్రకటించిన ప్రిటోయిరస్.. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 33 ఏళ్ల ప్రిటోరియస్ స్పష్టం చేశాడు. 2016లో దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేసిన ప్రిటోరియస్ 3 టెస్టులు, 27 వన్డేలు, 33 టి20 మ్యాచ్లు ఆడాడు. ఏయే లీగ్లలో ఆడుతున్నాడంటే.. టెస్టుల్లో 7 వికెట్లు తీసి 83 పరుగులు చేసిన అతను... వన్డేల్లో 35 వికెట్లు పడగొట్టి 192 పరుగులు... టి20ల్లో 35 వికెట్లు నేలకూల్చి 261 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ప్రిటోరియస్ ఇక నుంచి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్లపై, ఇతర పొట్టి ఫార్మాట్లపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపాడు. ప్రస్తుతం ప్రిటోరియస్ ఐపీఎల్ (చెన్నై సూపర్కింగ్స్), ద హండ్రెడ్ (వెల్ష్ ఫైర్), కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఎస్ఏ20 (డర్బన్ సూపర్ జెయింట్స్) లీగ్లలో భాగంగా ఉన్నాడు. చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్కు నో ఛాన్స్!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం? Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్ తర్వాత! -
సౌతాఫ్రికాపై ఘన విజయం.. పాక్ సెమీస్ ఆశలు సజీవం..!
టీ20 వరల్డ్కప్-2022లో దాయాది పాకిస్తాన్కు ఇంకా నూకలు ఉన్నాయి. ఇవాళ (నవంబర్ 3) జరిగిన కీలక పోరులో బాబర్ సేన.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో పాక్ గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి టీమిండియా తర్వాతి స్థానంలో నిలిచి, సెమీస్ రేసులో నిలిచింది. పాక్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతానికి రన్రేట్ ప్రకారం చూస్తే పాక్ (1.085).. భారత్ (0.730) కంటే మెరుగైన స్థితిలో ఉంది. పాక్కు సెమీస్ అవకాశాలు ఎలా అంటే.. గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో ఉన్న భారత్ (4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు), సౌతాఫ్రికా (4 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 5 పాయింట్లు, 1.402), పాకిస్తాన్ జట్లు చివరిగా తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్.. జింబాబ్వేతో, పాకిస్తాన్.. బంగ్లాదేశ్తో, సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ల్లో సౌతాఫ్రికా చిన్న జట్టైన నెదర్లాండ్స్పై గెలిస్తే గ్రూప్-2 నుంచి తొలి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. మరో బెర్తు కోసం పోటీలో.. పాక్ తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలపొంది, భారత్.. తమ చివరి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఓడితే, మెరుగైన రన్రేట్ ఆధారంగా పాకిస్తాన్ సెమీస్కు చేరుకుంటుంది. అయితే టీమిండియానే గడగడలాడించిన బంగ్లాపై పాక్ భారీ విజయం.. పసికూన జింబాబ్వే.. టీమిండియాపై గెలవడం అంత ఆషామాషీ విషయం కాదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించడంతో పాక్.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారీ వర్షం పడటంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించి దక్షిణాఫ్రికాకు 142 పరుగుల టార్గెట్ను నిర్ధేశించారు. అప్పటికే సౌతాఫ్రికా 9 ఓవర్లు ఆడేసి 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు మాత్రమే చేసి ఉండటంతో మిగిలిన 5 ఓవర్లలో 73 పరుగులు చేయాల్సి వచ్చింది. కష్టసాధ్యమైన ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులకు మాత్రమే పరిమితమైంది. -
Pak Vs SA: టీ20 వరల్డ్కప్లోనే అత్యంత భారీ సిక్సర్..!
టీ20 వరల్డ్కప్-2022లో అత్యంత భారీ సిక్సర్ నమోదైంది. సూపర్-12 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 3) జరిగిన మ్యాచ్లో పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ 106 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్లో ఇదే అత్యంత భారీ సిక్సర్గా రికార్డ్ అయ్యింది. ఎంగిడి వేసిన 16వ ఓవర్ నాలుగో బంతిని ఇఫ్తికార్ అహ్మద్.. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని స్టాండ్స్లోకి సాగనంపాడు. ఇఫ్తికార్ ఈ షాట్ ఆడిన విధానాన్ని చూసి బౌలర్ ఎంగిడి అవాక్కయ్యాడు. ఈ షాట్ తర్వాత సిడ్నీ స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియలో వైరలవుతుంది. #PAKvSA #T20WorldCup Iftikhar Ahmed hits the BIGGEST 6️⃣ of T20 World Cup 2022 💥 pic.twitter.com/MRWhl43TkG — MK CHAUDHARY 03 (@LovelyKhateeb) November 3, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఆరంభంలోనే వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. టెంబా బవుమా (19 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్సర్), ఎయిడెన్ మార్క్రమ్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగానే ఆడినా ఒకే ఒవర్లో వీరిద్దరూ ఔట్ కావడంతో సఫారీల కష్టాలు అధికమయ్యాయి. ఈ దశలో ఒక్కసారిగా భారీ వర్షం కూడా మొదలుకావడంతో దక్షిణాఫ్రికా మ్యాచ్పై ఆశలు వదులుకుంది. వర్షం మొదలయ్యే సమయానికి ఆ జట్టు స్కోర్ 9 ఓవర్ల తర్వాత 69/4గా ఉంది. సఫారీలు గెలవాలంటే 66 బంతుల్లో 117 పరుగులు చేయాల్సి ఉంది. హెన్రిచ్ క్లాసెన్ (2), ట్రిస్టన్ స్టబ్స్ (2) క్రీజ్లో ఉన్నారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారమయితే దక్షిణాఫ్రికా ఇంకా 15 పరుగులు వెనకపడి ఉంది. ఒకవేళ మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం పాక్నే విజేతగా ప్రకటిస్తారు. వర్షం ఎడతెరిపినివ్వడంతో మళ్లీ మొదలైన మ్యాచ్.. సౌతాఫ్రికా టర్గెట్ ఎంతంటే..? వర్షం ఎడతెరిపినివ్వడంతో పాక్-సౌతాఫ్రికా మ్యాచ్ మళ్లీ మొదలైంది. అయితే మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించి 142 పరుగుల టార్గెట్ను నిర్ధేశించారు. ఇప్పటికే ఆ జట్టు 9 ఓవర్లు ఆడేయడంతో మరో 5 ఓవర్లలో 73 పరుగులు సాధించాల్సి ఉంది. -
T20 WC 2022: పాక్ ఆశలపై నీళ్లు.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
PAK VS SA: సెమీస్ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్న పాకిస్తాన్ జట్టుకు పుండుపై కారం చల్లినట్లు మరో షాక్ తగిలింది. రేపు (నవంబర్ 3) సౌతాఫ్రికాతో జరుగబోయే కీలక సమరానికి ముందు స్టార్ ఆటగాడు ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. వన్డౌన్లో కీలకంగా వ్యవహరించే జమాన్.. మోకాలి గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాక్ మీడియా మేనేజర్ అధికారికంగా ప్రకటించాడు. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్కు కీలక ఆటగాడు అందుబాటులో లేకపోవడం పాక్ విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తుంది. అసలే మిడిలార్డర్ సమస్యతో బాధపడుతున్న పాక్కు జమాన్ గైర్హాజరీ మరింత ఆందోళన కలిగిస్తుంది. సౌతాఫ్రికాతో ఓడిపోతే పాక్ ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. కాగా, ఆసియా కప్ సందర్భంగా గాయపడ్డ జమాన్.. ఇటీవలే జట్టులోకి వచ్చాడు. ప్రస్తుత ప్రపంచకప్లో పాక్ ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ఆడని జమాన్.. చివరిగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్లో అతను 16 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గ్రూప్-2 పాయింట్ల పట్టికలో పాక్ చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఓ గెలుపు (నెదర్లాండ్స్), రెండు పరాజయాలతో (ఇండియా, జింబాబ్వే) 2 పాయింట్లు (0.765) కలిగి ఉంది. ఈ సమీకరణల నడమ ప్రస్తుతానికి బాబర్ సేన్ సెమీస్ అవకాశాలు మినుమినుకుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కీలక ఆటగాడు అందుబాటులో లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
భారత బ్యాటర్లు ఓపికగా ఆడితే బాగుండేది! ప్రొటిస్ మమ్మల్ని సైతం ఓడించి..
ICC Mens T20 World Cup 2022- India vs South Africa: ‘‘ఇండియా మా సెమీస్ అవకాశాలను గల్లంతు చేసింది. భారత్ పరాజయం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. అయినా ఇందులో వాళ్ల తప్పేమీ లేదు. మేమే చెత్తగా ఆడి.. మా తలరాతను ఇతరులు నిర్ణయించే దుస్థితిలో ఉన్నాం’’ అని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లయింది. అద్భుతాలు జరిగితే తప్ప బాబర్ ఆజం బృందం టోర్నీలో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ క్రమంలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నీలో పాక్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. టీమిండియా మమ్మల్ని నిరాశపరిచింది అదే సమయంలో రోహిత్ సేన.. దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఉంటే తమకు కాస్త మేలు చేసిన వాళ్లు అయ్యేవారంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా- సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ చానెల్లో స్పందించిన అక్తర్.. ‘‘పెర్త్ లాంటి పిచ్లపై ఆడటం కాస్త కష్టమే. ఏదేమైనా టీమిండియా మమ్మల్ని నిరాశకు గురిచేసింది. భారత బ్యాటర్లు కాస్త ఓపికగా ఆడి ఉంటే బాగుండేది. పెవిలియన్కు క్యూ కట్టకుండా.. కనీసం 150 పరుగులు స్కోరు చేసి ఉంటే ప్రయోజనకరంగా ఉండేది. మమ్మల్ని కూడా ఓడిస్తారు! అయితే, దక్షిణాఫ్రికా తన అనుభవజ్ఞులైన ఆటగాళ్ల సేవలను చక్కగా ఉపయోగించుకుంది. మిల్లర్ నిజంగా కిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్కరమ్తో కలిసి తన అనుభవన్నంతా ఉపయోగించి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. లుంగి ఎంగిడి అద్భుతాలు చేయగలడని మరోసారి నిరూపించాడు. నిజానికి ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే మాకు ఆశలు మిగిలి ఉండేవి. కానీ అలా జరుగలేదు. ఇక సౌతాఫ్రికా ఇప్పుడు.. టీమిండియా లాగే మమ్మల్ని సైతం ఓడించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ స్కోర్లు: ఇండియా- 133/9 (20) దక్షిణాఫ్రికా- 137/5 (19.4) 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లుంగి ఎంగిడి(4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) చదవండి: T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు.. T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్ కాదు.. దినేశ్ కార్తిక్పై సెహ్వాగ్ సెటైర్లు! ఇప్పటికైనా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెచ్చిపోయిన బాబర్ ఆజమ్.. ‘టీ20’లో తొలి శతకం!
సెంచూరియన్: వన్డే ఫార్మాట్లో తొలిసారి ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ అందుకున్న ఆనందంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టి20 మ్యాచ్లో రెచ్చిపోయాడు. సఫారీ బౌలర్లను చితగ్కొట్టి కేవలం 59 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టి20ల్లో ఆజమ్కిదే తొలి శతకం కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ టి20ల్లో వేగంగా శతకం కొట్టిన పాక్ బ్యాట్స్మన్గా... టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన పాక్ బ్యాట్స్మన్గా ఆజమ్ గుర్తింపు పొందాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి నాలుగు మ్యాచ్ల సిరీస్లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లలో వికెట్ నష్టపోయి 205 పరుగులు సాధించి గెలిచింది. కాగా అంతర్జాతీయ టి20ల్లో పాక్కిదే అత్యుత్తమ ఛేజింగ్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 122; 15 ఫోర్లు, 4 సిక్స్లు), మొహమ్మద్ రిజ్వాన్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) తొలి వికెట్కు 17.4 ఓవర్లలో 197 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. జానెమన్ మలాన్ (40 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మార్క్రమ్ (31 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్కు 108 పరుగులు జత చేశారు. సిరీస్లోని చివరిదైన నాలుగో టి20 మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. చదవండి: సుదీర్ఘ కాలంగా టాప్లో కోహ్లి; ఇప్పుడు అగ్రస్థానంలో పాక్ కెప్టెన్ -
కోహ్లిని వెనక్కినెట్టిన పాక్ కెప్టెన్...
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సత్తా చాటాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 865 పాయింట్లతో ముందు వరుసలో నిలిచాడు. కాగా 2017 నాటి నుంచి టాప్లో కొనసాగుతున్న రన్మెషీన్ కోహ్లి ప్రస్తుతం 857 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితం అయ్యాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో రెండు అర్ద శతకాలతో రాణించిన కోహ్లి.. ర్యాంకింగ్స్లో 1258 రోజుల పాటు అగ్రస్థానాన్ని కాపాడుకోగలినప్పటికీ, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో బాబర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో నంబర్ వన్ ర్యాంకు కోల్పోక తప్పలేదు. ఫొటో కర్టెసీ: ఐసీసీ ఇక బాబర్, కోహ్లి తర్వాత టీమిండియా హిట్మ్యాన్ రోహిత్ శర్మ (825), కివీస్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్(801), ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్(791) పాయింట్లతో టాప్-5లో చోటు దక్కించుకున్నారు. పాకిస్తాన్ మరో ఆటగాడు ఫకార్ జమాన్ దక్షిణాఫ్రికా సిరీస్లో 302 పరుగులతో రాణించడంతో ఏకంగా ఏడో స్థానానికి చేరుకున్నాడు. కాగా మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ నిమిత్తం పాకిస్తాన్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ను పాక్ కైవసం చేసుకోగా, కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ ఆతిథ్య జట్టు టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది. చదవండి: మరోసారి విలియమ్సన్కే... ఏడేళ్ల విరామం తర్వాత... తొలి టెస్టు.. -
అదరగొట్టిన లిండే.. ఓటమి పాలైన పాకిస్తాన్
జొహెన్నెస్బర్గ్: జార్జి లిండే ఆల్రౌండ్ ప్రదర్శన (3/23; 10 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్స్లు) కనబర్చడంతో... పాకిస్తాన్తో జరిగిన రెండో టి20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. నాలుగు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (50; 5 ఫోర్లు), హఫీజ్ (32; 6 ఫోర్లు) రాణించారు. లిండేకు తోడు విలియమ్స్ కూడా 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. మార్క్రమ్ (54; 7 ఫోర్లు, 3 సిక్స్లు)... క్లాసెన్ (36; 4 ఫోర్లు, 1 సిక్స్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఆల్రౌండ్ షోతో అదరొట్టిన జార్జి లిండే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. కాగా 3 వన్డేల సిరీస్ను పాక్ 2-1తో కైవసం చేసుకోగా, నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో ప్రస్తుతం 1-1తో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. చదవవండి: ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తుంది.. కాబట్టి: పాక్ మాజీ పేసర్ ఐపీఎల్ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?! -
ఏంటి బాబూ.. ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా?!
జొహన్నస్బర్గ్: అర్ధ సెంచరీ, సెంచరీ చేసినపుడు లేదా కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నపుడు బ్యాట్స్మెన్, కీలకమైన వికెట్లు తీసినపుడు బౌలర్లు.. తమదైన శైలిలో ఆనందాన్ని వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉంటాం. టీమిండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్కు, స్పెషల్ ఇన్నింగ్స్ తర్వాత చెవులు మూసుకుని సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. ఇక బౌలర్ల విషయానికొస్తే, షెల్డన్ కాట్రెల్ మార్చ్ సెల్యూట్ చేస్తూ సంబరాలు చేసుకుంటాడు. ఇలా ఒక్కో ఆటగాడు మైదానంలో ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయాడు. అయితే, నెటిజన్లు మాత్రం అతడు సెలబ్రేట్ చేసుకునే విధానం చూసి.. ‘‘ఏంటీ బాబూ.. ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా? ఇంతకు ముందెన్నడు ఇలాంటిది మేం జూడలే.. ఏదైతేనేం నీ కంటూ ఓ స్టైల్ ఉంది కదా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అతడేం ఏం చేశాడంటే.. పాకిస్తాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాటి మొదటి టీ20లో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పర్యాటక జట్టుకు 189 పరుగుల లక్ష్యం విధించింది. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా, పాక్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుండగా, షంసీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్లో ఫఖర్ జమాన్ను, 14 ఓవర్లో మహ్మద్ హఫీజ్ను పెవిలియన్కు పంపాడు. ఈ సందర్భంగా.. తన షూ తీసి, చెవి దగ్గర పెట్టుకుని, ఎవరికో ఫోన్ చేస్తున్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా షంసీ సెలబ్రేషన్ గురించి సహచర ఆటగాడు రసీ వన్ దేర్ దసెన్ మాట్లాడుతూ.. ‘‘షంసీ తన ఆనందాన్ని పంచుకునేందుకు ఇమ్మీ(ఇమ్రాన్ తాహిర్)కు ఫోన్ చేస్తాడు. తన ఆరాధ్య బౌలర్లలో ఇమ్మీ ఒకడు. వాళ్లిద్దరూ కలిసి ఆడారు. అందుకే వికెట్ తీసినప్పుడల్లా ఇమ్మీకి ఇలా ఫోన్ చేసి సంతోషం పంచుకుంటాడు’’అని వివరణ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో పాక్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన షంసీ, 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. చదవండి: ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తుంది.. కాబట్టి: పాక్ మాజీ పేసర్ Hafeez gone for 13 in his 100th T20I and Shamsi wrote another wicket on his shoe. This guy is alrwady pissing me off. Fitte mun Hafeez tere te 😠😠😠#PAKvSA pic.twitter.com/PW6uBybf7G — Daniyal Mirza (@Danitweets__) April 10, 2021 -
ఐపీఎల్ ఆడకుండా క్రికెటర్లను ఆపలేం.. ఎందుకంటే!
ఇస్లామాబాద్: కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడకుండా క్రికెటర్లను కట్టడి చేయలేమని పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ అభిప్రాయపడ్డాడు. దేశం తరఫున ఆడేకంటే, ఇలాంటి రిచ్ లీగ్లలో ఆడటం ద్వారా ఆర్థికంగా లబ్ది పొందుతారు కాబట్టే, వాటి వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని పేర్కొన్నాడు. పాకిస్తాన్ జట్టు, మూడు వన్డే, నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ నిమిత్తం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న పాక్, టీ20 సిరీస్లోనూ 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. మరోవైపు, ఐపీఎల్-2021 సీజన్లో ఆడేందుకు గానూ, ప్రొటిస్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్, కగిసొ రబడ వంటి ఆటగాళ్లు భారత్కు చేరుకున్నారు. ఈ క్రమంలో క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ కోసం జాతీయ జట్టు ప్రయోజనాలు పణంగా పెడతారా అంటూ, పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి.. ‘‘నేషన్ ఆర్ లీగ్’’ మ్యాచ్ డిబేట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆకిబ్ జావేద్ క్రికెట్ పాకిస్తాన్తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్(బీసీసీఐ) వలె ఐపీఎల్ ఎంతో శక్తిమంతమైన లీగ్. ఒప్పందం కుదిరిన తర్వాత తమ ఆటగాళ్లను అక్కడికి పంపనట్లయితే, ఇతర బోర్డులు వారికి భారీ మొత్తమే చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఐపీఎల్ ఆడటం ద్వారా, నెలన్నరలోనే ఒక్కో ఆటగాడు సగటున 1.5 మిలియన్ డాలర్లు సంపాదించే అవకాశం ఉంటుంది. జాతీయ జట్టుకు ఆడితే వస్తే మొత్తం కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ఇక దక్షిణాఫ్రికా క్రికెట్ ఇప్పటికే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న సమయంలో ఆటగాళ్లను పంపకుండా ఉండటం దాదాపు అసాధ్యం’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా టీమిండియా ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించిన ఆకిబ్.. తమ జట్టు బౌలర్ షాహిన్ షా ఆఫ్రిది కంటే ఎంతో డెత్ ఓవర్లలో ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడని కితాబిచ్చాడు. కాగా ఐపీఎల్పై పాక్ ఆటగాళ్ల అభిప్రాయాల పట్ల భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ సూపర్లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఐపీఎల్ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?! ‘మిస్టరీ గర్ల్’ మళ్లీ వచ్చింది -
ఐపీఎల్ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?!
ఇస్లామాబాద్: క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ)పై పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది విమర్శలు గుప్పించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021లో ఆడేందుకు ప్రొటిస్ ఆటగాళ్లను వన్డే సిరీస్ నుంచి విడుదల చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా మూడు వన్డే, నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ నిమిత్తం పాకిస్తాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాటి ఆఖరి వన్డే మ్యాచ్లో విజయం సాధించి పాక్ సిరీస్ను2-1తో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆఫ్రిది తమ జట్టుకు అభినందనలు తెలిపాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్, ఫకార్ జమాన్ అద్భుతంగా రాణించారంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. అదే సమయంలో క్రికెట్ సౌతాఫ్రికా తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ ఓ వైపు సిరీస్ కొనసాగుతుండగానే, మరోవైపు ఐపీఎల్ కోసం సీఎస్ఏ ఆటగాళ్లను విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. టీ20 లీగ్లు అంతర్జాతీయ క్రికెట్ను ఈవిధంగా ప్రభావితం చేయడం నిజంగా విషాదకరం. ఈ నిర్ణయాలపై పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉంది’’అని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆఫ్రిది తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అయితే, అతడి కామెంట్లపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీ జట్టుకు ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు కాబట్టే ఈ విమర్శలు చేస్తున్నావా.. టీ20 లీగ్ల గురించి బాధపడిపోతున్నావు సరే.. మరి నువ్వు కూడా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడిన వాడివే కదా. నీకొక రూల్, మిగతా వాళ్లకు ఒక రూల్ ఉంటుందంటావా?’’ అంటూ తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సౌతాఫ్రికా- పాక్ మ్యాచ్ విషయానికొస్తే, క్వింటన్ డికాక్, కగిసొ రబడ వంటి స్టార్ ఆటగాళ్లను లేకుండానే కీలకమైన మూడో వన్డే ఆడిన ప్రొటిస్ జట్టు 28 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ను చేజార్చుకుంది. ఇక ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 10 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: పాకిస్తాన్దే వన్డే సిరీస్ వైరల్: ఏంటా వేగం.. బ్యాట్ రెండు ముక్కలైంది Surprising to see @OfficialCSA allowing players to travel for IPL in the middle of a series. It is sad to see T20 leagues influencing international cricket. Some rethinking needs to be done!! https://t.co/5McUzFuo8R — Shahid Afridi (@SAfridiOfficial) April 7, 2021 -
వివాదాస్పద రనౌట్ దుమారం: ‘డీకాక్ తప్పేమీ లేదు’
జొహన్నెస్బర్గ్: ఆటల్లో క్రీడాస్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా క్రికెట్లో దీని పాలు ఎక్కువే! అందుకే దీనిని జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ మైదానంలో ఆటగాళ్లు ఎలా ప్రవర్తించారనేది చాలా ముఖ్యం. అందుకు సంబంధించి ‘ఫెయిర్ ప్లే’ నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓపెనర్ ఫకర్ జమాన్ (193; 155 బంతుల్లో 18x4, 10x6) ను రనౌట్ చేసిన విధానం వివాదాస్పదంగా మారింది. ఈ రనౌట్ కు సంబంధించి డీకాక్ చేసింది గేమ్ స్పిరిట్కు విరుద్ధమని పాక్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయంపై తాజాగా ఫకర్ జమాన్ స్పందించాడు. నేనే మరింత చురుగ్గా వ్యవహరించుండాలి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తన రనౌట్ బాధ్యతను ఫఖర్ జమానే తీసుకున్నాడు. ‘ఆ సమయంలో తానే మరింత చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఇందులో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ తప్పు లేదు. హరిస్ రౌఫ్ క్రీజ్ నుంచి కొంచెం ఆలస్యంగా పరుగు ప్రారంభించాడు, అందువల్ల అతను ఇబ్బందుల్లో పడతాడని నేను భావించాను. ఈ క్రమంలో నా దృష్టి కొంచెం మళ్లింది. కాబట్టి ఇందులో డికాక్ తప్పుందని నేను అనుకోవడంలేదు’అని జమాన్ పేర్కొన్నాడు. ఇక రనౌట్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో మార్క్రమ్ త్రో చేస్తున్న సమయంలో డీకాక్ చేసిన సైగలతో బంతి తను పరుగెడుతున్న వైపు రావడం లేదని భావించిన జమాన్ వేగాన్ని తగ్గించాడు. కాని బంతి అనూహ్యంగా అతని ఎండ్ వికెట్లకే తగిలి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా రెండో వన్డేలో 342 పరుగులు చేసిన పాకిస్థాన్కు చివరి ఓవర్లో 31 పరుగులు అవసరం. జమాన్ రనౌట్ అయిన తరువాత, పాక్ 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అసలు చట్టం ఏం చెప్తోంది రూల్ 41.5.1 ప్రకారం స్ట్రైకర్ బంతిని అందుకున్న తర్వాత బ్యాట్స్మెన్ను అడ్డుకోవడం, ఏ ఫీల్డర్ అయినా మాటలు లేదా తమ చర్యల ద్వారా ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్మన్ను దృష్టి మరల్చకూడదని పేర్కొటోంది. ( చదవండి: పవర్ఫుల్ షాట్.. కెమెరానే పగిలిపోయింది! ) #fakharzaman For the ones justifying. he clearly deceived fakhar zaman by his gesture and he unintentionally looked behind and hence slowed himself down. this is clear cheating. fake fielding. against the rules. 👎#fakharzaman #PakvRSA pic.twitter.com/qqNm5oKo8p — Pak Warrior 🇵🇰🇹🇷🇵🇰🇹🇷 (@MUxama3) April 4, 2021 -
బాయ్.. బయోబబూల్లో ఉన్నాం మర్చిపోయావా
రావల్పిండి: పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన సహచర ఆటగాడు అజర్ అలీని ట్రోల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివరాలు.. ఆటలో నాలుగోరోజైన ఆదివారం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఒక పిల్లి మైదానంలోకి పరిగెత్తుకు వచ్చింది. పిల్లిని చూసిన అజర్ అలీ దానిని గ్రౌండ్ నుంచి బయటికి పంపడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన రిజ్వాన్.. అజ్జూ బాయ్.. మనం బయోబబూల్లో ఉన్నాం.. అది(పిల్లి) లేదు.. ముందు దానికి కరోనా టెస్టు నిర్వహించి ఆ తర్వాత బయటికి పంపు అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. రిజ్వాన్ వ్యాఖ్యలు విన్న పాక్ ఆటగాళ్లు నవ్వును ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఇస్మాయిల్ ఫారుక్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా రెండో టెస్టులో విజయం సాధించాలంటే ఇంకా 243 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఒక వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. మక్రమ్ 59, వాన్డర్ డస్సెన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 298 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు క్రితం రోజు స్కోరుతో నాలుగోరోజు ఆటను ఆరంభించిన పాక్ మహ్మద్ రజ్వాన్ సెంచరీతో( 115, 204 బంతులు; 15 ఫోర్లు) మెరవడంతో 298 పరుగులకు ఆలౌటై దక్షిణాఫ్రికా ముందు 370 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. సోమవారం ఆటకు ఆఖరిరోజు కావడం.. తొలి ఇన్నింగ్స్ హీరో హసన్ అలీ మరోసారి బౌలింగ్తో రెచ్చిపోతే ప్రొటీస్ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. కాగా ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. Cat enters ground. Azhar Ali chases it. Ajju bhai test nahi kiya ye bubble me nahi hai-Rizwan 😂#PAKvSA #Rizwan pic.twitter.com/qlphrGxjDE — Ismaeel Farrukh (@IsmaeelFarrukh) February 7, 2021 -
చిరుత కంటే వేగం.. అంత తేలిగ్గా మరిచిపోలేం
బ్రిస్బేన్ : జాంటీ రోడ్స్.. క్రికెట్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. అప్పటివరకు మూస ధోరణిలో ఉండే ఫీల్డింగ్కు కొత్త పర్యాయం చెప్పిన వ్యక్తి రోడ్స్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్గా ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఫీల్డింగ్ విన్యాసాలు.. డైవ్ క్యాచ్లు.. మెరుపువేగంతో రనౌట్లు.. మైదానంలో పాదరసంలా కదలడం లాంటివన్నీ రోడ్స్ వచ్చిన తర్వాత వేగంగా మారిపోయాయి. తన 11 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్లు.. రనౌట్లు.. వెరసి కొన్నిసార్లు దక్షిణాఫ్రికా జట్టును కేవలం తన ఫీల్డింగ్ ప్రతిభతో మ్యాచ్లు గెలిపించాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టుకు ఆ ఇద్దరు ఆటగాళ్లు దూరం) అందుకు చాలా ఉదాహరణలున్నాయి.. వాటి గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తుకువచ్చేది 1992 ప్రపంచకప్.. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోడ్స్.. ఇంజమామ్ను రనౌట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. రోడ్స్ చేసిన విన్యాసం జిమ్ ఫెన్విక్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించగా.. అది బెస్ట్ ఫోటోగ్రఫీగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో 36 ఓవర్లకు కుదించి 194 పరుగులను రివైజ్డ్ టార్గెట్గా విధించారు. వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. పాక్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులతో పటిష్టంగా నిలిచి విజయానికి చేరువలో ఉంది. క్రీజులో ఇంజమామ్ ఉల్ హక్ 48 పరుగులతో మంచి టచ్లో ఉండగా.. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అతనికి అండగా ఉన్నాడు. అలెన్ డొనాల్డ్ బౌలింగ్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఇంజమామ్ షాట్ ఆడాడు. ఇంజమాముల్ హక్ కొట్టిన బంతిని రోడ్స్ చురుగ్గా అందుకొని చిరుత కంటే వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేసి ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంజమామ్ షాక్కు గురికాగా.. సఫారీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. మంచి ఫామ్లో ఉన్న ఇంజమామ్ను రోడ్స్ ఔట్ చేయడంతో ఆ ప్రభావం పాక్పై తీవ్రంగా పడి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ రనౌట్తోనే జాంటీ రోడ్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఒకే మ్యాచ్లో 5 క్యాచ్లు అందుకున్న ఘనత రోడ్స్ పేరిట ఇప్పటికి నిలిచిపోయింది. తాజాగా ఐసీసీ క్రిస్టమస్ సందర్భంగా మరోసారి జాంటీ రోడ్స్ రనౌట్ ఫీట్ను స్నో స్టాపింగ్ మూమెంట్ పేరుతో ట్విటర్లో షేర్ చేసింది. As a part of our Crickmas celebrations, we bring you some of the biggest 'snow'stopping instances in cricket history ❄️❗ Who remembers this incredible run-out by Jonty Rhodes from the 1992 @cricketworldcup 🤩 pic.twitter.com/cQM5f73TcJ — ICC (@ICC) December 23, 2020 -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పాక్ కోచ్
లండన్ : భారత్తో ఓటమి అనంతరం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘోర పరాజయం అనంతరం తమ జట్టుపై అన్ని వర్గాల నుంచి వచ్చిన విమర్శలు, ట్రోలింగ్తో తనపై నెలకొన్న ఒత్తిడి తట్టుకోలేకపోయానని తెలిపాడు. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తేరుకున్న పాక్ తమ తదుపరి మ్యాచ్ను న్యూజిలాండ్తో బుధవారం ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆర్థర్ మీడియాతో ముచ్చటించాడు. ‘ పోయిన ఆదివారం నేను చచ్చిపోవాలనుకున్నాను. చూస్తుండగానే మ్యాచ్ను కోల్పోయాం. ఒక్క చెత్త ప్రదర్శన కారణంగా ఆ ఆలోచన కలిగింది. ఒక్క మంచి ప్రదర్శన చేస్తే అన్నీ సర్దుకుంటాయని ఆలోచించా. ఇది ప్రపంచకప్ కాబట్టి.. మీడియా సమీక్షలు, అభిమానులు అంచనాలు అన్ని సాధారణమే. సరిగ్గా వారం తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్లో మా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆడారు. ఈ విజయం మాపై ఒత్తిడి తగ్గించింది. ఈ గెలుపుతో కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా. ఇంకా మేం టైటిల్ రేసులో ఉన్నాం. మా తదుపరి మ్యాచుల్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్లతో ఆడాల్సి ఉంది. వాటిలో కచ్చితంగా గెలుస్తాం. మిగతా అన్ని జట్లలాగే మా జట్టు కూడా బలంగా ఉంది’ అని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆర్థర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఓ ఫ్రొఫెషనల్ కోచ్గా ఉండి ఒక్క ఓటమికే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వచ్చాయా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటగాళ్లలో స్పూర్తిని నింపాల్సిన కోచ్ ఇలా డీలా పడితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పాక్కు దక్షిణాఫ్రికా విజయం ఊరటనిచ్చింది. బుధవారం కివీస్తో జరిగే మ్యాచ్లో పాక్ విజయం సాధిస్తే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. చదవండి : వైరల్: భారత్-పాక్ మ్యాచ్లో గెలిచిన ‘ప్రేమ’ నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా! -
‘కొంతమంది నోళ్లు మూయించాం’
లండన్: వన్డే వరల్డ్కప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా కొంతమందితోనైనా నోర్లు మూయించామని పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్థర్ పేర్కొన్నాడు. పాక్ తప్పక గెలవాల్సిన సమిష్టింగా పోరాడి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్థర్.. తమను విమర్శించిన వాళ్లకు ఇదొక హెచ్చరిక అని వ్యాఖ్యానించాడు. ‘ మా ఆటగాళ్లు ఆడతారని నాకు తెలుసు.వారు తిరిగి గాడిలో పడడంతో రాణించారు. గతవారం టీమిండియాతో ఓటమి కారుణంగా వారిపై అనేక విమర్శలు వచ్చాయి. మీడియా, సోషల్ మీడియాతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ విజయంతో ప్రస్తుతం కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. ఈ విజయంతో తమ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయన్నాడు. తాము తదుపరి మ్యాచ్ల్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్లతో ఆడాల్సి ఉందని, వాటిలో కచ్చితంగా గెలుస్తామన్నాడు. మిగతా అన్ని జట్లలాగే తమ జట్టు కూడా బలంగా ఉందన్నాడు. -
పాక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
లండన్ : ప్రపచంకప్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 49 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. భారత్తో ఓటమిని తట్టుకోలేని అభిమానులు తమ జట్టు ఆటగాళ్లను ఘోరంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై మండిపడ్డారు. అతనిపై సోషల్మీడియా వేదికగానే కాకుండా.. కళ్లెదుటనే అభ్యంతరకర పదజాలంతో తిట్టారు. అతని శరీరాకృతిపై కామెంట్లు చేశారు. తమ ఆటగాళ్లకు పిజ్జాలు, బర్గర్లు తినడం తప్పా ఆడటం రాదని కన్నీటి పర్యంతమయ్యారు. దక్షిణాఫ్రికాపై విజయానంతరం ఆ అభిమానులే తమ ఆటగాళ్లను ఆకాశానికెత్తున్నారు. ఎవరినైతే దారుణంగా తిట్టారో వారితోనే సెల్ఫీలు దిగుతున్నారు. తమ జట్టు విజయం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. గెలిచిన ఆనందంలో తమ భావోద్వేగాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. Pakistan making fans happy on and off the pitch 🤳#WeHaveWeWill | #CWC19 pic.twitter.com/jqb1gASXBT — Cricket World Cup (@cricketworldcup) June 23, 2019 కొందరైతే తమ ఆటగాళ్లు, కెప్టెన్ సర్ఫరాజ్ను దూషించిన తీరుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హరిస్ సొహైల్ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్స్లు), బాబర్ ఆజమ్ (80 బంతుల్లో 69; 7 ఫోర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. డుప్లెసిస్ (79 బంతుల్లో 63; 5 ఫోర్లు), డికాక్ (60 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. 6 మ్యాచ్లు ఆడిన పాక్ రెండు గెలిచి.. ఒకటి రద్దవ్వడంతో 5 పాయింట్లతో 7 స్థానంలో నిలిచింది. సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకోవాలంటే.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అప్గానిస్తాన్తో జరిగే ప్రతి మ్యాచ్ను గెలవాల్సిందే. పాక్ తమ తదుపరి మ్యాచ్ను న్యూజిలాండ్తో ఈ నెల 26 (బుధవారం)న ఆడనుంది. చదవండి : వైరల్: భారత్-పాక్ మ్యాచ్లో గెలిచిన ‘ప్రేమ’ సారీ సర్ఫరాజ్! నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా! -
అంతా ఐపీఎలే చేసింది : డూప్లెసిస్
లండన్ : ప్రపంచకప్ ముందు జరిగిన ఐపీఎలే తమ కొంపముంచిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ కొంతమంది ఆటగాళ్లను ఈ క్యాష్ రిచ్ లీగ్కు అనుమతించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. తీవ్ర పని భారంతో తమ ఆటగాళ్లు ఈ మెగాటోర్నీలో రాణించలేకపోయారని తెలిపాడు. ముఖ్యంగా కగిసో రబడ వైఫల్యం తమ జట్టు విజయాలపై ప్రభావం చూపిందన్నాడు. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 49 పరుగుల తేడాతో సఫారి జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో దక్షిణాఫ్రికా ప్రపంచకప్ ప్రస్థానం లీగ్ దశలోనే ముగిసింది. ఇప్పటి వరకు ఒకటే విజయంతో సరిపెట్టుకున్న సఫారీ ఐదు మ్యాచ్ల్లో ఓడింది. దీంతో సెమీస్ అవకాశాల్ని పూర్తిగా కోల్పోయింది. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో తమ పరాజయంపై డూప్లెసిస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. లీగ్ దశలోనే వెనుదిరగడం చాలా ఇబ్బందికరంగా ఉందన్నాడు. ‘మా ఓటమిపై సరైన సమాధానం చెప్పలేకపోతున్నాను. మేం అసలు ఐపీఎల్ ఆడకుండా ఉండాల్సింది. కనీసం రబడనైనా అడ్డుకోవాల్సింది. అతను ఐపీఎల్ ఆడకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కేవలం ఐపీఎల్ వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందనుకోవడం లేదు. కానీ కొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే.. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి తాజాగా బరిలోకి దిగేవారు. విశ్రాంతి లేకుండా ఆడితే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి. ఇతర పేసర్లు గాయాలు కూడా రబడపై ప్రభావం చూపాయి. అతనొక్కడే భారాన్ని మోసాడు. ఇది అతని బౌలింగ్పై ప్రభావం చూపింది. టోర్నీ ఆరంభంలో రాణించకుంటే.. మనపై మనకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. రబడ విషయంలో కూడా అదే జరిగింది. అతను ఎదో ఒకటి చేయాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఏం జరగలేదు. ఎదో చేయాలనే తపన రబడ వేసే ప్రతి బంతిలోను, చివరకు బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా కనిపించింది’ అని డూప్లెసిస్ చెప్పుకొచ్చాడు. 6 మ్యాచ్ల్లో రబడ 50.83 సగటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. తీవ్ర వర్క్లోడ్తో అతను రాణించలేకపోయాడు. ఇది దక్షిణాఫ్రికా గెలుపుపై ప్రభావం చూపింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 12 మ్యాచ్ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. గాయం నుంచి కోలుకున్న ఆ జట్టు స్టార్పేసర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్లో ఆడటంతో మళ్లీ గాయపడ్డాడు. ఇది కూడా దక్షిణాఫ్రికాపై తీవ్ర ప్రభావం చూపింది. చదవండి : పాకిస్తాన్ గెలిచింది... -
మూడో పాక్ క్రికెటర్గా..
లండన్: పాకిస్తాన్ క్రికెటర్ హరీస్ సొహైల్ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే వరల్డ్కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో సొహైల్(89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో పాకిస్తాన్ 309 పరుగుల టార్గెట్ను నిర్దేశించకల్గింది. ఈ క్రమంలోనే సొహైల్ దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. వరల్డ్కప్ మ్యాచ్ల్లో యాభైకి పైగా వ్యక్తిగత పరుగులు సాధించే క్రమంలో అత్యధిక స్టైక్రేట్ నమోదు చేసిన మూడో పాక్ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్లో సొహైల్ స్టైక్రేట్ 150.84గా ఉంది. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సొహైల్ ఆది నుంచి విజృంభించి ఆడాడు. 50కి పైగా పరుగుల్ని ఫోర్లు, సిక్సర్లతోనే సాధించాడు. దాంతో వరల్డ్కప్లో అత్యధిక స్టైక్రేట్ సాధించిన పాక్ ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. అంతకుముందు వరల్డ్కప్ మ్యాచ్ల్లో అత్యధిక స్టైక్రేట్ నమోదు చేసిన పాక్ ఆటగాళ్లలో ఇమ్రాన్ ఖాన్ 169. 69స్టైక్ రేట్(1983, శ్రీలంకపై 33 బంతుల్లో 56 పరుగులు), ఇంజమాముల్ హక్ 162. 16(1992, 37 బంతుల్లో 60)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్థానాన్ని తాజాగా హరీస్ సొహైల్ ఆక్రమించాడు. -
సర్ఫరాజ్ భయపడ్డాడా?
లండన్: వన్డే వరల్డ్కప్లో భారత్పై ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్సీలోనూ ఇటు ఆటలోనూ వైఫల్యం చెందడంతో సర్ఫరాజ్పై ఆ దేశ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోశారు. ఇక పాక్ అభిమానులైతే పిజ్జాలు, బర్గర్లు తింటూ పొట్ట బాగా పెంచావే కానీ ఆటపై ఏకాగ్రత లేదంటూ మండిపడ్డారు. అయితే భారత్తో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు సిద్ధమైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగింది. హరీస్ సోహైల్(89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), బాబర్ అజామ్(69), ఇమాముల్ హక్(44), ఫకార్ జమాన్(44)లు రాణించడంతో ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అంతవరకూ బాగానే ఉంది.. కానీ పాక్ కెప్టెన్ సర్పరాజ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. (ఇక్కడ చదవండి: చెలరేగిన సొహైల్..) పాక్ టాపార్డర్ ఆటగాళ్లలో పలువురు మెరుగైన ప్రదర్శన కనబరిచి మంచి స్కోరుకు బాటలో వేసిన సమయంలో సర్ఫరాజ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగడం పాక్ అభిమానులను ఆలోచింపజేస్తోంది. సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగే సర్పరాజ్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ రావడమే ఇప్పుడు హాట్ టాపిక్. బ్యాట్స్మన్ అయిన సర్ఫరాజ్ కింది వరుసలో బ్యాటింగ్ చేయడమేంటనేది సగటు క్రీడాభిమానికి మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇమాద్ వసీం ఐదో వికెట్గా పెవిలియన్ చేరిన తర్వాత సర్ఫరాజ్ బ్యాటింగ్కు వస్తాడని అనుకున్నారంతా. 48 ఓవర్ చివరి బంతికి ఇమాద్ వసీం ఔట్ కాగా అప్పటికి పాక్ స్కోరు 295. ఆ సమయంలో వహాబ్ రియాజ్ బ్యాటింగ్కు దిగాడు. ఇక్కడ వహాబ్ విఫలమయ్యాడు. ఇంకా రెండు ఓవర్లు ఉన్న సమయంలో సర్ఫరాజ్ బ్యాటింగ్కు రాకుండా వహాబ్ను దింపడం ఆలోచనలో పడేసింది. అప్పుడు సర్పరాజ్ బ్యాటింగ్కు వచ్చి ఉంటే పాక్ స్కోరు మరింత పెరగడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పోవడంతో మరోసారి విమర్శలకు బాట వేసినట్లే కనిపిస్తోంది. అసలు సర్పరాజ్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధం కాలేదా లేక హిట్టింగ్ చేయలేక భయపడ్డాడా అనేది అతనికే తెలియాలి. ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న సర్పరాజ్ రెండు పరుగులే చేసి అజేయంగా నిలవడం గమనార్హం. ఇక్కడ సర్పరాజ్ అహ్మద్ స్టైక్రేట్ వంద ఉంది..ఒకవేళ మ్యాచ్లో ఫలితం తేడా వస్తే అతన్ని మాటలతో ఉతికి ఆరేసే స్టైక్రేట్ కూడా వందకు పోవడం ఖాయం. ఇది పాక్కు కీలక మ్యాచ్. ఆ జట్టు సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. -
చెలరేగిన సొహైల్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 309
లండన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్లో మెరిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 309 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. హరీస్ సొహైల్(89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా, బాబర్ అజామ్(69), ఇమాముల్ హక్(44), ఫకార్ జమాన్(44)లు రాణించడంతో పాకిస్తాన్ మూడొందల పరుగుల మార్కును చేరింది. ఇన్నింగ్స్ను ఇమాముల్ హక్- ఫకార్ జమాన్లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 81 పరుగులు జత చేసిన తర్వాత ఫకార్ జమాన్(44; 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. సఫారీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ వేసిన 15 ఓవర్ ఐదో బంతికి ఫకార్ జమాన్ పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ఇమాముల్ హక్కు బాబర్ అజామ్ జత కలిశాడు. ఈ జోడి 17 పరుగులు జత చేసిన తర్వాత ఇమాముల్ హక్(44; 57 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆపై మహ్మద్ హఫీజ్(20) నిరాశపరిచాడు. కాగా, హరీస్ సొహైల్ మెరుపులు మెరిపించి పాక్ స్కోరును గాడిలో పెట్టాడు. బాబర్ అజామ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే అజామ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.(ఇక్కడ చదవండి: ఇమ్రాన్ తాహీర్ ‘వరల్డ్కప్’ రికార్డు) ఈ జోడి 81 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత అజామ్ నాల్గో వికెట్గా ఔటయ్యాడు. ఆ సమయంలో సోహైల్కు ఇమాద్ వసీం కలిశాడు. వీరిద్దరూ 71 పరుగుల జత చేసిన తర్వాత ఇమాద్(23) ఐదో వికెట్గా ఔట్ కాగా, కాసేపటికి వహాబ్ రియాజ్(4) పెవిలియన్ చేరాడు. మరో మూడు పరుగుల వ్యవధిలో సొహైల్ కూడా ఔట్ కావడంతో స్కోరు వేగం తగ్గింది. దాంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఇదిలా ఉంచితే, పాక్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు రావడం ఇక్కడ గమనార్హం. చివరి ఓవర్లో రెండు బంతులు ఆడిన సర్పరాజ్ రెండు పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్ రెండు వికెట్లు తీశాడు. ఫెహ్లుక్వోయో, మర్కరమ్లకు తలో వికెట్ లభించింది. -
ఇమ్రాన్ తాహీర్ రికార్డు
-
ఇమ్రాన్ తాహీర్ ‘వరల్డ్కప్’ రికార్డు
లండన్: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో తాహీర్ ఈ ఫీట్ సాధించాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో భాగంగా తాహీర్ వేసిన 21 ఓవర్ మూడో బంతికి ఇమాముల్ హక్ను ఔట్ చేయడంతో వరల్డ్కప్లో సఫారీ జట్టు తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. ఇది తాహీర్కు 39వ వరల్డ్కప్ వికెట్. దాంతో అలెన్ డొనాల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. (ఇక్కడ చదవండి: ఒకే స్కోరు.. ఒకే బౌలర్) 2003 వరల్డ్కప్ తర్వాత క్రికెట్ గుడ్ బై చెప్పిన డొనాల్డ్.. ఓవరాల్గా వరల్డ్కప్లో 38 వికెట్లు సాధించాడు. తాజాగా ఆ రికార్డును తాహీర్ బ్రేక్ చేశాడు. పాక్తో మ్యాచ్లో మరో ఓపెనర్ ఫకార్ జమాన్ ఔట్ చేసిన తర్వాత డొనాల్డ్ సరసన చేరిన తాహీర్.. మరి కాసేపటికి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఇమాముల్ హక్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను అందుకున్న తాహీర్.. ఇప్పటివరకూ ఈ వరల్డ్కప్లో 10 వికెట్లను ఖాతాలో వేసుకోవడం మరో విశేషం. -
ఒకే స్కోరు.. ఒకే బౌలర్
లండన్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్ను ఇమాముల్ హక్- ఫకార్ జమాన్లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 81 పరుగులు జత చేసిన తర్వాత ఫకార్ జమాన్(44; 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. సఫారీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ వేసిన 15 ఓవర్ ఐదో బంతికి ఫకార్ జమాన్ పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ఇమాముల్ హక్కు బాబర్ అజామ్ జత కలిశాడు. ఈ జోడి 17 పరుగులు జత చేసిన తర్వాత ఇమాముల్ హక్(44; 57 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. కాగా, ఇమాముల్ హక్-ఫకార్ జమాన్లు 44 పరుగుల వ్యక్తిగత పరుగులు సాధించిన తర్వాత పెవిలియన్ చేరడం ఇక్కడ గమనార్హం. అయితే వీరిద్దరూ ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్లో ఔట్ కావడంతో ఒకే స్కోరు.. ఒకే బౌలర్ అనుకోవడం అభిమానుల వంతైంది. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్ 30 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. మహ్మద్ హఫీజ్(20) మూడో వికెట్గా ఔటయ్యాడు. -
పాకిస్తాన్ గెలిస్తేనే..!
లండన్: వరల్డ్కప్లో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. సఫారీలు ఆరు మ్యాచ్ల్లో నాలుగు ఓడి.. ఒకటి గెలిచారు. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దుకావడంతో కేవలం 3 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. పాక్ ఐదు మ్యాచ్ల్లో మూడు ఓడగా.. ఒకటి గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. దీంతో ప్రస్తుతం 3 పాయింట్లతో ఆ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్ పాక్ చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. గత మ్యాచ్లో పాక్ చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ ఓటమి బాధ నుంచి కోలుకుని సఫారీలపై నెగ్గాలని సర్ఫరాజ్ సేన పట్టుదలగా ఉంది. ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్, కెప్టెన్ సర్ఫరాజ్తో బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. మహ్మద్ ఆమిర్, హసన్ అలీ, వాహబ్ రియాజ్ బౌలింగ్ విభాగానికి నేతృత్వం వహించనున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా గత మ్యాచ్ల్లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్లోనూ సమష్ఠి ప్రదర్శనతో గెలవాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. సఫారీలకు సెమీస్ చేరే అవకాశాలు దాదాపు లేకపోయినప్పటికీ విజయాల బాటపట్టాలని యోచిస్తోంది. హషీమ్ ఆమ్లా, క్వింటన్ డికాక్, కెప్టెన్ డుప్లెసి బ్యాటింగ్కు పెద్ద దిక్కుగా ఉన్నారు. రబాడ, లుంగిడి ఎన్గిడి, క్రిస్ మోరిస్, ఇమ్రాన్ తాహిర్తో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ సర్ఫరాజ్ అహ్మద్ మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. తుది జట్లు పాకిస్తాన్ సర్పరాజ్ అహ్మద్(కెప్టెన్), ఇమాముల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, హరీస్ సోహైల్, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, వహాబ్ రియాజ్, షాహిన్ అఫ్రిది, మహ్మద్ అమిర్ దక్షిణాఫ్రికా డుప్లెసిస్(కెప్టెన్), డీకాక్, హషీమ్ ఆమ్లా, మర్కరమ్, వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వోయో, క్రిస్ మోరిస్, రబడా, లుంగి ఎన్గిడి, ఇమ్రాన్ తాహీర్