-
ఏపీలో అప్పులు.. లెక్కలు.. ఇక అంతా మాయేనా?
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంపద సృష్టిస్తాం.. ఇది టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే,పదే చేసిన ప్రచారం. ఆయనకు మద్దతు ఇస్తూ చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉందని జనసేన అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇచ్చేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చంద్రబాబు, పవన్లు అంటున్నారు.. పైగా సంపద సృష్టిస్తామంటున్నారు. అంటే అప్పులే చేయకుండానే ఇవన్నీ చేస్తారు కాబోలు!. రాష్ట్రానికి అదే మేలు" కదా అని చాలా మంది అనుకున్నారు. ఎలాగైతేనేం చంద్రబాబు, పవన్లు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఇబ్బడి ,ముబ్బడిగా సంపద రెడీ అయిపోతుందని ఆశించినవారు ఇప్పుడు బిత్తరపోతున్నారు. ఇరవైరోజుల్లోనే ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఇది ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియాకు పెద్ద వార్త కాలేదు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అవసరార్దం వెయ్యి కోట్లు రుణం సేకరించినా, ఇంకాస్త ఎక్కువ తీసుకున్నా,చాలా ఘోరం జరిగిపోతున్నట్లు, ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు విపరీతమైన ద్వేష ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఇరవై రోజుల్లోనే ఏకంగా ఏడువేల కోట్ల అప్పు చేస్తే అదసలు లెక్కే కాదన్నట్లుగా ఆ మీడియా వ్యవహరిస్తోంది. అంతేకాదు..జూలై నెలలో మరో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణానికి టీడీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అయితే ఈ అప్పుల గురించి నోరు తెరిస్తే ఒట్టు. నిజంగా వారికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా అప్పు తెచ్చిన ప్రతిసారి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు మీడియా సమావేశం పెట్టి ,తాము ఎందుకు అప్పు చేశామో ప్రజలకు వివరించాలి. దానిని సంపద సృష్టికి వాడారా?లేక సంక్షేమ స్కీములకు వాడారా అన్నది చెప్పాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్ లో స్కీములు అమలు చేస్తుంటే, డబ్బును పప్పు ,బెల్లాల మాదిరి పందారం చేస్తున్నారని, బటన్ నొక్కుడు తప్ప ఇంకేమి చేస్తున్నారని దుష్ప్రచారం చేసేవారు. అదే టైమ్ లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన స్కీములకన్నా మూడు రెట్లు అధికంగా వెల్ఫేర్ పధకాలు ప్రజలకు ఇస్తామని, దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టి ఊదరగొట్టారు. బహిరంగ సభలలో కన్నా, వీటిపై కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రస్తుతం మంత్రి అయిన నిమ్మల రామానాయుడు వంటివారు ప్రతి గృహానికి వెళ్లి అక్కడ ఎంత మంది పిల్లలు ఉంటే, వారందరికి నీకు పదిహేనువేలు, నీకు పదిహేనువేలు అంటూ,పద్దెనిమిదేళ్ల వయసు దాటిని మహిళ కనిపిస్తే నీకు పద్దెనిమిది వేల రూపాయలు అంటూ తెగ ప్రచారం చేశారు. సంబంధిత వీడియో వైరల్ కూడా అయింది.ఈ సంగతి పక్కనబెడితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన వృద్దాప్య పెన్షన్ నాలుగువేల రూపాయలను కొందరు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఇదిపాత స్కీమే అయినా వెయ్యి రూపాయలు పెంచారు. కనుక బాగానే హడావుడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల సిబ్బంది,ఇతర ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపించారు. టీడీపీ కార్యకర్తలంతా దీనిని ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అది వేరే విషయం.పెన్షన్ తో పాటు మూడు నెలల బకాయి మూడువేల రూపాయలు కూడా ఇచ్చారు.ఈ ఏడువేల రూపాయలను సుమారు అరవైఐదు లక్షల మందికి పంపిణీ చేయడానికి గాను సుమారు 4550 కోట్ల వ్యయం అవుతుంది. ఇదే టైమ్ లో దివ్యాంగులకు, కిడ్నీ బాధితులు,ఇతర అర్హులైన వర్గాల వారికి కూడా పెరిగిన పెన్షన్ ఇచ్చారు. దీనికి అయ్యే వ్యయం మరికొన్ని కోట్లు ఉంటుంది.ఈసారి బకాయిలు కూడా చెల్లించవలసి వచ్చినందున ఈ స్థాయిలో ఖర్చు అయినా, వచ్చే నెల నుంచి కొంత తగ్గి సుమారు రూ.2,600 కోట్ల వ్యయం అవుతుంది.ఇది కూడా చాలా ఎక్కువే. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెండువేల రూపాయల పెన్షన్ ను మూడువేల రూపాయలు చేసి ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ అమలు చేసింది. దానికి సుమారు రూ.1,800 కోట్ల వరకు అయ్యేది. విశేషం ఏమిటంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇచ్చిన మరో హామీ ప్రకారం బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ సదుపాయం కల్పించాలి.చంద్రబాబు వీటిలో కోతలుపెట్టకుండా అది కూడా ఇస్తే బహుశా నెలకు రూ.3,500 కోట్ల వరకు వెళ్లవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,పెన్షన్ లకు సుమారు రూ.4,500 కోట్లు అవవుతుంది. అంటే ఈ రెండు పద్దుల కిందే సుమారు ఏడెనిమిది వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నమాట.ఇదీ చదవండి: ఒక్క రోజే రూ.5,000 కోట్ల అప్పుఇవి కాకుండా అనేక ఇతర స్కీములు, ప్రభుత్వపరంగా ఉండే ఇతర వ్యయాలు ఉంటాయి. ఇవన్నీ లెక్క వేస్తే పదివేల కోట్ల రూపాయల అంచనా దాటిపోతుంది. కేవలం ఒక్క హామీ అమలుకే ఇంత మొత్తం ఖర్చు అయితే, ఇక సూపర్ సిక్స్ లోని ఇతర స్కీముల అమలుకు ఇంకెంత కావాలో గణించుకోవచ్చు. బహుశా నెలకు పదిహేనువేల కోట్ల రూపాయల వరకు అవుతుందేమో తెలియదు. కాకపోతే చంద్రబాబు తెలివిగా వాటన్నిటిని అలవాటు ప్రకారం ఎగవేస్తే చెప్పలేం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కాని, కేంద్రం నుంచి వచ్చే వాటా,సాయం కాని అన్ని కలిపినా పది,పన్నెండు వేల రూపాయలు మించి ఉండకపోవచ్చు. అప్పుడు అప్పులు చేయక తప్పని స్థితి ఏర్పడుతుంది.కేవలం ఒక స్కీము అమలు చేసినందునే ఏడువేల కోట్ల అప్పు చేస్తే, మరి మిగిలిన స్కీముల కోసం ఎంత డబ్బు సమీకరించాలి?ఎంత అప్పు చేయాలి?దీని గురించి చంద్రబాబు లేదా ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణాత్మకంగా చిత్తశుద్దితో చెబితే మెచ్చుకోవచ్చు. కాని వారు అలా చేసే అవకాశం ఉండదు. పైగా శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.అది వేరే కధ. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తే అప్పులపాలు అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇరవై రోజులలోనే ఎందుకు ఇంత అప్పు చేశారు?ఈ రకంగా ప్రతి నెల రుణం తీసుకుంటే ఏడాదికి సుమారు తొంభైవేల కోట్ల నుంచి లక్ష కోట్ల అప్పు చేయడానికి సిద్దపడుతున్నారా?లేదా ఆ మేరకు సంపద సృష్టిస్తారా? ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2019 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి దిగిపోయే టైమ్ కు ఖజానాలో వంద కోట్లే ఉంది. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మారే నాటికి సుమారు 5500 కోట్ల నిధులు ఉన్నాయట.దీని గురించి వారు మాట్లాడరనుకోండి. ఈ మొత్తం కాకుండా ప్రతిరోజు వచ్చే పన్నులు,పన్నేతర ఆదాయం ఉండనే ఉంటుంది. ఇవేవి చాలక ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. అన్నింటికి జిందాతిలిస్మాత్ మాదిరి.. అమరావతిని అభివృద్ది చేస్తామని, ఆ తర్వాత భూములు అమ్మి వేలు,లక్షల కోట్లు పంపాదిస్తామని, అదే సంపదని తెలుగుదేశం నేతలు ప్రచారం చేశారు. భూములు అమ్మితే లక్షల కోట్ల ఆదాయం వస్తుందో,రాదోకాని, ముందుగా ఆ ఏభైఐదువేల ఎకరాలు అభివృద్ది చేయడానికి సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ మొత్తాన్ని ఎక్కడ నుంచి తెస్తారో వీరు చెప్పడం లేదు. ఇంకా ఏ రకంగా సంపద వస్తుందో వీరు ఇంతవరకు వెల్లడించలేదు. పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి మాదిరి చంద్రబాబు, పవన్ లు డబ్బును ఏమైనా సృష్టించే అవకాశం ఉందా?అన్న సందేహం రావచ్చు.అది సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే.ఈ మొత్తం ప్రక్రియలో అయితే సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన లక్షల కోట్ల రూపాయల విలువైన స్కీములను ఎగవేయాలి. అంటే ప్రజలను మోసం చేయాలి. లేక మభ్య పెట్టాలి. లేదంటే అప్పులు మరింతగా తెచ్చి వాటిని అర్హులందరికి పంచిపెట్టాలి. అది కూడా బటన్ నొక్కుడు కిందే వస్తుంది కదా?అప్పుడు ఏపీ రెండు శ్రీలంకలు అవుతుంది కదా! అయినా ఫర్వాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అంతా బ్రహ్మండంగా ఉన్నట్లు, ఆయన అప్పుల ద్వారా సంపద సృష్టించడంలో చాలా శ్రమపడుతున్నట్లు పిక్చర్ ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉంది కనుక ఏమి చేసినా వారికి పచ్చగానే కనపడవచ్చు.కాని ప్రజలకు అలా కనిపిస్తుందా? అంటే చెప్పలేం. పాత వృద్దాప్య పెన్షన్ స్కీములో వెయ్యిరూపాయలు పెంచి అమలు చేశాం కనుక సూపర్ సిక్స్ అయిపోయినట్లేనని ప్రచారం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు సుమా!.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
T20 World Cup 2024: మెల్బోర్న్ ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేసిన విరాట్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), శివమ్ దూబే (10) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (11) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.THE GOAT HAS ARRIVED IN T20I WORLD CUP 2024. 🇮🇳 pic.twitter.com/5vZTr1vTHK— Johns. (@CricCrazyJohns) June 20, 2024ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేసిన విరాట్ఈ మ్యాచ్లో విరాట్ 2022 టీ20 వరల్డ్కప్లో మెల్బోర్న్ మైదానంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్లో బాదిన ఐకానిక్ సిక్స్ను రిపీట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో విరాట్ కొట్టిన సిక్సర్ మెల్బోర్న్ ఐకానిక్ సిక్సర్ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్లో మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన విరాట్.. 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. -
TDP సూపర్ సిక్స్.. అట్టర్ఫ్లాప్ ఫిక్స్
అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చేయడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇలానే 2014లో అలవి కాని హామీలు 650 వరకూ ఇచ్చేసి.. గద్దెనెక్కిన తరువాత వాటిని తుంగలో తొక్కేసిన ఆయన.. మేక వన్నె పులిలా.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వస్తూ సూపర్ సిక్స్ పేరిట గుప్పిస్తున్న హామీలు ఏవిధంగా నమ్ముతామని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ రుణ వాయిదాలు చెల్లించవద్దని చంద్రబాబు ఢంకా బజాయించి మరీ చెప్పారు. బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలు కూడా చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని గొప్పగా చెప్పారు. చంద్రబాబు మాటలు అమాయకంగా నమ్మిన చాలామంది తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. చివరకు రుణ భారం తడిసి మోపెడై, బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుకుని అవమానాల పాలైన రైతులు, డ్వాక్రా మహిళలు లబోదిబోమన్నారు. తనఖా పెట్టిన బంగారం బ్యాంకుల నుంచి ఇంటికి వచ్చేస్తుందని నమ్మి మోసపోయారు. రైతులకు ‘బాబు’గారి జెల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు సహకార, వాణిజ్య బ్యాంకుల నుంచి ఏటా రూ.3,290 కోట్ల రుణాలు తీసుకుంటారు. వారికి రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. చివరకు అరకొరగా రూ.25 వేల లోపు మాత్రమే చేసి, మధ్యలోనే వదిలేసి, రైతులను నిలువునా ముంచేశారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న హామీలను ఏవిధంగా నమ్మాలని రైతులు ప్రశి్నస్తున్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారిలా.. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ ప్రకటించారు. అది నమ్మి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,10,336 స్వయం సహాయక సంఘాల్లోని 10,71,078 మంది మహిళలు అప్పటికి తమపై ఉన్న రూ.1,07,107 కోట్ల రుణాలు మాఫీ అయిపోతాయని సంబరపడ్డారు. తీరా గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు చిల్లిగవ్వ కూడా మాఫీ చేయకుండా దగా చేశారు. దీంతో ఆయనకు ఓట్లేసి మోసపోయామని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు – కుంకుమ పేరిట ప్రతి డ్వాక్రా మహిళకు మూడు విడతలుగా (రూ.2,500, రూ.3,500, రూ.4,000) రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా దానిని కొంతమందికే పరిమితం చేశారు. అది కూడా రూ.2,500, రూ.3,500 మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన రూ.4 వేలకు చెక్కులు ఇచ్చి ఏప్రిల్ చివరిలో మార్చుకోవాలని సూచించారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ చెక్కులు కాస్తా చెల్లుబాటు కాకుండా పోయాయి. వాటిని మహిళలు చిత్తుకాగితాల్లా చెత్తబుట్టలో వేయాల్సి వచ్చింది. నిరుద్యోగులకు కుచ్చుటోపీ 2014 ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చేంత వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, కొంత మందికి మొక్కుబడిగా రూ.1,000 చొప్పున వేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంకా కాపులకు రిజర్వేషన్, ముస్లింలకు ప్రధాన నగరాల్లో హజ్ హౌస్లు నిర్మిస్తామంటూ ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు గాలికొదిలేశారు. ఇలా అప్పట్లో ఆయన ఇచ్చిన హామీల్లో దేనినీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా వంచించారు. చివరకు టీడీపీ అధికారి వెబ్సైట్ నుంచి నాడు ఇచ్చిన మేనిఫెస్టోను సైతం మాయం చేసేశారు. అప్పట్లో ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు.. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జనం నిలదీస్తారనే జంకూ గొంకూ లేకుండా ఈ ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పథకాలు అంటూ మరోసారి చేస్తున్న ప్రచారాన్ని నమ్మబోమని ప్రజలు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీల తరఫున టీడీపీ నుంచి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో ఇస్తున్న నాలుగు పేజీల బుక్లెట్ను చాలామంది ఏమాత్రం చూడకుండా పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు తీరుకు పూర్తి భిన్నంగా గత ఎన్నికల వేళ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేసిన వైఎస్సార్ సీపీకే తమ మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ‘ఆడియో’ దుమారం -
విండీస్ విజయం; చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం
క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా వెస్టిండీస్ జట్టు సూపర్ సిక్స్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే వరల్డ్కప్ అర్హత అవకాశాన్ని కోల్పోయిన వెస్టిండీస్కు ఈ విజయం ఊరట మాత్రమే. బుధవారం సూపర్ సిక్స్లో భాగంగా వెస్టిండీస్, ఒమన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. సూరజ్ కుమార్ 53 పరుగులు నాటౌట్, షోయబ్ ఖాన్ 50 పరుగులతో రాణించగా.. అయాన్ ఖాన్ 30, కశ్యప్ 31 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ మూడు వికెట్లు తీయగా.. కైల్ మేయర్స్ రెండు, కెవిన్ సింక్లెయిర్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 100 పరుగులు) శతకంతో మెరవగా.. కెప్టెన్ షెయ్ హోప్ 63 నాటౌట్, పూరన్ 19 పరుగులు నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. -
హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్
జింబాబ్వే జట్టును దురదృష్టం వెంటాడింది.వరల్డ్కప్కు అర్హత సాధించాలన్న కల చెదిరింది. సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో గ్రూప్ దశలో వరుస విజయాలతో చెలరేగింది. సీన్ విలియమ్స్ వరుస సెంచరీలకు తోడుగా సికందర్ రజా ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తుండడంతో జింబాబ్వే ఈసారి వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తుందని అంతా భావించారు. అయితే సూపర్ సిక్స్ దశకు వచ్చేసరికి చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయంతో జింబాబ్వే అవమాన భారంతో వరల్డ్కప్ అర్హత రేసు నుంచి నిష్క్రమించింది. క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ రేసులో భాగంగా మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ ఆరో మ్యాచ్లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 235 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. రియాన్ బర్ల్ 84 బంతుల్లో 83 పరుగులు వీరోచిత పోరాటం వృథాగా మిగిలిపోయింది. మెస్లీ మెద్వెర్ 40, సికందర్ రజా 34 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోల్ మూడు వికెట్లు తీయగా, బ్రాండన్ మెక్ముల్లన్ రెండు, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ 48, మాథ్యూ క్రాస్ 38, బ్రాండన్ మెక్ముల్లన్ 34, మున్సే 31, మార్క్ వాట్ 21 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. చటారా రెండు, నగరవా ఒక వికెట్ పడగొట్టాడు. సూపర్ సిక్స్లో వరుస రెండు ఓటములు జింబాబ్వే కొంపముంచితే.. తొలి మ్యాచ్లో ఓడినా వరుసగా రెండు విజయాలతో ప్లస్ రన్రేట్తో ఉన్న స్కాట్లాండ్ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టుకు వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించే చాన్స్ ఉంది. స్కాట్లాండ్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ గెలిస్తే నేరుగా వరల్డ్కప్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడినా స్కాట్లాండ్కు అవకాశం ఉంటుంది. కాకపోతే నెదర్లాండ్స్ చేతిలో భారీ ఓటమి పాలవ్వకుండా జాగ్రత్తపడాలి. స్కాట్లాండ్తో మ్యాచ్లో నెదర్లాండ్స్ 30 కంటే ఎక్కువ పరుగులతో గెలవాలి లేదంటే చేజింగ్లో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ను అందుకోవాలి. అప్పుడే నెదర్లాండ్స్ వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం డచ్ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. స్కాట్లాండ్ను ఓడించినా ఆ జట్టు ఆరు పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్రేట్ కీలకం కానుంది. Final World Cup 2023 spot qualification scenario: Scotland - win and grab their tickets for India. Netherlands - win by 30+ runs or chase the target with 6 overs to spare. pic.twitter.com/R0HzIljTSl — Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2023 చదవండి: #AlexCarey: 'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి' -
భారత మహిళల జోరు
‘సూపర్ సిక్స్’ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై విజయం మెరిసిన మిథాలీ రాజ్, మోనా కొలంబో: లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు... ‘సూపర్ సిక్స్’ దశను కూడా విజయంతో మొదలుపెట్టింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో టీమిండియా తమ ఖాతాలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్లో మిథాలీ రాజ్ బృందం 49 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 205 పరుగులు సాధించింది. మోనా మేష్రమ్ (85 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (85 బంతుల్లో 64; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడంతోపాటు రెండో వికెట్కు 96 పరుగులు జోడించారు. మిథాలీ, మోనా పెవిలియన్ చేరుకున్నాక... బ్యాట్స్విమెన్ వేద కృష్ణమూర్తి (28 బంతుల్లో 18; ఒక ఫోర్, ఒక సిక్స్), దేవిక వైద్య (21 బంతుల్లో 19; 2 ఫోర్లు), శిఖా పాండే (21 బంతుల్లో 21; 3 ఫోర్లు) దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా అవుటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మారిజెన్ కాప్, అయబోంగా ఖాక రెండేసి వికెట్లు పడగొట్టారు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 46.4 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. శిఖా పాండే (4/34), ఏక్తా బిష్త్ (3/22) దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశారు. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరిలకు ఒక్కో వికెట్ లభించింది. మిథాలీ రాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఇతర సూపర్ సిక్స్ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్లతో ఐర్లాండ్పై, శ్రీలంక 5 వికెట్లతో పాకిస్తాన్పై గెలిచాయి. శుక్రవారం జరిగే తమ రెండో సూపర్ సిక్స్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ ఆడుతుంది.