Super Six
-
సూపర్ సిక్స్ ఇవ్వాలని నాకూ ఉంది! ఇస్తే పని చేయరేమోనని ఇవ్వడం లేదు!
సూపర్ సిక్స్ ఇవ్వాలని నాకూ ఉంది! ఇస్తే పని చేయరేమోనని ఇవ్వడం లేదు! -
ఏమయ్యాయో బాబు ఇచ్చిన హామీలు..
-
బాబు మోసాలపై జగన్ నిలదీత : YS Jagan
-
దావోస్లో ఒక్క MOU జరగలేదు: వైఎస్ జగన్
-
సూపర్ సిక్స్ ఇవ్వలేమనడం మోసమే..: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పుడు అమలు చేయలేమని ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రకటన చంద్రబాబు వైఖరిని మరోసారి తేటతెల్లం చేసిందని ఎత్తి చూపారు. సూపర్సిక్స్ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా, అందుకు ఏవేవో సాకులు చెబుతూ.. వాటిని ప్రజలు నమ్మేలా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పెద్దమనిషి ఒక వైపు హామీలన్నింటినీ తుంగలో తొక్కి.. మరోవైపు విద్యుత్ చార్జీల మోతతో భారం మోపుతుండటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీయడం వంటి అంశాలను కూడా ప్రజల్లో ఎండగట్టాలని నిర్దేశించారు. చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింతగా మమేకం కావాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు.రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతోపాటు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటనలు, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోత, నిలిచి పోయిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఆగిపోవడం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. తొమ్మిది నెలల కూటమి పాలన ప్రజలకు వ్యతిరేకంగా సాగిందని, దీనివల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ... క్షేత్ర స్థాయి అంశాలను నేతలు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అంతటా అరాచకాలే..రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల దారుణాల గురించి నేతలు వైఎస్ జగన్తో చర్చించారు. ఇలాంటి అరాచకాలు ఎక్కడా చూడలేదని, మెజారిటీ లేని.. అసలు సభ్యులే లేని చోట కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఫీజు పోరుపై ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి పెండింగ్లో ఉండడంతో వాయిదా వేసిన అంశం సమావేశంలో చర్చకు వచ్చింది.రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ, పేద విద్యార్థులను దారుణంగా దెబ్బ తీస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో కేంద్రం 75 వేల మెడికల్ సీట్లు అదనంగా పెంచబోతోందని.. కానీ, చంద్రబాబు మాత్రం తమకు కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. పేద విద్యార్థుల పక్షాన ఈ అంశాన్ని ఫీజు పోరులో భాగం చేయాలని వైఎస్ జగన్ పార్టీ నాయకులను ఆదేశించారు.రాష్ట్రంలో మెడికల్ సీట్ల కుదింపు, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని కూడా ఫీజు పోరులో భాగం చేసి, పేద విద్యార్థుల పట్ల చంద్రబాబుకు ఉన్న కక్షను ప్రజల్లో బట్టబయలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, విడదల రజని, పార్టీ సీనియర్ నేతలు కోన రఘుపతి, ముదునూరు ప్రసాదరాజు, ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, కొరుముట్ల శ్రీనివాసులు, అదీప్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?
సాక్షి, అమరావతి: అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. బడ్జెట్ బయట, లోపల ఏడాది తిరక్కుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్లో ప్రధాన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.5,820 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇప్పటి వరకు బడ్జెట్లోనే కేవలం మార్కెట్ రుణాల ద్వారా చేసిన అప్పులు రూ.80,827 కోట్లకు చేరాయి. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా రూ.71,000 కోట్లు అప్పు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్లో చెప్పిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ.10 వేల కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. మరో పక్క రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల గ్యారెంటీల ద్వారా బడ్జెట్ బయట రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది.కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనంచంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే రూ.1,26,527 కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్ర నుంచి తీసుకునే అప్పలు వీటికి అదనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం. -
కూటమి ప్రభుత్వంలో విద్యార్ధులకు తీవ్ర ఇబ్బందులు
-
ప్రజలను చంద్రబాబు నిలువునా ముంచారు: ఆదిమూలపు సురేష్
-
సూపర్ సిక్స్ పేరుతో దగా... టీడీపీపై పరీక్షిత్ రాజు ఫైర్
-
మోసానికి మారుపేరు చంద్రబాబు: పెద్దిరెడ్డి
సాక్షి,వైఎస్సార్ జిల్లా : రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ సొమ్మును ఏం చేశారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గురువారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ అన్నారు...ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నారు. ఇంతకు ముందు అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చాను అన్నారు. ఇప్పుడేమో సూపర్ సిక్స్ గురించి మాట్లడడం లేదు. హామీ ఇచ్చే రోజు మీకు తెలియదా? వైఎస్ జగన్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు.. చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హులు. ప్రజల మనోభావాలపై రాళ్ళు వేశారు. ఏడు నెలల్లోనే రూ.1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ సొమ్ము ఏ సంక్షేమానికి ఇచ్చారు..? దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. వైఎస్ జగన్ కోవిడ్-19 సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. హామీ ఇచ్చిన తేదీ ప్రకారం సంక్షేమాన్ని అందించారు. ఆ సంక్షేమం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నేతలు, అధికారులు ఏపీకి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపించారు. కానీ చంద్రబాబు అలా కాదు. సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉన్నా.. డబ్బులు లేవని దాట వేస్తున్నారు. అంటే చంద్రబాబుకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యం లేదు. అధికారంలోకి వచ్చారు. ఆరోగ్య శ్రీతో పాటు, రాష్ట్రంలోని వైద్య విద్యను నిర్విర్యం చేశారు. మాట్లాడితే జగన్ విధ్వంసం చేశారని అంటున్నారు. పేదలను ఆదుకోవడం విధ్వంసమా.. అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం విధ్వంసమా..?సూపర్ సిక్స్ లేదు. గుండు సున్నా చేశారు. ఆ రోజు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఆనాడు చంద్రబాబుకి వంత పాడారు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. -
రాష్ట్ర విభజనకు చంద్రబాబు ముఖ్య కారకుడు అయ్యాడు: వేణుగోపాలకృష్ణ
-
మోసకారి బాబు.. మళ్లీ ఫెయిల్
-
మోసకారి బాబు.. మళ్లీ ఫెయిల్: YSRCP నేతలు
సాక్షి,వైఎస్సార్జిల్లా: సూపర్సిక్స్ హామీలు అమలు చేయలేనని సీఎం చంద్రబాబు చేతులత్తేయడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం(జనవరి28) ఈ విషయమై వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు స్పందించారు. ఎన్నికల హామీలు ఎగ్గొట్టే తన నైజాన్ని బాబు మరోసారి బయటపెట్టుకున్నారని, ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపిస్తున్నారని విమర్శించారు.కొవిడ్లోనూ వైఎస్ జగన్ సంక్షేమం అందించారు: వైఎస్ అవినాష్రెడ్డి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలో చంద్రబాబు విఫలమయ్యడని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. ఏపీ అప్పుల్లో ఉందంటూ చంద్రబాబు ఏ పథకమూ ఇవ్వలేమని చేతులెత్తేశాడన్నారు.‘2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు అప్పు ఉండేది. అప్పుడు రాష్ట్ర ఖజానాలో రూ.100 కోట్లు మాత్రమే ఉంది. రెండు సంవత్సరాలు కొవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.కొవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను ప్రజలకు అందజేశారు.మేనిఫెస్టోను దైవంగా భావించి పథకాలను పేదలకు వైఎస్ జగన్ అందించారు.హామీల అమలులో బాబు, వైఎస్ జగన్లకు చాలా తేడా ఉంది’అని అవినాష్రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట తప్పడం బాబు నైజం: కాటసాని రాంభూపాల్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో తల్లులకు 15 వేలు, పిల్లలకు 15 వేలు అంటూ వారు ప్రచారం చేసి మోసం చేశారుటీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలను మోసం చేశారుసంక్షేమ పథకాలు అమలు చేయకుంటే చొక్కా పట్టుకోమని చెప్పిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారుచంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంలో అందరికి సంక్షేమ పథకాలు అందించారుప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్రం అప్పుల పాలయ్యిందని బాబు చెప్పుకొస్తున్నారు40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన రాష్ట్రానికి ఏమి చెయ్యడం లేదురాష్ట్రంలో క్వాలిటీ చదువు కన్న క్వాలిటీ మద్యాన్ని చంద్రబాబు అందిస్తున్నారుచంద్రబాబు సూపర్ సిక్స్, రాష్ట్రంలో డూపర్ సిక్స్ అయింది, టీడీపీ నేతలు కూడా ఎవరు సూపర్ సిక్స్ పై మాట్లడం లేదుతెలుగు దేశం పార్టీ నేతలు ఎమ్మెల్యేలు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పడం లేదుబాబు, పవన్ సమాధానం చెప్పాలి: పోతిన మహేష్ సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని,ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని బాబు చేతులెత్తేశారుఇది ప్రజలను మోసం చేయడం కదా అని చంద్రబాబు ,పవన్ చెప్పాలి..సూపర్ సిక్స్ అమలు చేయించే బాధ్యత నాదని పవన్ చెప్పాడు..ఇప్పుడు పవన్ స్పందించాలిచంద్రబాబు పాలన సంక్షేమ పధకాల కోత..పన్నుల మోత గా ఉంది..రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు చేపడుతున్నాడు. హెల్మెట్ లేకపోతే వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలు కట్టించుకొంటున్నారు..విద్యుత్ చార్జీల పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, చాలనాలు వసూళ్లు చేయడం సంపద సృష్టించడం అంటారా?వైఎస్ జగన్ దగ్గర చంద్రబాబు , పవన్ ట్యూషన్ చెప్పించుకోవాలి..వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమలులో సెంచరీ కొడితే... పవన, చంద్రబాబు డక్ ఔట్ అయ్యారు..బీజేపీ చంద్రబాబు పవన్ పట్టుకున్న మ్యానిఫెస్టో పట్టుకోలేదు..ప్రజలు చంద్రబాబు, పవన్ మాయలో పడ్డారు..దావోస్ లో చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వ్యక్తలు పారిపోయారు..ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేదు..తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష 78వేల కోట్లు ఎంవోయూలు చేసుకొని పండగ చేసుకుంటున్నారు..40ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ని చూసి పారిశ్రామిక వేత్తలు ఎందుకు రాలేదు..పవన్ దావోస్ పెట్టుబడులపై మాట్లాడాలి.. ఇది ప్రభుత్వ వైఫల్యం కదా?కర్నూల్ గ్రీన్ కో అత్భుతంగా వుందని చెప్పిన కంపెనీ జగన్ హయాంలో వొచ్చింది..దావోస్ పర్యటన తరువాత చంద్రబాబు నాలిక మడతపడుతుంది..వినేవాళ్ళు ఉంటే చంద్రబాబు చార్మినార్ కట్టారని చెపుతారు.2014 నుండి 2019 వరకు టీడీపీ ఒక్క పని కూడా చేయలేదు.. ఒక్క శాశ్వత నిర్ణయం కూడా చెప్పట్టలేదు..అమరావతి కి ఔటర్ రింగ్ రోడ్ కట్టింది.. విజయవాడ వెస్ట్ బైపాస్ కట్టింది.. అమరావతి లో తిరుపతి తరహా గుడి కట్టింది వైఎస్ జగన్ సింగపూర్ కంపెనీకి అమరావతి నిర్ణయం గురించి మాట్లాడారుఅమరావతి లో రిజిస్ట్రేషన్ చార్జీలు లేవని చంద్రబాబు చెపుతున్నారు..పేద మధ్యతరగతి వాళ్ళు సెంటు భూమి కొనగలరా?పేదలు కొనే దగ్గర రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి.. పెట్టుబడి దారులు కొనే దగ్గర చార్జీలు తగ్గుతాయి.పేదల ఇంట్లో , మహిళల కళ్లల్లో వెలుగులు వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది..చంద్రబాబు చెప్పినట్లు కేంద్రం నిధులు దారి మళ్ళితే పోలవరం పని పూర్తి అవుతుందా?ఏ పని చేయలేక.. ఏ పని చేతకాక గుడ్డ కాల్చి వైఎస్ జగన్ పై వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు..ఉద్దానం సమస్య కు శాశ్వత పరిష్కరం చూపిన నేత వైఎస్ జగన్ప్రాంతం చూడలేదు.. జగన్ సమస్య ను మాత్రమే చూసారు..చంద్రబాబు ప్రకటనలో మోసం,వంచన:మల్లాది విష్ణుచంద్రబాబు ప్రకటనలో మోసం ,దగా , వంచన స్పష్టంగా కనిపిస్తున్నాయిరైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో మోసం చేశావ్2024 ఎన్నికల్లో ఏపీ శ్రీలంక అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారుసూపర్ సిక్స్ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు గొంతు చించుకున్నారుజగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలిస్తామని చెప్పారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల జీవన స్థితిగతులను పట్టించుకోలేదుగద్దెనెక్కిన దగ్గర్నుంచి వైఎస్ జగన్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారుజీడీపీ 15 శాతం కంటే ఎక్కువ ఉంటేనే సంక్షేమం ఇస్తామంటున్నారు పథకాలివ్వాలంటే ఎనిమిది తొమ్మిదేళ్లు పడుతుందంటున్నారుమూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల ముందు తెలియదా ఏపీ ఆర్ధిక పరిస్థితిమా పథకాన్ని కాపీకొట్టి తల్లికి వందనం 15 వేలు ఇస్తామన్నారు..చేతులెత్తేశారు54 లక్షల మంది రైతన్నలను మోసం చేశారు18 వేలు ఇస్తామని కోటి 80 లక్షల మంది మహిళలను మోసం చేశారుకోటి మంది నిరుద్యోగులను దగా చేశారుబటన్ నొక్కడానికి జగన్ ఎందుకు ముసలమ్మ సరిపోతుందన్నారుఅమరావతి పేరుమీద వేల కోట్లు అప్పులు చేయడానికి మీరే కావాలాపోలవరానికి కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయడానికి మీ కూటమి అవసరమాప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డిజగన్ హయాంలో ఏపీలో పేదరికం 11.5 నుంచి 6శాతంకు తగ్గిందని నీతి ఆయోగ్ చెప్పిందినీతి ఆయోగ్ గణాంకాలకు ఏం సమాధానం చెబుతావ్ చంద్రబాబు ఈ ఏడు నెలల్లో తెచ్చిన లక్ష కోట్లకు పైగా అప్పు సొమ్మును ఏంచేశారో సమాధానం చెప్పాలి -
సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు మాటమారుస్తున్నారు
-
‘సూపర్ సిక్స్’ ఇవ్వలేమని స్పష్టంచేసిన ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలతో నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం వెల్లడి
-
బాబు మార్క్ మోసం
-
మహిళకు మోసం!
సాక్షి, అమరావతి: ఎన్నికలు ముగిసి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది... ఒకవైపు ఎనిమిది రాష్ట్రాల్లో మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు ఇప్పటికే ప్రారంభమైనా సీఎం చంద్రబాబు మాత్రం కసరత్తుల పేరుతో నింపాదిగా కాలక్షేపం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అమ్మ ఒడి నుంచి చేయూత దాకా.. సున్నా వడ్డీ నుంచి విద్యా దీవెన వరకు దాదాపు ప్రతి పథకంలోనూ నవరత్నాలతో అక్క చెల్లెమ్మలకే లబ్ధి చేకూర్చగా.. టీడీపీ సర్కారు పగ్గాలు చేపట్టాక మహిళా సాధికారతను గాలిలో దీపంలా మార్చింది! మహిళలకు రక్షణతోపాటు ఆర్థిక భద్రత కరువైంది. 2024 ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను ఆయా చోట్ల అధికారంలోకి రాగానే 8 రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వారికిచ్చిన హామీలను ఇంకా నెరవేర్చడం లేదని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మహిళలే కేంద్రంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పేర్లు, వాటికి బడ్జెట్లో కేటాయించిన నిధుల వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం గమనార్హం.ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ..సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్రంలో 19 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళకు ఏటా రూ.18 వేల చొప్పున (నెలకు రూ.1,500) ఇస్తానని చంద్రబాబు ఎన్నికల హామీల్లో వాగ్దానం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి పథకాల అమలు ప్రారంభమైనా సీఎం చంద్రబాబు మాత్రం ఏడు నెలలు గడిచిపోతున్నా ఆ ఊసే పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ‘ఆడబిడ్డ నిధి’ కోసం నిరీక్షిస్తున్న 1.80 కోట్ల మంది మహిళలు మోసపోయామని గ్రహిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పేద మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన చేయూత, సున్నా వడ్డీ, ఆసరా లాంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడంతో ఇప్పుడు అక్క చెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా ఉంది.8 రాష్ట్రాల్లో బడ్జెట్లోనూ కేటాయింపులు..మహిళలు కేంద్రంగా కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో ఇచ్చిన హామీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశాయని రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 8 రాష్ట్రాల్లో మహిళలకు ప్రకటించిన పథకాల అమలుకు ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు వ్యయం చేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల రెవెన్యూ రాబడుల్లో 3 శాతం నుంచి 11 శాతం వరకు మహిళా పథకాలకు వ్యయం చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.తల్లికి వందనం లేదు.. వంచనే!తాము అధికారంలోకి రాగానే మహిళల కోసం పలు పథకాలను అమలు చేస్తామని టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు దీని అమలు గురించి కనీసం బ్యాంకర్ల సమావేశంలో కూడా ప్రస్తావించలేదు. ఇక పీ–4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో చెప్పారు. ప్రత్యేక చర్యలు దేవుడెరుగు.. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలకే గండి కొట్టారు. ఇక సుప్రీం కోర్టు తీర్పు మేరకు అంగన్వాడీవర్కర్లకు గ్రాట్యుటీ చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ ఊసే మరిచిపోయారు. ఆశా వర్కర్ల కనీస వేతనం పెంచుతామని ఆశ పెట్టి ఊరించి నట్టేట ముంచారు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పి దాన్ని కూడా అమలు చేయడం లేదు. కలలకు రెక్కలు పథకం ద్వారా విద్యార్థినులకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఎన్నికలకు ముందే దరఖాస్తులు సైతం స్వీకరించి బుట్ట దాఖలు చేశారు. పండుగ కానుకలు ఇవ్వడంతో పాటు పెళ్లి కానుక పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ఇప్పటికే మూడు ప్రధాన పండుగలు వెళ్లిపోయాయి. పెళ్లి కానుక అందక ఎన్నో జంటలకు నిరాశే ఎదురైంది. సూపర్ సిక్స్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మంత్రుల బృందం అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇలా ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మహిళలను కూటమి సర్కారు వంచిస్తోంది.ఉచిత గ్యాస్లోనూ మాయఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి జిమ్మిక్కులతో మహిళలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు.జగనన్న ఉండి ఉంటే..వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండి ఉంటే గత ఏడు నెలల్లో తమకు ఎంతో మేలు జరిగేదని రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ గుర్తు చేసుకుంటోంది. మహిళలకు రక్షణతోపాటు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా జగనన్న ఎంతో భరోసా ఇచ్చారని పేర్కొంటున్నారు. గత ఐదేళ్లూ మహిళా సాధికారతకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. ఏటా ఏప్రిల్లో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే నెలలో విద్యా దీవెన.. జూన్లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక.. ఆగస్టులో మళ్లీ విద్యా దీవెన.. సెప్టెంబర్లో చేయూత.. నవంబర్లో తిరిగి విద్యా దీవెన.. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పథకాలతో లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టారు.వైఎస్సార్సీపీ హయాంలో నవరత్నాలతోపాటు పథకాలన్నీ మహిళలే కేంద్రంగా సంక్షేమాన్ని అందచేశారు. డ్రాపౌట్స్ను అరికట్టడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు జమ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన అన్ని పథకాలను కూటమి సర్కారు కక్షపూరితంగా నిలిపివేయడంతో ఇంటిని చక్కదిద్దే మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా అమలు చేయకుండా పిల్లలను సైతం మోసగించారు. అమ్మ ఒడి పథకాన్ని నిలిపివేసిన కూటమి ప్రభుత్వం కనీసం తల్లికి వందనం పథకాన్నైనా అమలు చేయకుండా కక్షపూరితంగా వ్యవహరించింది. ఇక మహిళలకు వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాలను కూటమి సర్కారు అటకెక్కించడంతో అన్ని వర్గాల మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
బాబు అబద్ధాలతో రాజకీయ దుమారం
-
సందడి లేని సంక్రాంతి
చేతిలో డబ్బుల్లేక పేద, మధ్యతరగతి ప్రజల దిగాలుపండగంటే కొత్త దుస్తులు, పిండి వంటలు, కొత్త వస్తువుల కొనుగోళ్లు, ఇంటికొచ్చిన బంధువులకు కానుకలు, చుట్టుపక్కలోళ్లకు పెట్టుబతలు.. గ్రామస్తులంతా తలో చేయి వేసి నిర్వహించే సామూహిక సంబరాలు.. ఇలా కోలాహలం కళ్లకు కట్టేది. ఈ ఏడాది ఏ ఊళ్లో అయినా ఇలాంటి సందడి కనిపిస్తుందేమోనని దివిటీ పట్టుకుని వెతికినా కనిపించని దుస్థితి. అన్ని వర్గాల ప్రజల్లో అదో నిర్లిప్తత, నైరాశ్యం. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై ‘సాక్షి’ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించాయి. ‘ఆనందంగా పండుగ చేసుకోవాలని ఉంది. అయితే అందుకు చేతిలో నాలుగు డబ్బులుంటేనే కదయ్యా..’ అని అంటున్నారు ఊరూరా జనం. పండగ అంటే గత ఐదేళ్లలోనే అని గుర్తు చేసుకున్నారు. ‘ఊళ్లో పరిస్థితి బాగోలేదు.. ఇంట్లోనూ అందుకు భిన్నంగా లేదు’ అని పెద్దలు వాపోయారు. ‘స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ ఆగిపోయాయి.. సచివాలయాల్లో పనులు కావడం లేదు.. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయి.. ఇంటికొచ్చి పని చేసి పెట్టే వలంటీర్లు కనిపించడం లేదు.. నెలకు రెండుసార్లొచ్చే ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారో తెలీదు.. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా లేదు.. మత్స్యకార భరోసా లేదు.. పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం.. ఇళ్లకు పంపించేస్తున్నారు.. పరిస్థితి ఇట్లా ఉంటే ఏంది పండుగ చేసుకునేది?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో ఊరారా ఇదే దుస్థితి కనిపించింది. అందరి నోటా ఇదే మాట వినిపించింది. మొత్తానికి రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ కళ తప్పింది.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘అవసరానికి అందివచ్చే డబ్బులు.. కష్టకాలంలో ఆదుకునే పథకాలు.. వెరసి ప్రతి రోజూ పండుగ రోజే’ అన్నట్లుగా గత ప్రభుత్వ పాలనలో ప్రతి పేద ఇంటిలో సంతోషం కనిపించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతో ‘అవసరానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. కష్టకాలంలో పట్టించుకునే నాథుడే కరువు.. పెద్ద పండుగ వస్తున్నా కన్పించని సందడి’ అన్నట్లు ప్రతి ఇల్లూ మారిపోయింది. రాష్ట్ర ప్రజలు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి సందడి ఈ ఏడాది ఊళ్లల్లో కనిపించడం లేదు. గడిచిన ఏడు నెలల్లో సంక్షేమాభివృద్ధి ఆగిపోవడమే ఇందుకు కారణం. దేశంలోనే సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన ‘నవరత్నాలు’ ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజల గడపకు చేరడం లేదు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు జమ (డీబీటీ పద్దతి) చేస్తూ గత సర్కారు అమలు చేసిన పథకాలను కూటమి ప్రభుత్వం ఆపేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కనీసం కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ సైతం అమలు చేయక పోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఐదేళ్లు మహోజ్వల వైభవంగత ప్రభుత్వంలో ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి, చెప్పిన నెలలో చెప్పిన సమయానికి ఆయా వర్గాలకు ఆర్థిక లబ్ధిని వారి ఖాతాలకు (డీబీటీ పద్దతి) నేరుగా జమ చేసేవారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం అందించడంతోపాటు వారి రోజువారీ అవసరాలకు చేతిలో డబ్బులు ఉండేలా చేశారు. తద్వారా జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారు. విద్యార్థులు, లాయర్లు, ఆటో డ్రైవర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లతోపాటు పొదుపు మహిళలు, రైతులకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు. కోవిడ్ వంటి సంక్షోభంలోనూ ఆర్థిక లబ్ధిని కలిగించే సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించడంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రజలు ఆర్థిక ఇక్కట్లను అధిగమించి కొనుగోలు శక్తి కొనసాగేలా చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పర్వదినాల్లో కొత్త దుస్తులు, ఇంట్లోకి కావాల్సిన సామగ్రి, పిండి వంటలకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకునేలా చేశారు. ప్రధానంగా విద్య, వైద్యం పరంగా దిగుల్లేకుండా చేశారు. సచివాలయ–వలంటీర్ వ్యవస్థతో ఉన్న ఊళ్లోనే పనులన్నీ జరిగేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి మార్పుల దిశగా గత 70 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ అడుగులు పడలేదు. అలాంటి మార్పులను.. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని గత ప్రభుత్వం రాష్ట్రంలో సాకారం చేసింది. తద్వారా ఉన్నత వర్గాలతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా పండుగలను ఆనందంగా జరుపుకొనేలా ఆర్థిక ఊతం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లలో కోత పెట్టేందుకు కుయుక్తులు పన్నుతుండటంతో పాటు మరో పథకాన్ని ప్రజలకు అందివ్వలేదు. ఏడు నెలలైనా ఒక్క పథకాన్ని కూడా అందించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. గతంలో తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు చేతికి వచ్చేవని, ఆ డబ్బులతో కావాల్సినవి కొనుక్కుని ఇంటిల్లిపాది పెద్ద పండుగను గొప్పగా జరుపుకొనేవాళ్లమని గతం గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు. కూటమి సర్కారు రాకతో తమ పరిస్థితి తారుమారైందని వాపోతున్నారు. గత సర్కారే కొనసాగి ఉంటే గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలు పథకాల ద్వారా దాదాపు 2.63 కోట్ల మందికి రూ.20,102 కోట్లçకుపైగా లబ్ధి చేకూరేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పథకాలు అందక పోవడంతో పండుగ పూట పస్తులు తప్పడం లేదని పేదలు ఆవేదన చెందుతున్నారు.అసంపూర్తి గదిలో పాఠాలుఇది అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇందులో దాదాపు 220 మంది చదువుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండో విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొమ్మిది తరగతి గదుల నిర్మాణానికి రూ.1,93,88,511 మంజూరయ్యాయి. భవన నిర్మాణాలు కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వంలోనే రూ.75,42,872 ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మిగిలిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గదులకు కిటికీలు, డోర్లు, టైల్స్ అమర్చాల్సి ఉంది. బయటి వైపు ప్లాస్టింగ్ చేయాలి. గదుల కొరత కారణంగా అసంపూర్తిగా ఉన్న నూతన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కిటికీలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్ధులకు ఎండ తగలకుండా ఉండేందుకు యూరియా సంచులు అడ్డు పెట్టారు. బంధువులను పిలవలేకపోతున్నాంగత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల ఫీజు కట్టే వాళ్లం. ఈసారి ‘తల్లికి వందనం’ సాయం అందలేదు. పంటలో వచ్చిన డబ్బులన్నీ స్కూల్ ఫీజులకే చాలడం లేదు. పండుగ వచ్చినా మా ఇంట్లో ఎలాంటి సంబరాలూ చేసుకోలేని స్థితి. మా చుట్టుపక్కల ఏ గ్రామంలో చూసినా సంక్రాంతి సందడి కనిపించడం లేదు. చాలా మందితో ఫోన్లో మాట్లాడితే ఇదే సమాధానం చెబుతున్నారు. బంధువులను కూడా ఇళ్లకు పిలవలేని పరిస్థితి నెలకొంది.– రైతు గోవిందప్ప, సంతేబిదనూరు, హిందూపురంఇప్పుడు ఆ సందడి లేదువిజయనగరం పట్టణం మూడు రాష్ట్రాలకు వాణిజ్య కేంద్రం. గత ఐదు సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కంటే ఉమ్మడి విజయనగరం ప్రజల నుంచి మార్కెట్లో కొనుగోలుదారులు పెరిగారు. ఈ ఏడాది సంక్రాంతి పండగ వ్యాపారం తగ్గింది. ముఖ్యంగా బడుగు మధ్యతరగతి ప్రజల నుంచి కొనుగోళ్లు తగ్గాయి. గతంలో సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి వ్యాపారాలు ఉండేవి. అటు హోల్సేల్ ఇటు రిటైల్ వ్యాపారాలతో పట్టణం కళకళలాడేది. ఇప్పుడా సందడి కనిపించడం లేదు.– కాపుగంటి ప్రకాష్, అధ్యక్షుడు, విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్కొనుగోలు శక్తి తగ్గిందిగత ఐదేళ్ల కాలంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో కరోనా వచ్చినప్పటికీ సంక్రాంతంటే మార్కెట్ కళకళలాడేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోవడానికి అండగా నిలుస్తాయి. ఇప్పుడు ఏ పథకాలు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోళ్లు లేక ఈ సంక్రాంతి కళ తప్పింది. – షేక్ చాంద్బాషా, మండీ మర్చంట్, పాత మార్కెట్, కడప సంక్రాంతి పండగలానే లేదుఈ ఏడాది సంక్రాంతి కళ మా గ్రామంలో కనిపించడం లేదు. వ్యాపారాలు పడిపోయాయి. గ్రామస్తుల దగ్గర డబ్బులు లేవు. రొటేషన్ లేక కొనుగోలు శక్తి తగ్గిపోయింది. గ్రామంలో మా కిరాణా షాపు గత ఏడాది వరకు రోజుకు రూ.15 వేలు అమ్మకం జరిగేది. ప్రస్తుతం రూ.5 వేలు కూడా అమ్మకం జరగడం లేదు.– లావుడియా శ్రీనివాసరావు, సర్పంచ్, కనిమెర్ల, ఎన్టీఆర్ జిల్లాసంక్రాంతి కానుకైనా ఇస్తారని ఆశపడ్డాంపశువులు, వ్యవసాయ పనులకు సంబంధించిన తాళ్లు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గత ఆర్నెల్లుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కనీసం సంక్రాంతి కానుకైనా ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. అది కూడా లేకుండా చేశారు. పెరిగిన పప్పులు, నూనెల ధరలు చూస్తుంటే పండుగకు పిండి వంటలు మానుకోవడమే ఉత్తమంగా కన్పిస్తోంది. ఈ ఏడాది మాలాంటోళ్లందరూ ఇలానే అంటున్నారు. – ఎస్.భవాని, కొత్తవలస, విజయనగరం జిల్లాపంట మునిగినా పైసా ఇవ్వలేదు.. ఇంక పండగెక్కడ?వైఎస్సార్ హయాంలో కాలనీ ఇల్లు వచ్చింది. అందులోనే ఉంటున్నాం. జగన్ వచ్చిన తర్వాత మా అబ్బాయికి అమ్మ ఒడి పడేది. పదో తరగతి పూర్తయింది. మాకు 30 సెంట్లు భూమి ఉంది. గత ఏడాది వరకు జగన్ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడిసాయం ఇచ్చేది. రైతులం పంటలు పండించుకునేవాళ్లం. ఈసారి ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పోసప్పో చేసి పంట వేశాం. మొన్న అక్టోబర్లో వర్షాలకు పొలం మునిగిపోయింది. పంట నష్టం ఇస్తామని చెప్పారు. అధికారుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నాను. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంక మా బతుకులకు పండగొకటి. అన్నిటికీ ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. – పల్లా రాము, రైతు, టి.నగరపాలెం, భీమిలి నియోజకవర్గంగత ప్రభుత్వంలోనే ఎంతో మేలుప్రస్తుతం ఏ కుటుంబమూ సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఓ వైపు ఆర్థిక సమస్య, మరోవైపు ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ఉంటే పిండి వంటలు ఎలా వండుకుంటాం? సంతోషంగా పండగ ఎలా జరుపుకుంటాం? గత ప్రభుత్వ హయాంలోనే ఎంతో మేలు. ప్రతి ఏటా ఏదో ఒక పథకం కింద మా బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యేది. ఖర్చులకు, అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక పేద, మధ్య తరగతి ప్రజలం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – సీహెచ్ భారతి, గృహిణి, నెల్లూరుచేతిలో లెక్కేదీ?వైఎస్సార్ జిల్లా అనిమెల గ్రామంలో సుమారు 2,500 జనాభా ఉంది. ఈ గ్రామంలో గత ఐదేళ్లు సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కళ తప్పింది. పండుగ ఆనందం ఏ ఒక్క ఇంట్లోనూ కనిపించలేదు. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులకు తగ్గట్లు దిగుబడులు లేకపోగా, వచ్చిన అరకొర దిగుబడికి ఆశించిన ధరలు లేక రైతులు ఆవేదనతో ఉన్నారు. మరో వైపు ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదు. గత ప్రభుత్వంలో ఈ ఒక్క గ్రామానికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.1.8 కోట్లు లభించింది. ఈ లెక్కన ప్రజల చేతుల్లో డబ్బు ఏ రీతిన రొటేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని గ్రామస్తులు అన్నారు. ఏం ఉందని జరుపుకోవాలి?బాపట్ల జిల్లా రాజుబంగారుపాలెంలో 3,200 కుటుంబాలుంటున్నాయి. ఈ ఊళ్లో దాదాపు అందరూ సామాన్యులే. ‘ఏమ్మా.. పండుగ ఎలా చేసుకుంటున్నారు..’అన్న ప్రశ్నకు రైతులు, కూలీలు, చిరువ్యాపారులు, ఆటోవాలాలు, కూరగాయలమ్ముకునే మహిళలు.. ఇలా అందరూ కూడబలుక్కున్నట్లు ఒకే సమాధానం చెప్పారు. అమ్మ ఒడి రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. చేయూత రాలేదు. ధాన్యం పండిస్తే మద్దతు ధర ఇవ్వలేదు.. అంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ఊరిని నమ్ముకొని చికెన్ కొట్టు పెట్టుకుంటే జనం దగ్గర డబ్బులు లేక కొట్టు మూయాల్సి వచ్చిందని వెంకటేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది. పిల్లోళ్లకు బట్టలు కొందామంటే డబ్బులు లేక ఉప్పుకయ్యల్లో పనికెళుతున్నానని జొన్నలపావని కన్నీటి పర్యంతమైంది. జగనన్న లాగా నెలనెలా డబ్బులు ఇచ్చివుంటే అందరం సంతోషంగా పండుగ చేసుకునేవారమని సరస్వతి పేర్కొంది. పింఛన్లు తీసేశారని కొందరు, రైతు భరోసా ఇవ్వలేదని ఇంకొందరు వాపోయారు. ఇలాంటి కష్టాల్లో పండుగ ఎలా జరుపుకోగలమని ఊరు ఊరంతా ఎదురు ప్రశ్నిస్తోంది. సాయం అందితే కదా..కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం (వీకే రాయపురం) గ్రామంలో ఎవరిని కదిపినా చేతిలో డబ్బులు లేకుండా పండుగ ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. సుమారు 2,600 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఏ వీధిలో ఎవరిని పలకరించినా జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, అర్హులందరికీ పథకాలు రావడంతో గత ఏడాది సంక్రాంతిని ఊరు ఊరంతా హుషారుగా పండగ చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక వరుస తుపానులతో పంటలు నష్టపోయినా సాయం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ఏకైక మినీ రైస్మిల్లు గత సంక్రాంతికి ముందు కస్టమర్లతో కిక్కిరిసిపోయేదని, ఈ సంక్రాంతికి రోజుకు ఐదుగురు రావడమే గగనమైపోయిందని యజమాని రేలంగి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మద్యం, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా గ్రామంలోకి వచ్చేయడంతో రోజంతా కష్టపడ్డ రెక్కల కష్టంలో సగం సొమ్ము మద్యానికే వెచ్చించడం కుటుంబాల్లో చిచ్చు రేపుతోందని మహిళలు అంటున్నారు. నాడు వలంటీరు వ్యవస్థతో ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడు ఏ పని కావాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఇంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘బీమా’కు నైవేద్యం.. ఆరోగ్యం హరీ!
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాక్ల మీద షాక్లు ఇస్తోంది. సూపర్–6, సూపర్ సెవన్ హామీల ఎగవేతల పరంపరలో భాగంగా ఈసారి ప్రజారోగ్యానికి ఎసరు పెట్టింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. కేవలం రూ.2.5 లక్షలతో బీమా పథకాన్ని అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోని కుటుంబాలకే వర్తింపజేస్తామని చావు కబురు చల్లగా చెప్పారు! ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి ఇప్పటికే ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ట్రస్టు పరిధిలో అమలు చేసి 95 శాతం కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కాపీ కొట్టి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో ప్రైవేట్ బీమా కంపెనీని తెరపైకి తెచ్చి ప్రజారోగ్యాన్ని దళారీల చేతికి అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆరోగ్య బీమాను వర్తింపజేస్తే ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెబుతుండటం గమనార్హం. పదో వంతుతో సరి.. రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రజలను నమ్మించి గద్దెకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అందులో పది శాతానికి తగ్గించి రూ.2.5 లక్షలకు బీమాను పరిమితం చేసింది. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తించేలా మెలిక పెడుతోంది. దీన్ని ‘యూనివర్సల్ ఇన్సూరెన్స్’ అంటూ గొప్పలు చెబుతోంది. వాస్తవానికి రూ.25 లక్షల వరకూ పరిమితితో ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 95 శాతం కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు కల్పిస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎగవేతలు, కోతలే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్య భరోసాకు తూట్లు పొడుస్తున్నారు. దేశంలో ఇప్పటికే బీమా విధానాన్ని అమలు చేసిన పలు రాష్ట్రాలు పెదవి విరిచాయి. మహారాష్ట్ర, కేరళ బీమా విధానాన్ని విడనాడి తిరిగి ఆరోగ్యశ్రీ తరహా ట్రస్ట్ విధానం బాట పట్టాయి. దీన్ని పెడచెవిన పెట్టిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని బలి పెడుతోంది. అంతా అస్తవ్యస్థం.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా పథకం నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ అని పథకం పేరు మార్చడం మినహా కనీసం శాశ్వత సీఈవోను సైతం నియమించలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. దీంతో ఏడాది తిరగకుండానే ఆస్పత్రులు ఏకంగా నాలుగు సార్లు కూటమి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. అయినప్పటికీ సర్కారులో చలనం లేకపోవడంతో గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను ఆస్పత్రులు నిలిపివేశాయి. చికిత్స కోసం వచ్చిన రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఇక ఆరోగ్య ఆసరా కింద ఇప్పటికే రూ.నాలుగు కోట్లకు పైగా ప్రభుత్వం రోగులకు బకాయి పడింది. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న బీమా విధానంలో ఆసరా సాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజ్లు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్షీట్స్, బెటాడిన్ సొల్యూషన్ కొరత నెలకొంది. విశాఖ కేజీహెచ్లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో లేవు. దీంతో చేసేది లేక మందులు, సర్జికల్ ఐటమ్స్ బయట కొనుగోలు చేయాలని వైద్యులు రోగులకు చీటీలు రాసిస్తున్నారు. ఇక వైద్య పరికరాలు పాడైతే పట్టించుకునే వారే లేరు. ఆదుకున్న ఆరోగ్య ఆసరా.. ఒకవైపు ప్రజలకు సంపూర్ణ వైద్య భరోసా కల్పించిన వైఎస్ జగన్ మరోవైపు చికిత్స అనంతరం రోగులు కోలుకునే వరకూ ఆ కుటుంబం జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆదుకున్నారు. వైద్యులు సూచించిన మేరకు నెలకు రూ.5 వేల వరకూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన రోజే రోగుల ఖాతాల్లో జమ చేశారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారుల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఆస్పత్రి పాలైతే పోషణ కష్టతరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం అందించిన ఆరోగ్య ఆసరా సాయం కష్ట కాలంలో వారు ఆర్ధిక ఇబ్బందుల పాలు కాకుండా ఆదుకుంది. ఇలా వైఎస్ జగన్ హయాంలో ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభించింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ హయాంలో పథకం అమలైన తీరు, లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అరకొర ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీకి రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 2019–24 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.13 వేల కోట్లకుపైగా వెచ్చించి 45 లక్షల మందికిపైగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించింది. మరో 24.59 లక్షల మంది రోగులకు డిశ్చార్జీ అనంతరం జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లు చెల్లించారు. నాడు కోటిన్నర కుటుంబాలకు భరోసాదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా రూ.25 లక్షల వరకూ వైద్య పరిమితితో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసింది. చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, పేదలు వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో కేవలం తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకే పరిమితం అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ఆపద్భాందవిలా అండగా నిలిచింది. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పథకాన్ని విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. ఏకంగా 3,257 ప్రొసీజర్లలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు బైలాట్రల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్, గుండె మార్పిడి లాంటి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సలు సైతం గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా లభించాయి. 54 వేలకు పైగా పోస్టుల భర్తీ..ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా వైద్యశాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రధాన సమస్య మానవ వనరుల కొరతను నివారించేందుకు మునుపెన్నడూ లేని విధంగా 2019–24 మధ్య ఏకంగా 54 వేలకుపైగా వైద్య పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. ప్రివెంటివ్ కేర్లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్లకు (ఎంవో) గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని, 22.30 శాతం ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్రమే ఉన్నట్లు స్పష్టమైంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్సీ వైద్యులు తమ పరిధిలోని గ్రామాలను నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా సందర్శించి.. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందించేవారు. పట్టణ పీహెచ్సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల గత సర్కారు తీసుకున్న శ్రద్ధకు నిదర్శనం.జీరో వేకెన్సీ పాలసీ..2019–24 మధ్య వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఉద్యోగ విరమణ, వీఆర్ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేశారు. కేవలం వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ –ఇన్ –ఇంటర్వ్యూలు నిర్వహించారు. నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు దేశవ్యాప్తంగా 61 శాతం కొరత ఉండగా రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతను అధిమించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో అభినందించింది. ఏపీ విధానాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్లు ఇస్తూ మిగిలిన రాష్ట్రాలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడిచింది. ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ కాకపోవడంతో వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది.రెండో రోజు నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు సాక్షి, అమరావతి: నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలు రెండో రోజు మంగళవారం నిలిచిపోయాయి. రూ.3 వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించలేదు. దీంతో సోమవారం నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు అందించడం లేదు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ లబ్ధిదారులు చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్తున్నా నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేది లేక జేబులో డబ్బులు పెట్టి ప్రజలు, ఉద్యోగులు చికిత్సలు చేయించుకుంటున్నారు. మరోవైపు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చర్చలు నిర్వహించారు. నిలిపి వేసిన సేవలను పునఃప్రారంభించాలని కోరారు. పెండింగ్ బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు అందించలేమని ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. రెండు గంటల పాటు సాగిన చర్చల్లో త్వరలోనే రూ.500 కోట్లు బిల్లులు విడుదల చేస్తామని ఆస్పత్రులకు హామీ ఇచ్చినట్టు వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి వచ్చిన హామీపై అసోసియేషన్ సభ్యులతో చర్చించి, బుధవారం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆశా ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్కుమార్ తెలిపారు. -
మంత్రి లోకేశ్ను నిలదీసిన మహిళలు
-
సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?
సాక్షి, భీమవరం/ఉండి/కాళ్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ను మహిళా లోకం నిలదీసింది. సూపర్ సిక్స్ హామీలన్నీ ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురవడంతో లోకేశ్ కంగుతిన్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలనెలా రూ.1,500, ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఎప్పటినుంచి ఇస్తారో చెప్పాలని మహిళలు కోరారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి అమలు చేస్తారు సార్’ అని స్థానిక మహిళలు లోకేశ్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉండిలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో పలు ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేశ్కు వినతులు ఇచ్చేందుకు వచ్చిన స్థానిక మహిళలను పోలీసులు అడ్డుకుని బయటే ఉంచేశారు. వారు గేటు బయటి నుంచి లోకేశ్ను పిలవగా.. ఆయన వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు? సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రశి్నస్తూ లోకేశ్కు చుక్కలు చూపించారు. లోకేశ్ బదులిస్తూ.. ‘పింఛన్ పెంచాం. గోతులు పూడుస్తున్నాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. త్వరలో చేస్తాం’ అన్నారు. కానీ.. ఎప్పటి నుంచి ఆయా పథకాలను అమలు చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయకుండా సమాధానం దాటవేశారు. వినతులు తీసుకోకుండానే.. దివ్యాంగురాలైన తన కుమార్తెకు పింఛన్ ఇప్పించాలని ఒక మహిళ వినతిపత్రం అందజేయగా.. మిగిలిన మహిళల నుంచి వినతులు తీసుకోకుండానే లోకేశ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. వినతిపత్రాలు ఇచ్చేవారు డిప్యూటీ స్పీకర్ కార్యాలయానికి వచ్చి అందజేయాలని కూటమి నాయకులు సూచించడంతో మంత్రి లోకేశ్కు వినతులు ఇచ్చేందుకు అప్పటివరకు పడిగాపులు కాసిన జనం ఉసూరుమంటూ వెనుదిరిగారు. మీడియాపై ఆంక్షలు ఉండిలోని జెడ్పీ హైస్కూల్లో దాతల సాయంతో ఆధునికీకరించిన అభివృద్ధి పనుల ప్రారంబోత్సవం, కాళ్ల మండలం పెదఅమిరంలో రతన్ టాటా విగ్రహావిష్కరణ, భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం, పితృవియోగంతో ఉన్న కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను పరామర్శించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి లోకేశ్ జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన ఆద్యంతం మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు.లేని షటిల్, టెన్నిస్ కోర్టులు ప్రారంభించిన మంత్రి నిర్మాణాలు ఏమీ చేయకుండానే నేలపై సున్నం వేసి, నెట్లు కట్టి షటిల్ కోర్టులంటూ మంత్రి లోకేశ్తో ప్రారంభింపజేయడం, ఆయన ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యపరించింది. మంత్రి పర్యటన సందర్భంగా పాఠశాలలోని ప్లే గ్రౌండ్ అభివృద్ధి పేరిట కాలువలోంచి తీసిన మట్టితెచ్చి వేశారని స్థానికులు తెలిపారు. హైస్కూల్లో ప్రారంభోత్సవాల అనంతరం లోకేశ్, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు, టీడీపీ ముఖ్య నేతలు కొంతసేపు ప్రధానోపాధ్యాయుని గదిలోనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కిటికీ తలుపులు కూడా మూసివేశారు. ఎంఈవో జ్యోతిని కూడా పోలీసులు, లోకేశ్ సెక్యూరిటీ లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారంతా బయటే ఉండిపోయారు. -
Chandrababu: సూపర్ సిక్స్ కు ఎగనామం
-
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాల్లో అన్నీ కోతలు, ఎగనామాలే... కూటమి సర్కారు తీరుపై మండిపడుతున్న ప్రజలు
-
విభాత సంధ్యల ప్రభాత గీతం!
‘తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్నారు శ్రీశ్రీ. కావచ్చు. కానీ, వాటికి ఉండే ప్రాధాన్యత వాటికున్నది. కొన్ని ముఖ్యమైన తేదీల శతాబ్దులూ, అర్ధ శతాబ్దుల సందర్భాలూ చాలా ప్రత్యేకమైనవి. అవి ఇప్పటి పరిస్థితులనూ, పరిణామాలనూ అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. నేర్చుకోవాలనుకుంటే పాఠాలు కూడా చెబుతాయి. ఇప్పుడు బలంగా ఊడలు దిగి కనిపిస్తున్న భావజాలాలపై అవగాహన కుదరాలంటే నాడు వాటికి నారుపోసి నీరు పెట్టిన తొలి కాపుల లక్ష్యాలేమిటో, స్వప్నాలేమిటో తెలుసుకోవాలి. ఈ సందర్భాలు అందుకు పనికొస్తాయి.కొన్నిసార్లు ఇటువంటి చారిత్రక సందర్భాలు ఒకదాని వెంట ఒకటి వరుసకట్టి వచ్చిపడతాయి. ఈ డిసెంబర్ ఆఖరి వారం కూడా అటువంటి ఓ అరుదైన క్రమాన్ని ఆవిష్కరించింది. జాతిపిత మహాత్మాగాంధీ ఒకే ఒక్కసారి 1924 డిసెంబర్ 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మేధావుల సమ్మేళనంలా ఉండే కాంగ్రెస్ పార్టీని ఆయన జనసామాన్యుల పార్టీగా, ఉద్యమ పార్టీగా పరుగులు పెట్టించారు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అదే బెళగావి (కర్ణా టక)లో నేటి శిథిల కాంగ్రెస్ పార్టీ కూడా దాని వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నది. మీడియా ద్వారా వెల్లడైన సమాచారాన్ని గమనిస్తే ఇది మొక్కుబడి సమావేశంగానే అనిపించింది. దూరమైన ప్రజాశ్రేణుల దరిజేరే ఉపా యాన్ని గాంధీ స్ఫూర్తి నుంచి గ్రహించినట్టు కనిపించలేదు.స్వాతంత్య్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కూడా డిసెంబర్ 26న వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఏర్పడిన కమ్యూనిస్టులను ఐక్యం చేసి ఆ రోజున కాన్పూర్లో జాతీయ పార్టీగా ప్రకటించారు. అయితే ఈ తేదీపై ఒక డజన్కు పైగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. 1920లోనే నాటి సోవియట్ యూనియన్లోని తాష్కెంట్ (నేటి ఉజ్బెకిస్తాన్)లో ఎమ్.ఎన్.రాయ్ తదితరులు పార్టీని ప్రకటించారు గనుక ఆ తేదీనే ఆవిర్భావ దినంగా భావించాలని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా బిగ్ బ్రదర్ సీపీఎం తాష్కెంట్ తేదీకే కట్టుబడి ఉన్నది. పుట్టిన తేదీ వంటి ఒక సాధారణ సాంకేతిక అంశంపైనే రాజీ పడటానికి సిద్ధంగా లేని కమ్యూనిస్టులు క్లిష్టమైన సైద్ధాంతిక విషయాల్లో ఐక్యత సాధించగలరని ఆశించే వారి సహనాన్ని అభినందించ వలసినదే!ఈ డిసెంబర్ 25నే ఆరెస్సెస్ కూడా తన వందో ఏడాదిలోకి అడుగుపెట్టింది. హిందూ రాష్ట్ర స్థాపన, హిందూ జాతీయ తావాదం లక్ష్యాలుగా కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను స్థాపించారు. సంస్థను స్థాపించిన తొలి రోజుల నుంచి సాంస్కృతిక రంగంపైనే ప్రధానంగా గురిపెట్టి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగు తున్న రోజుల్లో పుట్టినప్పటికీ రాజకీయ రంగంలో అది పరిమిత పాత్రనే పోషించింది. కానీ, ఈరోజున భారత రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ స్థాపించిన పలు అనుబంధ సంఘాలు శాఖోపశాఖలుగా విస్తరించి వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయి. దాని రాజకీయ వేదికైన భారతీయ జనతా పార్టీ దాదాపు పదికోట్ల మంది సభ్యులతో దేశంలో అతి బలీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అధికార పార్టీగా ఆ పార్టీ అనుస రిస్తున్న, అనుసరించబోయే విధానాలను ఆరెస్సెస్ వ్యవస్థాప కుల సిద్ధాంతాలు, ఆశయాలు ప్రభావితం చేయడం పెద్దగా ఆశ్చర్యపోయే విషయమైతే కాదు.ఈ సంవత్సరమే అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి పూర్తి కావడం యాదృచ్ఛికమైనప్పటికీ ఆసక్తికరం కూడా! ఆరెస్సెస్ కంటే సరిగ్గా ఒక సంవత్సరం ముందు డిసెంబర్ 25వ తేదీనే అటల్ జీ జన్మించారు. ఆరెస్సెస్ తొలి రాజకీయ వేదిక జనసంఘ్లో కూడా ఆయన ప్రముఖ నాయకుడుగా ఉన్నారు. కొంతకాలం అధ్యక్షునిగా పనిచేశారు. జనసంఘ్ పార్టీ భార తీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత పాతికేళ్ల పాటు దాని ముఖపత్ర చిత్రంగా వాజ్పేయి ఉన్నారు. మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్న బీజేపీని మధ్యేవాదులకు కూడా ఆమోదయోగ్యం చేయడంలో వాజ్పేయి బొమ్మ పనికొచ్చింది. ఆయనకున్న ఉదారవాద టైటిల్ సాయంతో తొలిసారి ఢిల్లీ సర్కార్ను ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేయగలిగింది. ఆ కాలానికి వాజ్పేయి ఉపయోగపడ్డారు. ఈ కాలానికి కాదు! ఇప్పుడు మోదీయే అవసరమని సంఘ్ అభిప్రాయపడింది. కాలానుగుణంగా కవర్ పేజీ చిత్రాలను ఎంపిక చేయడంలోనే ఆరెస్సెస్ విజయ రహస్యం ఇమిడి ఉన్నది. అంతే తప్ప వాజ్పేయి వేరు, మోదీ వేరూ కాదు! ఈ రెండు రూపాల్లోని సారం ఒక్కటే!!డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేసిన చారిత్రక ఘటనకు కూడా వందేళ్లు కావస్తున్నది. 1927లో సరిగ్గా డిసెంబర్ 25వ తేదీనే అంబేడ్కర్ ఈ పని చేశారు. వర్ణ వ్యవస్థ లేదా నేటి కులవ్యవస్థను మనుస్మృతి బలంగా సమర్థించింది. కుల వ్యవస్థ ముసుగులో జరిగిన దారుణమైన సామాజిక అణచితవేతకు గురైన బలహీన వర్గాల్లోని చైతన్యవంతులైన ప్రజల మనోభావాలకు అంబేడ్కర్ చర్య సాంత్వన కలిగించింది. అప్పటికంటే ఇప్పుడు అంబేడ్కరిజానికి మద్దతు మరింత పెరుగుతున్నది.స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం అనేవి ఆధునికమైన ప్రజాస్వామిక భావనలుగా ప్రపంచవ్యాప్తంగా పరిగణన పొందాయి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో ఈ భావనలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న నాటి రాజ్యాంగ సభ ఈ ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ఈ దేశంలోని కమ్యూ నిస్టులకు కూడా సిద్ధాంతపరంగా ఈ ఆధునిక భావనలతో పేచీ లేదు. మరి దేశంలోనే పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాటేమిటి?భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే కాలాను గుణమైన ఎత్తుగడలను అమలుచేస్తూ ఆరెస్సెస్ మూల సిద్ధాంతాలను హిడెన్ ఎజెండాగా పెట్టుకొని అవసరాన్ని బట్టి ఒక్కొక్కదాన్ని వెలికి తీస్తున్న పద్ధతి కనిపిస్తున్నది. భారత రాజ్యాంగం పట్ల ఆరెస్సెస్ వ్యతిరేకత రహస్యమేమీ కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తొలిరోజే దాని అధికార పత్రిక వ్యతిరేక వ్యాసం రాసిన సంగతి అందరికీ తెలిసినదే. సంఘ్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని ‘పలు దేశాల నుంచి అరువు తెచ్చుకున్న అతుకుల బొంత’గా వ్యాఖ్యానించడం కూడా రహస్యం కాదు. రాజ్యాంగ సభలో చర్చలు జరుగుతున్న రోజుల్లోనే పలువురు సంఘ్ ప్రముఖులు, హిందూ మహాసభ నాయకులు మనుస్మృతిని మన దేశ రాజ్యాంగంగా మలుచుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచన బీజేపీకి ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. పీఠికలో ఉన్న ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను తొలగించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తన హిడెన్ ఎజెండాలోని అంశాలనుముందుగా ప్రచారంలోకి వచ్చేలా చూడటం, పెద్దగా వ్యతిరేకత కనిపించకపోతే ఆచరణలో పెట్టడం బీజేపీకి కొత్త వ్యూహమేమీ కాదు. ఆధునిక భావనలైన స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వాలకు మనుస్మృతికి సాపత్యం కుదురుతుందంటే నమ్మడం కుదరదు. బీజేపీ ఎటువైపున నిలబడుతుందో చూడాలి. బీజేపీ తన గమ్యాన్ని చేరే యాత్రలో అడ్వాణీ రథయాత్ర ఒక మజిలీ, వాజ్పేయి అధికారం ఒక మజిలీ, నరేంద్ర మోదీ మరో రెండు మూడు మజిలీలు దాటి ఉంటారు. రేపటి జమిలి ఎన్నికలు మరో మజిలీ అని పలువురి భావన. ఈ యాత్ర నిర్నిరోధంగా ఇలాగే సాగుతుందా? దీన్ని నిలువరించే శక్తులున్నాయా? అనేదే నేటి ప్రధాన రాజకీయ చర్చ.సిద్ధాంత పరంగా చూస్తే బీజేపీ హిందూయాత్ర(?)ను ఎదిరించే బలం అంబేడ్కరిజానికి ఉన్నదని కొందరి అభి ప్రాయం. కానీ దానికి ఒక సంస్థాగత రూపం లేదు. అందుకే ‘లాల్–నీల్’æఅనే కొత్త నినాదం ముందుకొచ్చింది. అంబే డ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని దీని భావం. కానీ, చిన్నచిన్న పట్టింపులతోనే చీలికలు పీలికలైన లాల్వాలాల్లో ఇంకా ఆ సామర్థ్యం మిగిలి ఉందని నమ్మేవారి సంఖ్య స్వల్పం. ఇక వ్యూహ రాహిత్యం, నాయకత్వ వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయిన స్థితి. ‘ఇండియా’ కూటమి పక్షాల దన్నుతో 99 లోక్సభ సీట్ల దాకా నెట్టుకొచ్చిన ఆ పార్టీని ఇప్పుడు కూటమి పక్షాలే గెటౌట్ అనే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి వందేళ్ల నాటి భావాలూ, సంస్థలూ ఇంకా మన రాజకీయ యవనికపై కదలాడుతుండటం ఒక విశేషం. ఈ ప్రయాణంలో బలమైన శక్తులు బలహీనంగా మారడం, బలహీన శక్తులు బలంగా మారడం మరో విశేషం.చారిత్రక ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కనిపించడం కూడా మరో ఆసక్తికర పరిణామం. వెన్నుపోటు ఉదంతంతో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత వాజ్పేయి అండతో ‘కార్గిల్ గాలి’లో మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇది జరిగి పాతిక సంవత్సరాలు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా గడవకముందే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఆయన కొనితెచ్చుకున్నారు. అడ్డగోలుగా బాదిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మొదలైన ఆందోళనలు ఆయన పదవీకాలమంతా జరుగుతూనే ఉన్నాయి. చివరికి తిరుపతిలో మందుపాతర ప్రమాదం నుంచి బయటపడ్డ సానుభూతి కూడా ఆయన్ను గట్టెక్కించలేకపోయింది.ఇప్పుడూ అదే పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ను అటకెక్కించడంతోనే తాము మోసపోయామన్న అభిప్రాయం జనంలో వచ్చేసింది. దానికితోడు పరిపాలనా వైఫల్యాలు, కక్షసాధింపు రాజకీయాలు, ప్రజావైద్యం పడకేయడం, నాణ్యమైన ప్రభుత్వ విద్యకు పాతరేయడం, వాడవాడనా పారుతున్న మద్యం కంపు, అంతకుమించి కంపు కొడుతున్న రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలు, వెరసి ఆరు మాసాల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం నాడు వైసీపీ పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనల్లో పది లక్షలమందికి పైగా పాల్గొనడం ప్రజాగ్రహానికి ఒక శాంపిల్ మాత్రమే! పులివెందుల నియో జకవర్గంలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి జరిపిన పర్యటన జనసముద్రాన్ని చీల్చుకొని వెళ్తున్నట్టుగా కనిపించింది. అభిమాన సందోహం నడుమ పాతిక కిలోమీటర్ల ప్రయాణానికి ఏడు గంటల సమయం! పులివెందుల నుంచి బెంగళూరు వరకు ఆయన చేసిన రోడ్డు ప్రయాణం కూడా అంతే! దారి పొడవునా ఊళ్లు కాదు, జన జాతరలే దర్శనమిచ్చాయి. ఈ పరిస్థితి చూస్తుంటే కూడా గతమే గుర్తుకొస్తున్నది. మందుపాతర సాను భూతితో మళ్లీ గెలుస్తామని భావించిన బాబు నాలుగు మాసాలు ముందుగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనతోపాటు కేంద్రంలోని ఎన్టీయే సర్కార్ను కూడా తీసుకెళ్లి వాజ్పేయి పుట్టి ముంచారు. ఇప్పుడు కూడా ముందుగానే జమిలి వార్తలు వస్తున్నాయి. ఈ జమిలిలో మోదీ పుట్టిని కూడా ముంచుతాడేమో!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రూ.లక్ష కోట్ల అప్పు!
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్లోనూ, బడ్జెటేతర అప్పుల్లోనూ దూసుకుపోతున్నారు. ఆర్నెల్లలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పుల దిశగా రాష్ట్రం పరుగులు తీస్తోంది. మరోవైపు గత ఏడాదితో పోల్చితే అమ్మకాల పన్ను ఆదాయంతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ వరకు రాబడులు, వ్యయాలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. రాజధానికి రూ.52 వేల కోట్లు! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.74,590 కోట్లకు చేరాయి. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు రూ.65,590 కోట్లకు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు మరో రూ.9,000 కోట్లకు ఎగబాకాయి. ఇక రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేసేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈ మేరకు సీఆర్డీఏకు అనుమతిస్తూ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.అంటే సీఎం చంద్రబాబు ఆర్నెల్ల పాలనలో ఇప్పటికే చేసిన అప్పులు, చేయనున్న అప్పులు కలిపి మొత్తం రూ.1.05 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి. అంతేకాకుండా ప్రాథమిక అంచనా మేరకు రాజధానికి రూ.52 వేల కోట్ల మేర నిధులు అవసరమని, ఇప్పటికే రూ.31 వేల కోట్లు సమీకరించినందున మిగతా నిధులు రూ.21 వేల కోట్లు కూడా సమీకరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏకి ప్రభుత్వం నిర్దేశించింది. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమే అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పథకాలు లేవు.. పన్నుల మోతలే సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోగా అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపారు. ఏ ఒక్క పథకం అమలు కాకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అమ్మకం పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనం. కాగ్ గణాంకాల మేరకు గతేడాది నవంబర్తో పోల్చితే ఈ ఏడాది నవంబర్ నాటికి అమ్మకం పన్ను ఆదాయం రూ.1,043 కోట్లు తగ్గిపోయింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల ఆదాయం రూ.868 కోట్లు క్షీణించింది. మరోపక్క కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రూ.12,510 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు సంబంధించి సామాజిక వ్యయం కూడా గత నవంబర్తో పోల్చితే తగ్గిపోయిందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు రెవెన్యూ లోటు రూ.9,742 కోట్లు అదనంగా పెరిగింది. -
Big Question: ఇది ముంచేసే ప్రభుత్వం.. ఆరు నెలల్లో లక్ష కోట్ల అప్పులు.. విజనరీ బాబు
-
చంద్రబాబుది 420 విజన్: వైఎస్ జగన్
ఇవాళ ఆరు నెలలు గడవక ముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అని. ఇవాళ 6 నెలలు తిరక్క ముందే అది కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది. జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. పలావు, బిర్యానీ రెండూ పోయాయి. ఏమీ లేకుండా బాబు రోడ్డు మీద నిలబెట్టాడు అన్న చర్చ నడుస్తోంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిచంద్రబాబు విజన్ 2047 అంటున్నాడు. ఏడు నెలల క్రితం చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి మేనిఫెస్టో పేరుతో ప్రచారం చేసి ఊదరగొట్టారు. రూ.15 వేలు నుంచి రూ.48 వేల వరకు హామీలిచ్చుకుంటూ వెళ్లారు. ఇక్కడ ఏడు నెలల క్రితం మేనిఫెస్టో అని చెప్పిన హామీలకే దిక్కులేదు... కానీ, విజన్ 2047 అంటున్నాడు. రంగు రంగుల కథల పుస్తకమైన వారి విజన్ డాక్యుమెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. ఇంకోవైపు బాదుడే బాదుడు మొదలైంది. ముట్టుకుంటే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఆరు నెలలు తిరక్క మునుపే రూ.15 వేల కోట్లు కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన దుర్మార్గుడు చంద్రబాబు మాత్రమే. హామీలపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే... ఆ ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామ స్థాయి నుంచి అమలవుతోంది. స్కామ్ల మీద స్కామ్లు.. లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి డబ్బులివ్వాల్సిందే. ప్రతి విషయంలో నాకింత.. నీకింత.. అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన సాగు నీటి సంఘాల ఎన్నికలను అపహాస్యం చేశారు. ఎన్నికలను ఏకపక్షం చేశారు. గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూస్ సర్టిఫికెట్లు, ప్రతిపక్షానికి, సాధారణ రైతులకు ఇవ్వకుండా వాళ్ల పార్టీ వారికే ఇచ్చుకుని పోలీసుల సాయంతో ఏకపక్షంగా బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపించుకున్నారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు? బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపి... రైతులు సంతోషంగా ఉన్నారని ఎలా చెబుతారు? రైతులు సంతోషంగా ఉన్నారని మీకు అనిపిస్తే రాజీనామా చేసి బయటకు రండి. అప్పుడు పెట్టుబడి సాయం, ఉచిత బీమా ఎక్కడ అని అడుగుతున్న రైతులు మీకు కనిపిస్తారు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే సీఎం చంద్రబాబు రంగు రంగుల కథలు చెబుతూ.. దానికి విజన్ 2047 అని పేరు పెడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే దాన్ని 420 విజన్ అంటారని మండిపడ్డారు. ‘మనిషిని అభివృద్ధి బాటలోకి తీసుకుని పోవాలంటే.. ఆ అభివృద్ధి బాట ఏమిటని చెప్పేదే విజన్ డాక్యుమెంట్. ఇవాళ చిన్న పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు? అప్పుడు అతడి భవిష్యత్ ఏంటి? ఆ భవిష్యత్ కోసం ఇవాళ సరైన అడుగులు వేస్తున్నామా? లేదా? అన్నదే విజన్. అందులో భాగంగా ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా వాటిని చేసి చూపింది’ అని గుర్తు చేశారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని, పులినోట్లో తలపెట్టడమే అని.. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఇవాళ ఆరు నెలలు తిరక్క ముందే అదే కనిపిస్తోంది’ అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం దగా చేయడంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా గొంతు విప్పాలని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ‘పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. దేనికైనా మనం సిద్ధమే. ఎవ్వరూ, ఎక్కడా భయపడొద్దు. దేన్నైనా ఢీకొందాం. మీ అందరికీ జగన్మోహన్రెడ్డితోపాటు పార్టీ అండగా ఉంటుంది’ అంటూ నేతలకు భరోసా ఇచ్చారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...జనవరి నుంచి జిల్లాల పర్యటనజనవరి చివరి వారం నుంచి నేను పార్లమెంటు జిల్లాల్లో పర్యటిస్తాను. వారంలో ప్రతి బుధ, గురువారం రాత్రి అక్కడే బస చేసి కార్యకర్తలతో మమేకమవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ కార్యక్రమం మొదలయ్యే లోగా మండల స్థాయి నుంచి మొదలై నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలి. పార్టీ నిర్మాణం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇదంతా ఆర్గనైజ్డ్గా తీసుకు రావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మీరు, నేను కలిసి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకుని పోదాం. విలేజ్ కమిటీలు, బూత్ కమిటీల నియామకం పూర్తి చేస్తాం.సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉందాంఇవాళ మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు.. చంద్రబాబు వేసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ముసుగుతో యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే మనం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండాలి. జనరేషన్ మారింది. ప్రతి కార్యకర్తకు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలి. గ్రామ స్థాయిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. ఎవరికైనా పెన్షన్ రాకపోయినా, బిల్లుల బాదుడు పైనా ప్రశ్నిస్తూ ప్రతి గ్రామం నుంచి విప్లవ ధోరణిలో ప్రశ్నించాలి. గ్రామ స్థాయి నుంచే ప్రశ్నించే స్వరం ఉండాలి. అప్పుడే చైతన్యం వస్తుంది. ఈసారి మన టార్గెట్.. చంద్రబాబుకు సింగిల్ డిజిట్ దాటకూడదు. అది కచ్చితంగా జరుగుతుంది.మనకూ కచ్చితంగా గుడ్ టైమ్ వస్తుందిప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. జైల్లో కూడా పెడతారు. నేను మీ అందరికీ చెబుతున్నాను. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. ఏ కష్టం ఎవరికి వచ్చినా నా వైపు చూడండి. ప్రతిపక్షం ఉండదు.. అడిగే వాడు ఉండడని నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి నామీద కేసులు పెట్టాయి. ఏమైంది? ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యాను. పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. జమిలి వస్తుందంటున్నారు. దేనికైనా మనం సిద్ధంగా ఉందాం. మనకూ తప్పనిసరిగా గుడ్ టైమ్ వస్తుంది.ఆరు నెలల్లో 3.14 లక్షల పెన్షన్లు కట్మార్చి, ఏప్రిల్ నెలల్లో.. మన ప్రభుత్వ హయాంలో 66,34,742 పెన్షన్లు ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. డిసెంబర్లో పంపిణీ చేసిన పెన్షన్ల సంఖ్య 63,20,222. అంటే 3.14 లక్షల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా పెన్షన్ ఒక్కరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఇంకా, 3 లక్షల నుంచి 4 లక్షల మంది పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి. ఈ పోరుబాటలో ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను రెపరెపలాడించేలా ఎగుర వేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అభ్యర్థిస్తున్నాను. ఆరు నెలలకే ఇంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు⇒ ఆరు నెలలకే చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ఎన్నికల్లో మనం ప్రచారం చేసినప్పుడు, మన పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు నేను చెప్పిన మాటలు అందరికీ తెలుసు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీలు, మోసాల గురించి నా దగ్గరకు వచ్చిన పార్టీ నాయకులు చాలా మంది చెప్పారు. మనం కుటుంబానికి అంతటికీ మంచి చేశాం. కానీ చంద్రబాబు మోసాలు, అబద్ధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఇంటికి మనం మంచి చేస్తే.. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేస్తానని హామీ ఇచ్చాడు.⇒ మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని మన పార్టీ నేతలు నాతో అన్నారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ధర్మం కాదనేది నా అభిమతం. ఆ రోజు మనం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇవి మనం చేస్తున్న పథకాలు.. ఐదేళ్ల మన పాలనలో ఎప్పుడూ జరగని మార్పులు చేశాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించి అమలు చేశాం. చివరకు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాలు తగ్గినా, మనం సాకులు వెతుక్కోలేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్తో పాటు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి... బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసి చూపింది. అంత గొప్పగా ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాం.⇒ మనమంతా ఎమ్మెల్యేల తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు మనల్ని ఆప్యాయతతో ప్రజలు ఆదరించారు. మన మీద వ్యతిరేకత లేదు. కానీ పది శాతం మంది చంద్రబాబు మాటలను నమ్మారు. దానికి కారణం కూడా మనమే... అంత గొప్ప పాలన మనం అందించగలిగాం కాబట్టే.. చంద్రబాబు మభ్యపెట్టగలిగాడు. ప్రజలను ఆశ పెట్టగలిగాడు. జగన్ చేసి చూపించాడు కాబట్టి.. చంద్రబాబు కూడా చేసి చూపిస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారు.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో మోసం చేయగలుగుతాడా.. అన్నంతగా మోసం చేశారు. చిన్నపిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. వారి తల్లులకు నీకు రూ.18 వేలు అని, ఆ అమ్మల తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు.ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ పాలన⇒ ఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. రూ.15 వేల కోట్ల మేర కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామస్థాయి నుంచి అమలవుతోంది. మరోవైపు లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, స్కామ్లు. ప్రతి పనికీ డబ్బులివ్వాల్సిందే. నాకింత.. నీకింత అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు.⇒ ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టడానికి మనం ఇవాళ కలిసి అడుగులు వేస్తున్నాం. ఏ నాయకుడైనా ప్రజల తరఫున స్పందించ గలగాలి. వారి సమస్యలపై పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని చైతన్యం చేస్తున్నాం. అప్పుడే ప్రజల్లో అధికార పార్టీ మీద పెరుగుతున్న వ్యతిరేకత మనకు సానుకూలంగా మారుతుంది.⇒ ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది. ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మన కళ్లెదుటే కనిపిస్తోంది. రైతులకు గతంలో పెట్టుబడి సహాయంగా రైతు భరోసా కింద ఇచ్చిన రూ.13,500 గాలికెగిరిపోయింది. రూ.20 వేలు ఇస్తానన్న పెట్టుబడి సాయం మోసమని తేలిపోయిన పరిస్థితుల్లో రైతు సాగు చేస్తున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా దక్కే పరిస్థితి పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాపింగ్ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మనం ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి రైతుకు కనీస మద్దతు ధర వచ్చేటట్టుగా ధాన్యం కొనుగోలు చేసి.. వెంటనే పైకం చెల్లించేలా అక్కడే ‘ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్’ (ఎఫ్టీఓ) కూడా ఇచ్చి, మనం తోడుగా నిలిచాం. ఇవాళ అదే రైతులకు కనీస మద్దతు ధర రాకపోగా, అంత కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకే వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమం చేశాం.షాక్ కొడుతున్న కరెంటు బిల్లులపై 27న ఆందోళనపట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్న విద్యుత్ బిల్లుల మీద ఈ నెల 27న ఆందోళనకు పిలుపునిచ్చాం. ఇప్పటి వరకు అంటే... 6 నెలల వరకు రూ.6 వేల కోట్ల బాడుదు మాత్రమే. రేపటి నెలలో మరో రూ.9 వేల కోట్ల బాదుడు ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితులలో మహిళలు నిరసన తెలుపుతూ బిల్లులు కాల్చుతున్న పరిస్థితి. ఈ దఫా కరెంటు బిల్లుల పెరుగుదలకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో చేయబోతున్నాం.ఫీజులు రాని పిల్లలకు అండగా నిలుద్దాంమన ప్రభుత్వ హయాంలో ప్రతి 3 నెలలకొకసారి, త్రైమాసికం అయిన వెంటనే పిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారి చదువులకు తోడుగా ఉండేవాళ్లం. ఈ రోజు పిల్లలు విద్యా దీవెన, వసతి దీవెన రాక ఇబ్బంది పడుతున్నారు. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్లో వెరిఫై చేసి మే నెలలో ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు త్రైమాసికాలు గడిచిపోయాయి. ఏప్రిల్లో వసతి దీవెన కింద డబ్బులిచ్చే వాళ్లం. ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. మొత్తంగా ఫీజులకు సంబంధించి నాలుగు దఫాలు విద్యా దీవెన రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు మొత్తం రూ.3,900 కోట్లు పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల.. పిల్లలు డబ్బులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. పనులకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు అండగా, వారికి తోడుగా ఉండే కార్యక్రమం జిల్లా యూనిట్గా జనవరి 3వ తేదీన చేయబోతున్నాం.అసలైన విజన్ అంటే ఇదీచంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్తో మరో డ్రామాకు తెర తీశారు. అసలైన విజన్ అంటే ఏమిటో మనం చూపించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ బడులతో ప్రైవేటు బడులు పోటీ పడే పరిస్థితి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. నాడు–నేడు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించాం. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లిష్ మీడియం చేయడంతో పాటు, సీబీఎస్ఈతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణానికి కూడా మన ప్రభుత్వంలోనే అడుగులు పడ్డాయి. రోజుకొక మెనూతో గోరుముద్ద మన ప్రభుత్వంలోనే అమలు చేశాం. తొలిసారిగా మనం చేసిన ఈ మార్పులతో పదో తరగతికి వచ్చే సరికి పిల్లలు ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడే పరిస్థితి తెచ్చాం. అదీ మన విజన్.ఉన్నత విద్యలో ఊహకందని మార్పుఉన్నత విద్యలో మన డిగ్రీతో ఉద్యోగాలు రాని పరిస్థితి నుంచి వాటిని మరింత మెరుగ్గా చేయడానికి ఎడెక్స్ అనే సంస్థ సహాయంతో ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చాం. ఇందులో మన డిగ్రీ విద్యార్థి తనకు నచ్చిన కోర్సులు తీసుకునే విధంగా.. స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ వంటి పెద్ద, పెద్ద విదేశీ యూనివర్సిటీలు కోర్సులు ఆఫర్ చేసేలా చేశాం. ఆ కోర్సులు ఇక్కడ తీసుకుని పరీక్షలు రాస్తే.. వాటికి ఆ యూనివర్సిటీలు సర్టిఫికెట్స్ ఇస్తాయి. ఆయా యూనివర్సిటీల నుంచి డేటా అనలైటిక్స్, అసెట్స్ మేనేజిమెంట్ వంటి కోర్సుల్లో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి కోర్సుల కోసం ఆలోచన చేసి వారికి విద్యాదీవెన, వసతి దీవెనతో సహా ఏర్పాటు చేయడమే విజన్.గ్రామ స్థాయిలో ప్రివెంటివ్ కేర్చదువులు, వైద్యం మనిషిని ఎప్పుడైనా అప్పుల్లోకి నెట్టేస్తాయి. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్స్కు తీసుకుని పోయి రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందేట్టు చేశాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు–నేడు పనులతో రూపురేఖలు మార్చాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకుని వచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత దేశ వ్యాప్తంగా 67 శాతం ఉంటే... మన రాష్ట్రంలో మాత్రం దాన్ని కేవలం 4 శాతానికి పరిమితం చేశాం. ప్రతి ఆసుపత్రిలో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో కూడిన మందులు ఉండేలా చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ అంటే వివిధ రోగాలు తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించి, వాటిని నివారించడానికి గొప్ప అడుగులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పడ్డాయి. ఇదీ విజన్.పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో ప్రగతి..ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి రూ.13వేల కోట్లకుపైగా వ్యయంతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల నిర్మాణాన్ని, రూ. 3,500 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టాం. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. తద్వారా రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయి. ఇదీ విజన్. రైతును చేయి పట్టుకుని నడిపించాంరైతుకు ఇబ్బంది రాకుండా, వారిని చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను ఆర్బీకే కేంద్రంగా కూర్చోబెట్టడం విజన్. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేయడమే కాకుండా.. రైతుకు తోడుగా ఉంటూ ఇన్సూ్యరెన్స్ చేసుకున్నా, లేకున్నా.. విపత్తు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సూ్యరెన్స్ వచ్చేట్టు ఉచిత పంటల బీమా తీసుకు రావడం విజన్. రైతుకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల దగ్గరే కొనుగోలు చేసి.. పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టు చేయడం ఒక విజన్. ఈ రకంగా వ్యవసాయ రంగంలో మార్పులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయి.ఇంటి వద్దకే సేవలుమన ప్రభుత్వం రాకమనుపు ఒక రూపాయి ప్రభుత్వం ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? అలాంటి విజన్ను తీసుకొచ్చిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ.. అందులో 540 రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం.. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్... కులం, మతం, ప్రాంతం చూడకుండా.. లంచాలు లేకుండా ప్రతి ఇంటికి ప్రతి పథకం చేర్చగలిగే పరిస్థితి వైఎస్సార్సీపీప్రభుత్వంలోనే వచ్చింది. ఇదీ విజన్ అంటే. -
చంద్రబాబు ఒక్కడికే అది సాధ్యం వైఎస్ జగన్ సెటైర్లు
-
జగన్ పిలుపు ప్రభుత్వం వణుకు
-
సూపర్ సిక్స్ హామీలతో కూటమి డకౌట్
-
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
Andhra Pradesh: చంద్రబాబు ప్రభుత్వం హై ఓల్టేజ్ షాక్
సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు నెలలకే మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్లు ఇస్తోంది. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కినట్లుగానే విద్యుత్ చార్జీలపై చేసిన వాగ్దానాన్ని మరచి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. విద్యుత్తు చార్జీల మోత మోగిస్తూ హై వోల్టేజీ షాకులిస్తున్నారు. రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడుకు తెర తీశారు. విద్యుత్తు వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే ఇక తరువాత నెలల్లో ఏ స్థాయిలో షాక్లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపై పెనుభారం మోపింది.నివ్వెరపోతున్న వినియోగదారులు..ఈ నెల 2వ తేదీ నుంచి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్తు సిబ్బంది ప్రజలకు అందిస్తున్నారు. వాడిన దానికి మించి విద్యుత్ బిల్లులతో షాక్లకు గురి చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్నారని గ్రహించి గగ్గోలు పెడుతున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.6,072.86 కోట్ల భారాన్ని గత నెల విద్యుత్ వినియోగం నుంచి వినియోగదారులపై ప్రభుత్వం వేస్తోంది. సర్దుబాటు చార్జీ ప్రతి యూనిట్కు సగటున రూ.1.27గా నిర్ణయించిన ఏపీఈఆర్సీ దీనిని 15 నెలల్లో వసూలు చేయాలని సూచించడంతో ప్రతి నెలా వినియోగదారులపై ఈ సర్దుబాటు భారం యూనిట్కు సగటున రూ.0.63 చొప్పున పడుతోంది.వచ్చే నెల నుంచి మరింత మోత..ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లకే ప్రజలపై ఇంత భారీగా చార్జీల భారం పడుతుంటే వచ్చే నెల నుంచి కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద మరో పిడుగు వేయనుంది. రూ.9,412.50 కోట్ల చార్జీల వసూలుకు డిస్కమ్లు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నెల వినియోగం నుంచి అంటే జనవరి మొదటి వారం నుంచి వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఈ చార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ చార్జీల బాదుడుతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలులో నివసించే గడ్డం రమణారెడ్డికి నవంబరులో రూ.1,620 విద్యుత్ బిల్లు రాగా ఈ నెల ఏకంగా రూ.2,541 బిల్లు వచ్చింది. గత నెలతో పోలిస్తే 56 శాతం అదనంగా పెరిగి రూ.921 అధికంగా బిల్లు రావడంతో ఆయన లబోదిబోమంటున్నారు. నవంబర్,డిసెంబరు నెలల బిల్లులు చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో అద్దె ఇంట్లో నివసించే రమేష్కు ప్రతి నెలా రూ.300 – రూ.400 మధ్య కరెంట్ బిల్లు వస్తుంది. అక్టోబర్లో రూ.363 వచ్చింది. నవంబర్లోనూ రూ.385కి మించలేదు. అలాంటిది ఈ నెల ఏకంగా రూ.679 రావడంతో షాక్ తిన్నాడు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని ప్రకాశ్నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసించే కత్తి రామక్క నలుగురు సంతానం అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిరు వ్యాపారంతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎస్సీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపచేయడంతో ఐదేళ్లుగా ఆమెకు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే కరెంటు బిల్లు కట్టాలంటూ విద్యుత్ శాఖ అధికారులు ఇంటి వద్దకు వచ్చారు. రూ.3,464 బిల్లు కట్టాలని, 2018 నుంచి బకాయిలు చెల్లించాలని హెచ్చరిస్తూ కరెంట్ కట్ చేయడంతో అంధకారంలో మగ్గిపోతోంది. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారుగా బాబు 16/08/2023: టీడీపీ విజన్ డాక్యుమెంట్– 2047 విడుదల సందర్భంగా విద్యుత్ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు ⇒ మా ఇంటికి వైఎస్సార్ సీపీ హయాంలో ఉచిత విద్యుత్తు అందించారు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నుంచి బిల్లు కట్టమని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ⇒ కన్నేపల్లి కుమారి (ఎస్సీ సామాజిక వర్గం), సిటిజన్ కాలనీ, గాంధీ గ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా (02 వీఎస్సీ 803)కర్నూలులోని బుధవారపేటలో అద్దె ఇంట్లో నివసించే ప్రైవేట్ ఉద్యోగి అజయ్కి (సర్వీస్ నెంబర్ 8311102106824) గత నెలలో విద్యుత్ బిల్లు రూ.688 రాగా ఈ నెలలో ఏకంగా రూ.1,048 రావడంతో గుండె గుభిల్లుమంది. ఆ కుటుంబంపై ఒక్క నెలలోనే రూ.360 అదనపు ఆర్థిక భారం పడింది. ఈ నెల నుంచి పెరిగిన విద్యుత్ బిల్లుల బాదుడు స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 88 యూనిట్లకు రూ.348.97 బిల్లు రాగా ప్రస్తుతం 91 యూనిట్లకు రూ.463.91 బిల్లు వచ్చినట్లు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కె.సూర్యకాంత్ తెలిపారు. అదనంగా వాడిన మూడు యూనిట్లకు రూ.114.94 బిల్లు ఎక్కువగా రావడంతో ఆయన షాక్ తిన్నాడు. ఉచిత విద్యుత్తు ఇచ్చిన వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించిన విద్యుత్ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ కూటమి సర్కారు బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం హరిజనవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు ఇటీవల నిరసనగా దిగారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు.‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న బి.శివాజీ. విజయవాడలోని కానూరులో ఉంటారు. ఆయన ప్రతి నెలా దాదాపు రూ.600 విద్యుత్ బిల్లు చెల్లిస్తుండగా ఈ నెల రూ.813 బిల్లు వచ్చింది. దాదాపు 35 శాతం అదనంగా చార్జీలు పడటంతో శివాజీ గగ్గోలు పెడుతున్నాడు. ఇంత భారం మోపితే కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నాడు. పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగేవారే లేరా? అని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాడు.విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఏ.సహిల్కు ఈ నెల (నవంబర్ వినియోగం)రూ.1,321 బిల్లు వచ్చింది. గత నెల ఇదే సర్వీసుకు ఆయన చెల్లించిన బిల్లు రూ.861 మాత్రమే. అంటే ఈ నెల బిల్లులో ఏకంగా 53 శాతం అదనంగా భారం పడింది. -
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం: వైఎస్ జగన్
కేవలం ఆరు నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఓ వైపు ఎక్కడ చూసినా అక్రమాలు, కమీషన్లు, మామూళ్ల గోల. పరిశ్రమ నడుపుకోవాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా కప్పం కట్టాల్సిందే. వేలం పాటలుపెట్టి ఊరూరా బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారు. అన్నింటికీ నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు. ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు వాటాలు. ఇంకో వైపు సంక్షేమ పథకాలన్నీ పడకేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోతోంది. భరోసా ఇచ్చే వారు లేక అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. విద్యుత్ చార్జీల షాక్లతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఈ పరిస్థితిలో బాధిత వర్గ ప్రజల తరఫున నిలబడాల్సింది మనమే. వారి గొంతుకగా నిలిచి ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పోరాడుదాం.– పార్టీ శ్రేణులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కి.. అన్ని వర్గాలనూ దగా చేస్తున్న చంద్రబాబునాయుడి ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెల్లుబుకుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. కనీస మద్దతు ధర దక్కక రైతులు.. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు.. కరెంటు ఛార్జీల బాదుడుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనలతో అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, వారి తరఫున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి.. ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎప్పూడూ చూడని విధంగా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత ఎక్కడా చూడలేదు. ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వాగ్దానాలు గాలికెగిరిపోయాయి. వాటిని పక్కన పెట్టి మిగిలినవి చూస్తే.. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపం కింద మారి ఎక్కడికక్కడ వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరు గారిపోయాయి. నానాటికీ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే.. మన ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్ (మూడు నెలలు) అయిపోయిన వెంటనే అంటే.. జనవరి, ఫిబ్రవరి, మార్చి ముగిసిన వెంటనే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో విడుదల చేసే వాళ్లం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో ఇవ్వాల్సిన ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు సరి కదా.. ఏకంగా మూడు త్రైమాసికాల సొమ్ము పెండింగ్లో పెట్టారు. ⇒ ఈ డిసెంబర్ గడిస్తే నాలుగు క్వార్టర్లు ఇవ్వని పరిస్థితి. జనవరి వస్తే ఏకంగా రూ.2,800 కోట్లు విద్యా దీవెన బకాయిలు పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. వసతి దీవెనకు సంబంధించి రూ.1,100 కోట్లు పెండింగ్ ఉంది. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్ పెట్టారు. మరో వైపు ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని పిల్లలకు యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు.ఆరోగ్యశ్రీకి అనారోగ్యం ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. మార్చి నుంచి ఇంత వరకు నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన బకాయిలు ఇవ్వలేదు. మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 9 నెలలకు సుమారు రూ.2,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు గొడవ చేస్తే ఏదో రూ.200 కోట్లు ఇచ్చారు. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగారిపోతోంది. ఇంకా 108, 104 ఉద్యోగులకు సంబంధించి నాలుగు నెలల జీతాలు పెండింగ్. వాళ్లు సర్వీసు అందించే పరిస్థితి లేదు. ధాన్యం సేకరణ.. మద్దతు ధర లేదు ⇒ ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) లభించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వాళ్లం. ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేది. ఇదొక్కటే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్) ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. జీఎల్టీ కింద ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు అదనంగా రూ.10 వేలు వచ్చే పరిస్థితి ఉండేది.⇒ ఇవాళ రైతులకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదు. 75 కేజీల బస్తా కనీస మద్దతు ధర రూ.1,725 అయితే ఆ ధర ఎక్కడా ఇవ్వడం లేదు. కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం నిలిపివేశారు. గత్యంతరం లేక రైతులు దళారులు, రైస్ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లు రైతుల నుంచి రూ.300 నుంచి రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం సేకరణ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో జరుగుతోంది. మరోవైపు వర్షాలతో రైతులు పూర్తిగా దెబ్బతిని కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు ⇒ కరెంటుకు సంబంధించి ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడు మొదలైంది. మరో రూ.9 వేల కోట్ల బాదుడు వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయిలో రూ.15 వేల కోట్ల బాదుడు కార్యక్రమాన్ని భారతదేశ చరిత్రలో చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేసి ఉండరు. ఆరు నెలల్లోనే ఎవరూ రోడ్డు మీదకు రాకూడని, ఎవరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. ⇒ కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి, ఎవిడెన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆయన చేస్తున్న బాదుడు కార్యక్రమాన్ని నిరసిస్తూ ఎవరూ రోడ్డు మీదకు రాకూడదని ఇలా చేస్తున్నారు. ఎవరైనా ఆందోళన చేయాలనుకుంటే కేసులు పెడతారేమోనని భయపడే పరిస్థితులు కల్పిస్తూ పోలీసులను ఉపయోగించుకున్నారు. అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగం యథేచ్ఛగా నడుస్తోంది.ఇసుక, మద్యం మాఫియా ⇒ అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. కానీ, దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా, మన ప్రభుత్వం కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత అని.. చంద్రబాబు, లోకేష్ మొదలు ఎమ్మెల్యేల వరకు పంచుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. దాని కోసం కిడ్నాప్లతో పాటు, పోలీసుల ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. లాటరీలో ఎవరికైనా షాపులు వస్తే వారి దగ్గర నుంచి బలవంతంగా రాయించుకున్నారు. పైగా గ్రామంలో వీళ్లే వేలం పాటలు పెట్టి బెల్ట్షాప్లు కేటాస్తున్నారు. ⇒ ఈ రోజు బెల్ట్షాప్లు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్ట్షాప్కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేలం పాట పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో పరిశ్రమ నడుపుకోవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ జరగాలన్నా, ఏది కావాలన్నా ఎమ్మెల్యేకు ఇంత.. కడితే తప్ప జరిగే పరిస్థితి లేదు. ప్రతి దానికీ కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామూళ్ల కోసం కూడా గొడవలు జరుగుతున్నాయి. నెల్లూరులో ఏకంగా క్వార్ట్జ్ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్ చేశారు. ప్రజల పక్షాన నిలబడదాం.. వారి గొంతుక వినిపిద్దాం ⇒ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఈరోజు తీవ్ర స్ధాయిలో కనిపిస్తోంది. మనం కూడా ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. మామూలుగా ఏడాది వరకు వేచి చూసే పరిస్థితి నుంచి.. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది.⇒ కరెంటు ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కక పోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. మీ మీ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, సమన్వయకర్తలతో కలిసి వారిని ఇన్వాల్వ్ చేస్తూ, కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవసరం అయినప్పుడు మనం వారి తరఫున నిలబడాలి. వారి పక్షాన పోరాడాలి. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మనం వారికి దగ్గరగా ఉంటూ వారి తరఫున పోరాటం చేయాలి. వారి తరఫున నిలబడాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఇది కచ్చితంగా చేయాలి.సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనసంక్రాంతి తర్వాత నా జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధ, గురువారాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతాను. ‘జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో నేను పర్యటిస్తాను. నా పర్యటన వచ్చేసరికి మీరు జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలి. ప్రతి కార్యకర్తకు ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి కార్యకర్త ప్రశ్నించాలి. అప్పుడే గ్రామ స్థాయిలో తెలుస్తుంది. మా ఆస్పత్రులు ఎందుకు ఇలా ఉన్నాయి? మా స్కూళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి? మా ధాన్యాన్ని ఎందుకు కనీస మద్ధతు ధరకు అమ్ముకోలేకపోతున్నాం.. అని ప్రశ్నించాలి. రాబోయే రెండున్నరేళ్లు మనం, మన పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఆప్పుడే మనం చేయబోయే పోరాటాలకు మద్దతు బలంగా ఉంటుంది. ఇదంతా పక్కాగా జరగాలంటే జిల్లాల్లో పెండింగ్లో ఉన్న పార్టీ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలి.మూడు ప్రధాన అంశాలపై కార్యాచరణప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాలు.. రైతుల ఇబ్బందులు, కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు, ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వైఎస్సార్సీపీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల కార్యాలయాల వద్ద రైతులకు సంబంధించి ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలి. ధాన్యం సేకరణలో వారికి కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేయాలి. పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని కూడా డిమాండ్ చేయాలి. రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలి.చంద్రబాబు ప్రభుత్వ కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబర్ 27న ఆందోళన చేపట్టాలి. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీని విస్మరించిన నేపథ్యంలో పెంచిన కరెంటు ఛార్జీలు, జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడుతో పాటు, రానున్న నెలలో మరో రూ.9 వేల కోట్ల ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన తెలపాలి. ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయాలి.జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఫీజు రీయింబర్స్మెంట్పై ఆందోళన చేపట్టబోతున్నాం. పిల్లలకు అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన.. మొత్తంగా దాదాపు రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు ఏడాదిగా అంటే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫీజులు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. చదువుకుంటున్న పిల్లలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి, వినతిపత్రాలు సమర్పించి, డిమాండ్ చేయాలి.ఈ మూడు సమస్యలతో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుకు డిమాండ్ చేద్దాం. -
రూ.70వేల కోట్ల అప్పు ఏం చేశారు ?: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయిందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు,గుడివాడ అమర్నాథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదు.హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారు.యూనిట్కు 1రూపాయి20పైసలు పెంచారు.ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారు. అప్పుల భారం పెంచుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు.మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి’అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు.ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిత్యావసర వస్తులు పెంచమని చెప్పారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధరలు పెంచమని పదే పదే చెప్పారు.యూనిట్ విద్యుత్ ధర 1.20 రూపాయలు పెరిగింది.రూ. 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపుతుంది.విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసంఅన్ని పరిణామాలు ఆలోచించే కదా ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు.రూ. 15 వేల కోట్ల బారాన్ని ప్రభుత్వమే భరించాలిప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాంరూ 67 వేల 237 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వంఈ మంగళవారం మళ్ళీ రూ. 4 వేల కోట్లు అప్పు చేయబోతున్నారు.మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లకు చేరుతుంది.గతంలో మా ప్రభుత్వం డిస్కంలకు డబ్బులు చెల్లించాం.పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.గత సంవత్సరం ఇదే సమయానికి అమ్మఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,రైతు భరోసా,సున్నా వడ్డీ,మత్స్యకార భరోసా,ఈబీసీ నేస్తం నిధులు ప్రజలకు ఇచ్చాంఈరోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చాంప్రజలకు పథకాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ప్రయారిటీ కాదుపేద ప్రజలకు పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారురూ. 67 వేల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారుప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాంపథకాలు ఇవ్వడం లేదు సరి కదా విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నారుమా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు అప్పులు చేసి మీరేం చేస్తున్నారుమీ సోకులకు వాడుకుంటున్నారా..?గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసి వెళ్తే మేం కూడా ఆ అప్పులు చెల్లించాంప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందిగతంలో పథకాలు అందడం వలన మార్కెట్ మంచిగా ఉండేదిజీఎస్టీ తగ్గిపోతోంది..చాలా ఆందోళనగా ఉంది..వ్యాపారాలు ఏమి జరగడం లేదువాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారుదానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏమిటిప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలి.. ఏది లేకపోతే ఎలా..?నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయిబెల్టు షాపులకు బహిరంగ వేలం వేస్తున్నారుమా సమీప గ్రామంలో బెల్టు షాపు రూ. 50 లక్షలకు వేలం వేశారుఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..?ఈనాడు, జ్యోతి కథనాలనే నేను చెప్తున్నానుపవన్ కాకినాడ పర్యటన..గబ్బర్ సింగ్-3పవన్ కాకినాడ పర్యటన.. గబ్బర్ సింగ్..3ని తలపించిందిపీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తప్పే.. చర్యలు తీసుకోండిఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా..? అని పవన్ అడుగుతున్నారుపక్కన ఉన్న మీ మంత్రి మాటేంటి..?ఆయన చేతకాని వాడా..?పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండిరెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలిబియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారునిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి.. -
బాధ్యత మరచి ఎదురుదాడా!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు గడుస్తున్నా తన వైఫల్యాలను, తప్పిదాలను ఒప్పుకోకుండా వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు ఆపసోపాలు పడటం సిగ్గుచేటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలపై రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోవైపు నిత్యం జగన్ జపం చేస్తూ ఎల్లో మీడియాలో బురద కథనాలకే పరిమితమైందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇసుక నుంచి మద్యం వరకు.. కాకినాడలో పీడీఎస్ బియ్యం నుంచి ధాన్యం రైతులను తుపాన్కు వదిలేయడం దాకా అడుగడుగునా కూటమి సర్కారు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.ఇసుకలో లూటీ చేసేదీ వారే..! బెల్టు షాపులకు అనుమతి ఇచ్చేదీ వారే..! బియ్యాన్ని ఎగుమతి చేసేది వారే.. మళ్లీ స్మగ్లింగ్ జరుగుతోందంటూ హడావుడి చేసేదీ వారేనని పేర్కొంటున్నారు. అసలు కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం ఎందుకు వస్తోంది? పీడీఎస్ బియ్యం వస్తుంటే గత ఆర్నెల్లుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఎవరు పంపుతున్నట్లు? కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే దోపిడీ చేసి అమ్ముకుంటున్నారు కదా? తన పార్టీకి చెందిన మంత్రి పౌరసరఫరాల శాఖను పర్యవేక్షిస్తుంటే డిప్యూటీ సీఎం వచ్చి హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎంపీ కూడా అదే పార్టీకి చెందిన వారని ప్రస్తావిస్తున్నారు. సీఎంఆర్ బియ్యం బకాయిల విడుదలలో కమీషన్ల పర్వం వెలుగులోకి రావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, గత సర్కారుపై బురద చల్లడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు. ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి.. బెల్ట్ తీస్తామంటారా?మద్యం దుకాణాలను లాటరీ పేరుతో కూటమి శ్రేణులకు కట్టబెట్టిన ప్రభుత్వ పెద్దలు.. టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఊరూరా బెల్ట్ షాపులను తెరిపించారు. సీఐ, ఎస్ఐలను పంపి ఇతరులకు మద్యం దుకాణాలు దక్కకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఊరూరా ఒక్కో బెల్ట్ షాపును వేలం వేసి వచ్చిన డబ్బులను టీడీపీ కార్యకర్తలకు పంచిపెట్టారు. రూ.2 లక్షల నుంచి మూడు లక్షల దాకా వసూలు చేస్తూ నీకింత.. నాకింత! అని వాటాల దందా నడిపిస్తున్నారు. బెల్ట్ షాపులతో వాడవాడలా మద్యం ఏరులై పారుతోంది. ఈ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు బీరాలు పలుకుతుండటంపై ఎక్సైజ్శాఖ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా హోంమంత్రి అనిత ఇలాకాలో కూడా బెల్టు షాపుల దందా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా!ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ కోసం సేకరించిన వరి ధాన్యాన్ని మర ఆడించేందుకు పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద బియ్యాన్ని తిరిగి అప్పగిస్తారు. దీనికి సంబంధించి సుమారు రూ.1,600 కోట్ల వరకు మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ బిల్లుల చెల్లింపులో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాకినాడ కేంద్రంగా సరి కొత్త డ్రామాకు తెర తీశారు.స్మగ్లింగ్కు కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించడం విస్మయానికి గురి చేస్తోంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. బియ్యం ఎగుమతి.. ఎరువుల దిగుమతి అంతా యాంకరేజ్ పోర్టు మీదుగానే సాగుతుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు.. కాకినాడ పోర్టుకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న యాంకరేజ్ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణా ఎలా సాధ్యమవుతుందని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. పారదర్శక వ్యవస్థను తొలగించి ఇంటికే పౌరసేవలా?ప్రభుత్వ సేవలు, పథకాలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల మంది వలంటీర్లను తొలగించి దారుణంగా వంచించారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన సీఎం చంద్రబాబు తాజాగా ఇంటి గుమ్మం వద్దకే పౌర సేవలు అందిస్తానని చెప్పడంపై విస్తుపోతున్నారు. వలంటీర్లు లేకపోవడంతో టీడీపీ నేతలు లబ్ధిదారులను పెన్షన్ల కోసం ఇళ్ల వద్దకు రప్పించి చుట్టూ తిప్పుకుంటున్నారు. సచివాలయాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్న ఫోటోలు మీడియాలోనూ వచ్చాయి. మరోవైపు కూటమి సర్కారు దాదాపు లక్షన్నర పెన్షన్లను కుదించింది. ఇక పౌరసేవలు, పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ బాదుడే బాదుడు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చారీలను ఏమాత్రం పెంచబోమని.. వాటిని తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఊరూవాడా ప్రచారం చేశారు. అయితే హామీని నిలబెట్టుకోకుండా అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.15,485.36 కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై మోపారు. విద్యుత్ చార్జీల మంటతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దాంతో ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెడుతూ సీఎం చంద్రబాబు బురద చల్లుతున్నారు.ధాన్యం రైతుకు దగా..ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కూటమి సర్కారు దారుణంగా విఫలమైంది. ఎమ్మెస్పీ దక్కకపోవడంతో అన్నదాతకు బస్తాకు రూ.300 – రూ.400 వరకు నష్టం వాటిల్లింది. దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు తుపాన్ కారణంగా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు రోజులు ముందే తుపాన్ హెచ్చరికలున్నా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకుండా చోద్యం చూసింది. గోనె సంచులు సమకూర్చలేదు. పంట చేతికందే సమయంలో వర్షాలకు ధాన్యం తడిచిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.అప్పులపై అవే అబద్ధాలు..వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. రూ.పది లక్షల కోట్లు.. రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి నేతలు, ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఎన్నికల్లో సూపర్ సిక్స్తోపాటు వందల హామీలను ప్రజలకు చంద్రబాబు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్తోసహా ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అప్పులతోపాటు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ సాక్షిగా రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని కూటమి ప్రభుత్వమే అంగీకరించింది. అయినా సరే రాష్ట్రం అప్పు రూ.పది లక్షల కోట్లు కంటే ఎక్కువ ఉందంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తూ.. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉండటం వల్లే హామీలను అమలు చేయలేకపోతున్నానని సమర్థించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.పోలవరానికి ద్రోహం..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే తగ్గిస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. అయితే ఇప్పటికే స్పిల్ వేను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మించామని.. పోలవరం ప్రధాన డ్యామ్ను కూడా అదే రీతిలో నిర్మిస్తామని.. కావాలంటే టేపు తీసుకుని వచ్చి కొలుచుకోవాలని నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సవాల్ విసరడంతో తోక ముడిచారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి ఒక్క అంగుళం కూడా తగ్గించబోమని అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో అనేక మార్లు స్పష్టం చేశారు.కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఆగస్టు 28న పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేయడం గమనార్హం. దీనిపై ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు నోరు మెదపలేదు. పోలవరానికి కూటమి ప్రభుత్వం తలపెట్టిన ద్రోహానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దుష్ఫ్రచారాన్నే సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల ఇప్పుడూ చేస్తుండటం గమనార్హం.ఇసుకపై ఇష్టారాజ్యంగా.. ఇసుక ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలిచ్చారు. వర్షాకాలంలో అవసరాల కోసం గత సర్కారు స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకలో 40 లక్షల టన్నులను అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ నేతలు తెగనమ్మి సొమ్ము చేసుకున్నారు. అందరూ దసరా పండుగ సందడిలో ఉన్న సమయంలో కేవలం రెండు రోజులే గడువు ఇచ్చి ఇసుక రీచ్లకు టెండర్లు నిర్వహించారు. ఇసుక రీచ్లన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. ఇసుక ధరలను పచ్చ ముఠాలు ఇష్టారాజ్యంగా వసూలు చేయడంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. -
పోస్టాఫీసులకు పోటెత్తుతున్న మహిళలు
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రధాన పోస్టాఫీసులన్నీ వేలాదిగా తరలివస్తున్న మహిళలతో కిటకిటలాడుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలందరి వ్యక్తిగత ఖాతాల్లో సీఎం చంద్రబాబు రూ.1,500 జమ చేస్తారన్న విస్తృత ప్రచారంతో మహిళలంతా పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురం, హిందూపురంలో హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మహిళలు ఐపీపీబీ ఖాతాల కోసం చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం 5 గంటల నుంచే క్యూ కడుతుండటంతో హెడ్ పోస్టాఫీసులు జాతరను తలపిస్తున్నాయి. నెల రోజులుగా మహిళలు పోస్టాఫీసులకు వెళ్తున్నప్పటికీ.. నాలుగు రోజుల నుంచి వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. సోమవారం వేలాదిగా మహిళలు తరలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. సూపర్ సిక్స్ పథకాల కోసమంటూ..టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచి్చన హామీల మేరకు సూపర్సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతాయంటూ కూటమి నేతలు పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లో రూ.1,500 జమ చేస్తారన్న ప్రచారంతో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొందరు మహిళలైతే చంటి బిడ్డలను చంకన వేసుకుని వస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోస్టల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. తొక్కిసలాట నేపథ్యంలో కొందరు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. ఏమవుతుందోనన్న ఆందోళన అందరిలో కనిపించింది. పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులంతా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో కూడా అంతుబట్టడం లేదు.అసలు సంగతి ఏమిటంటే..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే ఐపీపీబీ ఖాతాలు గల లబ్ధిదారులు కొత్తగా ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు. అయితే, ఐపీపీబీ ఖాతాలు కలిగి ఆధార్ లింక్ అయినంత మాత్రానా డబ్బు జమ కాదు. కచ్చితంగా ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. బ్యాంకర్లు ఖాతాలకు ఆధార్ లింక్ చేస్తున్నా.. సీడింగ్ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా చాలామంది మహిళలు పోస్టల్ శాఖ ఇచ్చే ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ కానివారు అనంతపురం జిల్లాలో సుమారు 3 లక్షలకు పైబడి ఉన్నట్టు సమాచారం.బ్యాంకుల్లో ఆధార్ సీడింగ్ కాని వారు ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు వస్తుండగా.. ఆధార్ లింకేజీ, సీడింగ్ అయిన వారు కూడా ఐపీపీబీ ఖాతాల కోసం పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. మహిళలకు రూ.1,500 చొప్పున ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారు, అందుకోసం మహిళలు ఏం చేయాలి, ఇప్పటికే బ్యాంక్ ఖాతాలున్న మహిళలు ఏంచేయాలి, ఖాతాలు లేనివారు ఏ పోస్టాఫీసుకు లేదా ఏ బ్యాంకును సంప్రదించాలనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
-
CBNlies: ‘మాట మార్చడంలో డాక్టరేట్ ఇవ్వాలేమో!’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు చేస్తున్న ప్రకటనలపై శాస్త్రీయంగా ఒక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఎన్నికల ముందు చేసిన ప్రకటనలు.. ఆ తరువాత ఇస్తున్న సందేశాలు అంత ఆసక్తికరంగా ఉన్నాయి మరి! మాటలు మార్చడం ఇంత తేలికా అన్నట్టుగా ఉన్నాయి ఇటీవలి కాలంలో వీరు చేస్తున్న ప్రకటనలు. ఏమాత్రం జంకు గొంకూ లేకుండా అసత్యాలెలా చెప్పగలుగుతున్నారు? అసలు వీరి మాటలను ప్రజలు పట్టించుకుంటున్నారా? అన్న అనుమానాలూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమన్నారు..? తన రాజకీయ అనుభవంతో ప్రజలపై భారం పడకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాననే కదా? ఈ మాటలన్నింటికీ పవన్ కళ్యాణ్ ఊకొట్టడమే కాకుండా నిజం నిజం అంటూ బాబును ఆకాశానికి ఎత్తేశారా లేదా? వందిమాగధుల చందంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు పొడగ్తలతో బాబుకు ఎలివేషన్ కూడా ఇచ్చాయే..!! జగన్ సంక్షేమ కార్యక్రమాలను వృథా ఖర్చులంటూ, బటన్ నొక్కడం తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ విమర్శించిన ఈ మీడియా సంస్థలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రెండు, మూడు రెట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించాయి కూడా. జగన్ చేస్తే తప్పట. అదే చంద్రబాబు ఇంకా అధికంగా చేస్తానని చెబితే సూపర్ అట. ఇలా సాగిపోయింది వారి ప్రచారం. కానీ... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తం ఒక్కసారిగా అందరి గొంతు మారిపోయింది. వారి అసలు స్వరూపాన్ని బయటబెట్టుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అన్నింటిలోనూ యూటర్న్ తీసేసుకున్నారు. ఇందుకు ఏమాత్రం సిగ్గుపడటమూ లేదు సరికదా.. దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు పిసరంత పెంచినా బాదుడే, బాదుడు.. విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెరిగాయి అంటూ టీడీపీ, ఎల్లో మీడియా గొంతు చించుకునేవి. ఈ ప్రభావం ప్రజలపై కూడా కొంత పడింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అదే ట్రూ అప్ ఛార్జీలను మరింత అధికంగా బాదుతున్నారు. ఏకంగా రూ.17 వేల కోట్ల భారం మోపడానికి ఆమోదం పొంది, రూ.ఆరు వేల కోట్లకు పైగా మొత్తాన్ని తక్షణం వసూలు చేయడం ఆరంభించారు. అదేమిటంటే జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల పెంచాల్సి వస్తోందని కొత్త రాగం అందుకున్నారు. దీంతో సంపద సృష్టి అంటే జగన్ టైమ్లో కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమా? అని ప్రజలు నివ్వెర పోతున్నారు. ఇంకో ఉదాహరణ... రోడ్లపై గోతులు పూడ్చి, రోడ్ల నిర్వహణకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటన చూడండి. జగన్ టైమ్లో రహదారులను బాగు చేసినప్పటికీ రాష్ట్రంలో రోడ్లన్ని పాడైపోయినట్లు ఈనాడు మీడియా ప్రచారం చేసింది. వర్షాల వల్ల గోతులు పడినా, అదంతా జగన్ ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారం ఎంత స్థాయికి చేరుకుందంటే.. చంద్రబాబు, పవన్లు అధికారంలోకి రాగానే రహదారులపై గోతులు ఆమాంతం మాయమైపోతాయని, అద్దాల్లా మెరిసిపోతాయని ప్రజలు అనుకున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా మారింతి వీసమెత్తు కూడా లేదు. చంద్రబాబు నాయుడు అట్టహాసంగా హెలీకాప్టర్ వేసుకుని ఓ గ్రామం వద్ద రహదారి గోతిపై మట్టిపోసి రావడం తప్ప! తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మళ్లీ గొంతు మార్చేశారు. రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామన్నారు. వాహనదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసి ప్రైవేట్ సంస్థలే రహదారులను మరమ్మతు చేస్తాయని, ఉభయ గోదావరి జిల్లాల్లోనే తొలి పైలట్ ప్రాజెక్టు మొదలు పెడాతమని ప్రకటించారు. పైగా ప్రజలను ఈ పద్ధతికి ఒప్పించే బాధ్యతను ఆయన ఎమ్మెల్యేలపై నెట్టడం.. వారు ఒప్పుకోకుండా గుంతల్లోనే తిరుగుతామని అంటే తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పడం కొసమెరుపు!! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ పన్ను వేసినా, ఏ ఆదాయ వనరు పెంచినా, ప్రభుత్వ దోపిడీ అని అభివర్ణించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు కాకుండా, అన్నిటిపై ముక్కు పిండి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంటున్నారన్నమాట. నిజానికి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టారు. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మండల స్థాయి రోడ్లకు కూడా యూజర్ ఛార్జీలు అంటున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఈ పద్దతి అమలు చేస్తామని చెబితే తప్పు కాదు. అప్పుడేమో అంతా ఫ్రీ అని, ఆ తర్వాత ఏదీ ఉచితం కాదని, డబ్బులు మీరే ఇవ్వాలని జనాన్ని అంటుంటే వారు నిశ్చేష్టులవడం తప్ప చేసేది ఏమి ఉంటుంది? ఇక్కడ మరో సంగతి చెప్పాలి. రోడ్లు,భవనాల శాఖ మంత్రి జనార్ధనరెడ్డి మాత్రం రహదారులపై టోల్ గేట్లు ఉత్తదే అని ప్రకటన చేశారు. కాని మంత్రి గాలి తీస్తూ చంద్రబాబు యూజర్ చార్జీల ప్రకటన చేసేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం స్థానిక సంస్థలు పారిశుద్ద్యం నిర్వహణకు నెలకు ఏభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తే జగన్ ప్రభుత్వం చెత్తపన్ను వేశారని, ఇది చెత్త ప్రభుత్వం అని దుర్మార్గపు ప్రచారం చేశారు. ఇప్పుడేమో వేల రూపాయల చొప్పున యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు. లేకుంటే గోతులే మీకు గతి అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు దీనిని రోడ్లపై గుంతలకు కూడా జనం నుంచి డబ్బు వసూలు చేసే రోత ప్రభుత్వం అని ఎవరైనా విమర్శిస్తే తప్పులేదేమో! ఒకవైపు అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తున్నారు. ఆ అప్పులు రాష్ట్రం అంతా కట్టాల్సిందే. అమరావతిలో మాత్రం కొత్త రోడ్లపై టోల్ గేట్లు పెట్టి డబ్బలు వసూలు చేస్తామని చెప్పడం లేదు. అమరావతిలో విలాసవంతమైన కార్లలో తిరిగే ఖరీదైన షరాబులే అధికంగా ఉంటారు. వారు తిరిగే రోడ్లపై అంతా ఫ్రీ. పేదలు, మధ్య తరగతి వారు ఎక్కువగా తిరిగే గ్రామీణ రోడ్లపై మాత్ర టోల్ వసూళ్లు. ఇసుక ,మద్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇసుక మొత్తం ఉచితం అనుకున్న ప్రజలకు గతంలో కన్నా అధిక రేట్లు పెట్టి కొనాల్సి రావడం అనుభవం అయింది. మద్యం ధరలు తగ్గిస్తారనుకుంటే ఎమ్.ఆర్.పి కన్నా ఎక్కువ రేట్లే వసూలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలలో భాగంగా గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పెడితే చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్లు నానా యాగీ చేశారు. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా దుర్మార్గపు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటినే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. అప్పట్లో స్మార్ట్ మీటర్లపై వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఈనాడు మీడియా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయి.. అని హెడింగ్ పెట్టి ప్రజలను పండగ చేసుకోమన్నట్లుగా స్టోరీలు ఇస్తోంది. వివిధ కారణాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. వాటిని అదుపు చేసే యంత్రాంగం లేకుండా పోయింది. అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా సరుకుల రేట్లు పెరిగిపోయాయని యాగీ చేసిన టీడీపీ, ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఇప్పుడు అంతకు రెట్టింపు ధరలు పెరిగినా నోరు మెదిపితే ఒట్టు. ప్రజలకు జగన్ టైమ్ లో వచ్చిన స్కీముల డబ్బుతో పేదల జీవితం చాలావరకు సాఫీగా సాగేది. ఆయన ఇచ్చిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని కూటమి నేతలు అబద్దాలు చెప్పి, ఇప్పుడు దాదాపు అన్నిటిని ఎగవేసే పనిలో ఉన్నారు.దాంతో మండుతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం పిండుతున్న అదనపు వసూళ్లు చాలవన్నట్లు జీఎస్టీపై ఒక శాతం సర్ఛార్జ్ వసూలు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు కోరారు. అది కూడా వస్తే ఏపీలో పన్నులు మరింతగా పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు మండుతాయి. ప్రజల జీవితం మరింత భారంగా మారుతుంది. చేసిన బాసలకు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరిశోధనార్హమే అవుతుందేమో! బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని టీడీపీ సూపర్ సిక్స్ నినాదం. కాని అది ఇప్పుడు బాబు ష్యూరిటీబాదుడే, బాదుడుకు గ్యారంటీగా మారిందా! ఇప్పుడు జనం రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని అనుకోరా! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజలకు షాక్లు.. సర్కారు సోకులు 'వాతలపై వాకౌట్'
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది. విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు. ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది. సూపర్ సిక్స్ ఎక్కడ? సూపర్సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా? దిగజారిన శాంతి భద్రతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఔను.. ఒక్క సిలిండరే ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు.. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు. మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మూజువాణితో ఆమోదం... మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. -
ప్రతీ ఇంటికీ మూడు సిలెండర్లు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ
-
సూపర్ సిక్స్ ని నమ్మి ఓటేశారు.. ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది
-
‘హామీలిచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.. ఇది మోసం కాదా? చంద్రబాబూ’
సాక్షి, తాడేపల్లి: ‘చంద్రబాబూ.. ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు. నీవు చీటర్వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు.ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్?దీపం:ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్?తల్లికి వందనం:ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్?అన్నదాత:ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్?ఉచిత బస్సు ప్రయాణం:రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.యువగళం:రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్ఇదీ చదవండి: హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు!50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు. నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు..@ncbn గారు .. ప్రజలకు సూపర్సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.నీవు చీటర్వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2024 -
అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు
-
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకు స్కెచ్..
-
హామీలు సూపర్ సిక్స్.. అమలులో క్లీన్ బౌల్డ్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనిగానీ.. నిర్దిష్ట కేటాయింపులుగానీ లేకుండానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్ను సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా పన్నుల మోత, అప్పుల వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. సూపర్ సిక్స్ హామీలు డకౌట్ కావడంతో కూటమి సర్కారు తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత సామెతను తలపిస్తోంది. గత ఆర్ధిక ఏడాది కంటే ఈదఫా పన్ను ఆదాయం ఏకంగా రూ.23,894 కోట్లు అదనంగా వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే పన్నుల రూపేణా ప్రజలపై మరింత భారం మోపనున్నారు. ఇందులో మద్యం ద్వారా అదనంగా రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత ఆర్ధిక ఏడాది మద్యం ద్వారా రూ.15,977 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్ధిక ఏడాది రూ.25,597 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. పన్నేతర ఆదాయం గత ఆర్థిక ఏడాది కన్నా రూ.3,000 కోట్లకు పైగా అదనంగా వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. భారీ అప్పులు చేసి ప్రజలపై రుణం భారం మోపడమే లక్ష్యంగా 2024–25 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ ఆర్థిక ఏడాది ప్రజా రుణం ఏకంగా రూ.91,443 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. ‘సూపర్’.. బాదుడే! సూపర్ సిక్స్లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతను ఎప్పటిలాగానే చంద్రబాబు సర్కారు మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా బడ్జెట్లో చెప్పకుండా తూతూ మంత్రంగా రూ.1,000 కోట్లు విదిలించి మసిబూసి మారేడుకాయ చేశారు. సూపర్ సిక్స్లో భాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి బడ్జెట్లో కనీసం ప్రస్తావించకుండా మహిళలను దగా చేశారు. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని సూపర్ సిక్స్లో చెప్పిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది నిర్దిష్టంగా వెల్లడించకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో కొన్ని చోట్ల, జెండర్ బడ్జెట్లో కొన్ని చోట్ల కేటాయింపులు చేసినట్లు చూపించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి పైసా కేటాయింపుల చేయకపోగా త్వరలో అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి కేశవ్ ముక్తాయించారు. మరోపక్క విద్యుత్ రంగానికి కేటాయింపుల్లో భారీగా కోత విధించారు. 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14,867.18 కోట్లు వ్యయం చేస్తే 2024–25లో సగానికిపైగా కోత విధించి కేవలం రూ.8,155.31 కోట్లను కేటాయించారు. అంటే వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడుతుందని చెప్పకనే కూటమి ప్రభుత్వం చెప్పింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు అరకొర నిధుల కేటాయింపుతో సరిపుచ్చారు. 2023–24 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,866 కోట్ల వ్యయం చేయగా 2024–25లో కూటమి ప్రభుత్వం కేవలం రూ.4,012 కోట్లు మాత్రమే కేటాయించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా భారీ ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే భూమి విలువలను పెంచడం ద్వారా ప్రజలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రూపంలో ప్రజలపై అదనపు పన్నుల భారం వేయనున్నారు. 2023–24 లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు రూ.9,542 కోట్లు ఆదాయం రాగా 2024–25లో రూ.13,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్టెట్లో పేర్కొన్నారు. జగన్ ఉండి ఉంటే నేరుగా లబ్ధిదారులకు ఇవి అందేవి ఆదాయం, అప్పులు భారీగా.. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు బడ్జెట్లో ఆ మాటే గుర్తు లేన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. మొత్తం మీద పన్నుల రూపంలో భారీ ఆదాయం, భారీ అప్పులతో 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ.68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు.బాబు మేనిఫెస్టోలో హామీలు ఘనం... బడ్జెట్లో కేటాయింపులు శూన్యంప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు సూపర్సిక్స్ హామీలతోపాటు మరికొన్ని హామీలు ఘనంగా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్లోనే వాటి అమలుకు పైసా కేటాయించలేదు.పూర్ టు రిచ్: పేదలకు సంపన్నులను చేసే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్షిప్ (పీ4) పథకాలు: అసలు ప్రస్తావనే లేదు.సౌభాగ్యపథం: చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10 లక్షల వరకు సబ్సిడీ: ఈ ఊసే లేదు.యువత సంక్షేమం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్: దీని గురించి ఎలాంటి ఊసేలేదుఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహకాలు: చిల్లిగవ్వ ఇవ్వలేదుపరీక్షలకు ప్రిపేర్ కావడానికి డిజిటల్ లైబ్రరీలు: ఈ ప్రస్తావనే లేదుబీసీ డిక్లరేషన్బీసీ సబ్ ప్లాన్ ద్వారా రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం: ఆ మేరకు కేటాయింపులు లేదుదామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు: చిన్న మాట కూడా లేదుస్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం: స్పష్టత లేదు.రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ: కేటాయింపు లేదుఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25వేల వేతనం: ఊసే లేదు.వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం: పైసా లేదుమహిళా సంక్షేమంపీ4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం: ఊసే లేదు.అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ: దీని ప్రస్తావన లేదుఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు: దీని ప్రస్తావన లేదువిద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు: ఒక్క మాట లేదుఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర హామీలుప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్: పట్టించుకోలేదులేదుసీపీఎస్/జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అమోదయోగ్యమైన పరిష్కారం: ఆ ప్రసక్తే లేదుతక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు: ఊసే లేదువలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు: సున్నాకాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు: పైసా కేటాయించలేదు నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఏటా రూ.100 కోట్లు: పైసా లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్ చొప్పున 20లక్షల మందికి ఏడాదికి రూ.9,600 కోట్లు కేటాయించాలి: ఊసే లేదుప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లు, ప్రతి హైవీ లైసెన్సు లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం: ఒక రూపాయి కేటాయించలేదువ్యవసాయంధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు: పైసా కేటాయించలేదు రాయితీతో సోలార్ పంపు సెట్లు: దీని ప్రస్తావనే లేదుడ్రిప్ ఇరిగేషన్కు 90 శాతం సబ్సిడీ: ఆ ఊసే లేదుసబ్సిడీపై వ్యవసాయ పరికరాలు: లక్ష మంది రైతులు, కిసాన్ డ్రోన్లకు రూ.342 కోట్లు కావాలి. కానీ కేటాయించింది రూ.187.68 కోట్లు మాత్రమే పేదల గృహవసతిపేదలందరికీ గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు: బడ్జెట్లో ప్రస్తావన లేదుఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి: స్పష్టత ఇవ్వలేదుసాగునీటి రంగంగాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల శీఘ్రతర నిర్మాణం: ఆ మేరకు నిధుల కేటాయింపు లేదురాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి: బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు లేవు. ఈ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం -
కలిసికట్టుగా ఉద్యమిద్దాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఏపీలో మాఫియా రాజ్యమేలుతోంది. ఈ రాక్షస పాలనలో ప్రజలకు అండగా నిలబడదాం. కలిసికట్టుగా ఉద్యమిద్దాం. కూటమి అరాచకాలపై తిరుపతి నుంచే తిరుగుబాటు చేద్దాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ హామీలని చెప్పి చంద్రబాబు మోసం చేస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతోందని, మద్యం దుకాణాలు తెరవక ముందే టీడీపీ నేతలు దుకాణాలు తెరిచారని విమర్శించారు.ప్రజలు బంగారు పళ్లెంలో పెట్టి మనకు తిరిగి అధికారం ఇస్తారన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే సహించనని చెప్పిన పవన్కళ్యాణ్ ఈరోజు ఎక్కడ ఉన్నారని ప్రశి్నంచారు. ఇది ‘ఈవీఎం’ ప్రొడక్షన్స్ వారి సీబీఎన్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా భూమన కరుణాకరరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి అధ్యక్షత వహించారు. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు: విజయసాయిరాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదని అన్నారు. ప్రజలకు సేవచేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు భూమన అని అన్నారు. తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందని.. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని.. 2027 ఆఖర్లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించేందుకు భూమన కృషి చేస్తారని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు సంక్షేమం దూరమైంది: వైవీ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించారని గుర్తుచేశారు. నేడు ప్రజలు సంక్షేమ పథకాలు అందడంలేదని.. అభివృద్ధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత గుర్తింపు ఇస్తామని, 2027లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయన్నారు. మళ్లీ జగన్ను సీఎం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. తొలిరోజు నుంచే అరాచకాలు: సజ్జల చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నాటి నుంచే రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఓ మాఫియా రాజ్యం ఏలుతోందని.. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా కనిపించడంలేదన్నారు. 4 నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.వైఎస్ జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోషపడ్డారని.. అయితే వాటిని జగన్ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో సీఎం చంద్రబాబు రూ.53వేల కోట్లు అప్పుచేశారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయని ప్రశి్నంచారు. ఇకపోతే.. బలమైన కార్యకర్తల పారీ్టగా ఈసారి అధికారంలోకి వస్తున్నామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కష్టాల్లోనే వైఎస్ కుటుంబానికి మరింత అండగా.. : భూమన చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భూమన మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలు చేసే సమయంలో తాను తుపాకి కాల్పుల వరకు వెళ్లి వచ్చిన వాడినని, చంద్రబాబుని ఢీకొనడం అంటే బెండుతో ఢీకొనడడం లాంటిదేనన్నారు. వైఎస్సార్ కుటుంబం అధికారంలో ఉన్నప్పటి కంటే.. కష్టాల్లో ఉన్నప్పుడు మరింత అండగా నిలబడతానని భూమన స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 25 ఏళ్ల యువకుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డిని ఓడించడానికి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు చంద్రగిరిలో రంగంలోకి దించారని.. లోకేశ్ 6 రోజులు పాదయాత్ర చేసి మోహిత్ ఓటమి కోసం పనిచేశారని గుర్తుచేశారు. -
రైతులకు 20 వేలు ఎక్కడ చంద్రబాబు.. టీడీపీపై కారుమూరి ఫైర్
-
ఇసుక ఉచితమే.. చార్జీలు మాత్రమే తడిసి ముపేడు
-
Big Question: దీపాలు ఆర్పే డబ్బా బాబు!.. ఏపీ రాష్ట్ర ప్రజలు ఏమైనా ఎర్రి గొర్రెలా..
-
బాబు సర్కారు ప్రగతి.. 59,000 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల్లో గొప్పలు పోయిన చంద్రబాబు.. ఈ ఐదు నెలల్లో పైసా సృష్టించలేదు. అభివృద్ధి, సూపర్ సిక్స్ హామీలూ అటకెక్కేశాయి. ఉచిత ఇసుక అంటూ జనాన్ని ఎన్ని పిల్లిమొగ్గలు వేయిస్తున్నారో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. పల్లెల్లో జ్వరం వచ్చినా మందు బిళ్లలు దొరకవు. చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటీ అంటే.. అప్పులు. ఈ అప్పుల గ్రాఫ్ మాత్రం రాకెట్ స్పీడ్తో ఆకాశంలోకి దూసుకుపోతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలేవీ అమలు చేయని ప్రభుత్వం ఈ వేల కోట్ల అప్పుల సొమ్మంతటినీ దేనికి ఖర్చు చేస్తోందోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.59,000 కోట్లు అప్పు చేసింది. బడ్జెట్ పరిధిలో చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం 7.17 శాతం వడ్డీతో మరో రూ.3,000 కోట్లు అప్పు చేసింది. దీంతో బడ్జెట్ పరిధిలో చేసిన రుణాలు రూ.51,000 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.8,000 కోట్లు బడ్జెటేతర అప్పు చేశారు. తాజాగా తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 19 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 23 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఈ రుణం తీసుకుంది. నాడు గగ్గోలు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడైనా అప్పు తెస్తే.. ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ ఎల్లో మీడియా కథనాలను అచ్చేశాయి. చంద్రబాబు అండ్ కో కూడా లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపించేవారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రజల పరువు ప్రతిష్టలను దిగజార్చడమే లక్ష్యంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలు, కేంద్ర అనుమతి మేరకు రుణాలు తెచ్చినా అప్పు చేయడం మహాపరాధంగా బాబు అండ్కో చిత్రీకరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.ఇప్పుడు చంద్రబాబు మంగళవారాల్లో అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు పెగలడంలేదు. వివిధ కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వ గ్యారెంటీతో చంద్రబాబు సర్కారు మరో రూ.8,000 కోట్ల బడ్జెటేతర అప్పు చేసినా ఎల్లో మీడియా కిమ్మనడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల కార్యకలాపాల కోసం అప్పు చేసేందుకు గ్యారెంటీలు ఇవ్వడాన్ని చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా తప్పుపట్టాయి. పైగా ఆ అప్పులను దాచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.2,000 కోట్లు మార్క్ఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు ఏపీఐఐసీ ద్వారా రూ.1,000 కోట్లు మొత్తం రూ.8,000 కోట్లు అప్పు తెచ్చింది. దీనిపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే తప్పు అని గగ్గోలు పెట్టిన వారికి అదే పని చంద్రబాబు సర్కారు చేస్తే ఒప్పవుతుందా అని అంటున్నారు. -
ప్రజలు ‘సూపర్సిక్స్’ కోసం చూస్తున్నారు: బొత్స
సాక్షి,విశాఖపట్నం: సూపర్సిక్స్ హామీల అమలుకు ముహూర్తం ఎప్పుడని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం(అక్టోబర్ 19) మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీల అమలును కూటమి ప్రభుత్వం విస్మరించింది. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారు’అని బొత్స మండిపడ్డారు.బొత్స ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వానికి హామీలపై ఆరు నెలలు సమయం ఇద్దమనుకున్నాం.ఆరు నెలల తర్వాత కూడా ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు.రెండున్నర ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని చంద్రబాబు చెపుతున్నారు.వైఎస్సార్సీపీ పాలనలో పది వేల రూపాయాలకు వచ్చే ఇసుక నేడు 15 వేల లభిస్తుంది.ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పినా కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు.గత ప్రభుత్వ హయాంలో సినరేజ్ చార్జీలు రూ.375 వసూలు చేసేవారు.సినరేజ్ డబ్బులు ప్రభుత్వానికి ఆదాయ రూపంలో వచ్చేవి.కూటమి ప్రభుత్వం టన్నుకు 375 రూపాయలు సినరేజ్ వసూలు చేయకపోయినా టన్ను ఇసుక రేటు తగ్గలేదు.ట్రాక్టర్తో ఉచిత ఇసుక అనేది గత ప్రభుత్వ హయాంలో కూడా ఇచ్చేవారు.టీడీపీ ప్రభుత్వం హయంలో కొత్తగా ఏమీ ఇవ్వలేదు.మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు, ఎక్కడ తగ్గించారు.నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటాయి.తల్లికి వందనం, రైతు భరోసా ఒక్కరికైన ఇచ్చారా.ఖరీఫ్ ముగుస్తున్నా ఒక్క పైసా రైతు ఖాతాల్లో పడలేదు.అగ్గిపెట్టెలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.ప్రభుత్వ అవినీతిపై వార్తలు రాస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు.అగ్గి పెట్టె లెక్కలు మీ గెజిట్ పేపర్లోనే వచ్చాయి.టీడీపీ నేతల కుమ్ములాటలు వల్ల గుర్లలో పది మంది చనిపోయారు.నాలుగు నెలల నుంచి మంచి నీటిపై పర్యవేక్షణ లేదు.మంచినీటి సరఫరా కాంట్రాక్టు తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని కుమ్మూలడుకుంటున్నారు.ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ నిర్లక్ష్యం వలన డయేరియా మరణాలు సంభవించాయి.పరిశుభ్రమైన మంచి నీటిని అందించలేదు.డయేరియాతో చనిపోయిన పది మందికి నష్ట పరిహారం చెల్లించాలి.ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి -
బాబు మాటలు నేతి బీర చందమే!
బీరాలు పలకడం ఎలాగో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే బెదిరించడం, అధికారంలో ఉంటే దబాయించడం ఈయనగారికి బాగా ఒంటబట్టిన విద్య. ఓటేస్తే అది చేస్తా ఇది చేస్తామని సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించిన బాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని సాంతం మరచిపోయారు. పైగా హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి బాబు విషయం బాగానే తెలిసినట్లు ఉంది. అందుకే కొన్నేళ్ల క్రితమే ‘యూ టర్న్’ బాబు అని పేరు పెట్టారు. చంద్రబాబు కూడా ఆ పేరును ఎప్పటికప్పుడు సార్థకం చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గమనించండి.. ప్రజలు ఆనందంగా ఉంటే వైఎస్సార్సీపీ నేతలు భరించలేకపోతున్నారట! కక్ష్యలు కార్పణ్యాలు తనకు అసలే తెలియవట! హద్దుమీరితే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసట! వైఎస్సార్సీపీ తన పాలన కాలంలో వందకు 70 మంది అధికారులను భ్రష్టు పట్టించిందట! అవినీతి కేసులో జైల్లో ఉండగా ఆయన్ను చంపే ఆలోచన చేశారట! ఇవీ బాబుగారి వాక్కులు. వీటితోపాటు.. ‘‘రాష్ట్రానికి వీళ్లు అరిష్టం’’ అంటూ బాబు వైఎస్సార్సీపీని ఉద్దేశించి మాట్లాడారని అనుకూల మీడియా ఓ భారీ కథనాన్ని వండి వార్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం అరిష్టమా? లేక అన్నీ ఎగ్గొట్టడమా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ఈ నాలుగు నెలల కాలంలో ఎప్పుడైనా బాబు చెప్పాడా? కనీసం షెడ్యూలైనా ఇచ్చారా? ఇవ్వలేదే!. వాస్తవాలిలా ఉంటే.. ఆయనేమో.. ప్రభుత్వం చాలా మంచిదని తనకుతాను కితాబిచ్చుకుంటున్నారు. హామీలన్నింటినీ ఉట్టికెక్కించినా తన హయాంలో ప్రజలు ఆనందంగా ఉన్నారట! దబాయించడం అంటే ఇదే మరి!విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బాబు తీరు ఇంతే. ప్రతిపక్షంలో ఉండగా.. తామైతే ప్రైవేట్పరం కాకుండా రక్షిస్తామని గొప్పలు చెప్పారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం చేతులెత్తేశారు. కుంటిసాకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేశానని తరచూ చెప్పుకునే బాబు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అవగాహన లేకపోయిందని చెప్పడంతోనే తెలిసిపోయింది ఆయన మాటల్లో డొల్లతనం ఎంత అన్నది! విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుతం బాబు చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తే అది ప్రైవేట్ పరం కావడం తథ్యమని అనిపించకమానదు. అదే జరిగితే విశాఖకే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్కే అరిష్టం అవుతుంది!తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయం.. లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఒకసారి.. ఎక్కడ వాడారో అప్రస్తుతమని ఇంకోసారి!! ఇది కదా అరిష్టం! విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల విషయంలోనూ ఇంతే. మునుపెన్నడూ లేనంత విధంగా ఉత్సవాలు జరిగాయని ఆయనకు ఆయన కితాబిచ్చుకున్నారు కానీ.. ప్రత్యేక దర్శనం కోసం రూ.500 లు పెట్టి టికెట్ కొన్నవారు కూడా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చిందని, వీఐపీలు, జత్వానీ వంటి మోసకారి నటీమణులు నేరుగా, దర్జాగా దర్శనానికి వెళ్లారని భక్తులు ఆరోపించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆహా, ఓహో అని పొగుడుకుంటున్నారు. తాను అధికారంలో ఉండగా జరిగిన అవినీతి కార్యకలాపాలను ఎండగట్టారని, కేసులు పెట్టి, జైలుకు పంపారన్న అక్కసుతో ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడమే కాకుండా దాదాపు పాతికమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తనకు కక్షంటే ఏమిటో తెలియదని అమాయకపు మాటలు చెబుతున్నారు. వరద సాయం జరిగేటప్పుడు 5 - 10 శాతం దుబారా కావచ్చని ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చెప్పడం రాష్ట్రానికి అరిష్టమో కాదో తేల్చుకోవాలి. రాజమండ్రి జైలులో తనను చంపాలనుకున్నారని ప్రచారం జరిగిందని ఒక సీఎం అంటున్నారంటే అంతకన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా అలాంటిదేమైనా జరిగి ఉంటే ప్రస్తుతం ఆయనే సీఎంగా ఉన్నారు కదా, నిజానిజాలు నిగ్గుదేల్చవచ్చు కదా? జైలులో ఏసీ కూడా పెట్టించుకున్న ఈ నాయకుడు తనకు తగు సదుపాయాలు కల్పించ లేదని చెబుతున్నారంటే ఏమి అనుకోవాలి! ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ అనుకూల మీడియాలో రాసిన పచ్చి అబద్ధాలను ఇప్పటికీ ఆయన వాడుకుంటూనే ఉన్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ. 23 కోట్లు ఖర్చుపెట్టినదానికి సమాధానం ఇవ్వకపోగా ఐతే ఏంటట? అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీన్ని కదా అరిష్టపు పాలన అనాల్సింది. ఈవీఎంలు, జమలి ఎన్నికలపై చంద్రబాబు పలు మార్లు మాటమార్చిన సంగతి కొత్తేమీ కాదు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెప్పిందే ఆయన. ఒంగోలులో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి అక్రమాలు జరగలేదని ఎందుకు ఎన్నికల సంఘం ఎందుకు తేల్చలేదో చంద్రబాబు వివరించి ఉంటే అప్పుడు ఆయన మాటను నమ్మవచ్చు.ఈవీఎం బ్యాటరీ ఛార్జింగులో ఎందుకు తేడా వచ్చిందో చంద్రబాబైనా తెలిపి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకుండా 2019లో వైఎస్సార్ సీపీ ఎలా గెలిచిందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఈవీంలపై సుప్రీం కోర్టు దాకా ఎందుకు వెళ్లారో చెప్పరు. ఈ సంగతులు పక్కన పెడితే ‘‘నీకు 15 వేలు, నీకు 15 వేలు’’ అంటూ పిల్లలనూ, ‘‘నీకు 18 వేలు’’ అంటూ తల్లుల్ని, ‘‘నీకు 48 వేలు’’ అంటూ యాభై ఏళ్లలోపు ఉన్న బీసీలను ఊరించి వారికి మొండి చేయి చూపడం అరిష్టపాలన అవుతుందా కాదా? నిరద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఇస్తామని ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం, వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆశపెట్టి, అలా చేయకుండా, వారి బతుకులను రోడ్డు పాలు చేస్తే అది మంచి ప్రభుత్వం అవుతుందా? లేక అరిష్టపు ప్రభుత్వమవుతుందా? కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై మాత్రం చంద్రబాబు ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తుంటారు.జగన్ తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేస్తే అది అరిష్టమట. టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన దాదాపు అన్ని హామీల ఊసే ఎత్తకుండా, జనాన్ని మోసం చేయడం అరిష్టం కాదట? జగన్ సచివాలయాలు, హెల్త్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక వ్యవస్థలను తీసుకురావడం అరిష్ట పాలన అవుతుందా? వాటిని అన్నిటినీ ప్రస్తుతం ధ్వసం చేయడం అరిష్టపాలన అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం లోటుపాట్లు లెక్కకు మిక్కిలి. చంద్రబాబు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఎల్లో మీడియా అండతో జనాన్ని మభ్య పెట్టాలని చూడడం అన్నిటికన్నా పెద్ద అరిష్టం కాదా?- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నిరుద్యోగులకు సర్కార్ షాక్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్లో మొట్టమొదటి హామీకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ నిరుద్యోగ యువతకు షాక్ ఇచ్చింది. వారి పొట్టకొట్టే చర్యలు చేపట్టి.. రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించడానికి గేట్లు తెరిచింది. సూపర్ సిక్స్లో మొట్టమొదటి హామీగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన, లేదంటే ఉద్యోగాల కల్పించే వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫేస్టోలోస్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోపోగా తమకు కావాల్సిన రిటైర్డ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో తమకు ఇక సర్కారు కొలువులు ఎండమావే అని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లడమే.. ఖాళీ అయిన పోస్టులను కొత్త వారితో భర్తీ చేయకుండా తిరిగి రిటైర్ ఉద్యోగులతోనే భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తేనే నిరుద్యోగ యువతకు అవకాశాలు ఉంటాయని, రిటైర్ వారితో వాటిని భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువతను నిండా ముంచడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకపక్క రిటైర్డ్ వారికే మళ్లీ అవకాశం ఇస్తూ.. కొత్త పోస్టులు మంజూరు చేయకపోవడంతో సర్కారు కొలువులు నిరుద్యోగ యువతకు అందని ద్రాక్షగానే మిగిలిపోనున్నాయి. ఒక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి.. ఆ నియామక ప్రక్రియను తాత్సారం చేస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది డీఎస్సీ ఉండే అవకాశం కనిపించకపోవడంతో నిరుద్యోగులు ఉస్సూరుమంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోనూ గత ప్రభుత్వం ఇచి్చన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. రెండు స్క్రీనింగ్ కమిటీలు డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి కేడర్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్, ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులతో స్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ కంటే దిగువ కేడర్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో తిరిగి తీసుకునేందుకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శి (హెచ్ఆర్), సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మరో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులతో ఖాళీల భర్తీ ప్రతిపాదనల పూర్తి వివరాలు సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు.. స్క్రీనింగ్ కమిటీలకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్క్రీనింగ్ కమిటీల ఆమోదం తరువాత సీఎం ఆమోదం తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను రెగ్యులర్ పోస్టుల్లోనే తీసుకోవాలని, మంజూరు కాని పోస్టుల్లోకి తీసుకోకూడదని తెలిపారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు, అలవెన్స్లను 2018లో ఆరి్థక శాఖ జారీ చేసిన 48 జీవో మేరకు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు మాత్రమే వర్తిస్తాయని, అఖిల భారత సర్విసు, కేంద్ర సర్విసు ఉద్యోగులకు వర్తించవని పేర్కొన్నారు. -
బాబు ‘సూపర్సిక్స్’ అంటే ఇదే..! విజయసాయిరెడ్డి సెటైర్లు
సాక్షి,ఢిల్లీ:చంద్రబాబు వందరోజుల పాలనలో అమలు చేసిన సూపర్ సిక్స్ హామీలు ఇవే అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం (సెప్టెంబర్21) ఒక ట్వీట్ చేశారు. హింసను ప్రేరేపించి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను చంపించారు.మూడు నెలల్లో 19 వేల కోట్ల అప్పు చేశారు..కీలక సంక్షేమ పథకాలను ఆపేశారు.తన అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు విజయవాడ వరదలకు కారణమయ్యారు.వరద నిర్వహణలో చేతులెత్తేశారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా రెండు బ్లాస్ట్ ఫర్నేస్లను షట్ డౌన్ చేశారు.తమ మేనిఫెస్టో నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీటీడీ లడ్డుపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. TDP of Chandrababu (@ncbn) ‘Super Six’ in his first 100 days of governance in Andhra Pradesh:1.Incited mass violence, including killings of YSRCP supporters.2.Borrowed ₹19,000 crore in under 3 months.3.Halted key welfare schemes.4.Caused and Mishandled the Vijayawada floods…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2024ఇదీ చదవండి.. నీచరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బాబు: కొట్టు -
నారావారి వంచన.. ‘ఆరు’ నూరైనా అమలు చేయాలంటున్న జనం
నేను మారిన మనిషిని. ప్రజల మనిషినంటూ నరం లేని నాలుకలా వరాలు గుప్పించడం.. అందలమెక్కాక అబ్బే సాధ్యం కాదంటూ మాట మార్చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ కొండంత రాగం తీసిన చంద్రబాబు, పవన్ .. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ కొట్టలేం.. డకౌట్ అయిపోతామంటూ చేతులెత్తేస్తున్నారు.ఎండమావులు దప్పిక తీర్చవు.. చంద్రబాబు మాటలేవీ వాస్తవాలు కావన్నది రాష్ట్రంలోని ఐదుకోట్ల మందికీ తెలుసు. కానీ.. సూపర్సిక్స్ పేరుతో ‘మాయ’ఫెస్టో తీసుకొచ్చి.. ఒక ఎత్తు కాకపోతే.. మరో ఎత్తు.. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం అన్నట్లుగా.. హామీల వర్షం కురిపించేసి జనంతో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్నా.. హామీలు అమలు చేయకుండా మెల్లగా జారుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత మరో మాట.. ఇదీ చంద్రబాబు నైజం. నోటికొచ్చిన హామీలిచ్చి.. వాటిని తుంగలో తొక్కడం.. లేదంటే.. నిబంధనల చట్రంలో బందీలుగా మార్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సూపర్ సిక్స్తో విప్లవాత్మక మార్పులు వస్తాయంటూ ఊదరగొట్టి.. ఇప్పుడు అమ్మో భయమేస్తోంది.. సిక్స్ కొట్టడం సాధ్యం కాదు.. ప్రజలంతా గమనించాలంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. తల్లులందరికీ వందనమంటూ వంగి వంగి నమస్కారాలు పెట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాదు.. వచ్చే ఏడాదంటూ తెగేసి చెప్పేశారు. ఇంటికో ఉద్యోగమంటూ ప్రతి చోటా ఊకదంపుడు ఉపన్యాసమిచ్చిన బాబు.. ఇప్పుడు ఇంటికో అబద్ధమనే పథకాన్ని ప్రారంభించారు. నిరుద్యోగులకు భృతి అంటూ మరోసారి బూటకపు మాటలతో బురిడీ కొట్టించి.. యువత ఆశలపై నీళ్లు చల్లారు. ప్రతి మహిళకూ ఆర్థిక ఆసరా కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ అమలుకు అతివలు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడొస్తాయా అంటూ ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. బస్సెక్కిన ప్రతిసారీ ఫ్రీ ఎప్పుడని మహిళలంతా అడుగుతున్నారు.నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఇంటింటి తలుపు తట్టింది. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ క్యాలెండర్ ఏర్పాటు చేసి హామీలు అమలు చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా.. ఇలా ఒకటా రెండా.. ఇచ్చిన ప్రతి హామీ అమలైంది. ఇంటింటాసంక్షేమం వెల్లివిరిసింది. ఉచిత బస్సు వస్తుందా? ఎన్నికల్లో చంద్రబాబు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తోంది. ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదు. అసలు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నట్టా? లేనట్టా? – మరడాన మంగ, మహారాణిపేటఇంకా సిలిండర్ రాలేదు నిత్యావసర ధరలు పెరగడంతో కుటుంబ పోషణ తలకు మించిన భారం అవుతోంది. ఈ సమయంలో ప్రతీ ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో చాలా సంతోషించాం. మా వరకు ఏడాదికి 11 వరకు గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. గ్యాస్ సిలిండర్లు అందిస్తే ఉపశమనంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించాలి. – వియ్యపు నాగమణి, త్రినాథపురం అమ్మ ఒడితో అండగా నిలిచారు నాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు ఇంటర్, కుమార్తె 8వ తరగతి చదువుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. పాఠశాలలు ప్రారంభమై దాదాపు నాలుగు నెలలవుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా రూ.30 వేలు వస్తుందని ఆశపడ్డా. ఇంత వరకు ఈ పథకం ఊసే లేదు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకాన్ని నిరీ్ణత సమయానికి అమలు చేసి అండగా నిలిచారు. – కూండ్రపు అరుణ, మంగప్పయ్యగారివూరు, పరవాడ మండలంమే లోనే సాయం అందించారుజగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఐదేళ్లూ క్రమం తప్పకుండా అమలు చేశారు. ముఖ్యంగా రైతులను అన్ని విధాలా ఆదుకున్నారు. పెట్టుబడి సాయం, ఈ క్రాప్ నమోదు, రైతు భరోసా కేంద్రాలు, పంటల బీమా, పంట గిట్టుబాటు ధర, పంటల కొనుగోలుతో అండగా నిలిచారు. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి మేలోనే మొదటి విడతగా రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. ఏడాదికి రూ.13,500 సాయం రైతులకు అందేది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునేవాళ్లం.– చిల్ల వెంకటరమణ, చిప్పాడ‘తల్లికి వందనం’ ఊసేలేదు? నాకు ఇద్దరు పిల్లలు. పాప నాలుగో తరగతి, బాబు 8వ తరగతి చదువుతున్నాడు. కూటమి అధికారంలోకి వస్తే తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఉలుకూ.. పలుకూ లేదు. ఫీజులు కట్టాలని పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నా యి. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ద్వారా ఎంతో ప్రయోజనం పొందాను. – టి.వరలక్ష్మి, పాతకొవ్వాడరూ.1,500 ఎప్పుడిస్తారు? మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇంటర్ చదువుతున్నారు. నా భర్త ఆటో డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 19 నుంచి 59 ఏళ్ల మధ్య గల ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారనే కూటమికి ఓటు వేశాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే.– మీసాల జయలక్షి్మ, సత్యానగర్భృతి అందేదెప్పుడో? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గతంలో ప్రైవేట్ జాబ్ చేసేవాడిని. ఎన్నికల్లో గెలిస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు/నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇవ్వడంతో.. పోటీ పరీక్షలపై దృష్టి సారించాను. ప్రభుత్వం నిరుద్యోగభృతిపై ఊసే ఎత్తడం లేదు. కోచింగ్ సెంటర్, స్టడీ మెటీరియల్కు ఎంతో ఖర్చు అవుతోంది. ఇదంతా కుటుంబానికి ఆర్థికంగా భారం. వెంటనే నిరుద్యోగ భృతి అందజేయాలి.– కందుల సంతోష్ 62వ వార్డురైతుకు సాయం దక్కదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇంకా అమలుకు నోచుకోలేదు. మేము వరి, కొబ్బరి, మొక్కజొన్న, అరటి సాగుచేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ సాయం అందకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేయాలి. – నగిరెడ్ల రాంబాబు, వలందపేట -
చంద్రబాబు మరో మాయ.. ముందే లీకులు కూడా!
ఆంధ్రప్రదేశ్ ప్రగతికి రోడ్ మ్యాప్ తయారు చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త. ఇది నిజమే అయితే సంతోషించాల్సిన విషయమే. ఆ మొత్తం కథనం చదివితే ఎక్కడా సూపర్ సిక్స్ కానీ.. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు కనిపించలేదు. వాటికి రోడ్ మ్యాప్ ఎందుకు తయారు చేయడం లేదో చెప్పలేదు.కొత్త రోడ్ మ్యాప్లో ప్రధానంగా జనాభా మేనేజ్మెంట్(డెమోగ్రాఫ్ మేనేజ్మెంట్) గురించి ప్రస్తావించడం ఒక విశేషమైతే.. పీ-4(పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్) పాలసీ మీద కేంద్రీకరించారు. చంద్రబాబు గత కొంతకాలంగా చేస్తున్న ప్రచారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్దికి ఇంతకు మించి మార్గం లేదని చంద్రబాబు నాయుడు అన్నారని ఈ ప్రతిక వెల్లడించింది. ఈ ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ప్రయోజనాలు సాధించి తద్వారా సంపాదించే డబ్బును సంక్షేమానికి ఖర్చు పెట్టవచ్చని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలు ఇప్పట్లో అయ్యేవికావని చెప్పడమేనా?.ప్రతీ మహిళకు నెలకు 15 వందలు, స్కూల్కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి ఏడాదికి 15వేలు, ప్రతీ ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వీటికి బాబు సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రచురించారు. దీనికి బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ అని టైటిల్ పెట్టారు. ఇందులో ఎక్కడా పీ-4 విధానాన్ని అమలు చేసి.. అంటే ప్రైవేటు రంగంతో కలిసి వ్యాపారాలు చేసి లేదా అభివృద్ది సాధించి అటు పిమ్మట వచ్చే డబ్బుతో ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎక్కడా రాయలేదు.ఇవి కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అనేక హమీలు ఉన్నాయి. ఉదాహరణకు వాలంటీర్లను కొనసాగిస్తానని, వారికి గౌరవ వేతనం ఐదు వేల నుంచి 10వేలకు పెంచుతామని అప్పట్లో ప్రకటించారు. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఈ ష్యూరిటీలు.. భవిష్యత్ గ్యారంటీలు ఏమై పోయాయో కానీ ఇప్పుడు తాజాగా పీ-4 విజయవంతం అయితేనే సంక్షేమం మీద అధిక డబ్బులు ఖర్చు పెట్టగలుగుతామని సెలవిస్తున్నారు. సో.. మీడియా మేనేజ్మెంట్లో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు ఇదే ఏపీ గ్రోత్ అని.. దీనికి ఒక రోడ్ మ్యాప్ అని కథనాలు ఇప్పిస్తున్నారు.పరిశ్రమల అభివృద్ది, ఉపాధి, అమరావతి, పోలవరం, ఇంధన రంగం మొదలైన వాటి మీద ఫోకస్ చేస్తారట. అందులోనూ నైపుణ్య గణన వచ్చే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందట. అన్న క్యాంటీన్లు, మౌళిక వసతులు అభివృద్ది, పోలవరం ప్రభుత్వ ప్రధాన ఎజెండా అట. వాటిపై డాక్యుమెంట్ తయారు చేయడానికి సీనియర్ అధికారులతో చర్చ జరిపారట. ఈ ఫలితాలు సాధించడానికి చంద్రబాబు.. అధికారులకు సలహాలు ఇచ్చారట. ఈ మొత్తం వార్త చూస్తే ఏమనిపిస్తుంది. సూపర్ సిక్స్లోని అంశాలు ఏవీ ప్రధాన ఎజెండాలో లేవని కొంత ప్రత్యక్షంగా.. కొంత పరోక్షంగా చెప్పేస్తున్నట్టే కదా?. ఆ సూపర్ సిక్స్ రాష్ట్ర భవిష్యత్కు గ్యారంటీ అని కదా ఎన్నికలకు ముందు చెప్పింది. చంద్రబాబు ష్యూరిటీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారు.పరిశ్రమల అభివృద్ది, పోలవరం నిర్మాణాన్ని ఎవరు వద్దు అంటారు?. అది నిరంతర ప్రక్రియ. పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసేది ఏమి లేదు. ఈయన టైంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ముందుగా పునరుద్దరణ జరగాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయ అంచనాలను ఆమోదించాలి. ఆ తర్వాత డబ్బు కూడా కేంద్రమే ఇస్తుంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తాను చేపట్టి దానిని గందరగోళంలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదే. అయినా ఇప్పుడు ఆ నెపాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇరవై లక్షల ఉద్యోగాలు ఏలా ఇచ్చేది ఈ రోడ్ మ్యాప్లో చెప్పలేదు. తన స్పీచ్లలో కూడా చంద్రబాబు ఎక్కడా ఇది చెప్పడం లేదు. వైఎస్ జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలను మరోసారి ప్రారంభించి అది తన ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు.ఇక అమరావతి చూస్తే ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ ఫైనాన్స్గా తనే సమకూర్చుకుంటుందని ఇంత కాలం చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 15వేల కోట్ల రూపాయల అప్పును తీసుకువచ్చి అది ఏదో ఒక గొప్ప విషయంగా ఊదరగొడుతున్నారు. ఇక అక్కడే నాలుగేళ్లలో రూ. 60వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ‘అన్న క్యాంటీన్లు’ పెట్టడం పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చెప్పుకుంటున్నారు. సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచారు. ఇవి తప్ప మిగతా వాటిన్నింటికీ ఆయన పీ-4 విధానం కింద సంపాదించడం ద్వారానే అధిక ఖర్చు చేయగలుగుతామని జనానికి చెబుతున్నట్టుగా ఉంది. 2014-2019 మధ్య ఇలాంటి డాక్యుమెంట్లు తయారు చేయలేకపోలేదు. ప్రతీ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రోచర్ వేసి ప్రచారం చేసుకున్నట్టుగా ప్రభుత్వం అది చేస్తుంది.. ఇది చేస్తుంది అంటూ విమానాశ్రయాలు మొదలు అనేక హమీలు గుప్పించారు. కానీ, ఆచరణలో ఒక్కటి కూడా చేయలేకపోయారు.రుణ మాఫీ తదితర హామీలు సైతం అరకొరగా అమలు చేసి హుష్ కాకి అన్నారు. ఇప్పుడు ఏపాటి చేస్తారో కానీ.. పీ-4 విజన్ డాక్యుమెంట్, రోడ్ మ్యాప్ అంటూ జనాన్ని మాయ చేయడానికి వీలుగా మీడియాకు లీక్లు ఇస్తున్నారు. వీటికి తోడుగా ఇప్పుడు ఏపీలో జనాభాను పెంచుతారట. ఇప్పటికే జనాభా అధికమై దేశం అనేక సమస్యలు ఎదుర్కుంటుంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లలను అధికంగా కనమని చంద్రబాబు సలహా ఇస్తున్నారు. తన కుటుంబంలో అమలు చేయని విధానాన్ని ఇతరులు అంతా చేయాలని చెప్పడమే హైలెట్. పిల్లలను ఎంత మందిని కంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని ప్రచారం చేసిన ఈయన ఇంతవరకు ఆ స్కీమ్ అమలు గురించే మాట్లాడడం లేదు. ఈ ఏడాది దానిని అమలుచేయడం లేదని ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంటే చంద్రబాబును నమ్మి పిల్లలను కనేపనిలో ఉంటే ఏమవుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదా!.పంచాయతీ, మున్సిపాలిటీ పదవుల కోసం ఆశపడి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటారని చంద్రబాబు ప్రభుత్వం కనిపెట్టడం మరో విడ్డూరం. గతంలో ఇద్దరు పిల్లలను మించి పిల్లలను కంటే స్థానిక ఎన్నికల్లో అనర్హులు అవుతారని తెచ్చిన చట్టాన్ని ఈయన తీసేశారు. ఒక పక్క జనాభా పెంచాలని అంటారు. ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ అన్నారు. మరి వీటికి డబ్బులు ఎక్కడివీ అంటే పీ-4 అంటారు. ధనికులు పేదలను దత్తత తీసుకోవాలంట. ప్రభుత్వం, ప్రైవేట్ కలిసి వ్యాపారాలు చేయాలట. తద్వారా లాభాలు సంపాదించాలట. తదుపరి ఆ డబ్బును సంక్షేమంపై ఖర్చు చేయాలట. ఇది అంతా ఆయన విజన్ అంట. ఏం చేస్తాం అధికారంలో ఉన్న వాళ్లు ఏం చెప్పిన గొప్ప విషయంగా జనం తీసుకోవాలి. లేదంటే ఏలిన వారికి కోపం రావచ్చు. ఇదే క్రమంలో ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగు మీడియా చంద్రబాబుకు భజన చేసే పనిలో ఉంటే.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా కూడా తన పాత్రను పోషిస్తున్నట్టుగా ఉంది. ఏం చేసినా, చేయకపోయినా ఇలా బిల్డప్ ఇచ్చుకోవడంలో చంద్రబాబును మించిన మొనగాడు లేడేమో!.- కొమ్మినేని శ్రీనివాస రావు.సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘సూపర్సిక్స్ మరచిపోయారు’
సాక్షి,తిరుపతి: కూటమి నేతలు ప్రజాసమస్యలు గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి విమర్శించారు. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.ఇటీవల కూటమి నాయకుల కుట్రతో పార్టీ మారిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాష, కౌన్సిలర్లు తిరిగి సోమవారం(సెప్టెంబర్2) వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ ‘డీజీపీని హెలికాప్టర్లో మదనపల్లికి పంపించారు. వరద సహాయక చర్యలకు ఎందుకు హెలికాప్టర్ పంపించ లేదు అని ప్రశ్నిస్తున్నా. ఎవరైనా పార్టీ మారక పోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ను, కౌన్సిలర్లను బెదిరిస్తున్నారు. సూపర్ సిక్స్ అనే మాట ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు మరచిపోయారు. వారు కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. అభివృద్ధిపై దృష్టిపెట్టాలి’ అని మిథున్రెడ్డి సూచించారు. కొన్ని కారణాల వల్ల తాము రాజీనామా చేసి వెళ్ళామని, ఇప్పుడు తిరిగి వెనక్కి వచ్చామని మున్సిపల్ చైర్మన్ అలీంబాష తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబంతోనే తాము ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు. -
మనోడే.. విమానంలో తిప్పేద్దాం
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఖజానా ఖాళీ అంటున్న కూటమి ప్రభుత్వం.. తమ కార్యకర్తలకు జేబులు నింపడానికి అడ్డగోలుగా ప్రత్యేక జీవోలే ఇస్తోంది. ప్రజల సొమ్ముతో కార్యకర్తలు జల్సా చేసేలా ఒకే రోజు మూడు జీవోల్ని విడుదల చేసింది. మంత్రులతో పాటు వారి ఓఎస్డీలు, పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఒక జీవో జారీ చేశారు. మంత్రి ఓఎస్డీ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఏలు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు మంత్రితో పాటు ప్రయాణించడానికి అనుమతించారు. జీతభత్యాలతో సంబంధం లేకుండా మంత్రి కార్యాలయ సిబ్బంది ఎకానమీ క్లాస్లో ప్రయాణించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా మంత్రులు బయటి వ్యక్తులను ప్రైవేటు కార్యదర్శులుగా, వ్యక్తిగత సహాయకులుగా నియమించుకోవడానికి అనుమతించడమే కాకుండా, వారి వేతనాలను రెట్టింపు చేస్తూ మరో జీవో జారీ చేశారు. మంత్రి వ్యక్తిగత సహాయకుడి వేతనం రూ.18 వేల నుంచి రూ.36 వేలకు, ప్రైవేటు కార్యదర్శి వేతనం రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బంది ప్రతి మంత్రికి నలుగురు చొప్పున మొత్తం 24 మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతిస్తూ సురేష్ కుమార్ మరో జీవో ఇచ్చారు. ప్రతి మంత్రి ఒక ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)తో పాటు స్వర్ణాంధ్ర విజన్ నిర్వహణకు ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ను నియమించుకోవచ్చు. సోషల్ మీడియా నిర్వహణకు ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ను నియమించుకోవచ్చు. ఈ విధంగా కూటమి కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలను సృష్టించి, ప్రభుత్వ సొమ్మును దుబారా చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
Big Question: ఉచిత వైద్యం వేస్ట్.. మాంచి కిక్కిచ్చే మద్యం బెస్ట్.. బాబు మనసులో మాట
-
బాబు భవిష్యత్తు అంతా భయానకంగా..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన తమాషాగా ఉంది. పాలన ఎలా ఉండాలో చూపిస్తాం అని ఆయన అన్నారని ఈనాడు మీడియా ఒక హెడింగ్ పెట్టింది. ఈ డైలాగు చదివితే ఒక సినిమా సన్నివేశం గుర్తుకు వస్తుంది. తీస్తా..నాలో ప్రతిభ అంతటిని వెలికితీస్తా..అంటూ ఒక టివీ చానల్ ప్రోగ్రాం హెడ్గా నటించిన బ్రహ్మానందం చానెల్ యజమానికి చెబుతారు. మహద్బాగ్యం అని ఆ యజమాని సంతోషపడతారు..ఇది వినడానికి సరదాగా, హాస్యంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు అదే మాదిరిగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా పాలన చేస్తున్న వ్యక్తి ఏమీ కాదు.. ఇప్పటికే పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేశారు. మరోసారి ఆయనకు అవకాశం వచ్చింది. ఆకాశమే హద్దుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా అమలు చేసేది చెప్పకుండా పాలన ఎలా ఉండాలో చూపిస్తాం అని ఆయన అంటుంటే అది ఎలా ఉంటుందా? అని టీడీపీ నేతలే ఆశ్యర్చపోతున్నారు. ఇప్పటికే రెండు నెలల పాలన పూర్తి అయింది. దానిని జనం స్వయంగా చూశారు. హింసాకాండ, విధ్వంసకాండకు ఏపీ చిరునామాగా మారింది. ఇదేనా ఆ పాలన? ఎలా ఉండాలో చూపించడం అంటే అని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆయన రాష్ట్రంలో ఎక్కడకు పర్యటనకు వెళ్లినా, తాను ఏమి చేసేది చెప్పకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఉన్నవి,లేనివి కలిపి విమర్శలు గుప్పించడం, గత ఐదేళ్లు రాష్ట్రం ఏదో నాశనమైపోయిందని ప్రచారం చేయడానికే ఆయన టైమ్ అంతా సరిపోతోంది. చరిత్రలో ఎన్నడూ చూడని నష్టాలను గడచిన ఐదేళ్లలో రాష్ట్రం చూసిందపి ఆయన అంటున్నారు. అదెలాగో చెప్పరు. విధ్వంసం అంటే జగన్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడమా?. రాష్ట్రంలో నాలుగు కొత్త ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తేవడం, మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలకు శ్రీకారం చుట్టడం వంటివి రాష్ట్రానికి నష్టం కలిగించాయా?వీటి గురించి ప్రస్తావించి ఏ రకంగా జగన్ టైమ్ లో రాష్ట్రానికి నష్టం జరిగిందో వివరిస్తే అర్ధం ఉంటుంది. అలాకాకుండా లేనిపోని పిచ్చి ఆరోపణలు చేస్తే జనానికి ఏమి ఉపయోగం. ఒకవైపు చాలా హామీలు ఇచ్చాం కాని, ఖజానా ఖాళీగా ఉందని చంద్రబాబే చెబుతారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా?అని ఎవరైనా అడిగితే ఆయన కస్సుమనవచ్చు.రిషికొండలో ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తే తప్పు పడుతుంటారు. మరి అమరావతి పేరుతో అవసరం ఉన్నా,లేకపోయినా భారీ టవర్ల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో చెప్పరు. ఆయన చేస్తే అభివృద్ది..ఎదుటివారు చేస్తే విలాసం అన్నమాట. ఒకవేళ జగన్ ఇచ్చిన హామీల అమలు వల్ల రాష్ట్రం నష్టపోయిందని,ధ్వంసం అయిందని చంద్రబాబు చెప్పదలిచారా?అది కరెక్టు అయితే తాను ఏకంగా జగన్ కంటే మూడు రెట్ల అధికంగా హామీలు ఇచ్చారు కదా?అప్పుడు ఇంకెంత విధ్వంసం అవుతుంది?తాను ఇచ్చిన సూపర్ సిక్స్ ఏ రకంగా అమలు చేసేది చెబితే అప్పుడు చంద్రబాబును సెహబాష్ అని అనవచ్చు.అది చెప్పకుండా మిగిలిన కధలు ఎన్ని చెబితే జనం ఎందుకు నమ్ముతారు? పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహ ఆయన నెరవేర్చిన హామీలేమిటో చెప్పే పరిస్థితి లేదు. అప్పులపై ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అసత్యాలు ప్రచారం చేశారు?ఇప్పటికీ అవే అబద్దాలను ఎందుకు కొనసాగిస్తున్నారు?ఇదేనా పాలన అంటే ఏమిటో చూపించడం అంటే!ఉచిత ఇసుక అని ప్రకటించినా , ఏదో రూపంలో డబ్బులు వసూలు చేస్తుండడం కూటమి పాలనను రుచి చూపించడం. జగన్ ప్రభుత్వం నిల్వచేసిన ఇసుక సుమారు నలభై లక్షల టన్నుల మేర టీడీపీ, జనసేన క్యాడర్ దోచుకోవడం ద్వారా కూటమి పాలన ఎలా ఉందో చూపించారు కదా! .మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఇచ్చి చూపిస్తే , పాలన ఎలా ఉండాలో చూపించడం అవుతుంది.రైతులకు ఇవ్వవలసిన ఇరవైవేల రూపాయల భరోసా ఇచ్చి ఉంటే ఇది పాలన అంటే జనం ఒప్పుకోవచ్చు. తల్లికి వందనం పేరుతో విద్యార్ధులకు చెల్లించవలసిన పదిహేనువేల రూపాయలను ఈ ఏడాది ఎగవేయకుండా ఉంటే దానిని కదా పాలన ఎలా ఉండాలో చూపించడం అంటే! నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల సంగతి ఏమైంది?వలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఏమైంది!ఇలా అనేక వాగ్దానాలను తన అనుభవంతో అమలు చేసి చూపించినట్లయితే, పాలన ఇలా ఉండాలి కదా..అని జనం అనుకుంటారు.వీటన్నిటిని పక్కనబెడితే జగన్ పై ,సాక్షి మీడియాపైన దుష్ప్రచారం చేస్తే ప్రజలకు ఏమి ఒరుగుతుంది. సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రభుత్వ ప్రచార ప్రకటనలను ఆయన తప్పు పడుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా తన కార్యక్రమాలను ప్రచారం చేయడానికి మీడియాలో అడ్వర్టైజ్ మెంట్స్ ఇస్తుంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఈనాడు అధినేత రామోజీరావు సంస్మరణార్ధం పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిన వైనం గురించి ఏమి చెబుతారు?. 201419 మధ్య ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలకు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసింది?సాక్షి మీడియాకు ఎంత మొత్తం ఇచ్చింది పోల్చి చెప్పి ఉంటే చంద్రబాబు కొంతలో కొంత నిజాయితీగా మాట్లాడినట్లు అయ్యేది.ఆంధ్రజ్యోతి మీడియాకు అర్హత లేకపోయినా వందల కోట్లు చెల్లించినవైనంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చేవి. అయినా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సాక్షి మీడియాపై బురద చల్లుతున్నారు.చంద్రబాబు ఒక వైపు తాను సంపద సృష్టిస్తానని అంటారు. మరో వైపు ఆర్ధికంగా స్థితిమంతులైన ప్రతి ఒక్కరు పాతిక మందిని వృద్దిలోకి తెచ్చేందుకు సహకరిస్తే సమాజంలో పేదరికం అనేది లేకుండా పోతుందని చంద్రబాబు కొత్త ధీరీ చెబుతున్నారు.ఆయన కుటుంబం స్థితిమంతమైనదే కదా!ఎంతమందిని స్వయంగా పైకి తీసుకు వచ్చారో చెబితే జనానికి కాస్త అయినా నమ్మకం కుదిరేది కదా!రాయలసీమకు పరిశ్రమలు, నీటి ప్రాజెక్టుల గురించి ఎప్పటి మాదిరే ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ఆచరణ చేసి చూపించాలి తప్ప జగన్ పై దూషణలకు దిగితే ఉపయోగం ఏమి ఉంటుంది?గతంలో చంద్రబాబు లక్షకోట్ల రూపాయల రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి తీరా ఆచరణలో చేతులెత్తేశారు. ఇప్పుడు కూడా ఆ దిశలోనే చంద్రబాబు పాలన సాగుతోందని ఆయన మాటలను బట్టే అర్ధం అవుతుంది.పైగా సంక్షేమం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని సుభాషితాలు వల్లె వేస్తున్నారు. అది నిజమే అయితే సూపర్ సిక్స్ పేరుతో, ఎన్నికల ప్రణాళిక పేరుతో లెక్కకు మిక్కిలిగా వాగ్దానాలు ఎందుకు చేశారో చెప్పాలి కదా?అసలు సమస్య ఏమిటంటే.. చంద్రబాబుకు భవిష్యత్తు అంతా భయానకంగా కనిపిస్తోంది. తన పాలన తీరు ద్వారా ప్రజలలో ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఆయనకు అర్ధం అవుతోంది.అందుకే ఒక వైపు పాలన ఎలా ఉండాలో చూపిస్తాం..అంటూ మరో వైపు తనకు హామీలు అమలు చేసే శక్తి లేదని పరోక్షంగా అంగీకరిస్తూ భయమేస్తోందని చెబుతున్నారు. అదే ఆయన చూపించబోయే పాలన అని జనం అనుకుంటే తప్పు ఏమి ఉంటుంది! :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు సూపర్ సిక్స్ మీద నమ్మకం పోయింది.. టీడీపీపై NV ప్రసాద్ ఫైర్
-
అప్పుడు హామీ ఇచ్చాం.. ఇప్పుడు కుదరదు..
-
చంద్రబాబు సూపర్ సిక్స్ కు మంగళం..
-
15వేలు ఎక్కడ తాతయ్య..
-
సూపర్ సిక్స్ కు మంగళం పాడే దిశగా చంద్రబాబు
-
ప్రజలను ఏమార్చి చంద్రబాబు గెలిచారు: నారాయణ స్వామి
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు చేస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తోందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అమలు చేయలేనని చంద్రబాబు అనడం అవమానకరని అన్నారు. తిరుపతితో గురువారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు పప్పు, బెల్లంలా సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేస్తున్నారని ఏడ్చారు. పేదవారికి ఆశ చూపి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ను చూస్తే భయంగా ఉందని చంద్రబాబు అంటున్నాడు. దళితులు అన్ని రంగాల్లో రాణించాలని అంబేద్కర్ ఆశయం. చంద్రబాబు అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే విధంగా చూడాలి. విద్య, వైద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబుకి, రెడ్ బుక్ లోకేష్, పవన్ కళ్యాన్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ జగన్ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కమ్యూనిటీలను నమ్ముకుని ముందుకెళ్ళి అధికారం చేపట్టారు. ..మద్యం పాలసీలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. మద్యంలో కొత్త బ్రాండ్ లన్ని చంద్రబాబు తీసుకొచ్చిందే. తప్పు చేస్తే ఎటువంటి శిక్షకైనా రెడీ. ప్రస్తుతం టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీకి కనీసం ఒక గ్రామంలో కూడా సరిగ్గా తెలీదు. చంద్రబాబు ప్రజలను ఏమార్చి గెలిచారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి, కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ధీటుగా రెన్యువేషన్ చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య అందించడం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడం తప్పా. దళితులు చదువుకోవాలని, వారు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.పేదలపై పడి దాడులు చేయొద్దు, ఎమ్మెల్యేలుగా ఉన్న మాపై మీ ప్రతాపం చూపండి’’ అని అన్నారు. -
సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తుంది.. చంద్రబాబుపై కేఏ పాల్ అదిరిపోయే సెటైర్లు
-
అన్నన్నా.. చంద్రన్న మార్క్ ఛీటింగ్
ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన ఎన్నికల హామీలలో కీలకమైనవాటి జోలికి వెళ్లకుండా.. తేలికగా పూర్తి అయ్యే వాటిపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయ సంకల్పించారు. ఐదు రూపాయలకే భోజనం సమకూర్చడం దీని లక్ష్యం. ఆగస్టుపదిహేను నాటికి వంద చోట్ల ఈ క్యాంటిన్లు నెలకొల్పుతారు. ఆ తర్వాత మరో నెలలో ఇంకో 83 క్యాంటిన్లు ఏర్పాటవుతాయని టీడీపీ మీడియా కథనాన్ని ఇచ్చింది. అయితే..2014 టర్మ్లో కూడా కొన్ని క్యాంటిన్లు ఏర్పాటు చేసినా, వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఒనగూరలేదన్నది ఒక అభిప్రాయం. దీనికోసం పెట్టిన ఖర్చులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజంగానే ఈ క్యాంటిన్లు పేదలకు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది చర్చనీయాంశం. తమిళనాడులో కూడా అమ్మ క్యాంటిన్ల పేరుతో ఇలాంటి సదుపాయం కల్పించారు. తెలంగాణలో హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు చోట్ల ఇలాంటి క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో సహజంగానే వీటికి ప్రాధాన్యత తగ్గింది. ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77 మున్సిపాల్టీలు, 17 కార్పొరేషన్ లు, 29 నగర పంచాయతీలు ఉన్నాయి. అన్నీకలిపి 123 అర్బన్ స్థానిక సంస్థలు ఉన్నాయన్నమాట. ఈ రకంగా చూస్తే పట్టణానికి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు కావచ్చు. లేదంటే.. కొన్ని నగరాలలో అదనంగా మరో ఒకటో, రెండో నెలకొల్పుతారు. దీంతోనే పేదలందరికి ఆకలితీర్చేసినట్లే అన్నంతంగా ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. బహుశాఒక్కో క్యాంటిన్ లో వంద నుంచి రెండువందల మందికి భోజనం సరఫరా చేయవచ్చు. దీనికిగాను ప్రభుత్వానికి అయ్యే ఖర్చు బాగా తక్కువే. అయినా బాగా ప్రచారానికి ఉపయోగపడుతుందన్నది వ్యూహకర్తల భావనగా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మంగా సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన అంశాల జోలికి వెళ్లకుండా ఇలాంటి చిన్న,చిన్న హామీలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం కింద ప్రతి విద్యార్దికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇవ్వవలసి ఉంది. దానిని విద్యాశాఖ మంత్రి లోకేష్ వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దానికి ఆయన చూపిన కారణం స్కీమ్ గురించి చర్చించాలట. గత ప్రభుత్వ టైమ్ లో 72 వేల మంది విద్యార్ధులు తగ్గారని, టీచర్ల సంఘాలతో చర్చలు జరపాలని ఆయన అన్నారు. ఇది చాలా చిత్రమైన ప్రకటన. విద్యార్దులు తగ్గితే ,దాని గురించి తల్లికి వందనం స్కీము అమలును ఆపవలసిన అవసరం ఏమి ఉంటుందో తెలియదు. టీచర్ల సంఘాలు ఈ స్కీము అమలు చేయవద్దని ఏమీ చెప్పలేదు కదా!. పోనీ ఎన్నికల ప్రచార సమయంలో ఆ సంఘాలవారితో ఏమైనా ఆ హామీ గురించి చర్చించి ఖరారు చేశారా?చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు నిమ్మల రామానాయుడు వంటివారు పోటీపడి తల్లికి వందనం స్కీము గురించి ప్రచారం చేశారు కదా!ఇప్పుడేమో విధి విధానాలు ఖరారు కావాలని లోకేష్ అంటున్నారు. మొదట ప్రతి కుటుంబంలో ఒక్కరికే ఈ స్కీము పరిమితం చేయాలని ఆలోచించారు.కాని ప్రజలలో వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అసలు స్కీమునే ఏడాదిపాటు వాయిదా వేసుకున్నారు. దానికి కారణం.. ఈ పధకం అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. గతంలో జగన్ ప్రభుత్వం ఒక్క తల్లికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తేనే సుమారు ఆరేడువేల కోట్ల రూపాయల వ్యయం ఏడాదికి అయ్యేది. అలాంటిది ప్రతి విద్యార్దికి వర్తింపచేయాలంటే ఏడాదికి కనీసం పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం కావచ్చు. అందుకే ప్రభుత్వం వెనుకాడుతోంది. ఈ నేపధ్యంలోనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటేనే భయం వేస్తోందని అంటున్నారు. ఏపీలో ప్రతి మహిళకు రూ.1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇవ్వడం కూడా సూపర్ సిక్స్ లో భాగమే. ఆ రకంగా ఇవ్వడానికి ఏడాదికి ఇరవైవేల కోట్ల నుంచి పాతికవేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. నిరుద్యోగ భృతి, మూడు గ్యాస్ సిలిండర్లు మొదలైనవి కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది. వాటిని ఎలాగోలా దాటవేయడానికి టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ హామీని అమలు చేసేశామని ప్రచారం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈనాడు మీడియా ఇప్పటి నుంచే అన్నా క్యాంటిన్లపై ప్రచారం ఆరంభించింది. ప్రతి పట్టణంలోను ఎక్కడో ఒకటి,రెండు చోట్ల ఐదు రూపాయలకు భోజనం పెట్టి, మొత్తం పేదల ఆకలి తీర్చామని ప్రచారం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా టీడీపీ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ సూపర్ సిక్స్ ను పక్కనబెట్టి ,ఇలాంటి జిమ్మిక్కులకు జనం ఓకే చెబుతారా?అన్నది సందేహమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘సూపర్సిక్స్’ అమలు ఎప్పుడు?: లోక్సభలో ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి కోరారు. సోమవారం(జులై 29) లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు లేకుండా పెట్టుబడులు ఎలా..ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. నాపైన దాడి చేశారు. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్ని టీవీ చానల్స్ చూస్తుండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలి. హింసకు చరమ గీతం పాడాలి. అమరావతికి రుణం వద్దు.. గ్రాంట్గా కావాలి..పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. బడ్జెట్లో రూ. 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించవద్దు’అని మిథున్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
చంద్రబాబు-పవన్ ముందున్నది ఒకటే ఆప్షన్!
‘‘మనం హామీలు ఇచ్చాం.. సూపర్ సిక్స్ చెప్పాం.. చూస్తే భయమేస్తోంది. ముందుకు కదలలేకపోతున్నాం..ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి’’.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చేసిన ప్రకటన. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈయన అన్న మాటలు గమనించండి.'ఇంకా సంపద సృష్టిస్తా..ఆదాయాన్ని పెంచుతా..ఈ పెంచిన ఆదాయం పేదవాళ్లకోసం ఖర్చు పెడతా.."అని బహిరంగ పభలలో చెప్పారు. అంతేకాదు..తల్లికి వందనం కింద ఎందరు పిల్లలుంటే అందరికి పదిహేనువేల చొప్పున ఇస్తాం. ఒకరుంటే ఒకరికి ,ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా..ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తా..నలుగురు ఉంటే నలుగురికి ఇస్తా.."అని ఆయన చెప్పేవారు. మరి ఇప్పుడో.. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించింది ఎక్కడకు పోయిందో కాని, ప్రజలంతా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల గురించి ఆలోచించాలని చెబుతున్నారు. దీనిపైనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు ఎప్పుడైనా ఒక మోడెస్ ఆపరేండి అమలు చేస్తారని, తొలుత హామీలు ఇచ్చేస్తారని, ఆ తర్వాత తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వాటిని అమలు చేయడం కష్టమని ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ స్కీములపైన అయినా, ఎవరినైనా వ్యక్తిగతంగా హననం చేయాలన్నా ఇదే పద్దతి అవలంభిస్తారని జగన్ వ్యాఖ్యానించారు. చివరికి పిల్లనిచ్చిన మామ ఎన్.టి.రామారావును కూడా చంద్రబాబు వదలిపెట్టలేదని, ఆయనపై సైతం దుష్ప్రచారం చేశారని జగన్ పేర్కొన్నారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే విధానాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల అప్పు చేసిందని తెగ ప్రచారం చేశారు. అయినా తనకు సూపర్ సిక్స్ అమలు చేయగల సత్తా ఉందని అనేవారు. జనం కూడా కొంతవరకు ఆయనను నమ్మారు. సీనియర్ కనుక, ఏదో సంపద అని అంటున్నారు కనుక ,దానిని సృష్టించి హామీలు అమలు చేస్తారులే అని జనం అనుకున్నారు. కానీ చంద్రబాబు తన పాత ఎగవేత స్కీమ్ నే యధా ప్రకారం అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆలోచన చేశారు. మొత్తం సమస్యలన్నిటికి జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం ఆరంభించారు. ఏకంగా జగన్ ప్రభుత్వం వల్ల 12,96 లక్షల కోట్ల ఆర్దిక విధ్వంసం జరిగిందని కాకి లెక్కలు చెప్పారు. పోలవరం జాప్యం వల్ల రూ.45 వేల కోట్ల రూపాయల నష్టం. అమరావతివల్ల ఇంత నష్టం ..అంటూ ఏవేవో పిచ్చి లెక్కలు వేసి అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టేశారు. తనకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని ఉందని, కాని ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ,ప్రజలు అర్దం చేసుకోవాలని అంటున్నారు. ఇక అప్పుల మీద కూడా నోటికి వచ్చిన అంకెలను చెప్పి ప్రజలను నమ్మించాలని చూశారు. తొమ్మిది లక్షల డెబ్బైనాలుగువేల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలని ఆయన కోరారు. జగన్ 2.71 లక్షల కోట్ల డబ్బు బటన్ నొక్కి బదిలీ చేస్తే.. ఇంత అప్పు ఎందుకు అయిందని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించారు. మరి ఎన్నికలకు ముందు రూ. 13 లక్షల కోట్ల అప్పు అని ఎలా ప్రచారం చేశారని చంద్రబాబును ఎవరైనా ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది.నిజానికి రాష్ట్రాన్ని ఆర్ధికంగా విధ్వంసం చేయడానికి పూనుకుంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే.అందుకే బాద్యతారహితంగా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు. పైగా తమ అంత సమర్ధులు లేరని, సంపద సృష్టించి చూపుతామని కోతలు కోశారు.కాని ఇప్పుడు ఏమంటున్నారు. ప్రజలు ఆలోచించాలట. ఎమ్మెల్యేలు తమ ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వాలట. ఇందుకోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారట.గత ప్రభుత్వ హయాంలో క్షీణించిన శాంతిభద్రతలు , జరిగిన ఆర్ధిక అవకతవకలపై రాష్ట్రంలోని ప్రతి పల్లెలో చర్చ చేపడతారట. ఇంతకన్నా పచ్చి మోసం ఇంకొకటి ఉంటుందా?ఎన్నికల మానిఫెస్టోలో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల విలువైన హామీలు ప్రకటించినప్పుడు ఎవరిని అడిగి చేశారు?సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని ఎలా చెప్పగలిగారు? అది దారుణమైన అసత్యమని తెలిసి కూడా అలాంటి వాగ్దానం చేయడం జనాన్ని మోసం చేయడం కిందకు వస్తుందా? రాదా?. చంద్రబాబు తన ఆత్మసాక్షిని అడిగి జవాబివ్వగలరా? చంద్రబాబు ఆత్మతో నిమిత్తం లేకుండా అబద్దాలను చెప్పగలరన్న వైఎస్సార్సీపీ నేతల విమర్శలకు సమాధానం ఇవ్వగలరా!. ఏడు శ్వేతపత్రాలపై రాష్ట్రం అంతా చర్చిస్తారట. ఇదే కొత్తగా చెబుతున్న పాత డ్రామా అన్నమాట. 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ గెలిస్తేనే మద్య నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం స్కీమ్, విద్యుత్ చార్జీల తగ్గింపు మొదలైనవి యధావిధిగా కొనసాగుతాయని ప్రచారం చేశారు. తీరా టిడిపికి సగం సీట్లు వచ్చాక, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు నిర్వహించి వాటన్నిటికి మంగళం పాడారు. ఇప్పుడు కూడా సరిగ్గా సూపర్ సిక్స్ ఎగవేతకు రంగం సిద్దం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా హామీల అమలు సాద్యాసాద్యాల మీద రాష్ట్రం అంతా చర్చ పెడతామని చెప్పలేదే!. కాని ఇప్పుడు హామీలను అమలు చేయలేకపోతున్నామని, దీనిపై ప్రజలంతా చర్చించి సలహాలు ఇవ్వాలని అంటున్నారు ఇంతకన్నా చీటింగ్ వేరే ఏమైనా ఉంటుందా?అని జగన్ ప్రశ్నించడంలో అర్దం ఉంది.ఎన్నికలకు ముందు జగన్ చాలా స్పష్టంగా చంద్రబాబు జనాన్ని మోసం చేయడానికి సూపర్ సిక్స్ అంటున్నారని నెత్తి,నోరు మొత్తుకుని చెప్పారు. చంద్రబాబు మాటను నమ్మరని ఆయన అనుకున్నారు. కాని ప్రజలు మాత్రం చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకున్నారు.అదే ట్రాప్ ను ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ మోసంలో భాగస్వామిగా ఉండడానికి ఏ మాత్రం సిగ్గుపడడం లేదు. జగన్ ఈ అంశాలను ప్రస్తావిస్తూ మొత్తం అప్పు 7.48లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు 2019 లో దిగిపోయేనాటికి ఖజానాలో వంద కోట్లే మిగిల్చివెళితే, తాను 2024లో దిగిపోయేటప్పటికీ ఏడువేల కోట్ల నుంచి ఎనిమిదివేల కోట్ల రూపాయల నిధులు ఖజానాలో ఉన్నాయని, దీనిని బట్టి ఎవరు ఆర్దిక విధ్వంసానికి పాల్పడింది అర్ధం చేసుకోవచ్చని జగన్ వ్యాఖ్యానించారు. 2014 లో కూడా చంద్రబాబు రైతుల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని నమ్మబలికారు. కాని చేయలేక చతికిలపడ్డారు. తిరిగి 2024లో కూడా అదే తరహా హామీలు ఇచ్చి మళ్లీ జనాన్ని మాయ చేయగలిగారు. చేసిన వాగ్దానాలకు బడ్జెట్ కేటాయించవలసి వస్తుందని, అది సాధ్యం కాదు కనుకే చంద్రబాబు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేకపోతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. సాధారణంగా ఎన్నికలు అయిన వెంటనే పూర్థిస్థాయి బడ్జెట్ పెడతారు. కాని చంద్రబాబు ఆ పని చేయలేకపోవడం బలహీనతగానే కనిపిస్తోంది. చంద్రబాబేమో తాను వాగ్దానాలను అమలు చేయడం కష్టం అన్న సంకేతలు ఇస్తూ, జగన్ పై మొత్తం కధను నెట్టేయడానికి బేషజం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అదే జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నడూ డబ్బులు లేవని, కష్టాలు పడుతున్నానని, ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరలేదు. తనతంటాలేవో తాను పడి ఆర్ధిక వనరులు సమకూర్చుకుని స్కీములు అమలు చేశారు. ఏపీని టీడీపీ నేతలు అరాచకానికి చిరునామాగా మార్చారని జగన్ విమర్శిస్తే.. లోకేష్ దానికి బదులు ఇస్తూ ఇంకా రెడ్ బుక్ తెరవలేదని అంటున్నారు. అంటే ఆ బుక్ ఓపెన్ చేయకముందే ఇంత ఆరాచకం చేస్తే, బుక్ తెరచి ఇంకెందరిపై ఘాతుకాలకు పాల్పడతారో అనే సందేహం సహజంగానే అందరిలో వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ముందున్నది ఒకటే ఆప్షన్.జనాన్ని ఎలా మోసం చేయాలన్నదే..జనాన్ని ఎలా అబద్దాలతో నమ్మించాలన్నదే. ప్రజలను ఎలా డైవర్ట్ చేయలన్నదే. అందుకే తన తప్పులన్నింటిని జగన్ పై తోసివేసి కథ నడపాలని రాష్ట్ర వ్యాప్త చర్చల డ్రామాకు తెరదీస్తున్నారు. జనం అంతా ఎగబడి తమకు ఈ స్కీములు వద్దని చెప్పాలన్నమాట. ఎవరైనా స్కీములు ఎందుకు అమలు చేయరని? అడిగితే వారిని రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేయాలన్నమాట!. ఈ రకమైన కొత్త వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ను అబద్దాల ప్రదేశ్ గా మార్చడమే టీడీపీ ఎజెండా. దానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లు నాయకత్వం వహిస్తున్నారన్నమాట.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు యూటర్న్ వ్యాఖ్యలపై పవన్ మౌనమా?
తాడేపల్లి,సాక్షి: తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని.. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడుతున్నారు . సోమవారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యథావిథిగా యూటర్న్ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన ‘సూపర్సిక్స్’పై చంద్రబాబు యథావిథిగా యూటర్న్ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే, భయం వేస్తోందంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్నా.. కూటమి పథకాల గురించి, నాడు గొప్పగా చెప్పిన జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్.. కనీసం నోరు మెదపలేదని ఆయన ఆక్షేపించారు.టీడీపీ కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని, ఎన్నికల ముందు తాము పేర్కొన్నా.. తనకు సంపద సృష్టించడం తెలుసంటూ.. చంద్రబాబు గొప్పలు చెప్పి, ఇప్పుడు కాడి ఎత్తేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టించడం అంటే, అప్పులు చేయడమేనా అని నిలదీశారు.ప్రచార ఆర్భాటంచంద్రబాబు ప్రతి విషయంలో ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవ అమలు ఏదీ లేదని మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు అన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామంటూ, ప్రచారం చేశారని, కానీ.. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కంటే, ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని తెలిపారు.తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని, రైతులు ఖరీఫ్ సాగు ప్రారంభించినా, వారికి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం చేయలేదని, పిల్లలకు ఫీజులు చెల్లించలేదని, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఇంకా ఇవ్వలేదని.. .. ఇలా అన్ని వర్గాలను టీడీపీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు.మాట తప్పడం ఆయన నైజంచంద్రబాబు తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇచ్చిన మాటకు కట్టుబడలేదని మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు తేల్చి చెప్పారు. మాట తప్పడం చంద్రబాబు నైజం అని ఆయన గుర్తు చేశారు. అందుకు ఈ 50 రోజుల పాలన, మరో ఉదాహరణ అని పేర్కొన్నారు.కేంద్రం నుంచి సున్నాఇప్పుడు టీడీపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నా, ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు ప్రస్తావించారు. రాజధాని పనుల కోసం రూ.15 వేల కోట్లు, రుణంగా సమకూరుస్తామని చెబితే, ఆ ని«ధులు సాధించినట్లు గొప్పగా ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. మరే విషయంలోనూ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా, స్పందించడం లేదని ఆక్షేపించారు.రెడ్బుక్ రాజ్యాంగంరాష్ట్రంలో గత 50 రోజులుగా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న సుధాకర్బాబు, ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే, విపక్షంపై దాడులు మొదలయ్యాయని తెలిపారు. ఆరోజు నుంచి ఇప్పటి వరకు హత్యలు, హత్యా యత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం.. యథేచ్ఛగా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే చెప్పారు.దానర్థం మార్చారుమరోవైపు శ్వేతపత్రాల పేరుతో పచ్చి అబద్ధాలు చెప్పడం, అన్నింటికీ గత ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ నిందించడం, జగన్గారిని వ్యక్తిగత హననం చేయడమే సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని అన్నారు. నిజానికి శ్వేతపత్రం అంటే.. అన్ని వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, వాటికి సంబంధించి, భవిష్యత్తులో తామేం చేస్తామన్నది చెప్పడం అని గుర్తు చేసిన సుధాకర్బాబు.. ఇప్పుడు సీఎం చంద్రబాబు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని ఆక్షేపించారు.ఇకనైనా వైఖరి మార్చుకొండిచంద్రగిరిలో తమ పార్టీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డిని భయ భ్రాంతులకు గురిచేసి, ఇబ్బంది పెట్టారని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. అసలు ఆయన ఏ నేరం చేశారని, ఎయిర్పోర్టులో అదుపులోని తీసుకుని, నానా హంగామా చేసి, ఆ తరవాత నోటీసు ఇచ్చి వదిలారని నిలదీ«శారు.ప్రభుత్వ పెద్దలు ఇకనైనా వైఖరి మార్చుకోవాలని, కక్ష సాధింపు చర్యలు విడనాడాలని.. దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసాన్ని ఆపాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీజేఆర్ సుధాకర్బాబు హితవు చెప్పారు. తమను ఎంత వేధించినా, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతామని, ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు.రాష్ట్ చరిత్రలో వైఎస్సార్, జగన్ పేరు వింటే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు వింటే ప్రజలకు వెన్నుపోటు, విధ్ంసం, మోసాలు గుర్తొస్తాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే వైసీపి ప్రశ్నిస్తూనే ఉంటుంది’’ అని సుధాకర్బాబు అన్నారు. -
జగనే ఉండి ఉంటే.. నెల రోజుల్లోనే మారిపోయిన టాక్
-
KSR Live Show: చంద్రబాబు భయం.. ఇక ఏపీని దేవుడే కాపాడాలి
-
సూపర్ సిక్స్ కొట్టబోయి చంద్రబాబు డకౌట్
-
Gun Shot: ప్రజల ప్రతి రూపాయి కేంద్రానికి తాకట్టు.. నీ మాయ అమోఘం బాబు
-
సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు
-
లోకేష్ రోడ్ మ్యాప్.. సూపర్ సిక్స్ గోవిందా గోవిందా
-
టీడీపీ సూపర్ సిక్స్ పై అరకు ఎమ్మెల్యే సెటైర్లు
-
చంద్రబాబు సూపర్ సిక్స్.. బాచుపల్లి శివ ప్రసాద్ కౌంటర్