team
-
ఓటమితో హైదరాబాద్ ముగింపు
నాగ్పూర్: భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగినా... హైదరాబాద్ జట్టుకు నిరాశ తప్పలేదు. రంజీ ట్రోఫీ 2024–2025 దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ముగించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో ఆదివారం ముగిసిన గ్రూప్ ‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్లో చామా మిలింద్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. విదర్భ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఓవర్నైట్ స్కోరు 23/1తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన హైదరాబాద్ జట్టు 38.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటై పరాజయాన్ని చవిచూసింది. రాహుల్ రాదేశ్ (77 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలువగా... చివర్లో మిలింద్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), సిరాజ్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కాసేపు అలరించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ హర్‡్ష దూబే 57 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి విదర్భ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. బ్యాటర్లు క్రీజులో నిలబడితే ఛేదించే లక్ష్యమైనా... చివరిరోజు హైదరాబాద్ బ్యాటర్లు తడబడి మూల్యం చెల్లించుకున్నారు. ఓవరాల్గా గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఎనిమిది జట్లున్న ఈ గ్రూప్లో హైదరాబాద్ 2 మ్యాచ్ల్లో గెలిచి, 2 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. గ్రూప్ ‘బి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన విదర్భ, గుజరాత్ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 190; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 326; విదర్భ రెండో ఇన్నింగ్స్: 355; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి అండ్ బి) యశ్ ఠాకూర్ 6; అభిరత్ రెడ్డి (సి) దానిశ్ (బి) హర్ష్ దూబే 21; తనయ్ త్యాగరాజన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య థాకరే 18; రాహుల్ రాదేశ్ (సి) అథర్వ తైడే (బి) పార్థ్ రేఖడే 48; హిమతేజ (సి) అథర్వ తైడే (బి) హర్ష్ దూబే 0; వరుణ్ గౌడ్ (సి) యశ్ రాథోడ్ (బి) హర్ష్ దూబే 5; రాహుల్ బుద్ది (సి) అక్షయ్ వాడ్కర్ (బి) పార్థ్ రేఖడే 9; చామా మిలింద్ (సి) దానిశ్ (బి) హర్‡్ష దూబే 20; రక్షణ్ రెడ్డి (బి) హర్ష్ దూబే 0; సిరాజ్ (సి) అథర్వ తైడే (బి) హర్‡్ష దూబే 26; అనికేత్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 3; మొత్తం (38.5 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1–11, 2–36, 3–61, 4–67, 5–94, 6–107, 7–116, 8–123, 9–140, 10–161. బౌలింగ్: యశ్ ఠాకూర్ 5–1–26–1, ఆదిత్య థాకరే 7–0–27–1, హర్ దూబే 11.5–1–57–6, అక్షయ్ వఖారే 7–3–16–0, పార్థ్ రేఖాడే 8–0–33–2. -
కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న 'రాచరికం' సినిమా టీం సభ్యులు...
-
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
-
హీరోయిన్ బర్త్డే పార్టీలో బాలయ్య సందడి (ఫోటోలు)
-
నీ ఆటే బంగారం... శ్రీవల్లీ
‘క్రికెట్ ప్లేయర్ కావాలనుకుంటున్నాను’ అనే మాట అబ్బాయిల నోట వినిపిస్తే అభినందనలు తెలుపుతారు. ఆశీర్వదిస్తారు. అదే మాట అమ్మాయిల నోటి నుంచి వినిపిస్తే..? అవాక్కవుతారు. ‘అమ్మాయిలకు క్రికెట్ ఎందుకు?’ అని కూడా అంటారు. లక్ష్యం మీద గురి పెట్టిన వారు మాత్రం అలాంటి మాటలను లక్ష్యపెట్టరు. అలాంటి ఒక అమ్మాయి శ్రీవల్లి. ఎన్నో సవాళ్లను అధిగమించి తన కలను నెరవేర్చుకున్న శ్రీవల్లి క్రికెట్లో రాణిస్తోంది. డిసెంబరు 4 నుంచి అహ్మదాబాద్లో జరగనున్న మ్యాచ్లో బీసీసీఐ సీనియర్ మహిళల జట్టులో హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.శ్రీవల్లికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం టీవీలో వీక్షణకే పరిమితం కాలేదు. చిన్న వయసులోనే బాల్, బ్యాట్తో గ్రౌండ్లో అడుగు పెట్టేలా చేసింది. శ్రీవల్లి అయిదవ తరగతి చదువుతున్న రోజుల్లో... స్కూల్ ప్లే గ్రౌండ్కు వెళ్లింది. హైస్కూల్ అబ్బాయిలు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ‘అన్నా... నేను కూడా ఆడతాను’ అని అడిగింది చిన్నారి శ్రీవల్లి. వాళ్లు బిగ్గరగా నవ్వారు.ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ‘అయిదో క్లాసు అమ్మాయి హైస్కూల్ అబ్బాయిలతో ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. ‘ఆడపిల్లలు క్రికెట్ ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. వారి వెటకారపు నవ్వులతో వెనక్కి వెళ్లిపోలేదు శ్రీవల్లి. పీఈటీ రహీం సార్కు చెప్పింది. ‘నీ ఉత్సాహం సరే, వారితో ఆడగలవా?’ అని అడిగారు సార్. ‘ఆడతాను’ అని ఉత్సాహంతో తల ఊపింది.నిజానికి అది ఉత్సాహం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన తొలి సంకేతం. విజయపథం వైపు వేసిన తొలి అడుగు. శ్రీవల్లి చేసిన బౌలింగ్లో సీనియర్లు షాట్లు బాగానే కొట్టారు. కానీ, తన స్పీడ్కు కొందరు బెంబేలెత్తడం పీఈటీ సార్ గమనించారు. లైన్ లెంగ్త్ సరిదిద్దితే శ్రీవల్లిని బాగా తీర్చిదిద్దవచ్చు అని గుర్తించారు. అక్కడ నుంచి తానే కోచ్గా మారారు. శ్రీవల్లి బౌలింగ్లోని లోపాలను సరిచేస్తూ క్రమంగా స్పీడ్బౌలర్గా తీర్చిదిద్దారు. ‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది’ అని శ్రీవల్లి తల్లిదండ్రులకు చె΄్పారు.‘క్రికెట్ అంటే ఏదో సరదాగా ఆడుతోంది కానీ అమ్మాయిని డాక్టర్గా చూడాలనేది మా కల’ అని వారు అని ఉంటే శ్రీవల్లి కల ఆవిరైపోయేది. అయితే సార్ మాట విని శ్రీవల్లి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కుమార్తెకు మరింత సాధన అవసరమనుకున్న తండ్రి లక్షా్మరెడ్డి శ్రీవల్లిని హైదరాబాద్ పంపాడు.‘పై చదువుల కోసమో, ఎంసెట్ కోచింగ్ కోసమో పిల్లల్ని హైదరాబాద్కు పంపిస్తారుగానీ క్రికెట్ కోచింగ్ కోసం పంపిస్తున్నావా!’ అని బోలెడు ఆశ్చర్యపడిన వాళ్లు... ‘క్రికెట్లో ఎవరికో ఒకరికి అదృష్టం దక్కుతుంది. ఆడినవాళ్లందరూ స్టార్లు కాలేరు’ అని నిరాశపరిచిన వాళ్లూ్ల ఉండొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి మాటలు వచ్చినా ఆ తల్లిదండ్రులకు బాగా నచ్చిన మాట...‘మీ అమ్మాయికి క్రికెట్లో మంచి భవిష్యత్ ఉంది’హైదరాబాద్లో కనిష్కనాయుడు శిక్షణలో క్రికెట్లో తన నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది శ్రీవల్లి. ఫాస్ట్బౌలర్గానే కాకుండా, బ్యాటింగ్తోనూ ఆకట్టుకోగల ఆల్రౌండ్ నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది.బాల్యంలోనే పెద్ద కలలు కన్న శ్రీవల్లి టీనేజ్లో ఆ కలలను తన సాధనతో మరింత సాకారం చేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్గా రాణించాలనేది శ్రీవల్లి లక్ష్యం. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం. – అనిల్ కుమార్ భాషబోయిన సాక్షి ప్రతినిధి, కరీంనగర్ఆ స్ఫూర్తితోనే...అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి రకరకాల పరిమితులు ఉండొచ్చు. అయితే ఆడాలనే ఉత్సాహంతోపాటు సంకల్పబలం ఉంటే ఆ పరిమితులు మనకు అడ్డుకావు. ఎంతోమంది స్టార్ క్రికెట్ ప్లేయర్ల అపూర్వ విజయాలతో స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తితోనే క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టాను. ఫాస్ట్ బౌలర్గా రాణించాలనేది నా కల. – కట్టా శ్రీవల్లి రెడ్డి -
షాకిస్తున్న ట్రంప్ ఎంపికలు!
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడి ఎలా ఉండబోతున్నదన్న చర్చలు ఒకపక్క సాగుతుండగా ఆయన తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. ఆ పేర్లు కొందర్ని ఆశ్చర్యపరుస్తుంటే, మరికొందర్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతున్నాయి. తొలి బోణీ స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ కాగా, ఆయనతోపాటు వరసగా వివేక్ రామస్వామి, తులసీ గబార్డ్, మార్కో రుబియో, మాట్ గెట్జ్ వంటివారు కీలక పదవుల్లో కుదురుకోబోతున్నారని తేలింది. వీళ్లంతా వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు... అన్నిటికన్నా మించి ‘వెలుపలివారు’ అయినందువల్ల తన ప్రభుత్వం సమర్థవంతమైన కార్పొరేట్ దిగ్గజంగా వెలిగిపోతుందని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడు తోంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్ శౌరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఉండేది. దాని పని నష్టజాతక పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం. ఆ క్రమంలో సవ్యంగా నడుస్తున్న సంస్థలు సైతం ప్రైవేటుకు దక్కాయన్న విమర్శలుండేవి. ఇప్పుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో ట్రంప్ అటువంటి పనే చేయించబోతున్నారు. మస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం(డీఓజీఈ) ఏర్పడుతుంది. దానికి వివేక్ ‘వెలుపలి సలహాదారు’గాఉంటారు. వచ్చే ఏడాది జూలైకల్లా ప్రభుత్వ వ్యయంలో 2 లక్షల కోట్ల డాలర్లు కోత పెట్టడమే ధ్యేయంగా వీరిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వోద్యోగుల సంఖ్య అపరిమితంగా ఉన్న దనీ, ఇందులో భారీగా కోతపెట్టడంతోపాటు ఉద్యోగాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే ఉండటం అవసరమనీ తొలి ఏలుబడిలోనే ట్రంప్ తరచు చెప్పేవారు. అయితే సహచరుల హెచ్చరికతోముందడుగేయ లేకపోయారు. అందుకే కావొచ్చు... గతానుభవం లేనివారినే ఎంచుకున్నారు. అయితే ట్రంప్–మస్క్ల సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానమే. ప్రభుత్వోద్యోగుల పని తీరుపై ట్రంప్, మస్క్లకు ఏకాభిప్రాయం ఉంది. అయితే కార్పొరేట్ సంస్థలు అన్యాయంగా సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ట్రంప్ అభిప్రాయానికి మస్క్ వ్యతిరేకం. కార్మిక హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ప్రచారపర్వంలో చేసిన ప్రసంగాల వల్ల పలు కార్మిక సంఘాలు ట్రంప్కు అనుకూలంగా మారాయి. ఆయన విజయానికి దోహదపడిన అనేక అంశాల్లో ఇదొకటి. మస్క్ విష యానికొస్తే ఆయన ట్విట్టర్ (ఎక్స్)లోనూ, అంతకుముందు టెస్లాలోనూ భారీ యెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దానిపై జాతీయ కార్మిక సంబంధాల బోర్డులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక చైనాపై మస్క్కున్న ప్రేమ ఎవరికీ తెలియంది కాదు. 2020లో షాంఘైలో టెస్లా విద్యుత్ కార్ల కర్మాగారం మొదలయ్యాక ఒక్క చైనాలోనే మస్క్ ఆరు లక్షల కార్లు విక్రయించారు.పర్యావరణ పరిరక్షణ పేరిట పెట్రోల్, డీజిల్ కార్లకు బదులు విద్యుత్ కార్లు తీసుకురావటం పెద్ద కుట్రని ట్రంప్ అభిప్రాయం. దానికితోడు ఆయనకు చైనాపై ఉన్న వ్యతిరేకత మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. విదేశాంగమంత్రిగా ఎంపిక చేసుకున్న మార్కో రుబియో చైనాకు తీవ్ర వ్యతిరేకి, ఇజ్రాయెల్ అనుకూలుడు.ట్రంప్ హయాంలో వేధింపులు దండిగా ఉంటాయని అటార్నీ జనరల్గా మాట్ గెట్జ్ ఎంపిక వెల్లడిస్తోంది. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ మొదలుకొని ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ, 2021 నాటి మూకదాడి కేసు విచారణలో ప్రముఖపాత్ర పోషించిన లిజ్ షెనీ వరకూ చాలామందిపై ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అందుకే మైనర్లతో లైంగిక కార్యకలా పాలు, మాదకద్రవ్యాల వినియోగంవంటి ఆరోపణలున్నా ఉద్దేశపూర్వకంగా గెట్జ్ను ట్రంప్ ఎంపిక చేశారు. ట్రంప్పై నేరారోపణలు ముసురుకొని కేసులు వచ్చిపడిన తరుణంలో ఆయన వెనకదృఢంగా నిలబడటం గెట్జ్కున్న ఏకైక అర్హత. రిపబ్లికన్లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఎంపిక సెనేట్లో గట్టెక్కుతుందా అన్న సందేహాలున్నాయి. అమెరికా త్రివిధ దళాధిపతుల కమిటీ చైర్మన్తో సహా సైనిక జనరళ్లను తొలగించాలని కోరే ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ఎంపిక చేయడం కూడా అత్యధికులకు మింగుడుపడటం లేదు. వైవిధ్యత పేరిట సైన్యంలో మైనారిటీ వర్గాలకూ, స్త్రీలకూ ప్రాధాన్యత పెరగటాన్ని చాలాకాలంగా హెగ్సెత్ ప్రశ్నిస్తు న్నారు. గతంలో సైన్యంలో పని చేసిన హెగ్సెత్వల్ల ప్రభుత్వంతో సైన్యానికి ఘర్షణ తప్పదని అనేకుల అంచనా. ఇక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసిన తులసి గబార్డ్ వెనిజులా, సిరియా, ఉక్రెయిన్, రష్యా వ్యవహారాల్లో అమెరికా విధానాలు తప్పని అంటారు. ఆమెకు ఏకంగా 18 నిఘా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పటాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ట్రంప్ ఏలుబడిలో వలసదారులను శ్వేతజాతి దురహంకారం బెడదతో సహా అనేకం చుట్టు ముడతాయి. దానికితోడు వీసా సమస్యలు, ఉద్యోగాల కోత తప్పవు. ఇక ‘అమెరికా ఫస్ట్’ అమలైతే వాణిజ్యయుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు గనుక చైనాతో సహా అనేక దేశాలు ఆత్మరక్షణ విధానాలకు సిద్ధపడుతున్నాయి. డాలర్ దూకుడు అంచనాతో అమెరికా మార్కెట్లు వెలిగిపోతుంటే విదేశీ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ట్రంప్ టీంలో మార్కో రుబియో, హెగ్సెత్, ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వాన్స్తోసహా అందరూ ఉక్రెయిన్ యుద్ధం ఆపటమే తమ తొలి లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు గనుక ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గత్యంతరం లేదు. నాటో దేశాలు ట్రంప్తోగతంలో ఉన్న అనుభవం వల్ల ఇప్పటికే దిక్కుతోచక ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ రాకతో ఇంటా బయటా యధాతథ స్థితి తలకిందులు కాబోతోంది. -
అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు..
-
బిత్తిరి సత్తి నాన్ స్టాప్ కామెడీ.. పడి పడి నవ్వుకున్నా అల్లు శిరీష్, అలీ
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు (ఫోటోలు)
-
టెకీలకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్న్యూస్
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. టెక్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1,500 మంది నుంచి రెండేళ్లలో రెట్టింపునకు (3,000 మంది) పెంచుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు.రెగ్యులర్ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు (లేటరల్ హైరింగ్) మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా ప్రకటించారు. టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు వెల్లడి కావడంతో ఇటీవల బీవోబీపై ఆర్బీఐ ఆంక్షలు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. తర్వాత వీటిని ఎత్తివేసింది.1,500 మంది ప్రస్తుత టెక్నాలజీ బృందంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నట్టు చాంద్ చెప్పారు. జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెక్నాలజీపై బ్యాంక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ మౌలిక సదుపాయాల కోసమే రూ.2,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.రానున్న కాలంలోనూ దీనిపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 600 కొత్త శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. 12–14 శాతం మేర రుణాల్లో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సమయంలో డిపాజిట్లలో 10–12 శాతం వృద్ధిని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.15 శాతంగా ఉంటుందన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో ఆశిష్ (ఫొటోలు)
-
Saina Nehwal: రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
-
Geethanjali Malli Vachindi : శ్రీవారిని దర్శించుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీమ్ (ఫోటోలు)
-
శ్రీనిధి డెక్కన్ జట్టును గెలిపించిన ఒలివేరా
కొడుమన్ (కేరళ): ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో 12వ విజయం చేరింది. గోకులం కేరళ ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 44వ నిమిషంలో నికోలా స్టొజనోవిచ్ గోల్తో గోకులం కేరళ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే శ్రీనిధి తరఫున విలియమ్ అల్వెస్ డి ఒలివేరా (47వ ని.లో, 71వ ని.లో) రెండు గోల్స్ సాధించి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
Hanu Man: అమిత్ షాను కలిసిన హనుమాన్ టీమ్ (ఫోటోలు)
-
'గామి'తో సక్సెస్ కొట్టిన విశ్వక్ సేన్.. మూవీటీమ్తో తిరుమలలో సందడి (ఫోటోలు)
-
జీజేఆర్ క్రికెట్ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు న్యాయవాదుల క్రికెట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన జీజేఆర్ టోర్నమెంట్ పోటీల్లో హైకోర్టు న్యాయవాదుల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శనివారం కప్ను అందజేశారు. బోడుప్పల్లోని సాగర్ క్రికెట్ గ్రౌండ్, ఆరంఘర్లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీల్లో నగరంలోని 13 కోర్టుల న్యాయవాదులు పాల్గొన్నారు. సెమీ ఫైనల్లో సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల జట్టు (78)పై హైకోర్టు టీమ్(79) విజయం సాధించింది. అనంతరం జరిగిన ఫైనల్లో హైకోర్టు జట్టు... హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు టీమ్పై గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ది ఫైనల్లో బెస్ట్ బ్యాట్స్మన్గా వి.మనోహర్, బెస్ట్ బౌలర్గా సాయిచందర్ నిలిచారు. ఈ కప్ అందజేత కార్య క్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్గౌడ్, కౌన్సిల్ సభ్యుడు జితేందర్రెడ్డి, కటకం శారద, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
Manmadhudu: 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన మన్మథుడు జంట ఫోటోలు వైరల్
-
‘సాగర్’ను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం
నాగార్జునసాగర్: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులు స్థానిక ఇంజనీర్లతో కలసి గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ డ్యామ్పై బీటీరోడ్డు వేయడంతో పాటు సీజనల్గా చేయాల్సిన నిర్వహణ పనులైన డ్యామ్ రేడియల్ క్రస్ట్గేట్లకు రబ్బరు సీళ్లు, గ్యాలరీలలో సీపేజ్ నీరు రాకుండా మరమ్మతులు, గేట్లు ఎత్తి, దింపే స్టార్టర్లలో ప్యానల్ బోర్డులు, మోటార్ల మరమ్మతుల వంటి పనులు చేయాల్సి ఉంది. ఈ నెల 16వ తేదీన తెలంగాణ ఇంజనీర్లు నిర్వహణ పనులను ప్రారంభించారు. అయితే, ఈ పనులు చేయవద్దని ఏపీ వైపున ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. తెలంగాణ అధికారులు అలాగే పనులు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. దీంతో స్పందించిన కేఆర్ఎంబీ అధికారులు గురువారం సాగర్డ్యామ్ మీదకు వచ్చి పరిశీలించారు. డ్యామ్ మెయింటెనెన్స్ పనులు చేసుకోవచ్చని చెప్పారు. శుక్రవారం కేఆర్ఎంబీ అధికారులు సాగర్డ్యామ్తో పాటు కుడి, ఎడమ కాల్వల హెడ్రెగ్యులేటర్లను సందర్శించనున్నట్లు సమాచారం. సాగర్డ్యామ్పై పర్యటించిన వారిలో కేఆర్ఎంబీ ఎస్ఈ వరలక్ష్మి, సాగర్డ్యామ్ ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ మల్లికార్జున్రావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కృష్ణయ్య, సీఆరీ్పఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ పాల్గొన్నారు. -
‘కమాండో కాంపిటీషన్స్’లో సత్తా చాటిన ఏపీ
విశాఖ స్పోర్ట్స్: 14వ ఆల్ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ (ఏఐపీసీసీ)లో ఏపీ జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించింది. 300 పాయింట్లకు గాను 267.20 పాయింట్లతో ఏపీ పోలీస్ కమాండో జట్టు విజయకేతనం ఎగురువేసింది. ఈ పోటీల్లో 8 ట్రోఫీలకు గానూ నాలుగింట చాంపియన్గా నిలిచింది. విశాఖలోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయ మైదానంలో మంగళవారంతో ముగిసిన ఈ పోటీల్లో విజేతలకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏడీజీపీ మ హేష్ దీక్షిత్ ట్రోఫీలను అందజేశారు. 9 రోజుల పా టు 23 ప్రత్యేక దళ కమాండో (16 స్టేట్, 7 పారా మిలిటరీ ఫోర్స్) జట్లు.. 5 దశల్లో జరిగిన పోటీల్లో సత్తాచాటాయి. ఆర్పీఎఫ్కు చెందిన కమాండో బి జేంద్ర 9.05 (12 నిమిషాలకు) నిమిషాల్లోనే పూర్తి చేసి ఛీతా రన్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కమాండో కాంపిటీషన్స్ విజేతగా ఏపీ నిలిచి స్వర్ణాలను అందుకుంది. రన్నరప్గా మహారాష్ట్ర నిలిచి రజతాన్ని, సెకండ్ రన్నరప్గా రాజస్థాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాన్ఫిడెన్స్ కోర్స్ బెస్ట్ జట్టుగా 10 నిమిషాల 10 సెకన్ల వ్యవధితో ఏపీ జట్టు నిలిచింది. బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో జట్టుగా 300కు గానూ 267.20 మార్కులతో ఏపీ జట్టు కైవసం చేసుకుంది. స్మాల్ టీమ్ ఆపరేషన్స్కు ఇచ్చే రణ్నీతి ట్రోఫీని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కైవసం చేసుకోగా.. చక్రవ్యూహ్ (గ్రామీణ) ట్రోఫీని ఏపీ జట్టు, చక్రవ్యూహ్ (పట్టణ) ట్రోఫీని మహారాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది. బ్లాక్ హాక్ ఫైరింగ్ ట్రోఫీని 93 మార్కులతో(110కిగానూ) ఏపీజట్టు అందుకుంది. ఏపీ జట్టులోని 13 మంది (11+2) సభ్యులకు ఒక్కోక్కరికి రూ.5 లక్షల ప్రోత్సాహాంతో పాటు 3 అదనపు ఇంక్రిమెంట్లను సర్వీస్ బోర్డ్ ప్రకటించింది. -
ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు
ఉత్తరాఖండ్లోని ఛార్ధామ్లో సొరంగం కుప్పకూలిన ఘటనలో 40 మంది కార్మికులు నాలుగు రోజులుగా అందులో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే కొండచరియలు విరిగిపడటంతోపాటు పలు సాంకేతిక సమస్యలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. తాజాగా థాయ్ల్యాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ బృందాలను అధికారులు ఇక్కడకు రప్పించాలని నిర్ణయించారు. 2018లో థాయ్లాండ్లోని ఒక గుహలో చిక్కుకున్న పిల్లలను రక్షించడంలో థాయ్లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణులు విజయం సాధించారు. ఇప్పుడు వీరు ఉత్తరకాశీలోని చార్ధామ్ రహదారిపై ఉన్న ఈ గుహలో చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు సహాయం అందించనున్నారు. ఈ సొరంగంలో చిక్కుకున్న 40 మందిని వెలికితెచ్చేందుకు స్థానిక అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించకపోవడంతో థాయ్లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణుల సాయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉత్తర థాయ్లాండ్లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్ గుహలో చిక్కుకున్న జూనియర్ అసోసియేషన్ ఫుట్బాల్ జట్టును రక్షించడంలో థాయ్కి చెందిన ఒక రెస్క్యూ కంపెనీ విజయం సాధించింది. నాడు ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసేందుకు వారం రోజులు పట్టింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు! -
రెండు హృదయాల కల
‘రూహి’ చిత్రం తర్వాత రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ‘నో డ్రీమ్ ఈజ్ ఎవర్ చేజ్డ్ ఎలోన్!’ అనేది క్యాప్షన్. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్కు శరణ్శర్మ దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ‘‘ఒకే కల కోసం రెండు హృదయాలు ఎదురు చుస్తున్నాయి’’ అంటూ ఈ మూవీని ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్లుగా జాన్వీ కపూర్ అండ్ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న భగవంత్ కేసరి చిత్రబృందం (ఫొటోలు)
-
రూరల్ రోడ్ల పనుల నాణ్యత భేష్
సాక్షి, అమరావతి: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సహాయంతో చేపట్టిన ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఆ బ్యాంకు ప్రతినిధి బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బ్యాంకు సహాయంతో చేపట్టిన ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం 5 రోజులపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించింది. జిల్లా స్థాయి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశమై పనుల ప్రగతిని, నాణ్యతను పరిశీలించింది. తదనంతరం మంగళవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డితో ఈ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించి పనులపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తమ బ్యాంకు ఆర్థిక సహాయంతో జరుగుతున్న గ్రామీణ రహదారి పనుల్లో నాణ్యతతో కూడిన ఒక ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. రూ.5,026 కోట్లతో పనులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించడంతోపాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణ సహాయంతో ఏపీ రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా.. ఏఐఐబీ రూ.3,418 కోట్లను రుణంగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,608 కోట్లను సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3,665 పనులు చేపట్టి 7,213 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటికే కాంపొనెంట్–1ఏ కింద 6,215 కిలోమీటర్ల పొడవున 3,231 పనులు చేపట్టగా.. ఇప్పటికే 2,450 కి.మీ. పొడవు గల 1,201 పనులు పూర్తయ్యాయి. మరో 3,765 కి.మీ. పొడవు గల 2,030 పనులు ప్రగతిలో ఉన్నాయి. కాంపొనెంట్–1బీ కింద 364 కి.మీ. పొడవు గల 142 పనులు చేపట్టగా.. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కమిషనర్ సురేశ్కుమార్, పంచాయతీరాజ్ ఈఎన్సీ బాలూనాయక్, ఏఐఐబీ ప్రతినిధి బృందం లీడర్ ఫర్హద్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్కుమార్, పర్యావరణ, సోషల్ ఎక్స్పర్ట్ శివ, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ ప్రదీప్, ట్రాన్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ తౌషిక్ పాల్గొన్నారు. -
రైవాడ జలాశయాన్ని సందర్శించిన సాంకేతిక బృందం
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): ఢిల్లీ నుంచి వచ్చిన సాంకేతిక బృందం శుక్రవారం రైవాడ జలాశయాన్ని సందర్శించింది. గౌరవ్ భగత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ప్రత్యేక బోటులో ప్రయాణించి సర్వే నిర్వహించింది. బోటులో అమర్చిన ల్యాప్టాప్తో పాటు కెమెరాల ఆధారంగా సర్వేను చేపట్టారు. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్)లో రైవాడ జలాశయం పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రూ.252 కోట్లతో గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపారు. 1990లో వచ్చిన భారీ వరద దృష్ట్యా ఎటువంటి తుపాన్లు సంభవించినా ఎదుర్కొనేలా కొత్త స్పిల్వే గేట్లు అమర్చాలని డ్రిప్ పథకంలో ప్రతిపాదించారు. జలాశయం స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు సాంకేతిక అధికారుల బృందం ఇక్కడికి వచి్చంది. అధునాతన సాంకేతికత ఆధారంగా జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం, ఎంతమేర పూడిక ఉంది, జలాశయం విస్తీర్ణం, జలాశయం గర్భంలో ఎక్కడైనా నిర్మాణాలు జరిగాయా తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు.15 రోజులపాటు ఈ సర్వే జరుగుతుందని, అనంతరం సర్వే రిపోర్టును ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్కు అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. వీరికి జలాశయం డీఈ సత్యంనాయుడు, జేఈలు నంద కిశోర్, రవిప్రకాష్ తదితరులు జలాశయ స్థితిగతులను వివరించారు. -
ఉద్యోగులకు షాక్: గూగుల్లో మళ్లీ తొలగింపుల పర్వం
Google layoffs: దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గణనీయమైన తొలగింపులను ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్లో సిబ్బంది కోతలను అమలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దాదాపు వందలమందిని ఉద్యోగులను తొలగించనుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, క్లిష్టమైన స్థానాలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టడానికి ఆల్ఫాబెట్ జట్టులోని మెజారిటీని నిలుపుకోవాలని భావిస్తోంది. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను) జనవరిలో, ఆల్ఫాబెట్, సుమారు 12,000 ఉద్యోగాలను తొలగించింది. తద్వారా మొత్తం సిబ్బందిలో 6శాతం తగ్గించుకుంది.తాజాగా నియామకాల్లో కొనసాగుతున్న మంద గమనంలో భాగంగా మరికొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. విస్తృత స్థాయి తొలగింపులు కానప్పటికీ కొన్ని కీలక ఉద్యోగాల ఎంపిక కోసం కొన్ని వందల మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను తగ్గించుకుంటున్న బిగ్ టెక్ సంస్థగా ఆల్ఫాబెట్ నిలిచింది. మెటా, మైక్రోసాఫ్ట్ , అమెజాన్తో సహా ఇతర టెక్ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. (రూ.2000 నోటు: అమెజాన్ షాకింగ్ అప్డేట్, తెలుసుకోండి!) ఉపాధి సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ నివేదికలు జూలైతో పోలిస్తే ఆగస్టులో యునైటెడ్ స్టేట్స్లో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరిగాయి. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని సూచిస్తున్నాయి. రాయిటర్స్ ఆర్థికవేత్తల సర్వేలో సెప్టెంబరు 9తో ముగిసే వారానికి రాష్ట్ర నిరుద్యోగ ప్రయోజనాల కొత్త క్లెయిమ్స్ సుమారుగా 8 శాతం పెరుగుదలను అంచనా వేశారు. -
సీతమ్మకొండపై హర్ శిఖర్ తిరంగా
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన సీతమ్మ కొండపై ‘హర్ శిఖర్ తిరంగా’కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కొండపై ఆర్మీ బృందం జాతీయ జెండాను విజయవంతంగా ఆవిష్కరించింది. దీంతో సీతమ్మకొండకు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన ఆర్మీ బృందం సోమవారం మధ్యాహ్నం హుకుంపేట మండలంలోని మారుమూల ఓలుబెడ్డ గ్రామానికి చేరుకుంది. సర్పంచ్ పాంగి బేస్ ఆధ్వర్యంలో గిరిజనులంతా వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో ఆర్మీ బృందం కూడా సందడి చేసింది. మధ్యాహ్నం 1.30గంటలకు సీతమ్మ కొండపైకి బయలుదేరిన ఆర్మీ బృందం... గంటన్నరలో కొండపైకి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా కల్నల్ రణవీర్సింగ్ జమ్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరంగా గుర్తించిన సీతమ్మ కొండపై జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. తమ యాత్ర, జాతీయ జెండా ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, స్థానిక గిరిజనులు ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన హర్ శిఖర్ తిరంగా యాత్రను ప్రారంభించామన్నారు. సీతమ్మ కొండతో కలిపి ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాల్లో జాతీయ జెండాను విజయవంతంగా ఎగురవేశామన్నారు. మరో 6 రాష్ట్రాల్లో హర్ శిఖర్ తిరంగాను అక్టోబర్ 15వ తేదీకి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్ అధిరోహకుడు ఆనంద్కుమార్, టూరిజం అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రతినిధి కుంతూరు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఫైనల్స్కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్షిప్స్లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
బేబీ టీమ్కు స్పెషల్ పార్టీ ఇచ్చిన అల్లు అరవింద్ (ఫోటోలు)
-
బిగ్ ట్విస్ట్.. మరోసారి శరద్ పవార్ను కలిసిన అజిత్ పవార్..
ముంబయి: మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్తో అజిత్ పవార్ కలిసిన విషయం తెలిసిందే. అయితే అజిత్ పవార్ వరుసగా రెండోరోజు శరద్ పవార్తో భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అజిత్ మాట్లాడుతూ.. కేవలం అశీస్సులు తీసుకోవడానికే శరద్ పవార్ను కలిశానని అజిత్ పవార్ చెప్పారు. #WATCH | NCP president Sharad Pawar arrives at Mumbai's YB Chavan Centre where Maharashtra Deputy CM Ajit Pawar and NCP MLAs of his faction are present to meet him. pic.twitter.com/hrx8S2mVTR — ANI (@ANI) July 17, 2023 ఏక్నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపిన అజిత్ పవార్ మంత్రి పదవులు స్వీకరించిన అభ్యర్థులతో కలిసి నిన్ననే శరద్ పవార్ను కలిశారు. కాగా.. నిన్న ఆదివారం అయినందున కొంత మంది రాలేకపోయారని నేడు సమావేశం అనంతరం మాట్లాడారు. శరద్ పవార్ తమ అభ్యర్థనలను మౌనంగా విన్నారని, ఏమీ మాట్లాడలేదని అజిత్ పవార్ చెప్పారు. నేడు మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశం జరిగింది. అయితే.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే ఉంటామని తీర్మాణం చేయాల్సి ఉంది. ఆ తీర్మాణాన్ని స్పీకర్కు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ మరోసారి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఢిల్లీలో ఎన్డీయే నిర్వహించనున్న సమావేశానికి అజిత్ పవార్ రేపు వెళ్లనున్నారు. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ సహా పలువురు నేతలు ఆదివారం ముంబైలో శరద్ పవార్ను కలిశారు. అయితే, శరద్ పవార్ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ పాటిల్ తదితరులు ఉన్నారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని కోరినట్టు పేర్కొన్నారు. ఇదీ చదవండి: NCP Leadership Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పవార్ రియాక్షన్? -
ఐఎఫ్ఎల్కి ధోనీనే కెప్టెన్: ఆనంద్ మహీంద్ర హిల్లేరియస్ ట్వీట్ వైరల్
పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన కొత్త పోస్ట్తో సంచలనం సృష్టించారు. అంతేకాదు స్టార్ క్రికెటర్ ఎంఎస్ధోనీపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు బిలియనీర్ ఆనంద్ మహీంద్రా. హిల్లేరియస్ ట్వీట్తో ట్విటర్లో పలు రకాల కామెంట్లతో నవ్వులు పూస్తున్నాయి. ఐపీఎల్, ప్రో కబడ్డీ తరహాలో ఇండియన్ ఫుడ్ లీగ్ ఉంటే..తాను మాత్రం ఆలూ పరాటా జట్టులో ఆడాలనుకుంటున్నా.. హా.. అన్నట్టు ఖచ్చితంగా ఈ టీంకి ధోనీ కెప్టెన్గా ఉండాలి. ఆ ఫుడ్ టీమ్లోనే తానూ చేరతాను అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కమెంట్లు వెల్లువెత్తాయి. వర్టిగో వారియర్ అనే ట్విటర్ హ్యాండిల్ 18 రకాల మోస్ట్ పాపులర్ వెజిటేరియన్ డిషెస్ ఆఫ్ ఇండియాఅనే పేరుతో కొన్ని చిత్రాలను షేర్ చేసింది. ఇది చూసి టెంప్ట్ అయిన ఆనంద్మహీంద్ర ఇలా సరదాగా కమెంట్ చేయడం వైరల్గా మారింది. ఇందులో ఇడ్లీ, ఆలూ పరాఠా, మసాలా దోశ, దాల్ టక్డా, పనీర్ టిక్కా, కిచిడీ, రాజమా చావల్, సమోసా పోహా, చనా మశాలా, పావు బాజీ , ఉప్మా, వడా పావ్, ఛోలే బటూరే, కఛోరీ లాంటి వంటకాలను పోస్ట్ చేసింది. దీనిపై ఆనంద్ మహీంద్ర పేర్కొన్న సరికొత్త ఇండియన్ ఫుడ్ లీగ్ పై తమదైన శైలిలో ట్వీపుల్ స్పందించారు. If there was an Indian Food League, like the @IPL or @ProKabaddi then I would want to be playing on the Aloo Paratha team….(Of course I would still want to join whichever food team @msdhoni was captain of…😃) https://t.co/GTveHVSqYx — anand mahindra (@anandmahindra) July 1, 2023 -
ఇవాళ తెలంగాణకు ఈసీ బృందం
-
బ్రూక్ దురదృష్టం ఆస్ట్రేలియా అదృష్టం
-
ఇదెక్కడి వర్క్ ఫ్రొం హోమ్ రా మామ...
-
గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఎవరు ఆస్థి ఎన్ని లక్షల కొట్లో తెలుసా..!
-
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
WTC ఫైనల్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుకంటే..!
-
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
ధూమ్ ధామ్ రసూల్ మాటలు వింటే మస్తు నవ్వుకుంటారు
-
ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
పాతికేళ్లకు క్రికెట్ ఏంట్రీ.. ఇంజనీర్ T20 బౌలర్
-
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
Spy Teaser Press Meet : ‘స్పై’టీజర్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
ధోనీని కలిసిన ఎలిఫెంట్ విస్పర్స్ చిత్రబృందం
-
ఒక ఎపిసోడేని మాత్రమే ఫ్రీగా ఎందుకు చూపిస్తున్నాం అంటే..
-
అఖిల్ బాబు కామెడీ అయ్య బాబోయ్..
-
యాంకర్ ప్రశ్నకి ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్
-
ఆర్ఆర్ఆర్ టీమ్ తో అమిత్ షా భేటీ రద్దు
-
ట్రిపుల్ ఆర్ టీమ్ తో అమిత్ షా భేటీ
-
లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ కొడుతున్నాం
-
రిపోర్టర్స్ ముక్కు సూటి ప్రశ్నలకు అఖిల్ స్మార్ట్ ఆన్సర్స్
-
శ్రీ వారి సేవలో శాకుంతలం మూవీ టీమ్
-
ఆగస్ట్ 16 1947 మూవీ టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
దసరా మూవీ టీమ్ కి తెలంగాణ దావత్
-
బలగం చిత్ర బృందాన్ని సన్మానించిన మంచు ఫ్యామిలీ (ఫొటోలు)
-
‘బలగం’ మొగిలయ్యను పరీక్షించిన ఎంజీఎం వైద్యబృందం
కాశిబుగ్గ: వరంగల్ సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న ‘బలగం’సినిమాలో నటించి, పాటతో మెప్పించిన మొగిలయ్యను ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని వైద్యబృందం శనివారం పరామర్శించింది. మొగిలయ్య దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ఇటీవల ‘ఆపదలో ఉన్నాం.. తోడుగా నిలవండి’ శీర్షికన ప్రచురితమైన మానవీయ కథనానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పందించారు. మొగిలయ్యకు ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని వైద్యబృందం, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ నాయక్లు సంరక్ష ఆస్పత్రికి చేరుకొని మొగిలయ్యను పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యసేవల గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మొగిలయ్య గత సెప్టెంబర్ నుంచి రెండు కిడ్నీలు పూర్తిగా పాడై ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చికిత్స పొందుతున్నాడని, ఇటీవల బీపీ, షుగర్ పెరిగి కంటి సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. ఇక్కడ వైద్యసేవలు బాగానే ఉన్నాయని, రోజూ దుగ్గొండి నుంచి రావాలంటే బస్సులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. వచ్చివెళ్లేందుకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి మొగిలయ్యకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, మరేమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, వారి రక్షణకు తెలంగాణ ప్రభుత్వం, తాము సిద్ధంగా ఉన్నామని మొగిలయ్య దంపతులకు సూపరింటెండెంట్ సూచించారు. సూపరింటెండెంట్ వెంట సంరక్ష వైద్యులు డాక్టర్లు మల్లేష్, దినేష్, సంరక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ నటరాజ్, డాక్టర్ భాస్కర్ ఉన్నారు. -
సీఎం జగన్ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం భేటీ
-
ఆస్కార్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ టీమ్ కి సీఎం జగన్ అభినందనలు
-
ఆస్కార్ వేడుకల్లో.. స్టార్ల సందడి (ఫొటోలు)
-
రాళ్లు రువ్వి దాడికి యత్నం..పోలీసులనే పరుగులు తీయించారు
ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందంటూ వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో వాటిని తొలగించేందకు పోలీసులు, జిల్లా అధికారులు వచ్చారు. ఐతే వారు ఆక్రమణలు తొలగించి పనిపూర్తి చేసుకుని వెళ్లిపోతుండగా.. ఒక గుంపు దాడికి తెగబడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలోని జితార్ ఖేడి గ్రామంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని తొలగించేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సంజయ్ సాహు నేతృత్వంలోని పోలీసులు బృందం గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించి వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా ఒక గుంపు వచ్చి పోలీసులుపై రాళ్లు రువ్వి.. దాడికి తెగబడ్డారు. ఆ గుంపులో మహిళలు, పిల్లలు తోసహా అధికారులపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో బుల్డోజర్లు, కార్లు ధ్వసం అయ్యాయి. ఈ దాడి నుంచి మేజిస్ట్రేట్ సాహును రక్షించేందుకు మరో పోలీసుల వాహనంలో తరలించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సమీపంలోని జితార్ ఖేడీ గ్రామంలోని అర బిఘా (6,000 చదరపు అడుగులు) ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు సాహు పేర్కొన్నారు. ఇంతకుమునుపు గతంలో ఈ భూమిలో అన్ని వర్గాల వారు కార్యక్రమాలు నిర్వహించేవారని, ఐతే ఆక్రమణలకు గురికావడంతో అన్నీ ఆగిపోయాయని గ్రామస్తులు చెబుతున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు సాహు నేతృత్వంలోని పోలీసుల బృందం ఆక్రమణలు తొలగించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆక్రమణలు తొలగించి పని పూర్తి చేసి వెళ్తుండగా దాడికి పాల్పడ్డారని పోలీసుల చెబుతున్నారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది తోసహా బుల్డోజర్ డ్రైవర్ కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చట్టాన్ని ఉల్లంఘి ఈ ఘటనకు పాల్పడిన వారందరికీ శిక్ష పడుతుందని అదనపు మెజిస్ట్రేట్ సంతోష్ ఠాగూర్ తెలిపారు. (చదవండి: ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం) -
అమరావతిలో చంద్రబాబు బృందం అక్రమాలు బట్టబయలు
-
కెప్టెన్సీ వద్దంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్స్ ..!
-
విజయవాడ, వైజాగ్లో సీతారామం టీమ్ సందడి (ఫొటోలు)
-
‘ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు’
లబ్బీపేట(విజయవాడతూర్పు): రైటర్ పద్మభూషణ్ చిత్రయూనిట్ ఆదివారం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మూవీ బృందం పాటను రిలీజ్ చేశారు. అనంతరం హీరో సుహాస్ మాట్లాడుతూ రైటర్ పద్మభూషణ్ అందరినీ అలరిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, షూటింగ్ మొత్తం విజయవాడలో తీశామని తెలిపారు. ఛాయ్ బిస్కట్స్ ప్రొడక్షన్స్ ద్వారా తాను చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యానన్నారు. చదవండి: ఎన్టీఆర్ 30: సెట్స్పైకి వచ్చేది అప్పుడే! ఇది ఒక డ్రామా చిత్రమని, సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుని బయటకు వెళ్తారన్నారు. మూవీ చూశాక వారం రోజులు మర్చిపోలేరని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రైటర్ పద్మభూషణ్ సినిమా నాకు చాలా స్పెషల్ అని, తాను పుట్టి పెరిగిన విజయవాడలో షూటింగ్ జరిగిందన్నారు. తాను చదువుకున్న కాలేజీ, భవానీ ఐలాండ్, గాంధీ హిల్స్ ప్రతిచోటా షూటింగ్ చేశామన్నారు. హీరోయిన్ టీనాకల్పరాజ్ మాట్లాడుతూ తమ జీవితంలో జరిగిన విషయాలు లాగానే ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయన్నారు. తనను దర్శకుడు బాగా ఎంకరేజ్ చేశారన్నారు. నిర్మాత శరత్ మాట్లాడుతూ ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. చిత్ర నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. -
విజయవాడలో సందడి చేసిన విరాటపర్వం మూవీ టీం
-
చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!
Scientists Discover Ants Can Identify Cancerous Cells: ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస్త్రవేత్తల బృందం నిరతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స, త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. తాజా అధ్యయనాల్లో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కునుగొన్నాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగో తెలుసా!. వివరాల్లోకెళ్తే..చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలవని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ పరిశోధనలుల చేయడానికి సిల్కీ చీమలు అని పిలిచే ఫార్మికా ఫుస్కా అనే చీమలను వినియోగించింది. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా శిక్షణ ఇచ్చింది. నిజానికి అవి తమ వాసన సాయంతోనే ఆహారాన్ని సంపాదించుకునే చీమలు మానవునిలోని క్యాన్సర్ కణాల నంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్ని నయం చేసే పద్ధతులను అన్వేషించే క్రమంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది మాత్రమే కాక తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చీమలకు తొలుత చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునే స్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని మానవుడిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉందని చ్పెపారు. అయితే ఈ మొదటి అధ్యయనం చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని తేలిందని అన్నారు. అంతేగాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై పరిశోధనలు చేస్తున్నారు. అయితే వాటికి మంచి ఘ్రాణ శక్తి కలిగి ఉందని తెలిపారు. పైగా కుక్కుల కంటే చాలా త్వరతిగతిన క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలు తీసుకోంటాయని అన్నారు. (చదవండి: చెర్నోబిల్లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్) -
టెస్లా ఆటో పైలెట్ టీమ్కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!
Elon Musk Said 1st Indian-Origin Employee On Teslas Autopilot Team: ప్రముఖ దిగ్గజ టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భారత సంతతి వ్యక్తి అయిన అశోక్ ఎల్లుస్వామిని తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీకి సంబంధించిన ఆటోపైలట్ టీమ్లో నియమించుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు. అంతేకాదు ఆటో పైలెట్ టీమ్ను ప్రారంబిస్తున్నానని, పైగా టీమ్లో నియమించబడిని తొలి భారతసంతతి వ్యక్తి అశోక్ అని కూడా తెలిపారు. (చదవండి: ఫుడ్ కంటైనర్లో స్పై కెమెరా!) ఈ మేరకు అశోక్ ఆటోపైలట్ ఇంజనీరింగ్ హెడ్గా పనిచేయనున్నట్లు మస్క్ చెప్పారు. పైగా టెస్లా ఆటోపైలెట్ బృందంలో చాలా ప్రతిభావంతులు ఉంటారని వాళ్లు ప్రపంచంలోనే తెలివైన వ్యక్తుల్లో కొందరని అన్నారు. అంతేకాదు అశోక్ని ఇంటర్వ్యూ చేసిన వీడియోని కూడా మస్క్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవలే టెస్లా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలను నేరుగా పరిష్కరించడంలో శ్రద్ధ వహించే హార్డ్కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజనీర్ల కోసం వెతుకుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అశోక్ ఎల్లుస్వామి వోక్స్వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్కి సంబంధించిన డబ్ల్యూబీఏసీఓ వెహికల్ కంట్రోల్ సిస్టమ్లో పనిచేశారు. ఆయన చెన్నైలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని , కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుండి రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని చేశారు. (చదవండి: ఫుల్గా తాగి సెక్యూరిటీ గార్డ్తో గొడవపడిన మహిళ) Elon on Teslas Autopilot team: Ashok is actually the head of Autopilot engineering. Andrej is director of AI; People often give me too much credit & give Andrej too much credit. The Tesla Autopilot AI team is extremely talented. Some of the smartest people in the world. @elonmusk pic.twitter.com/a6vJ64aphG — Sawyer Merritt (@SawyerMerritt) December 29, 2021 -
టైసన్ను 'ఢీ' కొట్టేందుకు రెడీ అంటున్న విజయ్.. లైగర్ టీమ్
-
Sreemoyee Piu Kundu: సింగిల్ ఉమెన్గా ఉండటానికి ఎన్నో కారణాలు.. అయితే
‘హాయ్ శైలి... ఇన్నాళ్ల తరువాత నిన్ను చూసే భాగ్యం కలిగింది. ఎలా ఉన్నావు?’ ‘నన్ను గుర్తు పట్టావా?’ ‘నాకు అక్కలాంటిదానివి నువ్వు. ఎందుకు గుర్తుపట్టను!’ ‘కొత్త ఇల్లు కొన్నందుకు శుభాకాంక్షలు భార్గవి. ఫొటోల్లో కంటే సన్నగా కనిపిస్తున్నావు. ఇలాగే బాగున్నావు’ ... ఇవి ఏ ఫంక్షన్ హాల్లోనో వినిపించిన మాటలు కాదు. ఈ హాల్లో వివాహ వేడుకలాంటిదేమీ జరగడం లేదు. అందరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు. అయితే ఎప్పుడూ ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఈ సమావేశానికి వచ్చిన వాళ్లు సింగిల్ ఉమెన్. వారు సింగిల్ ఉమెన్గా ఉండడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే వారందరిని ఒకటి చేసింది, ఒక కుటుంబంలా నిలిపింది స్టేటస్ సింగిల్. కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న సింగిల్ ఉమెన్స్ ఆన్లైన్ వేదికగా ఒక బృందంగా ఏర్పడ్డారు. కష్టాలు, సుఖాలు, సంతోషాలు, సలహాలు...ఒకరితో ఒకరు పంచుకునేవారు. తమ గ్రూప్ను మరింత బలోపేతం చేయడానికి ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కు నడిచొచ్చారు. అందరూ దిల్లీలో సమావేశం అయ్యారు. ‘ఒకరినొకరం ప్రత్యక్షంగా కలుసుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. కులం, మతం, ప్రాంతాలకు అతీతం గా మేమందరం ఒకే కుటుంబం అనే భావన కలిగింది’ అంటుంది రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమోయి కుందు. అలా వచ్చిందే ఈ పుస్తకం.. ‘స్టేటస్ సింగిల్’ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించింది. ‘రియల్ అకేషన్’ ‘హ్యాపియర్ టైమ్’ ‘యువర్ బిగ్డే’... తన ప్రతి పుట్టిన రోజు వేడుకల్లో తరచు వినిపించే మాటలు ఇవి. ఈసారి తన పుట్టిన రోజును ఒక వేడుకలా జరుపుకోకుండా, గుర్తుండి పోయే పని ఒకటి చేయాలనుకుంది. అలా వచ్చిందే ఆమె రాసిన ‘స్టేటస్ సింగిల్’ అనే పుస్తకం. దీని కోసం 30–40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్బన్ ఉమెన్స్ మూడువందల మందిని ఇంటర్వ్యూ చేసింది. వారి అనుభవాలను రికార్డ్ చేసింది. ఈ పుస్తకం సింగిల్ ఉమెన్ కష్టాలు, కన్నీళ్లనే కాదు... వారి పోరాట పటిమనూ కళ్లకు కట్టింది. సింగిల్ ఉమెన్పై రకరకాల అపోహలు ఉన్నాయి. వారికి కోపం ఎక్కువని. ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంటారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని... ఇలాంటి ఎన్నో అపోహలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. ‘నేను రాసిన పుస్తకం సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడకపోవచ్చు. స్ఫూర్తిదాయక పుస్తకం కాకపోవచ్చు. కానీ ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఏముంటుంది’ అని కుందు చెబుతున్నప్పటికీ ఎంతోమంది సింగిల్ ఉమెన్కు ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా, సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడుతుంది. తర్వాత ఏమిటి మరి? ఢిల్లీలోనే కాదు దేశం నలుమూలలా ‘స్టేటస్ సింగిల్’ సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరికొకరు అండగా నిలవాలనేది లక్ష్యం. వారి లక్ష్యం ఫలించాలని ఆశిద్దాం. చదవండి: Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా మా కమ్యూనిటీలో -
చేతులు కలిపిన మేటా, మైక్రోసాఫ్ట్ ! వీడియో చాట్కి కొత్త సొబగులు
Meta Partnership With Microsoft: టెక్నాలజీ రంగంలో పరస్పరం పోటీ పడుతున్న ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్లు చేతులు కలిపాయి. కరోనాతో తలెత్తిన సంక్షోభ పరిస్థితులను మరింత చక్కగా వినియోగించుకునేందుకు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. నత్తనడకన వర్క్ప్లేస్ సోషల్ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్బుక్ ప్రస్తుతం మేటాగా పేరు మార్చుకుంది. అయితే మేటా వీడియో చాట్ యాప్గా వర్క్ప్లేస్ ఉంది. ఈ వీడియో చాట్యాప్ ద్వారా ఉద్యోగులు వర్చువల్గా పని చేసుకునే వీలుంది. మేటా ఆధ్వర్యంలో ఉన్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తరహాలో వర్క్ప్లేస్ పెద్దగా యూజర్ బేస్ సాధించలేక పోయింది. 2016 అక్టోబరులో వర్క్ప్లేస్ మార్కెట్లోకి వచ్చినా.. ఇప్పటి వరకు 7 మిలియన్లకు మించి పెయిడ్ యూజర్ బేస్ సాధించలేకపోయింది. లక్ష్యానికి దూరంగా మరోవైపు వీడియో చాట్ విభాగంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ టీమ్ యాప్ని అందిస్తోంది. వర్క్ప్లేస్తో పోల్చితే టీమ్ యాప్కి కస్టమర్ బేస్ ఎక్కువగానే ఉంది. 250 మిలియన్ల యాక్టివ్ మంత్లీ యూజర్లు ఈ యాప్కి ఉన్నారు. అయితే మైక్రోసాఫ్ట్ టీమ్ సైతం ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఎదగలేక పోయింది. ఈజీగా రెండు పనులు దీంతో వీడియో చాట్ విభాగంలో స్కైప్, జూమ్, గూగుల్ డుయోలకి పోటీగా మార్కెట్లో నంబర్ స్థానం లక్ష్యంగా మేటా, మైక్రోసాఫ్ట్లు జట్టు కట్టాయి. దీని ప్రకారం ఒకే యాప్లో ఉన్నప్పటికీ రెండు యాప్లలో ఉండే సౌకర్యాలను పొందవచ్చు. ఉదాహారణకు మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్లో ఉంటూనే వర్క్ప్లేస్ యాప్లో న్యూస్ ఫీడ్ను చూసుకోవచ్చు. నంబర్వన్ రోనా సంక్షోభం తర్వాత వీడియో చాట్ యాప్ల ప్రాముఖ్యత పెరిగిపోయింది. వర్చువల్ కాన్ఫరెన్సులు కామన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు యాప్లకు ఉన్న యూజర్ బేస్ను కాపాడుకుంటూ కొత్తగా వినియోగదారులను ఆకర్షించడం లక్ష్యంగా మైక్రోసాఫ్ట్, మేటాలు జట్టుకట్టాయి. వీడియో చాట్ విభాగంలో నంబర్ వన్ స్థానం లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. చదవండి:యాపిల్ ఎలక్ట్రిక్ కారు 3డీ మోడల్ చూస్తే మతిపోవాల్సిందే -
అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!
ఫిన్ల్యాడ్: మనం చాలా నిధుల గురించి విని ఉంటాం అయితే ఈ ఫిన్ల్యాండ్లోని లెమ్మిన్కైనెన్ అనే నిధి నిక్షేపం కోసం 30 ఏళ్లుగా పరిశోధిస్తునే ఉన్నారంటా. అంతేకాదు ఈ లెమ్మిన్కైనెన్ అనే నిధి కోసం "ట్వెల్వ్ టెంపుల్" పేరుతో పన్నెండు మంది బృందం 1987 నుండి అన్వేషిస్తోందట. (చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !) పైగా ఈ నిధిలో 1500 కోట్లు పైన ఉండచ్చని భావిస్తున్నారు. అంతేకాదు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వజ్రాలు, నీలమణులు, పురాతన కళాఖండాలు వంటివి 50వేలుకు పై చిలుకే ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వెయ్యేళ్లనాటి నిధిని చేధించేందకు ఈ పన్నెండు బృందాలు 30 ఏళ్లుగా అన్వేషిస్తునే ఉంది. ఈపరిశోధనల్లో భాగంగా వాళ్ల చాలా కష్ట నష్టాలను చవిచూశారు. అయితే ఇంతవరకు ఎవరు ఈ నిధిని కనుగొన లేకపోయారు. ఈ మేరకు ఆ పన్నెండు మంది బృందం తాము కొద్ది దూరంలో ఉన్నామని త్వరలోనే ఈ నిధిని కనుగొన గలమంటూ విశ్వాసం వ్యక్తం చేసింది. లెమ్మిన్కైనెన్ నిధి అన్వేషణాధికారి మాట్లాడుతూ...గణనీయమైన పురోగతి సాధించాం. త్వరలోనే మా బృందం ఆ నిధిని గుర్తించ గలదు" అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు) -
గ్రీన్ ఇండియా చాలెంజ్ : మొక్కలు నాటిన ‘మహా సముద్రం’ టీమ్
-
జబర్దస్త్ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
విజయవాడలో 'డియర్ మేఘ' టీం సందడి
-
ఆదిత్య 369 టీంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
-
సోషల్ మీడియా టీంతో YS షర్మిల భేటీ
-
మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని స్వదేశానికి రప్పించేందుకు మల్టీ-ఏజెన్సీ బృందం డొమినికాకు చేరుకుంది. "మిషన్ చోక్సీ" పేరుతో ఏర్పాటైన ఎనిమిది మంది సభ్యుల ఈ బృందానికి సీబీఐ అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న శారదా రౌత్ నేతృత్వం వహించడం విశేషంగా నిలిచింది. సీబీఐ, ఈడీ , సీఆర్పీఎఫ్ సభ్యులు ఈ బృందంలో భాగమని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీబీఐ బ్యాంకింగ్ మోసాలను విచారించే విభాగం చీఫ్ ముంబైకి చెందిన శారదా రౌత్ నేతృత్వంలోని ఈ బృందం రేపు (జూన్ రెండు) చోక్సీపై జరిగే కోర్టు విచారణకు హాజరవుతుంది. అక్కడ రాజకీయంగా దుమారాన్ని రేపిన ఈ కేసులో డొమినికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సహాయం చేయనుంది. అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే ఒక ప్రయివేట్ విమానం ద్వారా ఈ బృందం చోక్సీని వెనక్కి తీసుకురానుందని సమాచారం. డిల్లీలో విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణమే చోక్సీని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. సీబీఐ అధికారి శారదా రౌత్ (ఫైల్ ఫోటో) ఇది ఇలాఉంటే అందరూ భావిస్తున్నట్టుగా మే 25 న కాకుండా మే 23నే మెహు్ల్ చోక్సీ డొమినికాకు చేరుకున్నాడని ఆంటిగ్వా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అవుట్ బౌండ్ క్లియరెన్స్ పత్రం ద్వారా తెలుస్తోంది. సెయింట్ లూసియా ఆధారిత పడవ 'కాలియోప్ ఆఫ్ ఆర్నే' ద్వారా డొమినికాలో అడుగుపెట్టాడు. అక్కడినుంచి భారత్తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చెక్కెయ్యాలని ప్రయత్నించి చోక్సీ చివరికి బుక్కయి పోయాడు. కాగా నకిలీ పత్రాలు, పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై వేలకోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన కేసులో డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, అతని మేనమామ మెహెల్ చోక్సీ కీలక నిందితులుగా ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద కుంభకోణంగాఈ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత ఆంటిగ్వాకు పారిపోయి అక్కడి పౌరసత్వాన్ని అనుభవిస్తున్న మెహుల్ చోక్సీ ఇటీవల క్యూబాకు పారిపోతూ డొమినికాలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొమినికా పౌరసత్వంలేని చోక్సీని నేరుగా భారత్కు అప్పగించవచ్చని ఆంటిగ్వా ప్రకటించింది. చోక్సీ భారతదేశానికి తిరిగి వెళ్లాల్సిందే..అక్కడ నేరారోపణల విచారణను ఎదుర్కోవలసిందే అని ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ తేల్చి చెప్పారు. అలాగే చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించినందుకు చోక్సిని అదుపులోకి తీసుకోవాలని డొమినికన్ ప్రభుత్వాన్ని బ్రౌన్ కోరినట్లు ఆంటిగ్వా మీడియా వెల్లడించింది. మరోవైపు చోక్సీ భారత పౌరుడు కాదు కాబట్టి, చట్టబద్దంగా భారతదేశానికి తరలించలేరని చోక్సీ న్యాయవాది వాదిస్తున్నారు. అంతేకాదు కొన్ని రాజకీయ కారణాల రీత్యా బలవంతంగా డొమినికాకు చోక్సీని తీసుకెళ్లారని కూడా ఆరోపించారు. అటు చోక్సీ వ్యవహారం డొమినికాలో రాజకీయ వివాదానికి దారి తీసింది. అంతర్జాతీయంగా తమ ప్రతిష్ట దెబ్బదింటోందంటూ డొమినికా ప్రతిపక్ష నాయకుడు లెన్నాక్స్ లింటన్ ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెర్రిట్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చదవండి : Mehul Choksi: గర్ల్ఫ్రెండ్తో డిన్నర్కు వెళ్లి చిక్కాడు కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు -
నాంది టీం గుంటూరు సక్సెస్ టూర్ ఫోటోలు
-
హైదరాబాద్కు 64 దేశాల రాయబారుల బృందం
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు 64 దేశాల రాయబారులు బృందం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ బృందంలో పలు దేశాల హైకమిషనర్లు కూడా ఉన్నారు. వీరు ఎయిర్పోర్టు నుంచి శామీర్పేటలోని జీనోమ్ వ్యాలీకి మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఈ హైకమిషనర్, రాయబారుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయి కోవిడ్ 19 వ్యాక్సిన్పై పనిచేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, ఈ బయోలాజికల్స్ లిమిటెడ్ సంస్థలను సందర్శించి వ్యాక్సిన్పై చర్చించన్నారు. ఈ నేపథ్యంలో టీకాల పురోగతిని పరిశీలించి అనంతరం ఈ విదేశీ బృందం శాస్త్రవేత్తలతో భేటీ కానుంది. ఇక సమావేశం ముగిసిన తర్వాత సాయంత్ర 5:50 గంటలకు అంబాసిడర్, హైకమిషనర్లు తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. విదేశి పత్రినిధుల పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లు చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్లో ఉన్న విషయం తెలిసిందే. బయోలాజికల్ ఈ-సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్కు కేంద్ర గత నెలలలో అనుమతిచ్చింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్కు వచ్చి భారత్ బయోటెక్ను సందర్శించిన విషయం తెలిసిందే. -
ఆసీస్ను నిలువరించిన భారత్
టోక్యో: ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ను 2–2తో ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున వందన కటారియా (36వ నిమిషంలో), గుర్జీత్ కౌర్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఆస్ట్రేలియా జట్టుకు కైట్లిన్ నోబ్స్ (14వ నిమిషంలో), గ్రేస్ స్టీవార్ట్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇదే టోర్నీలో భారత పురుషుల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 1–2తో ఓడిపోయింది. రెండో నిమిషంలో హర్మన్ప్రీత్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కివీస్ ప్లేయర్ జేకబ్ స్మిత్ 47వ నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. చివరి నిమిషంలో స్యామ్ లేన్ గోల్ సాధించి న్యూజిలాండ్ విజయాన్ని ఖాయం చేశాడు.