team
-
బౌలర్గా శ్రీలీల .. బ్యాట్స్మెన్గా ఎవరంటే?.. రాబిన్హుడ్ టీమ్ ప్రకటించిన నితిన్!
టాలీవుడ్ హీరో నితిన్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో వస్తోన్న రాబిన్హుడ్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నితిన్కు యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. రాబిన్హుడ్ టీమ్ నుంచి క్రికెట్ జట్టును తయారు చేయాలంటే ఎవరూ దేనికి సూట్ అవుతారో చెప్పాలంటూ హీరోను అడిగింది. దీనికి నితిన్ స్పందిస్తూ.. మా క్రికెట్ టీమ్లో శ్రీలీల బౌలర్.. ఎందుకంటే ఆమె వయ్యారంగా బౌలింగ్ చేస్తే ఎవరైనా అవుట్ కావాల్సిందే.. వికెట్ కీపర్గా మా మైత్రి నిర్మాత రవిశంకర్.. అంపైర్గా వెంకీ కుడుముల.. బ్యాట్స్మెన్గా నేనే.. మా టీమ్లో క్యాచ్లో పట్టేది నవీన్.. మా టీమ్ ఓనర్గా డేవిడ్ వార్నర్ అంటూ ఫన్నీగా తమ రాబిన్హుడ్ టీమ్ను ప్రకటించారు. -
సూపర్ పియాస్ట్రి
షాంఘై: గత ఏడాది ఫార్ములావన్ సీజన్ ఆరంభంలో రెడ్బుల్ జట్టు అదరగొట్టగా... ఈసారి మెక్లారెన్ జట్టు మెరిపిస్తోంది. ఈ సీజన్లోని తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ విజేతగా నిలువగా... రెండో రేసు చైనా గ్రాండ్ప్రిలో మెక్లారెన్కే చెందిన రెండో డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన 23 ఏళ్ల పియాస్ట్రి రేసు ముగిసే వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. నిర్ణీత 56 ల్యాప్ల రేసును ఆ్రస్టేలియా జాతీయుడైన పియాస్ట్రి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 30 నిమిషాల 55.026 సెకన్లలో ముగించి చాంపియన్గా అవతరించాడు. 2023లో మెక్లారెన్ జట్టు తరఫునే ఫార్ములావన్లో అరంగేట్రం చేసిన పియాస్ట్రి వరుసగా మూడో ఏడాది అదే జట్టుతో ఉన్నాడు. గత ఏడాది హంగేరి గ్రాండ్ప్రి, అజర్బైజాన్ గ్రాండ్ప్రిలలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న పియాస్ట్రి తాజా గెలుపుతో తన కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు.మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానంలో నిలిచాడు. నోరిస్ 1 గంట 31 నిమిషాల 04.774 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఫార్ములావన్ రేసులో ఓవరాల్గా 1–2 స్థానాలు మెక్లారెన్ డ్రైవర్లే సొంతం చేసుకోవడం ఇది 50వ సారి కావడం విశేషం. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానంలో నిలువగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ ముగ్గురిపై వేటు ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్, లూయిస్ హామిల్టన్ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలువగా... పియరీ గ్యాస్లీ (ఆలై్పన్) 11వ స్థానంలో నిలిచారు. అయితే సాంకేతిక కారణాలరీత్యా రేసు ముగిశాక ఈ ముగ్గురిపై అనర్హత వేటు వేశారు. లెక్లెర్క్ 10 పాయింట్లను, హామిల్టన్ 8 పాయింట్లను చేజార్చుకున్నారు. 11వ స్థానంలో నిలిచినందుకు గ్యాస్లీకి ఎలాంటి పాయింట్లు లభించలేదు. ఫార్ములావన్ నిబంధనల ప్రకారం రేసు ముగిసిన తర్వాత డ్రైవర్ల కారు కనిష్ట బరువు 800 కేజీలు ఉండాలి. అయితే లెక్లెర్క్, హామిల్టన్, గ్యాస్లీల కార్ల బరువు 799 కేజీలు చూపించింది. దాంతో ఈ ముగ్గురిపై రేసు నిర్వాహకులు వేటు వేసి వారి ఫలితాలను రద్దు చేశారు. సీజన్లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్ప్రి ఏప్రిల్ 6న సుజుకా సర్క్యూట్లో జరుగుతుంది. సీజన్లోని తొలి రెండు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్షిప్లో లాండో నోరిస్ 44 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా... 36 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో, 35 పాయింట్లతో జార్జి రసెల్ మూడో స్థానంలో నిలిచారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్లో మెక్లారెన్ 78 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
వారెవ్వా నోరిస్...
మెల్బోర్న్: గత సీజన్ను విజయంతో ముగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ కొత్త సీజన్ను కూడా విజయంతో ప్రారంభించాడు. 2025 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రిలో బ్రిటన్కు చెందిన 25 ఏళ్ల లాండో నోరిస్ చాంపియన్గా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నోరిస్ నిర్ణీత 57 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 42 నిమిషాల 06.304 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ టైటిల్ సాధిస్తున్న వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. వెర్స్టాపెన్ రేసును 1 గంట 42 నిమిషాల 07.199 సెకన్లలో ముగించాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందాడు. 1987లో ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రి మొదలుకాగా ఈ రేసుకంటే ముందు వరకు ఫెరారీ జట్టు డ్రైవర్లు అత్యధికంగా 11 సార్లు విజేతగా నిలిచారు. అయితే ఈసారి ఫెరారీ జట్టుకు ఈ రేసు కలిసిరాలేదు. తొలిసారి ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగిన మాజీ వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 10వ స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ 8వ స్థానాన్ని సంపాదించాడు. 2010 తర్వాత తొలిసారి ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రికి వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఈ రేసుకు మూడుసార్లు అంతరాయం కలిగింది. మూడుసార్లు ట్రాక్పై సేఫ్టీ కార్లు వచ్చాయి. తొలి ల్యాప్ పూర్తికాకముందే ముగ్గురు డ్రైవర్లు కార్లోస్ సెయింజ్ (విలియమ్స్), జాక్ దూహాన్ (ఆలై్పన్), ఐజాక్ హద్జార్ (రేసింగ్ బుల్స్) రేసు నుంచి వైదొలిగారు. ఫార్మేషన్ ల్యాప్లో హద్జార్ తప్పుకోగా... తొలి ల్యాప్లో పరస్పరం ఢీకొట్టుకోవడంతో గత ఏడాది ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలో విజేతగా నిలిచిన సెయింజ్తోపాటు దూహాన్ నిష్క్రమించారు. ఆ తర్వాత అలోన్సో (ఆస్టన్ మార్టిన్) 32వ ల్యాప్లో, గాబ్రియేల్ బొర్టోలెటో (కిక్ సాబెర్) 45వ ల్యాప్లో, లియామ్ లాసన్ (రెడ్బుల్) 46వ ల్యాప్లో తప్పుకున్నారు. ఓవరాల్గా 20 మంది డ్రైవర్లలో 14 మంది రేసును పూర్తి చేశారు. 24 రేసులతో కూడిన 2025 సీజన్లో తదుపరి రెండో రేసు చైనా గ్రాండ్ప్రి ఈనెల 23న జరుగుతుంది. -
ఓటమితో హైదరాబాద్ ముగింపు
నాగ్పూర్: భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగినా... హైదరాబాద్ జట్టుకు నిరాశ తప్పలేదు. రంజీ ట్రోఫీ 2024–2025 దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ముగించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో ఆదివారం ముగిసిన గ్రూప్ ‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్లో చామా మిలింద్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. విదర్భ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఓవర్నైట్ స్కోరు 23/1తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన హైదరాబాద్ జట్టు 38.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటై పరాజయాన్ని చవిచూసింది. రాహుల్ రాదేశ్ (77 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలువగా... చివర్లో మిలింద్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), సిరాజ్ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కాసేపు అలరించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ హర్‡్ష దూబే 57 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి విదర్భ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. బ్యాటర్లు క్రీజులో నిలబడితే ఛేదించే లక్ష్యమైనా... చివరిరోజు హైదరాబాద్ బ్యాటర్లు తడబడి మూల్యం చెల్లించుకున్నారు. ఓవరాల్గా గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఎనిమిది జట్లున్న ఈ గ్రూప్లో హైదరాబాద్ 2 మ్యాచ్ల్లో గెలిచి, 2 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. గ్రూప్ ‘బి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన విదర్భ, గుజరాత్ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 190; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 326; విదర్భ రెండో ఇన్నింగ్స్: 355; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి అండ్ బి) యశ్ ఠాకూర్ 6; అభిరత్ రెడ్డి (సి) దానిశ్ (బి) హర్ష్ దూబే 21; తనయ్ త్యాగరాజన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆదిత్య థాకరే 18; రాహుల్ రాదేశ్ (సి) అథర్వ తైడే (బి) పార్థ్ రేఖడే 48; హిమతేజ (సి) అథర్వ తైడే (బి) హర్ష్ దూబే 0; వరుణ్ గౌడ్ (సి) యశ్ రాథోడ్ (బి) హర్ష్ దూబే 5; రాహుల్ బుద్ది (సి) అక్షయ్ వాడ్కర్ (బి) పార్థ్ రేఖడే 9; చామా మిలింద్ (సి) దానిశ్ (బి) హర్‡్ష దూబే 20; రక్షణ్ రెడ్డి (బి) హర్ష్ దూబే 0; సిరాజ్ (సి) అథర్వ తైడే (బి) హర్‡్ష దూబే 26; అనికేత్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 3; మొత్తం (38.5 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1–11, 2–36, 3–61, 4–67, 5–94, 6–107, 7–116, 8–123, 9–140, 10–161. బౌలింగ్: యశ్ ఠాకూర్ 5–1–26–1, ఆదిత్య థాకరే 7–0–27–1, హర్ దూబే 11.5–1–57–6, అక్షయ్ వఖారే 7–3–16–0, పార్థ్ రేఖాడే 8–0–33–2. -
కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న 'రాచరికం' సినిమా టీం సభ్యులు...
-
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
-
హీరోయిన్ బర్త్డే పార్టీలో బాలయ్య సందడి (ఫోటోలు)
-
నీ ఆటే బంగారం... శ్రీవల్లీ
‘క్రికెట్ ప్లేయర్ కావాలనుకుంటున్నాను’ అనే మాట అబ్బాయిల నోట వినిపిస్తే అభినందనలు తెలుపుతారు. ఆశీర్వదిస్తారు. అదే మాట అమ్మాయిల నోటి నుంచి వినిపిస్తే..? అవాక్కవుతారు. ‘అమ్మాయిలకు క్రికెట్ ఎందుకు?’ అని కూడా అంటారు. లక్ష్యం మీద గురి పెట్టిన వారు మాత్రం అలాంటి మాటలను లక్ష్యపెట్టరు. అలాంటి ఒక అమ్మాయి శ్రీవల్లి. ఎన్నో సవాళ్లను అధిగమించి తన కలను నెరవేర్చుకున్న శ్రీవల్లి క్రికెట్లో రాణిస్తోంది. డిసెంబరు 4 నుంచి అహ్మదాబాద్లో జరగనున్న మ్యాచ్లో బీసీసీఐ సీనియర్ మహిళల జట్టులో హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.శ్రీవల్లికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం టీవీలో వీక్షణకే పరిమితం కాలేదు. చిన్న వయసులోనే బాల్, బ్యాట్తో గ్రౌండ్లో అడుగు పెట్టేలా చేసింది. శ్రీవల్లి అయిదవ తరగతి చదువుతున్న రోజుల్లో... స్కూల్ ప్లే గ్రౌండ్కు వెళ్లింది. హైస్కూల్ అబ్బాయిలు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ‘అన్నా... నేను కూడా ఆడతాను’ అని అడిగింది చిన్నారి శ్రీవల్లి. వాళ్లు బిగ్గరగా నవ్వారు.ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ‘అయిదో క్లాసు అమ్మాయి హైస్కూల్ అబ్బాయిలతో ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. ‘ఆడపిల్లలు క్రికెట్ ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. వారి వెటకారపు నవ్వులతో వెనక్కి వెళ్లిపోలేదు శ్రీవల్లి. పీఈటీ రహీం సార్కు చెప్పింది. ‘నీ ఉత్సాహం సరే, వారితో ఆడగలవా?’ అని అడిగారు సార్. ‘ఆడతాను’ అని ఉత్సాహంతో తల ఊపింది.నిజానికి అది ఉత్సాహం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన తొలి సంకేతం. విజయపథం వైపు వేసిన తొలి అడుగు. శ్రీవల్లి చేసిన బౌలింగ్లో సీనియర్లు షాట్లు బాగానే కొట్టారు. కానీ, తన స్పీడ్కు కొందరు బెంబేలెత్తడం పీఈటీ సార్ గమనించారు. లైన్ లెంగ్త్ సరిదిద్దితే శ్రీవల్లిని బాగా తీర్చిదిద్దవచ్చు అని గుర్తించారు. అక్కడ నుంచి తానే కోచ్గా మారారు. శ్రీవల్లి బౌలింగ్లోని లోపాలను సరిచేస్తూ క్రమంగా స్పీడ్బౌలర్గా తీర్చిదిద్దారు. ‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది’ అని శ్రీవల్లి తల్లిదండ్రులకు చె΄్పారు.‘క్రికెట్ అంటే ఏదో సరదాగా ఆడుతోంది కానీ అమ్మాయిని డాక్టర్గా చూడాలనేది మా కల’ అని వారు అని ఉంటే శ్రీవల్లి కల ఆవిరైపోయేది. అయితే సార్ మాట విని శ్రీవల్లి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కుమార్తెకు మరింత సాధన అవసరమనుకున్న తండ్రి లక్షా్మరెడ్డి శ్రీవల్లిని హైదరాబాద్ పంపాడు.‘పై చదువుల కోసమో, ఎంసెట్ కోచింగ్ కోసమో పిల్లల్ని హైదరాబాద్కు పంపిస్తారుగానీ క్రికెట్ కోచింగ్ కోసం పంపిస్తున్నావా!’ అని బోలెడు ఆశ్చర్యపడిన వాళ్లు... ‘క్రికెట్లో ఎవరికో ఒకరికి అదృష్టం దక్కుతుంది. ఆడినవాళ్లందరూ స్టార్లు కాలేరు’ అని నిరాశపరిచిన వాళ్లూ్ల ఉండొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి మాటలు వచ్చినా ఆ తల్లిదండ్రులకు బాగా నచ్చిన మాట...‘మీ అమ్మాయికి క్రికెట్లో మంచి భవిష్యత్ ఉంది’హైదరాబాద్లో కనిష్కనాయుడు శిక్షణలో క్రికెట్లో తన నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది శ్రీవల్లి. ఫాస్ట్బౌలర్గానే కాకుండా, బ్యాటింగ్తోనూ ఆకట్టుకోగల ఆల్రౌండ్ నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది.బాల్యంలోనే పెద్ద కలలు కన్న శ్రీవల్లి టీనేజ్లో ఆ కలలను తన సాధనతో మరింత సాకారం చేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్గా రాణించాలనేది శ్రీవల్లి లక్ష్యం. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం. – అనిల్ కుమార్ భాషబోయిన సాక్షి ప్రతినిధి, కరీంనగర్ఆ స్ఫూర్తితోనే...అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి రకరకాల పరిమితులు ఉండొచ్చు. అయితే ఆడాలనే ఉత్సాహంతోపాటు సంకల్పబలం ఉంటే ఆ పరిమితులు మనకు అడ్డుకావు. ఎంతోమంది స్టార్ క్రికెట్ ప్లేయర్ల అపూర్వ విజయాలతో స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తితోనే క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టాను. ఫాస్ట్ బౌలర్గా రాణించాలనేది నా కల. – కట్టా శ్రీవల్లి రెడ్డి -
షాకిస్తున్న ట్రంప్ ఎంపికలు!
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడి ఎలా ఉండబోతున్నదన్న చర్చలు ఒకపక్క సాగుతుండగా ఆయన తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. ఆ పేర్లు కొందర్ని ఆశ్చర్యపరుస్తుంటే, మరికొందర్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతున్నాయి. తొలి బోణీ స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ కాగా, ఆయనతోపాటు వరసగా వివేక్ రామస్వామి, తులసీ గబార్డ్, మార్కో రుబియో, మాట్ గెట్జ్ వంటివారు కీలక పదవుల్లో కుదురుకోబోతున్నారని తేలింది. వీళ్లంతా వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు... అన్నిటికన్నా మించి ‘వెలుపలివారు’ అయినందువల్ల తన ప్రభుత్వం సమర్థవంతమైన కార్పొరేట్ దిగ్గజంగా వెలిగిపోతుందని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడు తోంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్ శౌరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఉండేది. దాని పని నష్టజాతక పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం. ఆ క్రమంలో సవ్యంగా నడుస్తున్న సంస్థలు సైతం ప్రైవేటుకు దక్కాయన్న విమర్శలుండేవి. ఇప్పుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో ట్రంప్ అటువంటి పనే చేయించబోతున్నారు. మస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం(డీఓజీఈ) ఏర్పడుతుంది. దానికి వివేక్ ‘వెలుపలి సలహాదారు’గాఉంటారు. వచ్చే ఏడాది జూలైకల్లా ప్రభుత్వ వ్యయంలో 2 లక్షల కోట్ల డాలర్లు కోత పెట్టడమే ధ్యేయంగా వీరిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వోద్యోగుల సంఖ్య అపరిమితంగా ఉన్న దనీ, ఇందులో భారీగా కోతపెట్టడంతోపాటు ఉద్యోగాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే ఉండటం అవసరమనీ తొలి ఏలుబడిలోనే ట్రంప్ తరచు చెప్పేవారు. అయితే సహచరుల హెచ్చరికతోముందడుగేయ లేకపోయారు. అందుకే కావొచ్చు... గతానుభవం లేనివారినే ఎంచుకున్నారు. అయితే ట్రంప్–మస్క్ల సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానమే. ప్రభుత్వోద్యోగుల పని తీరుపై ట్రంప్, మస్క్లకు ఏకాభిప్రాయం ఉంది. అయితే కార్పొరేట్ సంస్థలు అన్యాయంగా సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ట్రంప్ అభిప్రాయానికి మస్క్ వ్యతిరేకం. కార్మిక హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ప్రచారపర్వంలో చేసిన ప్రసంగాల వల్ల పలు కార్మిక సంఘాలు ట్రంప్కు అనుకూలంగా మారాయి. ఆయన విజయానికి దోహదపడిన అనేక అంశాల్లో ఇదొకటి. మస్క్ విష యానికొస్తే ఆయన ట్విట్టర్ (ఎక్స్)లోనూ, అంతకుముందు టెస్లాలోనూ భారీ యెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దానిపై జాతీయ కార్మిక సంబంధాల బోర్డులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక చైనాపై మస్క్కున్న ప్రేమ ఎవరికీ తెలియంది కాదు. 2020లో షాంఘైలో టెస్లా విద్యుత్ కార్ల కర్మాగారం మొదలయ్యాక ఒక్క చైనాలోనే మస్క్ ఆరు లక్షల కార్లు విక్రయించారు.పర్యావరణ పరిరక్షణ పేరిట పెట్రోల్, డీజిల్ కార్లకు బదులు విద్యుత్ కార్లు తీసుకురావటం పెద్ద కుట్రని ట్రంప్ అభిప్రాయం. దానికితోడు ఆయనకు చైనాపై ఉన్న వ్యతిరేకత మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. విదేశాంగమంత్రిగా ఎంపిక చేసుకున్న మార్కో రుబియో చైనాకు తీవ్ర వ్యతిరేకి, ఇజ్రాయెల్ అనుకూలుడు.ట్రంప్ హయాంలో వేధింపులు దండిగా ఉంటాయని అటార్నీ జనరల్గా మాట్ గెట్జ్ ఎంపిక వెల్లడిస్తోంది. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ మొదలుకొని ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ, 2021 నాటి మూకదాడి కేసు విచారణలో ప్రముఖపాత్ర పోషించిన లిజ్ షెనీ వరకూ చాలామందిపై ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అందుకే మైనర్లతో లైంగిక కార్యకలా పాలు, మాదకద్రవ్యాల వినియోగంవంటి ఆరోపణలున్నా ఉద్దేశపూర్వకంగా గెట్జ్ను ట్రంప్ ఎంపిక చేశారు. ట్రంప్పై నేరారోపణలు ముసురుకొని కేసులు వచ్చిపడిన తరుణంలో ఆయన వెనకదృఢంగా నిలబడటం గెట్జ్కున్న ఏకైక అర్హత. రిపబ్లికన్లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఎంపిక సెనేట్లో గట్టెక్కుతుందా అన్న సందేహాలున్నాయి. అమెరికా త్రివిధ దళాధిపతుల కమిటీ చైర్మన్తో సహా సైనిక జనరళ్లను తొలగించాలని కోరే ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ఎంపిక చేయడం కూడా అత్యధికులకు మింగుడుపడటం లేదు. వైవిధ్యత పేరిట సైన్యంలో మైనారిటీ వర్గాలకూ, స్త్రీలకూ ప్రాధాన్యత పెరగటాన్ని చాలాకాలంగా హెగ్సెత్ ప్రశ్నిస్తు న్నారు. గతంలో సైన్యంలో పని చేసిన హెగ్సెత్వల్ల ప్రభుత్వంతో సైన్యానికి ఘర్షణ తప్పదని అనేకుల అంచనా. ఇక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసిన తులసి గబార్డ్ వెనిజులా, సిరియా, ఉక్రెయిన్, రష్యా వ్యవహారాల్లో అమెరికా విధానాలు తప్పని అంటారు. ఆమెకు ఏకంగా 18 నిఘా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పటాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ట్రంప్ ఏలుబడిలో వలసదారులను శ్వేతజాతి దురహంకారం బెడదతో సహా అనేకం చుట్టు ముడతాయి. దానికితోడు వీసా సమస్యలు, ఉద్యోగాల కోత తప్పవు. ఇక ‘అమెరికా ఫస్ట్’ అమలైతే వాణిజ్యయుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు గనుక చైనాతో సహా అనేక దేశాలు ఆత్మరక్షణ విధానాలకు సిద్ధపడుతున్నాయి. డాలర్ దూకుడు అంచనాతో అమెరికా మార్కెట్లు వెలిగిపోతుంటే విదేశీ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ట్రంప్ టీంలో మార్కో రుబియో, హెగ్సెత్, ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వాన్స్తోసహా అందరూ ఉక్రెయిన్ యుద్ధం ఆపటమే తమ తొలి లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు గనుక ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గత్యంతరం లేదు. నాటో దేశాలు ట్రంప్తోగతంలో ఉన్న అనుభవం వల్ల ఇప్పటికే దిక్కుతోచక ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ రాకతో ఇంటా బయటా యధాతథ స్థితి తలకిందులు కాబోతోంది. -
అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు..
-
బిత్తిరి సత్తి నాన్ స్టాప్ కామెడీ.. పడి పడి నవ్వుకున్నా అల్లు శిరీష్, అలీ
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు (ఫోటోలు)
-
టెకీలకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్న్యూస్
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. టెక్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1,500 మంది నుంచి రెండేళ్లలో రెట్టింపునకు (3,000 మంది) పెంచుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు.రెగ్యులర్ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు (లేటరల్ హైరింగ్) మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా ప్రకటించారు. టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు వెల్లడి కావడంతో ఇటీవల బీవోబీపై ఆర్బీఐ ఆంక్షలు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. తర్వాత వీటిని ఎత్తివేసింది.1,500 మంది ప్రస్తుత టెక్నాలజీ బృందంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నట్టు చాంద్ చెప్పారు. జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెక్నాలజీపై బ్యాంక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ మౌలిక సదుపాయాల కోసమే రూ.2,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.రానున్న కాలంలోనూ దీనిపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 600 కొత్త శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. 12–14 శాతం మేర రుణాల్లో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సమయంలో డిపాజిట్లలో 10–12 శాతం వృద్ధిని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.15 శాతంగా ఉంటుందన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో ఆశిష్ (ఫొటోలు)
-
Saina Nehwal: రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
-
Geethanjali Malli Vachindi : శ్రీవారిని దర్శించుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీమ్ (ఫోటోలు)
-
శ్రీనిధి డెక్కన్ జట్టును గెలిపించిన ఒలివేరా
కొడుమన్ (కేరళ): ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో 12వ విజయం చేరింది. గోకులం కేరళ ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 44వ నిమిషంలో నికోలా స్టొజనోవిచ్ గోల్తో గోకులం కేరళ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే శ్రీనిధి తరఫున విలియమ్ అల్వెస్ డి ఒలివేరా (47వ ని.లో, 71వ ని.లో) రెండు గోల్స్ సాధించి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
Hanu Man: అమిత్ షాను కలిసిన హనుమాన్ టీమ్ (ఫోటోలు)
-
'గామి'తో సక్సెస్ కొట్టిన విశ్వక్ సేన్.. మూవీటీమ్తో తిరుమలలో సందడి (ఫోటోలు)
-
జీజేఆర్ క్రికెట్ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు న్యాయవాదుల క్రికెట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన జీజేఆర్ టోర్నమెంట్ పోటీల్లో హైకోర్టు న్యాయవాదుల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శనివారం కప్ను అందజేశారు. బోడుప్పల్లోని సాగర్ క్రికెట్ గ్రౌండ్, ఆరంఘర్లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీల్లో నగరంలోని 13 కోర్టుల న్యాయవాదులు పాల్గొన్నారు. సెమీ ఫైనల్లో సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల జట్టు (78)పై హైకోర్టు టీమ్(79) విజయం సాధించింది. అనంతరం జరిగిన ఫైనల్లో హైకోర్టు జట్టు... హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు టీమ్పై గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ది ఫైనల్లో బెస్ట్ బ్యాట్స్మన్గా వి.మనోహర్, బెస్ట్ బౌలర్గా సాయిచందర్ నిలిచారు. ఈ కప్ అందజేత కార్య క్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్గౌడ్, కౌన్సిల్ సభ్యుడు జితేందర్రెడ్డి, కటకం శారద, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
Manmadhudu: 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన మన్మథుడు జంట ఫోటోలు వైరల్
-
‘సాగర్’ను సందర్శించిన కేఆర్ఎంబీ బృందం
నాగార్జునసాగర్: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులు స్థానిక ఇంజనీర్లతో కలసి గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ డ్యామ్పై బీటీరోడ్డు వేయడంతో పాటు సీజనల్గా చేయాల్సిన నిర్వహణ పనులైన డ్యామ్ రేడియల్ క్రస్ట్గేట్లకు రబ్బరు సీళ్లు, గ్యాలరీలలో సీపేజ్ నీరు రాకుండా మరమ్మతులు, గేట్లు ఎత్తి, దింపే స్టార్టర్లలో ప్యానల్ బోర్డులు, మోటార్ల మరమ్మతుల వంటి పనులు చేయాల్సి ఉంది. ఈ నెల 16వ తేదీన తెలంగాణ ఇంజనీర్లు నిర్వహణ పనులను ప్రారంభించారు. అయితే, ఈ పనులు చేయవద్దని ఏపీ వైపున ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. తెలంగాణ అధికారులు అలాగే పనులు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. దీంతో స్పందించిన కేఆర్ఎంబీ అధికారులు గురువారం సాగర్డ్యామ్ మీదకు వచ్చి పరిశీలించారు. డ్యామ్ మెయింటెనెన్స్ పనులు చేసుకోవచ్చని చెప్పారు. శుక్రవారం కేఆర్ఎంబీ అధికారులు సాగర్డ్యామ్తో పాటు కుడి, ఎడమ కాల్వల హెడ్రెగ్యులేటర్లను సందర్శించనున్నట్లు సమాచారం. సాగర్డ్యామ్పై పర్యటించిన వారిలో కేఆర్ఎంబీ ఎస్ఈ వరలక్ష్మి, సాగర్డ్యామ్ ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ మల్లికార్జున్రావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కృష్ణయ్య, సీఆరీ్పఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ పాల్గొన్నారు. -
‘కమాండో కాంపిటీషన్స్’లో సత్తా చాటిన ఏపీ
విశాఖ స్పోర్ట్స్: 14వ ఆల్ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ (ఏఐపీసీసీ)లో ఏపీ జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించింది. 300 పాయింట్లకు గాను 267.20 పాయింట్లతో ఏపీ పోలీస్ కమాండో జట్టు విజయకేతనం ఎగురువేసింది. ఈ పోటీల్లో 8 ట్రోఫీలకు గానూ నాలుగింట చాంపియన్గా నిలిచింది. విశాఖలోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయ మైదానంలో మంగళవారంతో ముగిసిన ఈ పోటీల్లో విజేతలకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏడీజీపీ మ హేష్ దీక్షిత్ ట్రోఫీలను అందజేశారు. 9 రోజుల పా టు 23 ప్రత్యేక దళ కమాండో (16 స్టేట్, 7 పారా మిలిటరీ ఫోర్స్) జట్లు.. 5 దశల్లో జరిగిన పోటీల్లో సత్తాచాటాయి. ఆర్పీఎఫ్కు చెందిన కమాండో బి జేంద్ర 9.05 (12 నిమిషాలకు) నిమిషాల్లోనే పూర్తి చేసి ఛీతా రన్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కమాండో కాంపిటీషన్స్ విజేతగా ఏపీ నిలిచి స్వర్ణాలను అందుకుంది. రన్నరప్గా మహారాష్ట్ర నిలిచి రజతాన్ని, సెకండ్ రన్నరప్గా రాజస్థాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాన్ఫిడెన్స్ కోర్స్ బెస్ట్ జట్టుగా 10 నిమిషాల 10 సెకన్ల వ్యవధితో ఏపీ జట్టు నిలిచింది. బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో జట్టుగా 300కు గానూ 267.20 మార్కులతో ఏపీ జట్టు కైవసం చేసుకుంది. స్మాల్ టీమ్ ఆపరేషన్స్కు ఇచ్చే రణ్నీతి ట్రోఫీని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కైవసం చేసుకోగా.. చక్రవ్యూహ్ (గ్రామీణ) ట్రోఫీని ఏపీ జట్టు, చక్రవ్యూహ్ (పట్టణ) ట్రోఫీని మహారాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది. బ్లాక్ హాక్ ఫైరింగ్ ట్రోఫీని 93 మార్కులతో(110కిగానూ) ఏపీజట్టు అందుకుంది. ఏపీ జట్టులోని 13 మంది (11+2) సభ్యులకు ఒక్కోక్కరికి రూ.5 లక్షల ప్రోత్సాహాంతో పాటు 3 అదనపు ఇంక్రిమెంట్లను సర్వీస్ బోర్డ్ ప్రకటించింది. -
ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు
ఉత్తరాఖండ్లోని ఛార్ధామ్లో సొరంగం కుప్పకూలిన ఘటనలో 40 మంది కార్మికులు నాలుగు రోజులుగా అందులో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే కొండచరియలు విరిగిపడటంతోపాటు పలు సాంకేతిక సమస్యలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. తాజాగా థాయ్ల్యాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ బృందాలను అధికారులు ఇక్కడకు రప్పించాలని నిర్ణయించారు. 2018లో థాయ్లాండ్లోని ఒక గుహలో చిక్కుకున్న పిల్లలను రక్షించడంలో థాయ్లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణులు విజయం సాధించారు. ఇప్పుడు వీరు ఉత్తరకాశీలోని చార్ధామ్ రహదారిపై ఉన్న ఈ గుహలో చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు సహాయం అందించనున్నారు. ఈ సొరంగంలో చిక్కుకున్న 40 మందిని వెలికితెచ్చేందుకు స్థానిక అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించకపోవడంతో థాయ్లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణుల సాయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉత్తర థాయ్లాండ్లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్ గుహలో చిక్కుకున్న జూనియర్ అసోసియేషన్ ఫుట్బాల్ జట్టును రక్షించడంలో థాయ్కి చెందిన ఒక రెస్క్యూ కంపెనీ విజయం సాధించింది. నాడు ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసేందుకు వారం రోజులు పట్టింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు! -
రెండు హృదయాల కల
‘రూహి’ చిత్రం తర్వాత రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ‘నో డ్రీమ్ ఈజ్ ఎవర్ చేజ్డ్ ఎలోన్!’ అనేది క్యాప్షన్. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్కు శరణ్శర్మ దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ‘‘ఒకే కల కోసం రెండు హృదయాలు ఎదురు చుస్తున్నాయి’’ అంటూ ఈ మూవీని ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్లుగా జాన్వీ కపూర్ అండ్ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న భగవంత్ కేసరి చిత్రబృందం (ఫొటోలు)
-
రూరల్ రోడ్ల పనుల నాణ్యత భేష్
సాక్షి, అమరావతి: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సహాయంతో చేపట్టిన ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఆ బ్యాంకు ప్రతినిధి బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బ్యాంకు సహాయంతో చేపట్టిన ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం 5 రోజులపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించింది. జిల్లా స్థాయి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశమై పనుల ప్రగతిని, నాణ్యతను పరిశీలించింది. తదనంతరం మంగళవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డితో ఈ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించి పనులపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తమ బ్యాంకు ఆర్థిక సహాయంతో జరుగుతున్న గ్రామీణ రహదారి పనుల్లో నాణ్యతతో కూడిన ఒక ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. రూ.5,026 కోట్లతో పనులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించడంతోపాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణ సహాయంతో ఏపీ రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా.. ఏఐఐబీ రూ.3,418 కోట్లను రుణంగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,608 కోట్లను సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3,665 పనులు చేపట్టి 7,213 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటికే కాంపొనెంట్–1ఏ కింద 6,215 కిలోమీటర్ల పొడవున 3,231 పనులు చేపట్టగా.. ఇప్పటికే 2,450 కి.మీ. పొడవు గల 1,201 పనులు పూర్తయ్యాయి. మరో 3,765 కి.మీ. పొడవు గల 2,030 పనులు ప్రగతిలో ఉన్నాయి. కాంపొనెంట్–1బీ కింద 364 కి.మీ. పొడవు గల 142 పనులు చేపట్టగా.. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కమిషనర్ సురేశ్కుమార్, పంచాయతీరాజ్ ఈఎన్సీ బాలూనాయక్, ఏఐఐబీ ప్రతినిధి బృందం లీడర్ ఫర్హద్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్కుమార్, పర్యావరణ, సోషల్ ఎక్స్పర్ట్ శివ, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ ప్రదీప్, ట్రాన్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ తౌషిక్ పాల్గొన్నారు. -
రైవాడ జలాశయాన్ని సందర్శించిన సాంకేతిక బృందం
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): ఢిల్లీ నుంచి వచ్చిన సాంకేతిక బృందం శుక్రవారం రైవాడ జలాశయాన్ని సందర్శించింది. గౌరవ్ భగత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ప్రత్యేక బోటులో ప్రయాణించి సర్వే నిర్వహించింది. బోటులో అమర్చిన ల్యాప్టాప్తో పాటు కెమెరాల ఆధారంగా సర్వేను చేపట్టారు. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్)లో రైవాడ జలాశయం పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రూ.252 కోట్లతో గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపారు. 1990లో వచ్చిన భారీ వరద దృష్ట్యా ఎటువంటి తుపాన్లు సంభవించినా ఎదుర్కొనేలా కొత్త స్పిల్వే గేట్లు అమర్చాలని డ్రిప్ పథకంలో ప్రతిపాదించారు. జలాశయం స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు సాంకేతిక అధికారుల బృందం ఇక్కడికి వచి్చంది. అధునాతన సాంకేతికత ఆధారంగా జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం, ఎంతమేర పూడిక ఉంది, జలాశయం విస్తీర్ణం, జలాశయం గర్భంలో ఎక్కడైనా నిర్మాణాలు జరిగాయా తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు.15 రోజులపాటు ఈ సర్వే జరుగుతుందని, అనంతరం సర్వే రిపోర్టును ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్కు అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. వీరికి జలాశయం డీఈ సత్యంనాయుడు, జేఈలు నంద కిశోర్, రవిప్రకాష్ తదితరులు జలాశయ స్థితిగతులను వివరించారు. -
ఉద్యోగులకు షాక్: గూగుల్లో మళ్లీ తొలగింపుల పర్వం
Google layoffs: దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గణనీయమైన తొలగింపులను ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్లో సిబ్బంది కోతలను అమలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దాదాపు వందలమందిని ఉద్యోగులను తొలగించనుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, క్లిష్టమైన స్థానాలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టడానికి ఆల్ఫాబెట్ జట్టులోని మెజారిటీని నిలుపుకోవాలని భావిస్తోంది. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను) జనవరిలో, ఆల్ఫాబెట్, సుమారు 12,000 ఉద్యోగాలను తొలగించింది. తద్వారా మొత్తం సిబ్బందిలో 6శాతం తగ్గించుకుంది.తాజాగా నియామకాల్లో కొనసాగుతున్న మంద గమనంలో భాగంగా మరికొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. విస్తృత స్థాయి తొలగింపులు కానప్పటికీ కొన్ని కీలక ఉద్యోగాల ఎంపిక కోసం కొన్ని వందల మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను తగ్గించుకుంటున్న బిగ్ టెక్ సంస్థగా ఆల్ఫాబెట్ నిలిచింది. మెటా, మైక్రోసాఫ్ట్ , అమెజాన్తో సహా ఇతర టెక్ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. (రూ.2000 నోటు: అమెజాన్ షాకింగ్ అప్డేట్, తెలుసుకోండి!) ఉపాధి సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ నివేదికలు జూలైతో పోలిస్తే ఆగస్టులో యునైటెడ్ స్టేట్స్లో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరిగాయి. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని సూచిస్తున్నాయి. రాయిటర్స్ ఆర్థికవేత్తల సర్వేలో సెప్టెంబరు 9తో ముగిసే వారానికి రాష్ట్ర నిరుద్యోగ ప్రయోజనాల కొత్త క్లెయిమ్స్ సుమారుగా 8 శాతం పెరుగుదలను అంచనా వేశారు. -
సీతమ్మకొండపై హర్ శిఖర్ తిరంగా
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన సీతమ్మ కొండపై ‘హర్ శిఖర్ తిరంగా’కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కొండపై ఆర్మీ బృందం జాతీయ జెండాను విజయవంతంగా ఆవిష్కరించింది. దీంతో సీతమ్మకొండకు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన ఆర్మీ బృందం సోమవారం మధ్యాహ్నం హుకుంపేట మండలంలోని మారుమూల ఓలుబెడ్డ గ్రామానికి చేరుకుంది. సర్పంచ్ పాంగి బేస్ ఆధ్వర్యంలో గిరిజనులంతా వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో ఆర్మీ బృందం కూడా సందడి చేసింది. మధ్యాహ్నం 1.30గంటలకు సీతమ్మ కొండపైకి బయలుదేరిన ఆర్మీ బృందం... గంటన్నరలో కొండపైకి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా కల్నల్ రణవీర్సింగ్ జమ్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరంగా గుర్తించిన సీతమ్మ కొండపై జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. తమ యాత్ర, జాతీయ జెండా ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, స్థానిక గిరిజనులు ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన హర్ శిఖర్ తిరంగా యాత్రను ప్రారంభించామన్నారు. సీతమ్మ కొండతో కలిపి ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాల్లో జాతీయ జెండాను విజయవంతంగా ఎగురవేశామన్నారు. మరో 6 రాష్ట్రాల్లో హర్ శిఖర్ తిరంగాను అక్టోబర్ 15వ తేదీకి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్ అధిరోహకుడు ఆనంద్కుమార్, టూరిజం అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రతినిధి కుంతూరు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఫైనల్స్కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్షిప్స్లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
బేబీ టీమ్కు స్పెషల్ పార్టీ ఇచ్చిన అల్లు అరవింద్ (ఫోటోలు)
-
బిగ్ ట్విస్ట్.. మరోసారి శరద్ పవార్ను కలిసిన అజిత్ పవార్..
ముంబయి: మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్తో అజిత్ పవార్ కలిసిన విషయం తెలిసిందే. అయితే అజిత్ పవార్ వరుసగా రెండోరోజు శరద్ పవార్తో భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అజిత్ మాట్లాడుతూ.. కేవలం అశీస్సులు తీసుకోవడానికే శరద్ పవార్ను కలిశానని అజిత్ పవార్ చెప్పారు. #WATCH | NCP president Sharad Pawar arrives at Mumbai's YB Chavan Centre where Maharashtra Deputy CM Ajit Pawar and NCP MLAs of his faction are present to meet him. pic.twitter.com/hrx8S2mVTR — ANI (@ANI) July 17, 2023 ఏక్నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపిన అజిత్ పవార్ మంత్రి పదవులు స్వీకరించిన అభ్యర్థులతో కలిసి నిన్ననే శరద్ పవార్ను కలిశారు. కాగా.. నిన్న ఆదివారం అయినందున కొంత మంది రాలేకపోయారని నేడు సమావేశం అనంతరం మాట్లాడారు. శరద్ పవార్ తమ అభ్యర్థనలను మౌనంగా విన్నారని, ఏమీ మాట్లాడలేదని అజిత్ పవార్ చెప్పారు. నేడు మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశం జరిగింది. అయితే.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే ఉంటామని తీర్మాణం చేయాల్సి ఉంది. ఆ తీర్మాణాన్ని స్పీకర్కు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ మరోసారి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఢిల్లీలో ఎన్డీయే నిర్వహించనున్న సమావేశానికి అజిత్ పవార్ రేపు వెళ్లనున్నారు. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ సహా పలువురు నేతలు ఆదివారం ముంబైలో శరద్ పవార్ను కలిశారు. అయితే, శరద్ పవార్ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ పాటిల్ తదితరులు ఉన్నారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని కోరినట్టు పేర్కొన్నారు. ఇదీ చదవండి: NCP Leadership Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పవార్ రియాక్షన్? -
ఐఎఫ్ఎల్కి ధోనీనే కెప్టెన్: ఆనంద్ మహీంద్ర హిల్లేరియస్ ట్వీట్ వైరల్
పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన కొత్త పోస్ట్తో సంచలనం సృష్టించారు. అంతేకాదు స్టార్ క్రికెటర్ ఎంఎస్ధోనీపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు బిలియనీర్ ఆనంద్ మహీంద్రా. హిల్లేరియస్ ట్వీట్తో ట్విటర్లో పలు రకాల కామెంట్లతో నవ్వులు పూస్తున్నాయి. ఐపీఎల్, ప్రో కబడ్డీ తరహాలో ఇండియన్ ఫుడ్ లీగ్ ఉంటే..తాను మాత్రం ఆలూ పరాటా జట్టులో ఆడాలనుకుంటున్నా.. హా.. అన్నట్టు ఖచ్చితంగా ఈ టీంకి ధోనీ కెప్టెన్గా ఉండాలి. ఆ ఫుడ్ టీమ్లోనే తానూ చేరతాను అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కమెంట్లు వెల్లువెత్తాయి. వర్టిగో వారియర్ అనే ట్విటర్ హ్యాండిల్ 18 రకాల మోస్ట్ పాపులర్ వెజిటేరియన్ డిషెస్ ఆఫ్ ఇండియాఅనే పేరుతో కొన్ని చిత్రాలను షేర్ చేసింది. ఇది చూసి టెంప్ట్ అయిన ఆనంద్మహీంద్ర ఇలా సరదాగా కమెంట్ చేయడం వైరల్గా మారింది. ఇందులో ఇడ్లీ, ఆలూ పరాఠా, మసాలా దోశ, దాల్ టక్డా, పనీర్ టిక్కా, కిచిడీ, రాజమా చావల్, సమోసా పోహా, చనా మశాలా, పావు బాజీ , ఉప్మా, వడా పావ్, ఛోలే బటూరే, కఛోరీ లాంటి వంటకాలను పోస్ట్ చేసింది. దీనిపై ఆనంద్ మహీంద్ర పేర్కొన్న సరికొత్త ఇండియన్ ఫుడ్ లీగ్ పై తమదైన శైలిలో ట్వీపుల్ స్పందించారు. If there was an Indian Food League, like the @IPL or @ProKabaddi then I would want to be playing on the Aloo Paratha team….(Of course I would still want to join whichever food team @msdhoni was captain of…😃) https://t.co/GTveHVSqYx — anand mahindra (@anandmahindra) July 1, 2023 -
ఇవాళ తెలంగాణకు ఈసీ బృందం
-
బ్రూక్ దురదృష్టం ఆస్ట్రేలియా అదృష్టం
-
ఇదెక్కడి వర్క్ ఫ్రొం హోమ్ రా మామ...
-
గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఎవరు ఆస్థి ఎన్ని లక్షల కొట్లో తెలుసా..!
-
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
WTC ఫైనల్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుకంటే..!
-
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
ధూమ్ ధామ్ రసూల్ మాటలు వింటే మస్తు నవ్వుకుంటారు
-
ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
పాతికేళ్లకు క్రికెట్ ఏంట్రీ.. ఇంజనీర్ T20 బౌలర్
-
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
Spy Teaser Press Meet : ‘స్పై’టీజర్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
ధోనీని కలిసిన ఎలిఫెంట్ విస్పర్స్ చిత్రబృందం
-
ఒక ఎపిసోడేని మాత్రమే ఫ్రీగా ఎందుకు చూపిస్తున్నాం అంటే..
-
అఖిల్ బాబు కామెడీ అయ్య బాబోయ్..
-
యాంకర్ ప్రశ్నకి ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్
-
ఆర్ఆర్ఆర్ టీమ్ తో అమిత్ షా భేటీ రద్దు
-
ట్రిపుల్ ఆర్ టీమ్ తో అమిత్ షా భేటీ
-
లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ కొడుతున్నాం
-
రిపోర్టర్స్ ముక్కు సూటి ప్రశ్నలకు అఖిల్ స్మార్ట్ ఆన్సర్స్
-
శ్రీ వారి సేవలో శాకుంతలం మూవీ టీమ్
-
ఆగస్ట్ 16 1947 మూవీ టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
దసరా మూవీ టీమ్ కి తెలంగాణ దావత్
-
బలగం చిత్ర బృందాన్ని సన్మానించిన మంచు ఫ్యామిలీ (ఫొటోలు)
-
‘బలగం’ మొగిలయ్యను పరీక్షించిన ఎంజీఎం వైద్యబృందం
కాశిబుగ్గ: వరంగల్ సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న ‘బలగం’సినిమాలో నటించి, పాటతో మెప్పించిన మొగిలయ్యను ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని వైద్యబృందం శనివారం పరామర్శించింది. మొగిలయ్య దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ఇటీవల ‘ఆపదలో ఉన్నాం.. తోడుగా నిలవండి’ శీర్షికన ప్రచురితమైన మానవీయ కథనానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పందించారు. మొగిలయ్యకు ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని వైద్యబృందం, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ నాయక్లు సంరక్ష ఆస్పత్రికి చేరుకొని మొగిలయ్యను పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యసేవల గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మొగిలయ్య గత సెప్టెంబర్ నుంచి రెండు కిడ్నీలు పూర్తిగా పాడై ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చికిత్స పొందుతున్నాడని, ఇటీవల బీపీ, షుగర్ పెరిగి కంటి సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. ఇక్కడ వైద్యసేవలు బాగానే ఉన్నాయని, రోజూ దుగ్గొండి నుంచి రావాలంటే బస్సులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. వచ్చివెళ్లేందుకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి మొగిలయ్యకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, మరేమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, వారి రక్షణకు తెలంగాణ ప్రభుత్వం, తాము సిద్ధంగా ఉన్నామని మొగిలయ్య దంపతులకు సూపరింటెండెంట్ సూచించారు. సూపరింటెండెంట్ వెంట సంరక్ష వైద్యులు డాక్టర్లు మల్లేష్, దినేష్, సంరక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ నటరాజ్, డాక్టర్ భాస్కర్ ఉన్నారు. -
సీఎం జగన్ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం భేటీ
-
ఆస్కార్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ టీమ్ కి సీఎం జగన్ అభినందనలు
-
ఆస్కార్ వేడుకల్లో.. స్టార్ల సందడి (ఫొటోలు)
-
రాళ్లు రువ్వి దాడికి యత్నం..పోలీసులనే పరుగులు తీయించారు
ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందంటూ వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో వాటిని తొలగించేందకు పోలీసులు, జిల్లా అధికారులు వచ్చారు. ఐతే వారు ఆక్రమణలు తొలగించి పనిపూర్తి చేసుకుని వెళ్లిపోతుండగా.. ఒక గుంపు దాడికి తెగబడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలోని జితార్ ఖేడి గ్రామంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని తొలగించేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సంజయ్ సాహు నేతృత్వంలోని పోలీసులు బృందం గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించి వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా ఒక గుంపు వచ్చి పోలీసులుపై రాళ్లు రువ్వి.. దాడికి తెగబడ్డారు. ఆ గుంపులో మహిళలు, పిల్లలు తోసహా అధికారులపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో బుల్డోజర్లు, కార్లు ధ్వసం అయ్యాయి. ఈ దాడి నుంచి మేజిస్ట్రేట్ సాహును రక్షించేందుకు మరో పోలీసుల వాహనంలో తరలించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సమీపంలోని జితార్ ఖేడీ గ్రామంలోని అర బిఘా (6,000 చదరపు అడుగులు) ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు సాహు పేర్కొన్నారు. ఇంతకుమునుపు గతంలో ఈ భూమిలో అన్ని వర్గాల వారు కార్యక్రమాలు నిర్వహించేవారని, ఐతే ఆక్రమణలకు గురికావడంతో అన్నీ ఆగిపోయాయని గ్రామస్తులు చెబుతున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు సాహు నేతృత్వంలోని పోలీసుల బృందం ఆక్రమణలు తొలగించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆక్రమణలు తొలగించి పని పూర్తి చేసి వెళ్తుండగా దాడికి పాల్పడ్డారని పోలీసుల చెబుతున్నారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది తోసహా బుల్డోజర్ డ్రైవర్ కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చట్టాన్ని ఉల్లంఘి ఈ ఘటనకు పాల్పడిన వారందరికీ శిక్ష పడుతుందని అదనపు మెజిస్ట్రేట్ సంతోష్ ఠాగూర్ తెలిపారు. (చదవండి: ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం) -
అమరావతిలో చంద్రబాబు బృందం అక్రమాలు బట్టబయలు
-
కెప్టెన్సీ వద్దంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్స్ ..!
-
విజయవాడ, వైజాగ్లో సీతారామం టీమ్ సందడి (ఫొటోలు)
-
‘ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు’
లబ్బీపేట(విజయవాడతూర్పు): రైటర్ పద్మభూషణ్ చిత్రయూనిట్ ఆదివారం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మూవీ బృందం పాటను రిలీజ్ చేశారు. అనంతరం హీరో సుహాస్ మాట్లాడుతూ రైటర్ పద్మభూషణ్ అందరినీ అలరిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, షూటింగ్ మొత్తం విజయవాడలో తీశామని తెలిపారు. ఛాయ్ బిస్కట్స్ ప్రొడక్షన్స్ ద్వారా తాను చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యానన్నారు. చదవండి: ఎన్టీఆర్ 30: సెట్స్పైకి వచ్చేది అప్పుడే! ఇది ఒక డ్రామా చిత్రమని, సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుని బయటకు వెళ్తారన్నారు. మూవీ చూశాక వారం రోజులు మర్చిపోలేరని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రైటర్ పద్మభూషణ్ సినిమా నాకు చాలా స్పెషల్ అని, తాను పుట్టి పెరిగిన విజయవాడలో షూటింగ్ జరిగిందన్నారు. తాను చదువుకున్న కాలేజీ, భవానీ ఐలాండ్, గాంధీ హిల్స్ ప్రతిచోటా షూటింగ్ చేశామన్నారు. హీరోయిన్ టీనాకల్పరాజ్ మాట్లాడుతూ తమ జీవితంలో జరిగిన విషయాలు లాగానే ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయన్నారు. తనను దర్శకుడు బాగా ఎంకరేజ్ చేశారన్నారు. నిర్మాత శరత్ మాట్లాడుతూ ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. చిత్ర నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. -
విజయవాడలో సందడి చేసిన విరాటపర్వం మూవీ టీం
-
చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!
Scientists Discover Ants Can Identify Cancerous Cells: ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస్త్రవేత్తల బృందం నిరతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స, త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. తాజా అధ్యయనాల్లో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కునుగొన్నాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగో తెలుసా!. వివరాల్లోకెళ్తే..చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలవని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ పరిశోధనలుల చేయడానికి సిల్కీ చీమలు అని పిలిచే ఫార్మికా ఫుస్కా అనే చీమలను వినియోగించింది. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా శిక్షణ ఇచ్చింది. నిజానికి అవి తమ వాసన సాయంతోనే ఆహారాన్ని సంపాదించుకునే చీమలు మానవునిలోని క్యాన్సర్ కణాల నంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్ని నయం చేసే పద్ధతులను అన్వేషించే క్రమంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది మాత్రమే కాక తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చీమలకు తొలుత చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునే స్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని మానవుడిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉందని చ్పెపారు. అయితే ఈ మొదటి అధ్యయనం చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని తేలిందని అన్నారు. అంతేగాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై పరిశోధనలు చేస్తున్నారు. అయితే వాటికి మంచి ఘ్రాణ శక్తి కలిగి ఉందని తెలిపారు. పైగా కుక్కుల కంటే చాలా త్వరతిగతిన క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలు తీసుకోంటాయని అన్నారు. (చదవండి: చెర్నోబిల్లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్) -
టెస్లా ఆటో పైలెట్ టీమ్కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!
Elon Musk Said 1st Indian-Origin Employee On Teslas Autopilot Team: ప్రముఖ దిగ్గజ టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భారత సంతతి వ్యక్తి అయిన అశోక్ ఎల్లుస్వామిని తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీకి సంబంధించిన ఆటోపైలట్ టీమ్లో నియమించుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు. అంతేకాదు ఆటో పైలెట్ టీమ్ను ప్రారంబిస్తున్నానని, పైగా టీమ్లో నియమించబడిని తొలి భారతసంతతి వ్యక్తి అశోక్ అని కూడా తెలిపారు. (చదవండి: ఫుడ్ కంటైనర్లో స్పై కెమెరా!) ఈ మేరకు అశోక్ ఆటోపైలట్ ఇంజనీరింగ్ హెడ్గా పనిచేయనున్నట్లు మస్క్ చెప్పారు. పైగా టెస్లా ఆటోపైలెట్ బృందంలో చాలా ప్రతిభావంతులు ఉంటారని వాళ్లు ప్రపంచంలోనే తెలివైన వ్యక్తుల్లో కొందరని అన్నారు. అంతేకాదు అశోక్ని ఇంటర్వ్యూ చేసిన వీడియోని కూడా మస్క్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవలే టెస్లా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలను నేరుగా పరిష్కరించడంలో శ్రద్ధ వహించే హార్డ్కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజనీర్ల కోసం వెతుకుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అశోక్ ఎల్లుస్వామి వోక్స్వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్కి సంబంధించిన డబ్ల్యూబీఏసీఓ వెహికల్ కంట్రోల్ సిస్టమ్లో పనిచేశారు. ఆయన చెన్నైలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని , కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుండి రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని చేశారు. (చదవండి: ఫుల్గా తాగి సెక్యూరిటీ గార్డ్తో గొడవపడిన మహిళ) Elon on Teslas Autopilot team: Ashok is actually the head of Autopilot engineering. Andrej is director of AI; People often give me too much credit & give Andrej too much credit. The Tesla Autopilot AI team is extremely talented. Some of the smartest people in the world. @elonmusk pic.twitter.com/a6vJ64aphG — Sawyer Merritt (@SawyerMerritt) December 29, 2021 -
టైసన్ను 'ఢీ' కొట్టేందుకు రెడీ అంటున్న విజయ్.. లైగర్ టీమ్
-
Sreemoyee Piu Kundu: సింగిల్ ఉమెన్గా ఉండటానికి ఎన్నో కారణాలు.. అయితే
‘హాయ్ శైలి... ఇన్నాళ్ల తరువాత నిన్ను చూసే భాగ్యం కలిగింది. ఎలా ఉన్నావు?’ ‘నన్ను గుర్తు పట్టావా?’ ‘నాకు అక్కలాంటిదానివి నువ్వు. ఎందుకు గుర్తుపట్టను!’ ‘కొత్త ఇల్లు కొన్నందుకు శుభాకాంక్షలు భార్గవి. ఫొటోల్లో కంటే సన్నగా కనిపిస్తున్నావు. ఇలాగే బాగున్నావు’ ... ఇవి ఏ ఫంక్షన్ హాల్లోనో వినిపించిన మాటలు కాదు. ఈ హాల్లో వివాహ వేడుకలాంటిదేమీ జరగడం లేదు. అందరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు. అయితే ఎప్పుడూ ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఈ సమావేశానికి వచ్చిన వాళ్లు సింగిల్ ఉమెన్. వారు సింగిల్ ఉమెన్గా ఉండడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే వారందరిని ఒకటి చేసింది, ఒక కుటుంబంలా నిలిపింది స్టేటస్ సింగిల్. కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న సింగిల్ ఉమెన్స్ ఆన్లైన్ వేదికగా ఒక బృందంగా ఏర్పడ్డారు. కష్టాలు, సుఖాలు, సంతోషాలు, సలహాలు...ఒకరితో ఒకరు పంచుకునేవారు. తమ గ్రూప్ను మరింత బలోపేతం చేయడానికి ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కు నడిచొచ్చారు. అందరూ దిల్లీలో సమావేశం అయ్యారు. ‘ఒకరినొకరం ప్రత్యక్షంగా కలుసుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. కులం, మతం, ప్రాంతాలకు అతీతం గా మేమందరం ఒకే కుటుంబం అనే భావన కలిగింది’ అంటుంది రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమోయి కుందు. అలా వచ్చిందే ఈ పుస్తకం.. ‘స్టేటస్ సింగిల్’ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించింది. ‘రియల్ అకేషన్’ ‘హ్యాపియర్ టైమ్’ ‘యువర్ బిగ్డే’... తన ప్రతి పుట్టిన రోజు వేడుకల్లో తరచు వినిపించే మాటలు ఇవి. ఈసారి తన పుట్టిన రోజును ఒక వేడుకలా జరుపుకోకుండా, గుర్తుండి పోయే పని ఒకటి చేయాలనుకుంది. అలా వచ్చిందే ఆమె రాసిన ‘స్టేటస్ సింగిల్’ అనే పుస్తకం. దీని కోసం 30–40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్బన్ ఉమెన్స్ మూడువందల మందిని ఇంటర్వ్యూ చేసింది. వారి అనుభవాలను రికార్డ్ చేసింది. ఈ పుస్తకం సింగిల్ ఉమెన్ కష్టాలు, కన్నీళ్లనే కాదు... వారి పోరాట పటిమనూ కళ్లకు కట్టింది. సింగిల్ ఉమెన్పై రకరకాల అపోహలు ఉన్నాయి. వారికి కోపం ఎక్కువని. ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంటారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని... ఇలాంటి ఎన్నో అపోహలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. ‘నేను రాసిన పుస్తకం సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడకపోవచ్చు. స్ఫూర్తిదాయక పుస్తకం కాకపోవచ్చు. కానీ ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే అంతకంటే సంతోషం ఏముంటుంది’ అని కుందు చెబుతున్నప్పటికీ ఎంతోమంది సింగిల్ ఉమెన్కు ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా, సెల్ఫ్–హెల్ప్ బుక్లా ఉపయోగపడుతుంది. తర్వాత ఏమిటి మరి? ఢిల్లీలోనే కాదు దేశం నలుమూలలా ‘స్టేటస్ సింగిల్’ సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరికొకరు అండగా నిలవాలనేది లక్ష్యం. వారి లక్ష్యం ఫలించాలని ఆశిద్దాం. చదవండి: Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా మా కమ్యూనిటీలో -
చేతులు కలిపిన మేటా, మైక్రోసాఫ్ట్ ! వీడియో చాట్కి కొత్త సొబగులు
Meta Partnership With Microsoft: టెక్నాలజీ రంగంలో పరస్పరం పోటీ పడుతున్న ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్లు చేతులు కలిపాయి. కరోనాతో తలెత్తిన సంక్షోభ పరిస్థితులను మరింత చక్కగా వినియోగించుకునేందుకు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. నత్తనడకన వర్క్ప్లేస్ సోషల్ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్బుక్ ప్రస్తుతం మేటాగా పేరు మార్చుకుంది. అయితే మేటా వీడియో చాట్ యాప్గా వర్క్ప్లేస్ ఉంది. ఈ వీడియో చాట్యాప్ ద్వారా ఉద్యోగులు వర్చువల్గా పని చేసుకునే వీలుంది. మేటా ఆధ్వర్యంలో ఉన్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తరహాలో వర్క్ప్లేస్ పెద్దగా యూజర్ బేస్ సాధించలేక పోయింది. 2016 అక్టోబరులో వర్క్ప్లేస్ మార్కెట్లోకి వచ్చినా.. ఇప్పటి వరకు 7 మిలియన్లకు మించి పెయిడ్ యూజర్ బేస్ సాధించలేకపోయింది. లక్ష్యానికి దూరంగా మరోవైపు వీడియో చాట్ విభాగంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ టీమ్ యాప్ని అందిస్తోంది. వర్క్ప్లేస్తో పోల్చితే టీమ్ యాప్కి కస్టమర్ బేస్ ఎక్కువగానే ఉంది. 250 మిలియన్ల యాక్టివ్ మంత్లీ యూజర్లు ఈ యాప్కి ఉన్నారు. అయితే మైక్రోసాఫ్ట్ టీమ్ సైతం ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఎదగలేక పోయింది. ఈజీగా రెండు పనులు దీంతో వీడియో చాట్ విభాగంలో స్కైప్, జూమ్, గూగుల్ డుయోలకి పోటీగా మార్కెట్లో నంబర్ స్థానం లక్ష్యంగా మేటా, మైక్రోసాఫ్ట్లు జట్టు కట్టాయి. దీని ప్రకారం ఒకే యాప్లో ఉన్నప్పటికీ రెండు యాప్లలో ఉండే సౌకర్యాలను పొందవచ్చు. ఉదాహారణకు మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్లో ఉంటూనే వర్క్ప్లేస్ యాప్లో న్యూస్ ఫీడ్ను చూసుకోవచ్చు. నంబర్వన్ రోనా సంక్షోభం తర్వాత వీడియో చాట్ యాప్ల ప్రాముఖ్యత పెరిగిపోయింది. వర్చువల్ కాన్ఫరెన్సులు కామన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు యాప్లకు ఉన్న యూజర్ బేస్ను కాపాడుకుంటూ కొత్తగా వినియోగదారులను ఆకర్షించడం లక్ష్యంగా మైక్రోసాఫ్ట్, మేటాలు జట్టుకట్టాయి. వీడియో చాట్ విభాగంలో నంబర్ వన్ స్థానం లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. చదవండి:యాపిల్ ఎలక్ట్రిక్ కారు 3డీ మోడల్ చూస్తే మతిపోవాల్సిందే -
అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!
ఫిన్ల్యాడ్: మనం చాలా నిధుల గురించి విని ఉంటాం అయితే ఈ ఫిన్ల్యాండ్లోని లెమ్మిన్కైనెన్ అనే నిధి నిక్షేపం కోసం 30 ఏళ్లుగా పరిశోధిస్తునే ఉన్నారంటా. అంతేకాదు ఈ లెమ్మిన్కైనెన్ అనే నిధి కోసం "ట్వెల్వ్ టెంపుల్" పేరుతో పన్నెండు మంది బృందం 1987 నుండి అన్వేషిస్తోందట. (చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !) పైగా ఈ నిధిలో 1500 కోట్లు పైన ఉండచ్చని భావిస్తున్నారు. అంతేకాదు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వజ్రాలు, నీలమణులు, పురాతన కళాఖండాలు వంటివి 50వేలుకు పై చిలుకే ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వెయ్యేళ్లనాటి నిధిని చేధించేందకు ఈ పన్నెండు బృందాలు 30 ఏళ్లుగా అన్వేషిస్తునే ఉంది. ఈపరిశోధనల్లో భాగంగా వాళ్ల చాలా కష్ట నష్టాలను చవిచూశారు. అయితే ఇంతవరకు ఎవరు ఈ నిధిని కనుగొన లేకపోయారు. ఈ మేరకు ఆ పన్నెండు మంది బృందం తాము కొద్ది దూరంలో ఉన్నామని త్వరలోనే ఈ నిధిని కనుగొన గలమంటూ విశ్వాసం వ్యక్తం చేసింది. లెమ్మిన్కైనెన్ నిధి అన్వేషణాధికారి మాట్లాడుతూ...గణనీయమైన పురోగతి సాధించాం. త్వరలోనే మా బృందం ఆ నిధిని గుర్తించ గలదు" అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు) -
గ్రీన్ ఇండియా చాలెంజ్ : మొక్కలు నాటిన ‘మహా సముద్రం’ టీమ్
-
జబర్దస్త్ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
విజయవాడలో 'డియర్ మేఘ' టీం సందడి
-
ఆదిత్య 369 టీంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
-
సోషల్ మీడియా టీంతో YS షర్మిల భేటీ
-
మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని స్వదేశానికి రప్పించేందుకు మల్టీ-ఏజెన్సీ బృందం డొమినికాకు చేరుకుంది. "మిషన్ చోక్సీ" పేరుతో ఏర్పాటైన ఎనిమిది మంది సభ్యుల ఈ బృందానికి సీబీఐ అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న శారదా రౌత్ నేతృత్వం వహించడం విశేషంగా నిలిచింది. సీబీఐ, ఈడీ , సీఆర్పీఎఫ్ సభ్యులు ఈ బృందంలో భాగమని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీబీఐ బ్యాంకింగ్ మోసాలను విచారించే విభాగం చీఫ్ ముంబైకి చెందిన శారదా రౌత్ నేతృత్వంలోని ఈ బృందం రేపు (జూన్ రెండు) చోక్సీపై జరిగే కోర్టు విచారణకు హాజరవుతుంది. అక్కడ రాజకీయంగా దుమారాన్ని రేపిన ఈ కేసులో డొమినికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సహాయం చేయనుంది. అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే ఒక ప్రయివేట్ విమానం ద్వారా ఈ బృందం చోక్సీని వెనక్కి తీసుకురానుందని సమాచారం. డిల్లీలో విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణమే చోక్సీని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. సీబీఐ అధికారి శారదా రౌత్ (ఫైల్ ఫోటో) ఇది ఇలాఉంటే అందరూ భావిస్తున్నట్టుగా మే 25 న కాకుండా మే 23నే మెహు్ల్ చోక్సీ డొమినికాకు చేరుకున్నాడని ఆంటిగ్వా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అవుట్ బౌండ్ క్లియరెన్స్ పత్రం ద్వారా తెలుస్తోంది. సెయింట్ లూసియా ఆధారిత పడవ 'కాలియోప్ ఆఫ్ ఆర్నే' ద్వారా డొమినికాలో అడుగుపెట్టాడు. అక్కడినుంచి భారత్తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చెక్కెయ్యాలని ప్రయత్నించి చోక్సీ చివరికి బుక్కయి పోయాడు. కాగా నకిలీ పత్రాలు, పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై వేలకోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన కేసులో డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, అతని మేనమామ మెహెల్ చోక్సీ కీలక నిందితులుగా ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద కుంభకోణంగాఈ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత ఆంటిగ్వాకు పారిపోయి అక్కడి పౌరసత్వాన్ని అనుభవిస్తున్న మెహుల్ చోక్సీ ఇటీవల క్యూబాకు పారిపోతూ డొమినికాలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొమినికా పౌరసత్వంలేని చోక్సీని నేరుగా భారత్కు అప్పగించవచ్చని ఆంటిగ్వా ప్రకటించింది. చోక్సీ భారతదేశానికి తిరిగి వెళ్లాల్సిందే..అక్కడ నేరారోపణల విచారణను ఎదుర్కోవలసిందే అని ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ తేల్చి చెప్పారు. అలాగే చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించినందుకు చోక్సిని అదుపులోకి తీసుకోవాలని డొమినికన్ ప్రభుత్వాన్ని బ్రౌన్ కోరినట్లు ఆంటిగ్వా మీడియా వెల్లడించింది. మరోవైపు చోక్సీ భారత పౌరుడు కాదు కాబట్టి, చట్టబద్దంగా భారతదేశానికి తరలించలేరని చోక్సీ న్యాయవాది వాదిస్తున్నారు. అంతేకాదు కొన్ని రాజకీయ కారణాల రీత్యా బలవంతంగా డొమినికాకు చోక్సీని తీసుకెళ్లారని కూడా ఆరోపించారు. అటు చోక్సీ వ్యవహారం డొమినికాలో రాజకీయ వివాదానికి దారి తీసింది. అంతర్జాతీయంగా తమ ప్రతిష్ట దెబ్బదింటోందంటూ డొమినికా ప్రతిపక్ష నాయకుడు లెన్నాక్స్ లింటన్ ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెర్రిట్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చదవండి : Mehul Choksi: గర్ల్ఫ్రెండ్తో డిన్నర్కు వెళ్లి చిక్కాడు కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు -
నాంది టీం గుంటూరు సక్సెస్ టూర్ ఫోటోలు
-
హైదరాబాద్కు 64 దేశాల రాయబారుల బృందం
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు 64 దేశాల రాయబారులు బృందం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ బృందంలో పలు దేశాల హైకమిషనర్లు కూడా ఉన్నారు. వీరు ఎయిర్పోర్టు నుంచి శామీర్పేటలోని జీనోమ్ వ్యాలీకి మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఈ హైకమిషనర్, రాయబారుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయి కోవిడ్ 19 వ్యాక్సిన్పై పనిచేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, ఈ బయోలాజికల్స్ లిమిటెడ్ సంస్థలను సందర్శించి వ్యాక్సిన్పై చర్చించన్నారు. ఈ నేపథ్యంలో టీకాల పురోగతిని పరిశీలించి అనంతరం ఈ విదేశీ బృందం శాస్త్రవేత్తలతో భేటీ కానుంది. ఇక సమావేశం ముగిసిన తర్వాత సాయంత్ర 5:50 గంటలకు అంబాసిడర్, హైకమిషనర్లు తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. విదేశి పత్రినిధుల పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లు చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్లో ఉన్న విషయం తెలిసిందే. బయోలాజికల్ ఈ-సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్కు కేంద్ర గత నెలలలో అనుమతిచ్చింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్కు వచ్చి భారత్ బయోటెక్ను సందర్శించిన విషయం తెలిసిందే. -
ఆసీస్ను నిలువరించిన భారత్
టోక్యో: ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ను 2–2తో ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున వందన కటారియా (36వ నిమిషంలో), గుర్జీత్ కౌర్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఆస్ట్రేలియా జట్టుకు కైట్లిన్ నోబ్స్ (14వ నిమిషంలో), గ్రేస్ స్టీవార్ట్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇదే టోర్నీలో భారత పురుషుల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 1–2తో ఓడిపోయింది. రెండో నిమిషంలో హర్మన్ప్రీత్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కివీస్ ప్లేయర్ జేకబ్ స్మిత్ 47వ నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. చివరి నిమిషంలో స్యామ్ లేన్ గోల్ సాధించి న్యూజిలాండ్ విజయాన్ని ఖాయం చేశాడు. -
శక్తి టీం వాహనాలను ప్రరంభించిన ఐజీ మీనా
-
వెడ్డింగ్ ఎప్పుడు
-
క్రికెటర్ తండ్రి దారుణ హత్య
కొలంబో: శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ(26) తండ్రి రంజన్ డిసిల్వ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రంజన్ అక్కడిక్కడే మృతి చెందారు. తండ్రి మరణం నేపథ్యంలో వెస్టిండీస్ టూర్ నుంచి డిసిల్వ తప్పుకున్నాడు. 62 ఏళ్ల రంజన్ అలియాస్ మహథున్, దేహివాలా-మౌంట్ లావినియా మున్సిపల్ కౌన్సిలర్. జ్ఞానేంద్ర రోడు వద్ద రాత్రి 8గం.30ని. సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, ఇప్పటిదాకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారంటున్నారు. తండ్రి దుర్మరణంతో శుక్రవారం వెస్టిండీస్ టూర్కు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనంజయ డిసిల్వ తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎవరినీ తీసుకోబోతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్టు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే గాయం కారణంగా ఓపెనర్ దిముత్ కరుణరత్నే విండీస్ టూర్కు దూరం అయ్యాడు. కాగా, జూన్ 6 నుంచి వెస్టిండీస్తో శ్రీలంక జట్టు మూడు టెస్టులు ఆడనుంది. -
స్టన్నింగ్ బంతులతో బిత్తరపోయారు
సాక్షి, స్పోర్ట్స్ : పాకిస్థాన్ జట్టు మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రీది బంతితో తన సత్తా చాటాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాళ్లను తన లెగ్ స్పిన్తో బెంబేలెత్తించాడు. అద్భుత బంతులతో మూడు కీలక వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం దుబాయ్లో ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కరాచీ జట్టు 188 పరుగులు సాధించింది. తర్వాత 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముల్తాన్ జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అఫ్రీది బౌలింగ్తో బరిలోకి దిగాక మ్యాచ్ సమీకరణాలు మొత్తం మారిపోయాయి. పోలార్డ్, షోయబ్ మాలిక్, సైఫ్ బాబర్ వంటి కీలక బ్యాట్స్ మన్లను పెవీలియన్కు చేర్చాడు. ముఖ్యంగా పోలార్డ్.. అఫ్రీది వేసిన బంతి స్వింగ్ అయి వికెట్లను తాకటంతో ఆశ్చర్యపోయాడు. అఫ్రీది నాలుగు ఓవర్లలో(ఒక మెయిడెన్) కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి సుల్తాన్స్ జట్టు దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ దఫా పీఎస్ఎల్ లో అఫ్రీది బ్యాటింగ్ కన్నా బౌలింగ్ తోనే రాణిస్తుండటం విశేషం. అఫ్రీది క్షమాపణలు... ఆల్ రౌండర్ సైఫ్ బాదర్ ను అవుట్ చేశాక అఫ్రీది కాస్త దురుసుతనం ప్రదర్శించాడు. అనుచిత వ్యాఖ్యలు చేయటంతో సోషల్ మీడియాలో ఈ సీనియర్ ఆటగాడి తీరుపై విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ బాదర్ ఈ వీడియోకు స్పందిస్తూ... ఇప్పటికీ నువ్వంటే ఇష్టం షాహిద్ భాయ్ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో బాదర్కు క్షమాపణలు చెబుతున్నట్లు అఫ్రీది ప్రకటించటంతో వివాదానికి తెర పడింది. One of the best balls of the Pakistan Super League. Shahid Afridi to Kieron Pollard #PSL2018 #KKvMS pic.twitter.com/HtYI3BjMeC — Saj Sadiq (@Saj_PakPassion) 10 March 2018 Shahid Afridi's send off to young Saif Badar. There's a lot of discussion going around regarding it, What's your thought on it..? #MSvKK #KKvMS pic.twitter.com/WV4fEoaeEs — Saad IU/LQ 🇵🇰 (@SaadAwais22) 10 March 2018 -
కఠోర శ్రమతోనే విజయం సాధ్యం
ఒలింపిక్ మెడల్ విజేత సింధు వైభవంగా షీ టీమ్ ప్రథమ వార్షికోత్సవం తాడితోట/(రాజమహేంద్రవరం సిటీ) : కఠోర శ్రమతోనే విజయం సాధ్యమని ప్రముఖ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడల్ విజేత పీవీ సింధు అన్నారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన శనివారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని షీ టీమ్ ప్రథమ వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షీ టీమ్ సభ్యులు వాట్సప్, మెయిల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై క్షణాలలో రక్షణ కల్పించడం అభినందనీయమని కితాబు ఇచ్చారు. షీ టీమ్ వల్ల మహిళలకు భద్రత, రక్షణ కలుగుతుందని, ఈ టీమ్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని సూచించారు. యువత స్ఫూర్తిగా తీసుకోవాలి.. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ పీవీ సింధును స్ఫూర్తిగా తీసుకొని యువత విజయం సాధించాలని యువతకు సూచించారు. స్త్రీలు ఎక్కడ గౌరవించిన చోటే దేవతలు ఉంటారన్న ఆరోక్తిని ప్రస్తావించారు. మహిళలపై దాడులు, వేధింపులను అరికట్టాలనే లక్ష్యంతో షీ టీమ్ ఏర్పాటు చేశామని, ఈ ఏడాదిలో సుమారు మూడు వేలకు పైగా యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. షీ టీమ్ ఏర్పాటుతో నగరంలోని మహిళలకు భరోసా ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా షీ టీమ్ తరఫున యాప్ను ప్రారంభించారు. పిల్లలపై బాధ్యతగా వ్యవహరించాలి... సింధు తండ్రి రమణ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తమ పిల్లల్ని ఏం చేస్తున్నారో ఒక కన్ను వేసి ఉంచాలని సూచించారు. తాము బాధ్యతగా వ్యవహరించడం వల్లే సింధు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిందని అన్నారు. తొలుత సింధును మధురపూడి విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా ఆనం కళాకేంద్రానికి తీసుకువచ్చారు. షీ టీమ్ అధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలు, షటిల్ బ్యాడ్మింటెన్ పోటీలలో విజేతలకు సింధూ బహుమతులు అందజేశారు. సింధుకు ఘన సత్కారం ఈ సందర్భంగా సింధూను ఘనంగా సత్కరించారు. షీ టీమ్ సభ్యులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సిరి ఆనంద్, ప్రభుత్వ హాస్పిటల్ ఆర్ఎంఓ పద్మశ్రీ,, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మ, భవాని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు ఆదిరెడ్డి భవాని, బి.సత్యకుమారి, ఆర్.చంద్రకళ, అడిషినల్ ఎస్పీలు ఆర్.గంగాధరరావు, రజనీకాంత్రెడ్డి, డీఎస్పీలు కులశేఖర్, రామకృష్ణ, రమేష్ బాబు, శ్రీనివాసరావు, వైవీ రమణరావు, సీఐలు రవీంద్ర, మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు. -
అల్యూమిల్తో వేల్యూలైన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ శానిటరీ ఉత్పత్తుల సంస్థ వేల్యూలైన్ తాజాగా గ్రీస్కి చెందిన అల్యూమినియం ఉత్పత్తుల దిగ్గజం అల్యూమిల్తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద అల్యూమిల్ ఉత్పత్తులను వేల్యూలైన్ భారత మార్కెట్లో అందిస్తుంది. ముడి సరుకును దిగుమతి చేసుకుని స్థానిక అవసరాలకు తగినట్లుగా తమ ప్లాంట్లో ఫ్యాబ్రికేషన్ చేసి అందించనున్నట్లు గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వేల్యూలైన్ సీఎండీ నరీందర్ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా నిర్మాణాల్లో అల్యుమినియం వినియోగం గణనీయంగా పెరుగుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో తమ ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి మై హోమ్, ఫీనిక్స్ కన్స్ట్రక్షన్స్ తదితర రియల్టీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఆనంద్ ఈ సందర్భంగా చెప్పారు. కాగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాల్లో ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు అల్యూమిల్ చైర్మన్ జార్జ్ అలెక్స్ మిలోనాస్ తెలిపారు. అంతర్జాతీయంగా అల్యూమినియం ఆర్కిటెక్చర్ పరిశ్రమలో ప్రీమియం సెగ్మెంట్లో వార్షిక వినియోగం 2 లక్షల పైగా టన్నులు ఉంటోం దని, ఇందులో తాము దాదాపు 35,000 టన్నుల మేర ఉత్పత్తుల్ని అందిస్తున్నామని తెలిపారు. భారత్లో మూడేళ్ల నుంచీ తమ కార్యకలాపాలున్నాయని, డిమాండ్ను బట్టి ఇక్కడా తమ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారాయన. -
ఒకే గడ్డ నుంచి ఒకే జట్టుగా..
-ఖోడినార్ నుంచి ‘సాయి’ జట్టుకి ఎంపికైన ఏడుగురు యువతులు -వాలీబాల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణింపు అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) : ఇప్పుడంతా చదువుల యుగం. చదువులు దెబ్బ తింటాయని పాఠశాల, కళాశాల స్థాయిలో బాలురనే ఆడించడం లేదు. కానీ ఆ గ్రామం అందుకు భిన్నం. ఆటలు ఆడితేనే బంగారు భవిష్యత్ ఉంటుందని నమ్మిన గ్రామస్తులు బాలురనే కాదు.. బాలికలను కూడా ఆటల్లో ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఆ గ్రామానికి చెందిన ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా ఏడుగురు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆ గ్రామమే గుజరాత్ రాష్ట్రంలోని సోమనా«ద్ జిల్లాలోని ఖోడినార్. ఈ గ్రామానికి చెందిన ఏడుగురు క్రీడాకారిణులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి)కి ఎంపికై గొల్లవిల్లిలో జరుగుతున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఒకే గ్రామం నుంచి ఏడుగురు ఒక జట్టుకు ఎంపిక కావడం, రాణించడం అరుదైన విషయం. కోచ్ వర్ధన్వాలా శిక్షణలో తామంతా వాలీబాల్లో రాణిస్తున్నామంటున్న వీరంతా ఇంటర్నేషనల్, నేషనల్ పోటీల్లో అవార్డులు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ పోటీల్లో ఆడా.. విద్యతో పాటు వాలీబాల్పై మక్కువ పెంచుకుని తర్ఫీదు పొందాను. రెండు పర్యాయాలు థాయ్లాండ్లో జరిగన ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొన్నాను. ఆర్ట్ స్టూడెంట్గా ఉన్నతవిద్యభ్యసించి స్థిరపడాలని, అంతర్జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నా స్నేహితులు క్రీడాకారులు కావడంఅదృష్టం. – చేతన్ గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నా.. నేషనల్ సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి, ఇంటర్నేషనల్ ప్లేయర్గా గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నా. ఖోడినార్ ప్రాంతం నుంచి నాతో పాటు ఏడుగురం వాలీబాల్లోనే రాణిస్తున్నాం. కోచ్ సూచనలు, సలహాలతో నిరంతర సాధన చేస్తున్నాం. అటు చదువు, ఇటు క్రీడ రెండింటిలో గుర్తింపు తెచ్చుకోవాలని టీం వర్క్ చేస్తున్నాం. – అస్మిత -
చిట్టి దేశం.. ‘బీటీ’ని పాతరేసింది!
• ఆఫ్రికాలోని బుర్కినాఫాసో విజయగాథ • నల్లగొండ రైతుల ఆత్మహత్యలను అధ్యయనం చేసి మేల్కొన్న తీరు • పడగవిప్పిన మోన్శాంటోకు వణుకు పుట్టించిన వైనం • మహిళా రైతుల విజయగాథపై అధ్యయనం కోసం మళ్లీ వచ్చిన బృందం సాక్షి, హైదరాబాద్: నల్లగొండ, ఆఫ్రికాలోని బుర్కినాఫాసో దేశం.. ఈ రెండింటికీ ఓ అవి నాభావ సంబంధం.. ఇది ఆ దేశ రైతులను రక్షించిన అనుబంధం.. చిత్రంగా ఉన్నా ఇది నిజం. బుర్కినాఫాసో మన ఉమ్మడి ఏపీ విస్తీర్ణం కంటే చిన్న దేశం. జనాభా కోటీ డెబ్బై లక్షలు. కానీ ప్రపంచాన్ని గుప్పిట్లో ఉంచుకున్న బహుళజాతి కంపెనీ మోన్శాంటోను తరిమి కొట్టింది. బీటీ విత్తనాలతో రైతుల ఉసురు తీస్తున్న ఆ కంపెనీని జాడ లేకుండా వెళ్లగొట్టింది. ఆ దేశ సాగు విస్తీర్ణంలో 75 శాతం మోన్శాంటో విత్తనాలే ఉన్న స్థాయి నుంచి రెండేళ్లలో ఒక్క బీటీ విత్తనం కూడా కనిపించని స్థితికి రాగలిగింది. నల్లగొండ జిల్లా పత్తి రైతుల ఆత్మహత్యలకు బీటీ పత్తి కారణమన్న విషయం తెలుసుకోవడమే వారి విజయానికి కారణం. రైతుల ఆత్మహత్యల ప్రస్తావన రాగానే తెలంగాణ పేరు వినిపిస్తుం ది. సరైన దిగుబడి లేక, అప్పు తీర్చే మార్గం కానరాక రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇక్కడ నిత్యం కనిపిస్తుంటాయి. వీరిలో ఎక్కువ శాతం బీటీ పత్తి సాగుచేసే రైతులే. పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంద ని, చీడపీడలు ఆశించవని ఎన్నో ఆశలతో బీటీ పత్తి సాగు చేస్తున్న రైతులు.. ఆశించిన దిగు బడి లేక అప్పుల పాలై, అవి తీర్చలేక ప్రాణా లు తీసుకుంటున్నారు. కానీ ఈ పరిస్థితి నుంచి బుర్కినాఫాసో బయటపడింది. మెల్లమెల్లగా విస్తరించిన ‘బీటీ’భూతం బుర్కినాఫాసో ప్రధాన ఆదాయ వనరు పత్తి. నాణ్యమైన పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తుం ది. అలాంటి ఆ దేశంలోకి 2002లో మోన్శాం టో అడుగుపెట్టింది. బీటీ పత్తి విత్తనాలతో దిగుబడి పెరగడంతోపాటు సాగు ఖర్చు తగ్గు తుందంటూ ప్రచారం చేసింది. అక్కడి అధికా రులు, దళారులను మచ్చిక చేసుకుని రైతుల కు బీటీ విత్తనాలు అంటగట్టింది. పత్తి సాగును తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. అక్కడ 10 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుండగా.. 7.5 లక్షల హెక్టార్లలో బీటీ పత్తి వేయడం గమనార్హం. కానీ కొద్దికాలంలోనే ఆ విత్తనాల డొల్లతనం బయటపడింది. చీడపీడలు ఆశించి, ఎరువుల ఖర్చు పెరిగిం ది. నాణ్యత దెబ్బతిని, దిగుబడి తగ్గింది. దీంతో ఎగుమ తులు తగ్గి, ఉపాధి దెబ్బతిన్నది. ‘నల్లగొండ’ను చూపిన కెనడా సంస్థ కెనడాకు చెందిన ‘ఇంటర్ పారెస్’ అనే సంస్థ జన్యుమార్పిడి వంగడాల దుష్పరిణామాలపై అధ్యయనం చేస్తూ, సదస్సులు నిర్వహిస్తుం టుంది. ఆ సదస్సులకు తెలంగాణకు చెందిన ‘దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ’ ప్రతినిధులు హాజరయ్యారు. బీటీ పత్తి సాగుతో నష్టపోతు న్న తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్ప డుతున్న విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ పారెస్ ప్రతినిధి ఎరిక్.. ఓ అధ్యయనంలో భాగంగా బుర్కినాఫాసో వెళ్లినప్పుడు అక్కడి రైతు సంఘాలకు వివరించారు. దాంతో బుర్కినాఫాసో రైతు సంఘం నేత ఉమారూ నేతృత్వంలో ఓ బృందం 2012, 2014ల్లో నల్లగొండ జిల్లాకు వచ్చి పరిశీలించింది. ఆత్మ హత్య చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను సంప్రదించింది. బీటీ పత్తి కారణంగా జరిగిన నష్టం, బాధలు తెలుసుకుంది. తమ దేశంలో ఇలాంటి దుష్పరిణామాలు నెలకొనకుండా మోన్శాంటోను తరిమికొట్టాలని నిర్ణయించు కుంది. అక్కడి 250 సంఘాలతో సంఘటిత శక్తిగా మారిన రైతులు.. బీటీ పత్తిపై పోరాటం ప్రారంభించారు. వారి ప్రభుత్వం కూడా దిగి రావడంతో మోన్శాంటో బుర్కినాఫాసో నుంచి పలాయనం చిత్తగించింది. ఆ కంపెనీ విత్తనాల వల్ల ఒకే ఏడాది దాదాపు రూ.650 కోట్లకుపైగా నష్టాలు వచ్చాయని, ఆ మేరకు కంపెనీ తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ బుర్కినాఫాసో రైతులు ఫ్రాన్స్లోని కోర్టులో వ్యాజ్యాలు నడుపుతున్నారు. మళ్లీ తెలంగాణ పర్యటనకు.. బీటీ పత్తి దుష్పరిణామాలపై కళ్లు తెరవడానికి తెలంగాణ పర్యటన కారణం కావడంతో బుర్కినాఫాసో దేశ రైతు సంఘాలు ఈ ప్రాంతంపై సానుభూతితో ఉన్నాయి. తాజాగా ఇక్కడి మహిళా రైతులు, సంఘాల విజయగా«థను పరిశీలించి బుర్కినాఫాసోలో అమలు చేసేందుకు మరోసారి తెలంగాణకు వచ్చాయి. ఇంటర్ పారెస్ సంస్థ ప్రతినిధి ఎరిక్ ఆధ్వర్యంలో బుర్కినాఫాసోకు చెందిన కాడిడ్జ్ కోన్, ఘనాకు చెందిన ఆస్సటా యట్టారా, సెనెగల్కు చెందిన ఫాటో సా తదితరులు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి వచ్చారు. ఆ సంస్థ డైరెక్టర్ సతీశ్ ఆధ్వర్యంలో సాగులో మహిళల పాత్ర, మహిళా సంఘాల ప్రాధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం హైదరా బాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. పశ్చిమాఫ్రికా దేశాల్లోని మహిళలు వ్యవసాయంలో చురుగ్గా లేరని, తెలంగాణలోని పరిస్థితుల అధ్యయనం తర్వాత తాము ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుంటామని తెలిపారు. రైతులు మేల్కొనాలి ‘బుర్కినాఫాసో విజయాన్ని చూసి తెలంగాణ రైతాంగం మేల్కొనాలి. వెంటనే బీటీ పత్తి సహా ఇతర జన్యుమార్పిడి వంగడాల వాడకం మానుకుంటేనే మనుగడ ఉంటుంది. సాధారణంగా పరిస్థితులు కార్పొరేట్ కంపెనీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఆఫ్రికా రైతులు దాన్ని అధిగమించి జీవితాలను బాగు చేసుకున్నారు. ఇక్కడ కూడా రైతులు బీటీ సాగును వదిలించుకుంటేనే మేలు కలుగుతుందని గుర్తించాలి..’’ – సతీశ్, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ -
చర్మానికి మనసుంది!
స్కిన్ అండ్ స్ట్రెస్ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ చర్మానికే ఉన్నట్లున్నాయి. వాతావరణం మారితే... చర్మం మారుతుంది. మనసు మారితే కూడా... చర్మం మారుతుంది. ‘‘హలో... మనసు మారితే చర్మం మారడమేంటి? చర్మానికి ఏమైనా ఆలోచన ఉంటుందా?’’ అని అడిగితే... ‘‘అవును’’ అంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి వల్ల... చర్మానికీ సమస్యలు వస్తాయని నిర్ధారణ అయ్యింది. నిజమే... చర్మానికీ మనసుంది! ఉద్యోగులంతా ఏకాగ్రతతో తమ పనులు కొనసాగిస్తున్నారు. ఎంత వేగంగా చేసినా కొండంత లక్ష్యంలో కొంతైనా పూర్తవుతుందా అన్నది సందేహమే. ఆఫీసులో ఉన్నది – గంటలు కొట్టే గడియారం. అదృష్టవశాత్తూ ఒంటి గంట కావొస్తోంది. ఇందాక 12 గంటల సమయంలో ఒక్కో గంటా టార్గెట్స్ను గుర్తు చేసింది. ఒక గంట కంటే మరో గంట మరింత కర్ణకఠోరంగా మోగుతూ 12 వార్నింగులిచ్చింది. కానీ ఇప్పుడు మోగబోయేది కేవలం ఒక గంటే కదా అనుకున్న స్టాఫ్కు ఆ గంటా అంత సాంత్వన ఇవ్వలేదు. పన్నెండు గంటలు కలిపి కొడితే ఎంత శబ్దం వస్తుందో... ఆ ఒక్క గంటతోనే అంతటి వార్నింగ్! అలా మరో మూడు, నాలుగు గంటలు గడిచాయి. ఉద్విగ్నపూర్వకంగా సీట్లలో ఇబ్బందిగా కదిలారు సిబ్బంది. పాక్షికంగానైనా పూర్తయిన లక్ష్యాల మాట ఎలా ఉన్నా... ఒక్కోక్కరికి ఒంటిపై ఒక్కో లాంటి రిజల్ట్! ఒకరిద్దరికి ఫేస్పై మొటిమలు పొటమరించాయి. మరొకరి ముఖం రాష్తో ఎర్రబారింది. ఇంకొకరు తలపై జుట్టు పీక్కున్నారు. మరికొందరి నోళ్లలో పొక్కులు కనిపించాయి. అవును. ఇది నిజం. మానసిక ఒత్తిడి తాలుకు ప్రభావాలు ఇలా చర్మంపై రకరకాలుగా ఉంటాయి. ఇక దీర్ఘకాలంలో మరికొందరికి జట్టు రాలిపోతుంది. కొందరిలో గోళ్లూ ప్రభావితమవుతాయి. ఇరువైపులా నలిగిపోయే చర్మం... చర్మం... కోటి కాంతిపుంజాల నుంచి మొదలుకొని కొండంత రేడియేషన్ కిరణాల వరకు ఎన్నెన్నో తాకిడులనూ, కాలుష్యాలనూ ఎదుర్కొనేందుకు... ప్రతి మనిషికీ ప్రకృతి ఏర్పాటు చేసిన తొలి స్వాభావిక కవచం – మన చర్మం. పర్యావరణపరంగా బాహ్యం నుంచే కాకుండా ఒత్తిడీ, మానసిక వేదనల కారణంగా లోపలి నుంచి తాకిడి ఉండటంతో – ఇలా ఇరువైపులనుంచీ నలిగిపోతుంది చర్మం. మానసిక ఒత్తిళ్లు, తీవ్రమైన స్ట్రెస్ కారణంగా చర్మంపై పడే దుష్ప్రభావాలేమిటి, వాటిని అధిగమించడమెలాగో తెలుసుకుందాం. చర్మంపై నేరుగా... మొటిమలు: తీవ్రమైన మానసిక ఒత్తిడి అనే అంశం చర్మంపై మొటిమలను పెంచుతుంది. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే కొందరిలో మొటిమలు ఎక్కువగా వస్తాయని స్పష్టంగా తెలిసింది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం ఒత్తిడి పెరిగినప్పుడు సెబేషియస్ గ్లాండ్స్ ప్రభావితమై, అవి తీవ్రంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. (హైపర్ యాక్టివ్ అవుతాయి). ఆ గ్రంథుల్లోంచి ‘సెబమ్’ అనే నూనె వంటి పదార్థం స్రవిస్తుంది. అయితే ఈ గ్రంథుల చివర్లలో ఉన్న కణజాలం మృతి చెంది, ఆ నూనె వంటి పదార్థాన్ని బయటకు రాకుండా ఆపినప్పుడు, నూనె గ్రంథి మూసుకుపోయి మొటిమ వస్తుంది. ఒత్తిడితో చర్మానికి జరిగే అనర్థమిది. రోజేషియా: తీవ్రమైన ఒత్తిళ్ల కారణంగా చర్మంలోకి కొంత భాగం ఎర్రబారడాన్ని రోజేషియా అంటారు. రొజేషియా కండిషన్లో చర్మం ఎర్రగా, ఉబ్బెత్తుగా మారి ముక్కుకు ఇరువైపులా బుగ్గలపై మొటిమలు ఏర్పడతాయి. ఇలాంటివి మెడ, ఛాతీపైన కూడా కనిపిస్తాయి. అలాగే కోపోద్రిక్తతలు, తీవ్రమైన అవమానం, తీవ్రమైన అసహనం (ఇరిటేషన్), తీవ్రమైన విచారం, ఉద్విగ్నతకు లోనుకావడం (యాంగై్జటీ), వ్యాకులతకు లోనవ్వడం (డీ–మోటివేషన్), ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమయ్యేంతగా ఉద్రిక్తత (అగ్రెసివ్నెస్), తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన అలసట... ఇలాంటి ఎన్నో భావోద్వేగాలు మేని (ముఖ్యంగా ముఖంపైన ఉండే చర్మం) రంగును ఎర్రగా మారుస్తాయి. ఒత్తిడి తొలగినప్పుడు ఈ రంగు కూడా తొలగుతుంది. సొరియాసిస్ : అప్పటికే సొరియాసిస్ ఉన్నవారు... ఒకవేళ తీవ్రమైన (మానసిక, శారీరక) ఒత్తిళ్లకు లోనైతే వారి సొరియాసిస్ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. ఒత్తిడి సొరియాసిస్ రూపంలో వ్యక్తమైనప్పుడు చర్మంపై అవాంఛిత లక్షణాలు కనిపిస్తాయి. అవి... ⇔ దురద, పొడిబారడం, పొలుసుల్లా రాలడం ⇔ సొరియాసిస్ ఉన్నవారికి చర్మంపై ఎర్రటి మచ్చలు ఎక్కడైనా రావచ్చు. ⇔ వెండిలా మెరుస్తున్నట్లుండే మచ్చలు కనిపించచ్చు. ⇔ పురుషుల్లో మర్మావయవాల వద్ద పుండ్లు పడచ్చు. ⇔ కీళ్లనొప్పులు ⇔ మాడుపై తీవ్రమైన చుండ్రు ⇔ ఒక్కోసారి ఈ మచ్చలు వచ్చిన భాగంలో వాపు, నొప్పి వంటివి కనిపించవచ్చు. సెబోరిక్ డర్మటైటిస్ : కొంతమందిలో తీవ్రమైన ఒత్తిడి వల్ల మాడుపై చర్మం పొలుసుల్లా రాలిపోతూ ఉంటుంది. ఇది పొట్టులా పొడిగా కాకుండా, జిడ్డుగా రాలుతుంది. తలపై చర్మం ఎర్రబారి ర్యాష్లా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సొరియాసిస్, లేదా ఎగ్జిమాను పోలి ఉన్నప్పటికీ ఇది వేరు, పగుళ్లలా, పొలుసులు రాలినట్లుగా ఉండే ఈ కండిషన్ మాడుపైనే గాక... శరీరంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దీని తీవ్రత మరింత పెరుగుతుంది. సాధారణంగా ఒత్తిడి తొలగినప్పుడు ఈ సమస్య కూడా తగ్గుతుంది. ఎగ్జిమా : తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల వల్ల సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల వారిలో వచ్చే ప్రధాన సమస్య ఎగ్జిమా. ఈ వయసు వారిలో తమ వృత్తికి సంబంధించిన, ఇతరత్రా ఒత్తిళ్లు ఎక్కువ. అప్పటికే ఎగ్జిమాతో బాధపడేవారికి దీని తీవ్రత మరింత ఎక్కువవుతుంది. ఇక ఒకేచోట కూర్చొని పనిచేసే ఐటీ ఉద్యోగుల వంటివారిలో చర్మానికి ‘న్యూరో డర్మటైటిస్’ అనే ఎగ్జిమా రావచ్చు. ఇంకా అటోపిక్ డర్మటైటిస్ అనే ఎగ్జిమా ఉండే పిల్లల్లో ఒత్తిడి వల్ల ఆ జబ్బు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎగ్జిమా నివారణ, చికిత్స : ⇔ సువాసన లేని, అలర్జీ రహిత (హైపో అలర్జిక్) మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి. ⇔ దురద ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు వాటిని తగ్గించే పూత మందులు వాడాలి. ⇔ ఈ వయసువారు తప్పక వ్యాయామం చేయాలి. విటిలిగో : తమ రోగనిరోధక శక్తి తమపై ప్రతికూలమైన ప్రభావం చూపడం వల్ల బొల్లి సమస్య వస్తుంది. ఇలా అప్పటికే బొల్లి ఉన్నవారిలో మానసిక ఒత్తిడి మరింత పెరిగితే ఆటోమేటిగ్గా బొల్లి తీవ్రత పెరుగుతుంది. బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచ్లలా కనిపిస్తాయి. ఈ మచ్చల్లో ఎలాంటి నొప్పీ ఉండదు. వీటితో ఆరోగ్యానికి హాని కూడా ఉండదు. కానీ చూడటానికి ఇది అంతగా బాగుండదు. కాబట్టి దీన్ని ఎవరూ కోరుకోరు. ఇంగ్లిష్లో దీన్ని విటిలిగో అంటారు. సాధారణ ఒత్తిడికి తోడు... దాని వల్ల చర్మంపై వ్యక్తమైన బొల్లి వల్ల రోగులు మరింతగా మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. జుట్టు మీద... నిరంతర మానసిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం: నిరంతర మానసిక ఒత్తిడి వల్ల చర్మంపై పడే తొలి దుష్ప్రభావం... దానిపైన ఉండే వెంట్రుకలను రాలిపోయేలా చేస్తుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోవడానికి వెంట్రుక పెరుగుదల దశలు కొంత ఉపకరిస్తాయి. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలుంటాయి. ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోవడం అన్నది సాధారణంగా టిలోజెన్ దశలో జరుగుతుంటుంది. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే జుట్టు ఏ దశలో ఉన్నప్పటికీ... అది ఊడిపోయే దశ అయిన టిలోజెన్ వైపునకు ప్రస్థానం జరుగుతుంది. టిలోజెన్ దశ దీర్ఘకాలం కొనసాగుతుందన్నమాట. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఒత్తిడితో ఉండే వారి మాడుపైన ఉండే జుట్టు దువ్వుకుంటున్నప్పుడు సాధారణం కంటే ఎక్కువగా రాలిపోతుంటుంది. స్నానం చేసే సమయంలోనూ బాత్రూమ్ ఫ్లోర్లోనూ, తూము దగ్గర కుచ్చులు కుచ్చులుగా రాలిపడుతుంది. అరికట్టడం ఇలా : ఒత్తిడి తొలగిపోయాక కేవలం ఒత్తిడి కారణంగానే రాలిపోయిన జుట్టు మళ్లీ మొలుస్తుంది. ఒత్తిడితో జుట్టు పీక్కోవడం మరీ ఒత్తిడిని తట్టుకోలేకపోయిన కొందరు జుట్టు పీక్కుంటూ ఉండే సంగతి చాలామందిలో మనం గమనించేదే. ఇలా తమ జుట్టు తాము లాక్కునే కండిషన్ను ట్రైకో టిల్లోమేనియా అంటారు. బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్న తరహాలోనే ఇలా జుట్టునూ పీకేసుకుంటుంటారు. దాంతో వారి తల బట్టతలగా మారిపోతుంది. ఇక కొందరైతే తల పూర్తిగా ప్యాచ్లు ప్యాచ్లుగా బట్టతలగా మారిపోయాక... కనురెప్పల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు. ఒత్తిడితో బట్టతల : ఒత్తిడి తీవ్రమైనప్పుడు చాలా మందిలో తలపై జుట్టు రాలిపోతూ ఉంటుంది. పురుష హార్మోన్ల కారణంగా వచ్చే బట్టతల ఉన్నవారిలో ఒత్తిడి పెరిగితే... ఆ బట్టతల మరింతగా పెరుగుతుంది. అలొపేషియా ఏరేటా (పేనుకొరుకుడు) అనే సమస్య కూడా ఒత్తిడి వల్ల మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడి తగ్గించుకోడానికి... ⇔ చర్మంపై శ్రద్ధ పెంచుకోవాలి. మేని నిగారింపు కోసం ఆరోగ్యకరమైన మార్గాలను ప్రయత్నించాలి. ⇔ సిగరెట్ తాగడం స్ట్రెస్ను తగ్గిస్తుందన్నది వట్టి అపోహ. పొగతాగడం వెంటనే మానేయండి. ∙కొంత మంది పని ఒత్తిడిని తగ్గించుకోడానికి మద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. దీర్ఘకాలంలో అది దుష్ప్రభావం చూపుతుంది. మద్యం తాగేవారి చర్మం త్వరగా ముడతలు పడిపోతుంది. మద్యం అలవా టుంటే, వయసుకన్నా ఎక్కువగా కనపడుతుంటారు. ⇔ నడక చర్మానికి సైతం మేలు చేసే వ్యాయామం. ⇔ కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. ∙కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటుంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. కోలా డ్రింక్స్లోనూ కెఫిన్ ఉంటుంది. కాబట్టి మీ చర్మపు మెరుపును, నిగారింపును తగ్గించే కెఫిన్ పదార్థాలు మానేయండి. ∙రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేయండి. ∙భోజనవేళలను కచ్చితంగా పాటించండి. ⇔ ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల డీ–హైడ్రేషన్కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేస్తారు. ⇔ ఒత్తిడిని కలిగించే అంశాలకు స్పష్టంగా ‘నో’ చెప్పాలి. ⇔ చురుకుదనం పెరుగుతుందని ఒత్తిడి సమయంలో షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటారు. అయితే ఇవి మేని నిగారింపును, మెరుపును తగ్గిస్తాయని గుర్తుంచుకోవాలి. -
రెస్యూటీమ్ ప్రత్యేక శిక్షణ
కాకినాడ యాంకరేజ్ పోర్టులో ప్రత్యేక స్విమ్మింగ్ సెంటర్ తొలిబ్యాచ్కు ముగిసిన శిక్షణ కాకినాడ రూరల్: జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలైన తుపాను, వరదల సమయంలో ఆపదలో ఉన్న ప్రజలను, మత్స్యకారులను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్పీఎఫ్) సిబ్బంది సముద్రంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. మంగళగిరిలోని నేషనల్ డిజాస్టర్ రెస్పెన్స్ ఫోర్సులో (ఎన్డీఆర్ఎఫ్)లో శిక్షణ పొంది వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకులతో ప్రత్యేక రెస్కూ ్య టీమ్ను తయారు చేశారు. వారిలో 17 మంది వారం రోజులపాటు కాకినాడ యాంకరేజ్ పోర్టు కస్టమ్స్ కార్యాలయంలో శిక్షణ పొందారు. వారు గురువారం తాము నేర్చుకున్న అంశాలను ప్రత్యేకంగా సముద్రంలో చేసి చూపించారు. ఏపీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ కమాండెంట్ డీఎన్ఏ భాషా ఆధ్వర్యంలో ప్రత్యేక కోచ్ బి. మదన్మోహన్రావు వీరికి డిసెంబర్ 28 నుంచి జనవరి 5వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. రెస్కూ ్య పవర్బోట్స్ (రబ్బర్ ఇంజన్ బోటు)ను ఉపయోగించి వారు సహాయ చర్యలు చేపడతారు. ఒక్కొక్క బోటుపై ఐదుగురు ఉంటూ ఆపద సంభవిస్తే బాధితులను రక్షించేందుకు సిద్ధంగా ఉండేలా వారికి శిక్షణ ఇచ్చారు. బోటులో ఉండే వారికి ప్రత్యేక లైఫ్ జాకెట్లు, చేపలా ఈదేందుకు వీలుగా కాళ్లకు ప్రత్యేక బూట్లు, కళ్లద్దాలు, సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించేందుకు వీలుగా ప్రత్యేక ఆక్సిజెన్ సిలెండర్ వంటివి బోటుల్లో ఉన్నాయి. శిక్షణ ముగింపు సందర్భంగా వారు ఆపదలో ఉన్న వ్యక్తులను ఎలా రక్షించేదీ చేసి చూపించారు. దీన్ని ప్రత్యేక స్విమ్మింగ్ సెంటర్గా రూపొందిస్తూ ఒక టీముకు శిక్షణ పూర్తయిన తరువాత మరో టీముకు ఈ అంశాల్లో శిక్షణ ఇస్తామని కమాండెంట్ బాషా తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ కేవీ రవిచంద్ర, ఎస్సై ఈశ్వర్ పాల్గొన్నారు. -
పట్టిచ్చిన ఐడియా
దొంగ బంగారం కరిగించి జల్సాలు కరిగించిన వ్యాపారిని బెదిరించి రూ.లక్షలు స్వాహా పోలీసు పార్టీ పేరు చెప్పి బెదిరింపులు పిఠాపురం : ఒక యువకుడి దొంగ ఆలోచన పోలీసుల మతిపోగొట్టింది. ఐడీ పార్టీ పేరుతో వ్యాపారిని బెదిరించి రూ.2 లక్షలు స్వాహా చేయడమే కాకుండా మరిన్ని వసూళ్లకు యత్నించాడు. చెడు అలవాట్లకు బానిసైన ఆయువకుడు రూ.2 వేల నోట్లు మారుస్తూ పేకాడుతూ, జల్సాలు చేస్తూ తోటివారిలో చర్చనీయాంశమయ్యాడు. ఆ నోటా ఈ నోటా సమాచారం పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురానికి చెందిన ఆయువకుడు నాలుగు నెలల క్రితం ఎక్కడ నుంచో కొంత బంగారం తెచ్చి స్థానిక గోల్డు మార్కెట్ వీధిలోని వ్యాపారి వద్ద కరిగించాడు. ఆ ముద్దను విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. సొమ్ము పూర్తి కాగానే మళ్లీ బంగారం కరిగించే వ్యాపారి వద్దకు వెళ్లి తాను తెచ్చిన బంగారం దొంగదని, ఈ విషయం పోలీసులకు తెలిసిపోయిందని, రాజమండ్రి నుంచి ఐడీ పార్టీ పోలీసులు వచ్చారని వారికి డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరం జైలుకు పోతామని బెదిరించాడు. దీంతో కంగారు పడ్డ సదరు వ్యాపారి రూ.2 లక్షలు ఆయువకుడికి ఇచ్చి పోలీసులకు సర్దిచెప్పమని కోరాడు. ఆ డబ్బును సైతం ఖర్చుచేసి మళ్లీ వ్యాపారి వద్దకు వెళ్లి గతంలోలాగే బెదిరించాడు. దీంతో ఆ వ్యాపారి ససేమిరా అనడంతో ఇద్దరి మధ్యా గలాటా జరిగింది. ఈ విషయం పోలీసుల వరకూ చేరింది. వారు వ్యాపారిని ప్రశ్నించి యువకుడి వివరాలు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తీసుకువచ్చిన బంగారంపైనా, దాన్ని కరిగించిన వ్యాపారిపైనా దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ ఎస్సై కోటేశ్వరరావును ప్రశ్నించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేయడంపై విచారణ జరుపుతున్నామన్నారు. -
సంచార వైద్య బృందం కౌన్సెలింగ్ వాయిదా..
ఆందోళనలో అభ్యర్థులు నిరాశగా ఇళ్లకు తిరుగుముఖం కాకినాడ వైద్యం : జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) మొబైల్ హెల్త్ టీం ఎంపికకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.చంద్రయ్య వెల్లడించారు. కాకినాడలో డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయంలో జేసీ–2 రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ విధానంలో 204 మంది మొబైల్ బృందం(వైద్యులు, ఫార్మాసిస్ట్, ఏఎన్ ఎం, టెక్నికల్ అసిస్టెంట్ల) భర్తీకి బుధవారం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా 12.30 గంటల సమయంలో వైద్య, ఆరోగ్య కమిషనర్ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది తెలియజేస్తామంటూ అధికారిక ఉత్తర్వులు వచ్చినట్లు డీఎంఅండ్హెచ్ఓ ప్రకటించారు. ఈ వాయిదాతో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ దాకా మొబైల్ బృందానికి జరగాల్సిన శిక్షణ వాయిదా వేసినట్లు తెలిపారు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందతున్నారు. అధికారులు సెల్ఫోన్లో పంపిన సమాచారం అందుకుని ఒరిజినల్ అర్హత పత్రాలు, రూ.100 బాండ్పేపర్ పట్టుకుని వ్యయప్రయాసల కోర్చి కాకినాడ వస్తే, ఇలా ప్రకటించడం శోచనీయమన్నారు. చంటి పిల్లలతో వచ్చిన మహిళలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఇంటర్వూలు, తనిఖీలు, కౌన్సెలింగ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీల పేరిట తమను అధికారులు అనేక పర్యాయాలు తిప్పి పంపుతున్నారని వాపోయారు. నిరుద్యోగుల ఇక్కట్లను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సిబ్బంది నియామకాల కోసం కచ్చితమైన తేదీని ప్రకటించాలని కోరారు. -
రేపు సీనియర్ బాలికల జిల్లా జట్టు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 15న మంగళవారం సీనియర్ బాలికల జిల్లా జట్టు ఎంపికను స్థానిక ఆర్డీటీ క్రీడా గ్రామంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్బాబు తెలిపారు. ఆసక్తి కలిగిన బాలికలు ఈ ఎంపికలకు హాజరుకావచ్చన్నారు. ఎంపికైనవారు కర్నూలు జిల్లా నంద్యాలలో 7వ రాష్ట్రస్థాయి సీనియర్ హాకీ క్రీడా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీలు ఈ నెల 18 శుక్రవారం నుంచి 20వ తేదీ ఆదివారం వరకు ఉంటాయన్నారు. -
అరకురోడ్లో
-
ఒలింపిక్ సంఘం గుర్తింపును పొందాలి
రామచంద్రపురం : జిల్లాలో గల క్రీడా సంఘాలు జిల్లా ఒలింపిక్ సంఘం గుర్తింపును పొందాలని జిల్లా కార్యవర్గం తీర్మానించింది. స్థానిక కృత్తివెంటి పేర్ారజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో గల ఏవీ హాల్లో ఆదివారం జిల్లా ఒలింపిక్ స ంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన జరిగింది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జిల్లాలో మినీ ఒలింపియాడ్ను నిర్వహించాలని, తిరిగి జిల్లా సర్వ సభ్య సమావేశాన్ని డిసెంబర్లో రాజమండ్రిలో నిర్వహించాలని తీర్మానం చేశారు. క్రీడా సంఘాలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మ¯ŒSగా వై. తాతబ్బాయి, కన్వీనర్గా కృష్ణమూర్తి, సభ్యులుగా రాజు తదితరులు ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మ¯ŒSగా రామరాజు, కన్వీనర్గా సృజనారాజు, సభ్యులుగా కనకాల వెంకటేశ్వరరావు, వై. బంగార్ారజు, రమణలతో కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజుతో పాటు ప్రధాన కార్యదర్శి కె. పద్మనాభం, కోశాధికారి వై. తాతబ్బాయి, పి. సీతాపతిలను సత్కరించారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్, కొప్పాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 23ఆర్సీపీ02: మాట్లాడుతున్న జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గోవిందరాజు -
అండర్ 17 బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు
రామచంద్రపురం: అండర్ 17 జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో నిర్వహించారు. బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్ ఈపోటీలను ప్రారంభించారు. రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి గన్నమని చక్రవర్తి మాట్లాడుతూ ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు ముమ్మిడివరంలో జరిగే అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా బాలుర, బాలికల జట్ల ప్రాపబుల్స్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. బాలుర, బాలికల జట్లకు 20 మంది చొప్పున ఎంపిక చేశామన్నారు. వీరికి ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు. శిక్షణానంతరం ఫైనల్ జట్టును ప్రకటిస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ. భీమేష్, సంయుక్త కార్యదర్శి ఎం. ఉపేంద్ర, కోశాధికారి ఎన్వీవీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
స్టేట్ సివిల్ సర్వీసెస్ జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్ : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన బుధవారం స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, గాంధీనగర్లోని సిమ్మింగ్పూల్, దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఫుట్బాల్, వెయిట్లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, స్విమ్మింగ్ జట్లను ఎంపిక చేశారు. శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, శాప్ కోచ్ పర్యవేక్షణలో ఈ సెలక్షన్స్ ట్రయల్స్ జరిగాయి. -
అండర్–17 కబడ్డీ జట్ల ఎంపిక
చిరుమామిళ్ళ (నాదెండ్ల): కబడ్డీ అండర్–17 బాలుర, బాలికల జిల్లా జట్ల వివరాలను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎం గణేష్ సోమవారం ప్రకటించారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలోని నడికట్టు రామిరెడ్డి జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు 40 స్కూళ్ల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు, ముఖ్యఅతిథిగా నడికట్టు రామిరెడ్డి హాజరయ్యారు. బాలుర జట్టులో.. వై.నజీర్మీరసా, ఎన్.పవన్కుమార్ (చిలకలూరిపేట), సాయికుమార్ (గుళ్ళాపల్లి), ఇ.హరిబాబు(మాదల), జి.వెంకట శివనాగేశ్వరరావు (కుంకలగుంట), జి.సతీష్ (పిల్లుట్ల), జి.సైదులు మస్తాన్ (వి రెడ్డిపాలెం), ఎం.సుబ్బారావు (వెల్లటూరు), ఎస్.శ్రీనివాసరెడ్డి (కావూరు), భానుప్రసాద్ (చందోలు), ఎం.మేరిబాబు (తుమృకోట), బి.మణికంఠ (ఇంకొల్లు), స్టాండ్బైగా శ్రీనివాసరెడ్డి(చిరుమామిళ్ళ), పి.కరీం (చిలకలూరిపేట) ఎంపికయ్యారు. బాలికల జట్టులో.. డి.కవిత, ఎ.మహిత, సీహెచ్ ధనశ్రీ, ఎం.నిరోష, పి.వరలక్ష్మి, యు.భార్గవి (కావూరు), వి.సంధ్యారాణి (కుంకలగుంట), ఎ.అనిత (చిలకలూరిపేట), ఎ.రాజకుమారి (వల్లిపాలెం), ఎస్yì .ముబీనా (పెదకొండపాడు), ఐ.లావణ్య (రాజోలు), బి.దివ్య (ధూళిపూడి) ఎంపికయ్యారు. -
22 నేరాలకు పాల్పడిన 13 మంది పట్టివేత
రూ.29.50 లక్షలు సొత్తు రికవరీ కాకినాడ రూరల్ : మూడేళ్లుగా జిల్లాలో వివిధ చోరీలకు పాల్పడుతున్న 13 మందిని కాకినాడ క్రైమ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 29.50 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు. కాకినాడ గొడారిగుంట దుర్గానగర్ వెనుక ఖాళీ స్థలంలో వీరిని శుక్రవారం రాత్రి క్రైమ్ పోలీసులు దాడిచేసి పట్టుకున్నట్టు ఏఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కాకినాడ క్రైమ్ డీఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో క్రైమ్ డీఎస్సీ పిట్టా సోమశేఖర్తో కలసి ఆయన మాట్లాడారు. పెద్దాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాలకు చెందిన 17 మంది ముఠాగా ఏర్పడి మూడేళ్లుగా జిల్లాల్లో 22 నేరాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. వారు∙రూ.63.46 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, మోటారు సైకిళ్లు, ట్యాబ్లు చోరీ చేశారని చెప్పారు. ఇందులో రూ.29.32 లక్షల విలువైన 1,173 గ్రాముల బంగారం, రూ.5.45 లక్షల విలువైన 13.625 కిలోల వెండి వస్తువులు ఉన్నాయన్నారు. పెద్దాపురం మండలం గోరింట గ్రామానికి చెందిన పిడుగు శ్రీనివాస తమ్మారావు అలియాస్ బాబి గ్యాంగ్ లీడర్గా వ్యవహరించినట్టు ఏఎస్పీ తెలిపారు. పెద్దాపురం ఎలక్ట్రికల్ కార్యాలయంలో ప్రైవేట్ కార్మికునిగా పనిచేసే తమ్మారావుకు కాకినాడకు చెందిన పెద్ద నేరస్తుడైన ఘంటసాల రమణ అలియాస్ రమణబాబుతో సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. రమణబాబు పోర్టులో దొంగతనం చేసి తెచ్చిన ఎరువులు, మొక్కజొన్నలు, బియ్యం అమ్మి తమ్మారావు కమీషన్ తీసుకునేవాడు. దుర్వ్యసనాలకు బానిసైన తమ్మారావుకు రమణబాబు గ్యాంగ్నుంచి, ఎలక్ట్రికల్ ఆఫీసులో వచ్చే డబ్బులు చాలక పోవడంతో దొంగతనాలకు దిగాడు. తన స్నేహితులైన గోరింటకు చెందిన ఏడుగురిని, రాజమహేంద్రవరానికి చెందిన ముగ్గురిని, కాకినాడకు చెందిన ఏడుగురితో దొంగల ముఠాగా ఏర్పాటు చేశాడు. వారు 2014 నుంచి ఇళ్లల్లో దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. ఆ డబ్బులు పంచుకుని వారు జల్సాలకు, చెడు అలవాట్లకు ఖర్చు చేసేవారని ఏఎస్పీ దామోదర్ వివరించారు. వీరందరూ కలసి మారుతీ 800 కారును, 220 సీసీ పల్సర్ మోటార్సైకిల్, హీరో హోండా స్లె్పండర్, పేషన్ఫ్లస్ తదితర వాహనాలను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడేవారన్నారు. వెండి, బంగారం వస్తువులతో పాటు రూ. 27.86 లక్షల నగదు, రూ. 75 వేలు విలువైన మూడు మోటార్సైకిళ్లు, రూ. 10వేలు విలువైన ట్యాబ్ మొత్తం రూ. 63.46 లక్షలు విలువైన వస్తువులు వీరు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వాటిలో రూ. 22.35 లక్షల విలువైన 894 గ్రాముల బంగారం, 10.019 కిలోల వెండి, రూ. 1.85 లక్షల నగదు, రూ. 10 వేలు విలువైన ట్యాబ్ను పోలీసులు రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది జూలైలో కాకినాడ పళ్లంరాజు నగర్ రోడ్నంబర్ 1లో రిలయన్స్ కంపెనీ వారి ఇంటిల్లో రాత్రిపూట జరిగిన దోపిడీ కేసులో ఈ గ్యాంగ్లో 13 మందిని పట్టుకున్నట్లు దామోదర్ వివరించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. -
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు
110 కిలోల గంజాయి స్వాధీనం చింతూరు: ఒడిశా నుంచి ఆంధ్రా, తెలంగాణా మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఏడుగురు సభ్యులుగల అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను చింతూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎ. పల్లపురాజు శనివారం మీడియాకు తెలియజేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు శుక్రవారం ఏడుగురాళ్లపల్లి సమీపంలోని మద్దిగూడెం జంక్షన్ వద్ద చింతూరు సీఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా తారసపడిన రెండు కార్లను తనిఖీ చేయగా ఒక కారులో 110 కిలోల గంజాయి, మరో కారులో ఏడుగురు నిందితులు పట్టుబడ్డారు. నిందితులను ప్రశ్నించగా గంజాయి రవాణా వివరాలు తెలిశాయని పల్లపురాజు తెలిపారు. పక్కా ప్లాన్తో స్మగ్లింగ్ కర్ణాటకకు చెందిన సంతోష్ తుకారాం రాథోడ్, దేవదాసు పవారి, విశ్వనాథ దశర థ హైదరాబాద్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు ఒకసారి గంజాయి స్మగ్లింగ్ చేయడంతో మంచిలాభాలు వచ్చాయి. దాంతో హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్తో కలసి మరోమారు గంజాయి స్మగ్లింగ్ చేయాలని భావించారు. దీనికోసం హైదరాబాద్కు చెందిన హనుమకుమార్, భద్రాచలానికి చెందిన దాసరి సతీష్ కార్లను కిరాయికి మాట్లాడుకున్నారు. ఒడిశాకు చెందిన జగ్గారావు, భద్రయ్య, సన్యాసిరావుల వద్ద వీరు చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ఒక వాహనంలో గంజాయి, మరో వాహనంలో నిందితులు ప్రయాణిస్తూ పోలీసులకు దొరికిపోయారు. గంజాయి విక్రయించిన జగ్గారావు పోలీసులకు చిక్కగా మరో ఇద్దరు పరారైనట్టు డీఎస్పీ తెలిపారు. వారి వద్దనుండి రూ. 40,500, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను శనివారం రిమాండ్ కోసం కోర్టుకు తరలించామన్నారు. ఇన్ఛార్జి డీఎస్పీ పల్లపురాజు వెంట సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై గజేంద్రకుమార్ ఉన్నారు. -
రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు జట్టు ఎంపిక
కొత్తగూడెం అర్బన్ : నల్గొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో వచ్చేనెల 3వ తేదీన జరగనున్న రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు కొత్తగూడెం నేతాజీ వ్యాయామశాల బాడీ బిల్డర్స్ ఎంపికైనట్లు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ తెలిపారు. బుధవారం నేతాజీ వ్యాయామశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపికైన క్రీడాకారుల్లో జర్పుల లక్ష్మీనారాయణ, మధుకుమార్, నర్సయ్య, మన్మథకుమార్, మాలోత్ లక్ష్మణ్, దుర్గేష్ ఉన్నారని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు బహుమతులు గెలుపొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామశాల కోచ్ కూచన కృష్ణారావు, చైర్మెన్ మామిడి శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు తమ్మిశెట్టి మోహన్రావు పాల్గొన్నారు. -
జిల్లా జట్ల ఎంపిక
సంస్థాన్ నారాయణపురం: అండర్ – 19 హ్యాండ్బాల్, యోగా బాలుర, బాలికల జిల్లా జట్లను సోమవారం సర్వేల్ గురుకుల కళాశాలలో అధికారులు ఎంపిక చేశారు. విద్యార్థులకు క్రీడలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడలను ప్రిన్సిపాల్ వి. రాఘవరావు ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ సీతారాములు, పీడీలు సాంబశివరావు, రహమత్, శారదలు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు – హ్యాండ్బాల్ బాలుర విభాగంలో డి.నిఖిల్, గణేష్, వెంకట్, అరుణ్, గోపాల్, ఈశ్వర్, ఉదయ్, నిఖిల్, కృష్ణ, జాషువా, రాము, ప్రవీణ్, సూర్య, శ్రీనాథ్, శివ, రామాంజనేయులను ఎంపిక చేయగా, స్టాండ్బైగా సందీప్ను ఎంపికచేశారు. అదే విధంగా బాలికల విభాగంలో విజయభాను, కళ్యాణి, మహేశ్వరి, వందన, నాగజ్యోతి, సంధ్య, శ్రీవాణీలను ఎంపిక చేశారు. – యోగా బాలుర విభాగంలో వై.అజయ్, నవీన్, మోజస్, మహేష్, నిఖిల్, మణికంఠ, గణేష్లను ఎంపిక చేయగా, బాలికల విభాగంలో అనిత, సంధ్యలను ఎంపిక చేశారు. -
దొంగ నోట్ల ముఠా అరెస్టు
ఆరుగురు రిమాండ్, పరారీలో ఒకరు రూ.లక్షా ఐదు వేల నకిలీ కరెన్సీ స్వాధీనం ల్యాప్టాప్, ప్రింటర్స్, పేపర్స్, కలర్స్ సీజ్ సూర్యాపేట మున్సిపాలిటీ : దొంగ నోట్లను చెలమాణి చేస్తున్న ఓ ముఠాను సూర్యాపేట పోలీసులు అపులోకి తీసుకున్నారు. ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సునీతామోహన్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కష్టం లేకుండా సులభంగా సంపాదించాలనే దురాలోచనతో ఆత్మకూర్.ఎస్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన కప్పల విజయ్, మానుపురి వరప్రసాద్, హైదరాబాద్లోని రామంతపూర్కు చెందిన రాపోలు శ్రీనివాస్ అతడి తమ్ముడు సురేందర్, వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరుకు చెందిన తెడ్డు ప్రభాకర్, నర్సింహులగూడెంకు చెందిన గొడుగు రామకృష్ణ, అక్బర్ నకిలీ నోట్లను తయారీ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన ఈ దందాకు రాపోలు శ్రీనివాస్ ప్రధాన సూత్రదారిగా వ్యవహరించాడు. అయితే ఈ నోట్ల చెలామణిని నల్లగొండ, వరంగల్ జిల్లాలకు విస్తరించేందుకు యత్నించే క్రమంలో సూర్యాపేట పోలీసులు ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేయగా, నర్సింహులగూడెంకు చెందిన అక్బర్ పరరీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితులు చిక్కారిలా... ఆత్మకూర్.ఎస్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన కప్పల విజయ్ కొత్త బస్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తుండంతో పోలీసులు పట్టుకుని తనిఖీ చేయగా అతడి వద్ద ఎనిమిది నకిలీ రూ.500 నోట్లు లభించాయి. అతడిని విచారించగా గ్రామానికి చెందిన మానుపురి వరప్రసాద్, రామంతాపూర్కు చెందిన రాపోలు శ్రీనివాస్ పేర్లు బయటపడ్డాయి. సుమారు 350 నకిలీ రూ.500 నోట్లను తెచ్చిన వరప్రసాద్ 70 నోట్లను మార్చాడు. అనంతరం 270 నోట్లను కాల్చివేసి, 10 నోట్లు విజయ్కు ఇచ్చినట్టు విచారణలో తేలింది. విజయ్, వరప్రసాద్లను అదుపులోకి తీసుకున్న అనంతరం రామాంతపూర్లోని శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ ఉన్న శ్రీనివాస్తో పాటు అతడి తమ్ముడు సురేందర్, నకిలీ నోట్లు తీసుకెళ్లేందుకు వచ్చిన వరంగల్కు చెందిన తెడ్డు ప్రభాకర్, గొడుగు రామకృష్ణ పట్టుబడ్డారు. ఈ దాడిలో రూ.లక్షా ఐదు వేల నకిలీ కరెన్సీ, లాప్టాప్, ప్రింటర్స్, పేపర్స్, కలర్స్, కట్టర్, కలర్ జీరాక్స్, రెండు నర్సింగ్ సర్టిఫికెట్లు, మగధ యూనివర్సిటీకి చెందిన నకిలీ లెటర్హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీ నోట్ల తయారీలో మరో నింధితుడు అక్బర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, నకిలీ నోట్ల తయారీ కేసును చాకచక్యంగా ఛేదించిన ఐడీ పార్టీ సిబ్బంది శనగాని వెంకన్నగౌడ్, చామకూరి శ్రీనివాస్గౌడ్, కరుణాకర్, కృష్ణ, రాజులకు రివార్డు కోసం ఎస్పీకి సిఫారస్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ మొగలయ్య, ఎస్ఐ క్రాంతికుమార్, శనగాని వెంకన్నగౌడ్, చామకూరి శ్రీనివాస్గౌడ్, ఇరుగు బాబు, భద్రారెడ్డి, రవినాయక్, వీరన్న పాల్గొన్నారు. -
జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్ –19 క్రికెట్ ఎంపికలు హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ క్రికెట్ నెట్స్లో జరిగాయి. జిల్లా జట్టుకు ఎంపికైన క్రికెటర్లు ఈ నెల 6వ తేదీ నుంచి సంగారెడ్డిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే అండర్ – 19 క్రికెట్ టోర్నీలో పాల్గొంటుందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చేకూరి వెంకట్, మెగా యూత్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి ఎండీ మసూద్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది క్రికెటర్లు హాజరు కాగా వారికి ఎంపికలు నిర్వహించి 14 మంది క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. జట్టుకు ఎంపికైన వారి వివరాలను ప్రకటించారు. జట్టు వివరాలు: టీవీఎస్ నారాయణ, పి. భరత్, కె. సాయిసత్యతేజ, వి. విరించి, టి. నరేష్ సింగ్, పి. జయదేవ్, డి. సూర్య, పి. రాజేష్, జి, ధీరజ్, ఎం. ఠాగూర్, ఎస్. డి మహ్మద్హుస్సేన్, హేమంత్, కె. రవి, జి. వినోద్లు ఎంపికయ్యారు. -
ఏపీ త్రోబాల్ జట్టుకు అభినందన
విజయవాడ స్పోర్ట్స్ : కర్నూలులో ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు జరిగిన 27వ ఫెడరేషన్ కప్ త్రోబాల్ చాంపియన్షిప్లో బాలుర విభాగంలో ఏపీ జట్టు రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ జట్టును జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎండీ సిరాజుద్దీన్, త్రోబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గరిమెళ్ల నానయ్య చౌదరి అభినందించారు. ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిల్లా క్రీడాకారులు ఎ.అఖిల్, ఎం.అఖిలేష్, బి.సందీప్లను ప్రత్యేకంగా అభినంధించారు. కార్యక్రమంలో ఎస్ఏఎస్ కళాశాల పీడీ, త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇ.సులోచ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాము పాల్గొన్నారు. -
జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
బిక్కవోలు: జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిక్కవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా అండర్– 20 బాలురు, బాలికల జట్ల ఎంపిక ఆదివారం జరిగింది. ప్రతిభ కనబరచిన క్రీడాకారుల జాబితాను అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పన వీర్రాజు ప్రకటించారు. బాలుర జట్టుకు వైవీ శివకుమార్రెడ్డి, బండారు శేఖర్, డి.సల్లీ, సీహెచ్ కృష్ణ, డి.రమేష్, జి.ఈశ్వర్, ఎం.సాయిరాం, కేఎస్ఎస్ ప్రసాద్, ఆర్.సాయిరాం ఎంపికయ్యారు. బాలికల జట్టుకు శీలం కుసుమ, వై.మౌనిక, వి.పావని, బి.రేవతి, జ్యోతి, వీరలక్ష్మి, వీరలత, కె.వాణి, జేవీవీ వరలక్ష్మి, వై.కళ్యాణి, వి.భూలక్ష్మి, సుష్మ, మేరీ ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబరు 17 నుంచి 22 వరకూ బిక్కవోలులో శిక్షణ ఇస్తారు. అనంతరం 23 నుంచి 25 వరకు కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ఆడతారు. కార్యక్రమంలో సెక్రటరీ వి.తంబి, మానుకొండ వీర్రాఘవరెడ్డి,సెలక్షన్ బోర్టు కమిటీ మెంబరు వి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా టెన్నీకాయిట్ జట్లు ఇవే
నూజివీడు : టెన్నీకాయిట్ అండర్–14 జిల్లా బాల బాలికల జట్లను పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన సెలక్షన్లో ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ కార్యదర్శి డీ. సూర్యనారాయణ తెలిపారు. బాలుర జట్టు: జీ రమేష్, ఎన్. నవీన్, పీ. ఫణీంద్ర, ఎం. హరీష్, బీ. దుర్గారావు, పీ. కార్తీక్, కే తారక్, ఎం విశాల్. బాలికల జిల్లా జట్టుకు జీ. స్వాతి, జే. హరిణి, జే. రాజేశ్వరి, సీహెచ్. శ్రావణి, ఎం. సునంద, జీ. నిఖిత, యూ. ప్రవల్లిక, రవళి ఎంపికయ్యారు. -
బాల్బ్యాడ్మింటన్ జిల్లాజట్ల ఎంపిక
భువనగిరి టౌన్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అండర్–19 క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.దయాకర్రెడ్డి సమక్షంలో బాల్బ్యాడ్మింటన్ జిల్లా బాలికలు, బాలుర జట్లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శాగంటి శ్రీనివాస్, పీడీలు జి.సోమనర్సయ్య, సాంబశివరావు, అప్పారావు, టి.మల్లయ్య, శ్రీనివాసులు, వీరయ్య, తదితరులు ఉన్నారు. బాలుర జట్టుకు ఎంపికైన విద్యార్థులు ఎం.శ్రీను, వంశీకృష్ణ (నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల), బి.నవీన్(భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల), బి.సందీప్( చౌటుప్పుల్ మేధా కశాశాల), జి.నరేష్, పి.శంకర్(టీఎస్డబ్ల్యూఆర్జేసీ రాజాపేట). బాలికల జట్టుకు.. : బి.కావేరి(నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల), బి.లావణ్య, కె.మమత, కె.లతశ్రీ (టీఎస్డబ్ల్యూఆర్జేసీ తుంగత్తురి) ఎంపికయ్యారు. -
జిల్లా స్థాయి వాలీబాల్ విజేత సబ్బవరం
మునగపాక: కళాకారులు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామీణ యువజన మందిరం అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కొనియాడారు. క్రీడాకారులు కూడా తమలో ఉన్న ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. గ్రామీణ యువజన మందిరం 52వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన సోమవారం రాత్రి బహుమతిప్రధానం చేశారు. ఈసందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దారుడ్యంపెరగడంతోపాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. యువజన మందిరం ద్వారా ఏటా కళాకారులు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో తగిన గుర్తింపు పొందాలన్నారు. క్రీడల్లో రాణించేవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది క్రీడాకారులున్నారని వారిని ప్రోత్సహిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. సబ్బవరం జట్టుకు ప్రథమ బహుమతి.. జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో సబ్బవరం జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.గాజువాకకు చెందిన మోడల్ జట్టు ద్వితీయ స్థానం, తోటాడ మూడో స్థానాన్ని స్థానాన్ని, మునగపాక టీమ్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ప్రతీ గ్రామాన్ని సందర్శించాలి
డీఎంహెచ్ఓ కొండల్రావు ఖమ్మం వైద్య విభాగం : ప్రతీ గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందించి సీజనల్ వ్యాధులు రాకుండా నిర్మూలించాలని డీఎంహెచ్ఓ ఏ. కొండల్రావు సిబ్బందిని ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సూపర్వైజర్స్, సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రతీ పీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్, ఆశ వర్కర్లతో టీమ్గా ఏర్పడి, ఒక్కో గ్రామాన్ని సందర్శించి ఇంటింటికి తిరిగి సర్వే చేసి రక్త పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలన్నారు. గ్రామాలు, సబ్సెంటర్లు, పాఠశాలల్లో చికిత్స అందించే ఫొటోలు తీసి వాట్సప్ గ్రూప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతీ పీహెచ్సీ పరిధిలో వెయ్యి టీమ్లు ఏర్పడేటట్లు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రతీ టీం కనీసం 10 రక్త పూతలు తీసి పరీక్షలు నిర్వహించాలని, తద్వారా వచ్చిన మలేరియా కేసులకు వెంటనే చికిత్స అందించే వీలుంటుందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది కలిసి టీం వర్క్ చేసినట్లైతే జిల్లాలో రోజుకు 1000 గ్రామాలు సందర్శించి, అక్కడ ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి, వ్యాధులను అరికట్టి జిల్లాను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా సర్వేలెన్స్ అధికారిణి డాక్టర్ కోటిరత్నం, జిల్లా మలేరియా అధికారి ఏ. రాంబాంబు, డెమో వెంకన్న, డీహెచ్ఈ జి. సాంబశివారెడ్డి, పారామెడికల్ సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
అలరించిన బుర్రకథా గానం
రాజమహేంద్రవరం కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందు ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని పుష్కరాల రేవు, రాజరాజనరేంద్రుని విగ్రహం వద్ద మంగళవారం ప్రదర్శించిన శ్రీనివాస కల్యాణం బుర్రకథ అలరించింది. ప్రముఖ బుర్రకథ కళాకారులు గొర్రెల రామం బృందం ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించారు. కథకుడు గొర్రెల కృష్ణ సతీసుమతి కథను కూడా రసవత్తరంగా వివరించారు. గొర్రెల రామం, గొర్రెల శ్రీనివాస్ వంతులుగా ప్రదర్శనను రక్తి కట్టించారు. కాగా వర్షాకాలమని తెలిసీ, ప్రేక్షకులకు నడిరోడ్డుపై ‘నిలబడి’ ప్రదర్శనను చూసే మహత్తర ‘అవకాశం’కల్పించడంలో నగరపాలకసంస్థ ఉద్దేశం ఏమిటో పెరుమాళ్లకే ఎరుక. కేవలం ముగ్గురు, నలుగురు ప్రేక్షకులు వేదికపైనే ఓపక్కగా కూర్చుని ప్రదర్శనను తిలకించారు. టీటీడీ సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తున్నారు.కళాకారులకు ప్రత్యేకంగా వేదిక నిర్మించినా, ప్రేక్షకులు నడిరోడ్డుపై నిలబడి ప్రదర్శనను చూడవలసిందే. సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆనం కళా కేంద్రంలో జరుగుతున్న నేపధ్యంలో, టీటీడీ కార్యక్రమాలను కూడా అక్కడే నిర్వహిస్తే, కళాభిమానులు మరికొందరు ఈ కార్యక్రమాలను వీక్షించే అవకాశం ఉంటుంది. -
7న జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్ : జిల్లా జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపికల ఈనెల 7వ తేదీన పట్టాభిపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శివ శంకర్ సోమవారం తెలిపారు. ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులు 02–01–1997 తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్ జారి చేసిన జనన ధ్రువీకరణ పత్రము తీసుకొని రావాలని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్కు పంపటం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 93969 90666, 98497 03676 నెంబర్లకు సంప్రదించాలన్నారు. -
భారత్ వీసాకు పాక్ బృందం దరఖాస్తు!
లాహోర్ః కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో గాయపడిన వారికి మందులు, వైద్య చికిత్స అందించేందుకు పారామెడికల్ సిబ్బందితో కూడిన పాక్ వైద్య బృందం కశ్మీర్ చేరేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ నేతృత్వంలోని 30 మంది సభ్యులు భారత్ పర్యటనకు వీసాలకోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముస్లిం మత సంబంధిత మెడికల్ మిషన్.. జమాత్-ఉద్-దవా (జుద్) కు చెందిన 30 మంది వైద్య సిబ్బంది భారత్ వీసాలకు సన్నాహాలు చేస్తున్నారు. జమ్ము కశ్మీర్ ఘర్షణల్లో భారత సైన్యం చేతిలో గాయపడ్డవారికి చికిత్స అందించేందుకు వారు మంగళవారం కశ్మీర్ చేరే ప్రయత్నంలో ఉన్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం జమ్ము కశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఎక్కువమందికి కళ్ళకు గాయాలవ్వడంతో వారికి చికిత్స అందించేందుకుగాను కశ్మీర్ బయల్దేరుతున్న బృందంలో కంటి నిపుణులను సైతం తీసుకువెడుతున్నట్లు 'జుద్' కు చెందిన అధికారి అహ్మద్ నదీమ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జుద్ వైద్య బృందాన్ని ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయం ఎలా అనుమతిస్తోంది? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ముస్లిం మెడికల్ మిషన్ తన వంతు సహాయం అందించడంలో భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేశామని నదీమ్ తెలిపారు. అయితే గాయపడిన కాశ్మీరీలకు చికిత్స అందించేందుకు తమ బృదం రాకూడదంటూ భారత వైద్య బృదం..తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు మిషన్ ప్రెసిడెండ్ ప్రొఫెసర్ డాక్టర్ జాఫర్ ఇక్బాల్ చౌదరి తెలిపారు. గాయపడినవారికి భారత ప్రభుత్వం పూర్తిశాతం వైద్య చికిత్స అందించకపోవడంతోనే తమ బృదం భారత్ కు బయల్దేరాల్సి వస్తోందని తెలిపారు. గాయపడ్డవారికి పూర్తి శాతం చికిత్స అందించకుండానే భారత వైద్య బృందం శ్రీనగర్ నుంచీ తిరిగి వెళ్ళిపోయిందని ఆరోపించిన ఇక్బాల్ చౌదరి.. కశ్మీరీలకు చికిత్స అందించడం తమ విధిగా భావిస్తున్నామని తెలిపారు. -
అండర్–16 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీ రన్నరప్గా జిల్లా జట్టు
మహబూబ్నగర్ క్రీడలు : స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జింఖానా మైదానంలో జరిగిన అండర్–16 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీలో జిల్లా బాలుర జట్టు రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 3–2 గోల్స్ తేడాతో జిల్లా జట్టుపై విజయం సాధించింది. జిల్లా జట్టు రెండో స్థానంలో నిలవడంపై సీనియర్ క్రీడాకారులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
కలాం విగ్రహ ఏర్పాట్లు సందర్శించిన ప్రత్యేక బృందం
రామేశ్వరంః మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించనున్నారు. జూలై 27న జరగనున్న విగ్రహ స్థాపనకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులతో కూడిన బృందం ఆ ప్రదేశాన్ని సందర్శించింది. రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులు రామేశ్వరంలో పర్యటించారు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఏర్పాటుకోసం జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. మాజీ రాష్ట్పపతి మొదటి వర్థంతి సందర్భంలో జూలై 27న ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అదే ప్రాంతంలో కలాం స్మారక చిహ్నంగా ఓ లైబ్రరీని, మ్యూజియం ను సైతం నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సిబ్బందికోసం హౌసింగ్ క్వార్టర్స్ ను కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. పర్యవేక్షణ బృందంతోపాటు మండపం కోస్ట్ గార్డ్ కమాండర్ రామ్మోహన్ రావు, అబ్దుల్ కలాం మేనల్లుడు షేక్ సలీం కూడా హాజరై విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు. -
కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!
-
కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!
ఏ కంపెనీలోనైనా ఉద్యోగులకు యాజమాన్యం జీతాలు పెంచే పద్ధతి చూస్తాం. ఓ కంపెనీ సీఈవో మాత్రం తన ఉద్యోగులకు స్వంత జీతంలో కొంత భాగాన్ని ఉద్యోగులకు జీతం పెంచేందుకు వెచ్చించాడు. దాంతో సీఈవో తమపై చూపిస్తున్న అభిమానానికి ఉద్యోగులు ఫిదా అయిపోయారు. తమను ఉద్యోగులుగా కాక స్వంత మనుషులుగా గుర్తిస్తున్న సీఈవోను సైతం సంతోషపెట్టాలనుకున్నారు. అందుకే సదరు సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారి జీతాలనుంచీ సేకరించిన డబ్బుతో ఆయనకిష్టమైన బహుమతిని ఇచ్చి.. సర్ ప్రైజ్ చేశారు. తన కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఏడాదికి 70 వేల డాలర్ల జీతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న గ్రేవిటీ కంపెనీ సీఈవో డాన్ ప్రైస్ పై ఉద్యోగులూ ప్రత్యేకాభిమానం ప్రదర్శించారు. తమ జీతాల్లో కొంత డబ్బు సేకరించి ఆయనకిష్టమైన, అత్యంత ఖరీదైన టెల్సా కారును కొని, బహుమతిగా ఇచ్చారు. ఈ అనుకోని సందర్భానికి ఆనందంలో మునిగిపోయిన సదరు సీఈవో.. తన సంతోషాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తనకు ఉద్యోగులు బహుమతిగా ఇచ్చిన కారు ఫోటోతో పాటు.. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నానని, నిజంగా షాక్ తిన్నానని, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదంటూ పోస్ట్ చేశాడు. గ్రేవిటీ కంపెనీ సీఈవోగా ఉన్న డాన్ ప్రైస్ వేతనం 11 లక్షల డాలర్లు. అయితే దాన్ని 70 వేలకు తగ్గించుకున్న ఆయన.. మిగిలిన మొత్తాన్ని సంస్థలోని ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు వినియోగించాడు. కంపెనీలో ఉద్యోగులందరికీ కనీసం ఏడాదికి 70 వేల డాలర్లు ఉండాలంటూ ఆయన తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రపంచం మొత్తాన్నే ఆకట్టుకుంది. అయితే ఉద్యోగుల మనసులో అంతటి స్థానాన్ని సంపాదించిన డాన్ ప్రైస్ స్వంత సోదరుడి నుంచి ఓ కేసును ఎదుర్కొంటున్నాడు. గ్రేవిటీ కంపెనీలో వాటాదారుడుగా సోదరుడు.. ప్రైస్ అత్యధిక జీతం పొందుతున్నాడని అతనిపై కేసు వేశాడు. అయితే మూడు వారాల విచారణను ఎదుర్కొన్న డాన్... సోదరుడి కేసులో ప్రతి విషయాన్నీ ఆధారాలు సమర్పిస్తూ దీటుగా ఎదుర్కొంటూ వచ్చాడు. కేసు చివరి దశలో ఉండగా సంస్థ ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచేశాడు. -
ఫోటోగ్రాఫర్ల వేటలో హృతిక్ రోషన్!
వృత్తి పరంగా ఎప్పుడూ కెమెరా ముందే ఉండే నటీ నటులు... మిగిలిన జీవితంలో దానికి దూరంగా ఉండాలని చూస్తారు. కానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ఇప్పడు సినీరంగంలోని వారికే కాక, అభిమానులకూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన నిత్య జీవితంలో ఎప్పుడూ తన వెన్నంటి ఉండేలా కొంతమంది ఫొటోగ్రాఫర్లను ఆయన హైర్ చేసుకోవాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకూ హృతిక్ అలాంటి భిన్నమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఓసారి చూద్దాం. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని శరీరాకృతితో... బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు మారుపేరుగా నిలిచిన హృతిక్ రోషన్.. ఇప్పుడు కొందరు ఫొటోగ్రాఫర్లను తనకోసం నియమించుకుంటున్నారట. ఇకపై తనజీవితంలోని ప్రతి అడుగునూ కెమెరాలో వీడియోలు, ఫొటోల రూపంలో పదిలపరచాలనుకుంటున్నాడట.అందుకోసం ప్రత్యేకంగా కొంతమంది ఫొటో గ్రాఫర్లను నియమించుకొని, షూటింగ్ లతోపాటు, ఇతర సందర్భాల్లోనూ తనతోపాటే ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయితే ఇలా తన డైలీ లైఫ్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేవలం భద్రపరచుకోడానికే తీయించుకోబోతున్నాడా? లేదంటే ఏదైనా ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నాడా అన్నది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు అశుతోష్ గోవార్కిర్ కాంబినేషన్ లో క్రీస్తు పూర్వం నాటి కథా నేపథ్యం కలిగిన చిత్రం.. మొహెంజోదారో విడుదల కోసం వేచి చూస్తున్న హృతిక్... ఇప్పుడు ఈ ఫుటేజ్ సేకరించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడన్నది మాత్రం అందరికీ ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. -
నాసా పోటీల్లో భారత 'స్క్రూ డ్రైవర్స్'
హ్యూస్టన్ః అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ (నాసా) ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక పోటీల్లో భారత విద్యార్థులు పాల్గొన్నారు. ముంబై లోని ముఖేశ్ పటేల్ సాంకేతిక కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న 13 మంది విద్యార్థుల బృందం పోటీకి ఎంపికైంది. ప్రపంచంలోని మొత్తం 40 బృందాలతో ముంబై 'స్క్రూ డ్రైవర్స్' టీమ్ తలపడుతోంది. హ్యూస్టన్ లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు.. మారుమూల ప్రాంతాలనుంచి సందేశాలను అందుకొనే సామర్థ్యం గలవాహనాలను రూపొందిస్తున్నారు. వాహనాలను తయారు చేసేందుకు వ్యర్థాలను వినియోగిస్తున్నారు. -
వ్యక్తిగత ప్రశంసలతో టీం వర్క్ కు ప్రోత్సాహం
మనిషికి ఇచ్చే వ్యక్తిగత గుర్తింపు.. ప్రశంసలు... వారిని టీం వర్క్ చేయడానికి ప్రోత్సహిస్తుందని, వారిలో మంచి శక్తినిస్తుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. చైనాలోని ఓ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లో పనిచేసేవారిపైనా, కొందరు విద్యార్థులపైనా జరిపిన అధ్యయనాల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. ప్రయోగశాలలు, ఫీల్డ్ ప్రయోగాల ద్వారా అధ్యయనాల్లో... వ్యక్తిగత గుర్తింపు.. టీమ్ వర్క్ కు ఎంతగానో సహకరిస్తుందని కనుగొన్నారు. వ్యక్తి పని తీరుపై అతడికి ఇచ్చే ప్రశంసల ప్రభావం ఉంటుందని చైనాలో జరిపిన కొత్త పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఒక్కొక్కరి పనిని వ్యక్తిగతంగా గుర్తించడం, ప్రశంసలు తెలియజేయడం టీం వర్క్ ను ప్రోత్సహిస్తుందని అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పూలే కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సహ అధ్యయనకారుడు ప్రొఫెసర్ బ్రాడ్లీ కిర్క్ మాన్ తెలిపారు. అధ్యయనకారులు చైనా విశ్వవిద్యాలయానికి చెందిన 256 మంది విద్యార్థులపై జరిపిన అధ్యయనాల్లో ఒక్కొక్కరి పనులను విడివిడిగా గుర్తించడంతోపాటు, సమూహాలతో కలసికూడ గుర్తించారు. వ్యక్తిగత పనుల్లో ప్రశంసలు పొందిన వారే సమూహాల్లో శక్తివంతంగా పనిచేసినట్లు గుర్తించామని తమ అధ్యయనాల వివరాలను అప్లైడ్ సైకాలజీ జర్నల్ లో ప్రచురించారు. రెండవ రౌండ్ లోనూ వ్యక్తిగత ప్రశంసలు పొందిన వ్యక్తి... ఇటు వ్యక్తిగతంగానూ, సమూహాలతో కలసి కూడా పనిలో గణనీయమైన మెరుగును కనబరచినట్లు అధ్యయనకారులు గుర్తించారు. అంతేకాక వ్యక్తిగత గుర్తింపులేని వ్యక్తి టీమ్ మెంబర్ గా కూడ ఎటువంటి మెరుగుదలను చూపించలేకపోయినట్లు తెలుసుకున్నారు. ఉత్తర చైనాలోని ఓ ఉత్సత్తి సంస్థ కూలీలపై కూడ పరిశోధకులు ఈ కొత్త ప్రయోగాలను నిర్వహించారు. కంపెనీలోని కొన్ని విభాగాల్లో 'ఎంప్లాయీ ఆఫ్ ద మంత్' పేరుతో టీమ్ లోని అత్యధిక పనిమంతులను గుర్తించి మిగిలిన విభాగాల్లో గుర్తించకుండా వదిలేశారు. అయితే ఇక్కడకూడా ప్రత్యేక గుర్తింపునివ్వకుండా వదిలేసిన టీమ్ లలో అటు వ్యక్తిగతంగా గాని, టీమ్ వర్క్ లో గాని పనిలో ఎటువంటి ప్రత్యేక ఫలితాలూ కనిపించకపోవడాన్ని తెలుసుకున్నారు. -
'తండ్రి ప్రేమను మాటల్లో చెప్పలేము'
-
'నాన్నకు ప్రేమతో' టీమ్తో స్పెషల్ చిట్చాట్
-
టీమిండియా చేతిలో ఆసీస్ చిత్తు
-
విరాట్ కోహ్లి దూకుడు
-
జుకర్ బర్గ్ పై ఇరుగు పొరుగుల ఆగ్రహం..!
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు... బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ పై ఇరుగు పొరుగులు విరుచుకు పడుతున్నారు. ఆయన చట్టవిరుద్ధంగా పార్కింగ్ ను వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద కార్లను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి, కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బంది కలుగజేస్తున్నారంటూ వారు రాసిన లేఖ ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో లో నివసిస్తున్న ముఫ్ఫై ఏళ్ళ వ్యాపారవేత్త, ప్రపంచ ధనికుల్లో ఒకరైన మార్క్ జుకర్ బర్గ్ ఇప్పుడు స్థానికుల ఆగ్రహానికి గురౌతున్నారు. లిబర్టీ హిల్ కమ్యూనిటీలోని ఆయన ఇంటికి దగ్గరగా నివసిస్తున్న కొందరు.. జుకర్ వాహనాల పార్కింగ్ తీరును తప్పుబడుతున్నారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది... ఎప్పుడూ దారికి అడ్డంగా, చట్ట విరుద్ధంగా అతి పెద్ద రెండు సిల్వర్ కార్లను నిలిపి అత్యంత సమస్యను తెచ్చి పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాంగ్ పార్కింగ్ తో తెచ్చిపెడుతున్న సమస్యను నగర రవాణా ఏజెన్సీకి, జుకర్ బర్గ్ ఇంటి భద్రతా మేనేజర్ టిప్ వెన్జెల్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాక ఆయన లగ్జరీ హోమ్ కు సుదీర్ఘ కాలంపాటు పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టడం కూడ కాలనీవాసులకు తలనొప్పిగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జుకర్ బర్గ్ చాలాకాలంపాటు తమ ఇంటి నిర్మాణం కొనసాగించడంతో తీవ్రమైన శబ్దం, చెత్తతోపాటు, వీధుల్లో స్థలాన్ని ఆక్రమించడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ఇప్పటికే పౌరులుగా తాము సాధ్యమైనంత ఓపిక పట్టామని, చివరికి తమకిదో పరీక్షగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీధిని ఆక్రమిస్తున్న ఆ రెండు ఎస్ యూ వీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్) కార్లను తగిన పార్కింగ్ స్థలంలో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. డాలర్స్ పార్క్ కు దగ్గరలోని జిల్లాలో ఆయనకు ఇంతకుముందే రాంగ్ పార్కింగ్ సమస్య వచ్చిందని, ఇప్పుడు అది స్ట్రీట్ పార్కింగ్ కు పాకిందని అంటున్నారు. జుకర్ బర్గ్ చట్ట విరుద్ధంగా పార్కింగ్ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, ఇంతకు ముందుకూడ ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నాన్నకు ప్రేమతో.. స్పెషల్ ఇంటర్వూ
-
జపాన్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
-
'సాక్షి' చెప్పింది నిజమేనా?
-
టైగర్స్తో చిట్చాట్
-
సచిన్ కెప్టెన్సీలో షోయబ్ అక్తర్
-
సచిన్ కెప్టెన్సీలో షోయబ్ అక్తర్
న్యూయార్క్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సచిన్ కెప్టెన్సీలో క్రికిట్ ఆడబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు. అమెరికాలోని న్యూయార్క్, హ్యూస్టన్, లాస్ ఎంజిల్స్లలో జరగనున్న మూడు టీట్వంటీ ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో సచిన్ జట్టులో అక్తర్ ఆడనున్నాడు. టాస్ వేయడం ద్వారా ఆటగాళ్లను సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు పంచుకున్నాయి. ఈ సందర్భంగా అక్తర్కు సచిన్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. దీనిపై అక్తర్ మాట్లాడుతూ.. 'థ్యాంక్ గాడ్ సచిన్ జట్టలో క్రికెట్ ఆడబోతున్నాను, అతని కెప్టెన్సీని నేనెప్పుడూ దగ్గరగా చూడలేదు' అని సంతోషం వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ల సందర్భంగా గతంలో సచిన్కు ప్రత్యర్థిగా బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ ఆల్ స్టార్స్ టోర్నీలో మ్యాచ్ సందర్భంగా తనకు సచిన్ ఎలాంటి సలహాలు, వ్యూహాలు అందిస్తాడో చూడాలని ఆతృతగా ఉన్నాడు. సచిన్కు బౌలింగ్ చేస్తే చూడాలని ప్రజలు కోరుకుంటారని తెలుసు గానీ తనకు మాత్రం అతని కెప్టెన్సీలో ఆడాలని ఉన్నట్లు తెలిపాడు. -
మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత రోస్బర్గ్
మెక్సికో: మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ రేసులో జర్మనీకి చెందిన నికో రోస్బర్గ్ విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిలో రోస్బర్గ్కు ఇది నాలుగో విజయం కాగా, అతడి కెరీర్లో 12 వ విజయం. మెర్సిడేజ్ టీమ్మేట్, మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హమిల్టన్ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ తాజా విజయంతో మెర్సిడేజ్ జట్టు 17 రేసుల్లో 10 రేసులను ఒకటీ, రెండు స్థానాలతో గెలుచుకుంది. విజయం అనంతరం రోస్బర్గ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అత్యుత్తమ వేదికను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. -
ఫైటర్స్
-
వినియోగదారుల సమస్యలు తీర్చే కొత్త యాప్!
సెల్ ఫోన్ బుక్ చేస్తే... కీ చైన్ రావడం..., ఓ కంపెనీ ప్రొడక్టు బుక్ చేస్తే మరో కంపెనీది రావడం ఇలా తరచుగా మనం ఆన్ లైన్ షాపింగ్ ఇబ్బందులు చూస్తూనే ఉంటాం. బిజీ లైఫ్ లో వీకెండ్ షాపింగ్ కు సమయం వెచ్చించలేని వారు ఆన్ లైన్ షాపింగ్ పై ఆధారపడుతుంటారు. అత్యంత సులభం అనుకునే ఆన్ లైన్ షాపింగ్ ఒక్కోసారి కొనుగోలుదారులకు కష్టాలను కొని తెచ్చిపెడుతుంటుంది. అయితే తాము బుక్ చేసిన ఉత్పత్తులు సరిపోలకుండా.. వచ్చినప్పుడు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఆ ఫిర్యాదులను అత్యంత త్వరగా పరిష్కరించేందుకు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో 'కన్జూమర్ కనెక్ట్' పేరున ఓ మొబైల్ యాప్ వచ్చింది. దీంతో ఎప్పటికప్పుడు కస్టమర్ల సమస్య తీరే అవకాశం ఉంది. సత్యమూర్తి అనే యువకుడు తన ప్రయాణం కోసం ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీలో అరవై వేల రూపాయలతో ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. కానీ అత్యవసర పరిస్థితుల్లో అతని ప్రయాణం ఆగిపోయింది. దీంతో సత్యమూర్తి తన డబ్బు తిరిగి ఇవ్వమని కంపెనీకి ఫిర్యాదు చేశాడు. కంపెనీ నుంచీ కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే తిరిగి రావడంతో ఆశ్చర్యపోయిన అతడు...కన్జూమర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకున్నాడు. సమస్యను పరిశీలించిన సీ.ఏ.ఐ సత్యమూర్తికి ఫిర్యాదు విషయంలో సహాయపడింది. దీంతో 55 వేలు రిఫండ్ కూడ వచ్చాయి '' ఇది పూర్తిగా కంపెనీల తప్పు కాదు, మనం కొనుగోలుదారులుగా తగిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్యను వెంటనే వినియోగదారుల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో తక్షణ సేవలు అందించేందుకు సీఏఐ అందుబాటులో ఉంది.'' అంటున్నారు సీఏఐ సంస్థ ఫౌండర్ ట్రస్టీ కె. కృష్ణ కుమార్. కష్టమర్ల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆయా కంపెనీలతో ఫాలోఅప్ చేసి సహాయం అందించేందుకు 2001 లో సీ.ఏ.ఐ ప్రారంభమైంది. సీ.ఏ.ఐ టీమ్ కేవలం ఒక్క నెల్లోనే కస్టమర్ల సమస్యను తీర్చేందుకు కూడ సహాయ పడుతోంది. అక్కడితో ఆపకుండా ఇప్పుడు కస్టమర్లకు మరింత అందుబాటులో ఉండేందుకు సంస్థ కొత్తగా 'కన్జూమర్ కనెక్ట్' పేరున మొబైల్ యాప్ విడుదల చేసింది. దీంతో కస్టమర్లు ఎవర్ని కలవాలి అన్న సందేహం లేకుండా ఎప్పటికప్పుడు తమ చేతిలో ఉండే యాప్ ద్వారానే ఫిర్యాదులు చేయొచ్చునని సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. మొబైల్ యాప్ తో కస్టమర్ స్వయంగా కంప్లైంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం సంస్థలోని పదకొండు మంది టీమ్... వచ్చిన కంప్లైంట్ లను మెయిల్స్ ద్వారా ఆయా కంపెనీలతో ప్రదించి పరిష్కరానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా నెట్ వర్క్ అందుబాటులో లేని సమయంలో కూడ అప్లికేషన్ పూర్తి చేసే అవకాశం ఈ యాప్ లో ఉంది. పూర్తిచేసి సిద్ధంగా ఉంచిన ఫిర్యాదును నెట్ వర్క్ ద్వారా పంపించవచ్చు. తాము అందుకున్న ఉత్పత్తుల ఫొటోలను కూడా తీసి కూడ యాప్ ద్వారా పంపించవచ్చు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు కస్టమర్లు వార్షిక రిజిస్ట్రేషన్ ఫీజు కడితే సరిపోతుంది. త్వరలో సంస్థ వినియోగదారులకు అదనంగా సహాయం అందించేందుకు కన్జూమర్ ఇంటర్నేషనల్, కన్జూమర్ వరల్డ్ ఫెడరేషన్ గ్రూపులతో సంప్రదించి తమ సేవలను మరింత విస్తరించనుంది. -
సక్సెస్కు మంచి టీమ్ అవసరం
సినిమా విజయానికి మంచి కథతో పాటు ప్రతిభావంతులైన టీమ్ చాలా అవసరం అంటున్నారు నటి వేదిక. నటిగా ఈమె అభినయం ఏ పాటిదో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరదేశి, కావ్యతలైవన్ చిత్రాలే వేదిక నటనకు నిదర్శనం. అయితే ఆమె ఇంకా తనక ంటూ ఇక స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారన్నది నిజం. ప్రస్తుతం వినోదన్ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్న బహుభా నటి వేదికతో చిన్న భేటీ. ప్ర: నటిగా మంచి స్థాయి కోసం ఇంకా పోరాడుతున్నట్లున్నారు. అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లున్నాయి. కారణం ఏమిటనుకుంటున్నారు? జ: పరదేశి, కావ్యతలైవన్ చిత్రాల్లో నా పాత్రలు ఎంత బలమైనవో తెలిసిందే. ఆ తరువాత చాలా చిత్రాల అవకాశాలు వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించాలనుకోవడంలేదు. మంచి పాత్రలనే నేను ఆశిస్తున్నాను. అలాగని నేనేమి కాళీగా లేను. తమిళంతో పాటు కన్నడం,మలయాళం భాషల్లోనూ నటిస్తున్నాను. ఇక మంచి స్థాయి అంటారా’ ఎవరికైనా విజయంతోనే అంతస్తు పెరుగుతుంది. అలాంటి సక్సెస్ రావాలంటే కథతో పాటు మంచి టీమ్ చాలా అవసరం. అన్నీ కలిసొచ్చినప్పుడు స్థాయి అనేది వచ్చి తీరుతుంది. ప్ర: తాజా చిత్రం వినోదన్లో కొత్త నటుడితో నటించడానికి సిద్ధం అవుతున్నట్లున్నారు? జ: నూతన నటుడితో నటించడానికి అంగీకరించారేమిటన్న ప్రశ్నను చాలా మంది అడిగారు. వినోదన్ చిత్రం ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా నిర్మిస్తున్న తొలి చిత్రం. అయన ఎంత ప్రతిభావంతుడో చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రం అనగానే మరు మాట లేకుండా ఒప్పేసుకున్నాను. అలాగే వినోదన్ కథను దర్శకుడు వికటన్ జయరాజ్ చెప్పగానే బాగా నచ్చింది. ముఖ్యంగా నా పాత్ర చాలా ఆకట్టుకుంది. పరదేశి, కావయతలైవన్ చిత్రాల తరువాత అంత నటనకు అవకాశం ఉన్న పాత్ర. ఇలాటి పాత్రను ఇంతకు ముందు నా చిత్రాల్లో చూసి ఉండరు. ఈ చిత్ర టీమ్లో దర్శకుడు వికటన్ జయరాజ్, నవ కథానాయకుడు వరుణ్, సంగీత దర్శకుడు డి.ఇమాన్ ఇలా అందరూ ప్రతిభావంతులే . ప్ర: ఇతర భాషల్లో నటిస్తున్న చిత్రాల గురించి? జ: కన్నడంలో పి.వాసు దర్శకత్వంలో శివరాజ్కుమార్ సరసన నటిస్తున్నాను. ఇందులోనూ చాలా మంచి పాత్ర పోషిస్తున్నాను. ఇక మలయాళంలో పృథ్వీరాజ్కు జంటగా జేమ్స్ అండ్ అలీస్ అనే చిత్రం చేస్తున్నాను. -
కొరియర్ బాయ్ కళ్యాణ్ టీమ్తో ఇంటర్వ్యు
-
'వినవయ్యా రామయ్య' టీం తో చిట్ చాట్
-
చిరంజీవిని కలిసిన రాజేంద్రప్రసాద్ ప్యానల్
-
’S/o సత్యమార్తి’టీంతో చిట్చాట్
-
D ఫర్ దోపిడి మూవీ టీమ్తో చిట్ చాట్
-
విజయమ్మతో భేటీ అయిన ఏపిఎన్జీఓలు
-
"అలియాస్ జానకి" మూవీ టీంతో సాక్షి వేదిక