teaser
-
లుక్స్తోనే భయపెట్టిన తమన్నా.. ఉత్కంఠంగా ‘ఓదెల 2’ టీజర్
‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ (Odela 2)తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించగా, హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా..నాగసాధు పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్(Odela 2 Teaser)ని మహాకుంబమేళాలో విడుదల చేశారు మేకర్స్. నాగసాధు పాత్రలో తమన్నా నటన అదిరిపోయింది. ఉత్కంఠ రేకెత్తించే సీన్లలో టీజర్ని కట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. -
క్రైమ్ థ్రిల్లర్
నానీ(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. యునానిమస్ ప్రోడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. కాగా ఈ నెల 24న నానీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ మూవీలో అర్జున్ సర్కార్గా పవర్ఫుల్ పోలీస్గా కనిపించనున్నారు నానీ.‘హిట్’ సిరీస్లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం గ్లింప్స్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), లైన్ప్రోడ్యూసర్: అభిలాష్ మాంధదపు. -
బ్యూటీ టీజర్ చూశారా?
ఆయ్ ఫేమ్ అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యూటీ. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహించారు. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ‘బ్యూటీ’ టైటిల్ను ప్రకటించడంతోపాటు ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్ను కూడా విడుదల చేశారు. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా శ్రీ సాయి కుమార్ దారా పని చేస్తున్నారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్: బేబీ సురేష్ భీమగాని, ఎడిటింగ్: ఎస్బి ఉద్ధవ్. చదవండి: -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' టీజర్.. కొన్ని గంటల్లోనే రికార్డ్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వీడీ12 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్తో పాటు టైటిల్ను కూడా రివీల్ చేశారు మేకర్స్. కింగ్డమ్ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. యూట్యూబ్లో 10 మిలియన్స్ వ్యూస్తో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను ఊపేస్తున్నాయి. ఈ టీజర్కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్కు మరింత హైప్ను క్రియేట్ చేసింది. దీంతో కింగ్డమ్ వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. #Kingdom Teaser delivers all the emotions with KING SIZED MOMENTS! 💥💥💥10M+ views and standing tall! ❤️🔥❤️🔥▶️ https://t.co/rHwYoKCDgI#VD12 #Saamraajya @TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla… pic.twitter.com/HpHNpmxWZi— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2025 -
'విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్'.. రష్మిక పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ను అందించారు. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ రౌడీ హీరో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో కింగ్డమ్ టీజర్ పోస్టర్ను పంచుకుంది. 'ది మ్యాన్ కమ్స్ విత్ సమ్థింగ్ మెంటల్.. విజయ్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్..టాలీవుడ్లో ఈ జంటపై కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు వీరిద్దరు పెట్టిన పోస్టులతో ఫ్యాన్స్కు దొరికిపోయారు. గతేడాది దీపావళికి సైతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరోసారి ఈ జంటపై రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా కింగ్డమ్ టీజర్ను రష్మిక షేర్ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. కాగా.. వీరిద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది రష్మిక. ఈ బాలీవుడ్ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. -
విజయ్ దేవరకొండ 'వీడీ12'.. టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వీడీ12 టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా విడుదలైన టీజర్ రౌడీ హీరో ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.అయితే ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అలాగే వీడీ12 మూవీకి హిందీ టీజర్కు యానిమల్ హీరో రణ్బీర్ కపూర్ తన వాయిస్ అందించారు. తమిళంలో స్టార్ హీరో సూర్య వాయిస్తో టీజర్ విడుదల చేశారు మేకర్స్. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల వాయిస్తో టీజర్ను విడుదల చేయడం విశేషం.తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ ఆడియన్స్ను కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ టీజర్తో కింగ్డమ్పై అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఎదురుచూసిన అభిమానులకు ఆ కోరిక నేటితో తీరింది. 'జెర్సీ' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ కింగ్డమ్ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
'మీ నాన్నకు తెలియనంత జాబ్ ఏం చేస్తున్నావ్?'.. ఆసక్తిగా టీజర్
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) 'జాక్' (Jack)మూవీతో అభిమానులను అలరించనున్నారు. గతేడాది టిల్లు స్క్వేర్తో ఫ్యాన్స్ను మెప్పించిన సిద్ధు మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న జాక్లో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఇవాళ సిద్ధు పుట్టిన రోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా జాక్ మూవీ టీజర్ను ఫ్యాన్స్కు పరిచయం చేశారు.టీజర్ చూస్తే తండ్రి, కుమారుల మధ్య జరిగే స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య, సిద్ధు మధ్య వచ్చే డైలాగ్స్ ఫ్యాన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, వీకే నరేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. #Jack Konchem Crack 😉But adento adagoddu - It’s confidential 🤫 Presenting an exhilarating character who will run a MASSIVE entertainment show 🔥— https://t.co/VWrugmWs2n#JackTeaser out now! #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @SVCCofficial… pic.twitter.com/gQYQjYSW4o— SVCC (@SVCCofficial) February 7, 2025 -
వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati)నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ విడుదలైంది.ఈ సిరీస్కు ఆదరణ దక్కడంతో మేకర్స్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రానా నాయుడు సీజన్-2 టీజర్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా విడుదలైన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్కు రీమేక్గా రానా నాయుడు వెబ్ సిరీస్ను రూపొందించారు. ఈ సిరీస్తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.Ab hogi todfod ki shuruvaat mamu, kyun ki ye Rana Naidu ka style hai 👊. Watch Rana Naidu Season 2, out in 2025, only on Netflix #RanaNaiduS2#RanaNaiduS2OnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/AKzezumPzN— Netflix India (@NetflixIndia) February 3, 2025 -
మ్యాడ్ బ్యూటీ '8 వసంతాలు' టీజర్ రిలీజ్
మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మొదటి విడుదలైన గ్లింప్స్లో అద్భుతమైన లొకేషన్స్తో పాటు హీరోయిన్ ఎలివేషన్తో చూపిస్తే.. ఇప్పుడు టీజర్లో మంచి కంటెంట్ ఉన్న లైన్తో ఎమోషనల్గా చూపించారు ఈ చిత్రాన్ని ఫణింద్ర(Phanindra Narsetti) తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్)'8 వసంతాలు'(8 Vasantalu) చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. మ్యాడ్ మూవీలో జెన్నీ పాత్రలో అనంతిక సనీల్కుమార్ అదరగొట్టింది. ఇప్పుడు ఆమె మ్యాడ్ సిక్వెల్లో కూడా నటిస్తుంది. ఈ మూవీతో ఆమె చాలామంది యూత్కు క్రష్గా మారిపోయింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమకు రాకముందిఅనంతిక సనీల్కుమార్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ వివిధ రకాల కంటెంట్తో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు షేర్ చేస్తుండేది. అలా గుర్తింపు రావడంతో తెలుగులో మొదట రోజ్ మిల్క్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, మ్యాడ్ సినిమాతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అనంతికకు కర్రసాముతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చు. -
'అక్కడ ఎక్కడో చావడానికి రూ.70 లక్షలా?'.. ఆసక్తిగా టీజర్
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం పరదా. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తే ఈ మూవీని సోషియో ఫాంటసీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 'పిచ్చి గిచ్చి పట్టిందా తనకీ.. అక్కడ ఎక్కడో చావడానికి 70 లక్షలు ఇస్తుందట' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. టీజర్ చూస్తే ఈ కథ అంతా పర్వత ప్రాంతాల్లోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
పవర్ఫుల్ డైలాగ్స్తో భైరవం.. టీజర్ చూశారా?
హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భైరవం. ఇది తమిళ 'గరుడన్' సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి సోమవారం (జనవరి 20) టీజర్ రిలీజ్ చేశారు. రాత్రి నాకో కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. అంటూ జయ సుధ చెప్పే డైలాగ్తో టీజర్ మొదలవుతుంది. శీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే ప్రాణాలు తీస్తా అని మనోజ్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు. యాక్షన్కు ఢోకా లేదన్నట్లుగా ఉన్న ఈ టీజర్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్తో పాటు ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు'.. టీజర్ చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం లైలా. గతేడాది మెకానిక్ రాకీతో అలరించిన హీరో.. ఈ లవర్స్ డే రోజున ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. లైలా టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లోనూ ఫ్యాన్స్ను అలరించనున్నాడు. 'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు' అనే డైలాగ్ మాస్ కా దాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. Welcome to the world of #Laila filled with fun, action and romance ❤🔥The Echipaad #LailaTeaser out now 💥💥▶️ https://t.co/YHl8j4IgAKGRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th @RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/OQ5I4yzaJN— VishwakSen (@VishwakSenActor) January 17, 2025 -
అర్థమైందా.. రాజా!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన బ్లాక్బస్టర్ మూవీ ‘జైలర్’ (2023). ఈ మూవీకి సీక్వెల్గా ‘జైలర్ 2’ రానుంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లోనే తెరకెక్కనున్న ‘జైలర్ 2’ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే చిత్రీకరణనుప్రారంభించనున్నట్లు ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్లో వెల్లడించారు. ‘టైగర్ కా హుకుమ్’ సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్తో పాటు వీడియో చివర్లో ‘అర్థమైందా.. రాజా’ అనే ఓ డైలాగ్ ఉంది. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. సన్పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. -
సేమ్ లుక్.. సేమ్ స్టైల్.. యష్ 'టాక్సిక్' టీజర్ పై ట్రోల్స్..!
-
ఉత్కంఠభరితంగా వరుణ్ సందేశ్ 'కానిస్టేబుల్' టీజర్
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రాలకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం 'కానిస్టేబుల్'. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు.ఈ టీజర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలా ఉంది. ఓ అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురవ్వడం, ఆ హత్యను ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ టీజర్లోని విజువల్స్, ఆర్ఆర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్కు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ టీజర్తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. నాలుగు భాషల్లో ఈ టీజర్ అందుబాటులో ఉంది. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
ఆకట్టుకుంటున్న ‘కోర’ టీజర్
యాక్షన్ జానర్, పీరియాడిక్ డ్రామాతో వస్తున్న చిత్రాలకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనే కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతోంది. ఒరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా ‘కోర’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్ల మీద డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ, పి.మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ కోర మీద అంచనాలు పెంచేశాయి.తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీ టీజర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ టీంకు అభినందనలు తెలిపారు. ఇక కోర టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లతో సరైన పాన్ ఇండియన్ మూవీలా కోర తెరకెక్కింది. టీజర్లో చూపించిన విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్కు ఐ ఫీస్ట్లా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్లు ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రఫర్గా పని చేస్తుండగా.. బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె.గిరీష్ కుమార్ ఎడిటర్గా పని చేస్తున్నారు. -
దిల్రూబా టీజర్: ప్రేమ గొప్పది.. కానీ అదిచ్చే బాధే భయంకరంగా ఉంటుంది!
క సినిమాతో కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). అతడి పనైపోయిందని విమర్శించినవారితోనే భలే సినిమాతో వచ్చాడని మెచ్చుకునేలా చేశాడు. ప్రస్తుతం ఇతడు దిల్రూబా అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ కథానాయిక. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.శుక్రవాం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. మ్యాగీ తన ఫస్ట్ లవ్ అని.. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిలయినట్లు మొదటి ప్రేమలో విఫలమయ్యానంటూ హీరో వాయిస్తో టీజర్ మొదలవుతుంది. మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్లు నా లైఫ్లోకి అంజలి వచ్చిందంటూ హీరోయిన్ను చూపించారు. వీళ్ల ప్రయాణం, గొడవలు.. ఇలా అన్నింటినీ చూపించారు. దీనికి బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన క్లాసిక్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా ఉంది.ప్రేమ గురించి చెప్పడమైపోగానే కిరణ్ యాక్షన్ మోడ్లోకి మారాడు. తనకు అడ్డొచ్చినవారిని కోపంతో చితక్కొట్టాడు. ప్రేమ చాలా గొప్పది.. కానీ అదిచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది అన్న డైలాగ్తో టీజర్ ముగిసింది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది. దవ -
'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి'.. ఆసక్తిగా టీజర్
పొలిమేర మూవీ సిరీస్తో టాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్(satyam Rajesj>). తాజాగా మరో హిస్టారికల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో వస్తోన్న లేటేస్ట్ మూవీ 'త్రిబాణధారి బార్బరిక్'. ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ఠ ఎన్.సింహ, ఉదయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను(Tribanadhari Barbarik Teaser) మేకర్స్ రిలీజ్ చేశారు. పురాణాల్లో పాత్రల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి' అనే డైలాగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ప్రభావతి, మేఘన, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
భయపెట్టేలా ‘కరావళి’ టీజర్
ప్రస్తుతం ఆడియెన్స్ను ఆకట్టుకోవాలంటే కథలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలి. ఇది వరకు చూడనటువంటి కంటెంట్ను, కాన్సెప్ట్ను చూపిస్తేనే ఆడియెన్స్ థియేటర్ వరకు వస్తున్నారు. ఈ క్రమంలో కన్నడలో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ అంటూ అందరినీ మెస్మరైజ్ చేసే కంటెంట్, కాన్సెప్ట్తో వస్తున్నారు.‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గనిగ ‘కరావళి’ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిల్మ్స్ బ్యానర్తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్ మీద గురుదత్త గనిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ప్రోమో ఆడియెన్స్ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ టీజర్లోనే గూస్ బంప్స్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి.మహిషాలకు, మానవులకు మధ్య జరిగే కాన్సెప్ట్లా ఈ టీజర్లో ఏదో కొత్త కథను చూపించారు. 'పిశాచి రాక' అంటూ వదిలిన ఈ టీజర్లోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతోందని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సల్మాన్ ఖాన్, మురుగదాస్ యాక్షన్ టీజర్ విడుదల
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు కానుకగా ఆ చిత్రం నుంచి తాజాగా టీజర్ను విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా విడుదల కానుంది. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. -
'అంబానీ మామ.. నీకు వంద రీచార్జులు'.. నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా టీజర్
హీరోలు కూడా అలవోకగా కామెడీ పండించగలరు అని నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నిరూపించాడు. తను నోరు విప్పితే చాలు ఏదో ఒక పంచ్ రావాల్సిందే.. ప్రేక్షకుల పొట్ట చెక్కలవ్వాల్సిందే! నేడు (డిసెంబర్ 26న) నవీన్ పొలిశెట్టి బర్త్డే. ఈ సందర్భంగా అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా (Anaganaga Oka Raju Movie) నుంచి రాజుగారి ప్రీవెడ్డింగ్ వీడియో రిలీజ్ చేశారు.ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే..టీజర్ ప్రారంభంలో పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారు పళ్లెంలో భోజనం వడ్డిస్తున్నారు. మరోవైపు రాజుగారు నవీన్ పొలిశెట్టి.. ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వీడియో చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముకేశ్ అంబానీ ఫోన్ చేశాడట! ముకేశ్ మామయ్య... నీకు వంద రీచార్జులు.. ఇప్పుడే మన అనంత్ పెళ్లి క్యాసెట్ చూస్తున్నా.. అంటూ సంభాషణ మొదలుపెట్టాడు. తన ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే! జస్టిన్ బీబర్, కిమ్ కర్దాషియన్, జాన్ సేన.. అందరితో తన సంగీత్లో స్టెప్పులేయిస్తాడంటున్నాడు. చివర్లో పెళ్లికూతురు మీనాక్షి చౌదరితో ఫోటోషూట్ కూడా చేయించారు.ప్రీవెడ్డింగ్ వీడియో అదిరింది!ఈ ప్రీవెడ్డింగ్ వీడియో బ్లాక్బస్టర్ అవడం గ్యారెంటీ! మూడు నిమిషాల వీడియోలోనే ఇంత ఫన్ ఉంటే ఫుల్ సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందోనని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇకపోతే... అనగనగా ఒక రాజు సినిమా విషయానికి వస్తే మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. తార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
సూర్య 'రెట్రో' సినిమా.. అలరిస్తున్న టీజర్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ఈసారి అదిరిపోయే మాస్ కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. గతనెలలో 'కంగువ' (Kanguva Movie) మూవీతో వచ్చాడు. ప్రేక్షకులు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే 'బాహుబలి'లా తీద్దామనుకున్నారు కానీ మూవీ బెడిసికొట్టేసింది. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజుతో ఓ మూవీ చేశారు. దానికి 'రెట్రో' (Retro Movie) అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)డీ గ్లామర్ లుక్తో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతుంటాడు. నీతో ప్రేమ కోసం రౌడీయిజం, గుండాయిజం అన్ని వదిలేస్తున్నానని.. మీ నాన్న దగ్గర పనిచేయడం కూడా మానేస్తానని చెప్పడం బాగుంది. ఓవైపు ఇంటెన్స్ యాక్షన్ చూపిస్తూనే.. ప్రేమకథ కూడా ఉందనే విషయాన్ని టీజర్ చెప్పకనే చెప్పింది. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్కి చాలా కీలకం. ప్రస్తుతానికి తమిళ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో మిగతా భాషల టీజర్స్ విడుదల చేస్తారేమో?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ) -
ఆటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా.. రిలీజైన టీజర్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కొత్త సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ని తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంగా సినిమా ఉండనుంది. పరస్పరం గొడవలు పడే ఊరిలో లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. నేను నా నెక్ట్స్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. దీనికి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అని చంద్రహాస్ చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
తేజ్ ఊచకోత చూస్తారు – రామ్ చరణ్
‘‘సంబరాల ఏటిగట్టు’ తేజుకి 18వ సినిమా. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. డైరెక్టర్ రోహిత్ మొదటి సినిమా చేస్తున్నట్టుగా లేదు.. చాలా అద్భుతంగా తీస్తున్నాడు’’ అని రామ్ చరణ్ తెలిపారు. సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు) అనే టైటిల్ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2025 సెప్టెంబర్ 25 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ టైటిల్ టీజర్ని రామ్ చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తేజు ఈరోజు ఇక్కడ ఇలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల ఆశీర్వాదాలే. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. అంటే తను మా తేజ్ కాదు.. మీ తేజ్. తనపై ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు నిరంజన్, చైతన్యగార్లను చూస్తే సినిమా పట్ల వారికి ఉన్న ప్యాషన్ తెలిస్తోంది. ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘తేజు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిందంటే నమ్మశక్యంగా లేదు. మా విజయ దుర్గ అదృష్టవంతురాలు. తన పేరును తీసుకెళ్లి తన పేరులో పెట్టుకున్నాడు తేజు(సాయి దుర్గా తేజ్). అలాంటి కొడుకు ఉండటం అదృష్టం. తను మృత్యుంజయుడు’’ అని తెలిపారు. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ–‘‘ఈ వేదికపై నేను ఉండటానికి కారణమైన మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ(అభిమానులు) అందరి ప్రేమను ΄÷ందే అదృష్టం నాకు దక్కింది. బైక్ నడుపుతున్నప్పుడు నేను హెల్మెట్ ధరిస్తాను.. మీరు కూడా హెల్మెట్ ధరించాలి’’ అని కోరారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తేజుగారికి ధన్యవాదాలు’’ అన్నారు రోహిత్ కేపీ. ‘‘సంబరాల ఏటిగట్టు’ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు చైతన్య రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, డైరెక్టర్స్ వైవీఎస్ చౌదరి, దేవా కట్టా, కిషోర్ తిరుమల, మారుతి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ మాట్లాడారు. -
గేమ్ ఛేంజర్తో పోటీపడనున్న స్టార్ హీరో మూవీ.. టీజర్ వచ్చేసింది!
పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు, అరుంధతి చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ఫతే. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఆ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సైబర్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేదు. అయితే అదే రోజున రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది.किरदार ईमानदार रखना जनाज़ा शानदार निकलेगा ! 🪓 #Fateh Teaser out now 🔥Releasing in cinemas on 10th January. @Asli_Jacqueline @ZeeMusicCompany @ShaktiSagarProd @ZeeStudios_ Link: https://t.co/wfeG5hIR3W pic.twitter.com/LV0DCjv5rb— sonu sood (@SonuSood) December 9, 2024 -
రష్మిక 'గర్ల్ఫ్రెండ్'ని పరిచయం చేసిన దేవరకొండ
'పుష్ప 2'తో అందరి మనసుల్ని దోచేసిన రష్మిక.. ఇప్పుడు 'ద గర్ల్ ఫ్రెండ్'గా రాబోతుంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్తో ఈ టీజర్ సాగడం విశేషం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)'నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా' అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్పై రష్మిక కనిపిస్తుంటే వీళ్లిద్దరి ఫ్యాన్స్కి కనులవిందుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లుగా వీళ్ల రిలేషన్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో చూచాయిగా ప్రేమలో ఉన్నమన్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే రష్మిక కోసం విజయ్ కవిత్వం చెబుతున్నాడేమో అనిపించింది.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. ఇదంతా చూస్తుంటే ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. బహుశా ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
టాలీవుడ్ డైరెక్టర్ యాక్షన్ మూవీ.. సన్నీ డియోల్ యాక్టింగ్ చూశారా?
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తోన్న తాజా చిత్రం జాట్. ఈ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ పాన్ ఇండియా మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.(ఇది చదవండి: ఓటీటీలో కంగువా.. అనుకున్న తేదీకంటే ముందే స్ట్రీమింగ్)టీజర్ చూస్తే ఈ మూవీని ఫుల్ యాక్షన్ కథాంశంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, స్వరూప ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. शैतान नहीं, भगवान नहीं जाट हैं वो 💥💥💥Action Superstar @iamsunnydeol in and as #JAAT 🔥🔥 🔥 #JaatTeaser out now ❤️🔥▶️ https://t.co/3WmWn7VEEhMASS FEAST loading in cinemas April 2025. 🙌 Produced by @MythriOfficial & @peoplemediafcy A @MusicThaman Mass Beat 🔥🔥… pic.twitter.com/77fPDP2mWl— Gopichandh Malineni (@megopichand) December 6, 2024 -
2040లో అసలేం జరగనుంది.. భయపెడుతోన్న టీజర్!
శాండల్వుడ్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం యూఐ ది మూవీ. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. లహరి ఫిల్మ్స్ అండ్ వెనుస్ ఎంటర్టైనర్స్ బ్యానర్లపై జి మనోహరన్, శ్రీకాంత్ కేపీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ చూస్తేటీజర్ చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే ఈ సినిమాలో చూపించనున్నారు. 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను తలపిస్తోంది. మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ ఉంటూ ఉపేంద్రం డైలాగ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆలస్యమెందుకు టీజర్ చూసేయండి. -
Osey Arundhathi Teaser: ఆసక్తికరంగా ‘ఒసేయ్ అరుంధతి! ’ టీజర్
‘వెన్నెల’ కిశోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. పద్మ నారాయణ ప్రొడక్షన్స్పై ప్రణయ్ రెడ్డి గూడూరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఒసేయ్ అరుంధతి’ టీజర్ను విడుదల చేశారు. ప్రణయ్ రెడ్డి గూడూరు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్గా ‘ఒసేయ్ అరుంధతి’ నిర్మించాం. త్వరలో మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలనుకుంటుంది. అయితే అనుకోకుండా ఆమెకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంది? అనేదే ‘ఒసేయ్ అరుంధతి’ చిత్రకథ. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. -
అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉందంటూ.. 'బచ్చల మల్లి' టీజర్
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు.‘బచ్చల మల్లి’ సినిమాలో అల్లరి నరేశ్ లుక్ చాలా రగ్గడ్గా ఉంది. ఈ మూవీ టీజర్ గమనిస్తే ఆయన పాత్ర చాలా మాస్గా ఉన్నట్లు తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డైలాగ్స్ మెప్పించేలా ఉన్నాయి. 'మందుతో పాటు అప్పడప్పుడు నాకు అమ్మాయిల అలవాటు కూడా ఉంది' అంటూ అల్లరి నరేశ్ చెప్పే డైలాగ్స్ యూత్ను ఆకట్టుకునేలా టీజర్లో ఉన్నాయి. డిసెబర్ 20న ఈ మూవీ విడుదల కానుంది. -
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. డిటెక్టివ్ టీజర్ చూశారా?
టాలీవుడ్ నటుడు వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చంటబ్బాయ్ తాలుకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు ప్రముఖ రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెల కిశోర్ యాక్టింగ్ ఫర్మామెన్స్తో తెగ ఆకట్టుకుంటోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్పై వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. -
నయనతార విశ్వరూపం మీరూ చూసేయండి
లేడీ సూపర్స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చింది. తాజాగా తన నటించనున్న కొత్త సినిమా టైటిల్ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న నయన్ 'రక్కయీ' (RAKKAYIE) అనే కొత్త సినిమాను ప్రకటించింది. కథలో ఉమెన్ పాత్రకు ఎక్కువ ప్రధాన్యతను ఇచ్చేలా టీజర్ ఉంది. ఈ చిత్రానికి సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రమ్ స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వర్స్ఇండియా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నాయి. తల్లి పాత్రలో నటిస్తున్న నయన్తన కూతురు కోసం చేసే పోరాటం చాలా భయంకరంగా ఉండబోతుందని దర్శకుడు టీజర్లోనే చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. -
టీజర్లోనే ఇన్ని బూతులు ఉంటే.. ఇక సినిమా పరిస్థితి ఏంటో..?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బూతు డైలాగ్స్కు ఎలాంటి కొదవ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా టీజర్,ట్రైలర్లోనే కొన్ని డైలాగ్స్తో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'డ్రింకర్ సాయి' సినిమా టీజర్ కూడా అదే కోవకు చెందినట్లు కనిపిస్తుంది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్లు ‘డ్రింకర్ సాయి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్లైన్ కూడా ఉంచారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.యూత్ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ డ్రింకర్ సాయి చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్తో పాటు ధర్మ , ఐశ్వర్య శర్మ లవ్ స్టోరీ హైలెట్గా కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్య శర్మకు యూత్ ఫిదా అవుతున్నారు. షోషల్ మీడియాలో ఆమె డైలాగ్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రమ్, బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్
కొన్నిరోజులుగా అనుకుంటున్నట్లే బాలకృష్ణ కొత్త సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దాదాపు 96 సెకన్ల నిడివి ఉన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు.. డైరెక్టర్ బాబీ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. దానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే రేంజ్ అనేలా కొట్టాడు.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)'ఈ కథ వెలుగుని పంపే దేవుడిది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. కండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది.. మరణాన్నే వణికించిన మహారాజుది' అనే వాయిస్ ఓవర్ ఆగగానే.. 'మహారాజ్, డాకు మహారాజ్' అని బాలకృష్ణ చెప్పడం ఆకట్టుకుంది.ఇందులో బాలయ్యతో పాటు చౌందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
డబ్బు కోసం ఏమైనా చేసే 'రాబిన్ హుడ్' టీజర్ విడుదల
'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. -
కార్తీ కొత్త మూవీ టీజర్.. టైటిల్ వింతగా ఉందేంటి?
ఇటీవల సత్యం సుందరం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ కార్తీ. గతనెల విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో అరవింద్ స్వామి కీలకపాత్ర పోషించారు.అయితే కార్తీ తాజాగా మరో సినిమాకు రెడీ అయిపోయారు.కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం వా వాతియార్. ఇందులో ఉప్పెన భామ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. ఈ చిత్రానికి సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. వా వాతియార్ మూవీలో సత్యరాజ్, రాజ్కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జీఎం సుందర్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్, విద్యా బోర్గియా, నివాస్ అద్ధితన్, మధుర్ మిట్టల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఒక్క రోజులోనే క్రేజీ రికార్డ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. విడుదలకు మరో రెండు నెలల టైమ్ ఉండడంతో వరుస మూవీ అప్డేట్స్తో ఫ్యాన్స్ను అలరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ద్వారా పంచుకుంది. రామ్ చరణ్ పోస్టర్ షేర్ చేస్తూ వెల్లడించింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదేనంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.అంతకుముందు పొంగల్ బరిలో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర విడుదల కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఆ మూవీ పోటీ నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ రేసులో నిలిచింది. మెగాస్టార్ నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Crazy 55 Million+ Views ♥️Off the charts, right into the audience’s hearts😍#GameChangerTeaser 💥🔗 https://t.co/ihtvtgPel9In cinemas worldwide from 10th Jan.GlobalStar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/dQmzVtVtFU— Sri Venkateswara Creations (@SVC_official) November 10, 2024 -
గేమ్ ఛేంజర్ టీజర్ సెన్సేషన్.. మెగా హీరోస్, ఫ్యాన్స్ కు పండగే..
-
'గేమ్ ఛేంజర్' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Game Changer Teaser: వాడు మంచోడే కానీ కోపమొస్తే 'గేమ్ ఛేంజర్' టీజర్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో ఈ మూవీ టీజర్ను మొదట విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లా కేంద్రాల్లోని థియేటర్లలో గేమ్ ఛేంజర్ టీజర్ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీలతో పాటు దేశవ్యాప్తంగా 11 చోట్ల టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. -
నా మార్కెట్ పడిపోయిందని చాలామంది అన్నారు: పూజా
జీవితంలో ఎవరికైనా జయాపజయాలు సహజం. విజయాలతో విర్రవీగిన మహామహులు కూడా అపజయాలను చవి చూశారు. ఇందుకు సినీ తారలు అతీతం కాదు. నటి పూజాహెగ్డే విషయానికి వస్తే ఈ ఉత్తరాది భామ గత 12 ఏళ్ల క్రితం టాలీవుడ్,కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే, తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. తమిళ చిత్రాల నుంచి ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు రీఎంట్రీలో కూడా తెలుగుతో పాటు తమిళ్లో మళ్లీ అవకాశాలు దక్కుతున్నాయి.గతంలో మహేశ్బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించిన చిత్రాలు సూపర్హిట్ కావడంతో పూజాహెగ్డేకు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. దీంతో కోలీవుడ్ స్వాగతం పలికింది. అయితే అలా తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం కూడా పూర్తిగా నిరాశ పరిచింది. అదే సమయంలో టాలీవుడ్, బాలీవుడ్లో పూజాహెగ్డే నటించిన చిత్రాలు ప్లాప్ కావడంతో ఇక ఈ అమ్మడి పనైపోయింది అనే ప్రచారం జోరందుకుంది. కాగా ప్రస్తుతం హిట్స్ లేకపోయినా భారీ అవకాశాలు పూజాహెగ్డే తలుపు తట్టడం విశేషం. తమిళంలో సూర్యకు జంటగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించి పూర్తి చేశారు. తాజాగా నటుడు విజయ్తో ఆయన 69వ చిత్రంలో జత కడుతున్నారు. అలాగే తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఈ సందర్బంగా నటి పూజాహెగ్డే ఒక భేటీలో తన కెరీర్ గురించి పేర్కొంటూ తన మార్కెట్ పడిపోయిందనే ప్రచారం గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. అలాగే అపజయాల గురించి బాధ పడిందిలేదు, భయపడింది లేదన్నారు. తన వరకూ తాను తన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తున్నానని, మంచి టైమ్ కోసం సహనంగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం 5 చిత్రాల్లో నటిస్తున్నట్లు ,అందులో రెండు తమిళం, ఒక హిందీ చిత్రాలు ఉన్నాయని నటి పూజాహెగ్డే పేర్కొన్నారు. -
'గేమ్ చేంజర్' టీజర్.. అక్కడ గ్రాండ్ ఈవెంట్కు ఏర్పాట్లు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది. ఆపై ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో టీజర్ లాంచ్ కానుంది. నవంబర్ 9న గ్రాండ్గా గేమ్ చేంజర్ టీజర్ను విడుదల చేయనున్నారు.భారీ అంచనాలున్న గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్కు రామ్ చరణ్, కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ‘జరగండి జరగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ నెల 9న టీజర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంపై అంచనాలు మరింత రేంజ్లో పెరగనున్నాయి. టీజర్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలక్షన్స్ను నిబద్ధతతో నిర్వహించే ఆఫీసర్గా మెప్పించనున్నారు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. Ready, Set... Command 😎Get ready for #GameChanger ‘s charge in Lucknow ❤️🔥🧨#GameChangerTeaser launch event on 9th NOVEMBER in Lucknow, UP.#GameChanger takes charge in theatres on JAN 10th ❤️🔥Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah… pic.twitter.com/gq9LXHCs1y— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2024 -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్కు దీపావళీ అప్డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్సర్భ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Wishing you a sparkling Diwali from #SekharKammulasKubera! 💥The wait is almost over!!Catch the explosive #KuberaTeaser on Kartik Purnima, November 15th! 💥🔥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/9vAsnAv4tu— Annapurna Studios (@AnnapurnaStdios) November 1, 2024 -
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా 'అనంతం'.. టీజర్ రిలీజ్ చేసిన టాలీవుడ్ హీరో!
వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం తాజా చిత్రం "అనంతం". ఈ సినిమాలో రుచిత సాధినేని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ఆరుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీని టీజర్ విడుదల చేశారు మేకర్స్. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్ అద్భుతంగా ఉందని నిఖిల్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.నిర్మాతలు మాట్లాడుతూ - 'మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాను నిర్మించాం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్గా మూవీ ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించి థియేట్రికల్ రిలీజ్కు తీసుకొస్తాం' అని అన్నారు. -
గోద్రా అల్లర్లపై సినిమా.. టీజర్ ఎలా ఉందంటే?
నిజజీవిత సంఘటనలు, వివాదాలపై హిందీలో ఎప్పటికప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి. 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' చిత్రాలు అలాంటివే అని చెప్పొచ్చు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు, మళ్లీ ఓటీటీలోకి ఈ మూవీస్ వచ్చిన టైంలో రచ్చ రచ్చ జరిగింది. ఇప్పుడు మరో కాంట్రవర్సీ కాన్సెప్ట్తో తీసిన చిత్రం ఒకటి విడుదలకు సిద్ధమైంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్కి మరో కారు గిఫ్ట్)2002లో గుజరాత్లోని గోద్రాలో అల్లర్లు జరిగాయి. సబర్మతి ఎక్స్ప్రెస్ని దుండగులు దహనం చేశారు. ఈ వివాదం చాలా ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్పై సినిమా అంటే సాహసమనే చెప్పాలి. టీజర్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. '12th ఫెయిల్' విక్రాంత్ మస్సే, రాశీఖన్నా ఇందులో లీడ్ రోల్స్ చేశారు.టీజర్ బట్టి చూస్తే 'ద సబర్మతి రిపోర్ట్' మూవీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మతపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఆ ఘటన చుట్టూ చోటుచేసుకున్న రాజకీయాల నేపథ్యంలో అసలు నిజం ఏంటనే కాన్సెప్ట్తో సినిమా తీసినట్లు అనిపిస్తుంది. నవంబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. కంటెంట్ చూస్తుంటే కాంట్రవర్సీ అయ్యేలానే ఉంది మరి!(ఇదీ చదవండి: పవన్ సినిమా రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!) -
సినీ చరిత్రలోనే తొలిసారి... ఓకేసారి మూడు వర్షన్స్
ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం శారీ. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలోని సాంగ్కు సంబంధించిన టీజర్ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. కేవలం టీజర్తోనే సాంగ్పై అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాటకు సంబంధించిన మూడు వర్షన్ల ప్రోమోను ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మూవీలోని సాంగ్ టీజర్ చూస్తుంటే కుర్రకారుకు హీటు పుట్టించేలా ఉంది. పూర్తి పాటను అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.సినీ చరిత్రలో ఏఐ ద్వారా రూపొందించిన ఒకే పాటకు మూడు వర్షన్స్ రిలీజ్ చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ సమర్పణలో.. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్లో ఆరాధ్యదేవి తన అందాల ఆరబోత ఖాయంగా కనిపిస్తోంది.Here’s a sneak peak teaser reel of I WANT LOVE AI song ONE (Crazy ) from SAAREE film featuring https://t.co/4vViOc25qQ Full song releasing Oct 17 th 5 pm #SaareeSongsAI #RGVsSAAREE pic.twitter.com/RgNnwHGdx6— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2024 -
సస్పెన్స్ థ్రిల్లర్గా ఘటికాచలం.. ఆసక్తిగా టీజర్!
నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఘటికాచలం. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంసీ రాజు కథ అందించారు. ఈ చిత్రానికి ఫేవియో సంగీతమందిస్తున్నారు. -
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో '8 వసంతాలు' టీజర్
మ్యాడ్ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపుపొందిన అనంతిక సానీల్కుమార్ నటిస్తున్న కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. అద్భుతమైన లొకేషన్స్తో పాటు మంచి కంటెంట్ ఉన్న లైన్తో ఈ సినిమాను ఫణింద్ర తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.'8 వసంతాలు' చిత్రం నుంచి 'శుద్ధీ అయోధ్య టీజర్' పేరుతో చిత్ర యూనిట్ ఒక వీడియోను పంచుకుంది. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఈ చిత్రం ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. -
'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తాజాగా దసరా సందర్భంగా ఆయుధ పూజకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్.అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్ తాజాగా టీజర్ను విడుదల చేశారు.అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ చూస్తుంటే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లండన్ వెళ్లి తెల్లపిల్లను పడేసి ప్రపంచమంతా చుట్టేద్దామనుకున్నాడు అనే డైలాగ్ వింటే లవ్ అండ్ యూత్ఫుల్ స్టోరీ అని అర్థమవుతోంది. 90 శాతం మంది అబ్బాయిలు మందు తాగడానికి కారణం అమ్మాయిలేరా అనే నిఖిల్ డైలాగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతే కాకుండా హర్ష చెముడు కామెడీ ఈ సినిమాకు ప్లస్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.Did an Experimental Screenplay based breezy film with @sudheerkvarma @rukminitweets @itsdivyanshak @SVC_official @harshachemudu Here is the teaser 👇🏼 https://t.co/hHtdfqcEDe @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @Rip_Apart @NavinNooli @JungleeMusicSTH— Nikhil Siddhartha (@actor_Nikhil) October 11, 2024 -
మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'మట్కా'. 1980 బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర టీజర్ని తాజాగా విజయవాడలో లాంచ్ చేశారు. గత కొన్నాళ్లుగా వరస ఫ్లాఫ్స్ దెబ్బకు పూర్తిగా డీలా పడిపోయిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. టీజర్ అయితే ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: వాళ్ల మాటల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నా: ప్రియమణి)యుక్త, వృద్ధ పాత్రల్లో వరుణ్ తేజ్ కనిపించాడు. వింటేజ్ లుక్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయని టీజర్తో హింట్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ 'మట్కా' టైటిల్కి తగ్గట్లు ఈ గేమ్కి సంబంధించిన సీన్స్ ఎక్కడ చూపించలేదు. బహుశా ట్రైలర్లో రివీల్ చేస్తారేమో?'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. వరుణ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు. నవంబరు 14న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది) -
‘లవ్రెడ్డి’ నాకు చాలా స్పెషల్ : స్మరన్ రెడ్డి
‘లవ్రెడ్డి..నా మొదటి సినిమా. చాలా జాగ్రత్తగా తెరకెక్కించాను. సినిమాలో చిన్న గాలి సౌండ్ కూడా వదల్లేదు. ఎక్కడ ఏ సీన్ ఉండాలి.. ఏ మేరకు ఉండాలి అనేది ఒకటికి రెండు సార్లు చూసుకొని మరీ ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నా తొలి సినిమానే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది’అన్నారు యంగ్ డైరెక్టర్ స్మరన్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లవ్ రెడ్డి’. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్, బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న అక్టోబర్ 18న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ స్మరన్ రెడ్డి మాట్లాడుతూ.. లవ్ రెడ్డి సినిమా ఇంతవరకు వచ్చింది అంటే అందుకు కారణం హీరో అంజన్ రామచంద్ర. మా మధ్య చాలా జర్నీ ఉంది, మేము కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశాము, ఇప్పుడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను, హీరోయిన్ శ్రావణి చాలా బాగా నటించింది, అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది, సన్నీ సంగీతం, వరప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది, అలాగే మోహన్ చారి, అస్కర్ ఆలీ ఈ సినిమాకు కెమెరామెన్స్ గా వర్క్ చేశారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు గారు సపోర్ట్ మర్చిపిలేనిది. ఈ కొత్త ప్రేమ కథ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమా తప్పకుండా సెన్సేషనల్ సృష్టిస్తుంది. ‘సినిమా ఎండింగ్ లో ఒక గొప్ప ఫీల్ తో బయటికి వస్తారు’ అని హీరో అంజన్ రామచంద్ర అన్నారు. ‘మంచి కంటెంట్ తో వస్తోన్న సినిమా ఇది, అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని నిర్మాత మదన్ అన్నారు. -
రియల్ లైఫ్ పాత్రలో సాయిపల్లవి.. ఇంట్రో వీడియో చూశారా?
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత సాయిపల్లవి రెండు సినిమాలతో రాబోతుంది. అందులో ఒకటి నాగచైతన్య 'తండేల్', మరొకటి తమిళ మూవీ 'అమరన్'. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'అమరన్'లో అతడి భార్య ఇందుగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పాత్ర టీజర్ రిలీజ్ చేశారు. చూస్తున్నంతసేపు ఆహ్లాదంగా అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈమె పాత్రని మరింత ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మించిన 'అమరన్'.. అక్టోబరు 31న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. రాజ్కుమార్ పెరియసామి దర్శకుడు. జీవీ ప్రకాష్ సంగీతమందించాడు. సాయిపల్లవి వీడియో చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు) -
వరల్డ్ బెస్ట్ సిరీస్.. రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్
ఓటీటీల్లో కొన్ని సినిమాలు లేదా వెబ్ సిరీసులు అనుహ్యంగా హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'స్క్విడ్ గేమ్' ఒకటి. పేరుకే ఇది కొరియన్ సిరీస్. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్ని మెప్పించింది. 2021లో రిలీజైన తొలి సీజన్ అద్భుతమైన రికార్డులు సెట్ చేయగా.. ఇప్పుడు రెండో సీజన్ విడుదలకి సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నెట్ఫ్లిక్స్ నిర్మించిన బెస్ట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాయడం విశేషం. డబ్బు అవసరమున్న 456 మందిని ఓ ద్వీపానికి తీసుకొచ్చి ఉంచుతారు. వీళ్ల మధ్య చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. పోటీల్లో గెలిచినోళ్లు తర్వాత దశకు వెళ్తుంటారు. మిగిలిన వాళ్లని నిర్వహకులు నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటారు. చివరకు గెలిచిన ఒక్కరు ఎవరనేదే స్టోరీ.తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. ఈసారి కూడా 456 మంది ఉంటారు. మళ్లీ వీళ్ల మధ్య కొత్త గేమ్స్ పెడతారు. మరి ఇందులోనూ హీరో గెలిచాడా? ఈసారి ఏమేం గేమ్స్ ఉండబోతున్నాయనేది టీజర్లో చూచాయిగా చూపించారు. ఇక ఏడాది చివరి వారంలో అంటే డిసెంబరు 26న సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. మరి ఈ సిరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు?(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?) -
నలుగురు హీరోయిన్లతో 'రామ్నగర్ బన్నీ'.. టీజర్ వచ్చేసింది!
చంద్రహాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం రామ్నగర్ బన్నీ. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రభాకర్ మాట్లాడుతూ ..'నన్ను బుల్లితెరపై ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులు చూడటం వల్లే నా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. అందుకే మరో రెండు సినిమాలు ఉన్నా..ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి.' అని అన్నారు.దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ' ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఉన్న ఒక కథ గురించి తెలిసి ఆయన వింటా అన్నారు. కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్తోనే చేయాలని ముందుకొచ్చాడు. చంద్రహాస్ దర్శకుల హీరో. సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. అతను హీరోగా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలనే అన్ని ఎలిమెంట్స్తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చేశాం. అక్టోబర్ 4న వస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు. -
ప్రేమ మరీ ఎక్కువైపోతే? ఆసక్తికరంగా ఆర్జీవీ 'శారీ' టీజర్
సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ 'శారీ'. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అంటే ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో నవంబరులో తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించగా.. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రముఖ బిజినెస్మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్గా 'శారీ' తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ఉత్తరప్రదేశ్లో అమాయకులైన ఎంతో మంది మహిళలని 'శారీ కిల్లర్' అతి క్రూరంగా మానభంగం చేసి చిత్ర హింసలకు గురిచేసి హత్యలు చేశాడు. ఆ మృగాడికి మగువలపై ఎంతటి తీవ్రమైన కాంక్ష ఉండేదో అనే పాయింట్తో శారీ మూవీ తీశారు. చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో హానికరంగా, డేంజరస్గా ఓ అబ్బాయి ఎలా మారిపోయాడనేది టీజర్లో చూపించారు.ఇందులో అబ్బాయిగా సత్య యాదు, అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. ఆరాధ్య దేవి స్వస్థలం కేరళ. నిజానికి ఆరాధ్యని వర్మ ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓ ఇన్ స్టా రీల్లో తొలుత చూశారు. అలా ఆమెని ప్రధాన పాత్ర కోసం తీసుకుని ఏకంగా శారీ సినిమా తెరకెక్కించారు.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) -
ఆర్జీవీ 'శారీ' సినిమా.. క్రేజీ అప్డేట్
కాంట్రవర్సీ టాపిక్స్, నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం 'శారీ' మూవీ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో శ్రీలక్ష్మీ సతీశ్ అనే అమ్మాయిని చూసి ఇందులో హీరోయిన్గా ఎంచుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేయగా.. ఇప్పుడు టీజర్ గురించి క్రేజ్ అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు)ఈ సినిమా టీజర్ని సెప్టెంబరు 15న అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. అలానే ఇది ఉత్తరప్రదేశ్లోని శారీ కిల్లర్కి సంబంధించిన కథ కాదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.ఇకపోతే గిరి కృష్ణ కమల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్జీవీ డెన్ పతాకంపై వర్మ సమర్పిస్తుండగా రవి వర్మ నిర్మిస్తున్నారు. నవంబరులో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్కి ముందే 'తంగలాన్'కి దెబ్బ)Unlike some people are speculating , SAAREE film, is not based on the SAAREE killer of U P , but it’s based on several true life incidents #RGVsSAAREE pic.twitter.com/tDjmovrPNs— Ram Gopal Varma (@RGVzoomin) September 14, 2024 -
'మా నాన్న సూపర్ హీరో'.. ఎమోషనల్ టీజర్ వచ్చేసింది!
హరోం హర తర్వాత సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లూజర్ వెబ్సిరీస్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత పోకిరి నటుడు షాయాజీ షిండే టాలీవుడ్ అభిమానులను అలరించనున్నారు. 'నేను కష్టపడుతున్నాను కదా నాన్న.. ఇక నువ్వేందుకు పనిచేయడం' అన్న డైలాగ్ చూస్తుంటే ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే 'అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్లు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు!! లాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తండ్రీ, కుమారుల అనుబంధం, ఎమోషన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దసరా పండుగకు అక్టోబర్ 11న థియేటర్లలో మా నాన్న సూపర్ హీరో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సాయిచంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడ్డుకునట్టు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయాయినట్టు కాదు!!A heartwarming tale coming this Dusshera#MNSHTeaser - https://t.co/ke3FnMyr9w#MaaNannaSuperHero grand release on Oct 11th@abhilashkankara @sayajishinde #SaiChand @jaymkrish… pic.twitter.com/asU6FJtUwe— Sudheer Babu (@isudheerbabu) September 12, 2024 -
'మొక్కల్నే అంత జాగ్రత్తగా చూసుకుంటే.. మొగున్ని అయితే'.. ఆసక్తిగా టీజర్
సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించిన చిత్రం 'పైలం పిలగా'. ఈ మూవీకి ఆనంద్ గుర్రం దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్పై రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.హరీష్ శంకర్ మాట్లాడుతూ..' టీజర్ చూస్తుంటే సినిమాని చాలా సహజంగా చిత్రీకరించారని తెలుస్తోంది. టీజర్ చాలా చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. మంచి డైలాగ్స్ ఉన్నాయి . మొక్కల్నే అంత మంచిగా చూసుకుంటే మొగున్ని ఇంకెంత మంచిగా చూసుకుంటుంది అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది' అంటూ ఆయన అభినందించారు . ఈ చిత్రంలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ ఆ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ సెప్టెంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. -
'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ
గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. శ్రీనువైట్ల దర్శకుడు. అప్పట్లో 'వెంకీ', 'దుబాయ్ శీను', 'ఢీ' తదితర సినిమాలతో తెలుగులో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీనువైట్ల.. ఆ తర్వాత రొటీన్ మూస తరహా స్టోరీలతో మూవీస్ తీశాడు. అవి ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'విశ్వం'.(ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)దసరా కానుకగా అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే శ్రీనువైట్ల మార్క్ కామెడీ కనిపించింది. అలానే తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే 'విశ్వం' కోసం మరోసారి నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు యాక్షన్, నాన్న అనే ఎమోషన్ కూడా చూపించారు.టీజర్ చూస్తే పర్వాలేదనిపిస్తోంది గానీ స్టోరీ ఏ మాత్రం రొటీన్గా ఉన్నాసరే ప్రేక్షకులు తిరస్కరించే ఛాన్స్ ఉంది. మరి 'విశ్వం' సినిమాతో గోపీచంద్-శ్రీనువైట్ల కాంబో ఏం చేస్తుందో చూడాలి? తెలుగులో దసరాకి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేం లేవు. తమిళ నుంచి రజినీకాంత్ 'వేట్టాయాన్' ఉంది. మరి రజనీ మూవీని తట్టుకుని 'విశ్వం' ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం) -
తెలంగాణ నేపథ్యంలో 'లగ్గం' టీజర్
సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. ఈ సినిమాకు 'రమేశ్ చెప్పాల' కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో పెళ్లిలో ఉండే విందు,చిందు, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా అని మేకర్స్ తెలిపారు. రెండు రాష్ట్రాల వారు ఈ చిత్రం చూసి మెచ్చుకుంటారని వారు చెబుతున్నారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటు హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ... 'లగ్గం టీజర్ చాలా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. డైరెక్టర్ 'రమేష్ చెప్పాల' మంచి టేస్ట్తో ఈ సినిమాను తీశారనిపిస్తుంది. ఈసినిమాలో నటించిన రాజేంద్రప్రసాద్, రోహిణి, కృష్ణుడు వంటి వారితో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు బాగా దగ్గరిగా ఉన్నవారందరూ ఈ సినిమాలో ఉండడం సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని ఆయన అన్నారు.నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... 'మంచి సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నప్పుడు డైరెక్టర్ రమేష్ చెప్పాల తీసిన 'భీమదేవరపల్లి' సినిమా చూశాను. చాలా బాగా నచ్చి వెంటనే రమేష్తో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ క్రమంలో రమేష్ 'లగ్గం' కథ చెప్పడం జరిగింది. కథ నచ్చి వెంటనే సినిమా స్టార్ట్ చేశా. మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫీల్ గుడ్ సాంగ్స్ లగ్గం సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను' అని అన్నారు. -
ఆ రోజు ఏం జరిగింది?
డిటెక్టివ్గా ఓ మర్డర్ కేసును పరిష్కరించే పనిలో పడ్డారు హీరోయిన్ కరీనా కపూర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది బకింగ్హమ్ మర్డర్స్’. హన్సల్ మెహతా దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సెప్టెంబరు 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. విదేశాల్లో నివసిస్తున్న ఓ భారతీయుడి కుటుంబంలోని ఓ చిన్నారి హత్య నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో బ్రిటిష్– ఇండియన్ డిటెక్టివ్ జస్మిత్ భామ్రా పాత్రలో కరీనా నటిస్తున్నారని తెలుస్తోంది. ‘‘ఆ రోజు పార్కులో ఏం జరిగింది?, నువ్వు అతన్ని ఎలా చంపావ్?’...., ‘నువ్వు డిటెక్టివ్ కదా.. తెలుసుకో...!’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఏక్తా కపూర్, శోభా కపూర్లతో కలిసి ఈ సినిమాను కరీనా కపూర్ నిర్మించడం విశేషం. -
ఆమెతో కలిసి నటించాలన్న కల నెరవేరింది: హీరో
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'జ్యువెల్ థీఫ్'.శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్పై ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్ నారాయణ దర్శకత్వం వహించాడు. కృష్ణ సాయి, ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు.తాజాగా ఈ సినిమా టీజర్ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హీరోగా కృష్ణసాయి 'జ్యువెల్ థీఫ్' సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. సమాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజ జీవితంలోనూ ఆయన రియల్ హీరో అని తెలిపాడు.హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ఒకప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో కలిసి నటించాలన్న కల 'జ్యువెల్ థీఫ్' సినిమాతో నెరవేరింది అని పేర్కొన్నాడు. -
1980's Radhekrishna Teaser: నెత్తుటితో రాసిన ప్రేమకథ
ఎస్ఎస్ సైదులు హీరోగా, భ్రమరాంబిక అర్పిత హీరోయిన్గా నటించిన ద్విభాషా చిత్రం (తెలుగు, బంజారా) ‘1980లో రాధేకృష్ణ’. ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఊడుగు సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్కి నిర్మాతలు రామ్ తాళ్లూరి, బెక్కం వేణుగోపాల్, నటులు సోహైల్, ఆటో రామ్ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. ‘‘కృష్ణలంక... ఇక్కడ పుట్టే కులాన్ని బట్టి రాతలు రాయబడే ప్రాంతం. బతుకు బాగు కోసం ఎన్నో విప్లవ గేయాలు పాడిన గొంతులు మూగబోయిన ప్రాంతం, ఇది రాధాకృష్ణుల ప్రేమకావ్యాన్ని నెత్తురుతో లిఖించబడ్డ ప్రాంతం’’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఎస్ఎస్ సైదులు మాట్లాడుతూ– ‘‘మంచి కథతో తీసిన మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘తనికెళ్లభరణిగారి వాయిస్తో మా సినిమాకు ఒక కొత్త ఫీల్ వచ్చింది’’ అన్నారు ఇస్మాయిల్. ‘‘1980 కి తగ్గట్లుగా ఈ సినిమాను ఇస్మాయిల్గారు తీశారు’’ అని పేర్కొన్నారు ఊడుగు సుధాకర్. -
బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ చేతులపై 'కళింగ' టీజర్ రిలీజ్
'కిరోసిన్' హిట్తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. ఇప్పుడు 'కళింగ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నటించడంతో పాటు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ను బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విడుదల చేశారు.సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రాబోతున్న 'కళింగ' సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు తగ్గట్టుగా, గ్రిప్పింగ్ కథనంతో అందరినీ మెప్పించేలా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. ప్రేక్షకులని భయపెట్టారు కూడా. ప్రగ్యా నయన్ హీరోయిన్ కాగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటించారు. -
రవితేజ 'మిస్టర్ బచ్చన్' టీజర్ రిలీజ్ ఎలా ఉందంటే?
రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే టీజర్ని తాజాగా రిలీజ్ చేశారు. ఫెర్ఫెక్ట్ కమర్షియల్ అంశాలతో సినిమాని తీసినట్లు టీజర్ చూస్తే క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)ఓ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. ఓ పేరుమోసిన గుండాకి ఇంటికి రైడ్కి వెళ్తాడు. చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీలా అనిపిస్తుంది. దీనికి అదనంగా హీరోయిన్, పాటల్లాంటి హంగులు ఉన్నాయి. ప్రస్తుతం కాకుండా 90ల్లో జరిగిన కథలా విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. టీజర్ చూస్తే బాగానే ఉందనిపిస్తోంది. మరి ప్రేక్షకులు ఏ మేరకు దీన్ని రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాలి. బాలీవుడ్ హిట్ సినిమా 'రైడ్'కి దీన్ని రీమేక్గా తెరకెక్కించారు. కాకపోతే అధికారికంగా ఏం ప్రకటించలేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో చాలా సమస్యలు ఉన్నాయి.. సి.కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
Average Student Nani: ఆకట్టుకుంటున్న టీజర్
పవన్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. . శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు. మోస్ట్ రొమాంటిక్గా సాగిన ఈ టీజర్ యూత్ ఆడియెన్స్ను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి’,, ‘కాలేజ్లో ఉన్నంత వరకే స్టూడెంట్ నాని.. ఆ తరువాత కూకట్ పల్లి నాని’ అంటూ సాగే డైలాగ్స్తో యావరేజ్ స్టూడెంట్ నాని మోస్ట్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా సాగింది. ఈ టీజర్లో యూత్కి కావాల్సిన ప్రతీ అంశం ఉంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్ను టచ్ చేస్తూ టీజర్ను అద్భుతంగా కట్ చేశారు. ఈ టీజర్లో విజువల్స్, ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. -
రిలీజ్కు సిద్ధమైన పరాక్రమం మూవీ.. డేట్ ఫిక్స్!
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "పరాక్రమం". ఈ చిత్రాన్ని బీఎస్కే మెయిన్స్ట్రీమ్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ టీజర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ..'మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేస్తున్నాం. పరాక్రమం విషయానికి వస్తే ఇదొక సంఘర్షణతో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చా. నేను గతంలో నిర్భందం , నిర్భందం 2 , మాంగళ్యం సినిమాలను రూపొందించా. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. పేరుకి తగ్గట్లే అప్డేట్స్ అన్నీ ఒక్కో శనివారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇందులో విలన్గా నటిస్తున్న ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. టీజర్ కానీ టీజర్ అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది?(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?)ప్రతి శనివారం.. హీరో రకరకాలుగా ప్రవర్తించడం అనే స్టోరీతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్ కాగా.. తమిళ నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడు. కృూరమైన పోలీస్ అధికారిగా చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది.నాని-ప్రియాంక శ్రీకృష్ణుడు-సత్యభామగా.. ఎస్జే సూర్య నరకాసురుడు అని చెప్పడం లాంటి రిఫరెన్సులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. టీజర్ కాని టీజర్ అంటూనే ఆసక్తి రేకెత్తించారు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?) -
విలన్గా సునీల్ ఎంట్రీ.. టీజర్ అదిరిపోయింది!
రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్వుడ్లో మ్యాక్స్ మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోనా తర్వాత సుదీప్ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.టాలీవుడ్ నటుడు సునీల్ విలన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్లో సుదీప్ డిఫరెంట్ లుట్లో కనిపించారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్వుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో వస్తోన్న మ్యాక్స్ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో కనిపించడంతో.. సుదీప్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.MAX Takes Charge! 💥👿🔗https://t.co/GbhvhNzPAl#MAXManiaBegins with the explosive #MaxTeaser 🔥 #boloMAXii@Max_themovie @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shivakumarart @shekarchandra71 @ganeshbaabu21 @dhilipaction @ChethanDsouza @saregamasouth…— Kichcha Sudeepa (@KicchaSudeep) July 16, 2024 -
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టీజర్.. సమ్థింగ్ ఇంట్రెస్టింగ్!
కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ యంగ్ హీరోల్లో కాస్త మెరిట్ ఉన్న నటుడు. కాకపోతే దగ్గరకొచ్చిన సినిమాలన్నీ చేసేసి వరస ఫ్లాఫులు ఎదుర్కొన్నాడు. లెక్కకు మించిన విమర్శలు వచ్చేసరికి ఆలోచనలో పడిపోయాడు. ఏడాదికి మూడు సినిమాలు చేసే ఇతడు.. చాలా నెలల తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. దీని టీజరే ఇప్పుడు కిరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)'రాజావారు రాణిగారు' మూవీతో హీరోగా పరిచయమైన కిరణ్.. ఆ తర్వాత వరస సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ చూడలేకపోయాడు. దీంతో కాస్త టైమ్ తీసుకుని చేసిన పీరియాడికల్ మూవీ 'క'. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ బట్టి చూస్తుంటే.. ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్లా అనిపిస్తోంది. పక్కనోళ్ల ఉత్తరాలు చదివే ఓ పోస్ట్ మాస్టర్.. ఊరిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ అని తెలుస్తోంది.'నాకు తెలిసిన నేను మంచి.. నాకు తెలియని నేను..' అనే డైలాగ్తోపాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్నీ కూడా కిరణ్ అబ్బవరం గత చిత్రాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. టీజర్ కాబట్టి కంటెంట్ పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ప్రామిసింగ్గా ఉంది. మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా'.. ఆసక్తిగా టీజర్!
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కలి. ఈ చిత్రాన్ని శివ సాషు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్లో లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన కలి టీజర్ చూస్తే ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా.. నెక్ట్స్ లైఫ్ ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే మాత్రం మనిషిగా పుట్టకూడదు.. మంచితనంతో అస్సలు పుట్టకూడదు.' అనే డైలాగ్లో టీజర్ ప్రారంభమైంది. టీజర్లో ట్విస్ట్లు, సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో నేహా కృష్ణన్, గౌతన్ రాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, సివిఎల్ నరసింహారావు, మణిచందన, మధు మణి, త్రినాధ కీలక పాత్రల్లో నటించారు. -
'35 చిన్న కథ కాదు'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. -
'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి ఈ మధ్యే టీజర్ రిలీజైంది. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.(ఇదీ చదవండి: 'కల్కి' ముందు పెద్ద సవాలు.. నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో?)'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని అలరిస్తోంది. యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి.(ఇదీ చదవండి: 'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్ఫుల్!) -
థ్రిల్లింగ్గా ‘1000 వాలా’ టీజర్
అమిత్, షారుఖ్, నవిత, కీర్తి, సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘1000 వాలా’. అఫ్జల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అనే నమ్మకం కలిగింది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అని తెలిపారు. -
హీరోగా మగధీర విలన్.. టీజర్ రిలీజ్ చేసిన రాజమౌళి!
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బ్లాక్బస్టర్ చిత్రం మగధీర, రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రలో దేవ్గిల్ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 'ఇది అసుర రాజ్యం.. ఇక్కడికీ ఎవడైనా రావడమే తప్ప.. ప్రాణాలతో తిరిగిపోవడం ఉండదు' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన ఈ టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో దేవ్ గిల్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 'పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వేటాడే వేటగాడు' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచుతోంది. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడనేది కథ. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. Forever grateful to you @ssrajamouli garu 🙏🏼❤️#AhoVikramaarkaTeaser out now! - https://t.co/WIxYwyGxu7#AhoVikramaarka @iamdevsinghgill @ChitraShuklaOff @WriterPravin @tejaswwini @SayajiShinde @BithiriSathi_ @prabhakalakeya @petatrikoti pic.twitter.com/V5bw3GKavM— Dev Gill (@iamdevsinghgill) June 20, 2024 -
సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తోన్న శివం భజే.. టీజర్ వచ్చేసింది!
అశ్విన్ బాబు, దిగంగనా జంటగా నటించిన చిత్రం 'శివం భజే'. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర్ రెడ్డి నిర్మాతగా.. అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథతో మా సంస్థ నిర్మాణంలో వస్తోన్న చిత్రం 'శివం భజే'. టైటిల్, ఫస్ట్ లుక్కు మించి టీజర్కు స్పందన రావడం ఆనందంగా ఉంది. జూలైలో ప్రపంచవ్యప్తంగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు.దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. " శివం భజే టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించాం. టీజర్కు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత మహేశ్వర రెడ్డి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందిస్తాం. విడుదల తేదీ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని అన్నారు.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. "టీజర్కు అనూహ్య స్పందన వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా 'రా రాజా'.. టీజర్తోనే భయపెట్టారు!
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన చిత్రం 'రా రాజా'. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్పై శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఫుల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ..'రా రాజా సినిమా టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది . డైరెక్టర్ కథ చెబుతున్నంత సేపు చాల ఆసక్తిగా అనిపించింది. ఇందులో నటించిన ఇరవై నాలుగు క్యారెక్టర్స్ ఎవరి మొహాలు కనిపించకపోవడం అద్బుతం. ఏఐ జనరేషన్లో కూడా అసలు మొహాలు కనిపించకుండా సినిమా ఎలా తీశారు. ఆ ఒక్క రీజన్ కోసం అయినా త్వరగా చూడాలని ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. -
పండెరుపు చీరలో శ్రద్ధా స్టన్నింగ్ లుక్..ధర ఎంతంటే!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రద్ధా కపూర్ టీన్ పట్టి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయింది. అయితే ఆషికీ-2 సినిమాతోనే శ్రద్ధా కపూర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ నటనకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇప్పుడు శ్రద్ధా స్ట్రీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రద్ధా సంప్రదాయ చీరలో తళుక్కమంది. ఈ చీర ఆమె ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెప్పింది. ఆమె పూల మొక్కలతో కూడిన పండెరుపు చీరలో శ్రద్ధా ఎర్ర గులాబీలా అందంగా కనిపించింది.ఆ చీరకు తగ్గట్టు గోల్డెన్ బ్యాంగిల్స్, చక్కటి చెవిపోగులు, స్లీవ్ లెస్ బ్లౌజ్, సింపుల్ మ్యాకప్తో మరింతో అందంగా కనిపించిది. ఈ చీరను డిజైనర్ ధృవ్ పంచల్ తీర్చిదిద్దారు. దీని ధర ఏకంగా రూ. 31,500/-. శ్రద్ధా ఇలా చీరలో ఇంతకుమునుపు కూడా సందడి చేసింది. ప్రతి చీర ఆమె స్కిన్ టోన్కి తగ్గట్లుగా ఎంపిక చేసుకుంటుంది. తన లుక్ అందంగా కనిపించేలా సింపుల్ మేకప్కే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె నట్టించిన స్ట్రీ2 మూవీ వచ్చే నెల ఆగస్ట 15 థియోటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తన మూవీ ప్రమోషనల్ సందడి చేసేలా తన లుక్స్ పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది శ్రద్ధా.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)(చదవండి: స్లిమ్గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)