Tim Southee
-
కివీస్ పేసర్ భారీ హిట్టింగ్.. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు సమం
తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును సౌథీ సమం చేశాడు. కివీస్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడుతోంది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.లాథమ్, సాంట్నర్ ఫిఫ్టీలుహామిల్టన్లోని సెడాన్ పార్కులో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్తో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (135 బంతుల్లో 63; 9 ఫోర్లు), మిచెల్ సాంట్నర్ (54 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.మరోవైపు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (44; 9 ఫోర్లు), విల్ యంగ్ (42; 10 ఫోర్లు) రాణించారు. అయితే, ఒక దశలో 172/2తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్... మిడిలార్డర్ వైఫల్యంతో 231/7కు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (18), డరైన్ మిషెల్ (14), టామ్ బ్లన్డెల్ (21), గ్లెన్ ఫిలిప్స్ (5) విఫలమయ్యారు.చెలరేగిన సౌథీమరికాసేపట్లో ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటున్న దశలో ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ చెలరేగాడు. ఈ మ్యాచ్తో టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలుకనున్న టిమ్ సౌథీ (10 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా దుమ్ము రేపడంతో న్యూజిలాండ్ మూడొందల మార్కు దాటగలిగింది. వీరిద్దరి ధాటికి కివీస్ టి20 తరహాలో చివరి 8 ఓవర్లలో 76 పరుగులు రాబట్టడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.టెస్టు క్రికెట్లో భారీ సిక్స్లకు పెట్టింది పేరైన సౌథీకాగా టెస్టు క్రికెట్లో భారీ సిక్స్లకు పెట్టింది పేరైన సౌథీ ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో... క్రిస్ గేల్ (98 సిక్స్లు)తో సమంగా నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో ఉన్నది వీరేఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (133 సిక్స్లు) అగ్ర స్థానంలో ఉండగా... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ (107 సిక్స్లు), ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ (100 సిక్స్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.ఇక టీమిండియా నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్లు), రోహిత్ శర్మ (88 సిక్స్లు) ఈ జాబితాలో వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తరఫున 107వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సౌథీ... ఇంగ్లండ్తో సిరీస్ అనంతరం కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.ఇంగ్లండ్ 143 ఆలౌట్ఆదివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 143 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 340 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: భారత్తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్కు గుడ్ బై!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 35 ఏళ్ల సౌథీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది డిసెంబర్లో తన హోం గ్రౌండ్( హామిల్టన్లోని సెడాన్ పార్క్)లో ఇంగ్లండ్తో జరగనున్న మ్యాచ్ అనంతరం టెస్టులకు విడ్కోలు పలకనున్నట్లు సౌథీ వెల్లడించాడు.ఒకవేళ కివీస్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తే మాత్రం అతడు తన దేశం తరపున ఆడేందుకు అందుబాటులో ఉండనున్నాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు ఈ కివీ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు. "న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్క్యాప్స్ కోసం ఆడటం నాకు చాలా స్పెషల్. టెస్టు క్రికెట్కు నా హృదయంలో ప్రత్యేక స్ధానం ఉంది. ఏ జట్టుపై అయితే నేను టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశానో, ఇప్పుడు అదే జట్టుపై నా కెరీర్ను ముగించనున్నాను. నాకు బాగా ఇష్టమైన మూడు మైదానాల్లో సెడాన్ పార్క్ ఒకటి.అందుకే అక్కడే టెస్టులకు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను"అని సౌథీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా 2008లో ఇంగ్లండ్పై సౌథీ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తన 18 ఏళ్ల కెరీర్లో కివీస్ తరపున ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన సౌథీ.. 385 వికెట్లతో పాటు 2185 పరుగులు సాధించాడు. మరోవైపు 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు తీశాడు. 125 టీ20లు ఆడిన సౌథీ 303 పరుగులు, 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది -
సౌథీ అరుదైన ఘనత.. సెహ్వాగ్ సిక్సర్ల రికార్డు బ్రేక్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్లో 402 పరుగుల భారీ స్కోర్ను సాధించడంలో సౌథీ కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 147 టెస్టు ఇన్నింగ్స్లలో సౌథీ 92 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సెహ్వాగ్ను ఈ కివీ వెటరన్ అధిగమించాడు. ఇక అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్(131) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు న్యూజిలాండ్ వెటరన్ టిమ్ సౌథీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి సౌథీ తప్పుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో 2-0 తేడాతో న్యూజిలాండ్ ఘోర పరాభావం చూసిన తర్వాత సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.నాకు ఇష్టమైన రెడ్ బాల్ ఫార్మాట్లో న్యూజిలాండ్ కెప్టెన్గా పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్లో జట్టును నెం1గా నిలపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఆటగాడిగా నావంతు పాత్ర పోషిస్తున్నాను. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఓ ప్రకటనలో సౌథీ పేర్కొన్నాడు.కాగా గతేడాది కేన్ విలియమ్సన్ నుంచి కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు సౌథీ చేపట్టాడు. అయితే కెప్టెన్గా సౌథీ పర్వాలేదన్పించాడు. అతడి సారథ్యంలో 14 టెస్టులు ఆడిన బ్లాక్ క్యాప్స్.. ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించగా, మరో 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. మరో రెండు మ్యాచ్లను ఓటమితో ముగించింది.న్యూజిలాండ్ కెప్టెన్గా లాథమ్..ఇక బ్లాక్ క్యాప్స్ టెస్టు కెప్టెన్గా వెటరన్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ బాధ్యతలు చేపట్టాడు. ఆక్టోబర్ 16 నుంచి భారత్తో ప్రారంభం కానున్న తొలి టెస్టుతో కివీస్ కెప్టెన్గా లాథమ్ ప్రయాణం మొదలు కానుంది. లాథమ్ వన్డే, టెస్టు ఫార్మాట్లో కివీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇక భారత్తో కివీస్ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం కివీస్ ఆక్టోబర్ 10న భారత్కు వచ్చే ఛాన్స్ ఉంది. -
Afg vs NZ Day 1: ఒక్క బంతి పడకుండానే ముగిసిన ఆట
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్కు మొదటిరోజే ఆటంకం కలిగింది. వర్షం తాలూకు ప్రభావం కారణంగా ఒక్క బంతి పడకుండానే తొలి రోజు ఆట ముగిసిపోయింది. ఫలితంగా మ్యాచ్ను ఘనంగా ఆరంభించాలనుకున్న ఇరుజట్లకు చేదు అనుభవమే మిగిలింది.మూడింట విజయాలుకాగా 2017లో టెస్టు జట్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్... ఇప్పటి వరకు సంప్రదాయ ఫార్మాట్లో తొమ్మిది మ్యాచ్లు ఆడింది. టీమిండియాతో ఒకటి, ఐర్లాండ్తో రెండు, బంగ్లాదేశ్తో రెండు, వెస్టిండీస్తో ఒకటి, జింబాబ్వేతో రెండు, శ్రీలంకతో ఒక టెస్టులో పాల్గొంది. వీటిలో జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్లపై ఒక్కో మ్యాచ్లో గెలుపొందింది. ఈ క్రమంలో న్యూజిలాండ్తో తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆడేందుకు సిద్ధమైంది.ఆటగాళ్ల క్షేమమే ముఖ్యంతమదేశంలో ఇందుకు అనుకూల పరిస్థితులు లేని నేపథ్యంలో భారత్ వేదికగా కివీస్తో పోటీకి అన్నిరకాలుగా సన్నద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా నోయిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అవుట్ఫీల్డ్ మొత్తం పూర్తిగా తడిచిపోయింది. ఈరోజు కాస్త ఎండగానే ఉన్నా.. అవుట్ఫీల్డ్ మాత్రం పూర్తిగా ఆరలేదు.రోజుకొక అరగంట ఎక్కువ?గ్రౌండ్స్మెన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహిస్తే.. ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్లు జారిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్ట్యా తొలిరోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు కుమార్ ధర్మసేన, షర్ఫూద్దౌలా తెలిపారు. రేపటి నుంచి నాలుగురోజుల పాటు మ్యాచ్ను నిర్వహిస్తామని వెల్లడించారు.అనూహ్య పరిస్థితుల్లో తొలిరోజు ఆట రద్దైన కారణంగా మిగిలిన నాలుగు రోజులు అరగంట ఎక్కువసేపు ఆట కొనసాగిస్తామని తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆట మొదలవుతుందని పేర్కొన్నారు. కాగా స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ గాయం కారణంగా కివీస్తో టెస్టుకు దూరమయ్యాడు.న్యూజిలాండ్తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్.అఫ్గన్తో టెస్టు మ్యాచ్కు న్యూజిలాండ్ జట్టుటామ్ లాథమ్(వికెట్ కీపర్), టిమ్ సౌతీ(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, మ్యాచ్ హెన్రీ, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, విలియం ఒరూర్కీ. The buildup is 🔛!While we wait for the start of the game, check out these glimpses of the current scenes in Greater Noida. 👍#AfghanAtalan | #GloriousNationVictoriousTeam pic.twitter.com/aLC5SZGoaW— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2024 -
భారత్కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు.. ఎందుకంటే?
న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ మధ్య చారిత్రత్మక టెస్టు మ్యాచ్కు గ్రేటర్ నోయిడా ఆతిథ్యమివ్వనుంది. బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటికే నోయిడాకు చేరుకోగా.. తాజాగా కివీస్ జట్టు సైతం భారత గడ్డపై అడుగుపెట్టింది.కెప్టెన్ టిమ్ సౌథీ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గురువారం తెల్లవారుజామునఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి గ్రేటర్ నోయిడాకు బస్సులో కివీస్ పయనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.శుక్రవారం నుంచి బ్లాక్ క్లాప్స్ తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టనుంది. కాగా ఈ మ్యాచ్ భారత్తో టెస్టు సిరీస్కు ముందు జరగనుండడంతో కివీస్కు ప్రాక్టీస్గా ఉపయోగపడనుంది.అఫ్గాన్ సిరీస్కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ Welcome @BlackCapsVideo: The New Zealand team has arrived at the hotel in Greater Noida, India, for the one-off Test match against Afghanistan's national team.#AfghanAtalan | #AFGvNZ | #GloriousNationVictoriousTeam pic.twitter.com/UlQApG5UXP— Afghanistan Cricket Board (@ACBofficials) September 5, 2024 -
ఐదేసిన సౌథీ.. హండ్రెడ్ లీగ్ నుంచి రాకెట్స్ ఔట్
హండ్రెడ్ లీగ్ 2024 పురుషుల ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ప్లే ఆఫ్స్కు చేరే నాలుగు జట్లపై క్లారిటీ రానప్పటికీ.. టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లేవో తేలిపోయాయి. నిన్న బర్మింగ్హమ్ ఫీనిక్స్ చేతిలో ఓటమితో ట్రెంట్ రాకెట్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. రాకెట్స్తో పాటు వెల్ష్ ఫైర్, మాంచెస్టర్ ఒరిజినల్స్, లండన్ స్పిరిట్ ఈ ఎడిషన్ నుంచి నిష్క్రమించాయి. ఓవల్ ఇన్విన్సిబుల్స్ మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. సథరన్ బ్రేవ్, బర్మింగ్హమ్ ఫీనిక్స్, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ రేసులో ఉన్నాయి.బర్మింగ్హమ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ టిమ్ సౌథీ (20-13-12-5) ఐదు వికెట్ల ఘనతతో చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 118 పరుగులకు ఆలౌటైంది. రాకెట్స్ ఇన్నింగ్స్లో అల్సోప్ (51), ఇమాద్ వసీం (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌథీతో పాటు క్రిస్ వుడ్ (20-7-30-2), ఆడమ్ మిల్నే (20-14-17-1) వికెట్లు తీశారు.అనంతరం 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫీనిక్స్.. లివింగ్స్టోన్ (30 నాటౌట్), జేకబ్ బేతెల్ (38 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్లతో రాణించడంతో 93 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫీనిక్స్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ 30, మొయిన్ అలీ 13 పరుగులు చేయగా.. జేమీ స్మిత్, డాన్ మౌస్లీ గోల్డెన్ డకౌట్లయ్యారు. రాకెట్స్ బౌలర్లలో లూక్ వుడ్, జాన్ టర్నర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
పసికూనపై ప్రతాపం.. ఎట్టకేలకు తొలి విజయం.. ఏం లాభం?
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఉగాండాను చిత్తుగా ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది.ఈ మెగా ఈవెంట్లో అఫ్గనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియాలో కలిసి గ్రూప్-సిలో ఉన్న న్యూజిలాండ్.. తొలి రెండు మ్యాచ్లలో పరాజయం పాలైంది.మొదట అఫ్గనిస్తాన్ చేతిలో 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కేన్ విలియమ్సన్ బృందం.. తదుపరి వెస్టిండీస్ చేతిలో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.మరోవైపు.. అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ వరుస విజయాలతో రాణించి.. సూపర్-8 బెర్తును ఖరారు చేసుకోవడంతో న్యూజిలాండ్ కథ ముగిసిపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్లలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న కివీస్.. తాజాగా శనివారం నాటి మ్యాచ్లో పసికూన ఉగాండాపై ప్రతాపం చూపింది.ట్రినిడాడ్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టిమ్ సౌతీ(3/4), ట్రెంట్ బౌల్ట్(2/7), లాకీ ఫెర్గూసన్(1/9).. స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్(2/8), రచిన్ రవీంద్ర(2/9) ఆకాశమే హద్దుగా చెలరేగారు.దీంతో ఉగాండా 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఉగాండా ఇన్నింగ్స్లో టాప్ స్కోర్ 11గా నమోదైంది. ఇక అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(15 బంతుల్లో 22), రచిన్ రవీంద్ర(1)తో కలిసి అజేయంగా నిలిచి.. కివీస్ విజయాన్ని ఖరారు చేశాడు.ఫలితంగా వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన న్యూజిలాండ్ వరల్డ్కప్-2024లో పాయింట్ల ఖాతా తెరిచింది. తదుపరి జూన్ 17న పపువా న్యూగినియాతో కివీస్ జట్టు తలపడనుంది. కాగా ఉగాండాపై న్యూజిలాండ్ విజయం నేపథ్యంలో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా ఒకటి గెలిచిందని కొంతమంది సంతోషిస్తుంటే.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని మరికొందరు విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: న్యూజిలాండ్ స్టార్ పేసర్కు మందలింపు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు గానూ న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ మందలింపుకు గురయ్యాడు. ఈ మ్యాచ్లో సౌథీ ఔటయ్యాక డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తూ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్ను పగులగొట్టాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ల్లో గ్రౌండ్ పరికరాలను ధ్వంసం చేస్తే ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కింద ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారు. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సౌథీ స్వల్ప మందలింపుకు గురి కావడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ పొందాడు. గడిచిన 24 నెలల్లో సౌథీకి ఇది మొదటి ఉల్లంఘణ కావడంతో ఐసీసీ మందలింపుతో వదిలి పెట్టింది. సౌథీ తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ముందు అంగీకరించాడు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ 2024లో న్యూజిలాండ్ ప్రస్తానం ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఓడటంతో న్యూజిలాండ్ అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. న్యూజిలాండ్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. -
NZ vs AUS: చెలరేగిన హాజిల్వుడ్.. కుప్పకూలిన కివీస్! కానీ..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్ జోష్ హాజిల్వుడ్ దెబ్బకు కివీస్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ టామ్ లాథమ్ 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో మ్యాట్ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో వికెట కీపర్ టామ్ బ్లండెల్(22), కెప్టెన్ టిమ్ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్వుడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్ పేసర్ బెన్ సీర్స్. ఓపెనర్ స్టీవ్ స్మిత్(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్ పడగొట్టాడు. అనంతరం మరో ఫాస్ట్బౌలర్ మ్యాట్ హెన్రీ ఉస్మాన్ ఖవాజా(16), కామెరాన్ గ్రీన్(25), ట్రవిస్ హెడ్(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 45, నాథన్ లియోన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం. -
రోజు వ్యవధిలో సెంచరీలు కొట్టనున్న నలుగురు స్టార్ క్రికెటర్లు
అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు సెంచరీలు కొట్టబోతున్నారు. మార్చి 7, 8 తేదీల్లో టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్కు చెందిన జానీ బెయిర్స్టో, న్యూజిలాండ్కు చెందిన కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు తమ కెరీర్లలో వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు వందో టెస్ట్ మ్యాచ్ ఆడటం క్రికెట్ చరిత్రలో బహుశా జరిగి ఉండకపోవచ్చు. ఈ రికార్డుకు సంబంధించిన సరైన సమాచారం లేదు కానీ, ఇలాంటి సందర్భం రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరో విశేషమేమిటంటే.. పై పేర్కొన్న తేదీల కంటే కొద్ది రోజుల ముందు (ఫిబ్రవరి 15న) ఇంగ్లండ్కే చెందిన మరో ఆటగాడు వంద టెస్ట్ సెంచరీల మార్కును తాకాడు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్తో జరిగిన మూడో టెస్ట్తో వంద సెంచరీల అరుదైన మైలురాయిని తాకాడు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. జానీ బెయిర్స్టో- 99 టెస్ట్ల్లో 12 సెంచరీలు, 5974 పరుగులు రవింద్రన్ అశ్విన్- 99 టెస్ట్ల్లో 5 సెంచరీలు, 3309 పరుగులు, 507 వికెట్లు కేన్ విలియమ్సన్- 99 టెస్ట్ల్లో 32 సెంచరీలు, 8675 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-99 టెస్ట్ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2072 పరుగులు, 378 వికెట్లు టెస్ట్ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్ల మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. -
NZ VS AUS 1st T20: టిమ్ సౌథీ రికార్డు
న్యూజిలాండ్ వెటరన్ బౌలర్ టిమ్ సౌథీ ఆ దేశం తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్లో ఆడటం ద్వారా సౌథీ ఈ ఘనతను సాధించాడు. సౌథీ ఈ రికార్డును సాధించే క్రమంలో మార్టిన్ గప్తిల్ను అధిగమించాడు. గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 122 టీ20లు ఆడగా.. సౌథీ ఇవాల్టి మ్యాచ్తో కలుపుకుని 123 మ్యాచ్ల్లో న్యూజిలాండ్కు ప్రాతినిథ్యం వహించాడు. సౌథీ, గప్తిల్ తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐష్ సోధి పేరిట ఉంది. సోధి తన టీ20 కెరీర్లో 110 మ్యాచ్లు ఆడాడు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ టీమిండియా తరఫున ఇప్పటివరకు 151 మ్యాచ్లు ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్ను గెలిపించాడు. ఆసీస్ గెలుపులో మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
మార్చి 7, 8 తేదీల్లో సెంచరీలు కొట్టనున్న నలుగురు క్రికెటర్లు..!
మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. బెన్ స్టోక్స్- 99 టెస్ట్ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు జానీ బెయిర్స్టో- 97 టెస్ట్ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు కేన్ విలియమ్సన్- 98 టెస్ట్ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-98 టెస్ట్ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు టెస్ట్ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్ల మార్కును తాకారు. -
సౌతాఫ్రికాతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. రచిన్ రీఎంట్రీ..?
సౌతాఫ్రికా స్వదేశంలో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ సిరీస్లో టిమ్ సౌథీ న్యూజిలాండ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ విల్ ఓ రూర్కీకు తొలి సారి టెస్ట్ జట్టులో అవకాశం లభించింది. వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్ర ఈ సిరీస్తో టెస్ట్ల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రచిన్ వన్డేల్లోలా ఓపెనర్గా కాకుండా మిడిలార్డర్లో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ప్లేయర్ హెన్రీ నికోల్స్కు అవకాశం లభించలేదు కాదు కాబట్టి రచిన్కు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. 2021 భారత పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేసిన రచిన్.. ఆ పర్యటనలో రెండు టెస్ట్లు, ఆతర్వాత 2022లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్లో మాత్రమే ఆడాడు. ఆతర్వాత రచిన్కు టెస్ట్ జట్టులో అవకాశం దొరకలేదు. తిరిగి ఇన్నాళ్లకు రచిన్కు టెస్ట్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. వన్డే వరల్డ్కప్ 2023 అద్భుత ప్రదర్శనకు గానూ రచిన్ గతేడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ మౌంట్ మాంగనూయ్ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు.. రెండో మ్యాచ్ హ్యామిల్టన్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 17 తేదీల మధ్యలో జరుగుతుంది. సౌతాఫ్రికాతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ (రెండో టెస్టుకు మాత్రమే), గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్ , విల్ యంగ్ -
చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్గా రికార్డు
New Zealand vs Pakistan, 1st T20I: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌతీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్తో తొలి టీ20 సందర్భంగా సౌతీ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఐదు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన షాహిన్ ఆఫ్రిది బృందం న్యూజిలాండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డారిల్ మిచెల్(27 బంతుల్లో 61- నాటౌట్), కెప్టెన్ విలియమ్సన్ (57) అద్భుత అర్ధ శతకాలతో మెరవగా.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లకే చేతులెత్తేసింది. 180 పరుగులకు ఆలౌట్ అయి 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏకైక బౌలర్గా రికార్డు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో టిమ్ సౌతీ.. మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) రూపంలో రెండు బిగ్ వికెట్లు తీశాడు. అబ్బాస్ ఆఫ్రిదిని అవుట్ చేసిన క్రమంలో.. అంతర్జాతీయ టీ20లలో తన 150వ వికెట్ నమోదు చేశాడు సౌతీ. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. ఇక అబ్బాస్ తర్వాత హ్యారిస్ రవూఫ్ను పెవిలియన్కు పంపిన సౌతీ తొలి టీ20లో న్యూజిలాండ్ విజయాన్ని ఖరారు చేశాడు. నంబర్ 2 ఎవరంటే ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 35 ఏళ్ల కివీస్ ఫాస్ట్బౌలర్ టిమ్ సౌతీ(151) అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ అరుదైన లిస్టులో న్యూజిలాండ్ నుంచి ఇష్ సోధి(127), మిచెల్ సాంట్నర్(105) కూడా చోటు దక్కించుకోవడం విశేషం. చదవండి: Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్ శర్మ -
Ban vs NZ: న్యూజిలాండ్కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. తొలిరోజే..
Bangladesh vs New Zealand, 2nd Test: బంగ్లాదేశ్తో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్కు శుభారంభం లభించలేదు. తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టును 172 పరుగులకే కట్టడి చేశామన్న సంతోషం కివీస్ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సరికి అనూహ్యంగా బంగ్లాదేశ్ ఆధిక్యంలోకి వచ్చింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హైట్లో జరిగిన తొలి మ్యాచ్లో కివీస్కు ఘోర పరభావం ఎదురైంది. బంగ్లాదేశ్ గడ్డపై మొదటిసారి ఆతిథ్య జట్టు చేతిలో.. అది కూడా 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని భావిస్తోంది టిమ్ సౌథీ బృందం. ఇందులో భాగంగా ఢాకాలో బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను 172 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్ రెండు, సౌథీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆరంభంలోనే కివీస్కు షాక్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ లాథమ్ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(11), వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(13)ను మెహిది హసన్ మిరాజ.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(1)ను తైజుల్ అవుట్ చేశారు. ఆరో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ను హసన్ మిరాజ్ డకౌట్ చేయగా.. వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 12, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 12.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి వెనుకబడిపోయింది. హైలైట్స్ ఇవే ఇక ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వింతైన పద్ధతిలో అవుట్ కావడం హైలైట్గా నిలిచింది. జెమీసన్ బౌలింగ్లో వికెట్ల దిశగా వెళ్తున్న బంతిని చేతితో ఆపి రహీం హ్యాండిలింగ్ ద బాల్ నిబంధన వల్ల పెవిలియన్ చేరాడు. మరోవైపు.. తొలిరోజు ఆటలోనే మొత్తంగా 15 వికెట్లు కూలడం మరో విశేషం. మొత్తానికి ఢాకా పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇక న్యూజిలాండ్ ప్రస్తుతం బంగ్లా కంటే 117 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while... . .#BANvNZ pic.twitter.com/SC7IepKRTh — FanCode (@FanCode) December 6, 2023 -
న్యూజిలాండ్కు భారీ షాక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. భారీ విజయంతో..
Bangladesh vs New Zealand, 1st Test: పటిష్ట న్యూజిలాండ్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్పై భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో టిమ్ సౌథీ బృందాన్ని ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. కాగా రెండు టెస్టులు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం(నవంబరు 28) ఇరు జట్ల మధ్య సిల్హెట్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య బంగ్లా 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ను బంగ్లాదేశ్ 338 పరుగుల వద్ద ముగించగా.. కివీస్ 181 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్, తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లతో చెలరేగి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్ రూపంలో కీలక వికెట్లు తీసిన తైజుల్.. కైలీ జెమీషన్, ఇష్ సోధి, టిమ్ సౌథీలను కూడా అవుట్ చేసి శనివారం నాటి ఐదోరోజు తొలి సెషన్లోనే మ్యాచ్ను ముగించాడు. టెస్టుల్లో షాంటో బృందం సరికొత్త చరిత్ర ఇలా బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్పై బంగ్లాదేశ్కు ఇదే తొలి టెస్టు గెలుపు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు తొలిసారి సారథిగా వ్యవహరించిన నజ్ముల్ షాంటో ఈ మేరకు చారిత్రాత్మక విజయం అందుకోవడం విశేషం. ఇక గత 18 టెస్టుల్లోనూ బంగ్లాదేశ్కు ఇదే రెండో విజయం కావడం గమనార్హం. నాలుగో రోజు ఆట ముగిసిందిలా కాగా.. 332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్ మిచెల్ (44 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (4/24) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 212/3తో శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (67), మెహదీ హసన్ మిరాజ్ (50 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు. ఇక ఐదో రోజు ఆటలో భాగంగా విజయానికి కివీస్ మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్ నయీం హసన్ తొలి వికెట్ తీయగా.. తైజుల్ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు. చదవండి: అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్కు గుడ్ న్యూస్!
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(ఆక్టోబర్22)న ధర్మశాల వేదికగా టీమిండియాతో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ టిమ్ సౌథీ భారత్తో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో సౌథీ చేతి వేలికి గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. తమ జట్టుతో కలిసి భారత్కు వచ్చినప్పటికీ మొదటి నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే సౌథీ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టు సెలక్షన్కు అందుబాటోకి వచ్చాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ స్టాండింగ్ కెప్టెన్ టామ్ లాథమ్ ధృవీకరించాడు. "భారత్తో మ్యాచ్ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. ఇది గొప్ప పోటీ. ప్రపంచవ్యాప్తంగా కివీస్ ఎక్కడ ఆడినా అభిమానుల నుంచి సపోర్ట్ ఉంటుంది. ఈ భారత్లో కూడా బ్లాక్ క్యాప్స్కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివకు ఈ టోర్నీలో ఇప్పటివరకు అద్బుత విజయాలు సాధించాం. రాబోయే మ్యాచ్ల్లో కూడా అదే రిథమ్ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. ఇక కేన్ విలియమ్సన్ జట్టుతో ఉన్నప్పటికీ బొటనవేలు గాయంతో బాధపడతున్నాడు. అతడు రోజు రోజుకు బాగా కోలుకుంటున్నాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నాను. అయితే టిమ్ సౌథీ మాత్రం ఫిట్నెస్ సాధించాడు. అతడు భారత్తో మ్యాచ్కు జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నాడు" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో టామ్ లాథమ్ పేర్కొన్నాడు. -
న్యూజిలాండ్కు గుడ్న్యూస్.. కేన్ మామ వచ్చేసాడు!
వన్డే ప్రపంచకప్-2023లో వరుసగా మూడో విజయంపై న్యూజిలాండ్ కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్తో మ్యాచ్కు బరిలో దిగనున్నాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్లకు గాయం కారణంగా విలియమ్సన్ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు కేన్ మామ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. విలియమ్సన్ రాకతో కివీస్ జట్టు మరింత బలంగా తయారుకానుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ సందర్భంగా గాయపడిన విలియమ్సన్ అప్పటినుంచి కివీస్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు రెండు వామప్ మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ చేసిన కేన్.. మ్యాచ్ మధ్యలోనే రిటైర్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇప్పడు తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో రిఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు స్టార్ పేసర్ టిమ్ సౌథీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. సౌథీ చేతివేలి గాయంతో బాధపడతున్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో మ్యాచ్కు కూడా సౌథీ దూరమయ్యే ఛాన్స్ ఉంది. వరల్డ్కప్కు న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, విల్ యంగ్, టిమ్ సౌతీ, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్గా ప్రమోషన్ -
న్యూజిలాండ్కు మరో బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్తో తొలి మ్యాచ్కు ముందు న్యూజిలాండ్కు మరో బిగ్షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టిమ్ సౌథీ గాయం కారణంగా మొదటి మ్యాచ్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఇంగ్లండ్తో మ్యాచ్కు దూరమయ్యాడు. ఇప్పుడు సౌథీ కూడా దూరం కావడం కివీస్ నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా సౌథీ బొటనవేలు గాయమైంది. వెంటనే సిరీస్ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే వరల్డ్కప్ జట్టు ప్రకటనకు ముందు సౌథీ ఫిట్గా ఉన్నాడని కివీస్ ప్రకటించింది. కానీ భారత్కు వచ్చిన సౌథీ ఇంకా గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో పది రోజుల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్తో జరిగిన వామాప్ మ్యాచ్లో కూడా సౌథీ బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో అతడి స్ధానంలో జామీసన్ తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఆరంభ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. న్యూజిలాండ్ వరల్డ్ కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: కొంచెం బాధగా ఉంది.. నాకు అలవాటు అయిపోయింది: చాహల్ -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి బౌలర్గా
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా సౌథీ రికార్డులకెక్కాడు. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో జానీ బెయిర్స్టోను ఔట్ చేసిన సౌథీ.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ కివీస్ వెటరన్ 8.13 ఏకనామీతో 141 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(140) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో షకీబ్ రికార్డును సౌథీ బ్రేక్ చేశాడు. కాగా రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరం కావడంతో ఇంగ్లండ్ పర్యటనలో కివీస్ జట్టును సౌథీ నడిపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్, కార్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్,మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 140 లక్ష్యాన్ని కేవలం 14 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఊదిపడేసింది. గ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(54), హ్యారీ బ్రూక్(43 నాటౌట్) పరుగులతో మ్యాచ్ను మగించారు. చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్.. సిరీస్ సొంతం
దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. ఈవిజయంతో రెండో టీ20 ఓటమికి కివీస్ ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ఱీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(56), చాప్మన్(51) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దుఖీ మూడు వికెట్లు పడగొట్టగా.. జహూర్ ఖాన్, జవదుల్లా తలా వికెట్ సాధించారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లలో ఆయాన్ ఖాన్(42) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో లిస్టర్ మూడు వికెట్లు, జామీసన్, శాంట్నర్, ఆశోక్ తలా వికెట్ సాధించారు. 56 పరుగులతో రాణించిన విల్యంగ్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది..10 ఏళ్లగా కష్టపడుతున్నా! నా తొలి మ్యాచ్లోనే: రింకూ -
న్యూజిలాండ్కు బిగ్షాకిచ్చిన పసికూన.. 7 వికెట్ల తేడాతో సంచలన విజయం
న్యూజిలాండ్కు పసికూన యూఏఈ బిగ్షాకిచ్చింది. దుబాయ్ వేదికగా కివీస్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్పై యూఏఈకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో యూఏఈకు ఇదే మొదటి గెలుపు. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో యూఏఈ సమం చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. యూఏఈ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగుల మాత్రమే చేయగల్గింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్మాన్(63) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. జవదుల్లా రెండు, నసీర్, మహ్మద్ ఫరాజుద్దీన్ తలా వికెట్ సాధించారు. వసీం కెప్టెన్ ఇన్నింగ్స్.. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ వసీం(55) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఆసీఫ్ ఖాన్(48 నాటౌట్) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, శాంట్నర్, జేమీసన్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో టీ20 దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. చదవండి: సిరీస్పై భారత్ కన్ను The moment UAE became the first associate team to beat New Zealand...!! A proud day for UAE cricket. pic.twitter.com/v6t6MvpXfc — Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023 -
5 వికెట్లతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్.. యూఏఈపై ఘన విజయం
యూఏఈతో మూడు టీ20ల సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయంలో కెప్టెన్ టిమ్ సౌథీ కీలక పాత్ర పోషించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. బ్లాక్క్యాప్స్ బ్యాటర్లలో సీఫెర్ట్(55),మెక్కన్చీ(31) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ, హమీద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జహూర్ ఖాన్, ఫరాజుద్దీన్ చెరో వికెట్ పడగొట్టారు. 5 వికెట్లతో చెలరేగిన సౌథీ.. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈను టిమ్ సౌథీ ఆదిలోనే దెబ్బతీశాడు. కెప్టెన్ మహ్మద్ వసీంను తొలి బంతికే ఔట్చేసి కష్టాల్లో నెట్టాడు. ఈ మ్యాచ్లో సౌథీ 5 వికెట్లతో చెలరేగాడు. కివీస్ కెప్టెన్ సంచలన బౌలింగ్ ధాటికి యూఏఈ 136 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ(60) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 దుబాయ్ వేదికగా శనివారం జరగనుంది. చదవండి: IND vs IRE: ఐర్లాండ్తో తొలి పోరు.. శుభారంభం లక్ష్యంగా -
కివీస్తో సిరీస్.. కొత్త కెప్టెన్గా అతడు! ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ వీరుడి అరంగేట్రం!
New Zealand tour of United Arab Emirates, 2023: న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్తో పోరు నేపథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తమ టీ20 కొత్త కెప్టెన్గా మహ్మద్ వసీం పేరును ఖరారు చేసినట్లు యూఏఈ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇంగ్లండ్ కంటే ముందు కాగా ఇంగ్లండ్తో సిరీస్కు ముందు న్యూజిలాండ్.. యూఏఈతో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 17, 19, 20 తేదీల్లో దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి. ఈ క్రమంలో కివీస్ వంటి పటిష్ట జట్టుతో తలపడనున్న వసీం సారథ్యంలో 16 మంది సభ్యులున్న జట్టును ఎంపిక చేసినట్లు యూఏఈ బోర్డు బుధవారం తెలిపింది. రిజ్వాన్ స్థానంలో వసీం సీపీ రిజ్వాన్ స్థానంలో వసీం యూఏఈ టీ20 జట్టును ముందుకు నడిపించనున్నట్లు పేర్కొంది. కాగా కివీస్తో సిరీస్ సందర్భంగా అసోసియేట్ దేశాల్లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన అసిఫ్ ఖాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయనున్నాడు. అతడితో పాటు.. దేశవాళీ క్రికెట్లో అదరగిట్టిన ఆల్రౌండర్ ఫరాజుద్దీన్, స్పిన్నర్ జశ్ గియనానీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు యూఏఈ జట్టు: మహ్మద్ వసీం(కెప్టెన్), అలీ నాసీర్, అన్ష్ టాండన్, ఆర్యాంశ్ శర్మ, అసిఫ్ ఖాన్, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, ఈథన్ డిసౌజా, ఫరాజుద్దీన్, జశ్ గియనానీ, జునైద్ సిద్దిఖి, లవ్ప్రీత్ సింగ్, మహ్మద్ జవాదుల్లా, సంచిత్ శర్మ, వ్రిత్య అరవింద్, జహూర్ ఖాన్. యూఏఈతో సిరీస్కు కివీస్ జట్టు: టిమ్ సౌతీ(కెప్టెన్), అది అశోక్, చాడ్ బోస్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, కైలీ జెమీషన్, బెన్ లిస్టర్, కోలీ మెకాంచి, జిమ్మీ నీషం, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, విల్ యంగ్. సిరీస్ వివరాలు ►ఆగష్టు 17, ఆగష్టు 19, ఆగష్టు 20- మూడు టీ20లు ►స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్కోడ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం ►దుబాయ్లోనే మూడు టీ20లు ►భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్లు ఆరంభం. చదవండి: అక్కడ ఒక్కరాత్రికి 4 వేలు ఉండేది.. ఆరోజు మాత్రం ఏకంగా 60 వేలు! Squad ALERT: We unveil the 16 for the #UAEvNZ series. Mohammad Waseem to captain. More details: https://t.co/Vq3aSFqIwx pic.twitter.com/cmYCucYLUb — UAE Cricket Official (@EmiratesCricket) August 16, 2023 -
అంతర్జాతీయ టీ20లలో మొనగాడు.. అత్యధిక వికెట్లు తీసి..
Bangladesh vs Ireland, 2nd T20I - Shakib Al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీని వెనక్కినెట్టి ముందుకు దూసుకువచ్చాడు. స్వదేశంలో ఐర్లాండ్తో రెండో టీ20 సందర్భంగా ఐదు వికెట్లు కూల్చిన షకీబ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. టపాటపా.. ఐదు వికెట్లు చట్టోగ్రామ్లో జరిగిన మ్యాచ్లో ఐరిష్ ఓపెనర్ రాస్ అడేర్(6), వికెట్ కీపర్, వన్డౌన్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్(5), నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హ్యారీ టెక్టార్(22), ఐదో స్థానంలో దిగిన గరేత్ డెలనీ(6), ఆరో స్థానంలో వచ్చిన జార్జ్ డాక్రెల్(2) వికెట్లను షకీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. వీరందరినీ తక్కువ స్కోరుకు కట్టడి చేసి ఐర్లాండ్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అటు బ్యాట్(38 నాటౌట్)తోనూ ఇటు బంతితోనూ మ్యాజిక్ చేసి బంగ్లాదేశ్ను గెలిపించాడీ స్పిన్ ఆల్రౌండర్. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి.. బంగ్లాకు మరో సిరీస్ విజయం అందించాడు. ఇప్పటి దాకా అన్ని వరల్డ్కప్లలో కాగా అంతర్జాతీయ టీ20లలో వికెట్ల విషయంలో ఇప్పటివరకు టిమ్ సౌతీ ముందంజలో ఉండగా.. షకీబ్ అతడిని అధిగమించాడు. తద్వారా నంబర్1 గా అవతరించాడు. 2006లో జింబాబ్వేతో మ్యాచ్తో ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అడుగుపెట్టిన షకీబ్ ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ పాల్గొనడం విశేషం. ఇప్పటి వరకు అతడు బంగ్లా తరఫున 114 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే! 1. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- 136 వికెట్లు 2. టిమ్ సౌతీ- న్యూజిలాండ్- 134 వికెట్లు 3. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 129 వికెట్లు 4. ఇష్ సోధి- న్యూజిలాండ్- 114 వికెట్లు 5. లసిత్ మలింగ- శ్రీలంక -107 వికెట్లు చదవండి: BAN Vs IRE: చరిత్ర సృష్టించిన లిటన్ దాస్.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డు బద్దలు David Warner: సన్రైజర్స్ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్ను వదులుకుని! ఈసారి.. -
పట్టు బిగించిన కివీస్.. ఫాలోఆన్ గండం తప్పేదెలా?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. కివీస్ బౌలర్ల దాటికి లంక తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే కుప్పకూలింది. తద్వారా కివీస్కు 416 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో లంకను ఫాలోఆన్ ఆడించడానికే కివీస్ మొగ్గుచూపింది. లంక ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. ఫాలోఆన్ ఆడుతున్న లంక ప్రస్తుతం వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. కరుణరత్నే 21, కుషాల్ మెండిస్ క్రీజులో ఉన్నారు. రెండు వికెట్ల నష్టానికి 26 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన లంక ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా సమయం పట్టలేదు. 66.5 ఓవర్ల పాటు ఆడిన లంక 164 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కరుణరత్నే 89 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చండిమల్ 37 పరుగులు మినహా మిగతావారంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, మైకెల్ బ్రాస్వెల్ చెరో మూడు వికెట్లు తీయగా.. సౌథీ, టింక్నర్, బ్రాస్వెల్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ను 580 పరుగులు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. కేన్ విలియమ్సన్(215 పరుగులు), హెన్రీ నికోల్స్(200 పరుగులు) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేసింది. నాలుగో రోజు ఉదయం సెషన్లోగా మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు -
కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు ఊరట
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జడ్సీ) తమ ప్రధాన క్రికెటర్లు ఐపీఎల్లో ఆడేందుకు మార్గం సుగమం చేసింది. శ్రీలంకతో రెండో టెస్టు తదుపరి వన్డే సిరీస్ నుంచి లీగ్ కాంట్రాక్టు దక్కించుకున్న తమ కీలక ఆటగాళ్లను విడుదల చేయనుంది. కేన్ విలియమ్సన్ (గుజరాత్ టైటాన్స్), టిమ్ సౌతీ (కోల్కతా నైట్రైడర్స్), డెవాన్ కాన్వే, సాన్ట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్)లు ఆయా ఫ్రాంచైజీలతో జట్టు కట్టేందుకు రిలీజ్ చేయాలని ఎన్జడ్సీ నిర్ణయించింది. లంకతో ఆఖరి టెస్టు ఆడిన వెంటనే వీళ్లంతా భారత్కు బయల్దేరతారు. మరో ముగ్గురు క్రికెటర్లు ఫిన్ అలెన్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), ఫెర్గూసన్ (కోల్కతా), గ్లెన్ ఫిలిప్స్ (సన్రైజర్స్ హైదరాబాద్లు)లకు 25న ఆక్లాండ్లో జరిగే తొలి వన్డే అనంతరం లీగ్లో అడేందుకు అనుమతించింది. ఈ సీజన్ ఐపీఎల్ పోటీలు మార్చి 31 నుంచి జరుగనున్నాయి. ఈ లీగ్కు ముందు న్యూజిలాండ్–శ్రీలంక జట్ల మధ్య 17 నుంచి 21 వరకు చివరిదైన రెండో టెస్ట్ జరుగుతుంది. ఇది ముగియగానే ఈనెల 25, 28, 31 తేదీల్లో మూడు వన్డేల సిరీస్... ఏప్రిల్ 2, 5, 8 తేదీల్లో మూడు టి20ల సిరీస్ జరగనుంది. -
వెటోరీని అధిగమించిన సౌథీ.. రెండో స్థానానికి ఎగబాకిన కివీస్ కెప్టెన్
స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ సారధి టిమ్ సౌథీ ఓ రేర్ ఫీట్ను సాధించాడు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా క్రైస్ట్చర్చ్ వేదికగా ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్లో 3 వికెట్లు పడగొట్టిన సౌథీ ( తొలి రోజు ఆటలో).. న్యూజిలాండ్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2nd on the list! Tim Southee (362 wickets) becomes the second highest wicket-taker in Tests for New Zealand. Southee (706) now has the most international wickets for a New Zealander 🏏 #StatChat #NZvSL pic.twitter.com/2oXxxKw5ty — BLACKCAPS (@BLACKCAPS) March 9, 2023 93 టెస్ట్ల్లో 362 వికెట్లు పడగొట్టిన సౌథీ.. డేనియల్ వెటోరీని (112 టెస్ట్ల్లో 361) అధిగమించి, రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్ట్ల్లో 431 వికెట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సౌథీ న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు (మూడు ఫార్మాట్లతో కలిపి) పడగొట్టిన బౌలర్గా చలామణి అవుతున్నాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 354 మ్యాచ్లు ఆడిన సౌథీ 706 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సౌథీ తర్వాత వెటోరీ (696), హ్యాడ్లీ (589), బౌల్డ్ (578), కెయిన్స్ (419), మిల్స్ (327), మోరిసన్ (286), చాట్ఫీల్డ్ (263), బాండ్ (259), వాగ్నర్ (258) టాప్-10లో ఉన్నారు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
NZ Vs SL: లంకతో టెస్టు సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
Sri Lanka Tour New Zealand, 2023: శ్రీలంకతో టెస్టు సిరీస్కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. స్వదేశంలో లంకతో తలపడనున్న జట్టులో 13 మంది సభ్యులకు చోటిచ్చింది. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడిన జట్టునే కొనసాగించింది. కాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైన కివీస్.. రెండో మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. లంకకు ఆ అవకాశం ఈ క్రమంలో మార్చి 9 నుంచి లంకతో పోరుకు సిద్ధమవుతోంది టిమ్ సౌథీ బృందం. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సీజన్లో భాగంగా కివీస్- లంక మధ్య రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. క్రైస్ట్చర్చ్, వెల్లింగ్టన్లలో జరుగనున్న ఈ సిరీస్ శ్రీలంకకు కీలకంగా మారింది. ఒకవేళ న్యూజిలాండ్ను గనుక లంక వైట్వాష్ చేయడం సహా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా- ఆస్ట్రేలియాను క్లీన్స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు కరుణరత్నె బృందానికి అవకాశాలు ఉంటాయి. అయితే, సొంతగడ్డపై కివీస్ను ఓడించడం లంకకు తేలికేం కాదు. ఇక ఈ సిరీస్కు ఇప్పటికే లంక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్-2023 మార్చి 9- మార్చి 21 వరకురెండు టెస్టులు వేదికలు: క్రైస్ట్చర్చ్, వెల్లింగ్టన్ లంకతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ఇదే టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్), మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, స్కాట్ కుగ్గెలీజన్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్. చదవండి: WTC NZ Vs SL: కివీస్తో సిరీస్కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! BGT 2023: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు! ముందుందిలే.. -
ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్బాల్' పనికిరాదు
న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను తొలిరోజునే డిక్లేర్ చేయడం చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందన్న విమర్శలు వచ్చాయి. కానీ రెండో రోజుకే మ్యాచ్ ఫలితం వచ్చేసింది. తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్కు బజ్బాల్ క్రికెట్(Bazball) బాగా ఉపయోగపడుతుందని అంతా అనుకున్నారు. ఇదే బజ్బాల్ క్రికెట్ మంత్రంతో వరుసగా సౌతాఫ్రికా, పాకిస్తాన్లను మట్టికరిపించింది. కానీ ప్రతీసారి అదే దూకుడు పనికి రాదని తర్వాతి టెస్టుతోనే అర్థమైంది. ఓటమి నేర్పిన పాఠంతో బజ్బాల్(Bazball) ఆటను పక్కనబెడితే మంచిదని కొంతమంది క్రీడానిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈసారి కూడా ఇంగ్లండ్ ఆటను వేగంగానే మొదలుపెట్టింది. రూట్, హ్యారీ బ్రూక్ శతకాలతో విరుచుకుపడడంతో 435 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ను తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌట్ చేసి ఫాలోఆన్ కూడా ఆడించింది. ఇన్నింగ్ తేడాతో గెలవాలన్న ఇంగ్లండ్ ప్లాన్ బెడిసికొట్టింది. కేన్ విలియమ్సన్ శతకంతో మెరవగా.. టామ్ బ్లండెల్, టామ్ లాథమ్, డెవన్ కాన్వే, డారిల్ మిచెల్లు కీలక ఇన్నింగ్స్లు ఆడారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో కివీస్ 483 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్ను ఉంచింది. బజ్బాల్ మంత్రంతో ఊగిపోతున్న ఇంగ్లండ్ ఆటను చూస్తే టార్గెట్ అంత కష్టమేమి అనిపించలేదు. అందుకు తగ్గట్టుగానే రూట్ తన శైలికి భిన్నంగా వేగంగా ఆడడంతో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా సాగినట్లే అనిపించింది. కానీ ప్రతీసారి దూకుడు పనికిరాదన్న విషయం ఇంగ్లండ్కు అర్థమైంది. రూట్ మినహా మిగతావాళ్లు పెద్దగా రాణించకపోవడంతో ఇంగ్లండ్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. అయితే కాస్త ఓపికగా ఆడి ఉంటే మాత్రం ఇంగ్లండ్.. మ్యాచ్తో పాటు సిరీస్ను క్లీన్స్వీప్ చేసేదే. కానీ సంప్రదాయ ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు. బజ్బాల్ అంటూ దూకుడు మంత్రం జపిస్తున్న ఇంగ్లండ్కు న్యూజిలాండ్ తమ ఆటతో బ్రేకులు వేసింది. దీంతో ఇంగ్లండ్ బజ్బాల్ క్రికెట్(Bazball Cricket)ను పక్కనబెట్టడం మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చదవండి: పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు టెస్టు క్రికెట్లో సంచలనం.. పరుగు తేడాతో విజయం WHAT A GAME OF CRICKET New Zealand have won it by the barest of margins... This is test cricket at its finest ❤️ #NZvENG pic.twitter.com/cFgtFBIkR4 — Cricket on BT Sport (@btsportcricket) February 28, 2023 -
పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టు ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన టెస్టు మ్యాచ్.. అసలు మజా ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్తో టెస్టు క్రికెట్లో విజయం సాధించిన రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకముందు 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. తాజాగా 30 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్తో మ్యాచ్లో కివీస్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్తో విజయం సాధించిన జాబితాలో విండీస్తో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచింది కివీస్. ఇంతకముందు 2011లో ఆస్ట్రేలియాపై ఏడు పరుగుల తేడాతో, 2018లో పాకిస్తాన్పై నాలుగు పరుగుల తేడాతో అతి తక్కువ మార్జిన్ తేడాతో విజయాలు అందుకుంది. ఇక టెస్టు క్రికెట్లో అతి తక్కువ మార్జిన్తో విజయాలు సాధించిన జట్ల జాబితా పరిశీలిస్తే... ► 1993లో ఆస్ట్రేలియాపై ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్ విక్టరీ ► 2023లో ఇంగ్లండ్పై ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం ► 2005లో ఆస్ట్రేలియాపై రెండు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం ► 1902లో ఇంగ్లండ్పై మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం ► 1982లో ఆస్ట్రేలియాపై మూడు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం ► 2018లో పాకిస్తాన్పై నాలుగు పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం ► 1994లో ఆస్ట్రేలియాపై ఐదు పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం ► 1885లో ఇంగ్లండ్పై ఆరు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం Incredible scenes at the Basin Reserve. A thrilling end to the 2nd Test in Wellington 🏏 #NZvENG pic.twitter.com/tyG7laNtdP — BLACKCAPS (@BLACKCAPS) February 28, 2023 చదవండి: టెస్టు క్రికెట్లో సంచలనం.. పరుగు తేడాతో విజయం -
టెస్టు క్రికెట్లో సంచలనం.. పరుగు తేడాతో విజయం
టార్గెట్ 258 పరుగులు.. బజ్బాల్ క్రికెట్తో దూసుకుపోతున్న ఇంగ్లండ్కు ఇది పెద్ద కష్టసాధ్యమైన లక్ష్యం మాత్రం కాదు. కానీ సంప్రదాయ టెస్టు క్రికెట్లో బజ్బాల్ అంటూ వేగవంతమైన క్రికెట్ ఆడుతూ మంచి ఫలితాలు అందుకున్న ఇంగ్లీష్ జట్టుకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. టెస్టు క్రికెట్లో ఉండే మజా ఏంటో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్ నిరూపించింది. వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. 258 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌటైంది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. ఒకసారి మ్యాచ్ ఇంగ్లండ్వైపు మొగ్గితే.. మరోసారి కివీస్ చేతిలోకి వచ్చింది. చివరకు ఒకే ఒక్క పరుగు.. ఇంగ్లండ్కు ఓటమి పలకరించగా.. అదే సమయంలో విజయంతో కివీస్ రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకొని పరువు నిలుపుకుంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసిన జో రూట్ రెండో ఇన్నింగ్స్లోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న రూట్.. 95 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇదే మ్యాచ్లో టర్నింగ్ పాయింట్గా నిలిచింది. రూట్ ఉన్నంతవరకు ఇంగ్లండ్ విజయం దిశగానే నడిచింది. అయితే మధ్యలో కివీస్ బౌలర్లు ఫుంజుకొని వికెట్లు తీయడంతో మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. అయితే చివర్లో బెన్ స్టోక్స్(33 పరుగులు), బెన్ ఫోక్స్లు(35 పరుగులు) రాణించడంతో ఇంగ్లండ్ మరోసారి గెలుపు ట్రాక్ ఎక్కింది. ఈ దశలో కివీస్ బౌలర్లు సౌథీ, వాగ్నర్లు స్వల్ప వ్యవధి తేడాతో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ఒత్తిడిలో పడింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో అండర్స్ వాగ్నర్ బౌలింగ్లో టామ్ బ్లండెల్కు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు తీయగా.. సౌథీ మూడు, మాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రూట్, హ్యారీ బ్రూక్లు సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 209 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ను ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో కేన్ విలియమ్సన్ సెంచరీతో మెరవడంతో 483 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్ను ఉంచగలిగింది. Incredible scenes at the Basin Reserve. A thrilling end to the 2nd Test in Wellington 🏏 #NZvENG pic.twitter.com/tyG7laNtdP — BLACKCAPS (@BLACKCAPS) February 28, 2023 -
చెలరేగిన ఆండర్సన్, జాక్ లీచ్.. కష్టాల్లో కూరుకుపోయిన కివీస్
New Zealand vs England, 2nd Test- Day 2 Highlights: న్యూజిలాండ్తో రెండో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు అద్భుత ఆట తీరు కనబరుస్తున్నారు. రెండో రోజు ఆటలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ స్పిన్నర్ జాక్ లీచ్ కివీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. కీలక వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టుకు కోలుకోలేని షాకిచ్చారు. ఆండర్సన్, జాక్ లీచ్ విజృంభణతో శనివారం నాటి ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 297 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. భారీ ఆధిక్యంలో.. రెండు మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్మాంగనీయ్లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో వెల్లింగ్టన్లో శుక్రవారం(ఫిబ్రవరి 24) మొదలైన రెండో టెస్టులోనూ స్టోక్స్ బృందం ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ 65 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (169 బంతుల్లో 184 బ్యాటింగ్; 24 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగి సెంచరీ సాధించగా... జో రూట్ (182 బంతుల్లో 100 బ్యాటింగ్; 7 ఫోర్లు) కెరీర్లో 29వ సెంచరీ చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 294 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వర్షం కారణంగా తొలి రోజు ఆటను 65 ఓవర్ల వద్ద ముగించారు. బ్రూక్, రూట్ సెంచరీలతో చెలరేగి అంతకుముందు ఇంగ్లండ్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా బ్రూక్, రూట్ సెంచరీలతో ఆదుకున్నారు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో రూట్ 153 పరుగులతో అజేయంగా నిలవగా.. హ్యారీ బ్రూక్ తన స్కోరుకు మరో రెండు పరుగులు(186) జతచేసి అవుటయ్యాడు. మిగిలిన వాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 87.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద పర్యాటక ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఇంగ్లండ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. చెలరేగిన ఆండర్సన్, జాక్ లీచ్ డెవాన్ కాన్వేను జేమ్స్ ఆండర్సన్ తొలి వికెట్ అందించగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ వికెట్ను జాక్ లీచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విలియమ్సన్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్లో వెనుదిరగగా.. 2 పరుగులకే విల్ యంగ్ను ఆండర్సన్ పెవిలియన్కు పంపాడు. వరణుడి ఆటంకం హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్ వికెట్లను జాక్ లీచ్ పడగొట్టాడు. మిచెల్ బ్రాస్వెల్ రూపంలో స్టువర్ట్ బ్రాడ్కు ఒక వికెట్ దక్కింది. ఇక వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో రెండో రోజు టీ బ్రేక్ సమయానికే ఆట ముగించాల్సి వచ్చింది. అప్పటికి కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ కంటే 297 పరుగులు వెనుకబడింది సౌథీ బృందం. గత మ్యాచ్లో సెంచరీతో మెరిసిన వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ 25, కెప్టెన్ టిమ్ సౌథీ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా తొలి టెస్టులో ఏడు వికెట్లు తీసిన ఆండర్సన్ ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు! WTC NZ Vs SL: కివీస్తో సిరీస్కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! -
NZ Vs Eng: టిమ్ సౌథీ అరుదైన ఘనత.. సరికొత్త రికార్డు
New Zealand vs England, 2nd Test: న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ పేసర్గా ఈ రైట్ ఆర్మ్ సీమర్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో స్వదేశంలో రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా 34 ఏళ్ల టిమ్ సౌథీ ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(9 పరుగులు)ను అవుట్ చేసి తన కెరీర్లో 700వ వికెట్ నమోదు చేశాడు. తద్వారా కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ డానియెల్ వెటోరి(705)తో పాటు 700 వికెట్ల క్లబ్లో చేరాడు. కాగా టిమ్ సౌథీ ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున మొత్తంగా 353 మ్యాచ్లు ఆడి.. టెస్టుల్లో 356, వన్డేల్లో 210, టీ20లలో 134 వికెట్లు కూల్చాడు. ఇక రెండు టెస్టుల సిరీస్ ఆడే నిమిత్తం ఇంగ్లండ్ న్యూజిలాండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంతా తొలి టెస్టులో ఆతిథ్య కివీస్ను 267 పరుగుల తేడాతో స్టోక్స్ బృందం చిత్తు చేసింది. ఇక రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. రూట్, బ్రూక్ సెంచరీలతో చెలరేగగా.. బజ్బాల్ విధానంతో మరోసారి దూకుడు ప్రదర్శించి పటిష్ట స్థితిలో నిలిచింది. కివీస్ బౌలర్లలో సౌథీ ఒకటి, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీశారు. జో రూట్ 101 పరుగులు, హ్యారీ బ్రూక్ 184 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: WC 2023: కన్నీటి పర్యంతమైన హర్మన్... అక్కున చేర్చుకున్న అంజుమ్.. వీడియో వైరల్ Ind Vs Aus: భారత పిచ్లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే! ENG vs NZ: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచంలో తొలి క్రికెటర్గా! View this post on Instagram A post shared by Spark Sport (@sparknzsport) #StatChat | Tim Southee joins Daniel Vettori (705) as the only New Zealanders to take 700 International wickets. Southee has represented the BLACKCAPS in 353 matches across the three formats 🏏 #NZvENG pic.twitter.com/sF3joTF1UN — BLACKCAPS (@BLACKCAPS) February 23, 2023 -
'బజ్బాల్' ఎలా అడ్డుకోవాలి?.. ఫ్యాన్స్ను వేడుకున్న కివీస్ టాప్ వెబ్సైట్
బజ్బాల్(Bazball) క్రికెట్తో ఇంగ్లండ్ చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఐదురోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్ను ఇంగ్లండ్ 'బజ్బాల్' ఆటతీరుతో వీలైనంత తొందరగా ముగించాలని చూస్తోంది. బ్యాటింగ్కు దిగితే దాటిగా ఆడడం.. బౌలింగ్ వేస్తే వేగంగా వికెట్లు తీయాలనుకోవడం.. ఇలా స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ దూసుకుపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ను బజ్బాల్ మంత్రంతో వారి గడ్డపై టెస్టు సిరీస్లో మట్టికరిపించింది. బజ్బాల్ క్రికెట్ను పాకిస్తాన్ జట్టుకు మొదటిసారిగా పరిచయం చేసింది. తాజాగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లోనే అదే దూకుడు మంత్రాన్ని కొనసాగిస్తుంది. కివీస్తో జరిగిన తొలి టెస్టులో స్టోక్స్ సేన 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్ బజ్బాల్ ఆటతీరును ఎలా అడ్డుకోవాలో కాస్త చెప్పండి అంటూ న్యూజిలాండ్కు చెందిన టాప్ వెబ్సైట్ స్టఫ్.కో. ఎన్జెడ్(Stuff.co.nz) క్రికెట్ అభిమానులను కోరడం ఆసక్తి కలిగించింది. ''ఇంగ్లండ్ బజ్బాల్ ఆటతో దూకుడు మంత్రం జపిస్తుంది. వెల్లింగ్టన్ వేదికగా మొదలుకానున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బజ్బాల్ క్రికెట్కు ముకుతాడు వేయడానికి 400-800 పదాలతో ఒక పరిష్కార మార్గాన్ని లేదా గేమ్ స్ట్రాటజీని రాసి పంపించగలరు. మీ విలువైన సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా అందించగలరు'' అంటూ మెయిల్ ఐడీ ఇచ్చింది. ఒకవేళ మీకు కూడా ఆసక్తి ఉంటే stuffnation@stuff.co.nzకు బజ్బాల్ క్రికెట్ను అడ్డుకునే సలహాను పంపించండి. ఇక తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలిరోజునే 325 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తడబడినా 306 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో వేగంగా ఆడిన ఇంగ్లండ్ కివీస్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో నలుగురు హాఫ్ సెంచరీలు చేయగా.. ఓలీ పోప్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత పేస్ ద్వయం అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు చెరో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్కు భారీ విజయాన్ని కట్టబెట్టారు. చదవండి: Joe Root: 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి' 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్కు -
ఇంగ్లండ్ టీమ్ ఓవర్ కాన్ఫిడెన్స్.. తొలి రోజే.. ఓ వికెట్ ఉన్నా..!
2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. మౌంట్ మాంగనూయ్లో ఇవాళ (ఫిబ్రవరి 16) ప్రారంభమైన తొలి టెస్ట్లో (డే అండ్ నైట్ టెస్ట్) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి రోజు.. అది కూడా కేవలం 58.2 ఓవర్లు మాత్రమే ఆడి, ఓ వికెట్ ఉన్నా తొలి ఇన్నింగ్స్ను 325 పరుగుల (9 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో 20.. 30 పరుగులు అదనంగా చేసే అవకాశం ఉన్నా ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ సోషల్మీడియాలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇది టెస్ట్ క్రికెట్ అనుకుంటున్నారా లేక ఇంకేమైనానా అంటూ ఇంగ్లండ్ నిర్ణయాన్ని దుయ్యబడుతున్నారు. టెస్ట్లను కూడా టీ20ల్లా ఆడాలనుకుంటే, కేవలం వాటికే పరిమితం కావచ్చు కాదా అంటూ సలహాలిస్తున్నారు. ఇంగ్లండ్ నిర్ణయం మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇంగ్లండ్ తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల టెస్ట్ క్రికెట్ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని మండిపడుతున్నారు. సంప్రదాయ టెస్ట్ మ్యాచ్లను బజ్బాల్ అనే అతిగతి లేని విధానాన్ని అమలు చేసి చంపేస్తున్నారని తూర్పారబెడుతున్నారు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్లు ఆడే ఓపిక లేకపోతే, ఇంట్లోనే కూర్చోవాలి కానీ, ఆటకు కళంకం తేవడమెందుకని నిలదీస్తున్నారు. కాగా, ఇంగ్లండ్ టీమ్ గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్లో వేగం పెంచిన విషయం విధితమే. ఫలితం త్వరగా రాబట్టాలనే ఉద్దేశంతో ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగడమే వారి ప్రణాళిక. దీనికి వాళ్లు బజ్బాల్ అప్రోచ్ అనే పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి వారు ఈ విధానంలో టెస్ట్లు ఆడి 100 శాతం సఫలమయ్యారు. అయితే సంప్రదాయ టెస్ట్ క్రికెట్ వాదులు ఇంగ్లండ్ అమలు చేస్తున్న బజ్బాల్ విధానాన్ని తప్పుపడుతున్నారు. ఇలా చేయడం వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని వాపోతున్నారు. ఇప్పటికే టీ20ల వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, కివీస్తో తొలి టెస్ట్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రాకెట్ వేగంతో పరుగులు సాధించి 325/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బెన్ డక్కెట్ (68 బంతుల్లో 84; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 89; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకాలు సాధించి తృటిలో సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఓలీ పోప్ (42), బెన్ ఫోక్స్ (38) సైతం బౌండరీలతో విరుచుకుపడి జట్టు వేగంగా పరుగులు సాధించడానికి దోహదపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి రాబిన్సన్ (15 నాటౌట్; 3 ఫోర్లు) జోరుమీదుండగా.. జేమ్స్ ఆండర్సన్ బరిలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో వాగ్నర్ 4, సౌథీ, కుగ్గెలెన్ తలో 2, టిక్నర్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వెనుక మరో కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పిచ్ పేసర్లకు సహకరించడం మొదలుపెట్టిందని తెలిసి వారు హడావుడిగా పరుగులు సాధించి, ప్రత్యర్ధిని బరిలోకి ఆహ్వానించారని సమాచారం. డిన్నర్ బ్రేక్ తర్వాత ఇంగ్లండ్ ఆఖరి 4 వికెట్లను 46 పరుగుల వ్యవధిలో కోల్పోవడం వారి ప్రణాళికకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఇంగ్లండ్ వ్యూహాలు కూడా ఫలించాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 37 పరగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. కాన్వే (17), వాగ్నర్ (4) క్రీజ్లో ఉన్నారు. -
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ఇదే! స్టార్ బౌలర్ వచ్చేశాడు
స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు టిమ్ సౌథీ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా గత ఏడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ కైల్ జేమీసన్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 16 టెస్టులు ఆడిన జేమీసన్ 72 వికెట్లు సాధించాడు. మరోవైపు కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్కు కూడా దూరంగా ఉన్నాడు. అదే విధంగా ఈ జట్టులో స్పిన్నర్ ఆజాజ్ పటేల్, మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్కు చోటు దక్క లేదు. ఇక భారత్తో వన్డే సిరీస్లో అదరగొట్టిన ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వేల్కు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇక ఈ హోం సిరీస్లో భాగంగా కివీస్ ఇంగ్లండ్తో రెండు టెస్టులు ఆడనుంది. అయితే ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్(పింక్బాల్ టెస్టు)గా జరగనుంది. ఈ మ్యాచ్ తౌరంగ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరగనుంది. ఇంగ్లండ్తో టెస్టులకు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్. చదవండి: IND Vs AUS: కింగ్ ఈజ్ బ్యాక్.. జిమ్లో కోహ్లి కసరత్తులు! వీడియో వైరల్ -
కివీస్తో పాక్ మ్యాచ్.. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
Pakistan vs New Zealand, 1st Test: టెస్టు, వన్డే సిరీస్లు ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. వరల్డ్ టెస్టు చాంపియన్సషిప్ 2021-23 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం(డిసెంబరు 26) ఆరంభమైన తొలి మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు నమోదైంది. టాస్ గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌతీ.. బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో నాలుగో ఓవర్లో బంతిని అజాజ్ పటేల్ చేతికి ఇవ్వగా.. స్పిన్తో తిప్పేశాడు. ఈ బాల్ను అంచనా వేయడంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(7) విఫలం కాగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండల్ అతడిని స్టంపౌట్ చేశాడు. 145 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇక ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్వెల్ బౌలింగ్లోనూ వన్డౌన్ బ్యాటర్ షాన్ మసూద్(3)ను ఇదే రీతిలో బ్లండల్ స్టంపౌట్ చేశాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు నమోదైంది. 145 ఏళ్ల పురుషుల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా తొలి రెండు వికెట్లు స్టంపౌట్ ద్వారా లభించడం ఇదే మొదటిసారి కాగా.. ఓవరాల్గా రెండోసారి. గతంలో.. 1976లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జమైకాలో జరిగిన టెస్టులో తొలిసారి ఈ ఫీట్ నమోదైంది. ఈ మ్యాచ్లో ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ మారీ కార్నిష్ నాలుగు వికెట్లు(టూయీస్ బ్రౌనీ, జాస్మిన్ సామీ, గ్లోరియా గిల్) తీయగా.. అందులో మూడు స్టంపౌట్లే ఉండటం విశేషం. చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్ పడితే నీ ఆట ముగిసేది.. భారత్ 89కే ఆలౌట్ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్ Mohammad Rizwan: వైస్ కెప్టెన్పై వేటు! 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలి మ్యాచ్.. ఆఫ్రిదిపై విమర్శలు Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు -
ఇండియా టూర్కు కేన్ మామ డుమ్మా.. కారణం ఏంటంటే..?
New Zealand Tour Of India 2023: వచ్చే ఏడాది (2023) జనవరిలో జరుగనున్న 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా జరుగనున్న వన్డే సిరీస్ కోసం జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిన్న (డిసెంబర్ 18) ప్రకటించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ, హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ లేకుండానే న్యూజిలాండ్ వన్డే జట్టు భారత్లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ ముగ్గురూ భారత్ కంటే ముందు పాకిస్తాన్తో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో (జనవరి 10, 12, 14) పాల్గొని అట్నుంచి అటే న్యూజిలాండ్కు తిరిగి వెళ్లిపోతారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (సీఎన్జెడ్) వెల్లడించింది. ఫిబ్రవరిలో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ టీమ్ స్వదేశంలో పర్యటించనున్న నేపథ్యంలో వర్క్ లోడ్ తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎన్జెడ్ ప్రకటించింది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో భారత్తో వన్డే సిరీస్కు టామ్ లాథమ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని పేర్కొన్న సీఎన్జెడ్.. ఈ సిరీస్కు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్థానంలో అసిస్టెంట్ కోచ్ లూక్ రాంచీ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలిపింది. విలియమ్సన్, సౌథీ స్థానాలను మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ భర్తీ చేస్తారని పేర్కొంది. కాగా, భారత పర్యటనలో న్యూజిలాండ్ తొలుత వన్డే సిరీస్ ఆడనుంది. జనవరి 18, 21, 24 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అనంతరం జనవరి 27, 29 ఫిబ్రవరి 1 తేదీల్లో టీ20 సిరీస్ జరుగుతుంది. టీ20 సిరీస్కు జట్టును సీఎన్జెడ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. భారత్తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు : టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫ్ఫీ, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి -
కేన్ విలియమ్సన్ రాజీనామా..న్యూజిలాండ్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
Tim Southee Appointed As New Zealand Test Captain: న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్బై చెప్పడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జెడ్సీబీ) కొత్త సారధిని నియమించింది. విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌథీ టెస్ట్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఎన్జెడ్సీబీ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పాకిస్తాన్తో ప్రారంభమయ్యే 2 టెస్ట్ల సిరీస్కు సౌథీ కెప్టెన్గా వ్యవహరిస్తాడని పేర్కొంది. సౌథీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వికెట్ కీపర్ టామ్ లాథమ్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఓ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్గా ఎంపిక కావడం ఇది రెండోసారి. గతంలో డియాన్ నాష్ కివీస్ టెస్ట్ సారధిగా వ్యవహరించాడు. మరోవైపు టెస్ట్ జట్టుకు సారధిగా ఎంపికైన సౌథీ.. 22 టీ20ల్లో కివీస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే అతను టెస్ట్ సారధ్య బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. కాగా, వర్క్ లోడ్ కారణంగా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన విలియమ్సన్.. వన్డే, టీ20 ఫార్మాట్లో కెప్టెన్గా కొనసాగుతానని ప్రకటించాడు. అలాగే టెస్ట్ జట్టులో సభ్యుడిగానూ కొనసాగుతానని పేర్కొన్నాడు. పాకిస్తాన్ పర్యటనకు అతను జట్టుతో పాటే వెళ్లనున్నాడు. ఈ పర్యటనలో తొలుత టెస్ట్ మ్యాచ్లు ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 10, 12, 14 తేదీల్లో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఇదిలా ఉంటే, 6 ఏళ్ల పాటు కివీస్ సారథ్య బాధ్యతలు మోసిన విలియమ్సన్.. అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. అతని హయాంలో కివీస్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు మరెన్నో అద్భుత విజయాలు సాధించింది. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తర్వాత కేన్ మామ న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. అతని సారథ్యంలో న్యూజిలాండ్ 38 టెస్టు మ్యాచ్లు ఆడి 22 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. -
న్యూజిలాండ్తో మూడో టీ20కి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్
నేపియర్లోని మెక్లీన్ పార్క్ వేదికగా రేపు (నవంబర్ 22) న్యూజిలాండ్తో జరుగబోయే మూడో టీ20కి ముందు టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ తెలిసింది. రేపు జరుగబోయే మ్యాచ్కు వరుణుడి నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు) ఆకాశం మేఘావృతమైనప్పటికీ.. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువని అక్కడి వాతావరణ శాఖ వెదర్ ఫోర్కాస్ట్లో పేర్కొంది. మ్యాచ్ ఎటువంటి అంతరాయం లేకుండా 20 ఓవర్ల మ్యాచ్గా సాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆకాశం పూర్తిగా మబ్బు పట్టి ఉంటే పేసర్లకు అనుకూలిస్తుందని, పరుగుల ప్రవాహానికి కూడా అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా, సిరీస్ డిసైడర్ కావడంతో ఈ మ్యాచ్ కచ్చితంగా జరగాలని ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. వెల్లింగ్టన్లో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. మౌంట్ మాంగనూయ్లో జరిగిన రెండో మ్యాచ్లో సూర్యకుమార్ విధ్వంసం (111 నాటౌట్), దీపక్ హుడా మాయాజాలం (4/10) చేయడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20లో కివీస్ జట్టుకు టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. మెడికల్ అపాయింట్మెంట్ ఉండటంతో రెగ్యలర్ కెప్టెన్ విలియమ్సన్ లీవ్ తీసుకోవడంతో సౌథీకి జట్లు పగ్గాలు అప్పజెప్పారు. విలియమ్సన్ స్థానాన్ని మైఖేల్ బ్రేస్వెల్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మార్పు మినహా రెండో టీ20లో ఆడిన జట్టునే కివీస్ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. రెండో టీ20లో అంతగా ఆకట్టుకోలేని సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. -
Ind Vs NZ: సూర్య అత్యుత్తమ టీ20 బ్యాటర్ కాదా!? కివీస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
New Zealand vs India, 2nd T20I- Suryakumar Yadav: అద్భుత అజేయ సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసల జల్లు కురుస్తున్న వేళ న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌతీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో ఎంతో మంది అత్యుత్తమ టీ20 ప్లేయర్లు ఉన్నారని.. సూర్యను ఇప్పుడే బెస్ట్ బ్యాటర్ అనలేమంటూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. మౌంట్ మాంగనుయ్ వేదికగా కివీస్తో జరిగిన రెండో టీ20లో సూర్య 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా సేన.. న్యూజిలాండ్కు భారీ లక్ష్యం విధించింది. ఇక టార్గెట్ ఛేదనలో టాపార్డర్ విఫలం కావడంతో కివీస్ 18.5 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 65 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ మ్యాచ్లో సూర్య విధ్వంసకర ఆట తీరు కివీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన తీరును టీమిండియా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. సౌతీ హ్యాట్రిక్ ఇదిలా ఉంటే.. రెండో టీ20లో కివీస్ బౌలర్ టిమ్ సౌతీ.. 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 34 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆల్రౌండర్ దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ వికెట్లు వరుసగా పడగొట్టి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన సౌతీకి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూర్య ఇన్నింగ్స్ గురించి ప్రశ్న ఎదురైంది. మీరు బౌలింగ్ చేసిన టీమిండియా ఆటగాళ్లలో అత్యుత్తమ టీ20 ప్లేయర్గా సూర్యను భావిస్తారా అని మీడియా అడుగగా.. సౌథీ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు.. ఇక సూర్య ‘‘ఇండియాలో ఎంతో మంది గొప్ప టీ20 ప్లేయర్లు ఉన్నారు. కేవలం పొట్టి ఫార్మాట్లో మాత్రమే కాదు ఇతర ఫార్మాట్లలోనూ ఇండియా ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. వాళ్లంతా సుదీర్ఘ కాలంగా వివిధ ఫార్మాట్లలో తమ సేవలు అందిస్తూ మేటి ఆటగాళ్లుగా ఎదిగారు. ఇక సూర్య విషయానికొస్తే.. గత 12 నెలలుగా అతడు అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో, అంతర్జాతీయ స్థాయిలో అతడు రాణిస్తున్నాడు. ఈ రోజు కూడా చాలా బాగా ఆడాడు. అయితే, ఇదే తరహాలో అతడు ఆట తీరు కొనసాగించాల్సి ఉంది’’ అని టిమ్ సౌతీ అభిప్రాయపడ్డాడు. కాగా సూర్యకు ఇది అంతర్జాతీయ టీ20లలో రెండో శతకం కావడం విశేషం. చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్! IND vs NZ: సలాం సూర్య భాయ్.. కోహ్లి రికార్డు బద్దలు! ఏకైక భారత ఆటగాడిగా Winning hearts on & off the field - the @surya_14kumar way! 👏 👏 Coming 🔜 on https://t.co/Z3MPyesSeZ - a Chahal TV special - where SKY picks one fan from the stand to ask him a question 👌 👌#TeamIndia | #NZvIND | @yuzi_chahal pic.twitter.com/tfGvsypnq3 — BCCI (@BCCI) November 20, 2022 -
సూర్యకుమార్ సుడిగాలి శతకం.. సౌథీకి హ్యాట్రిక్, చరిత్రలో తొలిసారి ఇలా..
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో కెరీర్లో రెండో సెంచరీ బాదాడు. సూర్యకుమార్ ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్లో సూర్యకుమార్ మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్ ఊచకోత ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అయితే టిమ్ సౌథీ మాత్రం సూర్యను కంట్రోల్ చేస్తూ.. తన కోటా 4 ఓవర్లలో కేవలం 34 పరుగులు మాత్రమే ఇచ్చి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. సౌథీకి ఇది టీ20ల్లో రెండో హ్యాట్రిక్. ఈ ఫీట్ను గతంలో శ్రీలంక యార్కర్ కింగ్ లసిత్ మలింగ మాత్రమే సాధించాడు. కాగా, సౌథీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మూడో బంతికి హార్ధిక్ (13), నాలుగో బంతికి హుడా (0), ఐదో బంతికి సుందర్ (0)లను పెవిలియన్కు పంపి టీ20 కెరీర్లో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. సౌథీ మినహా మిగతా బౌలర్లందరినీ సూర్యకుమార్ ఓ ఆట ఆడుకున్నాడు. ఫెర్గూసన్ 2 వికెట్లు, సోధీ ఒక వికెట్ పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. భారత ఇన్నింగ్స్లో సూర్యకుమార్ సెంచరీతో శివాలెత్తగా.. ఇషాన్ కిషన్ (36) ఓ మోస్తరుగా రాణించాడు. ఓపెనర్గా వచ్చిన పంత్ (6), శ్రేయస్ అయ్యర్ (13) నిరాశపరిచారు. అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రెండో బంతికే ఫిన్ అలెన్ (0)ను భవనేశ్వర్ కుమార్ పెవిలియన్కు పంపాడు, అర్షదీప్ క్యాచ్ అందుకోవడంతో అలెన్ ఔటయ్యాడు. First ever t20 match where a batsman scored a century and bowler took an hat trick. 🤯#timsouthee #SuryakumarYadav pic.twitter.com/LdVdetAF4G — Akshat (@AkshatOM10) November 20, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఒకే మ్యాచ్లో (టీ20ల్లో) సెంచరీ, హ్యాట్రిక్ నమోదయ్యాయి. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సూర్యకుమార్ సెంచరీతో.. టిమ్ సౌథీ హ్యాట్రిక్తో చెలరేగారు. -
షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత.. ప్రపంచ రికార్డు సమం
అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా న్యూజిలాండ్ పేసర్ సౌథీ(127) పేరిట రికార్డును సమం చేశాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్.. ఈ అరుదైన రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు 101 ఇన్నింగ్స్లలో సౌథీ 127 వికెట్లు పడగొట్టగా.. షకీబ్ 106 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. ఇక రెండో స్థానంలో ఆఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 121 వికెట్లతో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో బంగ్లాదేశ్పై 5 పరుగుల తేడాతో (డక్వర్త్–లూయిస్ ప్రకారం) భారత్ విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను బంగ్లాదేశ్ సంక్లిష్టం చేసుకుంది. ఇక బంగ్లాదేశ్ తమ అఖరి మ్యాచ్లో నవంబర్ 6న పాకిస్తాన్తో తలపడనుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి సరి కొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు -
టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా
అంతర్జాతీయ టీ20ల్లో న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా సౌథీ నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ ఔట్ చేసిన సౌథీ... ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు 101 మ్యాచ్లు ఆడిన సౌథీ.. మొత్తంగా 123 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ ఘనత బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ పేరిట ఉండేది. షకీబ్ ఇప్పటి వరకు 104 మ్యాచ్ల్లో 122 వికెట్లు సాధించాడు. అదే విధంగా ఈ మ్యాచ్లో సౌథీ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్కప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ బౌలర్గా నాథన్ మెక్ కల్లమ్తో కలిసి సమంగా నిలిచాడు. ఇక ఓవరాల్గా అన్ని ఫార్మాట్లు కలిపి ఇప్పటి వరకు 337 మ్యాచ్లు ఆడిన సౌథీ.. 669 వికెట్లు సాధించాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: Devon Conway: కాన్వే అరుదైన ఘనత.. బాబర్తో కలిసి సంయుక్తంగా -
ఎప్పుడు కొట్టని షాట్ ఆడాడు.. అందుకే ఆశ్చర్యపోయాడా?
న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ జోరు కనబరుస్తుంది. ఇప్పటికే తొలి టెస్టు కైవసం చేసుకున్న ఇంగ్లండ్ రెండో టెస్టులోనూ ఆకట్టుకుంది. తొలి టెస్టు గెలవడంలో కీలకపాత్ర పోషించిన రూట్ రెండో టెస్టులోనూ అదే జోరు కనబరుస్తున్నాడు. రెండో టెస్టులో సెంచరీతో మెరిసిన రూట్ మొత్తంగా 211 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 176 పరుగులు చేసి ఔటయ్యాడు. అతనికి ఓలీ పోప్(239 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సహకరించాడు. మూడో వికెట్కు ఈ జోడి 187 పరుగులు జోడించడం విశేషం. ఇక రూట్ ఇన్నింగ్స్లో ఒకే ఒక సిక్సర్ ఉండగా.. అది ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచింది. అయితే రూట్ ఇన్నింగ్స్లో సిక్సర్లు చాలా తక్కువ. ఒకవేళ కొట్టినా అన్నీ సంప్రదాయ సిక్సర్లు ఉంటాయి.తాజాగా టిమ్ సౌథీ బౌలింగ్లో రివర్స్ స్కూప్లో సిక్సర్ను తరలించాడు. అయితే అది సిక్సర్ వెళుతుందని రూట్ కూడా అనుకోలేదనుకుంటా.. అందుకే అంతలా ఆశ్యర్యపోయాడు. రూట్ సిక్సర్ చూసిన సౌథీకి మతి పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ప్రస్తుతం డారిల్ మిచెల్ 32, మాట్ హెన్రీ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన బౌలర్లు రెండో ఇన్నింగ్స్లో మాత్రం చెలరేగడంతో న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 238 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. A quiet start to the morning in Nottingham... Scorecard & Videos: https://t.co/GJPwJC59J7 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/Fjz96fl2SZ — England Cricket (@englandcricket) June 13, 2022 చదవండి: విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత ENG vs NZ: 238 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్ -
ENG vs NZ: అదరగొట్టిన మిచెల్, బ్లన్డెల్.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలే!
England Vs New Zealand 1st Test Day 2 Score- లండన్: లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ దాదాపు సమంగా నిలవగా... రెండో ఇన్నింగ్స్లో కివీస్ చక్కటి బ్యాటింగ్తో కోలుకుంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. డరైల్ మిచెల్ (97 నాటౌట్; 11 ఫోర్లు), టామ్ బ్లన్డెల్ (90 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీలకు చేరువయ్యారు. కివీస్ ఒకదశలో 56 పరుగులకు 4 వికెట్లు కోల్పోగా... మిచెల్, బ్లన్డెల్ ఆదుకున్నారు. ఐదో వికెట్కు 180 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 116/7తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 141 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 9 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్లలో సౌతీ 4, బౌల్ట్ 3 వికెట్లు తీశారు. Day 2: రెండో ఇన్నింగ్స్లో కివీస్ 236/4 . చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్ From 56/4 to 236/4 👊@dazmitchell47 and Tom Blundell walk off to warm applause from the @HomeOfCricket crowd.#ENGvNZ pic.twitter.com/9QzLje4fzP — BLACKCAPS (@BLACKCAPS) June 3, 2022 What impressed batting coach Luke Ronchi the most on Day 2 at the @HomeOfCricket? #ENGvNZ pic.twitter.com/ey1TQHLZ28 — BLACKCAPS (@BLACKCAPS) June 4, 2022 The moment so many have been waiting for 😉 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/xuJoi7qT1w — England Cricket (@englandcricket) June 3, 2022 -
Eng Vs NZ: అదరగొట్టిన సౌథీ, బౌల్ట్.. ఇంగ్లండ్కు షాక్! కానీ.. మళ్లీ!
New Zealand tour of England 2022- Eng Vs NZ 1st Test Day 2: న్యూజిలాండ్తో తొలి టెస్టులో భాగంగా తొలిరోజు ఆరంభంలో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపించిన ఇంగ్లండ్ 141 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి రోజు ఆటలో 92/2తో మెరుగైన స్థితిలో కనిపించిన ఆతిథ్య జట్టును కివీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. ట్రెంట్ బౌల్ట్, కైలీ జెమీషన్, టిమ్ సౌథీ తలా రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరి దెబ్బకు 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. ఇక శుక్రవారం నాటి రెండోరోజు ఆటలో భాగంగా సౌథీ.. స్టువర్డ్ బ్రాడ్ను అవుట్ చేయడంతో ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆతిథ్య జట్టు.. రెండు ఓవర్ల వ్యవధిలోనే ఫోక్స్ రూపంలో తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయింది. ఈ క్రమంలో పార్కిన్సన్ వికెట్ తీసి బౌల్ట్ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో ఇంగ్లండ్.. కివీస్ కంటే కేవలం 9 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో మొత్తంగా సౌథీ నాలుగు, బౌల్డ్ 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. జెమీషన్కు రెండు, గ్రాండ్హోమ్కు ఒక వికెట్ లభించాయి. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. టామ్ లాథమ్ 14, విల్ యంగ్ 1, కేన్ విలియమ్సన్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆండర్సన్ ఒకటి, అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు తీశాడు. రెండో రోజు ఆటలో 15 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు: 36-3. న్యూజిలాండ్ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్: తొలి టెస్టు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 132-10 (40 ఓవర్లు) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 141-10 (42.5 ఓవర్లు) చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ Wasim Jaffer Trolls Eng Vs NZ 1st Test: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! JIMMMY! 😍 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/BLyPNdqwRp — England Cricket (@englandcricket) June 3, 2022 This is some debut 💪 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 | @MattyJPotts pic.twitter.com/9028Sleasc — England Cricket (@englandcricket) June 3, 2022 A 9 run deficit as Tim Southee and Trent Boult combine for 7 wickets at Lord's 🏏 Watch LIVE in NZ with @sparknzsport and listen with @SENZ_Radio 📲#ENGvNZ pic.twitter.com/30zD1K3kXB — BLACKCAPS (@BLACKCAPS) June 3, 2022 -
ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కివీస్ స్టార్ ఆల్రౌండర్
Tim Southee Wins Sir Richard Hadlee Medal: న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ టిమ్ సౌథీ.. తన దేశ క్రికెట్కు సంబంధించి ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2021-22 సీజన్ ఆధ్యాంతం అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు గాను అతను సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకాన్ని గెలుచుకున్నాడు. సౌథీ తన 14 ఏళ్ల కెరీర్లో ఈ మెడల్ను గెలవడం ఇదే తొలిసారి. ఇవాళ (ఏప్రిల్ 14న) జరిగిన న్యూజిలాండ్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో సౌథీ ఈ మెడల్తో పాటు 2022 సంవత్సరానికి గాను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. సౌథీ 2021-22 సీజన్లో 23.88 సగటున 36 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్పై సాధించిన ఐదు వికెట్ల ఘనత కూడా ఉంది. సౌథీ.. న్యూజిలాండ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించడంతో పాటు గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో తన జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. సౌథీ ఇటీవలి భారత పర్యటనలో న్యూజిలాండ్ జట్టుకు సారధిగా (కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో) కూడా వ్యవహరించాడు. కెరీర్లో ఇప్పటివరకు 85 టెస్ట్లు, 143 వన్డేలు, 92 టీ20లు ఆడిన సౌథీ.. 639 వికెట్లతో పాటు 2697 పరుగులు సాధించాడు. చదవండి: వన్డేల్లో సరికొత్త రికార్డు.. 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు -
వారెవ్వా.. డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు టిమ్ సౌతీ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన రసెల్ బౌలింగ్లో.. రబడా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అది మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న సౌతీ పరెగెత్తుకుంటూ 30 యార్డ్ సర్కిల్ లోపలకు వచ్చి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్పై కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లో ఉమేశ్ యాదవ్ నాలుగు వికెట్లు, సౌతీ రెండు వికెట్లు, నరైన్, రసెల్ చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో భానుక రాజపక్స(31), కగిసో రబడ(25) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 138 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్ 31 బంతుల్లో 70 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. చదవండి: Tom Latham: చరిత్ర సృష్టించిన కివీస్ కెప్టెన్.. 24 ఏళ్ల కిందటి సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు Tim Southee 😍 #IPL2022 pic.twitter.com/2WiqXXtJWq — Amanpreet Singh (@AmanPreet0207) April 1, 2022 -
ఐపీఎల్కు ముందు పెళ్లి పీటలెక్కిన మరో స్టార్ క్రికెటర్.. ఎవరంటే..?
Tim Southee: ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు మరో స్టార్ క్రికెటర్ పెళ్లి పీటలెక్కాడు. రెండ్రోజుల కిందట (మార్చి 18) ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్, ఆర్సీబీ కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్.. తన ప్రేయసి, భారత సంతతి అమ్మాయి విని రామన్ను మనువాడగా, తాజాగా న్యూజిలాండ్ ఆటగాడు, కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ టిమ్ సౌథీ.. తాను చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రయా ఫహీని పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Tim Southee (@tim_southee) సౌథీ తన పెళ్లి ఫోటోను ఇన్స్టా షేర్ చేసి ఫరెవర్ అని క్యాప్షన్ జోడించాడు. దీంతో నెట్టింట సౌథీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, సౌథీ జంట చాలాకాలంగా రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో ఇండీ మే సౌథీ, 2019లో స్లోయానే అవా సౌథీ వీరికి జన్మించారు. కాగా, న్యూజిలాండ్ తరఫున 85 టెస్ట్ మ్యాచ్లు, 143 వన్డేలు, 92 టీ20లు ఆడిన సౌథీ.. 639 వికెట్లతో పాటు 2600కు పైగా పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ కివీస్ ఆల్రౌండర్ క్యాష్ రిచ్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్ జట్ల తరఫున 43 మ్యాచ్లు ఆడి 31 వికెట్లు 118 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో సౌథీని కేకేఆర్ జట్టు బేస్ ప్రైజ్ రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: గర్ల్ఫ్రెండ్ను పెళ్లాడిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు -
టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన బౌల్ట్.. రెండో బౌలర్గా!
కింగ్స్టన్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లా బ్యాటర్ మెహాది హాసన్ వికెట్ పడగొట్టి టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్లో చేరాడు. టెస్టుల్లో 300 వికెట్ల ఘనత సాధించిన నాలుగో కివీస్ బౌలర్గా బౌల్ట్ నిలిచాడు. అంతే కాకుండా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో కివీస్ బౌలర్గా నిలిచాడు. అతడి కంటే ముందు ఆర్జే హాడ్లీ(431), డానియల్ వెటోరీ(361), టిమ్ సౌథీ(328), ఈ జాబితాలో ఉన్నారు. అయితే 75 మ్యాచ్ల్లో సౌథీ ఈ ఘనత సాధించగా, బౌల్ట్ 74 మ్యాచ్ల్లో ఈ రికార్డు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ను 521-6 వద్ద డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ లాథమ్ డబుల్ సెంచరీతో చెలరేగగా, కాన్వే సెంచరీతో మెరిశాడు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 126 పరుగులకే కూప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో 5 వికెట్లు సాధించిగా, టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్కు అవకాశం... సిరాజ్ స్థానంలో అతడే! ఎందుకంటే.. -
ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు
David Warner Nominated For ICC Player Of The Month Award: 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డుకు గాను నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాక్ ఆటగాడు ఆబిద్ అలీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ నిలిచారు. పురుషుల విభాగంలో ఈ ముగ్గురు క్రికెటర్లు నామినీస్ కాగా.. మహిళల కేటగిరీలో పాక్ స్పిన్నర్ ఆనమ్ అమిన్, బంగ్లా బౌలర్ నహీదా అక్తర్, విండీస్ ఆల్రౌండర్ హలే మథ్యూస్ ఉన్నారు. వార్నర్.. నవంబర్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో నాలుగు మ్యాచ్ల్లో 69.66 సగటుతో 209 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలువగా.. అదే టోర్నీలో సౌథీ 7 వికెట్లతో రాణించి తన జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. డబ్ల్యూటీసీలో భాగంగా భారత్తో జరిగిన తొలి టెస్ట్లో సైతం సౌథీ 8 వికెట్లు సత్తా చాటాడు. ఈ అవార్డు రేసులో ఉన్న పాక్ ఓపెనర్ ఆబిద్ అలీ బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో 133, 91 పరుగులతో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, నవంబర్ నెలలో టీమిండియా ఆటగాళ్లు తక్కువ మ్యాచ్లు ఆడటం.. అందులో పెద్దగా రాణించకపోవడంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కాగా, ఐసీసీ.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా ఈ అవార్డును అందజేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరినీ త్వరగా ఔట్ చేస్తే.. భారత్దే విజయం! -
కుంబ్లే రికార్డు బద్దలు కొట్టిన సౌథీ
Tim Southee Breaks Anil Kumble Record Most Wickets IND vs NZ.. న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ టీమిండియాకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. బౌలింగ్ తనదైన పేస్తో మెప్పిస్తున్న సౌథీ వికెట్లతో చెలరేగుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో మెరిసిన సౌథీ.. రెండో ఇన్నింగ్స్లోనూ ఇప్పటికే మూడు వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలోనే సౌథీ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించాడు. చదవండి: Kyle Jamieson: 1865 బంతులు.. కైల్ జేమీసన్ అరుదైన ఘనత సౌథీ టీమిండియాపై ఇప్పటివరకు 10 టెస్టుల్లో 51 వికెట్లు తీశాడు. తద్వారా న్యూజిలాండ్ తరపున ఒక బౌలర్ టీమిండియాపై ఎక్కువ వికెట్లు సాధించిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. కివీస్ తరపున రిచర్డ్ హడ్లీ(1976-90) టీమిండియాపై 14 టెస్టుల్లో 65 వికెట్లతో టాప్ స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్గా టీమిండియా- న్యూజిలాండ్ బై లేటరల్ టెస్టు సిరీస్ పరంగా చూసుకుంటే సౌథీ.. భారత లెగ్స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్పై 50 వికెట్లు తీసిన కుంబ్లేను తాజాగా సౌథీ అధిగమించాడు. ఈ జాబితాలో రిచర్డ్ హడ్లీ(65 వికెట్లు) తొలి స్థానంలో.. బిషన్ సింగ్ బేడీ(57 వికెట్లు) రెండో స్థానంలో.. ప్రసన్న(55 వికెట్లు) మూడో స్థానం.. రవిచంద్రన్ అశ్విన్(55 వికెట్లు) నాలుగో స్థానంలో ఉండగా.. సౌథీ 51 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక ఆసియా గడ్డపై సౌథీకి బౌలర్గా మంచి రికార్డు ఉంది. ఆసియా గడ్డపై సౌథీ ఆడిన 12 మ్యాచ్ల్లో 47 వికెట్లు తీశాడు. చదవండి: IND vs NZ: డిఫెన్స్ ఆడాలనుకున్నాడు.. అవకాశమే ఇవ్వలేదు -
Ind Vs Nz 1st Test: నాలుగోరోజు ముగిసిన ఆట.. విజయానికి 9 వికెట్ల దూరంలో టీమిండియా
Ind Vs Nz 2021 Test Series Kanpur 1st Test Day 4 Highlights Updates Telugu: 4:40PM: న్యూజిలాండ్, టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(2),సోమర్విల్లే(0) పరుగులతో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 234/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 49 పరుగులు కలుపుకుని న్యూజిలాండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. 283 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అదిలోనే ఓపెనర్ విల్యంగ్ వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన యంగ్.. ఆశ్విన్ బౌలింగ్లో ఎల్బీ రూపంలో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్, విలియం సోమర్విల్లే ఉన్నారు. 4:24 PM: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 234/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను టీమిండియా డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్తో కలుపుకుని న్యూజిలాండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 65, వృద్ధిమాన్ సాహా(62) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ,జెమీషన్ చెరో మూడు వికెట్లు సాధించారు. 3:24 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు- 202/7. భారత్ ప్రస్తుతం 252 పరుగుల ఆధిక్యంలో ఉంది. అక్షర్ పటేల్(14), వృద్ధిమాన్ సాహా(44) క్రీజులో ఉన్నారు. 2:48 PM: టీమిండియా ప్రస్తుతం 227 పరుగుల ఆధిక్యంలో ఉంది. అక్షర్ పటేల్(4), వృద్ధిమాన్ సాహా(29) క్రీజులో ఉన్నారు. 02:25: అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్(65) అవుట్ అయ్యాడు. సౌథీ బౌలింగ్లో బ్లెండెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారత్ 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. 02: 10 PM: శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 124 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వృద్ధిమాన్ సాహా (22 పరుగులు)అతడికి సహకారం అందిస్తున్నాడు. రహానే సేన ప్రస్తుతం62 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. 01:47 PM: అరంగేట్ర టెస్టు తొలి ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్.. రెండో ఇన్నింగ్స్లోనూ అర్ధ సెంచరీతో మెరిశాడు. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టు పాలిట ఆశాకిరణంలా మారి 109 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 01: 40 PM: ►టీమిండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 01:16 PM: ►169 పరుగుల ఆధిక్యంలో భారత్ ►వృద్ధిమాన్ సాహా 7 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. 12:40 PM: రవిచంద్రన్ అశ్విన్ను దురదృష్టం వెంటాడింది. జెమీషన్ బౌలింగ్లో అశ్విన్ బౌల్డ్ అయ్యాడు. 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. టీమిండియా 156 పరుగుల ఆధిక్యంలో ఉంది. శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా క్రీజులో ఉన్నారు. 12:28PM: టీమిండియా ప్రస్తుత స్కోరు- 100/5. భారత్ 149 పరుగుల ఆధిక్యంలో ఉంది. శ్రేయస్ అయ్యర్ 24, అశ్విన్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ టీమిండియాను దెబ్బకొడుతున్నాడు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ టీమిండియాను దెబ్బకొడుతున్నాడు. వరుసగా రెండు వికెట్లు తీసి.. రహానే సేనను కష్టాల్లోకి నెట్టేశాడు. మయాంక్ను అవుట్ చేసిన సౌథీ.. జడేజా క్రీజులోకి రాగా అద్భుత బంతిని సంధించాడు. దీంతో జడ్డూ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 11:30 AM: లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 133 పరుగుల ఆధిక్యంలో ఉంది. శ్రేయస్ అయ్యర్ 18, అశ్విన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11:08 AM: టీమిండియా ప్రస్తుత స్కోరు- 73/5. 10:45 AM: జడ్డూ భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్లో రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తద్వారా భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అశ్విన్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 108 పరుగుల ఆధిక్యంలో ఉంది. 10:40 AM: టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. టిమ్ సౌథీ బౌలింగ్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టామ్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 10:30 AM: నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. పుజారాను జామీసన్ పెవిలియన్కు పంపగా, కెప్టెన్ రహానే కేవలం నాలుగు పరుగులు చేసి ఆజాజ్ పటేల్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. 32 పరుగుల వద్ద టీమిండియా పుజారా రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన పుజారా, కైల్ జామీసన్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కాన్పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. కివీస్ బౌలర్ కైలీ జెమీషన్ బౌలింగ్ అటాక్ను ప్రారంభించాడు. మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. కాగా మూడో రోజు ఆటలో భాగంగా అక్షర్ పటేల్, అశ్విన్ అద్భుత ప్రదర్శనతో విలియమ్సన్ బృందాన్ని 296 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రహానే సేన రెండో ఓవర్ తొలి బంతికే శుభ్మన్ గిల్ (1) వికెట్ కోల్పోయింది. Updates: 09: 45 AM: ► 78 పరుగుల ఆధిక్యంలో టీమిండియా 09: 35 AM: ►మయాంక్ అగర్వాల్(8), ఛతేశ్వర్ పుజారా(14) పరుగులతో క్రీజులో ఉన్నారు. ►72 పరుగుల ఆధిక్యంలో భారత్ భారత జట్టు: శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్- వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్స్టిట్యూట్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్. న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్విల్లే. -
దుమ్ము రేపిన కీవిస్ ఓపెనర్లు.. చేతులెత్తేసిన భారత బౌలర్లు
సొంతగడ్డపై భారత్కు ప్రపంచ చాంపియన్ న్యూజిలాండ్ నుంచి అనూహ్య ప్రతిఘటన... ఆశించిన రీతిలో రెండో రోజు బ్యాటింగ్లో భారీగా పరుగులు జోడించలేకపోయిన టీమిండియా ఆ తర్వాత ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. ముగ్గురు స్పిన్నర్లు కలిసి 41 ఓవర్లు వేసినా కివీస్ ఓపెనర్లు అదరకుండా, బెదరకుండా ఆడి ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది. శనివారం ఎవరు పైచేయి సాధించి టెస్టును శాసిస్తారనేది చూడాలి. కాన్పూర్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ మెరుగైన స్థితిలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్లో కివీస్ వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. విల్ యంగ్ (180 బంతుల్లో 75 బ్యాటింగ్; 12 ఫోర్లు), టామ్ లాథమ్ (165 బం తుల్లో 50 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 258/4తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (171 బంతుల్లో 105; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ పూర్తి చేసుకోగా... సౌతీ (5/69) చెలరేగాడు. రెండో రోజు 27.1 ఓవర్లు ఆడిన భారత్ మరో 87 పరుగులే జోడించి చివరి 6 వికెట్లు కోల్పోయింది. సౌతీ జోరు... సీనియర్ బౌలర్ సౌతీ రెండో రోజు భారత్ను గట్టిగా దెబ్బ కొట్టాడు. భారత్ రెండో రోజు కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగు అతని ఖాతాలోనే చేరాయి. విరామం లేకుండా వేసిన తన 11 ఓవర్ల సుదీర్ఘ స్పెల్లో అతను పదునైన బంతులతో బ్యాటర్ల పని పట్టాడు. తన రెండో ఓవర్లోనే రవీంద్ర జడేజా (112 బంతుల్లో 50; 6 ఫోర్లు)ను బౌల్డ్ చేసిన అతను కొద్ది సేపటికే సాహా (1)ను కూడా పెవిలియన్ పంపించాడు. మరోవైపు అయ్యర్ మాత్రం దూకుడుగా ఆడాడు. జేమీసన్ బౌలింగ్లో పాయింట్ దిశగా ఆడి రెండు పరుగులు తీసిన అయ్యర్ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సౌతీ తన వరుస ఓవర్లలో అయ్యర్, అక్షర్ పటేల్ (3)లను అవుట్ చేసి కెరీర్లో 13వసారి ఇన్నింగ్స్లో 5 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ దశలో అశ్విన్ (56 బంతుల్లో 38; 5 ఫోర్లు) ధాటిగా ఆడటంతో భారత్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే అశ్విన్ను బౌల్డ్ చేసిన ఎజాజ్... ఇషాంత్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ ఆలౌటైంది. ఓపెనర్లు సూపర్... తక్కువ ఎత్తులో వస్తున్న బంతి, ఒక్కోసారి అనూహ్యమైన బౌన్స్, టర్న్... ఇలాంటి పిచ్పై భారత బ్యాట్స్మెన్ ఇబ్బంది పడిన చోట కివీస్ బ్యాటర్లకు కూడా సమస్య తప్పదనిపించింది. అయితే ఓపెనర్లు లాథమ్, యంగ్ దానిని తప్పుగా నిరూ పించారు. భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా మన ముగ్గురు స్పిన్నర్లను వారు జాగ్రత్తగా ఆడిన తీరు కివీస్ పట్టుదలను చూపించింది. మన పేసర్లు తొలి 7 ఓవర్లు వేయగా... వాటిలో చివరి 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా రాలేదు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ నుంచే స్పిన్తో భారత్ దాడికి సిద్ధమైంది. అయితే ఈ వ్యూహం ఏమాత్రం పని చేయలేదు. చూస్తుండగానే భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. భారత గడ్డపై తొలిసారి ఆడుతున్న యంగ్ బౌండరీలతో చెలరేగగా, లాథమ్ అండగా నిలిచాడు. టీ విరామానికి కివీస్ 72/0 వద్ద నిలిచింది. చివరి సెషన్లోనూ భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోగా... ప్రత్యర్థి ఓపెనర్లు దూసుకుపోయారు. 88 బంతుల్లో యంగ్ అర్ధసెంచరీ పూర్తి కాగా, 39వ ఓవర్లో పార్ట్నర్షిప్ వంద పరుగులకు చేరింది. చివర్లో లాథమ్ 157 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోగా, భారత బౌలర్లు ఎంత ప్ర యత్నించినా ఈ జోడీని విడదీయలేకపోయారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) బ్లన్డెల్ (బి) జేమీసన్ 13; గిల్ (బి) జేమీసన్ 52; పుజారా (సి) బ్లన్డెల్ (బి) సౌతీ 26; రహానే (బి) జేమీసన్ 35; శ్రేయస్ (సి) యంగ్ (బి) సౌతీ 105; జడేజా (బి) సౌతీ 50; సాహా (సి) బ్లన్డెల్ (బి) సౌతీ 1; అశ్విన్ (బి) ఎజాజ్ 38; అక్షర్ (సి) బ్లన్డెల్ (బి) సౌతీ 3; ఉమేశ్ (నాటౌట్) 10; ఇషాంత్ (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (111.1 ఓవర్లలో ఆలౌట్) 345. వికెట్ల పతనం: 1–21; 2–82; 3–106; 4–145; 5–266; 6–288; 7–305; 8–313; 9–339; 10–345. బౌలింగ్: సౌతీ 27.4–6–69–5; జేమీసన్ 23.2–6–91–3; ఎజాజ్ 29.1–7–90–2; సోమర్ విలే 24–2–60–0; రచన్ రవీంద్ర 7–1–28–0. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బ్యాటింగ్) 50; యంగ్ (బ్యాటింగ్) 75; ఎక్స్ట్రాలు 4; మొత్తం (57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 129. బౌలింగ్: ఇషాంత్ శర్మ 6–3–10–0; ఉమేశ్ యాదవ్ 10–3–26–0; అశ్విన్ 17–5–38–0; జడేజా 14–4–28–0; అక్షర్ 10–1–26–0. -
IND Vs NZ: రెండో టి20లో విజయం.. టీమిండియాదే సిరీస్
న్యూజిలాండ్తో జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్(55), రాహుల్(65)లు తొలి వికెట్కు 117 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. దీంతో టీమిండియా లక్ష్యాన్ని సులువుగానే చేధించింది. ఆఖర్లో వీరిద్దరు ఔటైనప్పటికి పంత్(12 పరుగులు) వరుసగా రెండు సిక్సర్లతో టీమిండియాను గెలిపించాడు. వెంకటేశ్ అయ్యర్ 12 పరుగులు నాటౌట్గా నిలిచాడు. ఈ విజయంతో టీమిండియా మూడు టి20 మ్యాచ్ల సిరీస్ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. వరుస బంతుల్లో రెండు వికెట్లు డౌన్.. 17 ఓవర్లలో 140/3 టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. సౌథీ బౌలింగ్లో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రోహిత్ శర్మ(55),సూర్యకుమార్ యాదవ్(1) వెనుదిరిగారు. ప్రస్తుతం టీమిండియా 17 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ఫిఫ్టీ.. టీమిండియా 11 ఓవర్లలో 92/0 టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థశతకంతో మెరిశాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో టి20 కెరీర్లో 16వ అర్థసెంచరీ మార్క్ను అందుకున్నాడు. మరోవైపు రోహిత్ కూడా 31 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. 10 ఓవర్లలో టీమిండియా 79/0 టీమిండియా ఓపెనర్లు రాహుల్(44), రోహిత్ శర్మ(31)లు నిలకడగా ఆడుతుండడంతో టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. 3 ఓవర్లలో టీమిండియా 18/0 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 16, రోహిత్ శర్మ 1 పరుగుతో ఆడుతున్నారు. ►టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 80 పరుగులతో పటిష్టంగానే కనిపించిన న్యూజిలాండ్ .. టీమిండియా స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అశ్విన్, అక్షర్ పటేల్లు కలిసి 8 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కివీస్ బ్యాటింగ్లో గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. గప్టిల్ 31, డారిల్ మిచెల్ 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్ 2, అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, దీపక్ చహర్ తలా ఒక వికెట్ తీశారు. 18 ఓవర్లలో న్యూజిలాండ్ 140/6 18 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సాంట్నర్ 3, మిల్నే 0 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు భువనేశ్వర్ బౌలింగ్లో 3 పరుగులు చేసిన నీషమ్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో వికెట్ కోల్పోయిన కివీస్.. గ్లెన్ ఫిలిప్స్(3) ఔట్ డారిల్ మిచెల్(31) రూపంలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఫిలిప్స్(3), సీఫెర్ట్ 0 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన కివీస్.. 9 ఓవర్లలో 80/2 21 పరుగులు చేసిన మార్క్ చాప్మన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. గప్టిల్(31) ఔట్.. 5 ఓవర్లలో న్యూజిలాండ్ 56/1 మార్టిన్ గప్టిల్(31) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చహర్ బౌలింగ్లో షాట్కు యత్నించి కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. మిచెల్ 19, చాప్మన్ 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియాతో జరుగుతున్న రెండో టి20లో న్యూజిలాండ్ దాటిగా ఆడుతోంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు పోటాపోటీగా పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. గప్టిల్ 25, మిచెల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. రాంచీ: న్యూజిలాండ్తో తొలి టి20లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు సిరీస్ సొంత చేసుకోవడంపై దృష్టి పెట్టింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా నేడు జరిగే రెండో మ్యాచ్లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా చెంత చేరుతుంది. మరోవైపు టి20 ప్రపంచకప్ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు ఈ ద్వైపాక్షిక సిరీస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, సూర్యకుమార్, రిషభ్ పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్ , దీపక్ చహర్, అశ్విన్, భువనేశ్వర్, హర్షల్ పటేల్ న్యూజిలాండ్: సౌతీ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్ -
INDvsNZ: తొలి టి20లో భారత్ విజయం
-
Ind Vs Nz 1st T20: 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడ్డాయి... అయినా
Ind Vs Nz T20 Series 2021: India Beat New Zealand By 5 Wickets Lead 1-0: కొత్త కెప్టెన్, కొత్త కోచ్ మార్గనిర్దేశనంలో భారత క్రికెట్ జట్టు టి20 సిరీస్లో శుభారంభం చేసింది. బౌలింగ్లో అశ్విన్, భువనేశ్వర్ రాణించడంతో కివీస్ను కట్టడి చేసిన టీమిండియా... ఆపై సూర్యకుమార్, రోహిత్ల ప్రదర్శనతో లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఆఖర్లో కొంత పోటీనిచ్చినా న్యూజిలాండ్కు చివరకు ఓటమే ఎదురైంది. జైపూర్: న్యూజిలాండ్తో టి20 సిరీస్ను భారత్ విజయంతో మొదలు పెట్టింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో కివీస్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్లు), మార్క్ చాప్మన్ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది. శతక భాగస్వామ్యం... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే డరైల్ మిచెల్ (0) డకౌట్ కావడంతో కివీస్ ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. అయితే గప్టిల్, చాప్మన్ కలిసి జట్టును ఆదుకున్నారు. చహర్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ సహా 15 పరుగులు రావడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 41 పరుగులకు చేరింది. ధాటిగా ఆడిన ఈ జోడీ రెండో వికెట్కు 77 బంతుల్లోనే 109 పరుగులు జోడించింది. అయితే ఈ భాగస్వామ్యాన్ని విడదీసిన తర్వాత మిగతా కివీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో భారత్ సఫలమైంది. రాణించిన రోహిత్... ఛేదనలో రాహుల్ (15) ఆరంభంలోనే వెనుదిరిగినా... రోహిత్ తనదైన శైలిలో స్వేచ్ఛగా ఆడాడు. సౌతీ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను... బౌల్ట్ ఓవర్లోనూ వరుసగా 4, 4, 6 బాదాడు. మూడో స్థానంలో వచ్చిన సూర్య కూడా చక్కటి షాట్లతో కెప్టెన్కు సహకారం అందించాడు. ఫలితంగా 69 బంతుల్లోనే జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. 34 బంతుల్లోనే సూర్య అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో 16 పరుగుల వ్యవధిలో భారత్ 3 వికెట్లు చేజార్చుకోవడంతో కొంత ఉత్కంఠ నెలకొన్నా... మరో రెండు బంతుల ముందే విజయం దక్కింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) శ్రేయస్ (బి) చహర్ 70; మిచెల్ (బి) భువనేశ్వర్ 0; చాప్మన్ (బి) అశి్వన్ 63; ఫిలిప్స్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; సీఫెర్ట్ (సి) సూర్యకుమార్ (బి) భువనేశ్వర్ 12; రవీంద్ర (బి) సిరాజ్ 7; సాన్ట్నర్ (నాటౌట్) 4; సౌతీ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–1; 2–110; 3–110; 4–150; 5–153; 6–162. బౌలింగ్: భువనేశ్వర్ 4–0– 24–2; దీపక్ చహర్ 4–0–42–1; సిరాజ్ 4–0– 39–1; అశి్వన్ 4–0–23–2; అక్షర్ 4–0–31–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) చాప్మన్ (బి) సాన్ట్నర్ 15; రోహిత్ (సి) రవీంద్ర (బి) బౌల్ట్ 48; సూర్యకుమార్ (బి) బౌల్ట్ 62; పంత్ (నాటౌట్) 17; శ్రేయస్ అయ్యర్ (సి) బౌల్ట్ (బి) సౌతీ 5; వెంకటేశ్ అయ్యర్ (సి) రవీంద్ర (బి) మిచెల్ 4; అక్షర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–50; 2–109; 3–144; 4–155; 5–160. బౌలింగ్: సౌతీ 4–0–40–1; బౌల్ట్ 4–0–31–2; ఫెర్గూసన్ 4–0–24–0; సాన్ట్నర్ 4–0–19–1; ఆస్టల్ 3–0–34–0; మిచెల్ 0.4–0–11–1. చదవండి: Mohammed Siraj: 52 మ్యాచ్ల తర్వాత బరిలోకి Venkatesh Iyer: 'నా కల నెరవేరింది'.. వెంకటేశ్ అయ్యర్ ఎమోషనల్ ICYMI: There was no shortage of drama & action in the last over of #TeamIndia's chase. Here's how the things panned out as @RishabhPant17 hit the winning runs & India sealed a win. 👏 👏 #INDvNZ @Paytm Watch 🎥 🔽 — BCCI (@BCCI) November 17, 2021 -
IND vs NZ: తొలి టి20లో టీమిండియా ఘనవిజయం
న్యూజిలాండ్తో జరిగిన తొలి టి20లో టీమిండియా భోణీ కొట్టింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ తొలి వికెట్కు 50 పరుగులు జోడించారు. రాహుల్ ఔటైన అనంతరం రోహిత్ శర్మ(48), సూర్యకుమార్ యాదవ్ (63) టీమిండియా ఇన్నింగ్స్ నడిపించారు. చివర్లో ఉత్కంఠ రేపినా ఆఖరి ఓవర్ నాలుగో బంతికి పంత్ ఫోర్ కొట్టడంతో టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 2, సౌథీ, సాంట్నర్, మిచెల్ తలా ఒక వికెట్ తీశారు. రోహిత్ శర్మ(48) ఔట్.. టీమిండియా 141/2 రోహిత్ శర్మ(48) బౌల్ట్ బౌలింగ్లో వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సూర్యకుమార్ 61, పంత్ 10 పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లలో టీమిండియా 104/1 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 46, సూర్యకుమార్ యాదవ్ 37 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో మార్క్ చాప్మన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 7 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. రోహిత్ 37, సూర్యకుమార్ 5 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 165..3 ఓవర్లలో టీమిండియా 24/0 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 15, కేఎల్ రాహుల్ 7 పరుగులతో ఆడుతున్నారు. 20 ఓవర్లలో న్యూజిలాండ్ 164/6 టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ ( 70 పరుగులు, 42 బంతులు; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. మార్క్ చాప్మన్ 63 పరుగులు చేశాడు. మిగతా వారిలో పెద్దగా ఎవరు రాణించలేదు. ఇక టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ చెరో 2 వికెట్లు తీయగా..దీపక్ చహర్, సిరాజ్లు తలా ఒక వికెట్ తీశారు. అశ్విన్ దెబ్బ.. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన కివీస్ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు న్యూజిలాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో రెండో బంతికి చాప్మన్(63) క్లీన్బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఐదో బంతికి గ్లెన్ ఫిలిప్స్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కివీస్ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. దాటిగా ఆడుతున్న కివీస్.. 13 ఓవర్లలో 106/1 టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో కివీస్ దాటిగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ తొలి హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతనికి గప్టిల్ 42 పరుగులతో సహకరిస్తున్నాడు. ►10 ఓవర్లలో న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ 42, గప్టిల్ 19 పరుగులతో ఆడుతున్నారు. 6 ఓవర్లలో న్యూజిలాండ్ 41/1 ఆరు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ 30, మార్టిన్ గప్టిల్ 9 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు డారిల్ మిచెల్ భువనేశ్వర్ బౌలింగ్లో గోల్డెన్ డక్ అయ్యాడు. డారిల్ మిచెల్ గోల్డెన్ డక్.. తొలి వికెట్ కోల్పోయిన కివీస్ మ్యాచ్ ప్రారంభంలోనే న్యూజిలాండ్కు షాక్ తగిలింది. ఓపెనర్ డారిల్ మిచెల్ భువనేశ్వర్ బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 1 ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. జైపూర్: టి20 ప్రపంచకప్ 2021 ముగిసిందో లేదో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ ఆరంభమైంది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య బుధవారం జరుగుతున్న తొలి టి20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. టి20 ప్రపంచకప్లో సూపర్ 12 దశలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సీనియర్ల గైర్హాజరీలో టీమిండియాలో చాలా మార్పులు జరగనున్నాయి. ఇక రోహిత్ టి20ల్లో పూర్తిస్తాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనుండడంతో అతనికి ఈ సిరీస్ కీలకంగా మారింది. అటు న్యూజిలాండ్లో కూడా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమిసన్లు దూరంగా ఉండడంతో సౌథీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు 15 సార్లు టి20ల్లో తలపడగా.. ఆరు సార్లు టీమిండియా.. 9 సార్లు న్యూజిలాండ్ విజయం సాధించింది. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ(కెప్టెన్), టాడ్ ఆస్టిల్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ Toss Update from Jaipur:@ImRo45 has won the toss & #TeamIndia have elected bowl against New Zealand in the first T20I. @Paytm #INDvNZ Follow the match ▶️ https://t.co/5lDM57TI6f pic.twitter.com/Xm3p91BgLG — BCCI (@BCCI) November 17, 2021 -
IND vs NZ T20 Series: కివీస్కు షాక్.. తప్పుకొన్న విలియమ్సన్.. కెప్టెన్గా సౌథీ
IND vs NZ T20I Series 2021: Kane Williamson to Miss T20 Against India, Check Here: టీమిండియాతో టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్ తగిలింది. సుదీర్ఘ కాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరం కానున్నాడు. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత టెస్టు సిరీస్ నాటికి టీమ్తో మమేకం కానున్నాడు. కాగా టీ20 వరల్డ్కప్ 2021లో న్యూజిలాండ్ను తొలిసారి ఫైనల్కు చేర్చిన సారథిగా విలియమ్సన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే, విశ్వవిజేతగా నిలవాలన్న కేన్ బృందం ఆశలపై నీళ్లు చల్లి.. ఆస్ట్రేలియా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. దీంతో కివీస్ రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే టీమిండియాతో సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో యూఏఈ నుంచి కివీస్ ఆటగాళ్లు జైపూర్కు చేరుకున్నారు. నవంబరు 17 నుంచి మొదలుకానున్న పొట్టి ఫార్మాట్ సిరీస్కు సన్నద్ధమవుతున్నారు. కాగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ తర్వాత.. వరల్డ్టెస్టు చాంపియన్షిప్లో భాగంగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి డబ్యూటీసీ టైటిల్ గెలిచిన కెప్టెన్గా చరిత్ర లిఖించిన విలియమ్సన్.. పూర్తిస్థాయిలో ఈ సిరీస్పై దృష్టి సారించాలని భావిస్తున్నాడట. స్వదేశంలో కొరకరాని కొయ్యగా మారే భారత జట్టుకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాడట. ఇందుకు తోడు గాయం కూడా వేధిస్తుండటంతో టీ20 సిరీస్కు దూరం కావాలని విలియమ్సన్ నిర్ణయించుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది. కాగా టీ20 సిరీస్కు కేన్ విలియమ్సన్ దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో టిమ్ సౌథీ సారథిగా పగ్గాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఇక టీ20 సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ తొలిసారి పూర్తిస్థాయిలో టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనుండగా.. మొదటి టెస్టుకు అజింక్య రహానే, రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యం వహించనున్నారు. టీమిండియాతో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ఇదే: టాడ్ ఆస్ట్లే, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, లోకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, కైలీ జెమీషన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ(కెప్టెన్). చదవండి: Hardik Pandya: అవన్నీ ఉత్త పుకార్లే.. 5 కోట్లు కాదు.. ఆ వాచీ ధర కోటిన్నర మాత్రమే: పాండ్యా Kane Williamson: వినండి పక్కనే వాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో.. మరేం పర్లేదు కేన్.. మనసులు గెలిచారు! -
ENG Vs NZ : కివీస్ ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు
3 Big Records For New Zeland Players Vs ENG Semi Final Match T20 Wc 2021.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. కాగా 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ సూపర్ ఓవర్లో ఓడిన సంగతి తెలిసిందే. ఫైనల్, సూపర్ ఓవర్ టై కావడంతో ఇన్నింగ్స్లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ అనూహ్యంగా విశ్వవిజేతగా అవతరించింది. దీంతో న్యూజిలాండ్కు నిరాశే ఎదురైంది. తాజాగా టి20 ప్రపంచకప్లో ఇరుజట్లు సెమీస్లో ఎదురుపడగా.. ఇంగ్లండ్ ఫెవరెట్గా కనిపిస్తుంది. అయితే కివీస్ ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. చదవండి: Sunil Gavaskar: సెమిఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించడం అంత సులభం కాదు టిమ్ సౌథీ: కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ.. శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ రికార్డును బ్రేక్ చేసే అవకాశం లభించింది. ఇప్పటివరకు మలింగ 84 టి20ల్లో 107 వికెట్లు తీశాడు. టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మలింగ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా సౌథీ 88 మ్యాచ్ల్లో 106 వికెట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో సౌథీ ఒక్క వికెట్ తీస్తే మలింగతో సమానంగా.. రెండు వికెట్లు తీస్తే మలింగను దాటి రెండో స్థానంలో నిలవనున్నాడు. ఇక మొదటి స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్(94 మ్యాచ్ల్లో117 వికెట్లు) ఉన్నాడు. చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా! కేన్ విలియమ్సన్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టి20ల్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు 69 పరుగులు కావాల్సి ఉంది. కాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో కేన్ మామ 69 పరుగులు చేస్తే ఈ మార్క్ను అందుకున్న మూడో కివీస్ బ్యాటర్గా నిలవనున్నాడు. ఇంతకముందు కివీస్ తరపున మార్టిన్ గప్టిల్, బ్రెండన్ మెక్కల్లమ్ ఉన్నారు. మార్టిన్ గప్టిల్: కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 112 పరుగులు చేస్తే టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాటర్గా నిలవనున్నాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో సెంచరీ చేయడం కాస్త కష్టసాధ్యమైనప్పటికీ గప్టిల్ వేగంగా ఆడితే మాత్రం రికార్డు అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం గప్టిల్ 107 మ్యాచ్ల్లో 3115 పరుగులు చేశాడు. ఇక తొలి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి 95 మ్యాచ్ల్లో 3227 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 116 మ్యాచ్ల్లో 3038 పరుగులతో ఉన్నాడు. చదవండి: Daryl Mitchell: ఇది ఫీల్డింగ్ అంటే.. క్యాచ్ పట్టకపోయినా హీరో అయ్యాడు -
NZ Vs PAK: టిమ్ సౌథీ నయా రికార్డు; టి20 చరిత్రలో మూడో బౌలర్గా
Tim Southee 100th Wicket In T20I Cricket.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ టి20ల్లో చరిత్ర సృష్టించాడు. టి20 క్రికెట్లో 100 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా సౌథీ రికార్డులకెక్కాడు. కాగా న్యూజిలాండ్ నుంచి ఈ ఘనత అందుకున్న తొలి బౌలర్గా సౌథీ నిలవడం విశేషం. టి20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో బాబర్ అజమ్ను క్లీన్బౌల్డ్ చేయడం ద్వారా సౌథీ టి20 క్రికెట్లో 100వ వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. చదవండి: WI VS SA: రసెల్ స్టన్నింగ్ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో ఇంతకముందు టి20 క్రికెట్లో వంద వికెట్ల మార్క్ను అందుకున్న వారిలో షకీబ్ అల్ హసన్(117 వికెట్లు), లసిత్ మలింగ(107 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా సౌథీ తర్వాత రషీద్ ఖాన్ 99 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా సౌథీ న్యూజిలాండ్ తరపున 79 టెస్టుల్లో 314 వికెట్లు.. 143 వన్డేల్లో 190 వికెట్లు.. 84 టి20ల్లో 100 వికెట్లు తీశాడు. Southee claims 100th T20I wicket via @t20worldcup https://t.co/6vpJxIOwCl — varun seggari (@SeggariVarun) October 26, 2021 -
Gautam Gambhir: సోషల్ మీడియా యూజర్లను పెంచుకోవడానికేనా ఇలా?!
Gautam Gambhir Comments On Ashwin- Morgan Row: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్, కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కొంతమంది మోర్గాన్కు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు అశ్విన్కు అండగా నిలుస్తున్నారు. ఇక ఈ వివాదంపై టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ ఘటనలో అశ్విన్కు వంద శాతం తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. నిబంధనలకు లోబడే అశ్విన్ అలా ప్రవర్తించాడని, అందులో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నాడు. ఈ మేరకు ఒకప్పటి ఢిల్లీ జట్టు సారథి గౌతీ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఈ విషయం గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు. వాళ్లకు ఇందులో అసలు ప్రమేయం ఎందుకు? బహుశా సోషల్ మీడియా యూజర్లను పెంచుకునే క్రమంలో ఇలా మాట్లాడుతున్నారేమోనని అనిపిస్తోంది. ఇలా చేయడంలో ఏమాత్రం అర్థం లేదు. అశ్విన్ కచ్చితంగా సరైన పనే చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని అశూకు మద్దతు తెలిపాడు. కాగా ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అశ్విన్దే తప్పంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. courtesy: IPL ఇక సెప్టెంబరు 28న కేకేఆర్తో ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా సౌథీ, అశ్విన్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్.. సౌథీకి అండగా నిలిచాడు. దీంతో అశ్విన్ సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలో కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ జోక్యం చేసుకుని గొడవను ఆపాడు. అయితే, ఆ తర్వాత దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. బాల్ పంత్ను తాకిన తర్వాత కూడా అశ్విన్ పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే ఉద్దేశంలో మోర్గాన్ అలా స్పందించి ఉంటాడని పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన అశ్విన్.. నిబంధనలకు లోబడే పరుగు తీశానని, ఇందులో తన తప్పేమీ లేదని కౌంటర్ ఇచ్చాడు. చదవండి: MS Dhoni: చాలు సామీ.. చాలు.. ఫినిషర్ ఇంకా బతికే ఉన్నాడు! -
Ashwin Vs Morgan: గొడవ పడ్డానా... ఎట్టకేలకు మౌనం వీడిన అశ్విన్!
Ravichandran Ashwin Tweets Goes Viral: కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆటగాడు టిమ్ సౌథీతో జరిగిన గొడవ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఎట్టకేలకు మౌనం వీడాడు. వరుస ట్వీట్లతో సదరు ఘటన గురించి తన స్పందన తెలియజేశాడు. తప్పొప్పుల గురించి మాట్లాడేటపుడు కాస్త ఆలోచించాలని విమర్శకులకు హితవు పలికాడు. నిబంధనలకు లోబడి ఆడటం, మైదానం వీడిన తర్వాత గొడవల గురించి మర్చిపోవడం అసలైన క్రీడాస్ఫూర్తి అన్న విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని తల్లిదండ్రులకు సూచించాడు. ఈ మేరకు అశ్విన్ ...‘‘ఫీల్డర్ విసిరిన బంతి రిషభ్ తాకిందన్న విషయం నాకు తెలియదు. ఆ సమయంలో నేను మరో పరుగు కోసం వెళ్లాను. నిజంగా పంత్ను బంతి తాకిన విషయం నేను చూశానా? ఆ తర్వాత కూడా రన్ కోసం వెళ్తానా అంటే.. కచ్చితంగా..! మోర్గాన్ చెప్పినట్లు నాకు ఇతరులను గౌరవించడం రాదా? కానే కాదు! నిజంగా నేను గొడవకు దిగానా? లేదు.. అస్సలు లేదు.. నా పాటికి నేను అక్కడ నిల్చుని ఉన్నాను. నా తల్లిదండ్రులు, టీచర్లు చెప్పినట్లు బుద్ధిగా నిల్చుని ఉన్నా. మీరు కూడా మీ పిల్లలకు ఇదే చెప్పండి. మోర్గాన్, సౌథీ వారి క్రికెట్ ప్రపంచంలో వారికి నచ్చిందే సరైందని భావించవచ్చు. కానీ, మైదానంలో ఒకరిని తక్కువ చేసి మాట్లాడే హక్కు వారికి లేదు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఎవరు మంచివాళ్లు.. ఎవరు కాదు అన్న విషయాల గురించి కొంత మంది చర్చ మొదలెట్టేశారు. క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. ఫీల్డర్ విఫలమైనపుడు అదనపు రన్ కోసం పరుగు తీయడం మీ కెరీర్ను బ్రేక్ చేస్తుందా? ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ను పరుగు వద్దని హెచ్చరించి, మనం కూడా వారి ప్రతిపాదన తిరస్కరిస్తేనే మంచి వ్యక్తి అని, లేదంటే చెడ్డవాళ్లు అంటూ ఇతరులను కన్ఫ్యూజన్లో పడేయకండి. మైదానంలో నిబంధనలకు అనుగుణంగా... పూర్తిస్థాయిలో మన శక్తి సామర్థ్యాలు ఒడ్డి జట్టుకు ప్రయోజనకరంగా ఉండటం మంచి విషయం. ఆట పూర్తైన తర్వాత చేతులు కలిపి మాట్లాడుకోవడం అనేదే క్రీడా స్ఫూర్తి అన్న విషయం నాకు అర్థమైంది’’అని సుదీర్ఘ పోస్టు పెట్టాడు. తన తప్పేమీ లేదని పరోక్షంగా మోర్గాన్, సౌథీకి కౌంటర్ ఇచ్చాడు. కాగా సెప్టెంబరు 28న కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా సౌథీ, అశ్విన్ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో కెప్టెన్ మోర్గాన్ దూరి సౌథీకి మద్దతు పలికాడు. దీంతో ఆశ్విన్ మోర్గాన్కు బ్యాట్ చూపిస్తూ సీరియస్గా కనిపించాడు. అంతలో.. వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ జోక్యం చేసుకోవడంతో అక్కడితో వివాదం సద్దుమణిగింది. అయితే, ఆ తర్వాత దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. బాల్ పంత్ను తాకిన తర్వాత కూడా అశ్విన్ పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే ఉద్దేశంలో మోర్గాన్ అలా స్పందించి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఈ మేరకు ట్వీట్లు చేయడం గమనార్హం. చదవండి: Harshal Patel: కోహ్లి తొడను గట్టిగా రుద్దేశాను.. సిరాజ్ కాలికి గాయం! 1. I turned to run the moment I saw the fielder throw and dint know the ball had hit Rishabh. 2. Will I run if I see it!? Of course I will and I am allowed to. 3. Am I a disgrace like Morgan said I was? Of course NOT. — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) September 30, 2021 -
డెబ్యూ మ్యాచ్లోనే గొడవ.. మోర్గాన్ మద్దతు
Ravichandran Ashwin Vs Tim Southee.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ తరపున కివీస్ పేసర్ టిమ్ సౌథీ డెబ్యూ మ్యాచ్ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్లోనే సౌథీ గొడవ పడడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ బ్యాటర్ రవిచంద్రన్ అశ్విన్తో మాటల యుద్దానికి దిగాడు. ఇంతలో మోర్గాన్ కలగజేసుకోగా.. వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ వచ్చి అశ్విన్ను దూరంగా తీసుకెళ్లాడు. అయితే వెళ్తూ వెళ్తూ అశ్విన్ సౌథీకి బ్యాట్ చూపిస్తూ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఇక సౌథీ వేసిన స్లోబాల్ను అశ్విన్ ఫ్లిక్ చేయగా.. గాల్లోకి లేవడంతో డీప్ స్వేర్లెగ్లో ఉన్న నితీష్ రాణా పరిగెత్తుకు వచ్చి క్యాచ్ అందుకున్నాడు. చదవండి: నరైన్ సూపర్ బౌలింగ్.. అయ్యర్కు బొమ్మ కనపడింది Courtesy: IPL Twitter కాగా ఇద్దరి మధ్య గొడవకు కారణం అంతకముందు ఓవర్ అట.. వెంకటేశ్ అయ్యర్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదో బంతికి పంత్ రెండు పరుగులు తీశాడు. అయితే అశ్విన్ రెండో పరుగు కోసం వెళ్లగా.. అయ్యర్ బంతి అందుకోవడంలో విఫలమయ్యాడు. అయ్యర్కు అశ్విన్ అడ్డురావడంతో రనౌట్ మిస్ అయింది. అయితే ఇందులో అశ్విన్ తప్పు ఏం లేదు. ఇది మనసులో పెట్టుకొని సౌథీ అలా చేసి ఉంటాడని.. అందుకు మోర్గాన్ మద్దతు పలికాడంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. చదవండి: T20 World Cup 2021: భువీ స్థానంలో అతనికి అవకాశం ఇస్తే మంచిదేమో! some Words Exchange Between Ash anna And Morgan..#Ipl2021 #KKRvDC pic.twitter.com/Y7zoEfYex4 — Mr.Béâst 🦁ᵀᵉᵃᵐ ᶜˢᴷ (@its_vaathi) September 28, 2021 -
కోల్కతాకు సౌథీ, పంజాబ్తో ఆదిల్ రషీద్ ఒప్పందం
న్యూఢిల్లీ: సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకోవడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఇదివరకే చాలా జట్లు రిప్లేస్మెంట్ ఆటగాళ్లును ఎంపిక చేసుకుంది. తాజాగా, కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) జట్టు న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీని జట్టులోకి తీసుకోగా, పంజాబ్ కింగ్స్ జట్టు ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ను జట్టులోకి చేర్చుకున్నాయి. సౌథీ.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ను రీప్లేస్ చేయనుండగా, రషీద్ ఆసీస్ పేసర్ జై రిచర్డ్సన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆదిల్ రషీద్ ఐపీఎల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, సౌథీ గతంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో వరుసగా ఆరు సీజన్లు ఆడిన సౌథీ గతేడాది వేలంలో అమ్ముడుపోలేదు. చివరిసారి అతను 2019 ఐపీఎల్లో కోహ్లి సారథ్యంలో ఆర్సీబీకి ఆడాడు. చదవండి: పీసీబీ అధ్యక్షుడిగా పాక్ ప్రధాని సన్నిహితుడు.. -
ఒక జెర్సీ.. 11 మంది ఆటగాళ్లు; 8 ఏళ్ల చిన్నారి ప్రాణాలు
ఆక్లాండ్: న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సౌథీ ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు వేసుకున్న జెర్సీని వేలం వేయనున్నాడు. క్యాన్సర్తో పోరాడుతున్న 8 ఏళ్ల బాలికను రక్షించడానికి సౌథీ ఈ పని చేయనున్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన 11 మంది ఆటగాళ్లతో ఇప్పటికే జెర్సీపై సంతకాలు చేయించగా.. తాజాగా ఆ జెర్సీని వేలం వేయనున్నట్లు ప్రకటించాడు. వేలం ద్వారా వచ్చే డబ్బును చిన్నారి చికిత్సకు ఉపయోగించనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో షేర్ చేసుకున్న సౌథీ స్పందిస్తూ..' హోలీ బీటీ అనే 8 ఏళ్ల బాలిక మూడేళ్లుగా న్యూరోబ్లస్టోమా క్యాన్సర్తో పోరాడుతుంది. రెండున్నరేళ్లుగా చికిత్స తీసుకుంటున్న బెట్టీ రెండున్నర సంవత్సరాలుగా చికిత్స తీసుకుంటుంది. కాగా ఇటీవలే ఆమె మెదుడులో మూడు సెంటీమీటర్ల ట్యూమర్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని నాకు మా కుటంబసభ్యులు తెలిపారు. నా కుటుంబసభ్యులు కూడా చిన్నారి చికిత్సకు అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చారు. ఇక ఆ చిన్నారిని బతికించేందుకు నేను డబ్ల్యూటీసీ ఫైనల్లో వేసుకున్న జెర్సీని వేలం వేయాలని నిర్ణయించుకున్నా. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బెట్టీ కుటుంబానికి అందజేస్తాను. నా జెర్సీని దక్కించుకోవాలనే వాళ్లు బిడ్ వేయండి అంటూ చెప్పుకొచ్చాడు. సౌథీ జెర్సీ వేలంపై అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఇక డబ్ల్యూటీసీ టోర్నీలో భాగంగా 2019-21 కాలంలో 11 టెస్టులు ఆడిన సౌథీ 56 వికెట్లు తీసి న్యూజిలాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇక భారత్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌథీ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: ఊహించని విధంగా బౌన్సర్ వేశాడు.. దాంతో View this post on Instagram A post shared by Tim Southee (@tim_southee) -
WTC: 13 ఏళ్ల క్రితం సెమీస్లో.. ఇప్పుడు ఫైనల్లో
లండన్: మరో పది రోజుల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్షిప్ మ్యాచ్ జరగనుంది. తొలిసారి టెస్టు క్రికెట్లో చాంపియన్షిప్ మ్యాచ్ జరగనుండడంతో క్రికెట్ ప్రేమికుల దృష్టి దీనిపైనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఐసీసీ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రోజుకో విషయంతో మన ముందుకు వస్తుంది. తాజాగా మంగళవారం ఐసీసీ తన ట్విటర్లో షేర్ చేసిన ఫోటో ఆసక్తికరంగా మారింది. 2008 అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియా, న్యూజిలాండ్లు సెమీ ఫైనల్లో తలపడ్డాయి. అప్పటి టీమిండియా జట్టులో కోహ్లి, రవీంద్ర జడేజా.. కివీస్ జట్టులో కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ సభ్యులుగా ఉన్నారు. విచిత్రమేంటంటే.. అప్పటి జట్టుకు టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లి, కివీస్ కెప్టెన్గా కేన్ విలియమ్సన్లు ఉండడం విశేషం. తాజాగా జరగనున్న టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు ఇరు జట్లు కెప్టెన్లుగా ఈ ఇద్దరే ఉన్నారు. వీరిద్దరితో పాటు టీమిండియా నుంచి జడేజా ప్రస్తుత జట్టులో ఉండగా.. కివీస్ నుంచి టిమ్ సౌథీతో పాటు ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు. అలా 13 ఏళ్ల కింద ఒక మెగా సెమీఫైనల్ ఆడిన ఈ నలుగురు మరోసారి టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు సిద్ధమవుతున్నారు. ఐసీసీ పెట్టిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక 2008 అండర్- 19 ప్రపంచకప్లో ఇరుజట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కివీస్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కోరె అండర్సన్ 70 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కేన్ విలియమ్సన్ 37 పరుగులు చేశాడు. అనంతరం టీమిండియా బ్యాటింగ్ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో 43 ఓవర్లలో 191 పరుగుల చేయాల్సి వచ్చింది. టీమిండియా మరో 9 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి ఫైనల్లో అడుగుపెట్టింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ నాలుగు వికెట్లతో రాణించాడు. ఇక ఫైనల్లో కోహ్లి సారథ్యంలోని టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించి సగర్వంగా అండర్ 19 ప్రపంచకప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. చదవండి: ఐసీసీ అధికారిక భాగస్వామిగా భారత్పే WTC Final: ఐసీసీ ఈవెంట్లు ఇద్దరికి కలిసి రాలేదు The glow up of all glow ups. From 2008 U19 @cricketworldcup semi-final talents, to #WTC21 final titans 🏏 pic.twitter.com/hBracC1m52 — ICC (@ICC) June 8, 2021 -
టిమ్ సౌథీ 'ఆరే'యడంతో న్యూజిలాండ్కు ఆధిక్యం
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో టామ్ లాథమ్ (30), నీల్ వాగ్నర్ (1) ఉన్నారు. ఇంగ్లీష్ బౌలర్ ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంకా ఆటలో ఒక్కరోజే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా, వరణుడి దెబ్బకు మూడో రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 111/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దారుణంగా దెబ్బ తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ను వరుసగా పెవిలియన్కు పంపాడు. సౌథీకి మరో పేసర్ కైల్ జేమిసన్ (3/85) తోడవ్వడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోరీ బర్న్స్ (132; 297 బంతుల్లో 16×4, 1×6) అద్భుత శతకానికి, కెప్టెన్ జో రూట్ (42), ఓలీ రాబిన్సన్ (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. వీరితో పాటు ఇంగ్లండ్ జట్టులో ఓలీ పోప్(22), స్టువర్ట్ బ్రాడ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఎడ్జ్బాస్టన్ వేదికగా జూన్ 10 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు రెండో టెస్టులో తలపడనున్నాయి. ఈ సిరీస్ అనంతరం కివీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్తో తలపడనుంది. జూన్ 18న ఇరు జట్లు సౌతాంప్టన్ వేదికగా ప్రతిష్టాత్మకమైన పోరులో తలపడనున్నాయి. చదవండి: మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉండేది -
59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా గానీ
ఆక్లాండ్: న్యూజిలాండ్- వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ నేడు ప్రారంభమైంది. తొలి మ్యాచ్కు ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ మైదానం వేదికైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు, విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కాగా, వర్షం కారణంగా మ్యాచ్ను 16 ఓవర్లకు కుదించారు. ఇక ఆరంభంలో తడబడినా కెప్టెన్ కీరన్ పొలార్డ్ , ఫాబియన్ అలెన్ దూకుడుగా ఆడటంతో విండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 180 పరుగులు చేసింది. 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ ఈ జోడీ 84 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరు సాధించింది. ఇక మ్యాచ్ను కుదించిన కారణంగా డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.(చదవండి: జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోండి: అక్తర్ ఫైర్) టపాటపా వికెట్లు.. కానీ ఆండ్రూ ఫ్లెచర్, బ్రాండన్ కింగ్ వెస్టిండీస్ ఇన్నింగ్స్ను ఆరంభించారు. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ వైడ్తో ఖాతా తెరిచాడు. తొలి ఓవర్ ముగిసేసరికి పర్యాటక జట్టు 8 పరుగులు చేసింది. కివీస్ ఫాస్ట్ పేసర్లు ఫెర్గూసన్, సౌథీ విండీస్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఫెర్గూసన్ ఒకే ఓవర్లో ఫ్లెచర్, హెట్మెయిర్ను అవుట్ చేయగా.. సౌథీ బ్రాండన్ కింగ్ను పెవిలియన్కు చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన పావెల్ సైతం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. సౌథీ బౌలింగ్లో ఫెర్గూసన్కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ను ఫెర్గూసన్ అవుట్ చేయడంతో కేవలం 59 పరుగులకే విండీస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక అప్పటికే క్రీజులో ఉన్న పొలార్డ్, అలెన్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. కానీ మరోసారి బంతితో మ్యాజిక్ చేసిన ఫెర్గూసన్ అలెన్ను, ఆ వెంటనే పాల్ను పెవిలియన్కు చేర్చాడు. అలా పద్నాలుగు ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ జట్టు 146 పరుగులు చేసింది. ఇక 37 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచిన పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు(180) సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
అదే అతి పెద్ద టర్నింగ్ పాయింట్: సౌతీ
వెల్లింగ్టన్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం ఖాయంగా కనబడుతోంది. ఈ మ్యాచ్లో ఇప్పటికే కివీస్ పైచేయి సాధించడంతో ఆ జట్టు విజయంపై ధీమాగా ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులతో ఉంది. దాంతో న్యూజిలాండ్ నమోదు చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 39 పరుగులు వెనుకబడే ఉంది. రేపు నాల్గో రోజు ఆటలో ఓవర్నైట్ ఆటగాళ్లు అజింక్యా రహానే(25 బ్యాటింగ్), హనుమ విహారి(15 బ్యాటింగ్) సుదీర్ఘ సమయం క్రీజ్లో ఉంటేనే మ్యాచ్లో పోరాడే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంచితే, భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకు ఆలౌట్ కాగా, అందులో రిషభ్ పంత్ ఔటైన తీరు ఆశ్చర్యపరిచింది. (ఇక్కడ చదవండి: ‘రిషభ్.. నీ రోల్ ఏమిటో తెలుసుకో’) అనవసర పరుగు కోసం రహానే పిలుపు నివ్వడంతో రిషభ్ ముందుకు దూకాడు. సౌతీ వేసిన 59 ఓవర్ రెండో బంతిని రహానే ఆఫ్సైడ్ తరలించి పరుగు తీయాలని ఆరాటపడ్డాడు. అయితే బంతి ఫీల్డర్ సమీపంలోకి రావడంతో అవతలి ఎండోలో ఉన్న పంత్ పరుగుకు తటపటాయించాడు. కానీ అప్పటికే సగం క్రీజు వరకు రహానే వచ్చి ఆగాడు. దీంతో చేసేదేమి లేక పంత్ కూడా పరుగు కోసం ప్రయత్నం ప్రారంభించాడు. అయితే అప్పటికే బంతి అందుకున్న అజాజ్ పటేల్ నేరుగా వికెట్ల మీదకు త్రో విసిరాడు. అప్పటికీ పంత్ క్రీజు చేరుకోకపోవడంతో రనౌట్ అయ్యాడు. దీంతో పంత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో పంత్ రనౌట్ కాకుండా ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదని అంటున్నాడు సౌతీ. ‘పంత్ రనౌట్..భారత్కు తీవ్ర నష్టం చేసేందనే చెప్పాలి. పంత్ వంటి బలమైన బ్యాట్స్మెన్ రెండో కొత్త బంతితో మరో బ్యాట్స్మెన్ రహానేతో కలిసి చాలా పరుగులు చేసేవాడు. అప్పటికే రహానే దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పంత్కు పిచ్పై పట్టు దొరికిన క్రమంలో రనౌట్ అయ్యాడు. పంత్ చాలా ప్రమాదకరమైన బ్యాట్స్మన్. అతను క్రీజ్లో ఉంటే భారత్ గాడిలో పడేది. పంత్ రనౌట్ మ్యాచ్లో అతి పెద్ద టర్నింగ్ పాయింట్’ అని సౌతీ తెలిపాడు. -
ఇంకో 43 కొట్టారు అంతే..
వెల్లింగ్టన్: ఊహించిందే జరిగింది.. రహానే ఆదుకోలేదు.. పంత్ మెరవలేదు.. టెయిలెండర్లు చేతులెత్తేశారు. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 165 పరుగులకే ఆలౌటైంది. ఓవరనైట్ స్కోర్ 122/5తో రెండో రోజు ఇన్నింగ్ ఆరంభించిన కోహ్లి సేన మరో 43 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. పట్టుమని 15 ఓవర్లు కూడా టీమిండియాను బ్యాటింగ్ చేయనీయలేదు కివీస్ బౌలర్లు. ఆదుకుంటారని అనుకున్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (138 బంతుల్లో 46; 4 ఫోర్లు), రిషభ్ పంత్ (19)లు తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా పంత్ రనౌట్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అశ్విన్ గోల్డెన్ డకౌట్ కాగా, షమీ(20 బంతుల్లో 21; 3ఫోర్లు) ధాటిగా ఆడటంతో టీమిండియా కనీసం 150 పరుగుల స్కోరైనా దాటగలిగింది. రెండో రోజు ఆటలో సౌతీ మూడు వికెట్లు పడగొట్టగా..జేమీసన్ మరో వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కివీస్ తొలి ఇన్నింగ్స్లో 25 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ వేసిన 11 ఓవర్లో టామ్ లాథమ్ (11) కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బ్లండెల్ (30 బ్యాటింగ్), సారథి విలియమ్సన్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఏ పిచ్పై అయిత మన బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారో అదే పిచ్పై కివీస్ బ్యాట్స్మెన్ సాదాసీదాగా బ్యాటింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా మన పేస్ కివీస్ బ్యాట్స్మన్ను ఇబ్బందులు పెట్టలేకపోతోంది. చదవండి: బోల్తా పడ్డారు... రజతంతో సరిపెట్టుకున్న సాక్షి -
వారికి అవకాశం ఇచ్చాం... ఇక ఏం చేస్తాం: సౌతీ
మౌంట్మాంగనీ: టీమిండియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను చూసుకుంటే ఇక్కడ న్యూజిలాండ్ క్లీన్స్వీప్ కావడానికి వారి స్వీయతప్పిదాలే కారణమనే విషయాన్ని కాదనలేం. వరుసగా రెండు మ్యాచ్లను టై చేసుకుని సూపర్ ఓవర్ వరకూ తీసుకొచ్చి పరాజయాల్ని చూసిన కివీస్.. చివరి టీ20లో గెలుపు వాకిట చతకిలబడింది. సునాయాసంగా గెలుస్తుందనుకున్న తరుణంలో భారత్ బౌలింగ్కు దాసోహమైంది. ఈ సిరీస్లో టీమిండియా కడవరకూ పోరాడి సిరీస్ను వైట్వాష్గా ముగించగా, పోరాడటంలో కివీస్ విఫలం కావడంతోనే వారికి ఇంతటి పరాభవం ఎదురైంది. గతంలో వారి గడ్డపై భారత్కు ఎప్పుడూ టీ20 సిరీస్ను కోల్పోని కివీస్.. ఈసారి 5-0తో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దాదాపు ఇదే విషయాన్ని చెబుతున్నాడు న్యూజిలాండ్ తాత్కాలిక సారథి టిమ్ సౌతీ. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో సౌతీ మాట్లాడుతూ..‘ మరోసారి విజయానికి దగ్గరగా వచ్చి చతికిలబడ్డాం. దురదృష్టవశాత్తూ మరొకసారి అనవసర తప్పిదాలు చేశాం.(ఇక్కడ చదవండి; చివరి టీ20: ఇద్దరు కెప్టెన్లూ పక్కపక్కనే..) టీమిండియాకు మేము అవకాశాలు కల్పించాం. చేతుల్లోకి వచ్చిందనుకున్న తరుణంలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాం. ఏ చిన్న అవకాశాన్ని టీమిండియా వదల్లేదు. ఇక ఏం చేసేది లేకుండా పోయింది. వచ్చిన అవకాశాల్ని వారు రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నారు. మేము ఎక్కువ వ్యత్యాసంతో ఓడిపోలేదు. మేము చేసిన తప్పిదాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. వన్డే ఫార్మాట్కు అన్ని విధాలుగా సమాయత్తం అవుతాం. వన్డే ఫార్మాట్ అనేది..టీ20కి చాలా భిన్నం. ఈ ఫార్మాట్లో మేము పటిష్టంగానే ఉన్నాం’ అని సౌతీ తెలిపాడు. (ఇక్కడ చదవండి: టీమిండియా క్లీన్స్వీప్) -
టిమ్ సౌథీపై వార్నర్ ఆగ్రహం
-
టిమ్ సౌథీపై వార్నర్ ఆగ్రహం
పెర్త్: మైదానంలో క్రికెటర్లు కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించడం సర్వ సాధారణం. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూ రెచ్చగొట్టే యత్నాలు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధానంగా బ్యాట్స్మన్-బౌలర్ పోరు కూడా తరచు కనిపిస్తూ ఉంటుంది. వీరు ఒకర్ని ఒకరు స్లెడ్జింగ్ చేసుకోవడం ఒకటైతే, అసహనంతో బంతిని బ్యాట్స్మన్పైకి విసిరేసే సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇలా సహనం కోల్పోయిన తర్వాత సదరు బౌలర్.. క్రీజ్లో ఉన్న బ్యాట్స్మన్కు సారీ చెప్పడం కామన్. కాకపోతే ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ చేసిన పనిలో క్రీడా స్ఫూర్తి లోపించినట్లు కనిపించింది. క్రీజ్లో ఉన్న బ్యాట్స్మన్ను బంతితో కొట్టినా దానికి ఎటువంటి క్షమాపణ కోరకపోవడం ఫీల్డ్లో ఉన్న క్రికెటర్లను విస్మయానికి గురి చేసింది. అది అనవరసపు త్రో అనే విషయం అభిమానులకు కనిపిస్తున్నా సౌథీ చేసి యాక్షన్ ఇంకా విసుగు తెప్పించింది. గురువారం ఆరంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది కనిపించింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ను అందుకున్న సౌథీ... ఆసీస్ ఓపెనర్ జో బర్న్స్కు ఒక బంతిని వేశాడు. ఆ బంతిని బర్న్స్ డిఫెన్స్ ఆడగా అది కాస్తా బౌలర్ సౌథీ వద్దకు వెళ్లింది. ఆ బంతిని అందుకున్న వెంటనే సౌథీ నేరుగా బ్యాట్స్మన్ వైపు విసిరేశాడు. ఆ సమయంలో క్రీజ్ దాటి కాస్త బయట ఉన్న బర్న్స్ కు ఆ బంతి బలంగా తాకింది. అయితే దీనిపై ఎటువంటి రియాక్షన్ లేని సౌతీ నవ్వుకుండా వెనక్కి వచ్చేశాడు. ఇది నాన్ స్టైకింగ్ ఎండ్లో ఉన్న మరో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు కోపం తెప్పించింది. దాంతో సౌథీతో వాదనకు దిగక తప్పలేదు.(ఇక్కడ చదవండి: మొన్న స్మిత్.. నేడు వార్నర్) ఇదేనా క్రీడాస్ఫూర్తి.. ఇదేనా హుందాతనం, అది అనవసరమైన త్రో కదా అంటూ వార్నర్ సీరియస్ అయ్యాడు. దానికి సౌథీ నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే. అతను క్రీజ్ బయట ఉన్నాడు కాబట్టి బంతిని విసిరా అంటూ సమాధానమిచ్చాడు. ఆ బంతి బర్న్స్ చేతికి తగిలింది తెలుసా అంటూ వార్నర్ కౌంటర్ ఇచ్చాడు. ‘మంచిది’ అంటూ సౌథీ నుంచి వ్యంగ్యంగా సమాధానం వచ్చింది. ఇది వార్నర్కు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ విషయం చెప్పనక్కర్లేదు.. కాస్త హుందాగా ఉండటం నేర్చుకో అంటూ వార్నర్ రిప్లై ఇచ్చాడు. ఇలా వారి మధ్య మాటల యుద్ధం పెద్దది కావొస్తుండటంతో అంపైర్లు, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కలగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కివీస్ 166 పరుగులకు ఆలౌట్ కాగా, అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు చేసింది. -
దిగ్గజాల సరసన సౌతీ
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు పేసర్ టిమ్ సౌతీ.. 250 టెస్టు వికెట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. సోమవారం ముగిసిన రెండో టెస్టులో సౌతీ రెండు ఇన్నింగ్స్ల్లో ఆరు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్లో లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే వికెట్ను సాధించడం ద్వారా 250 వికెట్ల మార్కును చేరాడు. కాగా, టెస్టు ఫార్మాట్లో పదిహేను వందలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు, 45కి పైగా క్యాచ్లు పట్టిన ఎనిమిదో ఆటగాడిగా సౌతీ మరో ఘనత సాధించాడు. ఈ క్లబ్లో ఇయాన్ బోథమ్(ఇంగ్లండ్), కపిల్ దేవ్(భారత్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), అనిల్ కుంబ్లే( భారత్), షాన్ పొలాక్(దక్షిణాఫ్రికా), జాక్వస్ కల్లిస్(దక్షిణాఫ్రికా), డానియెల్ వెటోరి(న్యూజిలాండ్)లు మాత్రమే ఇప్పటివరకూ ఉండగా వారి సరసన సౌతీ చేరిపోయాడు. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకూ సౌతీ 1611 పరుగులు చేయగా, 251 వికెట్లను సాధించాడు. లంకేయులతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్లో 122 పరుగులకే చాపచుట్టేసి ఇన్నింగ్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది. -
బౌల్ట్.. నేను కూడా నీ వెనకాలే..!
కొలంబో: న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు ఫార్మాట్లో న్యూజిలాండ్ తరఫున 250 వికెట్ల మార్కును చేరిన నాల్గో బౌలర్గా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో సౌతీ ఈ మార్కును చేరాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేను ఔట్ చేయడం ద్వారా 250 వికెట్ల క్లబ్లో సౌతీ చేరిపోయాడు. ఈ టెస్టు మ్యాచ్కు ముందు 245 టెస్టు వికెట్లతో ఉన్న సౌతీ.. లంకేయులపై తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు సాధించాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో సైతం సౌతీ రెండు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. కాగా, తనతో కలిసి కొత్త బంతిని పంచుకునే మరో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 250 వికెట్ల మార్కును చేరిన మూడు రోజుల్లోనే అతని సరసన సౌతీ నిలవడం ఇక్కడ విశేషం, అయితే న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో రిచర్డ్ హ్యాడ్లీ(431) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో డానియెల్ వెటోరి(361) ఉన్నాడు. ఆపై వరుస స్థానాల్లో బౌల్ట్, సౌతీలే ఉండటం మరో విశేషం. లంకేయులతో రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన తొలి ఇన్నింగ్స్లో కివీస్ 431/6 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 122 పరుగులకే చాపచుట్టేసింది. లంక రెండో ఇన్నింగ్స్లో డిక్వెల్లా(51) మినహా ఎవరూ రాణించలేదు. బౌల్ట్, సౌతీ, అజార్ పటేల్, సోమర్విల్లేలు తలో రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దాంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది. తొలి టెస్టులో శ్రీలంక విజయం నమోదు చేసింది. -
కివీస్ సారథిగా టిమ్ సౌతీ
సారథిగా, బ్యాట్స్మన్గా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారాన్ని మోస్తున్న కేన్ విలియమ్సన్కు ఎట్టకేలకు కాస్త విశ్రాంతి లభించింది. ఐపీఎల్, ప్రపంచకప్ అంటూ వరుస మెగా టోర్నీలు ఆడిన విలియమ్సన్కు శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం లంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే అతడు స్వదేశానికి బయల్దేరుతాడు. విలియమ్సన్తో పాటు, ట్రెంట్ బౌల్ట్కు కూడా సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు. లంకతో సెప్టెంబర్ 1 నుంచి జరగబోయే మూడు టీ20ల సిరీస్కు టిమ్ సౌతీ కివీస్ సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20 సిరీస్ కోసం మంగళవారం 14 మంది సభ్యులతో కూడిన కివీస్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సెలక్టర్ లార్సన్ మాట్లాడుతూ.. ‘విలియమ్సన్కు విశ్రాంతిని ఇవ్వడానికి ఇదే సరైన సమయంగా భావించాం. ప్రపంచకప్ నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఆడటమే కాదు జట్టు బ్యాటింగ్ భారాన్ని పూర్తిగా మోస్తున్నాడు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కివీస్ పలు కీలక సిరీస్లు ఆడునుంది. దీంతో అతడికి విశ్రాంతినివ్వాలని భావించాం. ఇక వచ్చే ఏడాది అక్టోబర్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం జట్టును సన్నద్దం చేస్తున్నాం’అని పేర్కొన్నాడు. కాగా, లంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్లో కివీస్ 0-1తో వెనుకంజలో ఉంది. కివీస్ టీ20 జట్టు టిమ్ సౌతీ(కెప్టెన్), ఆస్టల్, టామ్ బ్రూస్, గ్రాండ్హోమ్, ఫెర్గుసన్, మార్టిన్ గప్టిల్, స్కాట్ కుగ్లెజన్, మిచెల్, కోలిన్ మున్రో, ర్యాన్సే, సాంట్నర్, టిమ్ సెఫెర్ట్, ఇష్ సోధి, రాస్ టేలర్