u turn
-
డీలిమిటేషన్ హీట్.. యూటర్న్ తీసుకున్న స్టాలిన్
చెన్నై: నియోజకవర్గ పునర్వవ్యస్థీకరణపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తగా పెళ్లైన జంటలను ఆలస్యంగా పిల్లలను కనాలని సూచించిన ఆయన.. ఇప్పుడు స్టాండ్పై యూటర్న్ తీసుకున్నారు. అందుకు నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం వేడెక్కడమే కారణం. సోమవారం నాగపట్నంలో డీఎంకే నేత కుటుంబ వివాహ వేడుకకు హాజరైన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో కొత్తగా పెళ్లైన వాళ్లను పిల్లల విషయంలో కొంత సమయం తీసుకోవాలని నేనే చెప్పాను. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మనం విజయవంతం అయ్యాం కూడా. కానీ, ఇప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై కేంద్రం కొత్త పాలసీలు తీసుకొస్తున్న వేళ అలా చెప్పను. కొత్తగా పెళ్లైన జంటలు వీలైనంత త్వరగా పిల్లలను కనండి. వాళ్లకు మంచి తమిళ పేర్లు పెట్టండి అని స్టాలిన్ అన్నారు. అయితే.. జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజకవర్గాలను పునర్విభజించబోతోందని స్టాలిన్ చెప్పడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందూ ఆయన ఇలాగే మాట్లాడారు. అలా జనాభా ప్రకారం చూసుకుంటే.. తమిళనాడుకు 8 స్థానాలు తగ్గే అవకాశం ఉందని.. ఇది మరికొన్ని రాష్ట్రాలపైనా ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన.దేశ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. కుటుంబ నియంత్రణ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విజయం సాధించాయని అనుకుంటున్నాయి. రేపు ఒకవేళ జనాభా ప్రతిపాదికన గనుక కేంద్రం నియోజకవర్గాలను విభజిస్తే.. ఆ రాష్ట్రాలకే తీవ్ర నష్టం అని అంటున్నారాయన.అయితే స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) కౌంటర్ ఇచ్చింది. తమిళనాడు సీఎం వ్యాఖ్యలు నిరాశవాదంతో కూడుకున్నవని, నిజాయితీలేని రాజకీయాలకు సంకేతమని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ చెబుతున్నారు. జనాభాకు తగ్గట్లుగా హక్కులు ఉంటాయా? అని గతంలో మీ మిత్రపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని స్టాలిన్ను ఉద్దేశించి కేశవన్ అన్నారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామాలని డీఎంకేపై మండిపడ్డారాయన. మరోవైపు.. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదివరకే ఓ ప్రకటన చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు యూ టర్న్
-
మరీ ఇంత అధ్వానమా.. చంద్రబాబు ట్రాక్ రికార్డులో ఇలాంటివెన్నో!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైంది? కొద్ది నెలల క్రితం వరకు ఒక పద్ధతి ప్రకారం అన్నీ వ్యవస్థలు నడిచాయి. పలు కొత్త వ్యవస్థలు ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటయ్యాయి. అవి ఎంత బలమైనవిగా రూపుదిద్దుకున్నాయంటే, విపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ వంటివారు వాటిని ఏదో రకంగా తామూ కొనసాగిస్తామని చెప్పక తప్పలేదు. అది వలంటీర్ల వ్యవస్థ కావచ్చు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కావచ్చు. ఇళ్ల వద్దకే పౌర సేవలు అందించడం కావచ్చు.. ఇలా ఒకటేమిటి? దేశంలోనే పరిపాలనలో ఒక కొత్త విప్లవాన్ని నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చింది.ఇదే టైమ్లో వైఎస్సార్సీపీ తెచ్చిన కొన్ని సంస్కరణల విషయంలో పచ్చి అబద్ధాలను కూడా విపక్షం, దానికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా విపరీతంగా ప్రచారం చేశాయి. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. చివరికి వైఎస్సార్సీపీ అభిమానులకే అనుమానం కలిగే స్థాయిలో టీడీపీ, జనసేన నేతలు ప్రచారం చేశారు. ముఖ్యంగా భూముల రీసర్వే, లాండ్ టైటిలింగ్ యాక్ట్పై వీరు చేసినంత దుష్ప్రచారం ఇంతా, అంతాకాదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే భూములన్నిటిని లాక్కుంటాడని, దానిపై కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదంటూ రైతులను భయపెట్టారు. నిజం తెలుసుకునేలోపు అబద్ధం లోకం అంతా తిరిగివచ్చిందన్న సామెతను అక్షర సత్యం చేసి చూపించారు.తాము అధికారంలోకి వస్తే రీసర్వే రద్దు చేస్తామని, లాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేయబోమని నమ్మబలికారు. దాని గురించి అప్పట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతగా ప్రజలకు వివరించి చెప్పబోయినా, పెద్దగా ఫలితం రాలేదు. ఆయన దీనిపై ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిజాయితీగా లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడేవారు. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమం అని, దానివల్ల భూ వివాదాలకు శాశ్వతంగా తెరపడుతుందని, భూములపై ఆసాములకు పూర్తి హక్కులు దఖలు పడతాయని ఆయన చెప్పే ప్రయత్నం చేసేవారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు చంద్రబాబు పెద్ద గొంతుతో అసత్యాలను ప్రచారం చేయడంతో వైఎస్సార్సీపీపై వ్యతిరేకత పెరిగింది. వైఎస్సార్సీపీ ఓటమికి అది కూడా ఒక ప్రధాన కారణం అయింది.ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం దక్కింది. అవకాశం వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన ఆయా వ్యవస్థలను కూటమి ప్రభుత్వం ధ్వంసం చేయడం ఆరంభించింది. జగన్కు మంచి పేరు తెచ్చిన వాటిని ఏదో రకంగా బదనాం చేయడానికి తన మీడియా బలంతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీ ప్రకారం రీసర్వే నిలుపుదల చేస్తున్నామని, లాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఇక్కడే మళ్లీ ట్విస్ట్ ఏర్పడింది. ఈలోగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూ సర్వే చేయించి, టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసే రాష్ట్రాలకు ఏభైఏళ్లపాటు వడ్డీ లేని రుణం అందచేస్తామని ప్రకటించింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం కామ్గా యుటర్న్ తీసుకుంది.ఇప్పటికే అనేక విషయాలలో తన నిర్ణయాలను రివర్స్ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో కూడా అదే బాటపట్టింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రీసర్వే కొనసాగుతుందని, ఐదు శాతం రైతులలో దీనిపై ఉన్న అసంతృప్తిని పరిష్కరించి ముందుకు వెళతామని ప్రకటించారు. అంటే దీని అర్థం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని యదాతథంగా కొనసాగిస్తామనే కదా? మరి ఎన్నికల ప్రచారంలో ఎందుకంత ఘోరంగా అబద్ధాలు ప్రచారం చేశారంటే ఏమి చెబుతాం. చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ తదితరులు పోటీపడి వదంతులు సృష్టించారు. దానిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గట్టిగా ఎదుర్కోలేకపోయిన ఫలితంగా ఓటమి చవిచూడవలసి వచ్చింది.ప్రజాస్వామ్యంలో అబద్ధాల ద్వారా అధికారంలోకి రావచ్చని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోసారి రుజువు చేసింది. 1955 మధ్యంతర ఎన్నికలలో కూడా ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్నంతగా ఊపు వచ్చింది. అప్పటికి ఇంకా ఉమ్మడి ఏపీ ఏర్పడలేదు. ఆంధ్ర, రాయలసీమ కలిపి ఆంధ్రరాష్ట్రంగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలు యునైటెడ్ కాంగ్రెస్గా ఏర్పడి ఎన్నికలలో పోటీచేశాయి.అయినా కమ్యూనిస్టులను ఓడించడం కష్టం అని అనుకునేవారు. ఆ క్రమంలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే మీడియాలోకానీ, ఆయా సభలలో కానీ కాంగ్రెస్ నేతలు ఒక వదంతిని ప్రచారం చేశారట. అదేమిటంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే భూస్వాముల భార్యల మెడలపై కాడి వేసి దున్నిస్తామని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్య అన్నారన్నది ఆ వదంతి. అప్పట్లో అలాంటివాటిని వెరిఫై చేసుకునే పరిస్థితే తక్కువ. దాంతో అది దావానలంగా వ్యాపించి అధికారంలోకి వస్తామనుకున్న కమ్యూనిస్టు పార్టీ కేవలం పదిహేను సీట్లకే పరిమితం అయిపోయింది. సరిగ్గా అదే మోస్తరుగా ఇప్పుడు భూముల టైటిలింగ్కు సంబంధించి టీడీపీ, జనసేన, వారి అనుబంధ మీడియా విపరీతమైన అసత్య ప్రచారం చేశాయి.సోషల్ మీడియా ఇంత విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చినా, దానిని వైఎస్సార్సీపీ ఎంతగా ఖండించినా, రైతులు నమ్మలేకపోయారు. సోషల్ మీడియాను ఎంతగా దుర్వినియోగం చేయవచ్చో ఈ ఉదంతం తెలియచెబుతుంది. భూముల రీసర్వేలో కొన్ని తేడాలు ఉండవచ్చని, అవన్నీ బయటపడితే తమకు నష్టం అని కొందరు భయపడ్డారు. దానిని టీడీపీ ఎన్ క్యాష్ చేసుకుని జనాన్ని ఒక అబద్ధంతో నమ్మించి అధికారంలోకి రాగలిగింది. కానీ అబద్ధం ఏదో ఒకనాడు బయటకు రాకతప్పదు కదా! ఇప్పుడు అదే రీసర్వేని కొనసాగిస్తున్నట్లు మంత్రి చెప్పారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికే అనేక విషయాలలో చంద్రబాబు ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలు తీసుకుంది. ఉదాహరణకు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే రైతులకు అవి ఉరితాళ్లు అవుతాయని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక, ఆ మీటర్లను యధాప్రకారం కొనసాగిస్తామని చెప్పి రైతులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. తల్లికి వందనం గురించి ఇప్పటికే చేతులెత్తేశారు. మూడు గ్యాస్ బండల స్కీమ్ అమలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ నాలుక మడతేశారు. వలంటీర్లకు జీతాలు పెంచడం సంగతి అటుంచి వారి ఉన్న ఉద్యోగాలకే దిక్కులేని పరిస్థితిని సృష్టించారు. దేశ చరిత్రలో రెండు నెలల వ్యవధిలో ఇంతగా అప్రతిష్టపాలైన ప్రభుత్వం మరొకటి ఉండకపోవచ్చు.అయినా ఆ బురద అంతటిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చిమ్మి తప్పించుకోవాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లు చూస్తున్నారు. ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి. చంద్రబాబు ట్రాక్ రికార్డు ఇందుకు భిన్నంగా ఎప్పుడూ లేదు. తనకు మద్దతు ఇచ్చే మీడియా అండతో తాను ఏమి చేసినా సాగిపోతుందన్నది ఆయన నమ్మకం. 1996 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఏమి చెప్పింది.. ఎన్నికలయ్యాక ఏమి చేసింది.. అప్పటి కాంగ్రెస్ ప్రముఖ నేత రోశయ్య చాలా అర్థవంతమైన రీతిలో వివరించిన వీడియో వైరల్ అవుతోంది. మూడుదశాబ్దాలుగా చంద్రబాబు ఇదే టెక్నిక్ అమలు చేసినా, ప్రజలు కొన్నిసార్లు ఓడించారు. మరికొన్నిసార్లు ఆయన చేసిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి గెలిపించారు.2024లో కూడా అదే జరిగింది. చిత్తశుద్ధితో తాను చెప్పింది చేయాలని అనుకోవడం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన తప్పా? అంటే ఏమి బదులు ఇస్తాం. ప్రజలను మోసం చేయబోనన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిను జనం ఓడించారు. చంద్రబాబు ఇలా మోసపూరిత హామీలతో జనాన్ని నమ్మించి, తదుపరి ఐదేళ్లపాటు వారి చెవిలో పూలు పెట్టడం అలవాటైన వ్యవహారమే అని తెలిసినా జనం టీడీపీ కూటమిని గెలిపించారు. ఇందుకు తప్పుపట్టవలసింది చంద్రబాబునా? లేక జనాన్నా?ఎవరి ఆలోచన ప్రకారం వారు నిర్ణయానికి రావొచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
యూటర్న్లో చంద్రబాబుది గిన్నిస్ రికార్డు: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి: యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్బుక్ రికార్డుకెక్కుతారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం(జులై 30) తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాలలో యూటర్న్ తిరిగారన్నారు. చంద్రబాబు అబద్దంలోనే పుట్టాడని, అబద్దంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రీసర్వేపై యూటర్న్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేను, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీవ్రంగా తప్పు పట్టిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి రాంబాబు గుర్తు చేశారు. భూములు, గనులు, సహజ వనరుల దోపిడి జరిగిందంటూ, ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలో భూముల రీసర్వేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. కొద్ది రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారని ఆయన ఆక్షేపించారు. స్వప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవడం చంద్రబాబు నైజం అని ఆయన అన్నారు.అబద్ధాలు. యూటర్న్లు‘రాష్ట్రంలో కొత ప్రభుత్వం ఏర్పడి 50 రోజులవుతోంది. ఈ కొద్ది రోజుల్లోనే చంద్రబాబు నిర్ణయాలన్నీ దారుణం. ప్రతి నిర్ణయంపై యూటర్న్. ‘ఆత్మస్తుతి పరనింద’.. ఇదే చంద్రబాబు పాలన అని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన హామీలు.. ముఖ్యంగా సూపర్సిక్స్ను అమలు చేయలేక.. శ్వేతపత్రాల పేరుతో కాలయాపన చేస్తూ.. గత తమ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆయన ఆక్షేపించారు.‘చంద్రబాబు ఎప్పుడూ అబద్ధంతోనే రాజ్యమేలుతాడనేది నగ్న సత్యం. అది గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించే అంశం’ అని అంబటి తేల్చి చెప్పారు.యథేచ్ఛగా మాట తప్పడంఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నా, రాష్ట్రానికి ఏ ఒక్కటీ సాధించలేకపోతున్న చంద్రబాబు, ఇటీవల కేంద్రం తమ బడ్జెట్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేల కోట్ల రుణం ఇప్పిస్తామని చెబితే.. దానిపైనా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు.మరోవైపు ఎన్నికల హామీల అమలు విషయానికి వస్తే.. అన్నింటా మాట తప్పారని మాజీ మంత్రి అన్నారు. నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి, ఒక నెల మాత్రమే ఇచ్చారని.. ఇప్పుడు అనర్హులు చాలా మంది ఉన్నారని, కొందరిని తీసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు.ఇంకా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం సహాయం, మహిళలకు ఫ్రీ బస్, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, ప్రతి ఇంట్లో నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి.. ఇవేవీ ఈ ఏడాది అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని వెల్లడించారు. తాము సూపర్సిక్స్ ప్రకటించామని, ఇప్పుడు వాటిని అమలు చేయాలంటే భయమేస్తోందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పడం.. పథకాల అమలులో ఆయనకు చిత్తశుద్ధి లేదని చూపుతోందని స్పష్టం చేశారు.సంపద సృష్టించడం తనకు తెలుసన్న చంద్రబాబు, అంత బేలగా మాట్లాడడం చూస్తుంటే.. చంద్రబాబు పచ్చిగా మాట మారుస్తున్న వైనం బయట పడుతోందని అన్నారు. చంద్రబాబును చూస్తుంటే, ప్రజలకు రోత కలుగుతుందన్న ఆయన, వారిలో ఇప్పటికే పశ్చాత్తాపం మొదలైందని.. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలంతా అనుకుంటున్నారని తెలిపారు.రీసర్వేపై దుష్ప్రచారంరాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేపై చంద్రబాబు దారుణంగా దుష్ప్రచారం చేశారన్న అంబటి రాంబాబు.. గత ఎన్నికల సమయంలో ఆ కార్యక్రమంపై చంద్రబాబు చేసిన ప్రసంగాల వీడియోలు ప్రదర్శించారు.ఆ తర్వాత, శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. రీసర్వే నిలిపేస్తామంటూ, ఈనెల 15న చంద్రబాబు చేసిన ప్రకటన వీడియో కూడా మాజీ మంత్రి ప్రెస్మీట్లో ప్రదర్శించారు.‘జగన్గారు చేపట్టిన భూముల సమగ్ర రీసర్వే లోపభూయిస్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పిన నువ్వు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు?. మీరు గొప్ప మేధావి అని మీ ఎల్లో మీడియాలో అదే పనిగా రాస్తారు. అలాంటప్పుడు వాస్తవాలు ఎందుకు గుర్తించలేదు?. అంటే మీకు కనీస అవగాహన లేదన్న విషమం అర్థమవుతోంది’.. అని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి చురకలంటించారు.ఇదీ సీనియర్ ఐఏఎస్ మాటదేశంలో నాడు బ్రిటిషర్ల పాలనలో 100 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, ఆ తర్వాత 100 ఏళ్లు.. అవే రికార్డులు కొనసాగాయని.. ఆ పరిస్థితుల్లో జగన్గారు, భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుడుతూ, ఒక మహాయజ్ఞం తలపెట్టారని మాజీ మంత్రి వెల్లడించారు.భూముల రీసర్వేను తప్పు బట్టి, మళ్లీ యూటర్న్ తీసుకుని, ఇప్పుడు కొనసాగిస్తామంటున్న చంద్రబాబు వైఖరిపై తనతో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మాట్లాడారన్న అంబటి రాంబాబు.. ఆయన ఏమన్నాడన్నది చెప్పారు. ‘ఇతర దేశాల్లో భూవివాదాలు 3 శాతం మాత్రమే ఉంటాయి. అదే మన దేశంలో 60–70 శాతం ఉంటాయి. అవన్నీ క్లియర్ చేయడం కోసం రీసర్వే చేసి విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని సదుద్దేశంతో జగన్ గారు నాడు ప్రారంభిస్తే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇష్టారీతిగా మాట్లాడారు. పైగా ఎవరైనా కోరుకుంటే మాత్రమే చేస్తామన్నారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చారు’.. అని ఆ ఐఏఎస్ అధికారి చెప్పారని అంబటి వివరించారు.ఒక మహాయజ్ఞం‘భూముల రీసర్వే కోసం ప్రభుత్వం 14,630 మంది సర్వేయర్లను నియమించింది. 17 వేల గ్రామాల్లో 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 13,371 గ్రామ కంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ, ప్రేవేట్ ఆస్తులు, 110 పట్టణ ప్రాంతాల్లోని 40 లక్షల ప్రభుత్వ, ప్రేవేట్ ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో సమగ్ర రీసర్వే ఈ కార్యక్రమ లక్ష్యం. మొత్తం మూడు దశల సర్వే కార్యక్రమంలో ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఇప్పుడు మాత్రం మళ్ళీ రీసర్వే మేం చేస్తామంటున్నారు’.. అని అంబటి రాంబాబు తెలిపారు.రీసర్వే కోసం అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల ఎర్రర్ కేవలం 5 సెం.మీ మాత్రమే ఉంటుందన్న ఆయన, ఇందుకు 75 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి రోవర్లతో కొలిచే ప్రక్రియను తీసుకువచ్చామని గుర్తు చేశారు. అదే చైన్ పద్దతిలో.. అంటే గొలుసుల పద్దతిలో కొలిస్తే ఒక మీటర్ తేడా ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం 5 సెం.మీ.కే అది పరిమితం అయిందని చెప్పారు. రీసర్వేలో భాగంగా హెలికాఫ్టర్లు, డ్రోన్లు కూడా వినియోగించామని వివరించారు.రీసర్వే. పురోగతిఈ సమగ్ర భూసర్వే రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో 6 వేల గ్రామాల్లో పూర్తయిందని, అందులో 4 వేల గ్రామాల్లో పాసు పుస్తకాలు ఇవ్వడం పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో ఆ పని చేయాల్సి ఉందని, ఇంకా మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వే కూడా పూర్తయిందని.. ఆ విధంగా అన్నీ సక్రమంగా పూర్తి చేసిన తమ ప్రభుత్వం.. వివాద రహితంగా డిజిటల్ రికార్డులను అందుబాటులోకి తీసుకొచ్చిందని అంబటి వెల్లడించారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్రైతులకు ఎంతో మేలు చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై గత ఎన్నికల ముందు తీవ్ర దుష్ప్రచారం చేసిన చంద్రబాబు, అది ఇంకా ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ, దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని అంబటి రాంబాబు తెలిపారు. అయితే ఆ చట్టం తెచ్చింది, కేంద్రమే అన్న ఆయన, నీతి ఆయోగ్ సూచనల మేరకే.. ఆ చట్టాన్ని రాష్ట్రాలకు సూచించారని వెల్లడించారు.భూసంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు 50 ఏళ్ళపాటు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఆర్ధిక మంత్రి ప్రతిపాదించారని గుర్తు చేసిన అంబటి.. భూమలు రీసర్వేతో పాటు, ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా అమలు చేయాల్సి ఉంది కాబట్టి.. ఇక్కడా యూటర్న్కు అవకాశం లేకపోలేదని తేల్చి చెప్పారు.ఇచ్చిన ఏ హామీని అమలు చేయని మోసగాడు చంద్రబాబు అయితే.. ప్రతి మాట నిలబెట్టుకున్నది జగన్గారు అని, చివరకు ఈ భూసర్వే విషయంలో ఆయన చెప్పిందే కరెక్ట్ అనేది అర్ధమవుతుందని మాజీ మంత్రి అంబటి అన్నారు.ఆయనే మా ఏకైక నాయకుడు మా పార్టీలో నెంబర్ టూ స్థానం కోసం అంతర్గత పోరు సాగుతోందని ఎల్లో మీడియా ఈనాడులో ఓ కట్టుకధ అల్లారన్న అంబటి రాంబాబు.. ‘మా పార్టీలో నెంబర్ టూ ఉండరు. మా ఏకైక నాయకుడు జగన్ గారే. ఆయన ఎవరికి ఏ పని అప్పజెపితే వారు ఆ పని చేస్తారని’స్పష్టం చేశారుతమ పార్టీపై ఎన్ని కుట్రలు చేసినా, అన్నింటినీ చేధించుకుని ముందుకు వచ్చిన శక్తి సామర్థ్యాలు జగన్ గారికి ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా పార్టీలో అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అంబటి.. ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు చర్యలకు దిగినా.. తమ పార్టీలో ఎవ్వరూ భయపడబోరని తేల్చి చెప్పారు. -
అప్పుడు తప్పన్నాడు.. ఇప్పుడు అదే చేస్తున్నాడు
-
బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ నేత యూ టర్న్!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్సభ బీజేపీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అహం పెరిగిపోవడం వల్లే సరైన ఫలితం రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పేరు ప్రస్తావించకుండా ప్రతిపక్ష కూటిమిపై విమర్శలు గుప్పించారు. ఇక.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపటంతో క్లారిటీ ఇచ్చారు.‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాముడిని వ్యతిరేకించిన వాళ్లు అధికారంలో లేరు. రాముడిని గౌరవించాలనే సంకల్పం ఉన్నవాళ్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. అదే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది’’ అని ఇంద్రేష్ కుమార్ స్పష్టం చేశారు.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారు.మరోవైపు.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు.మరోవైపు.. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా .. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని అన్నారు. ఇటీవల ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
‘పద్మశ్రీ’పై హేమచంద్ ఎందుకు మనసు మార్చుకున్నారు?
ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ వైద్యుడు హేమచంద్ మాంఝీ ‘పద్మశ్రీ’ని తిరిగి ఇవ్వడంపై మనసు మార్చుకున్నారు. మొదట్లో పద్మశ్రీని వాపసు చేస్తానని ప్రకటించిన ఆయన ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.మావోయిస్టుల బెదిరింపుల నేపధ్యంలో హేమచంద్ మాంఝీ మే 27న తన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పరిపాలన అధికారులు వెంటనే స్పందించారు. కంకేర్ ఎస్పీ ఆయనతో మాట్లాడి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలోనే ప్రభుత్వం హేమచంద్ మాంఝీకి వై కేటగిరీ భద్రతను కూడా కల్పించింది. ఈ విధమైన భద్రత లభించిన నేపధ్యంలో హేమ్చంద్ మాంఝీ తాను పద్మశ్రీని తిరిగి ఇవ్వబోనని ప్రకటించారు.హేమ్చంద్ మాంఝీ నారాయణపూర్ జిల్లాలోని ఛోటాదొంగర్లో నివసిస్తున్నారు. మే 26 అర్థరాత్రి వేళ మావోయిస్టులు ఆయనను చంపేస్తామని బెదిరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మావోయిస్టులు హేమచంద్ మాంఝీని హతమార్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హేమచంద్ కనిపించకపోవడంతో మావోయిస్టులు అతని మేనల్లుడిని హతమార్చారు. హేమచంద్ మాంఝీని మావోయిస్టులు అవినీతిపరుడని ఆరోపిస్తుంటారు. ఆయనను ఈ ప్రాంతంనుంచి తరిమి కొట్టాలని పలుమార్లు ప్రజలకు పిలుపునిచ్చారు.హేమచంద్ మాంఝీ అందిస్తున్న వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం గత నెలలో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంలో మాంఝీ మాట్లాడుతూ ‘15 ఏళ్లుగా తాను నారాయణ్పూర్లో ప్రజలకు చికిత్స అందిస్తున్నానని, నాటి రోజల్లో ఛత్తీస్గఢ్లో ఆసుపత్రి అంటూ ఏమీ లేదన్నారు. అప్పటి నుంచి తాను వన మూలికలు, ఔషధ మొక్కల సాయంతో ప్రజలకు చికిత్స అందిస్తున్ననని’ తెలిపారు. -
దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
జయప్రకాష్ నారాయణ.. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఐఏఎస్ అధికారిగా, లోక్సత్తా అనే పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలవకపోయినా.. మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగానే కాదు.. ఏపీ జనాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్సత్తా మద్ధతు. అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయండి. నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు అయినా రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం’’ : జయప్రకాష్ నారాయణ .. అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు కావొచ్చు. కానీ.. దానికి ఎంచుకున్న సమయం, సందర్భం కూడా చూడాలి కదా. ఇప్పుడు జేపీకి అలియాస్ నాగభైరవ జయప్రకాష్ చౌదరికి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. సీఎం జగన్ వచ్చిన తర్వాత పాఠశాలలు బాగుపడ్డాయి, పిల్లల చదువులు బాగున్నాయి, ఆస్పత్రులు బాగున్నాయి, వైద్యం బాగా అందుతోంది, అభివృద్ది పెరిగింది అంటూ ఇన్నాళ్లు మీరు యూట్యూబ్లో చేసిన వీడియోలకు మీ మాటలకు పొంతన ఎందుకు కుదరడం లేదు? ►పేదలు బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా? ►పేదపిల్లలు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ప్రజలందరికి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఇబ్బడిముబ్బడిగా మెడికల్ కాలేజీలు పెట్టటం .. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టటం జెపిగారికి నచ్చటం లేదా? ►పేద ప్రజలకి తలదాచుకునేదుందుకు 30 లక్షల మందికి ఇంటి స్థలాలిచ్చి ఇల్లు కట్టించటం జేపీ గారికి నచ్చటం లేదా? ►గడచిన 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా 950 కిలోమిటర్లు తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయటం .. అందులో భాగంగా ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ కానీ లేదా ఫిషింగ్ హార్బర్ కానీ పెట్టటం జేపీ గారికి నచ్చటం లేదా? ►దక్షిణ భారతదేశం మొత్తానికి మనమే విధ్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరాలనే లక్ష్యంతో అనేకరకమైన విద్యుతు ప్లాంటులు నిర్మించటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఎక్కడా లంచాలకి తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే ఇవ్వటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఇటుపక్క కాకినాడ సెజ్ అటుపక్క శ్రీసిటీలలో అనేక కొత్త కంపెనీలు రావటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఉద్దానం సమస్యని పరిష్కారించటం నచ్చలేదు .. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టటం జేపీ గారికి నచ్చటం లేదా? ►రాష్ట్ర తలసరి ఆదాయం పెరగటం జేపీ గారికి నచ్చటం లేదా? ►16 లక్షల మంది కొత్తగా టాక్స్ పేయర్లు పెరగటం కూడా జేపీ గారికి నచ్చటం లేదా? ►విద్యా వైద్యంలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండటం జేపీ గారికి నచ్చటం లేదా? ►కేంద్ర మరియు ఇతర రాష్ట్రాలతో పోల్చినా లేదా అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చినా ప్రతీ రంగంలో మన రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించటం జేపీ గారికి నచ్చటం లేదా? ఇలా ఒకటేమిటి అనేకం .. అసలు రాష్ట్రం బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా?.. అంతే కాదండోయ్ .. లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు రామోజీ ముఠా మీద కేసులు పెట్టటం జేపీ గారికి అసలే నచ్చటం లేదా? విద్యారంగం వైద్యరంగం విద్యుత్ రంగం లాంటి వన్నీ ఒక్క కులం చేతిలోనే ఉండాలా? .. ముఠాలుగా ఏర్పడి ప్రజలని దోచుకోవాలా? పేద ప్రజలు మీ ఇళ్ల పక్కన ఉండటానికి వీల్లేదా? దోమలమీద యుద్ధం .. పుష్కరాలకు లైట్లు రంగుల పేరుతో రాష్టాన్ని దోచుకోవాలి ... దోచుకున్న డబ్బులతో ఓట్లు కొనాలి .. కేసుల్లేకుండా వ్యవస్థల్ని మానేజ్ చేయాలి .. అప్పుడే మీకు నచ్చుతుందా? అలా చేసే వాళ్ళకే మీరు మద్ధతిస్తారా?.. -
ఢిల్లీలో దాక్కున్న రింగ్ మాస్టర్ చినబాబు.. రాను రాను నేను రాను
-
Delhi Woman's Death Case: వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అమానుష ఘటనపై అధికారులు సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. విచారణలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్న విషయాలను విని ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అలానే సీసీఫుటేజ్ దృశ్యాలు సైతం నివ్వెరపోయేలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ ఘటననే చూసిన ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా మాట్లాడుతూ...ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగినట్లు తెలిపాడు. అతను తన మిఠాయి షాపు వద్ద ఉండగా.. సుమారు వంద మీటర్ల దూరంలో పెద్ద శబ్దం వచ్చింది. కారు టైరు పేలిందనుకున్నా.. కానీ కారు కదిలినప్పుడూ ఒక మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. తాను పెద్దగా అరుస్తూ వాహనాన్ని ఆపేందుకు మోటారు బైక్తో వెంబడించి యత్నించాను కానీ వారు వాహనాన్ని ఆపలేదు. సుమారు గంటన్నరపాటు ఆ యువతి మృతదేహాన్ని 20 కి.మీ దూరం ఈడ్చుకెళ్లారని తెలిపాడు. వారు యూటర్న్ తీసుకుని పదే పదే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఇది కేవలం ప్రమాదం కాదని దహియా నొక్కి చెప్పాడు. అంతేగాదు సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం వేరయ్యిందని, ఆ తర్వాత నిందితులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పాడు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ...కారు ఢీ కొట్టడంతో యువతి స్కూటీ నుంచి పడిపోయిందని, ఆ తర్వాత చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు. వాహనం రిజిస్టర్ నెంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే వాహనం కిటికీలు మూసి ఉన్నాయి, పైగా సంగీతం బిగ్గరగా వస్తున్నందున్న తమకు ఏం జరిగిందో తెలియలేదని నిందితులు చెబుతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పరారయ్యినట్లు పోలీసులకు తెలిపారు. ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. 🔴#BREAKING | New CCTV Confirms Witness Account, Car Makes U-Turn, Drags Delhi Woman https://t.co/wPFfrz6eKV pic.twitter.com/DvUDIbbwfM — Breaking News (@feeds24x7) January 2, 2023 (చదవండి: ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఫైర్: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది) -
బిగ్ క్వశ్చన్: యూటర్న్ కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
-
అంతా తూచ్! యాపిల్ ఆఫీస్ భలే ఉంది: మస్క్ యూటర్న్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్తో యుద్ధానికి సై అంటే సై అన్న బిలియనీర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. ముఖ్యంగా యాపిల్ ప్రధాన కార్యాలయంలో యాపిల్ సీఈవో టీమ్ కుక్తో భేటీ తర్వాత మస్క్ మాట మార్చడం హాట్టాపిక్గా నిలిచింది. (షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!) టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ప్రపంచ కుబేరుడు మస్క్ పలు ఆరోపణలు చేశారు. తన ట్విటర్ను యాప్ స్టోర్ నుంచి తొలగిస్తే.. తాను కూడా ప్రత్యామ్నాయంగా స్మార్ట్ఫోన్ల తయారీలోకి దిగుతానంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. అయితే అనూహ్యంగా తాను అపార్థం చేసున్నామనీ, ట్విటర్ ను తొలగించాలని ఎప్పుడూ అనుకోలేదంటూ ట్వీట్ చేశారు. అసలేం జరుగుతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్నునిలదీసిన మస్క్ తాజాగా తామిద్దరి మధ్యా మంచి చర్చ జరిగిందనీ, ఇతర విషయాలతోపాటు, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ట్విటర్ను తొలగించాలని తామెపుడూ భావించలేదని టిమ్ స్పష్టంగా చెప్పారంటూ పేర్కొన్నారు. అంతేకాదు కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో "యాపిల్ అందమైన హెచ్క్యూ" వీడియో క్లిప్ను కూడా షేర్ చేయడం విశేషం. Thanks @tim_cook for taking me around Apple’s beautiful HQ pic.twitter.com/xjo4g306gR — Elon Musk (@elonmusk) November 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ ట్రయల్ రన్.. అయోమయంలో వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసుల ప్రయోగాత్మక ఆంక్షల నడుమ వాహనాలు ఆగుతూ... సా..గుతూ కనిపించాయి. సీవీఆర్ జంక్షన్, రోడ్ నెం. 45 జంక్షన్లో రైట్ టర్న్ను తొలగించడంతో తొలి రోజు ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో చుట్టూ తిరుగుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 బాలకృష్ణ నివాసం చౌరస్తాతో పాటు జర్నలిస్టు కాలనీ, సీవీఆర్, బీవీబీపీ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్పోస్టులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని మార్గాల్లో ట్రయల్ రన్ కింద మళ్లింపులు చేపట్టి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇద్దరు ట్రాఫిక్ ఏసీపీలు, ఇద్దరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది ఎస్ఐలు కలిసి మొత్తం 32 మంది ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ మళ్లింపును పర్యవేక్షించారు. ► మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు ప్రారంభించారు. చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక గజిబజిగా ముందుకు సాగుతుండగా ట్రాఫిక్ పోలీసులు వారికి దారి చూపారు. ► అయితే పలుచోట్ల ట్రాఫిక్ చాంతాండాంత దూరానికి నిలిచిపోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు. మొదటి రోజు వాహనాలు వివిధ మార్గాల నుంచి మళ్లించడంతో చుట్టూ తిరుగుతూ వాహనదారులు గమ్యస్థానాలకు వెళ్లారు. ► నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ రంగనాథ్, ఏసీపీ జ్ఞానేందర్రెడ్డి పలుచోట్ల యూటర్న్లు, రైట్ టర్న్లను పరిశీలించారు. రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 ప్రధాన రోడ్డులో పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ వెళ్లే టర్నింగ్ వద్ద పిల్లర్ నెంబర్ సి–1659 నుంచి హెచ్సీయూ డిపోకు చెందిన సిటీ బస్సు శుక్రవారం ఉదయం రాంగ్రూట్లో వస్తూ కనిపించింది. సాధారణంగా ఆటో వాలాలు, ద్విచక్ర వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లడం కనిపిస్తుంది. ఏకంగా సిటీ బస్సు రాంగ్రూట్లో వస్తుండటంతో స్థానికులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఓ స్కూటరిస్ట్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సర్వీసు రోడ్డులో నిండుగా... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45ల కేబుల్ బ్రిడ్జి నిర్మించి దానికి అనుసంధానంగా ఫ్లై ఓవర్ నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు సర్వీసు రోడ్డులో వాహనాలు ఏ రోజు కూడా నిండుగా కనిపించలేదు. కానీ తొలిసారి శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్లోని ఆయా జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించి మళ్లింపులు చేపట్టడంతో సర్వీసు రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మరో వైపు రోడ్ నెం.45లోని ఫ్లై ఓవర్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వాహనాలు తక్కువగా వెళ్లడం గమనార్హం. (క్లిక్ చేయండి: 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు) జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి బాలయ్య ఇంటి దగ్గర రైట్ టర్న్ తీసేసిన ట్రాఫిక్ పోలీసులు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద కూడా యూ టర్న్ లేదు. సిగ్నల్ ఫ్రీ అంటే మమ్మల్ని సిటీ అంతా తిప్పడం కాదు సర్ అట్టర్ ఫ్లాప్ ప్రయోగం. Please Look into this. @HYDTP. @HiHyderabad #Hyderabad @KTRTRS — Vidya Sagar Gunti (@GVidya_Sagar) November 25, 2022 నగర వాసులు ఏమంటున్నారు.. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ట్రయన్ రన్పై నగర వాసులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించమంటే తమను ఊరంతా తిప్పుతున్నారని అంటున్నారు. So! The city traffic police woke up one day and said - everything is fine, let’s mess up? Was that the thought behind all these diversions/ no U-turns in Jubilee Hills? Such chaos! #Hyderabad #HyderabadTraffic #WhatOnly🤯 pic.twitter.com/WpDIaB0u7Y — Revathi (@revathitweets) November 26, 2022 -
ట్రంప్ చేసిన పనికి బైడెన్ క్షమాపణ
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ క్షమాపణలు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అంశంపై మాట్లాడుతూ ఈ మేరకు ప్రపంచ దేశాలను క్షమాపణలు కోరారు బైడెన్. పారిస్ ఒప్పందంలో వెంటనే చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధాన పర్యావరణ సదస్సులను నిర్వహించామని తెలిపారు. భూతాపాన్ని తగ్గించే పోరాటంలో నాయకత్వాన్ని తిరిగి తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు బైడెన్. ఐక్యరాజ్య సమితి కాప్27 సదస్సులో ప్రసంగించారు. ‘స్నేహితులారా.. ఈ ఒక్క సమస్యపై దశాబ్దాలుగా చర్చ కొనసాగుతోంది. పురోగతిలో అడ్డంకులను అధిగమించడానికి అమెరికా చేయవలసిన పరివర్తనాత్మక మార్పులు చేయాలని నిర్ణయించుకునే నేను అధ్యక్ష పదవికిలోకి వచ్చాను. అమెరికా ఒక విశ్వసనీయమైన, గ్లోబల్ లీడర్గా వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంది. దానిని సాధించటానికి మా సాయశక్తులా కృషి చేస్తాం.’ అని తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రపంచ దేశాలు సైతం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు బైడెన్. వారిపై ఒత్తిడి తేవటం గ్లోబల్ లీడర్గా తమ బాధ్యత అని వెల్లడించారు. పర్యావరణ సంక్షోభంతో అది మానవ, ఆర్థిక, వాతవారణ, జాతీయ భద్రతకు ముప్పు తెస్తోందని సూచించారు. ఈ భూమండలంపై ఉన్న ప్రతి జీవికి ముప్పు వాటిల్లుతోందన్నారు. ఇదీ చదవండి: పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత -
పీఎంగా రిషి సునాక్ బిగ్ ‘యూ-టర్న్’.. ఆ నిర్ణయంలో మార్పు
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన విషయం తెలిసిందే. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవంటూ తన మార్క్ను చూపిస్తున్నారు. అయితే, ప్రధాని పీఠంపై కూర్చున్న మొట్టమొదటి సారి బిగ్ యూటర్న్ తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దేశీయ బాధ్యతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి క్లైమేట్ సమ్మిట్కు వెళ్లకూడదని ముందుగా నిర్ణయించుకున్న రిషి సునాక్.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తాను పర్యావరణ సదస్సుకు హాజరవుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకుండా బంగారు భవిష్యత్తు లేదు. పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెట్టకుంటే విద్యుత్తు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లే. అందుకే.. వచ్చే వారం జరగనున్న కాప్27 క్లేమేట్ సదస్సుకు హాజరవబోతున్నా. సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించే గ్లాస్గో వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నా.’ అని ట్వీట్ చేశారు రిషి సునాక్. ఈజిప్ట్లోని షర్మ్ ఎల్-షేక్ రెడ్ సీ రిసార్ట్లో జరిగే సమావేశానికి హాజరు కాకూడదని సునాక్ తీసుకున్న నిర్ణయం పర్యావరణ ప్రచారకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిషి సునాక్ ట్వీట్ చేయకముందే యూ-టర్న్పై హింట్ ఇచ్చారు ఆయన అధికార ప్రతినిధి. నిర్ణయంపై పునఃసమీక్షిస్తున్నట్లు చెప్పారు. దానికన్నా ముందు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది కాప్ 26 సమావేశానికి ఆయన ప్రధాని హోదాలో హాజరయ్యారు. There is no long-term prosperity without action on climate change. There is no energy security without investing in renewables. That is why I will attend @COP27P next week: to deliver on Glasgow's legacy of building a secure and sustainable future. — Rishi Sunak (@RishiSunak) November 2, 2022 ఇదీ చదవండి: ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్పై విమర్శలు! -
Cyberabad: జంక్షన్లు, యూ టర్న్లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే వక్రమార్గంలో ప్రయాణాలు, ప్రమాదాలూ తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్లో కొత్తగా యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటు అవసరాన్ని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. స్థానికుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, ఆ మేరకు కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాంగ్ రూట్లో వెళుతూ.. ‘నిజమైన వినియోగదారులే.. నిజమైన న్యాయనిర్ణేతలు’ ట్రాఫిక్ నిర్ణయాలలో ఇది అక్షరాలా నిజం. వాహనదారులు కోరిన విధంగా యూటర్న్ ఇస్తే వక్రమార్గంలో ప్రయాణించరు. అలా చేయకపోవటంతో రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుకే యూటర్న్లు, జంక్షన్లు, ట్రాఫిక్ మళ్లింపుల ఏర్పాట్లపై స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించాలని నిర్ణయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆయా ఏర్పాట్లతో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం ఉంటుందా? వాహన ప్రమాదాలు తగ్గుతాయా? అసలు అది న్యాయబద్దమైన కోరికేనా వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కారు పడిందని ఫ్లైఓవరు ఎక్కట్లేదు.. ఖాజాగూడ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైకి ఎక్కకుండా కింది నుంచి వెళ్లి జంక్షన్ దగ్గర కుడి వైపునకు మళ్లుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కారణమేంటని అధ్యయనం చేయగా.. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫ్లైఓవర్ పైనుంచి కారు కిందికి పడిపోవటంతో వాహనదారులు ఇప్పటికీ భయపడుతున్నారని, అలాగే ఆ ఫ్లైఓవర్ డిజైనింగ్లోనే లోపాలున్నాయని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఏ రహదారైనా 90 డిగ్రీల కోణంలో తిరిగేటప్పుడు ఎటు వైపునకు మళ్లుతుందో ఆ వైపు రోడ్డు కొంత వంగి ఉండాలి. లేకపోతే వేగంతో వచ్చే వాహనాలు రోడ్డుకు అనుగుణంగా మళ్లవు. దీంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం బయోడైవర్సిటీ ఫైఓవర్ రోడ్డు డిజైనింగ్లో మరమ్మతులు చేయలేం కాబట్టే వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. యూటర్న్, జంక్షన్లు ఇక్కడే.. ఇప్పటివరకు యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటుపై స్థానికుల నుంచి 25కి పైగా అభ్యర్థనలు వచ్చాయని.. సాధ్యాసాధ్యాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 3 ప్రాంతాలను ఎంపిక చేశామని, మరో 11 ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ► ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వెళ్లే మార్గంలో కోకాపేట దగ్గర వరుణ్ మోటార్స్ వైపున తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)తో కలిసి జంక్షన్ను అభివృద్ధి చేశారు. ► ఏఐజీ ఆసుపత్రి అభ్యర్థన మేరకు గచ్చిబౌలిలోని డెలాయిట్ ఆఫీసు దగ్గర యూటర్న్ను ఏర్పాటు చేశారు. ► గచ్చిబౌలి జంక్షన్ ఇందిరానగర్ దగ్గర యూటర్న్ను ఇచ్చారు. ► జీఎంసీ బాలయోగి స్టేడియం ముందు ఉన్న యూటర్న్ తక్కువ విస్తీర్ణం ఉందని వచ్చిన అభ్యర్థన మేరకు వెడల్పాటి యూటర్న్ను ఏర్పాటు చేశారు. జంక్షన్లు, ఫుట్పాత్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష గ్రేటర్ నగరంలో రోడ్ల నిర్వహణతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న ఫుట్పాత్లు, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అమీర్పేట హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్పార్డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. సీఆర్ఎంపీ ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించిన అన్ని అంశాలపైనా మరింత దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ– రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. (క్లిక్: విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్’ సిటీ పరిస్థితి ఏంటి?) -
జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’
సాక్షి హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు సమగ్ర అధ్యయనాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, సమయాలు గుర్తిస్తున్నారు. తాజాగా చేపట్టిన అధ్యయనంలో గడిచిన మూడేళ్ల కాలంలో ట్రాఫిక్ జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 2019– 21 మధ్య మొత్తం మృతుల్లో కనిష్టంగా 18.91 శాతం, గరిష్టంగా 21.14 శాతం మంది ఈ ప్రాంతాల్లోనే మృత్యువాతపడ్డారని తేలింది. మొత్తమ్మీద 147 మంది ఈ ప్రాంతాల్లో జరిగిన యాక్సిడెంట్స్లోనే కన్నుమూశారు. ఈ అధ్యయనాల ఆధారంగా నిరోధానికి చర్యలు తీసుకుంటామని సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఉల్లంఘనలే ప్రధాన కారణం.. సిటీలోని పలు ప్రాంతాల్లో అనునిత్యం కనిపించే సీన్లు చూస్తే ఇతర వాహనాల కంటే ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉల్లంఘనలకు పాల్పడుతుంటారని స్పష్టమవుతోంది. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్తో పాటు నిర్లక్ష్యంగా టర్న్ తీసుకోవడం వంటివి చేస్తుంటారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల మాదిరిగానే జంక్షన్లు, యూ టర్న్స్ వద్దా ఇదే పంథా అనుసరిస్తున్నారు. అదే వీరితో పాటు ఎదుటి వారి ప్రాణాల మీదకు తెస్తోందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో నమోదైన ప్రమాదాలను పరిశీలిస్తే జంక్షన్లు, యూ టర్న్స్ మృత్యువాతపడిన వాళ్లల్లో ద్విచక్ర వాహనచోదకులది మొదటి స్థానం కాగా.. పాదచారులది రెండో స్థానం. అధ్యయనంలో గుర్తించిన అంశాలివి... 2021లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా.. జంక్షన్ల వద్ద 48 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 279 మంది. ఇందులో రాత్రి వేళ 28 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 31 చోటు చేసుకున్నాయి. మృతుల్లో పాదచారులు 17 మంది, ద్విచక్ర వాహనచోదకులు 35 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. లంగర్హౌస్లోని ఆర్మీ గేట్ యూ టర్న్, బోయిన్పల్లి చౌరస్తా, డెయిరీ ఫామ్ టీ జంక్షన్, ఎంజే మార్కెట్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2020లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 8 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 31 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 254. రాత్రి వేళ 20 ప్రమా దాలు జరగ్గా, పగటి వేళ 19 చోటు చేసుకున్నా యి. మృతుల్లో పాదచారులు 12 మంది, ద్విచక్ర వాహనచోదకులు 26 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అమీర్పేట చౌరస్తా, నల్లగొండచౌ రస్తా, బాలమ్రాయి ఎక్స్ రోడ్స్, తాజ్మహల్ ఎక్స్రోడ్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2019లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 38 మంది మరణించారు. మరణించిన వారి సంఖ్య మొత్తం 259 మంది. రాత్రి వేళ 22 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 27 చోటు చేసుకున్నాయి. మృతుల్లో పాదచారులు 25 మంది, ద్విచక్ర వాహనచోదకులు 19 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. చిలకలగూడ చౌరస్తా, ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. పటిష్ట ప్రణాళిక రూపొందిస్తున్నాం హైదరాబాద్లోని జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. తాజా అధ్యయనం గుర్తించిన అంశాల ఆధారంగా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఇతర విభాగాలతో కలిసి ఆయా చోట్ల క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహిస్తాం. వారి సహకారంతో అవసరమైన మార్పుచేర్పులు చేయడంతో పాటు రోడ్ ఇంజినీరింగ్ వంటి చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది నగరంలో రోడ్డు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
ఉగ్గబట్టుకుని చూడాల్సిన వీడియో! ఏది నిజం.. ఏది వైరల్!
Driver Takes Impossible u-turn On Narrow Hillside Road: ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. కొన్ని వీడియోల్లో అయితే వీడి పని అయిపోయింది అనుకునేంతగా వీడియోలు చూశాం. కొంత మంది బస్సు కింద పడిన ఏ మాత్రం గాయాలుపాలు కాకుండా బయటపడిన వీడియోలు చూశాం. అయితే కొండ అంచున ఒక డ్రైవర్ యూటర్నింగ్ తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లోనూ, ట్విట్టర్లోనూ తెగ వైరల్ అవుతుంది. కానీ ఈ వీడియో చూడాలంటే మాత్రం చాలా టెన్షన్గా, ఏం అవుతుందో అని ఉగ్గబట్టుకుని భయం భయంగా చూడాలి. అసలు విషయంలోకెళ్తే...ఒక కొండల వద్ద ఘాటీ రోడ్డులో వెళ్లేందుకు ఒక మార్గం వచ్చేటప్పడూ ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే కొండల వద్ద ఎదురుగా ఇంకో వాహనం ఏదీ రాదు. అలాగే ఇరుకైన కొండల అంచున రోడ్డుపై యూటర్న్ తీసుకోవడం అసలు కుదరదు. కానీ ఈ వీడియోలో డ్రైవర్ తన బ్లూ కార్తో అంత ఇరుకైన పర్వత రోడ్డు వద్ద చాలా నైపుణ్యం ప్రదర్శించి యూ టర్న్ తీసుకున్నాడు. పైగా అతనికి ఈ యూటర్న్ తీసుకోవడానికి సుమారు 80 నిమిషాలు పట్టింది. దీంతో నెటిజన్లు ఆ డ్రైవర్ నైపుణ్యాన్ని తెగ ప్రశసింస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియోని డ్రైవింగ్స్కిల్ అనే యూట్యూబ్ ఛానెల్ గత ఏడాది డిసెంబర్లో మొదటిసారి షేర్ చేసింది. అంతేకాదు కారు నడిపే వ్యక్తి చాలా ఇరుకైన రహదారిపై యూ టర్న్లు ఎలా చేయాలో ప్రదర్శించే నిపుణుడు అని పేర్కొంది. అయితే మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాక నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU — Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022 ఇక ఇంటర్నెట్లో మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇది పై వీడియోకి ఒరిజినల్ అనే ప్రచారం నడుస్తోంది. సో.. ఈ రెండిటిలో ఏది నిజం? ఏది వైరల్? అనేది నిర్ధారించడం కొంచెం కష్టమే అవుతోంది. (చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో) -
Viral Video: ఏంటా దూకుడు!... బ్రేక్ వేసుండకపోతే పరిస్థితి....
అతి వేగం అనర్థం అని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్న యువతలో మాత్రం మార్పు రావడం లేదు. స్పీడ్ బ్రేకర్లు, జీపీఎస్ అంటూ వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయినా మితి మీరిన వేగంతో వేళ్తేనే మజా అంటోంది యువత. ఎంత భయంకరమైన ప్రమాదాలు జరిగిన తగ్గేదేలే అంటూ రయ్ రయ్ మంటూ వెళ్లిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడొక వ్యక్తి కూడా యూ టర్న్ తీసుకుంటున్న బస్సుని లక్ష్య పెట్టకుండా తనదైన స్పీడులో దూసుకుపోతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని మంగళూరులో బస్సును వేగంగా దాటిన వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ యూ టర్న్తీసుకోవడానికి బస్సుని ఒక పక్కకు ఆపి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా స్కూటర్ పై దూసుకుంటూ వస్తున్న ఒక వ్యక్తిని చూసి బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు. అయితే ఆ వ్యక్తి మాత్రం చేపల ప్రాసెసింగ్ యూనిట్ గేట్ని రాసుకుంటూ ..ఒక దుకాణం, చెట్టు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ నుంచి వెళ్లిపోయాడు. అతను రైడ్ చేసిన విధానం చూస్తేనే వొళ్లు గగ్గర్పాటుకు గురవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు లక్కీ గై అని ఒకరు, మరోకరేమో ఏమి జరగనట్టుగా వెళ్లిపోతున్నాడు అంటూ విమర్శిస్తూ ట్వీట్ చేశారు. Viral video of a young man who was speeding on a scooter and miraculously avoided colliding with a bus that was taking a U-turn near Elyarpadavu, Mangalore. 🚌💨🛵 The scooter then hits the door of the fish processing unit and passed in between a shop and a tree. 😱 pic.twitter.com/c4vAvbbikj — Mangalore City (@MangaloreCity) January 11, 2022 -
‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి: సీఎం యూటర్న్
చండీగఢ్: మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు సంవత్సరానికి పైగా పోరాడుతున్న రైతులపై తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనపై యూటర్న్ తీసుకున్నారు. రైతుల నిరసన కార్యక్రమాలతో తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఇష్టమొచ్చినట్టు చేసుకోండి.. కానీ పంజాబ్లో ఎందుకు’ అని ప్రశ్నించారు. కేంద్రంపై పోరాడేందుకు ఢిల్లీలో ఉద్యమం చేయాలని సూచించారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్కాకి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు రైతులు తమ శక్తియుక్తుల్ని ఉపయోగించాలని చెప్పారు. రాష్ట్రంలో కాదని పేర్కొన్నారు. పంజాబ్కు ఎందుకు నష్టం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హరియాణా, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేసుకోండి అని సూచించారు. రైతులు ఢిల్లీ, హరియాణాలోని 113 ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు అని తెలిపారు. ‘మీ ఆందోళనతో రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడడం ఆందోళనకరం’ అని ఆరోపించారు. రాష్ట్రం ఆదాయం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్రావు డ్యాన్స్ పంజాబ్లో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సీఎం అమరీందర్సింగ్ ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. నల్ల చట్టాల రద్దుకు రైతులు పంజాబ్లో భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పది నెలలుగా రైతులు నల్ల చట్టాల రద్దుకు ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలతో తమకు మద్దతు ధర దక్కదని.. వ్యవసాయం కార్పొరేటు పరం అవుతుందనే ఆందోళనతో రైతులు ఉద్యమ బాట పట్టారు. -
Ramdev యూటర్న్: వ్యాక్సిన్ తీసుకుంటా, వారు దేవదూతలు
సాక్షి,న్యూఢిల్లీ: అల్లోపతిపైన, డాక్టర్లపైనా సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యోగా గురు బాబా రాందేవ్ యూ టర్న్ తీసుకున్నారు. వైద్యులు దేవుని దూతల్లాంటి వారంటూ తాజాగా పేర్కొన్నారు. తన పోరాటం వైద్యులపై కాదు, మాదకద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగా అంటూ ప్రకటించారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ దుమారాన్ని రాజేసిన ఆయన త్వరలోనే తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్ 21 నుంచి అందరికీ ఉచిత టీకా అందుబాటులో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని చెప్పారు రాందేవ్. తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని తెలిపారు. తన పోరాటం డ్రగ్ మాఫియాపై మాత్రమేనని రాందేవ్ పేర్కొన్నారు. అయితే ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉందన్నారు. కానీ అవసరమైన మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని ఆయన హితవు పలికారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనరిక్ మెడిసిన్ తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు వేసేలా మోదీ చారిత్రాత్మక ప్రకటన చేశారనీ, ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రజలంతా ఆచరించాలని, వ్యాధుల నివారణలో యోగా రక్షణ కవచంలా ఉంటుందనీ, ముఖ్యంగా కరోనా నుండి యోగా రక్షిస్తుందని రాందేవ్ పేర్కొన్నారు. కాగా వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతిని, వైద్యులను కించపరిచేలా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మండిపడింది. రాందేవ్కు లీగల్ నోటీసు లిచ్చింది. దీంతోపాటు కేంద్ర ఆరోగ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాసింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు రాందేవ్పై చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం ఐఎంఎ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాందేవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చదవండి : వ్యాక్సిన్లపై రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం -
భారత్పై ఆక్రోశం? చక్కెర, పత్తికి పాకిస్తాన్లో తిప్పలు
ఇస్లామాబాద్: పక్కనున్న దేశంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవసరమైన వస్తువుల దిగుమతిపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ ఎత్తి వేసే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై నిన్న మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఒకరోజు తిరిగే లోపే ఆ నిర్ణయానికి బ్రేక్ పడింది. దీంతో ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు చుక్కెదురైంది. భారత్ నుంచి వస్తువుల దిగుమతికి ఆ దేశంలోని జాతీయ సంస్థ నిరాకరించింది. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్పై తీసుకున్న చర్యలతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి భారత్ నుంచి దిగుమతి చేసుకునే పత్తి, చక్కెర తదితర వస్తువులపై నిషేధం విధించింది. పాకిస్తాన్ మంత్రిమండలి ప్రధాని ఇమ్రాన్ఖాన్ అధ్యక్షతన బుధవారం సమావేశమై భారత్ నుంచి దిగుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పత్తి, చక్కెర దిగుమతులకు తిరిగి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తెల్లారే గురువారం పాకిస్తాన్లో ఆర్థిక సహకార కమిటీ (ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ-ఈసీసీ) ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. భారత్ నుంచి దిగుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయమే ఫైనలా? లేదా ఆర్థిక కమిటీ నిర్ణయం ఫైనలా అనేది తేలాల్సి ఉంది. భారత్ను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్ వైఖరి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో ఆహార కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే చక్కెర, పత్తి కొరత తీవ్రంగా ఉంది. అందుకే వాటిని తిరిగి దిగుమతి చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తుండగా ఆ నిర్ణయానికి ఆర్థిక కమిటీ నిరాకరించింది. మరి ఇమ్రాన్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
చిన్మయానంద కేసులో భారీ ట్విస్ట్
లక్నో: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద లైంగిక దాడి కేసు కీలక మలుపు తిరిగింది.. చిన్మయానంద తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ గతేడాది ఆరోపించిన లా విద్యార్థిని తాజాగా యూటర్న్ తీసుకుంది. ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడలేదని కోర్టు ముందు పేర్కొంది. దాంతోపాటు ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఆమె కేసు వాపస్ తీసుకోవడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. షహజాన్పూర్లో చదువుతున్న లా విద్యార్థిని గతేడాది ఆగస్టులో కనిపించకుండా పోయింది. తరువాత తిరిగి వచ్చిన ఆమె మాజీ మంత్రి చిన్మయానందపై లైంగిక ఆరోపణలు చేసింది. చాలా పోరాటాలు జరిగిన తరువాత గతేడాది సెప్టెంబర్లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అలహాబాద్ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బ్రాంచ్ ఈ కేసు విచారణను చేపట్టింది. ఫిబ్రవరిలో చిన్మయానంద బెయిల్పై బయటకు వచ్చారు. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా, చిన్మయానంద తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని విద్యార్థిని కోర్టుకు తెలిపింది. అయితే మాజీ మంత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గతంలో ఆరోపించిన విద్యార్థిని తాజాగా మాట మార్చడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. న్యాయ విద్యార్థిని మాట మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బెయిల్పై వచ్చి ఘనంగా బర్త్డే -
దావుద్ విషయంలో పాక్ యూటర్న్
-
బాబు నాలుకకు ఎన్నీ చీలికలో..!
-
యూటర్న్ బాబు
-
టీడీపీ యూటర్న్ పార్టీ
-
యడ్యూరప్ప యూ టర్న్
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప యూటర్న్ తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్ట నిరసన సందర్భంగాజరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి బంధువులకు ప్రకటించిన 10 లక్షల రూపాయల పరిహారం చెల్లింపు విషయంలో వెనక్కి తగ్గారు. బుధవారం మంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ, హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు జరిపి, బాధితులు నిర్దోషులు అని తేలేవరకు పరిహారం చెల్లించలేమని సీఎం స్పష్టం చేశారు. మంగళూరు నార్త్ (బందరు) హింస ముందస్తు కుట్రగా పేర్కొన్న ముఖ్యమంత్రి హింసకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీఐడితో పాటు మెజిస్టీరియల్ విచారణ జరుగుతోందన్నారు. వాస్తవాల ఆధారంగా హింసకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయమని పోలీసులను నిర్దేశిస్తానని, ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని యడ్యూరప్ప తెలిపారు. కాగా పౌరసత్వం (సవరణ) చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌరుల రిజిస్టర్కు వ్యతిరేకంగా గత వారం జరిగిన నిరసన పోలీసు కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో నౌసిన్ (23), జలీల్ కుద్రోలి (49) చనిపోయారు. అసలు ఈ ఇద్దరూ ఆందోళనలో పాల్గొనలేదని, వారి బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం వీరిని నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఇద్దరు బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆ ఆఫర్కు నో చెప్పిన సమంత!
దక్షిణాది హీరోయిన్లకు బాలీవుడ్లో అవకాశం అనేది ఒక కల అనే చెప్పవచ్చు. ఇక్కడ టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్నా, హిందీ చిత్రాల్లో నటించాలని ఆశపడుతుంటారు. అందుకు కారణం బాలీవుడ్ చిత్ర పరిధి వేరు. అంతేకాదు క్రేజ్తో పాటు మార్కెట్ పెరుగుతుంది. అలా ఇక్కడ స్టార్స్గా రాణిస్తున్న నటి త్రిష, శ్రియ వంటి హీరోయిన్ల బాలీవుడ్లో పాగావేయాలని ప్రయత్నించినా, అక్కడ గుర్తింపు పొందలేకపోయారు. నటి తాప్సీ మాత్రం దక్షిణాది క్రేజ్తో బాలీవుడ్లో అవకాశాలను అందుకుని అక్కడ సెటిల్ అయ్యింది. నటి నయనతార, అనుష్క వంటి వారికి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినా తమకు దక్షిణాది చాలు అంటూ నో చెప్పేశారు. ఇప్పుడు నటి సమంత కూడా వీరి కోవలోకి చేరిందనే ప్రచారం సాగుతోంది. సమంత చేతిలో ఇప్పుడు 96 అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. అదీ దాదాపు పూర్తి అవుతున్న దశలో ఉంది. కాగా ఇంతకుముందు ఈ బ్యూటీ యూ టర్న్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగు, తమిళం రీమేక్లో సమంత కోరి మరీ నటించింది. కాగా అదే చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. ఇందులో సమంతకే నటించే అవకాశం వచ్చిందట. అయితే ఆ అవకాశాన్ని ఈ బ్యూటీ నిరాకరించినట్లు సమాచారం. అలా బాలీవుఢ్ ఎంట్రీని కాదన్న సమంత గురించి ఇప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. అయితే తను ఎంతో కోరుకుని నటించిన యూటర్న్ చిత్రం అంత ఆశించిన విజయాన్ని సాధించలేదన్న నిరాశతో ఆ అవకాశాన్ని కాదందా లేక బాలీవుడ్లో నటించడం ఇష్టం లేక నో అన్నదా అన్న చర్చ మాత్రం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. -
ఆ రికార్డు చంద్రబాబుకే దక్కుతుంది...
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయాక మరోలా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన వ్యవహారశైలికి కొన్నిసార్లు ఊసరవెల్లి కూడా ఆశ్చర్యపోవాల్సిందే. యూటర్న్కు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు అందితే జుట్టు, అంతకపోతే కాళ్లు పట్టుకోవడం అలవాటే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని, నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించిన చంద్రబాబు తాజాగా బీజేపీలోకి కలిసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమయం లో రాహుతల్తో పొత్తు కోసం మోదీని నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్ర బాబు రాజకీయంగా కాంగ్రెస్కు హ్యాండిచ్చి మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీకి దగ్గర కావాలని తహతహలాడుతున్నారు. కేంద్రం విభేదించి తప్పు చేశామంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ బీజేపి ఇంచార్జ్ సునీల్ దియోధరా మాత్రం బాబు ఎంట్రీకి ఎప్పుడో గేట్లు మూసేశామని చెబుతున్నారు. అయినా బాబు యూటర్న్ ప్రయత్నాలు, లాబీయింగ్ మాత్రం సుజనా చౌదరి ద్వారా నడుస్తూనే వుందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. యూటర్న్ విషయానికి వస్తే... 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు... 2019 ఎన్నికలకు వచ్చేసరికి వ్యతిరేకతను పక్కనపెట్టి ఆ పార్టీతో చేతులు కలిపారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఆయన వేసిన పిల్లిమొగ్గలతో సొంత పార్టీ నేతలే అయోమయానికి గురయ్యారు. ఇక నాలుగున్నరేళ్లుగా బీజేపీతో పనిచేసిన చంద్రబాబు ఎన్నికల ముందు హఠాత్తుగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసి హోదాపై యూ టర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి తానే పోరాటం చేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చిన ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే తాను అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టులు అప్పచెప్పి..సకాలంలో పూర్తి చేసిన వారిని భారీ బహిరంగ సభ పెట్టి మరీ సన్మానించిన చంద్రబాబే... పవర్ పోయి ప్రతిపక్ష నేతగా మారగానే యూ టర్న్ తీసేసుకున్నారు. చైనా మోటర్స్ పైనా , ఆ టెక్నాలజీ వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందంటూ హడావుడి చేసేస్తున్నారు. గతంలో చైనా ప్రభుత్వం సహాయంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ తో రాజధాని భవనాలను నిర్మిస్తున్నామని ఆ దేశంలో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు చంద్రబాబు. చైనా ప్రతినిధులకు కూడా అమరావతి వచ్చి వెళ్లిపోయారు. యూటర్న్కు... బాబు కూడా కొత్త కాదు. అయితే నిజాన్ని చెప్పే అలవాటు ఏ రోజు చంద్ర బాబుకు అలవాటు లేదన్నది జనమెరిగిన సత్యం. నాలుగు నెలలకే తన అనుభవాన్ని ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేసే చంద్రబాబు ఎప్పుడు ఏ యూటర్న్ తీసుకున్నా అది తన లాభాని తప్ప జనానికి ఉపయోగపడేది కాదనేది వాస్తవం. యూటర్న్ అనేపదం కూడా తన వ్యక్తిత్వాన్ని ,సహజత్వాన్ని వదులుకునేలా చంద్రబాబు ప్రవర్తిస్తుండటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. ఈ లెక్కన చూస్తుంటే...యూటర్న్ను ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన రికార్డు చంద్రబాబుకే దక్కుతుంది. -
జరిమానాలపై జనం బెంబేలు
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం పడుతున్న భారీ జరిమానాలు ఇవి. చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకే వేలు దాటి లక్షల్లో పెనాల్టీ పడుతుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ చట్టంతో సామాన్యులపై మోయలేని భారం పడుతోందని సగానికి పైగా రాష్ట్రాలు అమల్లోకి తీసుకురావడానికి నిరాకరించాయి. చివరికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొత్త చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తే జనంలో చెడ్డ పేరు వస్తోందని గగ్గోలు పెడుతున్నాయి. కేంద్రం చేసిన చట్టాన్ని తాము కూడా అమలు చేయలేమంటూ చేతులెత్తేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొదట గుజరాత్ ఈ స్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చి చెప్పేస్తే, ఇప్పుడు అదే బాటలో మహారాష్ట్ర, కర్ణాటక కూడా నడుస్తున్నాయి. ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉందని, ప్రమాదాలు నివారించి, ప్రజల ప్రాణాలు కాపాడడానికే ఈ జరిమానాలు తీసుకువచ్చామని కేంద్ర రోడ్లు, రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నా, సమాజంలో వివిధ వర్గాలతో సుదీర్ఘ చర్చల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా ఆయనకు నిరసన సెగలు తగులుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు గడ్కరీ ఇంటి ముందు ధర్నాలకు దిగారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ జరిమానాలపై తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. జోకులు, మెమెలతో నెటిజన్లు హడావుడి చేస్తున్నారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థాయిలో జరిమానాలు విధించడం ఇష్టం లేక చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్నాయి. గుజరాత్ బాటలో..! బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ ఈ పెనాల్టీలపై తొలిసారి నోరు మెదిపింది. ఈ స్థాయి లో జరిమానాలు సరైన పద్ధతి కాదంటూ సగానికి సగం జరిమానాలను తగ్గించింది. దాదాపుగా 90 శాతం కేసుల్లో జరిమానాల్లో మార్పులు చేసింది. హెల్మెట్ లేకపోతే రూ.500, లైసెన్స్ లేకపోతే రూ2000... ఇలా చాలా కేసులకు సంబంధించి జరిమానాలను సగానికి సగం తగ్గించింది. ఇక గుజరాత్ బాటలోనే ఉత్తరాఖండ్ కూడా నడిచింది. ఎన్నికలున్నాయనే... కొత్త చట్టం కింద పన్నులు విధించడానికి కొన్ని రాష్ట్రాలు వెనక్కి తగ్గడానికి, ఎన్నికలకు సంబంధం ఉందనే విశ్లేషణ లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్, మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే మహారాష్ట్ర, జార్ఖండ్లు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయలేమని చెప్పేశాయి. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల కోసం కాదని, ప్రజల కోసమేనని మహారాష్ట్ర అంటోంది. భారీస్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చేసిన రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్న రాష్ట్రాలు: పంజాబ్, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్ -
కర్ణాటకం : కాంగ్రెస్ ఎమ్మెల్యే యూటర్న్..!
బెంగుళూరు : కన్నడనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు రెబెల్ ఎమ్మెల్యేలు ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్తో చర్చలకు ససేమిరా అనడంతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కుప్పకూలే పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్కు మద్దతిస్తానని చెప్పిన రెబెల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు 24 గంటల్లోనే మాటమార్చారు. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తానని శనివారం నాగరాజు శివకుమార్తో చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. కానీ, ఆదివారం ఉదయంకల్లా సీన్ రివర్సయింది. ఆయన యూటర్న్ తీసుకున్నారు. ముంబైలో మకాంవేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసేందుకు నాగరాజు వెళ్లినట్టు సమాచారం. ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే సుధాకర్ కూడా రెబెల్ ఎమ్మెల్యేల శిబిరంలో చేరేందుకు వెళ్లనున్నట్టు తెలిసింది. (చదవండి : రేపే ‘విశ్వాసం’ పెట్టండి) విశ్వాసం సన్నగిల్లిందా..! శాసనసభలో బుధవారం ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. తమ ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసం ఉందని, విశ్వాస పరీక్షలో నెగ్గుతామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. విశ్వాస పరీక్షలో పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే వారి సభ్యత్వాన్ని కోల్పోతారని అన్నారు. ఈ అంశం చట్టంలో స్పష్టంగా ఉందని వెల్లడించారు. అసంతృప్త ఎమ్మెల్యేల డిమాండ్లను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. విశ్వాస పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం శాసనసభాపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇక సంకీర్ణానికి మద్దతిస్తానని చెప్పిన నాగరాజు యూటర్న్ తీసుకోవడంపై ఆయనకు పార్టీ సమర్థతపై విశ్వాసం సన్నగిల్లిందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. (చదవండి : విశ్వాసపరీక్షకు సిద్ధం!) -
మార్కెట్ల రీబౌండ్ : జెట్ ఎయిర్వేస్ జూమ్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు యూ టర్న్ తీసుకుని లాభాల్లోకి మళ్లాయి. బలహీనమైన ట్రెండ్ నుంచి పాజిటివ్ట్రెండ్లోకి మారాయి. రోజు కనిష్టం నుంచి ఏకంగా 350 పాయింట్లకు పైగా ఎగిసింది. సెన్సెక్స్ ప్రస్తుతం176 పాయింట్ల లాభంతో 39,292 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 11,740 వద్ద ట్రేడవుతోంది. ట్రేడర్లు షార్ట్కవరింగ్కు మార్కెట్లకు ఊతమిస్తోందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రధానంగా ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్ రంగాలు లాభపడుతున్నాయి. రుపీ బలపడటంతో ఐటీ 0.5 శాతం, ఎఫ్ఎంసీజీ 0.25 శాతం చొప్పున నీరసించాయి. మరోవైపు ఇటీవల భారీగా కుదేలైన జెట్ ఎయిర్వేస్ ఏకంగా 32 శాతం ఎగిసింది. ప్రస్తుతం 23శాతం లాభాలతో కొనసాగుతోంది. అడాగ్ షేర్లు కూడా రీబౌండ్ అయ్యాయి. -
నా పాత్రలో ఆమెను ఊహించుకోలేను: శ్రద్దా శ్రీనాథ్
తమిళసినిమా: మనసులో అనిపించింది అలానే బయటకు చెప్పేస్తే ఒక్కోసారి బెడిసి కొడుతుంది. అందుకే ఏ విషయాన్నైనా ఆచితూచి మాట్లాడాలంటారు పెద్దలు. నటి శ్రద్ధా శ్రీనాథ్ అలా నోరు జారే అభిమానుల ఆగ్రహానికి గురైంది. కథానాయకిగా ఎదుగుతున్న నటి శ్రద్ధాశ్రీనాథ్. కన్నడంలో ఈ బ్యూటీ నటించిన యూటర్న్ మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇక తమిళంలోనూ శ్రద్ధాశ్రీనాథ్ నటించిన ఇవన్ తంద్రిరన్, విక్రమ్వేదా చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా విక్రమ్వేదా కోలీవుడ్లో శ్రద్ధాశ్రీనాథ్కు ల్యాండ్మార్క్ చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి జెర్సీ చిత్రంతో సక్సెస్ను తన ఖాతాలో వేసేసుకుంది. ఇంత వరకూ బాగానే ఉంది. బహుభాషా నటిగా మార్కెట్ను పెంచుకుంటోంది. ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది సహజం. అలా కన్నడంలో శ్రద్ధాశ్రీనాథ్ నాయకిగా నటించిన యూటర్న్ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో రీమేక్ చేశారు. ఇందులో శ్రద్ధాశ్రీనాథ్ పాత్రను నటి సమంత పోషించింది. ఇమె ఇష్టపడి చేసిన పాత్ర ఇది. ఆ పాత్రలో నటించి మంచి పేరే తెచ్చుకుంది. కాగా శ్రద్ధాశ్రీనాథ్ ఇటీవల ఒక భేటీలో సమంత నటించిన యూటర్న్ చిత్రం గురించి చేసిన కామెంట్ సమంత అభిమానుల్లో అసంతృప్తిని కలిగించింది. ఇంతకీ శ్రద్ధాశ్రీనాథ్ ఏమందంటే నేను నా గురించి ఎక్కువగానే ఊహించుకుంటాను. యూటర్న్ రీమేక్ చిత్రాన్ని పూర్తిగా చూడాలని భావించాను. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువ చూడలేకపోయాను. ఎందుకంటే నేను నటించిన రక్షణ పాత్రలో వేరే నటి(సమంత)ని ఊహించలేకపోయాను అని అంది. ఇలా తన మనసుకు అనిపించింది బయటకు చెప్పడంతో సమంత నటన ఈ అమ్మడికి నచ్చలేదనే అర్థం స్పురించడంతో సమంత అభిమానులకు రుచించలేదు. దీంతో వారు నటి శ్రద్ధాశ్రీనాథ్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. -
‘ట్రావెన్కోర్’ యూటర్న్
-
శ్వేతపత్రాల్లోనూ బాబు యూటర్న్
-
చంద్రబాబు ‘ఫాదర్ ఆఫ్ యూటర్న్’
హుస్నాబాద్: ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే చంద్రబాబుకు ‘ఫాదర్ ఆఫ్ యూటర్న్’ అవార్డు ఇవ్వాలని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ది పేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో బుధవారం టీఆర్ఎస్వీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి హరీశ్ మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బాబు వచ్చి ప్రచారం చేస్తే గెలుస్తామని వారు కలలు కంటున్నా రని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఉత్తమ్కుమార్రెడ్డి తలుపు దగ్గర నిలుచుని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఆస్తుల పంపకం కాలేదని, హైకోర్టు విభజన జరగలేదని, ప్రభుత్వరంగ సంస్థల విభజన పూర్తికాలేదన్నారు. ఐదేళ్లు గడిచినా ఏ ఒక్కటీ విభజన పూర్తి కాలేదన్నారు. బాబుపై ఆధారపడి కాంగ్రెస్ అ«ధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తికానిస్తాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారని హరీశ్ అన్నారు. దేశంలోనే అవకాశవాద నాయకుడాయన.. 1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు కాంగ్రెస్లో ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్పై పోటీ చేస్తానని చెప్పారని హరీశ్ అన్నారు. 1985లో టీడీపీలో చేరిన బాబు.. ఎన్టీఆర్ను దేవుడని పొగడ్తల వర్షం కురిపించారని తెలిపారు. 1999లో బీజేపీతో జత కలిసి.. దేశం బీజేపీతోనే అభివృద్ధి చెందుతుందని మాట మార్చారని, 2004లో చంద్రబాబు ఓడిపోయినప్పు డు బీజేపీ పొత్తు వల్లే ఓడిపోయానని చెప్పాడన్నారు. దేశంలోనే అవకాశవాద నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మె ల్యే సతీశ్కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
శూర్పణఖ పాత్రలో సమంత
టాలీవుడ్ లో టాప్ స్టార్గా వెలుగొందుతున్న స్టార్ హీరోయిన్ సమంత ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరుకు సోషల్ సినిమాలు మాత్రమే చేసిన సామ్ త్వరలో ఓ పౌరాణిక పాత్రలో నటించేందుకు ఓకె చెప్పారట. అది కూడా నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో అని తెలుస్తోంది. పలు యానిమేషన్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్.. రామాయణం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. శూర్పణఖ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంత లీడ్ రోల్లో నటించనున్నారు. ముందుగా ఈ పాత్రకు కాజల్ను తీసుకోవాలని భావించినా ప్రస్తుతం సమంత పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
లేడీ డైరెక్టర్తో సమంత!?
సినిమా షూటింగ్లతో బిజీబిజీగా ఉండే సమంత ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూ టర్న్ చిత్రాలతో హిట్ కొట్టిన సమంత.. నెక్ట్స్ భర్త చైతో కలిసి ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చైతూ, సమంతల పెళ్లి రోజు (అక్టోబర్ 6)న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే సమంత మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలిసింది. ‘అలా మొదలైంది’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సామ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నందినీ రెడ్డి స్క్రిప్టుకు ఇంప్రెస్ అయిన సామ్.. ఈ చిత్రంలో నటించడానికి సుముఖత వ్యక్తం చేశారట. కాగా 2013లో నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘జబర్దస్త్’ సినిమాలో సామ్ నటించిన సంగతి తెలిసిందే. -
ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న చై-సామ్!
అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’, సమంత నటించిన ‘యూ టర్న్’ ఒకే రోజున విడుదలైనా.. రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయవంతమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవ్వడమే అరుదు.. అందులో భార్య, భర్త లీడ్ రోల్స్లో నటించిన రెండు వేర్వేరు సినిమాలు రిలీజ్ అవ్వడం ఆశ్చర్యమే. అయినా రెండు సినిమాలు విభిన్న కథాంశాలతో తెరకెక్కడంతో.. రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట ఖుషీగా పార్టీ చేసుకుంటున్నట్టుంది. పబ్లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సమంత. ఈ పార్టీలో అఖిల్ కూడా చిందులేసినట్టున్నాడు. -
సమంతకు ఎంపీ కవిత కితాబు
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘యు టర్న్’. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మంచి వసూళ్లు సాధిస్తుండటంతో చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత , డైరెక్టర్ నందినిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘సినిమాని ఇంత హిట్ చేసినందుకు అందరికి థాంక్స్.. మీడియాకి, రివ్యూయర్స్కి చాల చాల కృతజ్ఞతలు. నేను చేసిన సినిమాల్లో ఇంత పాజిటివ్ రివ్యూస్ రావడం, అది కూడా నా యాక్టింగ్కి రావడం చాల ఆనందంగా ఉంది.. ఇక్కడికి వచ్చిన కవిత గారికి, డైరెక్టర్ నందికి గారికి చాల థాంక్స్’అన్నారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ‘వండర్ ఫుల్ సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాల బాగా ఉంది అంటున్నారు. సమంత ఈ సినిమాలో చాల డిఫరెంట్గా కనిపించింది. రంగస్థలంలో , యూ టర్న్ లో చాల వేరియేషన్స్ చూపించింది. సమంత సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాల మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ’ అన్నారు. ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్ ఇతర కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రిలీజ్ కాకముందే రీమేక్ చేద్దామన్నారు!
సమంత ముఖ్య పాత్రలో పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’కి ఇది రీమేక్. భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు చేశారు. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా పవన్ కుమార్ పలు విశేషాలు పంచుకున్నారు. ► బెంగళూర్లో జరిగిన ఓ చిన్న సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశా. మనందరం రోడ్ మీద యు టర్న్ని పట్టించుకోం. రాంగ్ రూట్లో వెళ్లిపోతుంటాం. అది పెద్ద తప్పుల్లా భావించం. అలా చేయడం వల్ల పరిణామాలు భయంకరంగా ఉంటే? అనే ఐడియానే ఈ కథ. ► ఈ సినిమాను నేను రీమేక్ అనను. ఎందుకంటే చివరి 30 నిమిషాలు చాలా మటుకు మార్చాం. కన్నడంలో తీసినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. బడ్జెట్, ఇంకా చాలా విషయాల్లో అప్పుడు అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి వీలుపడలేదు. ఈసారి బాగా తీశాను. ► కన్నడ ‘యు టర్న్’ ట్రైలర్ రిలీజైన సాయంత్రమే సమంత నాకు మెసేజ్ చేసింది. తర్వాత స్క్రిప్ట్ పంపించమంది. నాకు భయమేసింది. సినిమా రిలీజ్ అవ్వకుండా స్క్రిప్ట్ ఎలా పంపుతాం? అని. పంపాను. సమంత, చైతన్య వచ్చి నా ఆఫీస్లోనే రిలీజ్ కాకముందే సినిమా చూశారు. బాగా నచ్చింది. రీమేక్ చేస్తాం అన్నారు. ► ఏదైనా భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తుంటాం. కానీ రిలీజ్ కాకముందే సమంత రీమేక్ చేయాలనుకోవడం గ్రేట్. తనకున్న కమిట్మెంట్స్ వల్ల సినిమా స్టార్ట్ చేయడం ఆలస్యం అయింది. సమంత, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో.. సెట్లో డైరెక్టర్–యాక్టర్ ఈక్వేషన్ కంటే కూడా ఫ్రెండ్స్గా ఉండేవాళ్లం. ► నా ఫస్ట్ సినిమా ‘లూసియా’ను హిందీలో రీమేక్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. నెక్ట్ ఏ ప్రాజెక్ట్ అని ఇంకా నిర్ణయించుకోలేదు. -
ప్రస్తుతానికి మంచోడిలా ఉందామనుకుంటున్నాను
‘‘ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాగా వస్తున్నాయి. మెల్లిగా గేమ్ చేంజ్ అవుతోంది. ఆడియన్స్ అభిరుచులు మారుతున్నాయి. అందుకే ఏ పాత్ర చేసినా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను. మంచి సినిమాలో భాగం అవ్వాలని అనుకుంటా. నా కెరీర్లో బెస్ట్ మూవీస్లో ‘యు టర్న్’ తప్పకుండా ఉంటుంది’’ అని ఆది పినిశెట్టి అన్నారు. సమంత మెయిన్ లీడ్గా ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆది పలు విశేషాలు పంచుకున్నారు. ► సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్న పాయింట్ అయినా ఆసక్తి కలిగించేలా దర్శకుడు పవన్ చెప్పారు. సామాజిక స్పృహ ఉన్న కథను బోధించినట్టు కాకుండా కమర్షియల్గా చెప్పారు. ► కర్మ సిద్ధాంతం. మనం ఏదైనా తప్పు చేస్తే అది మళ్లీ మనకే వస్తుంది అన్నదే ఈ సినిమా కథ. ► ‘వైశాలి’ తర్వాత మళ్లీ పోలీస్ పాత్ర చేశాను. పోలీస్ అనగానే స్లో మోషన్ షాట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉండాలనుకోను. ఈ సినిమాలో ఏ ఇంట్రడక్షన్ ఉండదు. సాధారణ పాత్రలానే ఎంటర్ అవుతాను. ఇదే నా కెరీర్లో బెస్ట్ ఇంట్రడక్షన్. పవన్ నెక్ట్స్ జనరేషన్ డైరెక్టర్. తనకి చాలా ఫ్యూచర్ ఉంది. ‘రంగస్థలం’ తర్వాత సమంతతో మరో సక్సెస్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ► సినిమాను అనలైజ్ చేసే వాళ్లు కేవలం 15 శాతం మంది ఉంటారు. మిగతా వాళ్లకు బావుందా బాలేదా అన్నదే ముఖ్యం. ‘నీవెవరో’ సినిమా కూడా కామన్ ఆడియన్స్కు నచ్చొచ్చు అన్నాను. కానీ క్రిటిక్స్ మీద కామెంట్ చేయలేదు. క్రిటిసిజిమ్ నుంచే నేర్చుకొంటాను. ఎప్పటికప్పుడు యాక్టర్గా ఇంప్రూవ్ అవ్వడానికి మీరిచ్చే (క్రిటిక్స్) ఫీడ్బ్యాకే ముఖ్యం. పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా చూస్తుంటాను. ► సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్గా ఉండను. కొంతమంది సంబంధం లేకుండా నెగటివిటీ షేర్ చేస్తుంటారు. అలాంటి వాళ్లను పాపం అనుకొని పక్కన పెట్టేయడమే. ► ప్రస్తుతానికి మంచోడిలా ఉందాం అనుకుంటున్నాను. మంచి స్క్రిప్ట్ వస్తే అప్పుడు చెడ్డగా (విలన్) మారతాను. నెక్ట్స్ నాలుగు ప్రాజెక్ట్లు అనుకుంటున్నాను. -
‘యు టర్న్’ మూవీ రివ్యూ
టైటిల్ : యు టర్న్ జానర్ : సూపర్ నేచురల్ థ్రిల్లర్ తారాగణం : సమంత, ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్, నరేన్ సంగీతం : పూర్ణచంద్ర తేజస్వీ దర్శకత్వం : పవన్ కుమార్ నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు పెళ్లి తరువాత సినిమాల ఎంపికలో సమంత చాలా సెలెక్టివ్ గా ఉన్నారు. ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రంగస్థలం, అభిమన్యుడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న సామ్ మరో సూపర్ హిట్ మీద కన్నేశారు. అందుకే కన్నడలో ఘనవిజయం సాధించిన యు టర్న్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన యు టర్న్ కు ఒరిజనల్ వర్షన్కు దర్శకత్వం వహించిన పవన్ కుమారే దర్శకత్వం వహించాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యు టర్న్తో సమంత ఆశించిన విజయం సాధించారా..? లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆకట్టుకున్నారా.? కన్నడ ప్రేక్షకులను అలరించిన యు టర్న్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..? కథ : రచన(సమంత) ఓ మీడియా సంస్థలో ఇంటర్న్షిప్ చేస్తుంటుంది.అదే సంస్థలో ఉద్యోగం కోసం ఓ హ్యూమన్ ఇంట్రస్ట్ స్టోరి చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంలో ఆర్కేపురం ఫ్లైఓవర్పై రోడ్ బ్లాక్స్ ను తప్పించి యు టర్న్ తీసుకునే వారిని మీద స్టోరి చేయాలన్న ఆలోచనతో, యుటర్న్ తీసుకున్న వ్యక్తుల వెహికిల్ నంబర్స్ ద్వారా వారి అడ్రస్లు, ఫోన్ నంబర్లు తెలుసుకుంటుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా సుందర్ అనే వ్యక్తిని కలిసేందుకు ప్రయత్నించినా వీలుపడదు. కానీ అదే రోజు సుందర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవటంతో రచనను ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకెళతారు. విచారణలో భాగంగా రచన డైరీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ డైరీలో ఉన్న వ్యక్తులందరూ సుందర్ లాగే గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. అసలు ఆ డైరీలో ఉన్న వ్యక్తులు ఎవరు..? ఎలా చనిపోయారు.? వారి మరణానికి రచనకు సంబంధం ఏంటి.? ఈ సమస్యల నుంచి రచన ఎలా బయటపడింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఇన్నాళ్లు కమర్షియల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. యు టర్న్ సినిమాను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నారు. తన పర్ఫామెన్స్ తో సినిమా స్థాయిని పెంచారు సమంత. ప్రేమ, భయం, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ను అద్భుతంగా పండించారు. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. రచనకు సాయంచేసే పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం లేకపోయినా.. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. భూమిక తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతో మంచి ఎమోషన్స్ పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో భూమిక నటన కంటతడిపెట్టిస్తుంది. సమంత ఫ్రెండ్ పాత్రలో క్రైమ్ రిపోర్టర్ గా రాహుల్ రవీంద్రన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇతర పాత్రలో నరేన్, రవి ప్రకాష్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : థ్రిల్లర్ జానర్లో తెరకెక్కే సినిమాలను ఓ సెక్షన్ ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారు. అందుకే టాప్ స్టార్లు కూడా అప్పుడప్పుడు థ్రిల్లర్ సినిమాల వైపు చూస్తుంటారు. సమంత కూడా నటిగా తన స్థాయిని మెరుగుపరుచుకునేందుకు కన్నడ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు వర్షన్ ను కూడా డైరెక్ట్ చేశారు. తొలి పది నిమిషాలు కాస్త నెమ్మదిగా మొదలు పెట్టినా.. ఒక్కసారి అసలు కథ మొదలయ్యాక ఆడియన్స్ను కట్టిపడేశాడు దర్శకుడు. ఎక్కడ అనవసరమైన కామెడీ, సాంగ్స్ లాంటివి ఇరికించకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్లా సినిమాను నడిపించాడు. పూర్ణ చంద్ర తేజస్వీ సంగీతం సీన్స్ను మరింత ఎలివేట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. అయితే సెకండ్హాఫ్లో కొన్ని ట్వీస్ట్ లు ఆడియన్స్ ముందే అంచనా వేయగలిగేలా ఉన్నాయి. థ్రిల్లర్ సినిమాకు ఇది డ్రాబ్యాక్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సమంత నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : తొలి పది నిమిషాల అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
గిన్నీస్ కోసం ట్రై చేస్తున్నావా : సమంతతో నాగ్
సమంత ప్రధాన పాత్రలో పవన్ కుమార్ దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా యు టర్న్. కన్నడలో ఘన విజయం సాదించిన యు టర్న్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా రేపు(గురువారం) రిలీజ్ కానుంది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా నాగ్ మాట్లాడుతూ ‘రేపు రిలీజ్ అవుతున్న సినిమాల రిజల్ట్ తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నా.. ముఖ్యంగా సమంత యు టర్న్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. సమంత నటించిన మరో తమిళ సినిమా కూడా రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయం గురించి ఇప్పుడే సమంతను అడుగుతున్నా గిన్నీస్ బుక్లో రికార్డ్ కోసం ట్రై చేస్తున్నావా.. ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నావ్ అని’ అంటూ వేదికపై నవ్వులు పూయించారు నాగ్. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు, సమంత యు టర్న్తో పాటు ఈ నెలాఖరున దేవదాస్ కూడా రిలీజ్ అవుతుందన్న నాగ్.. ఈ సెప్టెంబర్ నెల అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసొస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
నేనెవరికీ తాళం వేయను
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బిజినెస్. నేను యాక్ట్ చేసిన సినిమాల నిర్మాతలకు డబ్బు రావాలని కోరుకుంటాను. నా దృష్టిలో బాక్సాఫీస్ రిజల్ట్సే సక్సెస్కు కొలమానం. మంచి పేరు ఎవరికి కావాలి? డబ్బులు కావాలి. అంతే (నవ్వుతూ). నేను రియలిస్టిక్గా ఉంటాను. ఎవరికీ తాళం వేయను’’ అన్నారు సమంత. ఆమె నటించిన తాజా చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’కు ఇది రీమేక్. ఒరిజనల్ను డైరెక్ట్ చేసిన పవన్కుమార్నే దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు. శ్రీనివాస చిట్టూరి, బండారు రాంబాబు నిర్మించిన ఈ సినిమా గురువారం రిలీజవుతున్న సందర్భంగా సమంత చెప్పిన విశేషాలు.. కన్నడ ‘యు టర్న్’ రిలీజ్కి ముందే ఆ స్క్రిప్ట్ గురించి విన్నాను. ఇలాంటి సినిమాలు ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలని ఇక్కడ రీమేక్ చేశాం. థ్రిల్లర్ మూవీస్ ఏ భాషకైనా నప్పుతాయి. ఈ సినిమా ఇక్కడి ఆడియన్స్కు కూడా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ∙కథే ఈ సినిమాకు ఈ హీరో. కథను ముందుకు తీసుకెళ్లడానికి మేం అందరం క్యారెక్టర్స్ చేశాం. భూమికగారితో సినిమా చేయడం ఓ మంచి ఎక్స్పీరియన్స్. క్లైమాక్స్లో ఆమె నటన సూపర్. ఈ సినిమా కోసం నేను హెయిర్ కట్ చేసుకోవాల్సి రావడం, అంతకుముందు నాకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది. ∙నా ‘యు టర్న్’, నా భర్త నాగచైతన్య సినిమా (శైలజారెడ్డి అల్లుడు) ఒకే రోజు విడుదలవుతాయని ముందు ఊహించలేదు. కానీ అలా కుదిరింది. డెస్టినీ. ఇద్దరం ఇంట్లో కూర్చొని రిపోర్ట్ కార్డ్ కోసం వెయిట్ చేస్తాం. ఒక మంచి భార్యగా ఆయన విజయం నాకెంతో అవసరం. ‘శైలజారెడ్డి అల్లుడు’ చూశాను. పండక్కి ఫుల్మీల్స్ లాంటి సినిమా. నా సినిమా వర్క్ చెన్నైలో జరగుతుండటం వల్ల ‘యు టర్న్’ని చైతూ ఇంకా చూడలేదు. ∙ఈ ఏడాదిలో నేను తీసుకున్న రిస్క్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి. నేను విలేజ్ అమ్మాయిని కాదు. కానీ ‘రంగస్థలం’ సినిమాలో రామలక్ష్మీ పాత్ర చేశాను. ‘మహానటి’ సినిమాలో నాది టైటిల్ రోల్ కాదు. ‘అభిమన్యుడు’లోనూ మంచి పాత్ర చేశాను. ఈ ఇయర్ ఆనందంగా ఉంది. ఈ ఏడాదిలానే భవిష్యత్లో కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే నా లక్ వెనకాల హార్డ్వర్క్ కూడా ఉంది. తెలుగులో డబ్బింగ్ చెప్పడం కష్టమే. కానీ కంటిన్యూ చేస్తాను. తమిళంలో కూడా సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను కంప్లీట్ యాక్టర్ కావాలనుకుంటున్నాను. ∙స్కూల్లో నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ‘యు టర్న్’ ప్రమోషనల్ సాంగ్లో డ్యాన్స్ చేయడానికి స్కోప్ దొరికింది. మా స్కూల్ ఫ్రెండ్స్ కాల్ చేసి అభినందించారు. ∙ప్రతి సినిమాకీ ముందు చేసిన సినిమాల్లో లేని కొత్త ఛాలెంజ్ని తీసుకోవడానికి ఇష్టపడతాను. నా వర్క్ని ఎంజాయ్ చేయాలనుకుంటాను కానీ సౌకర్యాలు కావాలని కోరుకోను. ప్రజెంట్ నేను సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నాను. సక్సెస్ల కోసం చాలా సినిమాలు చేయాలనే తాపత్రయం లేదు. ఎగై్జటింగ్ స్క్రిప్ట్ అయితే ఓకే. ∙పెళ్లి చేసుకున్నాక స్ట్రాంగ్ ఉమెన్గా తయారయ్యా. మంచి సపోర్ట్ ఉంది. పిల్లల కోసం డేట్ ఏదీ ఫిక్స్ చేయలేదు. దేవుడే ఫిక్స్ చేస్తాడు. ∙శివ నిర్వాణ దర్శకత్వంలో నేను, చైతూ చేయబోతున్న సినిమా అక్టోబర్ 6న స్టార్ట్ అవుతుంది. అదే రోజు మా పెళ్లి రోజు. ఆ డే స్పెషల్ ఇదే (నవ్వుతూ). మరో సినిమా కమిట్ అయ్యా. త్వరలో ఆ విశేషాలు చెబుతాను. -
పెళ్లయితే అత్త.. వదినలేనా?
‘‘నా పాత్ర స్క్రీన్ మీద ఎంత సేపు ఉంటుంది అని కాదు. కథకు ఎంత ఇంపార్టెంట్, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నది ముఖ్యం. నాకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. వాడికోసం కేటాయించే సమయాన్ని ఓ సినిమాకి ఇవ్వాలంటే అది ఎంతో విలువైనదిగా ఉండాలనుకుంటున్నాను. అద్భుతమైన క్యారెక్టర్, టీమ్ దొరికితే చేస్తా. మా అబ్బాయి స్కూల్, వాడితో స్పెండ్ చేసే టైమ్ మిస్ అవ్వదలచుకోలేదు’’ అని భూమిక అన్నారు. సమంత మెయిన్ లీడ్గా ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లా పలు విశేషాలు పంచుకున్నారు. ► దర్శకుడు పవన్ ‘యు టర్న్’ కథ చెప్పినప్పుడు డిఫరెంట్గా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నా పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను. ఒరిజినల్ చూశాను. కానీ నా స్టైల్లో, దర్శకుడు చెప్పినట్టు చేశాను. ఒరిజినల్తో పోలిస్తే కొన్ని కొన్ని మార్పులు చేశాం. నాకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నా సూపర్ హిట్స్లో థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. ► సమంత బ్రిలియంట్ యాక్టర్. సెట్లో తనుంటే మంచి ఎన ర్జీ ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్. సమంతవి ఎక్కువ సినిమాలు కూడా చూడలేదు. రీసెంట్గా తన ‘ఈగ, రంగస్థలం’ చూశాను. ► హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు బాగా వస్తున్నాయి. అవి ఇంకా పెరగాలి. కొంచెం టైమ్ పడుతుంది. ఉమెన్ సెంట్రిక్ అంటే ప్రొడ్యూసర్స్ కొంచెం ఆలోచిస్తున్నారు. బట్ అది కూడా త్వరలోనే మారిపోతుంది. ఈ తరహా సినిమాలు కూడా ఎక్కువ రావాలి. ► పెళ్లి అయిపోయిన హీరోయిన్స్ని అత్తలు, వదిన పాత్రలకు ఫిక్స్ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. బాలీవుడ్లో విద్యాబాలన్ ‘తుమ్హారీ సులూ’ ఎంత బావుంటుంది? జ్యోతిక, రాణీ ముఖర్జీ ఇలా మంచి సినిమాలు చేస్తున్నారు. 40 ప్లస్ ఏజ్ ఉన్న హీరోయిన్స్ మెయిన్ లీడ్గా కూడా రాణిస్తారు. దర్శకులు కూడా ఇంకా మంచి ఉమెన్ సెంట్రిక్ స్టోరీలు రాయాలి. ఆడియన్స్ ఆదరించాలి ► కమర్షియల్ సినిమాల్లో మంచి రోల్స్ చేశాను. ఒకే ఒక్క సినిమాతో కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్గా మారిపోరు. సినిమా సినిమాకి మెల్లిగా మారుతూ వస్తుంటాం. ► జయాపజయాలు నా కెరీర్పై ఎప్పుడూ ప్రభావం చూపలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాలీవుడ్ రిలీజ్ ఉన్నప్పుడు ఇక్కడ షూట్లో ఉండేదాన్ని. తెలుగు రిలీజ్ ఉంటే నార్త్లో ఎక్కడో షూటింగ్ చేస్తుండేదాన్ని. వరుసగా ‘ఎంసీఏ, యు టర్న్, సవ్యసాచి’ సినిమాల్లో అవకాశాలొచ్చాయి. నెక్ట్స్ తమిళంలో రెండు, తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకున్నాను. -
వైరల్గా సమంత ‘కర్మ థీమ్’ చాలెంజ్
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలెంజ్ల ట్రెండ్ నడుస్తోంది. మొన్నటి వరకు ఫిట్నెస్, కికీ తదితర చాలెంజ్లతో నిండిపోయిన సోషల్ మీడియాకు.. క్రేజీ నటి సమంత సరికొత్త చాలెంజ్ను పరిచయం చేశారు. తన అప్కమింగ్ మూవీ ‘యూటర్న్’ ప్రమోషన్లో భాగంగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ రూపొందించిన కర్మ థీమ్లో డ్యాన్స్తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసిన సమంత #యూటర్న్డాన్స్చాలెంజ్ పేరిట సవాల్ విసిరారు. సమంతపై ఆప్యాయత, అనురాగాలు కురిపించే ఆమె మరిది అఖిల్ అక్కినేని మొదటగా ఈ చాలెంజ్ను స్వీకరించారు. ఆ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్రతో పాటుగా సమంత అభిమానులందరూ ఈ చాలెంజ్ను స్వీకరించడంతో.. యూటర్న్కర్మథీమ్ చాలెంజ్ ఇప్పుడు వైరల్గా మారింది. కాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘యూటర్న్’ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్తోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్లు ఇతర పాత్రల్లో కన్పించనున్నారు. In love with this song. The karma theme from #UTURN . couldn't stop grooving .This one is for you @Samanthaprabhu2 .A fan of Jessy .All the best #uturn team i challenge… https://t.co/Xmqd9RTbuW — Naveen Chandra (@Naveenc212) September 8, 2018 The more i hear the more i love this song! This is for you sweetheart @Samanthaprabhu2 Tried my best and was kinda intimidated by all the amazing performances you are reposting 😝🙈… https://t.co/aOXRUouzw7 — LAVANYA (@Itslavanya) September 7, 2018 -
మలుపులో మిస్టరీ
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ హిట్ మూవీ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ మిస్టరీగా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్, ప్రమోషనల్ వీడియోకి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ్లో తెరకెక్కించాం. రెండు భాషల్లోనూ ఒకే రోజు విడుదల చేస్తున్నాం. సమంత నటన, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ పాత్రలు ఆకట్టుకుంటాయి. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి’’ అన్నారు. -
సెప్టెంబర్ 21న ‘నన్ను దోచుకుందువటే’
సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో ‘నన్ను దోచుకుందువటే’తో సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా వినాచక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’, సమంత ‘యు టర్న్’ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సుధీర్ బాబు తమ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. -
అలా చేయడం నాకు నచ్చదు
నాకు గ్లిజరిన్ వేసుకుని నటించడం నచ్చదని అన్నారు నటి సమంత. వివాహనంతరం అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ నాటి మేటి నటీమణులను గుర్తుకు తెస్తున్నారు. ఇటీవల సమంత తమిళ, తెలుగు భాషల్లో నటించిన చిత్రాలన్నీ సక్సెస్లే. అలాంటి నటి తాజాగా మరో మైల్రాయిని టచ్ చేశారు. ఇప్పటివరకూ స్టార్ హీరోలకు సపోర్టింగ్ పాత్రల్లోనే నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్న ఈ సుందరి తాజాగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఓకె చెప్తున్నారు. కన్నడంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న యూటర్న్ చిత్రం అదే పేరుతో సమంత కథానాయకిగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కింది. కన్నడ చిత్ర దర్శకుడు పవన్కుమార్నే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ సంస్థ అధినేత శ్రీనివాస సింధూరి, వీవై.కంబైన్స్, పీఆర్ 8 క్రియేషన్స్ అధినేత రాంబాబు బండారు కలిసి నిర్మిస్తున్న చిత్రం యూటర్న్. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆది, రాహుల్ రవీంద్రన్, నరేన్, భూవిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టెయిన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ధనుంజయన్ విడుదల చేయనున్నారు. చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చిత్ర దర్శకుడు పవన్కుమార్ మాట్లాడుతూ కన్నడ చిత్రం యూటర్న్ను మరింత మెరుగు పరిచి తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించినట్లు తెలిపారు. చిత్రం చివరి 30 నిమిషాలు చాలా థ్రిల్లర్గా ఉంటుందన్నారు. కన్నడంలో ట్రైలర్ విడుదల సమయంలోనే సమంత ఈ చిత్రం గురించి తనతో మాట్లాడారని, ఆమె కోసమే ఈ రీమేక్ చిత్రానికి తాను దర్శకత్వం వహించానని తెలిపారు. సమంత, రాహుల్ రవీంద్రన్ల నుంచి తాను తమిళ భాషను కొంచెం కొంచెం నేర్చుకున్నానని దర్శకుడు పవన్కుమార్ తెలిపారు. నటి సమంత మాట్లాడుతూ యూటర్న్ ట్రైలర్ విడుదల రోజే 2 మిలియన్ల వీయూస్ పొందిందని, అంత మంది ప్రేక్షకులు ఆదరిస్తారని తానూ ఊహించలేదని అన్నారు. ఇందులో హీరో, హీరోయిన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరన్నారు. కథే పెద్ద హీరో అని పేర్కొన్నారు. కన్నడ చిత్రం లూసియా చూసినప్పుడే ఆ చిత్ర దర్శకుడు పవన్కుమార్కు తాను వీరాభిమానిని అయిపోయానన్నారు. అప్పుడే ఆయన దర్శకత్వంలో ఒక చిత్రం చేయాలని ఆశపడ్డానన్నారు. ఈ చిత్రం ద్వారా అది నెరవేరడం సంతోషంగా ఉందని అన్నారు. యూటర్న్ థ్రిల్లర్ కథా చిత్రం మాత్రమే కాదని, ఇదే పెద్ద జర్నీ అని చెప్పారు. ఇందులో అన్ని రకాల భావోద్రేకాలు ఉంటాయన్నారు. అదే విధంగా చిత్ర షూటింగ్ను ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని తమిళంలో ధనుంజయన్ విడుదల చేయడంతో మంచి చేతిలో పడ్డట్టు భావిస్తున్నానన్నారు. తనకు యథార్థంతో కూడిన పాత్రల్లో నటించడం చాలా ఇష్టం అన్నారు. అదే తనని చిత్రంలోకి తీసుకొచ్చిందని చెప్పారు. యూటర్న్ చిత్రంలో ఎమోషన్ సన్నివేశాలు చాలా ఉంటాయని చెప్పారు. తనకు గ్లిజరిన్ వేసుకుని నటించడం నచ్చదన్నారు. అలా కష్టపడి ఒక సన్నివేశంలో నటించిన తరువాత మరో భాష కోసం అదే సన్నివేశంలో నటించాల్సి ఉంటుందని, అది చాలా ఛాలెంజ్ అనిపించిందని అన్నారు. హీరోల కష్టమేమిటో ఈ చిత్రంతో తాను అనుభవ పూర్వకంగా గ్రహించానని సమంత పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు శివ అతిథిగా పాల్గొన్నారు. నటుడు ఆది, రాహుల్ రవీంద్రన్, నిర్మాత ధనుంజయన్ చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. -
‘చై విత్ సామ్.. వర్సెస్ కాదు’
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్యలు త్వరలో వెండితెర మీద తలపడనున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యు టర్న్, నాగచైతన్య హీరోగా తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ ఆసక్తికరమైన పోటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత, చైతూల పెళ్లి సమయంలో చైసామ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో సందడి చేసింది. ఇప్పుడు అదే తరహాలో చై వర్సెస్ సామ్ (#chayVsSam) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన సమంత, చై వర్సెస్ సామ్ కాదు చై విత్ సామ్(#ChayWithSam) అంటూ కామెంట్ చేశారు. It’s Chay with Sam !! Not vs ❤️ https://t.co/nkGJJQygbR — Samantha Akkineni (@Samanthaprabhu2) 28 August 2018 -
చంపుతున్నది ఎవరు?
సాఫీగా సాగిపోతున్న జీవితంలో అనుకోని సంఘటన జరిగి, ఇబ్బందులు ఏర్పడితే లైఫ్ ఒక్కసారిగా ‘యు టర్న్’ అయింది అంటాం. అదే యు టర్న్ ఓ సినిమాకి కీలకమైంది. తప్పు దోవలో యు టర్న్ తీసుకున్నవాళ్లు చనిపోతుంటారు. చంపుతున్నది ఎవరు? అనే పాయింట్తో రూపొందిన కన్నడ చిత్రం ‘యు టర్న్’. అదే టైటిల్తో సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేశారు. పవన్కుమార్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్కు తెలుగు, తమిళ భాషల్లో 65 లక్షల వ్యూస్ వచ్చాయి. రెండు భాషల్లోనూ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 13న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నికేత్ బొమ్మి íసినిమాటోగ్రాఫర్, పూర్ణచంద్ర తేజస్వి స్వరకర్త. -
‘యు టర్న్’కు డేట్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ సమంత ఓ డిఫరెంట్ రోల్ నటిస్తున్న సినిమా యు టర్న్. కన్నడలో సూపర్ హిట్ అయిన యు టర్న్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన యు టర్న్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, తమిళభాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యువ నటుడు రాహుల్ రవీంద్రన్, సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పూర్ణ చంద్ర తేజస్వి సంగీతమందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్ బ్యానర్స్ పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్నారు. -
ఆ ప్రచారం సినిమా వాళ్లు చేసిందే: సమంత
తమిళసినిమా: అది సినిమా వాళ్లు చేసే పనేనని అంటోంది నటి సమంత. నటీమణుల్లో ఈ అమ్మడంత లక్కీ హీరోయిన్ ఈ తరంలో ఉండరేమో! పెళ్లికి ముందు ఆ తరువాత కూడా కథానాయకిగా బిజీగా అదే సమయంలో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న నటి సమంత. నిజం చెప్పాలంటే వివాహానంతరమే ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ఎక్కువ పేరు తెచ్చిపెడుతున్నాయి. అలా కథానాయకిగా దశాబ్దాన్ని చాలా సులభంగా అధిగమించేసింది. పదేళ్లుగా కథానాయకిగా నటించడాన్ని సాధారణంగానే భావిస్తున్న సమంత దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం. 10 ఏళ్లుగా కథానాయకిగా రాణించడానికి పెద్దగా భావిస్తున్నారు. నా మాదిరిగానే కొందరు కథానాయికలు నటిస్తున్నారు. నాటి కథానాయికలే సినిమాలో నిలదొక్కుకుని నిలిచారని అనేవారు, ఈ తరం నటీమణులు కూడా పది కాలాల పాటు నిలడతున్నారు అదేవిధంగా. వివాహంతో హీరోయిన్ల మార్కెట్ పడిపోతుందనే ఒక అపోహ ఉంది. దాన్ని బ్రేక్ చేయాలని భావించాను. అనుకున్నట్టుగానే బ్రేక్ చేశాను. వివాహానంతరం నేను నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. అదేవిధంగా పెళ్లి అనంతరం హీరోయిన్లకు ఆదరణ ఉండదనే ప్రచారం సినిమా వాళ్లు చేసిందే. నిజానికి ప్రేక్షకులు అలా భావించడం లేదు అన్నది నా చిత్రాల ద్వారా నిరూపణ అయ్యింది. నాకు ముందు కూడా పలువురు హీరోయిన్లు సాధించారు. మరో విషయం ఏమిటంటే నేనీ స్థాయికి ఎదగడానికి విమర్శలే కారణం. అవే మనల్ని ఎదగడానికి దోహదపడతాయి. పలాన పాత్రలో సమంత నటించలేదు అని ఎవరన్నా అంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని అలాంటి పాత్రలో నటించడానికి కఠినంగా శ్రమించడానికి సిద్ధ పడతాను. కాబట్టి విమర్శలే ఎదగడానికి సోపానాలు అని అంటున్న సమంత తాజాగా నటించిన హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం యూటర్న్, శివకార్తికేయన్కు జంటగా నటించిన సీమదురై షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల ఒక వారం గ్యాప్లో వరుసగా తెరపైకి రావడానికి ముస్తాబవు తున్నాయి. ఈ రెండు చిత్రాలపైనా అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. వీటిలో ఇటీవల విడుదలైన యూటర్న్ టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోందన్నది తెలిసిన విషయమే. -
‘యూటర్న్’ ట్రైలర్ విడుదల
-
కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా
‘‘యు టర్న్’ టీమ్ అంతా ఫ్రెండ్సే. ఓ ఫ్యామిలీలాగా కలిసిపోయి ఈ సినిమా చేశాం. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ‘లూసియా’ సినిమాతో దర్శకుడు పవన్కుమార్కి పెద్ద ఫ్యాన్ అయ్యాను’’ అని సమంత అన్నారు. ఆమె లీడ్ రోల్లో, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు. సమంత మాట్లాడుతూ – ‘‘అందరం సిన్సియర్గా చేసిన ప్రయత్నం ‘యు టర్న్’. నిర్మాతలు కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా. కానీ, వాళ్లు చక్కగా డీల్ చేశారు. మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘సమంత మంచి నటే కాదు.. మంచి మనిషి కూడా. నా చిత్రాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చిత్రమిది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘ఒకప్పుడు సమంతకు, ఇప్పటి సమంతకు చాలా తేడా కనపడుతోంది. నటిగా ఇంకా ఎదిగింది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘ఇంత మంచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ జర్నీ చాలా విషయాలను నేర్పింది. సమంతగారు మంచి నటి. ఆవిడతో పనిచేయడం హ్యాపీ’’ అన్నారు పవన్కుమార్. -
‘జెస్సీ’ సినిమాపై సుధీర్ బాబు క్యూట్ ట్వీట్
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూ టర్న్’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో జర్నలిస్టుగా నటిస్తున్న సమంత ఓ కేసు విషయమై పోలీసు స్టేషన్కు వెళ్లడం, ఆ ప్రమాదాలకు సమంతే కారణం అంటూ పోలీసులు ప్రశ్నించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ ట్రైలర్ చూసిన నాగార్జున, నాగ చైతన్య, రకుల్ప్రీత్, అఖిల్, రానాలు సామ్కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యూ టర్న్ విడుదల తేదీపై హీరో సుధీర్ బాబు ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘ చాలా ఏళ్లు గడిచాయి. కానీ జెస్సీ, జెర్రీల మధ్య ఫైట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ సెప్టెంబరు 13న మళ్లీ ఒకసారి పోటీ పడబోతున్నారు. అయితే ఒక్క విషయం యూ టర్న్ ట్రైలర్ అదిరిపోయింది. సామ్.. నీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ*.. సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. సామ్ ‘యూ టర్న్’ , సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలు ఒకేరోజు విడుదల కానున్న నేపథ్యంలో సుధీర్ బాబు చేసిన క్యూట్ ట్వీట్కు సమంత కూడా అంతే క్యూట్గా స్పందించారు. ‘అయ్యో అదేం లేదు... మనిద్దరికీ ఆల్ ద బెస్ట్... థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఏ మాయ చేశావే సినిమాలో సమంత సోదరుడిగా సుధీర్ బాబు నటించిన విషయం తెలిసిందే. Years passed,but still Jessy & Jerry continue 2 fight,#UTurn & #NannuDochukunduvate both on Sep13th😁 But I have to say,trailer is arresting, amazing, intriguing & interesting..In short,I am short of adjectives Sam👍Can't wait 2 watch @Samanthaprabhu2 @23_rahulr @AadhiOfficial https://t.co/AI3i2AWWs5 — Sudheer Babu (@isudheerbabu) August 17, 2018 Aiyooooo🤗🤗🤗 nooo .. all the very best to the both of us .. will be cheering for you .. Thankyou 🙏🙏🙏 https://t.co/v5sRyZgGCx — Samantha Akkineni (@Samanthaprabhu2) August 17, 2018 -
సర్ప్రైజ్ ఇవ్వకుండా ఉండలేవు కోడలా!
హైదరాబాద్ : టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున తన కోడలు, నటి సమంత లేటెస్ట్ మూవీ ట్రైలర్పై స్పందించారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూ టర్న్’ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఓ కేసు విషయంలో భాగంగా సమంత పోలీసు స్టేషన్కు వెళ్లడం, ఆ ప్రమాదాలకు సమంతే కారణం అంటూ పోలీసులు ప్రశ్నించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ ట్రైలర్ చూసిన నాగ్.. ‘వావ్, సర్ప్రైజ్ ఇవ్వకుండా ఉండలేవు కోడలా.. మూవీ యూనిట్కు ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు. తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు మామా అని డ్యాన్స్ చేస్తున్న ఎమోజీలతో స్యామ్ రీట్వీట్ చేశారు. లవ్ యూ అని సమంత భర్త, నటుడు నాగ చైతన్య ట్వీట్ చేయగా.. ట్రైలర్ బాగుందని.. మూవీ యూనిట్కు ఆల్ ది బెస్ట్ అని రకుల్ప్రీత్, అఖిల్, రానా స్పందించారు. వీరందరికీ సమంత థ్యాంక్స్ చెప్పారు. కాగా కన్నడలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ రీమేక్కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సమంతతో పాటు భూమిక ఓ కీలకపాత్రలో నటిస్తుండగా మిగతా పాత్రల్లో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కన్పించనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. (ఆసక్తి పెంచుతోన్న సమంత ‘యూ టర్న్’ ట్రైలర్) -
ఆసక్తి పెంచుతోన్న సమంత ‘యూటర్న్’ ట్రైలర్
సమంత ప్రధాన పాత్రలో ‘యూ టర్న్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ను ఈ రోజు(ఆగస్టు 17 ) విడుదల చేశారు. నేనిలా బార్ కౌంటర్లో ఇన్ని శబ్దాల మధ్య... అంటూ సమంత వాయిస్తో మొదలైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్నఈ మూవీలో సమంత పాత్రికేయురాలిగా నటిస్తున్నారు. ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరిగిన ఆక్సిడెంట్లకు సంబంధించిన విషయాల గురించి ఇన్వెస్టిగేట్ చేసేందుకు సమంత పోలీసు స్టేషన్కు వెళ్లడం, ఆ ప్రమాదాలకు సమంతే కారణం అంటూ పోలీసులు ప్రశ్నించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కాగా కన్నడలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ రీమేక్కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సమంతతో పాటు భూమిక ఓ కీలకపాత్రలో నటిస్తుండగా మిగతా పాత్రల్లో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కన్పించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న యూ టర్న్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. -
‘యూటర్న్’ సినిమా ట్రైలర్ విడుదల
-
యూ టర్న్ గీతాలు రెడీ
తమిళసినిమా: సెలబ్రిటీస్ చిత్ర వివరాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు ఆసక్తి కనబరుస్తుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా ఆ కోవలోకి చేరిన నటి సమంత. వివాహనంతరం అగ్రనటిగా కొనసాగుతున్న అరుదైన హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అంతే కాదు ఇప్పటి వరకూ హీరోలతో నాలుగు ప్రేమ సన్నివేశాలు, నాలుగు పాటలు అంటూ నటించేసిన సమంత వివాహానంతరం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా మారింది. అవును సమంత ప్రస్తుతం నటిస్తున్న యూ టర్న్ చిత్రం ఆ తరహా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రమే. కన్నడంతో సంచలన విజయం సాధించిన యూటర్న్ చిత్రాన్ని అదే పేరుతో సమంత హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఈ బ్యూటీ మరోసారి పాత్రికేయురాలిగా నటిస్తోంది. ఇప్పటికే మహానటి చిత్రంలో విలేకరిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న యూ టర్న్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. తాజాగా ఈ చిత్ర గీతాలను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్లు నటి సమంత తన ట్విట్టర్లో పేర్కొంది. యూ టర్న్ చిత్రం విడుదలైన వారంలోనే శివకార్తికేయన్తో సమంత నటించిన సీమరాజా చిత్రం తెరపైకి రానుంది. ప్రస్తుతం సమంత విజయ్సేతుపతితో సూపర్ డీలక్స్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. అదే విధంగా తెలుగులో భర్త నాగచైతన్యకు జంటగా ఒక చిత్రంలోనూ నటిస్తోంది. ఆ తరువాత ఒక కొరియా చిత్ర రీమేక్లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. విశేషం ఏమింటంటే ఇందులో సమంత 80 బామ్మగా కనిపించనుందట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇలా నటనకు అవకాశం ఉన్న అదే సమయంలో వ్యత్యాసంతో కూడిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ సమంత తన నట దాహాన్ని తీర్చుకుంటోందన్న మాట. -
ఆగస్టు 17న ‘యూ టర్న్’ ట్రైలర్
రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్నారు సమంత. ఈ ఏడాది ప్రథమార్దం సమంతకు కలిసి వచ్చింది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సమంత.. ద్వితీయార్దంలో కూడా సక్సెస్ సాధించడానికి రెడీ అవుతున్నారు. కన్నడ హిట్ మూవీ యూ టర్న్ సినిమాను అదే పేరుతో తెలుగులో సమంత రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, భూమిక కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ఆగస్టు 17న, సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కన్నడ వర్షన్ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ రీమేక్ను తెరకెక్కిస్తున్నారు. Trailer launch on the 17th of this month 😊Hope you guys are excited. Promising an edge of your seat thriller . A lucky few will be among the first to watch the trailer with us. @pawanfilms @AadhiOfficial @23_rahulr @SS_Screens @UTurnTheMovie #UTurnonSept13 #UTurnTrailerOnAug17 pic.twitter.com/20oX3v6Umi — Samantha Akkineni (@Samanthaprabhu2) August 11, 2018 -
ఎంత నమ్మకమో!
తమిళసినిమా: తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి సమంత. అంతే కాదు కన్న కలల్ని, కోరుకున్న వాటిని సాధించుకున్న నటి ఈ బ్యూటీ. సమంతలో ఆత్మ విశ్వాసం అధికం కావడానికి ఇవన్నీ కారణం కావచ్చు. చెన్నై పుట్టినిల్లు, హైదరాబాద్ను మెట్టినిల్లు చేసుకుని నటిగానూ, అర్థాంగిగానూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న సమంత లాంటి వారు అరుదనే చెప్పాలి. వివాహానంతరం అగ్రనటిగా రాణిస్తున్న ఈ అమ్మడు వరుస విజయాలను అందుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సుందరికి పిచ్చ పాపులారిటీ ఉంది. అందుకే తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న యూ టర్న్ చిత్రంలో నటిస్తున్నారు. ఈమెను హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల నాయకిగా ప్రమోట్ చేసిన చిత్రం ఇదే. కన్నడంలో సంచలన విజయాన్ని సాధించిన యూ టర్న్ చిత్రానికి ఇది రీమేక్. తమిళంలో శివకార్తికేయన్కు జంటగా సీమరాజా చిత్రంలోనూ సమంత నాయకిగా నటిస్తున్నారు. ఇంతకుముందు సమంత నటించిన నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి), విశాల్కు జంటగా నటించిన ఇరుంబుతిరై ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ రెండు చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. తాజాగా అలాంటి పరిస్థితి రిపీట్ కానుంది. సమంత నటించిన యూ టర్న్, సీమరాజా చిత్రాలు రెండూ సెప్టెంబరు 13న తెరపైకి రానున్నాయి. యూటర్న్ చిత్రంలో సమంత పత్రికా విలేకరిగా నటించారు. సీమరాజా గ్రామీణ నేపథ్యంలో సాగే కథా చిత్రం. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున తెరపైకి రానుండటం గురించి సమంత ఏమంటున్నారో చూద్దాం. యూ టర్న్, సీమరాజా రెండూ వేర్వేరు కథాంశాలతో కూడిన చిత్రాలు. యూ టర్న్ ఒక హత్య నేపథ్యంతో కూడిన కథా చిత్రం. సీమరాజా గ్రామీణ నేపథ్యంతో సాగే కథా చిత్రం. కాబట్టి రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని పేర్కొన్నారు. ఈ రెండు చిత్రాలపై ఎంత నమ్మకం లేకపోతే సమంత అంతగా చెబుతారు. ఈ బ్యూటీ నమ్మకం వమ్ము కాకూడదని కోరుకుందాం. -
బామ్మగా సమంత..?
పెళ్లి తరువాత సమంత సినిమాల ఎంపికలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాగచైతన్యతో వివాహం తరువాత రంగస్థలం, అభిమన్యుడు సినిమాలతో ఘన విజయం అందుకున్న సామ్, ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా ఓకె చెపుతున్నారు. ఇప్పటికే కన్నడ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న యు టర్న్ లో నటిస్తున్న సామ్, మరో డిఫరెంట్ మూవీ కి ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనున్నారట. 2014లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షాంటసీ జానర్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం యు టర్న్, సీమరాజా, సూపర్ డీలక్స్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత త్వరలో నాగచైతన్యతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారు. -
టీడీపీలో ‘యూ’ టెన్షన్ !
‘యూటర్న్..’ పేరు వింటేనే టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పది రోజులుగా ఆ పదం వాడకుండా ఏ సమావేశాన్ని ముగించడం లేదు. తాను యూటర్న్ తీసుకోలేదంటూ పార్టీ సమావేశాలు, టెలికాన్ఫరెన్స్ల్లో పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీన్నిబట్టే ‘యూటర్న్’ టీడీపీని ఎంత కలవరపాటుకు గురి చేస్తోందో తెలిసిపోతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. –సాక్షి, అమరావతి టర్నుల మీద టర్నులు ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న విభిన్న వైఖరులతో ఆయన ‘యూటర్న్’ల గురించి దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. గత ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని 15 ఏళ్లు కావాలని మోదీ సమక్షంలో కోరారు. తర్వాత బీజేపీతో కలసి అధికారాన్ని పంచుకుని హోదా అవసరం లేదని ప్రత్యేక ప్యాకేజీ అత్యుత్తమమని మాట మార్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి హోదానే కావాలంటూ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. హోదా కోసం పోరాడుతున్న యువతను బెదిరించిన నోటితోనే ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ కొత్త పాట పాడుతున్నారు. ‘యూటర్న్ అంకుల్’: తాను కారులో వెళ్తుంటే ఎక్కడ యూటర్న్ కనబడినా చంద్రబాబే గుర్తుకొస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన అనంతరం చంద్రబాబు యూటర్న్ల గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. ఫేస్బుక్, యూట్యూబ్, ఇతర మాధ్యమాల్లో బాబు యూటర్న్పై అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. గూగుల్లో ‘యూటర్న్ అంకుల్’ అంటే చంద్రబాబు ఫొటోలు, యూటర్న్ సింబల్తో ఉన్న ఫొటోలు దర్శనమిస్తుండడం విశేషం. ఇటీవల ప్రధాని మోదీ సైతం లోక్సభలో మాట్లాడుతూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు బీజేపీపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు. 40 ఏళ్లుగా బాబు యూటర్న్లు (సోషల్ మీడియాలో వైరల్గా మారాయి) 1978 - కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు 1983 - కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిన తరువాత ఆ పార్టీకి ఝలక్ ఇచ్చి టీడీపీలోకి జంప్ 1995 - సొంత మామ ఎన్డీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు 1998 - యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండగానే యూటర్న్తో ఎన్డీఏలో చేరిక 1999 - బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ 2004 - ఎన్నికల తర్వాత ఎన్డీఏకు హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చిన బాబు 2009 - టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐలతో కలిసి పోటీ, ఎన్నికలయ్యాక ఆ పార్టీలకు ఝలక్ 2014 - మళ్లీ ఎన్డీఏలో చేరిక 2018 -మరోసారి ఎన్డీఏకు ఝలక్ ఇచ్చి బయటకు వచ్చారు ప్రత్యేక హోదాపై బాబు యూటర్న్లు 2014 ఏప్రిల్ 29 - మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇస్తామంటున్నారు. 15 ఏళ్లు ఇవ్వాలని మోదీ గారిని కోరుతున్నా (తిరుపతి సభలో) 2015 ఆగస్టు 25 - ప్రత్యేక హోదా సంజీవని కాదు. (ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఢిల్లీలో) 2016 మే 17 - హోదాతో ఏమొస్తుంది? హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? 2016 సెప్టెంబర్ 15 - హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు, హోదాకు సంబంధం లేదు. 2017 ఫిబ్రవరి 3 - హోదా వేస్ట్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. 2018 మార్చి 2 - రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని టీడీపీ ఎప్పుడూ అనలేదు. 2018 మార్చి 10 - కేంద్రంపై వైఎస్సార్ సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వం. 2018 మార్చి 15 - వైఎస్సార్సీపీ అవిశ్వాసానికి మద్దతిస్తాం. 2018 మార్చి 16 - వైఎస్సార్ సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వం. మేమే అవిశ్వాసం పెడతాం. 2018 మే - రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 2018 జూలై 25 - ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. -
అభిమాని ట్వీట్కు సమంత ఫన్నీ రిప్లై
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత, సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వటంతో పాటు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ట్వీట్ చేసి ఫోటోపై సమంత ఆసక్తికరంగా స్పందించారు. ఓ వ్యక్తి సమంతను పెళ్లి చేసుకున్నట్టుగా గ్రాఫిక్స్ లో ఎడిట్ చేసిన ఫొటోను అల్లు అర్జున్ అడిక్ట్ (Allu Arjun Addict) అనే ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసి ఏంటిది..? అంటూ కామెంట్ చేశారు..? ఈ ఫొటోపై స్పందించిన సమంత ‘తొలి చూపులోనే ప్రేమించుకున్నాం, వారం క్రితం పారిపోయాం. ఈ ఫోటో ఎలా లీకైందో అర్థం కావట్లేదు’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. సమంత ఇచ్చిన రిప్లై పై సినీ ప్రముఖులు కూడా సరదాగా స్పందిస్తున్నారు. ఇటీవల యు టర్న్, సీమరాజ సినిమాల షూటింగ్ను పూర్తి చేసిన సమంత, సూపర్ డీలక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. Eloped last week .. don’t know how this leaked .. It was love at first sight https://t.co/wJxvLBXbCc — Samantha Akkineni (@Samanthaprabhu2) 29 July 2018 -
మిస్టరీ వీడిందా?
‘రంగస్థలం, అభిమన్యుడు, మహానటి’ చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకొని, నటిగా తన స్థాయిని పెంచుకున్న సమంత ‘యూ టర్న్’ చిత్రంతో మరోసారి తన నట విశ్వరూపం చూపనున్నారు. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ని ఆదివారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్గా, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సమంత ఇన్టెన్స్ లుక్స్, పెర్ఫార్మెన్స్ ‘యూ టర్న్‘ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. త్వరలోనే పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. సెప్టెంబర్ 13న మా సినిమాని తెలుగు, తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘యూ టర్న్’ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్. కాగా, సమంత తమిళంలో నటించిన ‘సీమరాజా’ చిత్రం కూడా సెప్టెంబర్ 13నే విడుదల కానుండటం విశేషం. -
సమంత ‘యూ టర్న్’ ఫస్ట్ లుక్
సమంత ప్రధాన పాత్రలో ‘యూ టర్న్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. సమంత డీ గ్లామరస్గా, సీరియస్గా కన్పిస్తున్న ఈ లుక్ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. కన్నడ మూవీ యూ టర్న్ రీమేక్గా అదే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. కన్నడలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ రీమేక్కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్నఈ మూవీలో ఓ కీలకపాత్రలో భూమిక నటించారు. మిగతా పాత్రల్లో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కన్పించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 13 న విడుదల చేయనున్నట్టు యూనిట్ సభ్యులు తెలిపారు. సమంత ఈ ఏడాది తెలుగులో మహానటి, రంగస్థలం చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
బాబు యూటర్న్ను బయటపెట్టిన ప్రధాని మోదీ
-
నేను అలా చేయను!
తమిళసినిమా: సాధారణంగా అయితే నేనలా చేయను అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్. పుట్టింది జమ్ముకశ్మీర్లో అయినా నటిగా మలయాళం, కన్నడం, తమిళం అంటూ చుట్టేస్తోందీ బ్యూటీ. కోహినూర్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన శ్రద్ధాశ్రీనాథ్కు కన్నడ చిత్రం యూటర్న్ బిగ్ టర్నింగ్నిచ్చింది. ఆ తరువాత తమిళంలో మాధవన్తో రొమాన్స్ చేసిన విక్రమ్ వేదా ఇంకాస్త గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతే అక్కడ నుంచి ఈ అమ్మడికి అవకాశాలు వరుస కట్టేస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో కాట్రు వెలియిడై చిత్రంలోనూ అతిథి పాత్రలో మెరిసిన శ్రద్ధాశ్రీనాథ్కు తాజాగా అరుళ్నిధితో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ఈ జాణ బదులిస్తూ ఎస్సీ.సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తనను ఎంపిక చేయాలన్న ఆలోచన చిత్ర దర్శక నిర్మాతలకు లేదంది. అనూహ్యంగానే అది జరిగిందని చెప్పింది. దర్శకుడు భరత్ నీలకంఠన్ కథా చర్చలకు బెంగళూర్ వచ్చారని చెప్పింది. అనుకోకుండా ఒక రోజు దర్శకుడి నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపింది. సాధారణంగా తాను రాత్రి వేళల్లో కథలను విననంది. అయితే దర్శకుడు బెంగళూర్ వచ్చిన కారణంగా ఒక రోజు రాత్రి ఆయన్ని కలిసి కథ విన్నానని చెప్పింది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ దర్శకుడు కథను వినిపించారని ఆమె ఈ సందర్భంగా తెలిపిం ది. కథలోని ప్రతి సన్నివేశాన్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడంతో అప్పుడే నాకు ఆ చిత్రంలో నటించాలన్న ఆసక్తి కలిగిం దని ఆమె అంది. దీన్ని థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పలేమని, ఇంటెలిజెన్సీ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత డ్రామాతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని ఆమె పేర్కొంది. ఈ చిత్ర టైటిల్ను, ఫస్ట్లుక్ పోస్టర్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు భరత్ నీలకంఠన్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. అరుళ్నిధి, శ్రద్ధాశ్రీనాథ్ వంటి పాపులర్ జంటతో ఈ చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
బాగా పరిశీలించాకే నిర్ణయం
న్యూఢిల్లీ: భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377కు సంబంధించి చట్టబద్ధమైన ప్రామాణికతను అన్ని రకాలుగా పరిశీలించాకే రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. భారత్లో స్వలింగ సంపర్కులపై తీవ్ర వివక్షకారణంగా అది వారి మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిందని అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే 158 ఏళ్ల నాటి సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ధర్మాసనం సెక్షన్ 377 రద్దుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తమకే వదిలేసినప్పటికీ రాజ్యాంగపరంగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా సెక్షన్ 377ను కొనసాగించాలని, దీనిపై ప్రజాభిప్రాయం సేకరించాలని న్యాయవాదులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని దానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనేది చూడాలని అభిప్రాయపడింది. కేంద్రం యూ టర్న్ తీసుకుందనడం సబబు కాదు కేంద్రం ఈ కేసులో ‘యూ టర్న్’ తీసుకుందన్న న్యాయవాదుల ఆరోపణను, వారి వ్యతిరేకతను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అయితే గోప్యతా హక్కుతో పాటు పలు తీర్పులను పరిగణనలోకి తీసుకుని చూస్తే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ‘యూ టర్న్’గా అభివర్ణించడం సబబు కాదని పేర్కొంది. -
సాంగ్స్ టర్న్
‘రంగస్థలం, మహానటి’ చిత్రాల తర్వాత తెలుగులో సమంత నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని, పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అన్నారు. నరేన్, రవి ప్రకాష్, బిర్లా బోస్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్. -
తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దంలా.. : సమంత
ఈ ఏడాది ప్రథమార్థం సమంతకు బాగా కలిసొచ్చింది. కేవలం సినిమాలు విజయవంతం కావడమే కాదు.. నటిగానూ ఎంతో పేరు వచ్చింది. రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా అలరించిన సమంత, మహానటిలో మధుర వాణీ పాత్రలో జీవించారు. ఇవి రెండూ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలే. రీసెంట్గా వచ్చిన అభిమన్యుడు సినిమా కూడా విజయవంతంగా దూసుకెళ్తోంది. మరి ద్వితీయార్థం సమంతకు ఎలా ఉంటుందో చూడాలి. సెకండాఫ్ కూడా విజయాలను ఇస్తుందని చాలా నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు సమంత. ఇదే విషయమై సమంత స్పందిస్తూ.. ‘తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దంలా..... ఫస్ట్ హాఫ్ సక్సెస్ అయినట్లు సెకండాఫ్ కూడా ఉండబోతోంది... యూ టర్న్ మూవీకి డబ్బింగ్ మొదలైంది’ అంటూ ట్వీట్ చేశారు. కన్నడ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. The calm before the storm !! Prepping for the second half of the year ,after an amazing first half 💪. #SuperDeluxe #Uturn #Seemaraja Dubbing begins !! pic.twitter.com/bKZ7YS4Enp — Samantha Akkineni (@Samanthaprabhu2) June 7, 2018 -
ఏ టర్న్?
‘‘నా దృష్టిలో ఫిట్నెస్ అంటే ఎట్రాక్టివ్గా కనిపించేందుకు చేసే వర్క్ కాదు. క్రమశిక్షణ, గౌరవం, ఆత్మవిశ్వాసం.. ఇవన్నీ ఎక్స్ర్సైజ్ వల్ల ఏర్పడతాయి’’ అంటున్నారు సమంత. ‘హమ్ ఫిట్ తో హై ఇండియా ఫిట్’ కాన్సెప్ట్లో భాగంగా సమంత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమె ఫిట్నెస్కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ఒకటీ రెండు కాదు ఏకంగా పది కేజీల బరువును వీపుపై ఉంచుకుని ఎక్స్ర్సైజ్ చేశారు సమంత. సినిమాల విషయంలోనే కాదు... ఫిట్నెస్ విషయంలోనూ ఆమె డెడికేషన్ అదుర్స్ కదూ. ఈ సంగతి ఇలా ఉంచితే... ఇన్సెట్లో ఉన్న ‘యు–టర్న్’ సినిమా ఫొటోను చూడండి. లైఫ్టా, రైటా? ఏ టర్న్ తీసుకోవాలి? అని ఆలోచిస్తున్నట్లున్నారు సమంత. మరి ఫొటోలో కనిపిస్తోన్న సమంత, పాప, భూమిక ఎక్కడికి వెళ్లారు? అనేది ‘యు–టర్న్’ సినిమాలో చూద్దాం. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో కన్నడ హిట్ మూవీ ‘యు టర్న్’ తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ వెర్షన్ డైరెక్టర్ పవన్ కుమార్నే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. జర్నలిస్ట్ పాత్రలో సమంత, పోలీసాఫీసర్ పాత్రలో ఆది కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 50 పర్సెంట్కి పైగా కంప్లీట్ అయిందని సమాచారం. అన్నట్లు ఫోటోలో సమంత, భూమికల మధ్య ఉన్న పాప... సినిమాలో భూమికకు కూతురట. -
‘యూ టర్న్’ లో జర్నలిస్ట్గా సామ్
రంగస్థలం, మహానటి సినిమాలతో ఈ వేసవిలో అభిమానులకు సమంత కనులవిందు చేశారు. ప్రస్తుతం ఆమె... విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే తమిళ్లో విడుదలై సంచనాలు సృష్టిస్తోంది ఈ సినిమా. ప్రస్తుతం సమంత ఓ కన్నడ రీమేక్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ మూవీ ‘యూ టర్న్’ ను అదే పేరుతో తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్లో సమంత జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్నఈ మూవీలో ఓ కీలకపాత్రకు భూమికను తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. కన్నడలో తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ రీమేక్కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. -
సమంతను ఇంప్రెస్ చేసిన తాతయ్య
స్టార్ హీరోయిన్ సమంత షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా.. అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. తన సినిమాల అప్డేట్స్ తో పాటు సరదా సంగతలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను ఖుషీ చేస్తుంటారు. తాజాగా సామ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ట్విటర్లో ఓ వ్యక్తి తన తాతయ్య రంగస్థలం సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాట పాడిన వీడియోను సమంతను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘సమంత సిస్టర్.. మీ పాట ఎంతో పాపులర్. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ మీ పాట పాడుకుంటున్నారు. తాతయ్య రాకింగ్. అద్భుతమైన పాట ఇచ్చినందకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై వెంటనే స్పందించిన సమంత ‘మేడ్ మై డే’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం యూటర్న్ షూటింగ్లో బిజీగా ఉన్న సామ్, త్వరలో నాగచైతన్యతో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. 😂😂😂made my day https://t.co/QMhN4UHhWj — Samantha Akkineni (@Samanthaprabhu2) 26 May 2018 -
మహానటిలా సమంత..!
మహానటి సినిమాలో సావిత్రి పరిచయ సన్నివేశానికి అద్భుతమైన స్పందన వచ్చింది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా గ్లిజరిన్ లేకుండానే సావిత్రి ఒక కంటి నుంచి కన్నీరు కార్చినట్టుగా తెరకెక్కించిన ఈ సన్నివేశానికి థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. అయితే ఇలాంటి సంఘటనే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యు టర్న్’ సినిమా సెట్లో జరిగింది. ఈ విషయాన్ని నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు యాక్షన్ చెప్పగానే ఎలాంటి గ్లిజరిన్ లేకుండానే సమంత కన్నీళ్లు కార్చేసిందట. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన రాహుల్ ట్విటర్లో తన అనుభవాన్ని వివరించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన యు టర్న్ సినిమా తెలుగులో సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు వర్షన్ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. Our director just has to call action and this girl @Samanthaprabhu2 can sob her heart out on cue... and how! No glycerin nothing. Sammo... cut! 😄😄🙌🏽🙌🏽 #UTurn — Rahul Ravindran (@23_rahulr) 23 May 2018 -
హోదా విషయంలో మరోసారి మెత్తబడ్డ చంద్రబాబు
-
యూటర్న్ అంకుల్ అనడంలో తప్పు లేదు..
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తమ పార్టీ నాయకులతో మాటల దాడి చేయిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి తీరును బాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీల అవినీతి భాగోతాన్ని విజయసాయి రెడ్డి ఎక్కడ బయటపెడతారో అన్న భయం తెలుగు దేశం పార్టీకి, నాయకులకు నిద్ రలేకుండా చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏది చేప్తే అది ఊదరగొట్టే ఎల్లో మీడియాతో ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న విజయసాయి రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై పూటకో మాట మాట్లాడే చంద్రబాబును యూటర్న్ అంకుల్ అనడంలో తప్పు లేదని అన్నారు.