union budget 2016-17
-
ఇక లగ్జరీలన్నీ మరింత ప్రియం
రూ. 10 లక్షల కన్నా ఖరీదైన కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీరు కారు ధర కంటే ఒక శాతం అదనపు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. 2016-17 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై లగ్జరీ పన్నును జూన్ 1నుంచి విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టాక్స్ పన్నును అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ అదనపు పన్నును కారు అమ్మకం దారుడు వసూలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్ షోరూం ధరలను బట్టి ఈ పన్ను విధిస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. అదేవిధంగా లగ్జరీ పన్నుతో పాటు కృషి కల్యాణ్ సెస్ పేరిట సర్వీసు పన్నులపై అదనంగా 0.50 శాతాన్ని అదనపు పన్నును వసూలు చేయనున్నారు. దీంతో ఇకనుంచి బయట రెస్టారెంట్లలో భోజనం చేయడం, ట్రావెలింగ్, ఇన్సూరెన్స్ , ప్రాపర్టీ కొనుగోలుకు ఫోన్లు చేయడం వంటివి ప్రియం కానున్నాయి. కృషి కల్యాణ్ సెస్ పేరిట 0.50 సర్వీసు పన్నును పెంచడంతో ఇప్పడివరకూ ఉన్న సర్వీసు టాక్స్ రేటు 14.5 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. గతేడాదే ఈ సర్వీసు టాక్స్ లను ఆర్థికమంత్రి పెంచారు. 12.36 గా సర్వీసు పన్నులను 14 శాతానికి చేశారు. స్వచ్ఛ్ భారత్ పేరిట మరోమారు 0.50 శాతం పెంచారు. ఈ ఏడాది కృషి కల్యాణ్ పేరిట మరో 0.50 శాతం అదనంగా సెస్ విధించనున్నట్టు అరుణ్ జైట్లీ బడ్జెట్ లో తెలిపారు. -
నిరసనల మధ్య జైట్లీ ప్రసంగం
స్మృతి ఇరానీపై హక్కుల తీర్మానం కోసం విపక్షాల ఆందోళన గందరగోళం మధ్యే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన జైట్లీ న్యూఢిల్లీ :బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున లోక్సభలో మునుపెన్నడూ లేని అసాధారణ పరిస్థితుల్లో.. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య.. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ బలవంతంగా ప్రసంగం ప్రారంభించాల్సి వచ్చింది. సోమవారం సభలో బడ్జెట్ ప్రసంగం చేయటానికి జైట్లీ లేచి నిలుచోగానే.. హెచ్సీయూలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య విషయమై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ తాము ఇచ్చిన హక్కుల తీర్మానాల అంశాన్ని కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు లేవనెత్తారు. ఆ అంశం పరిశీలనలో ఉందని స్పీకర్ సుమిత్రామహాజన్ చెప్పినప్పటికీ.. వారు దానిని ప్రస్తావిస్తూనే ఉండటంతో గందరగోళం తలెత్తింది. బడ్జెట్ సమయంలో ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుధ్వజమెత్తారు. మధ్యలో కూర్చుని ప్రసంగించిన జైట్లీ... లేత నీలి రంగు కుర్తాపై, కొంత ముదురు నీలి రంగు జాకెట్ ధరించిన జైట్లీ.. గంటన్నరకు పైగా ప్రసంగం కొనసాగించారు. ఆయన 20 నిమిషాలు ప్రసంగించాక.. కూర్చుని ప్రసంగాన్ని కొనసాగించవచ్చని స్పీకర్ సూచించారు. బడ్జెట్కు తొమ్మిది మూల స్తంభాలు... భారతదేశాన్ని రూపాంతరీకరించాలన్న తమ అజెండాలో భాగంగా.. తొమ్మిది విభిన్న మూల స్తంభాలపై ఆధారపడి బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు జైట్లీ వివరించారు. అవేమిటంటే... 1) వ్యవసాయం - రైతుల సంక్షేమం, 2) గ్రామీణ రంగం, 3) ఆరోగ్యపరిరక్షణ సహా సామాజిక రంగం, 4) విద్య - నైపుణ్యాలు - ఉపాధి కల్పన, 5) మౌలిక సదుపాయాలు - పెట్టుబడులు, 6) ఆర్థిక రంగ సంస్కరణలు, 7) పరిపాలన - వాణిజ్యం సులభతరం చేయటం, 8) ఆర్థిక క్రమశిక్షణ, 9) పన్ను సంస్కరణలు. గ్రామీణ ఆదాయం, మౌలిక సదుపాయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ సంక్షోభం అతి పెద్ద సవాలంటూ.. గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం, గ్రామీణ ఆదాయాన్ని పెంపొం దించటం కేంద్ర బడ్జెట్ లక్ష్యాలని జైట్లీ తెలిపారు. బడ్జెట్లో ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అనే వర్గీకరణను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తొ లగించనున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రభుత్వ వ్యయం లో రెవెన్యూ, పెట్టుబడి (కేపిటల్) వర్గీకరణపై మ రింత దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని వివరించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను తొలగిస్తామని.. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు ఒకే తరహాలో ఉండేలా రాష్ట్రాల ఆర్థిక శాఖలతో కలిసి పనిచేస్తామని జైట్లీ తెలిపారు. రాహుల్ సూచనకు సరే.. ♦ గత యూపీఏ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను పాడైపోయిన స్థితిలో తమకు అప్పగించిందని, ఎన్డీఏ ప్రభుత్వం దానిని సరిచేసిందని చెప్తూ జైట్లీ.. ఁకష్టీ చలానే వాలో నే జబ్ దీ పట్వార్ హమే.. ఇన్ హాలాత్ మే ఆతా హై దరియా పార్ కర్నా హమే* (ఓడ తెడ్డును మా చేతికి అందించినపుడు.. ఈ పరిస్థితుల్లో నదిని దాటటం ఎలాగో మాకు తెలుసు) అటూ ఉర్దూ కవితను ఉదహరించారు. ♦ ఒక సందర్భంలో తమను ఆకాశ (ఆస్మానీ) శక్తులు, రాజ్య (సుల్తానీ) శక్తులు ఇబ్బందులు పెట్టాయని జైట్లీ వ్యాఖ్యానించారు. అయితే దానిని వివరించలేదు. ♦ దళిత పారిశ్రామికవేత్తల గురించి జైట్లీ తన ప్రసంగంలో ప్రస్తావించినపుడు.. కాంగ్రెస్ సభ్యులు దళిత విద్యార్థి రోహిత్ వేముల అంశాన్ని లేవనెత్తటం వినిపించింది. ♦ బ్రెయిలీ పేపర్పై దిగుమతి సుంకాన్ని తొలగించాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సూచనలను తాను అంగీకరించినట్లు జైట్లీ పేర్కొన్నపుడు.. సభలోనే ఉన్న రాహుల్ నవ్వుతూ కనిపించారు. బడ్జెట్ హైలైట్స్ ⇔ ఎఫ్డీఐ పాలసీలో గణనీయమైన మార్పులు చేయటం ద్వారా సాధారణ బీమా కంపెనీల లిస్టింగ్కు, బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్కరణలకు తెర తీయటం. ⇔ సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహకానికి పరంపరాగత్ కృషి వికాస్ యోజన ⇔ మొత్తం గ్రామీణ రంగానికి రూ.87,675 కోట్ల కేటాయింపు. ⇔ పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.2.87 లక్షల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ⇔ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు ⇔ విద్య, ఆరోగ్యం, సామాజిక రంగానికి రూ.1,51,581 కోట్ల కేటాయింపు. ⇔ 2016-17లో ప్రధానమంత్రి జన ఔషధి కార్యక్రమం కింద 3000 స్టోర్ల ఏర్పాటు. ⇔ ఫైనాన్షియల్ కంపెనీల వివాదాల పరిష్కారానికి సమగ్ర నియమావళి. ⇔ ముద్ర యోజన కింద మంజూరీ లక్ష్యం రూ.1.8 లక్షల కోట్లకు పెంపు. ⇔ ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఈడీఏ, నాబార్డ్ల ద్వారా రూ. 31,300 కోట్ల ఇన్ఫ్రా బాండ్లు ⇔ 2017 మార్చి నాటికి 3 లక్షల రేషన్ డిపోల్లో ఆటోమేషన్. ⇔ స్టార్టప్లకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి కంపెనీల చట్టం సవరణ. ⇔ ఏప్రిల్, 2016 నుంచి మార్చి 2019 మధ్య ఏర్పాటు చేసిన స్టార్టప్లకు మూడు నుంచి ఐదేళ్ల పాటు లాభాల్లో పూర్తి మినహాయింపు ⇔ సంవత్సరానికి రూ.10 లక్షలకు మించి డివిడెండ్ గనక తీసుకుంటే మొత్తం డివిడెండ్పై అదనంగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇔ రూ.2 లక్షలకు పైబడి ఏవైనా వస్తువులు, సేవలు కొన్నా... రూ.10 లక్షలకు పైబడిన లగ్జరీ కార్లు కొన్నా... అక్కడికక్కడే 1 శాతం టీడీఎస్ ⇔ ఆప్షన్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.017 నుంచి 0.05కు పెంపు ⇔ అన్ని సేవలపై రైతులు, వ్యవసాయ సంక్షేమం నిమిత్తం 0.5 శాతం సెస్సు ⇔ రూ.1000 మించిన రెడీమేడ్ గార్మెంట్లపై ఎక్సయిజు పన్ను 2 శాతానికి పెంపు ⇔ బీడీ మినహా పొగాకు ఉత్పత్తులపై ఎక్సయిజు సుంకం 15 శాతానికి పెంపు. ⇔ బ్లాక్మనీ వెల్లడికి 4 నెలల సమయం. ఆ బ్లాక్మనీపై 45% పన్ను, వడ్డీ. ⇔ బొగ్గు, లిగ్నైట్లపై క్లీన్ ఎనర్జీ సెస్ టన్నుకు 200 నుంచి రూ. 400కు పెంపు. ⇔ 2017-18 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం జీడీపీలో 3 శాతం ⇔ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం రూ. 25 వేల కోట్లు -
నువ్వు నేను జైట్లీ
చదివింది ఢిల్లీ పార్లమెంట్లో అయినా ఈ సారి బడ్జెట్ తిరిగింది మాత్రం మన ఊరి చుట్టూనే. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేరుగా ఊళ్లోకొచ్చేశారు. గ్రామీణ రంగానికి భారీ కేటాయింపులతో పాటు... పంచాయతీలు, మున్సిపాలిటీలను పరిపుష్టం చేయడానికి ఏకంగా 2.87 లక్షల కోట్లు కేటాయించారు. రెండేళ్లలో కరెంటు లేని గ్రామం ఉండదని, మూడేళ్లలో 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కంప్యూటర్ విద్య అందిస్తామని హామీ ఇచ్చారు జైట్లీ. ప్రతి గ్రామానికీ రోడ్డు వేయటమే కాక... నిరుపయోగంగా ఉన్న ఎయిర్పోర్టులూ వాడకంలోకి తెస్తారట. ఇవన్నీ జరిగితే.. మన ఊరు... ఇదిగో ఈ చిత్రంలోలానే పచ్చగా కళకళలాడుతుంది. నిరుపేదకు సుస్తీ చేస్తే..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైతే వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ తెచ్చారు. మరి మిగతా రాష్ట్రాల సంగతో!!. ఒకరకంగా ఇపుడిది దేశమంతటా విస్తరించనుంది. కుటుంబానికి లక్ష రూపాయల వరకూ బీమా కల్పిస్తారు. వృద్ధులకైతే ఇది 1.3 లక్షలు. అంతేకాదు! చౌక మందుల కోసం మరిన్ని జన ఔషధి స్టోర్లొస్తాయి. కిడ్నీ వ్యాధుల బారినపడ్డవారి సంఖ్య పెరగటంతో జాతీయ డయాలసిస్ ప్రోగ్రామ్ కూడా రాబోతోంది. పెద్దలకు గౌరవం ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచి పింఛను కోసం దాచుకుని... తీరా తీసుకునేటపుడు పన్ను కట్టాలంటే... అదీ రిటైరైన సమయంలో!! ఆ బాధ మామూలుగా ఉండదు. జైట్లీకి అర్థమై ఉండొచ్చు. ఎన్పీఎస్లో ఆ భారం తొలగించారు. పింఛనుకోసం కట్టే బీమా పాలసీలపై కూడా సేవా పన్ను తగ్గించారు. కట్టెలపొయ్యి అక్కర్లేదిక.. గ్యాస్ పొయ్యి ఉన్నోళ్లంతా గొప్పోళ్లు కాదిక. ప్రతి ఒక్కరికీ గ్యాస్ ఇవ్వటానికి రూ.2 వేల కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కోటిన్నర మందికి... ఐదేళ్లలో 6 కోట్ల మందికి గ్యాస్ పొయ్యిలందుతాయి. ఆధార్ ద్వారా పథకాలన్నీ నేరుగా చేరేలా దానికి చట్టబద్ధత కల్పిస్తారు. ఊళ్లలోకి విదేశీ నిధులు కూడా..! వ్యవసాయానికి విదేశీ నిధుల దన్ను కూడా దొరకబోతోంది. ఎందుకంటే దేశంలో ఆహార పదార్థాల ఉత్పత్తి, తయారీ కార్యకలాపాలకు 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతిస్తారు. అది కూడా నేరుగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డే అనుమతిస్తుంది. ఆహారధాన్యాల ధరల్లో హెచ్చుతగ్గుల్ని నియంత్రించడానికి రూ.900 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కూడా. ఉద్యోగాల కోసం.. ఉద్యోగుల కోసం కంపెనీలు పీఎఫ్ భారం లేకుండా కొత్తగా ఉద్యోగాలివ్వటానికి... మూడేళ్ల పాటు కేంద్రమే యాజమాన్య పీఎఫ్ వాటాను చెల్లిస్తుంది. యువతలో స్కిల్స్ అభివృద్ధి చేయటానికి శిక్షణ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. సొంత కంపెనీలు పెట్టేలా ప్రోత్సహించడానికి మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులూ రానున్నాయి. స్కూల్ చలే హమ్.. స్కూలు మారినప్పుడల్లా ఓ సర్టిఫికెట్. ఫస్టొస్తే ఒకటి... సెకండొస్తే మరొకటి. మార్కుల జాబితాలూ అంతే! స్కూళ్లు మారుతున్నపుడు, జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లినపుడు... తీసుకెళ్లాల్సిందే. ఇక బీమా పాలసీల్లా, కంపెనీ షేర్లలా వీటినీ డిజిటల్ రూపంలో దాచుకోవచ్చు. దీనికి డిజిటల్ డిపాజిటరీ వస్తోంది. ఇంకా 62 నవోదయ స్కూల్స్ వస్తాయి. రూ.1000 కోట్లతో ఉన్నత విద్యకు ఫైనాన్సింగ్ ఏజెన్సీ కూడా పెడతారు. జై కిసాన్.. నిజం! ఈ బడ్జెట్లోనైతే రైతే రాజు. పంట పండుతుందో లేదోననే భయం ఉన్నా... పథకాల పంట మాత్రం పండింది. నష్టపోతే ఆదుకోవటానికి బీమా పథకం. 28.5 లక్షల ఎకరాల కోసం సాగునీటి పారుదల పథకం. బోర్లు ఎండి పోకుండా.. భూగర్భ జలవనరుల పథకం. సేంద్రీయ సాగు ప్రోత్సాహానికి మరో పథకం. దీర్ఘకాలంగా సాగుతూ ఉన్న 89 ప్రాజెక్టులిక శరవేగంగా పూర్తవుతాయి. వర్షాభావ ప్రాంతాల్లో 5 లక్షల చెరువులు, బావులు తవ్వుతారు. సేంద్రీయ ఎరువుల తయారీకి 10 లక్షల కంపోస్ట్ గుంతల్నీ ఏర్పాటు చేస్తారు. వచ్చే మార్చికల్లా 14 కోట్ల భూ కమతాలకూ భూసార ఆరోగ్య కార్డులొస్తాయి. చిన్నకంపెనీ పెద్ద రిలీఫ్ ఊళ్లలో ఉన్నా, సిటీల్లో ఉన్నా... చిన్న కంపెనీలు ఇక ఖాతా పుస్తకాలు రాయక్కర్లేదు. టర్నోవరు మాత్రం రూ. 2 కోట్లలోపుంటే చాలు. డాక్టరుతో సహా వృత్తి నిపుణులకూ ఈ రిలీఫ్ ఇచ్చారు. వారి సంపాదన ఏడాదికి 50 లక్షలు మించకూడదు. చిన్న ఉద్యోగికి ఊరటే... నెల జీతం 41వేలు లోపుంటే.. ఏడాదికి మరో 3వేలు మిగులుతుంది. కాస్త రిబేటు పెంచారు లెండి. హెచ్ఆర్ఏ కంపెనీ ఇవ్వకపోతే... అలాంటివారికి కూడా కాస్త ఊరటనిచ్చారు. పెరిగిన ధరలతో పోలిస్తే ఇదేం మూలకనే పెదవి విరుపు చిరుద్యోగి సొంతం మరి. కారు మబ్బులు.. ఊళ్లోకి రాకుండా దూరంగా వె ళ్లే కారును, శ్రీమంతుల్ని కూడా జైట్లీ వదల్లేదు. కార్లపై సెస్సులు వేసి ధరలు పెంచారు. ఏటా రూ.కోటి ఆదాయం దాటే వారిపై మరో 3 శాతం సర్చార్జీ వడ్డించారు. పెట్టుబడులపై డివిడెండ్లు అందుకునేవారినీ బాదారు. ‘పాడికీ పథకాలు’ మన ఒంగోలు గిత్తల్లా కొన్ని పశు జాతులు అంతరించిపోతున్నాయి. అందుకే వీటికి జాతీయ జినోమిక్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పశుధన్ సంజీవని, నకుల్ స్వాస్థ్య పాత్ర, ఈ-పశుధన్ హాత్ వంటి పథకాలనూ ప్రకటించారు. -
తయారీ సంస్థలకు తోడ్పాటు
పారిశ్రామిక కార్యకలాపాలను ప్రోత్సహించటం, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేందుకు బడ్జెట్లో కొత్త తయారీ యూనిట్లకు తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ విధించేలా ప్రతిపాదనలు చేశారు. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చి 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త తయారీ యూనిట్లకు కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతమే (సర్చార్జి, సెస్సులు అదనం) ఉంటుంది. దీన్ని పొందాలంటే ఆయా సంస్థలు.. లాభాలు, పెట్టుబడుల ఆధారిత డిడక్షన్లు మొదలైనవి క్లెయిమ్ చేసుకోకూడదు. మరోవైపు, రూ. 5 కోట్ల టర్నోవరు ఉండే చిన్న యూనిట్లకు దీన్ని 30 శాతం నుంచి 29 శాతానికి (సర్చార్జి, సెస్సు అదనం) తగ్గించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ను నాలుగేళ్లలో దశలవారీగా 25 శాతానికి తగ్గించే దిశగా చర్యలు ప్రతిపాదించినట్లు చెప్పారు. కొత్త సెజ్ యూనిట్లు.. సెక్షన్ 10ఏఏ ప్రయోజనాలు పొందాలంటే 2020 మార్చి 31 నాటికల్లా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. -
కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ఊరట
దేశంలో ఉపాధి కల్పన పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. కొత్త ఉద్యోగులకు కంపెనీల బదులు ప్రభుత్వమే ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ (ఈపీఎస్)కు 8.33 శాతం మొత్తాన్ని జమచేయనున్నది. ఉపాధి కల్పనకు ఊతమిచ్చేదిశగా ఆర్థిక మంత్రి జైట్లీ ఈ ప్రతిపాదన చేసారు. ఉద్యోగి నియామకం తర్వాత మూడేళ్ల వరకూ ప్రభుత్వం ఈ చెల్లింపు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. రూ. 15,000లోపు వేతనంతో నియమించుకునే కొత్త ఉద్యోగులకు 8.33 శాతం ఈపీఎఫ్ను కంపెనీల తరపున ఇక మీదట ప్రభుత్వమే చెల్లించడం కంపెనీలకు ఊరటనిచ్చే అంశం. కాగా ఉపాధి పెరుగుదల కోసం 2016-17 చివరి నాటికి 100 మోడల్ కెరీర్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తామని జైట్లీ ప్రకటించారు. స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజెస్, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ను అనుసంధానం చేస్తామని తెలిపారు. -
కరెన్సీ కింగ్లు
120 కోట్ల మంది కోసం ప్రవేశపెట్టే దేశ బడ్జెట్ ప్రపంచంలోని మొదటి నలుగురు కుబేరుల ఆస్తితో దాదాపు సమానం. టాప్ 5 బిలియనీర్ల జాబితా పరిశీలిస్తే.. ( రూ. కోట్లలో) బిల్గేట్స్ 5,38,560 అమెరికాకు చెందిన బిల్గేట్స్ మెక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత. 1995 -2006 మధ్య, 2009లో ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. కార్లొస్ స్లిమ్ హెలు 5,24,280 మెక్సికోకు చెందిన ఈ టెలికం దిగ్గజం 2010-13 మధ్య ఫోర్బ్స్ ధనవంతుల్లో చోటు దక్కించుకున్నారు. వారెన్ బఫెట్ ఆఫ్ మెక్సికోగా పేరు పొందారు. వారెన్ బఫెట్ 4,94,360 ప్రపంచంలో విజయవంత మైన పెట్టుబడిదారుల్లో మొదటిస్థానం అమెరికాకు చెందిన బఫెట్దే... బెర్క్షైర్ హతవేకు ఈయన ఛైర్మన్, సీఈవోగా ఉన్నారు. అమాన్షియో ఓర్టెగా 4,38,600 స్పెయిన్కు చెందిన అమాన్షియో.. ఇండిటెక్స్ ఫ్యాషన్ గ్రూపునకు వ్యవస్థాపక ఛైర్మన్.. అక్టోబర్, 2015న ఫోర్బ్స్ బిలియనీర్లలో మొదటిస్థానం దక్కించుకున్నారు. లారీ ఎల్లిసన్ 3,69,240 అమెరికాకు చెందిన ఎల్లిసన్ ఒరాకిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీటీఓగా ఉన్నారు. ఒరాకిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన సీఈవోగానూ పనిచేశారు. -
రూ. 10,000 కోట్లు రాయితీల్లో కోత ఇదీ...
ఆహార సబ్సిడీ రూ.1.39 లక్షల కోట్ల నుంచి రూ.1.34 లక్షల కోట్లకు న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై రాయితీలను వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నాలుగు శాతానికి పైగా తగ్గించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ బిల్లు కింద 2,31,781.61 కోట్లు కేటాయించారు. 2015-16 సంవత్సరంలో సబ్సిడీ బిల్లు సవరించిన అంచనాల ప్రకారం 2,41,856.58 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర తగ్గించారు. 2015-16 లో ఆహార సబ్సిడీ బిల్లు రూ. 1,39,419 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని రూ. 1,34,834.61 కోట్లకు తగ్గించారు. అలాగే.. ఎరువుల సబ్సిడీని రూ. 72,437.58 కోట్ల నుంచి రూ. 70,000 కోట్లకు, పెట్రోలియం సబ్సిడీని రూ. 30,000 కోట్ల నుంచి వచ్చే ఏడాదిలో రూ. 26,947 కోట్లకు కుదించారు. ♦ వచ్చే ఏడాది ఎరువుల సబ్సిడీకి 70 వేల కోట్లు కేటాయింపులు జరిపారు. అందులో యూరియా సబ్సిడీకి రూ. 51,000 కోట్లు, అనియంత్రిత ఫాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకు రూ. 19,000 కోట్లు కేటాయించారు. ♦ యూరియా సబ్సిడీ రూ. 51 వేల కోట్లలో.. రూ. 40 వేల కోట్లను దేశీయ యూరియాకు, మిగతా మొత్తాన్ని దిగుమతి చేసుకునే యూరియాకు సబ్సిడీగా పేర్కొన్నారు. ♦ అనియంత్రిత పాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకుకేటాయించిన రూ. 19 వేల కోట్లలో దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకు రూ. 12 వేల కోట్లు, దిగుమతి చేసుకునే ఎరువులకు రూ. 6,999.99 కోట్లు కేటాయించారు. ఇందులోనే సిటీ కంపోస్ట్ ఉత్పత్తికి సాయంగా రూ. 1 లక్ష కేటాయించారు. ♦ పెట్రోలియం సబ్సిడీ కింద రూ. 26,947 కోట్లు కేటాయించగా.. అందులో రూ. 19,802.79 కోట్లు ఎల్పీజీ సబ్సిడీ కింద, మిగతా మొత్తాన్ని కిరోసిన్ సబ్సిడీ కింద కేటాయింపులు జరిపారు. -
మరిన్ని సేవలపై పన్ను పోటు...
న్యూఢిల్లీ: కొన్ని సర్వీసులకు ఇప్పటిదాకా ఇస్తున్న పన్ను మినహాయింపులను ఉపసంహరించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మరికొన్నింటికి మాత్రం మినహాయింపులను ఇచ్చారు. సీనియర్ అడ్వకేట్లు.. ఇతర అడ్వొకేట్లకు అందించే సర్వీసులపై 14 శాతం పన్ను విధించనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే ప్రజా రవాణా సేవలు అందించే స్టేజ్ క్యారియర్లను నెగటివ్ లిస్టు నుంచి తొలగించారు. ఈ సర్వీసులపై జూన్ 1 నుంచి 5.6% సర్వీస్ ట్యాక్స్ విధించనున్నట్లు జైట్లీ తెలిపారు. మరోవైపు, సేవా పన్నుల ఎగవేతల్లో ప్రాసిక్యూషన్కు సంబంధించి బడ్జెట్లో కొన్ని మార్పులు ప్రతిపాదించారు. వీటి ప్రకారం పన్నులు వసూలు చేసి, వాటిని ఖజానాకు జమ చేయని పక్షంలోనే పన్ను చెల్లింపుదారుపై చర్యలకు అవకాశం ఉంటుంది. ప్రాసిక్యూషన్కు అర్హమయ్యే ఎగవేత పరిమాణాన్ని రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్లకు పెంచారు. టెలికాం స్పెక్ట్రమ్ను బదలాయించడం సర్వీసు పరిధిలోకి వస్తుందని, దీనికి సేవాపన్ను వర్తిస్తుందని జైట్లీ స్పష్టంచేశారు. మినహాయింపులూ ఉన్నాయ్.. అందరికీ ఇళ్లు (హెచ్ఎఫ్ఏ), ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) తదితర పథకాల కింద చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులపై 5.6% సర్వీస్ ట్యాక్స్ను ఎత్తివేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. పీఎంఏవైలో భాగంగా 60 చ.మీ. కన్నా తక్కువ కార్పెట్ ఏరియా ఉండే హౌసింగ్ ప్రాజెక్టులకు కూడా మార్చి 1 నుంచి ఇది వర్తిస్తుంది. అటు, సెబీ, ఐఏఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ తదితర నియంత్రణ సంస్థల సర్వీసులపైనా ఏప్రిల్ 1 నుంచి 14% సర్వీస్ ట్యాక్స్ను కూడా ఉపసంహరిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ వంటి వాటితో బాధపడే వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘నిరామయా’ ఆరోగ్య బీమా పథకంలో భాగమైన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల సర్వీసులకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సేవా పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం వీటిపై 14% సర్వీస్ ట్యాక్స్ ఉంటోంది. మరిన్ని విశేషాలు .. ♦ నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చెయిన్ డెవలప్మెంట్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన భాగస్వామ్య సంస్థలు అందించే సేవలపై ట్యాక్స్ను ఉపసంహరించారు. ఇది ప్రస్తుతం 14 శాతంగా ఉంది. ♦ దేశీ షిప్పింగ్ సంస్థలకు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలోని కొన్ని కోర్సులకు సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. ♦ నిర్దిష్ట పరిమితికి మించి సెంట్రల్ ఎక్సైజ్ చెల్లించాల్సిన వారు దాఖలు చేయాల్సిన రిటర్నుల సంఖ్యను ఏకంగా 27 నుంచి 13కి తగ్గించారు. ఇకపై నెలకొకటి చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు, వార్షికంగా ఒకటి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నెలవారీ రిటర్నులకు ఈ-ఫైలింగ్ విధానం ఉండగా.. త్వరలో వార్షిక రిటర్నులకు కూడా దీన్ని అందుబాటులోకి తేనున్నారు. అటు సర్వీస్ ట్యాక్స్ అసెసీలు వార్షికంగా మూడు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. -
వెన్నముకకు దన్ను
♦ వ్యవసాయ రంగానికి... రూ. 44,485 కోట్లు ♦ బ్యాంకుల ద్వారా పంట రుణాల లక్ష్యంరూ. 9,00,000 కోట్లు ♦ పంటల బీమా పథకానికి..రూ.5,500కోట్లు ♦ కొత్తగా సాగులోకి..28.5లక్షల ఎకరాలు ♦ వచ్చే ఏడాది కల్లా 14కోట్ల మంది రైతులకు భూసార కార్డులు.. ♦ వర్షపు నీటి నిల్వకు నీటి గుంతలు, కొలనులు.. 5లక్షలు ♦ సేంద్రియ సాగు లక్ష్యం..5లక్షల ఎకరాలు పాడి పరిశ్రమాభివృద్ధికి..రూ.850కోట్లు ♦ ఇ-మార్కెట్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం ♦ సేంద్రియ సాగు, ఎరువులకు ప్రోత్సాహం వ్యవసాయానికి ఊతమిచ్చేందుకు బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన మరిన్ని అంశాలివీ.. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకాన్ని సమర్థంగా అమలు చేస్తాం. కొత్తగా 28.5 లక్షల ఎకరాలను సాగు పరిధిలోకి తెస్తాం పాడి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు రూ.850 కోట్లు వెచ్చిస్తాం. పశుధన్ సంజీవని, నకుల్ స్వాస్థ్య పత్ర, ఇ-పశుధన్ హాత్ పథకాలతోపాటు దేశీయ పాడి సంతతిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న నేషనల్ జినోమిక్ కేంద్రానికి ఈ నిధులను వెచ్చిస్తాం. వచ్చే మూడేళ్లలో ఐదు లక్షల ఎకరాలను సేంద్రియ సాగు పరిధిలోకి తెస్తాం. ఇందుకు రూ.412 కోట్లు వెచ్చిస్తాం. రూ.6 వేల కోట్లతో భూగర్భ జలాల పెంపు, సంరక్షణ చర్యలు. రూ.368 కోట్లతో భూసార పరిరక్షణ చర్యలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వర్షపు నీటిని నిల్వచేసేందుకు 5 లక్షల నీటి కొలనులు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తాం. ఇదే పథకం ద్వారా 10 లక్షల సేంద్రియ ఎరువు తయారీ గుంతలు ఏర్పాటు చేస్తాం వచ్చే మూడేళ్లలో విత్తన, భూసార పరీక్షలు కూడా చేసుకునేందుకు వీలుండే 2 వేల ఎరువుల దుకాణాలను ఏర్పాటుచేస్తాం సుదీర్ఘ వ్యవసాయ అవసరాల కోసం నాబార్డ్లో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. తొలి దశ కింద రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం పశుధన్ సంజీవని కింద పశువులకు ఆరోగ్య కార్డులు అందజేస్తాం కిందటి ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.8.5 లక్షల కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి రూ.9 లక్షల కోట్లు అందిస్తామని తెలిపారు. ఇంత పెద్ద లక్ష్యం నిర్దేశించుకోవడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ ;వరుసగా రెండేళ్లపాటు కరువుతో సంక్షోభంలో పడ్డ వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు దన్నుగా ఉంటామంటూ బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. సాగుకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపుల్ని దాదాపు రెట్టింపు చేసింది. సాగు, పాడి రంగాలకు మొత్తంగా రూ.44,485 కోట్లు కేటాయించింది. దేశంలో రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2016-17లో రైతులకు రూ.9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అలాగే సాగు రుణాల వడ్డీ చెల్లింపుల్లో రైతులకు సాయం అందించేందు కు బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకానికి రూ.5,500 కోట్లు ప్రతిపాదించారు. పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు రూ.500 కోట్లు కేటాయిం చారు. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలో 14 కోట్ల మంది రైతులకు భూసార పరీక్ష కార్డులు అందజేస్తామన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు కనీస మద్దతు ధర దక్కేందుకు వీలుగా... ఆన్లైన్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందుకు ఎంపిక చేసిన 585 హోల్సేల్ మార్కెట్లలో వ్యవసాయ ఏకీకృత ఇ-మార్కెట్ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ పథకాన్ని జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఈ పథకంలో చేరేందుకు వీలుగా ఇప్పటికే 12 రాష్ట్రాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ) చట్టాన్ని సవరించుకున్నాయని, ఈ ఏడాది మరిన్ని రాష్ట్రాలు ఇందులో చేరనున్నాయని వివరించారు. దేశ ఆహార భద్రతకు రైతు వెన్నెముకగా నిలుస్తున్నాడని, అతడికి ఆర్థిక భద్రత అందించాల్సిన అవసరం ఉందని జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వేగంగా 89 సాగునీటి ప్రాజెక్టుల పనులు సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద చాలాకాలంగా పెండింగ్లో ఉన్న 89 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని అరుణ్జైట్లీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 80.6 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుందన్నారు. వీటికి వచ్చే ఏడాది రూ.17 వేల కోట్లు, రాబోయే ఐదేళ్లలో రూ.86,500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఈ 89 ప్రాజెక్టులలో 2017 మార్చి 31 నాటికి కనీసం 23 ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు. -
బడ్జెట్ తయారీ ఇలా...
బడ్జెట్.. అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక ఆరు నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో మీరే ఓ లుక్కేయండి!! ♦ సెప్టెంబర్ చివర్లో.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్కు కేటాయిస్తుంది. ♦ అక్టోబర్ చివర్లో.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. ♦ డిసెంబర్.. ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. ♦ జనవరి.. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ♦ ముద్రణ ప్రక్రియ.. బడ్జెట్కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ♦ ఫోన్ ట్యాపింగ్.. బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. ♦ సందర్శకులపై మూడో కన్ను..] ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సంద ర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. ♦ ఫిబ్రవరి చివర్లో.. బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ♦ ఆహారంపై ఎంత జాగ్రత్తో.. ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. ♦ అత్యవసర సమయాల్లో.. ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. ♦ ఫిబ్రవరి 28/29.. సాధారణంగా ఈ రోజుల్లోనే ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానికి బడ్జెట్ గురించి వివరిస్తారు. -
సేవలపై కొత్తగా 0.5 శాతం వ్యవసాయ సెస్
పన్ను పరిధిలోని అన్ని సేవలపై ఈ ఏడాది జూన్ 1 నుంచి 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్ విధించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగానికి నిధులు సమకూర్చేందుకు ఈ సెస్ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే వ్యవసాయ పంపులు, ఎరువులపై ఎక్సైజ్ డ్యూటీని త గ్గిస్తామని, శీతల గిడ్డంగుల పరికరాలపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించివేస్తామని తెలిపారు. మొత్తంగా ఈ బడ్జెట్ రైతుకు అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. సాగులో ఆదాయం పెంచే దిశగా ఆలోచనలు చేయడం బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశం. సాగులో మార్పు తేవడం కోసం విత్తు నాటారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. వీటి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయించడం సబబుగా ఉంది. అలాగే కొత్తగా విధించిన వ్యవసాయ సెస్ ఆహ్వానించదగ్గది. స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త -
విగ్గు పౌడర్ విలవిల..
బడ్జెట్ అంటే పన్నులు. మరి ఫన్నులు ఏమిటి? ఇవీ పన్నులే. అప్పుడెప్పుడో జనాల్ని చావబాదినవి. ఇప్పుడు మాత్రం మనకు విచిత్రంగా అనిపించేవి.. నవ్వు తెప్పించేవి.. వింతైనవి అన్నమాట. ఓసారి చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఆ ఫన్నులపై లుక్కేద్దామా.. - సాక్షి సెంట్రల్ డెస్క్ విగ్గు పౌడర్ విలవిల.. బ్రిటిష్ ప్రధానుల్లోకెల్లా అత్యంత పిన్న వయస్కుడైన విలియమ్ పిట్ విచిత్రమైన పన్నులతో ప్రజలను విలవిలలాడించే వాడు. తన హయాంలో విగ్గులకు వాడే పౌడర్పైనా పన్ను విధించాడు. అప్పట్లో 1790 కాలంలో విగ్గులకు పౌడర్ వాడటం ఫ్యాషన్గా ఉండేది. అయితే, ఈ ఫ్యాషన్ 1820ల నాటికే కనుమరుగవడంతో, దానిపై విధించే పన్నుకూ కాలం చెల్లింది. కిటికీ కిరికిరి.. రష్యా పాలకుడు పీటర్-1 కూడా వింత పన్నుల వీరుడే. చిమ్నీలపై పన్నులు విధించాలని తొలుత సంకల్పించాడు. అయితే, అదంత తేలిక కాకపోవడంతో పాటు చిమ్నీల కంటే కిటికీలను లెక్కించడం తేలిగ్గా కనిపించడంతో ఇళ్ల కిటికీలపై పన్ను వడ్డించాడు. దూరంతో పెరిగే భారం.. దూరానికీ, పన్ను భారానికీ లంకెపెట్టిన చరిత్ర చైనాలోని చౌ వంశీయులది. వారి హయాంలో రాజధానికి చేరువలోనున్న పొలాలకు చెందిన రైతులపై 5 శాతం పన్ను విధించే వారు కాగా, దూరాన్ని బట్టి రైతులపై పన్ను భారం గరిష్టంగా 25 శాతం వరకు పడేది. ప్రమాదాల పన్ను... ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లకు న్యూజెర్సీ ప్రభుత్వం 1994 నుంచి పన్ను విధిస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి మూడేళ్ల వరకు ఏటా ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ద్వారా న్యూజెర్సీ సర్కారుకు అదనంగా 100 కోట్ల డాలర్లు సమకూరాయి. -
నల్ల ధనం వెల్లడికి 4 నెలలు
న్యూఢిల్లీ: లెక్కల్లో చూపని ఆదాయాలు, ఆస్తులు స్వచ్ఛందంగా వెల్లడించాలనుకునే వారికి నాలుగు నెలల వ్యవధి ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ వ్యవధిలో సదరు నల్లధనానికి సంబంధించి పన్నులు, పెనాల్టీలు కట్టిన వారిపై తదుపరి ప్రాసిక్యూషన్ తదితర చర్యలు ఉండబోవని తెలిపారు. ఇటువంటి బ్లాక్మనీపై 30 శాతం పన్నులు, 7.5 శాతం సర్చార్జీ, 7.5 శాతం పెనాల్టీ ఉంటుందని (మొత్తం 45 శాతం) మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. -
అమృత్, స్మార్ట్ సిటీస్ కు 7296 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్), స్మార్ట్ సిటీ మిషన్లకు రూ. 7296 కోట్లను కేటాయించారు. ఇందులో అమృత్ పథకానికి రూ. 4091 కోట్లు, స్మార్ట్సిటీస్ మిషన్కు రూ. 3205కోట్లు కేటాయించారు. 100 నగరాలను ఎంపిక చేసి అందులో తొలి విడతగా టాప్-20 నగరాలను అభివృద్ధి (తాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సాంకేతికత, కనీస మౌలిక వసతులు వంటివి) చేసేందుకు గత నెలలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో నగరానికి ఐదేళ్లపాటు రూ.500కోట్ల నిధులిస్తారు. -
ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఊతం
న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంకోసం కేంద్రం తాజా బడ్జెట్లో ‘స్టాండప్ ఇండియా’ పథకం కింద రూ.500 కోట్లను కేటాయించింది. దీనితోపాటు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వృత్తిపరమైన సాయం అందించడానికి వివిధ పారిశ్రామిక సంఘాల సహకారంతో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖలో జాతీయ హబ్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్లో ప్రకటించారు. పరిశ్రమలు, వాణిజ్యరంగంలో ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలు మంచి ఫలితాలు కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలు, మహిళలు వ్యాపార, పారిశ్రామికరంగాల్లో రాణించడానికోసం రూ.500 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉందని జైట్లీ అన్నారు. ప్రతీ బ్యాంకు బ్రాంచిల్లో ఒక్కో కేటగిరీలో కనీసం రెండు ప్రాజెక్టుల చొప్పున ఆర్థిక సాయం అందేలా చూస్తామని చెప్పారు. దీనిద్వారా దాదాపు 2.5 లక్షలమందికి లబ్ధికలుగుతుందని మంత్రి తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలను జరుపుకొంటున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సాధికారతకు ఊతం లభించాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలకు రూ.100 కోట్లు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి, గురు గోవింద్సింగ్ 350వ జయంతి ఉత్సవాల నిర్వహణకోసం రూ. 100కోట్ల చొప్పున కేంద్రం బడ్జెట్ కేటాయింపులు చేసింది. కాగా, 2017లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇన్నేళ్లలో సాధించిన విజయాలను ఆ వేడుకలసందర్భంగా మననం చేసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. మైనారిటీల కోసం ‘ఉస్తాద్’ మైనారిటీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికోసం ‘ఉస్తాద్’ పేరిట పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకంద్వారా బహుళ రంగాల్లో మైనారిటీల అభివృద్ధికోసం చర్యలు చేపడతారు. -
గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో కొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే సాగరమాల ప్రాజెక్టు ద్వారా నౌకాయాన రంగంలో జలమార్గాలు, పోర్టు ఆధారిత ఆర్థికాభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. జాతీయ జలమార్గాల అభివృద్ధి కోసం రూ. 800 కోట్లు అందించామని...ఆ పనులను వేగవంతం చేశామని వివరించారు. 12 ప్రధాన పోర్టులను ఆధునీకరించి వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా కనీసం రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలనుకుంటున్నామన్నారు. నౌకాయాన రంగంపై జైట్లీ పేర్కొన్న ఇతరాంశాలు.. ♦ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్రధాన పోర్టులు, ఎయిర్పోర్టుల్లో ఇండియన్ కస్టమ్స్ సింగిల్ విండో ప్రాజెక్టు అమలు. ♦ మరింత మంది దిగుమతిదారులకు డెరైక్ట్ పోర్టు డెలివరీ సౌకర్యం విస్తరణ. ♦ కొన్ని తరగతుల ఎగుమతిదారులు, దిగుమతిదారులకు కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులో వాయిదా సౌలభ్యం అందించేందుకు కస్టమ్స్ చట్టానికి సవరణ. -
పన్నుల్లో ఊరట తక్కువే!
ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇది మధ్య తరగతిని నిరాశపరిచేదే. కాకపోతే కాస్త తక్కువ ఆదాయం ఉన్నవారిపై మాత్రం జైట్లీ కొంత కనికరం చూపించారు. బాగా ఎక్కువ ఆదాయం ఉన్నవారిని ఇంకాస్త మొత్తారు. తొలిసారి రుణంతో ఇంటిని కొనుక్కునేవారికి మరిన్ని వడ్డీ ప్రయోజనాలిచ్చారు. టీడీఎస్తో చిన్న పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది పడుతున్నారని, త్వరలోనే సరళమైన విధానాన్ని తెస్తామని చెప్పారు జైట్లీ. 80 జీజీ కింద హెచ్ఆర్ఏ పరిమితి రూ.60,000కు పెంపు 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 5,000 ట్యాక్స్ రిబేట్ తొలిసారి ఇల్లు కొంటే వడ్డీపై అదనంగా 50,000 మినహాయింపు ఎన్పీఎస్ నుంచి విత్డ్రా చేసుకునే 40 % మొత్తానికి పన్నుండదు కోటిరూపాయల ఆదాయం దాటితే సర్ చార్జీ ఇక 15 శాతం తక్కువ ఆదాయం... తక్కువ ఊరట రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ఇప్పటిదాకా పన్నులో రూ.2,000 రిబేటు ఇస్తున్నారు. దీన్నిపుడు రూ.5,000కు పెంచారు. దీంతో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.3,000 అదనపు ప్రయోజనం లభించనుంది. 2013లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటును ప్రవేశపెట్టారు. అంటే నెలకు రూ.41 వేలు ఆదాయంలోపు ఉన్నవారికే ఈ ప్రయోజనం. అది దాటితే ఎలాంటి రిబేటూ ఉండదు. అదీ లెక్క. హెచ్ఆర్ఏ అలవెన్స్ లేనివారికి.. కంపెనీలన్నీ హెచ్ఆర్ఏ ఇవ్వవు. కొందరు అద్దె ఇంట్లో ఉన్నా వారికి హెచ్ఆర్ఏ ప్రయోజనం లభించదు. అలాంటివారు ఇప్పటి వరకూ సెక్షన్ 80 జీజీ కింద రూ.24,000 మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద తగ్గించి చూపించుకునే అవకాశం ఉండేది. ఇపుడు ఆ మొత్తాన్ని రూ.60 వేలకు పెంచారు. అంటే హెచ్ఆర్ఏ లేని ప్రతి ఒక్కరికీ అదనంగా రూ.36,000 మినహాయింపు లభిస్తుంది. వ్యక్తిగత ట్యాక్స్ శ్లాబుల్నిబట్టి గరిష్ఠంగా 10,800 వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఇలా పెంచటం ఊరటే అయినా... ఏడాదికి రూ.60 వేలంటే నెలకు రూ.5వేల కింద లెక్క. ప్రస్తుత ధరల ప్రకారం రూ.5వేల అద్దెకు మంచి ఇల్లు ఎక్కడైనా వస్తోందా? మరి ఇది నిజంగా ఊరటేనా? తొలిసారి ఇంటిని కొంటే ఒకవంక రియల్ ఎస్టేట్ దెబ్బతినటంతో దేశీయంగా డిమాండ్ పెంచటానికి, నిర్మాణ రంగానికి ఊతమివ్వటానికి జైట్లీ మరో నిర్ణయం తీసుకున్నారు. రుణం తీసుకుని ఇల్లు కట్టుకునేవారికి వడ్డీ విషయంలో అదనపు ప్రయోజనం కల్పించారు. తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 24 కింద లభించే రూ.2 లక్షలకు అదనంగా రూ.50,000 ప్రయోజనాన్ని కల్పిస్తూ ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ దీని కోసం కొన్ని షరతులు విధించారు. ఇంటి ధర రూ. 50 లక్షలు దాటకుండా... తీసుకునే రుణం రూ.35 లక్షలు దాటకుండా ఉంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఎక్కువ ఆదాయం.. ఎక్కువ వడ్డన ఏడాదికి కోటి రూపాయలు దాటి సంపాదించేవారిపై వడ్డన మరికాస్త పెంచారు. అలాంటివారు ఇప్పటిదాకా పన్ను చెల్లించటంతో పాటు... సూపర్ రిచ్ సర్ఛార్జీ పేరిట 12 శాతాన్ని చెల్లించేవారు. ఇపుడు ఈ సర్ఛార్జిని 15 శాతానికి పెంచారు. 2013లో అప్పటి ఆర్థిక మంత్రి తొలిసారిగా ఈ సూపర్ రిచ్ సర్చార్జిని 10 శాతంగా ప్రవేశపెట్టారు. గత బడ్జెట్లో జైట్లీ వెల్త్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేసి సూపర్ రిచ్ సర్ చార్జీని 12 శాతానికి పెంచారు. ఇప్పుడు ఇది 15 శాతం అయ్యింది. ఎన్పీఎస్ విత్డ్రా.. ట్యాక్స్ ఫ్రీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ను (ఎన్పీఎస్) మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇతర పింఛన్ పథకాల మాదిరిగానే ఎన్పీఎస్ నుంచి చేసే విత్ డ్రాయల్స్పై కూడా పన్ను భారాన్ని తీసేశారు. 60 ఏళ్లు దాటాక ఎన్పీఎస్ కార్పస్ నుంచి మామూలుగా 60 శాతం మొత్తాన్ని విత్డ్రా చేయొచ్చు మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయాలి. తద్వారా పింఛన్ వస్తుంది. అయితే విత్డ్రా చేసుకునే మొత్తంపై ఇప్పటిదాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇకపై మాత్రం విత్డ్రా చేసుకునే మొత్తం 40 శాతందాకా ఉంటే ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. 60 శాతమైతే మాత్రం... మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎన్పీఎస్ మాదిరిగా 1-4-2016 నుంచి ఈపీఎఫ్లో కూడా మార్పులు జరుగుతాయి. విత్డ్రాయల్స్పై 40 శాతం వరకు మాత్రమే పన్ను మినహాయింపులుంటాయి. అలాగే సింగిల్ ప్రీమియం పెన్షన్ పాలసీపై సర్వీస్ ట్యాక్స్ను 3.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగమిస్తే ఈపీఎఫ్ సాయం.. కొత్త ఉద్యోగాలు కల్పించడానికి, పరిశ్రమలన్నీ ఈపీఎఫ్ పరిధిలోకి రావటానికి కేంద్రం కొత్త ప్రోత్సాహకాలు కల్పించింది. కొత్త ఉద్యోగి కనక ఈపీఎఫ్లో చేరితే... మూడేళ్లపాటు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను (జీతంలో 8.33 శాతం) కేంద్రమే ఈపీఎఫ్కి జమ చేస్తుంది. అయితే ఉద్యోగి జీతం రూ.15,000 దాటి ఉండకూడదు. దీని వల్ల జీతంలో కనీసం 8.33 శాతం ఈపీఎఫ్కి జమచేయాలన్న నిబంధన నుంచి కంపెనీలకు మూడేళ్లు ఊరట లభిస్తుంది. ఉద్యోగికీ లాభం ఉంటుంది. ఇందుకోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది. చౌక ఇళ్లకు ప్రోత్సాహకాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేలా అందుబాటు ధరల్లో నిర్మించే ఇళ్లకు ఈ బడ్జెట్లో ప్రోత్సాహకాలిచ్చారు. చౌక ఇళ్లను నిర్మించే సంస్థలకు వచ్చే లాభాల్లో 100 శాతం డిడక్షన్కు వీలు కల్పించారు. మెట్రో నగరాల్లో 30 చదరపు అడుగుల్లో, మిగిలిన పట్టణాల్లో 60 చదరపు అడుగుల్లో నిర్మించే ఫ్లాట్స్కి ఈ ప్రయోజనం లభిస్తుంది. బీమా ఏజెంట్లకు టీడీఎస్ ఊరట ముందస్తు పన్ను మినహాయింపు (టీడీఎస్) నుంచి ఊరట దొరికింది. ముఖ్యంగా బీమా ఏజెంట్ల కమీషన్పై విధించే టీడీఎస్ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇంతకాలం కమీషన్ రూపంలో వచ్చే ఆదాయం రూ.20,000 దాటితేనే టీడీఎస్ వర్తించేది. దీన్నిప్పుడు రూ.15,000కు తగ్గించారు. బీమా పాలసీకి చేసే చెల్లింపులపై విధించే టీడీఎస్ను 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్ స్కీం (ఎన్ఎస్ఎస్) కమీషన్లపై టీడీఎస్ను 20 నుంచి 10 శాతానికి, బ్రోకింగ్ కమీషన్లపై టీడీఎస్ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. ఎస్ఎంఈలు, వృత్తి నిపుణులకు ఊరట చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వృత్తి నిపుణులకు పెద్ద ఊరటే ఇచ్చారు. రెండు కోట్ల లోపు టర్నోవర్ కలిగిన వారు... తమ టర్నోవర్లో 8% లాభం వస్తుందని అంచనా వేసుకుని... దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాంటివారు ఎటువంటి అకౌంటింగ్ బుక్స్ రాయాల్సిన పని కూడా లేదు. గతంలో ఈ పరిమితి కోటి రూపాయలుగా ఉండేది. దీనివల్ల సుమారు 30లక్షల మంది చిరు వ్యాపారులకు ఊరట లభించనుంది. అలాగే డాక్టర్లు, ఇంజినీర్లు వంటి వృత్తి నిపుణులు తమ ఆదాయం కనక రూ.50 లక్షల లోపు ఉంటే... ఆదాయంలో 50 శాతాన్ని లాభంగా అంచనా వేసుకుని, దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. వీరు కూడా అకౌంట్ బుక్స్ రాయాల్సిన పని ఉండదు. ఇప్పుడు పన్ను శ్లాబులు ఎలా ఉన్నాయంటే... -
ఆధార్ కు చట్టబద్ధత
♦ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ♦ ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేస్తామన్న జైట్లీ ♦ ఎరువుల సబ్సిడీ ‘ప్రత్యక్ష బదిలీ’పై త్వరలో పైలట్ ప్రాజెక్టు న్యూఢిల్లీ: వివిధ వర్గాల వ్యతిరేకత, సుప్రీంకోర్టు మొట్టికాయల నేపథ్యంలో ‘ఆధార్’కు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, అర్హులకే సబ్సిడీలు అందించడానికి ఆధార్ ఆవశ్యకమని... అందువల్ల ఆధార్కు చట్టబద్ధత కల్పించనున్నామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పేదలు, బలహీనవర్గాలకు ప్రయోజనం కల్పించేలా పారదర్శకంగా వ్యవహరించేందుకు ఆధార్ తోడ్పడుతుందన్నారు. బిల్లు సిద్ధంగా ఉందని, మరో రెండు రోజుల్లో దీన్ని పార్లమెంట్ ముందుకు తెస్తామని చెప్పారు. చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసి, మరిన్ని అభివృద్ధి చర్యలకు అనుసంధానిస్తామని తెలిపారు. భారత సంచిత నిధి నుంచి కల్పించే అన్ని రకాల సబ్సిడీలు, సేవలు, ప్రయోజనాలను ఆధార్ ద్వారా అందజేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 98 కోట్ల మంది ఆధార్ నంబర్ను పొందారని... రోజూ సుమారు 26 లక్షల మంది నేరుగా, మరో 1.5 లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. వంటగ్యాస్కు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) పథకం కింద 16.5 లక్షల మంది ప్రయోజనం పొందుతుండగా... అందులో 11.19 కోట్ల మంది తమ ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకున్నారని వెల్లడించారు. త్వరలోనే ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతులకే అందజేసే పథకాన్ని దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నామని జైట్లీ తెలిపారు. ఇక వివిధ సబ్సిడీ పథకాలను ఆధునీకరించడంలో భాగంగా... దేశవ్యాప్తంగా లక్ష రేషన్ దుకాణాలను కంప్యూటరీకరించనున్నట్లు ప్రకటించారు. -
రహదారులకు రాజయోగం
♦ దాదాపు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ♦ బడ్జెట్లో రోడ్లు, హైవేలకు రూ. 55,000 కోట్లు ♦ ఎన్హెచ్ఏఐ బాండ్ల ద్వారా రూ. 15,000 కోట్లు ♦ గ్రామీణ సడక్ యోజనకు రూ. 19,000 కోట్లు ♦ పథకంలో రాష్ట్రాల వాటా మరో రూ. 8,000 కోట్లు ♦ మొత్తం రూ. 97 వేల కోట్లతో రోడ్లకు మహర్దశ ♦ 2019 నాటికే అన్ని గ్రామాలకూ రోడ్ల అనుసంధానం ♦ వచ్చే ఏడాదిలో 10 వేల కి.మీ. హైవేల నిర్మాణం ♦ నేషనల్ హైవేలుగా 50 వేల కిలోమీటర్ల రాష్ట్ర హైవేలు ♦ రోడ్డు ప్రయాణంలో ప్రయివేటు రంగానికి అవకాశం ♦ వాహనాలపై 1 నుంచి 4 శాతం వరకూ ఇన్ఫ్రా సెస్సు న్యూఢిల్లీ: మౌలిక వసతుల రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం.. 2016-17 బడ్జెట్లో 2.21 లక్షల కోట్ల నిధులను అందుకోసం కేటాయించింది. ఇందులో దాదాపు లక్ష కోట్ల రూపాయలను కేవలం రహదారుల నిర్మాణం కోసమే వెచ్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) సహా దేశంలో రహదారుల రంగానికి రూ. 97 వేల కోట్లు కేటాయించారు. జాతీయ రహదారులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ.. రోడ్లు, హైవేలకు భారీగా రూ. 55,000 కోట్లు ఇచ్చారు. దీనికి అదనంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బాండ్ల రూపంలో రూ. 15,000 కోట్లు సమీకరించి ఖర్చు చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. ఇక పీఎంజీఎస్వై కోసం మరో రూ. 19,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. సడక్ యోజన నిధులకు రాష్ట్రాల వాటా రూ. 8,000 కోట్లు కలుస్తుందని చెప్పారు. మొత్తం కలిపి రూ. 97,000 కోట్లతో దేశంలో రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నట్లు ప్రకటించారు. 2019 నాటికి అన్ని గ్రామాలకూ రోడ్లు... ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని మునుపెన్నడూ లేని విధంగా తాము అమలు చేస్తున్నట్లు జైట్లీ చెప్పారు. గతంలో నిధుల కేటాయింపులు స్వల్పంగా ఉండటం వల్ల ఈ పథకం దెబ్బతిన్నదన్నారు. 2012-13లో ఈ పథకానికి రూ. 8,885 కోట్లు, 2013-14లో రూ. 9,805 కోట్లు మాత్రమే కేటాయించారని.. తాము గత రెండేళ్లలో గణనీయంగా నిధులు పెంచామని తెలిపారు. తాజా బడ్జెట్లో ఈ పథకం కింద.. కేంద్రం కేటాయించిన రూ. 19,000 కోట్ల నిధులకు రాష్ట్రాల వాటా కలిపి మొత్తం రూ. 27,000 కోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యయం చేయటం జరుగుతుందన్నారు. దేశంలో మిగిలి వున్న 65 వేల అర్హమైన గ్రామాలనూ ఈ పథకం కింద 2021 నాటికి 2.23 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో అనుసంధానించాలన్న లక్ష్యాన్ని 2019 నాటికే పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు జైట్లీ తెలిపారు. అలాగే.. 2011-14 మధ్య సగటున రోజుకు 73.5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగితే అది ప్రస్తుతం 100 కిలోమీటర్లకు పెరిగిందని.. దీనిని మరింతగా పెంచుతామని చెప్పారు. ఇక.. దేశవ్యాప్తంగా 50,000 కిలోమీటర్ల రాష్ట్ర హైవేలను వచ్చే ఏడాదిలో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నిలిచిపోయివున్న రూ. లక్ష కోట్లకు పైగా రోడ్డు ప్రాజెక్టుల్లో 85 శాతం ప్రాజెక్టులను మొదలు పెట్టటం, వచ్చే ఏడాది 10,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టటం జరుగుతుందని వివరించారు. రోడ్డు రవాణాలో ప్రయివేటుకు అవకాశం... అలాగే.. రహదారుల రంగం అభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్న ‘పర్మిట్ రాజ్’ (అనుమతుల విధానం)ను తొలగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం.. రహదారులపై ప్రయాణ రవాణాను మరింత సమర్థవంతంగా చేయాల్సి ఉందని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రయాణ విభాగంలో ప్రయివేటు సంస్థలకు రోడ్డు రవాణా తలుపులు తెరిచేందుకు మోటారు వాహనాల చట్టానికి అవసరమైన సవరణలు చేపడతామని చెప్పారు. కార్లు, వాహనాలపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు... భారతీయ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్న జైట్లీ.. అదనపు వనరులను సృష్టించటం కోసం చిన్న పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై ఒక శాతం చొప్పున, నిర్దిష్ట సామర్థ్యం గల డీజిల్ కార్లపై 2.5 శాతం, అధిక ఇంజన్ సామర్థ్యం గల వాహనాలు, ఎస్యూవీలపై 4 శాతం చొప్పున మౌలికసదుపాయాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) సెస్సు వేయనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. -
పైసాలోనే పరమాత్మ!
బడ్జెట్ అంటే అంతా డబ్బుతో పని. ఇప్పుడంటే అంతా నోట్లలోనే నడుస్తోంది గానీ.. గతంలో అన్నీ నాణేలే. మరి దేశంలోని మొదటి నాణెం నుంచి మనం స్వర్ణయుగమని చెప్పుకునే గుప్తుల నుంచి విజయనగర రాజుల వరకూ, అటు మొగలుల నుంచి ఇటు హైదరాబాద్ నిజాం కాలం వరకూ నాణేలు ఎలా ఉండేవి.. ఇదిగో ఇలా ఉండేవి. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మిశ్రమ స్పందన లభించింది. అధికార బీజేపీ ప్రశంసించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వైద్య సంఘం నిట్టూర్పులు వెళ్లగక్కింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాకాంక్షను నెరవేర్చిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సోమవారం 2016-17 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా పలువురు స్పందించారు. బడ్జెట్లో అన్ని అంశాలను ప్రస్తావించారని, నిధులను కేటాయించారని తమిళిసై అన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం నుంచి ఏవైతే ఆశిస్తున్నారో వాటికి ఈ బడ్జెట్ అద్దం పట్టిందని తెలిపారు. ముఖ్యంగా రైతు పక్షపాతి బడ్జెట్గా రూపొందిందని చెప్పారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్లో కేటాయింపులకే దిక్కులేదని ఎద్దేవా చేశారు. ప్రకటించడం కాదు అమలు చేయడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. కంటితుడుపుగా అంకెలు చూపితే ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు. ప్రజారోగ్యానికి ప్రధాన్యత ఏదీ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పించడంలో కేంద్రబడ్జెట్ విఫలమైందని డాక్టర్ అసోసియేషన్ ఫర్ సోషల్ ఈక్విటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీఆర్ రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు. వైద్య ఖర్చుల కారణంగా ప్రతి ఏటా ఆరుకోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు దిగజారుతున్నారని కేంద్రం విడుదల చేసిన జాతీయ సంక్షేమ సిద్ధాంతం-2015 తేటతెల్లం చేసిందని అన్నారు. ప్రజారోగ్యశాఖకు 2013-14లోనే రూ.1,93,043 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో కేవలం రూ.1,51, 581 కోట్లు కేటాయింపు జరగడం విచారకరమన్నారు. ప్రజావైద్యశాలను బలోపేతం చేయడానికి మారుగా ప్రయివేటు వైద్యశాలకు మేలు చేకూరేలా ఆరోగ్యబీమాపై నిర్ణయాలు తీసుకున్నారని ఆయన విమర్శించారు. బీమా పాలసీలు ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చడం లేదని అనేక సర్వేల్లో తేలిపోయిందని ఆయన గుర్తుచేశారు. వైద్యఖర్చులు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో లక్ష రూపాయల బీమా సౌకర్యం వృథా అని అన్నారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అన్నారు. గ్రామీణ వికాశం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన కేంద్రబడ్జెట్ను స్వాగతిస్తున్నానని మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ ఏ వేలయ్యన్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులు, తీసుకున్న నిర్ణయాలు భారత దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయని చెప్పారు. -
క్రీడలకు నామమాత్రపు పెంపు..
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో క్రీడలకు నిధులు నామమాత్రంగా పెంచారు. గత బడ్జెట్తో పోలిస్తే కేవలం రూ. 50.87 కోట్లు ఎక్కువ ఇచ్చారు. 2016-17 బడ్జెట్లో క్రీడలకు ప్రణాళిక వ్యయం కింద రూ. 1,400 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 192 కోట్లు మొత్తం రూ. 1592 కోట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. గత బడ్జెట్లో క్రీడలకు రూ. 1541.13 కోట్లు ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీకి రూ. 381.30 కోట్లు, క్రీడా సంస్థలకు రూ. 545.90 కోట్లు కేటాయించారు. -
కుటుంబానికి రూ. లక్ష ఆరోగ్య బీమా
వైద్య రంగానికి రూ. 38,206 కోట్లు సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేల వరకు ప్యాకేజీ జాతీయ ఆరోగ్య మిషన్కు 19వేల కోట్లు కిడ్నీ రోగులపై కరుణ ♦ జాతీయ డయాలసిస్ సేవలకు శ్రీకారం ♦ అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ♦ దేశవ్యాప్తంగా 3 వేల జన్ఔషధి స్టోర్లు న్యూఢిల్లీ: పేదలు (దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు), ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రతపై బడ్జెట్లో కేంద్రం కరుణ చూపింది. వారి కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ పేద, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం రూ. లక్ష విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. ఆయా కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్ల కోసం (60 ఏళ్లు, అంతకన్నా పైబడిన వ్యక్తులు) రూ. 30 వేల టాప్ అప్ ప్యాకేజీని అందిస్తామన్నారు. ‘‘కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే అది ఆ కుటుంబంపై పెను ఆర్థిక భారం మోపడమే కాకుండా వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. అందుకే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు కొత్త ఆరోగ్య పథకం తెస్తాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం తర్వాత ప్రకటించనుంది. జాతీయ ఆరోగ్య మిషన్కు రూ. 19,037 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి రూ. 38,206 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్తో పోలిస్తే ఇది రూ.4,375 కోట్లు ఎక్కువ. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్కు రూ. 2,043 కోట్లు, జాతీయ ఎయిడ్స్ నియంత్రణకు 1,700 కోట్లు కేటాయించారు. న్యూఢిల్లీ: కిడ్నీ రోగులపై బడ్జెట్లో కేంద్రం ఉదారత చాటుకుంది. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం అవసరమైన రోగులకు ఆర్థికంగా, శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించి దీని కింద అన్ని జిల్లా ఆస్పత్రుల్లో రోగులకు డయాలసిస్ సేవలు అందించనుంది. అలాగే డయాలసిస్ పరికరాల్లోని కొన్ని భాగాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ లేదా కౌంటర్వెయిలింగ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ నుంచి మినహాయిస్తామని ప్రతిపాదించింది. ‘‘దేశంలో ఏటా కిడ్నీల వైఫల్యంతో 2.2 లక్షల మంది బాధపడుతుంటే దేశవ్యాప్తంగా సుమారు 4,950 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రైవేటు రంగంలో, ప్రధాన నగరాలు/పట్టణాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో 3.4 కోట్ల డయాలసిస్ సెషన్లకు అదనపు డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్కో డయాలసిస్ సెషన్కు రూ. 2 వేల ఖర్చవుతుండగా ఏటా ఈ ఖర్చు రూ. 3 లక్షలు దాటుతోంది. డయాలసిస్ కోసం రోగుల కుటుంబాలు తరచూ దూరప్రాంతాలకు ప్రయాణించాల్సి రావడం వల్ల ప్రయా ణ ఖర్చులు మోపెడవుతున్నాయి. దీంతో వారు రోజువారీ వేతనాలూ నష్టపోతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందించేందుకు పీపీపీ విధానంలో నిధుల సమీకరణ చేపడతామన్నారు. నాణ్యమైన జనరిక్ మందులను చవకగా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జన్ఔషధి యోజన కింద 3 వేల స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు. -
ఈ బడ్జెట్ విప్లవాత్మకమైనది
ఈ బడ్జెట్ విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన బడ్జెట్ అని.. రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. దేశ చరిత్రలో తొలిసారిగా రోడ్లు, హైవేల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్న రోడ్డు రంగాన్ని ప్రభుత్వం పునరుద్ధరించగలిగిందని.. రానున్న నెలల్లో ఇది చాలా వేగవంతం కానుందని చెప్పారు. బడ్జెట్ ప్రకటనల ద్వారా.. యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 15 కోట్లకు పెరుగుతుందన్నారు. కేవలం 10 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణ పనుల ద్వారా నాలుగు కోట్ల పని దినాల సృష్టి జరుగుతుందని చెప్పారు. -
విమానయానం మరింత భారం
విమానాల్లో వినియోగించే ఇంధనం ‘ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)’పై ఆరు శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంపును జైట్లీ ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతం 8 శాతంగా ఉన్న ఈ పన్ను 14 శాతానికి పెరగనుంది. విమానయాన సంస్థల వ్యయంలో 40 శాతం కేవలం ఏటీఎఫ్ కోసమే ఖర్చవుతుంది. ఈ లెక్కన ఏటీఎఫ్పై పన్ను పెంపుతో వినియోగదారులపైనే భారం పడుతుంది. అయితే ‘ప్రాంతీయ అనుసంధాన పథకం’లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని విమానయాన సంస్థలకు మాత్రం ప్రస్తుత పెంపు నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఏటీఎఫ్పై పన్ను పెంపుతో ఈ రంగంలో ముడి పదార్థాల ధరలు నాలుగైదు శాతం వరకు పెరగవచ్చని అంచనా. -
ధూమపాన ప్రియుల జేబుకు చిల్లు
వరుసగా ఐదో ఏడాదీ కేంద్ర బడ్జెట్లో సిగరెట్లపై పన్ను వడ్డించారు. వాటితోపాటు ఇతర పొగాకు ఉత్పత్తులపైనా ఎక్సైజ్ పన్నును 15 శాతం వరకూ పెంచారు. ఇందులో ఒక్క బీడీలకు మాత్రం మినహాయింపునిచ్చారు. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు పన్ను పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో పేర్కొన్నారు. 65 మిల్లీమీటర్ల (ఎంఎం)లోపు పొడవున్న ఫిల్టర్, ఫిల్టర్ రహిత సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రతి వెయ్యి సిగరెట్లకు రూ. 70 నుంచి రూ.215కు పెంచాలని ప్రతిపాదించారు. 65-70 ఎంఎం మధ్య ఉండే ఫిల్టర్ రహిత, 70-75 ఎంఎం మధ్య ఉండే ఫిల్టర్ సిగరెట్లపై పన్నును రూ.110 నుంచి రూ.370కి పెంచాలని... 65-70 ఎంఎం మధ్య ఉండే ఫిల్టర్ సిగరెట్లపై పన్నును రూ.70 నుంచి రూ.260కి పెంచాలని ప్రతిపాదించారు. మిగతా కేటగిరీల్లో ప్రతి వెయ్యి సిగరెట్లపై పన్నును రూ.180 నుంచి ఏకంగా రూ.560కి పెంచాలని పేర్కొన్నారు. గుట్కా, ఖైనీ, జర్దాలపై పన్నును 70 శాతం నుంచి 81 శాతానికి పెంచనున్నారు. మరోవైపు దీనిపై సిగరెట్ పరిశ్రమ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ స్థాయి పెంపుకారణంగా ప్రజలు ఇతర ప్రమాదకర పొగాకు ఉత్పత్తుల వైపు మళ్లుతారని, సిగరెట్ల అక్రమ రవాణాకూ కారణమవుతుందని పేర్కొంటున్నాయి. -
అంగట్లో అమ్మడిపై పన్ను
ఆదాయం ఏదైనా ... జర్మనీలో మాత్రం పన్నువాత తప్పదు. దాంతో సులువుగా డబ్బు సంపాదించాలనుకున్న ఆ అమ్మడు చిక్కుల్లో పడింది. జర్మనీకి చెందిన 18 ఏళ్ల పెర్షియా 2009లో తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. ఇటలీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి రూ. 88 లక్షలతో ఆన్లైన్ వేలంలో బిడ్ గెలుచుకున్నాడు. ఇంతలో ఆదాయపు పన్ను అధికారులు ఆమెకు ఊహించని షాకిచ్చారు. లావాదేవీ వ్యభిచారం కిందకి వస్తుందంటూ సగం డబ్బుతీసుకెళ్లిపోయారు. ఆన్లైన్ వేలంపై 19 శాతం వ్యాట్తో పన్ను వాత పెట్టారు. వరికి ‘ఉరేశారు’..! రైతు శ్రేయస్సు కోరేవాడే రాజు.. కానీ, జపాన్ పాలకులు అన్నదాతలను పీల్చిపిప్పి చేశారు. జలపుష్పాలైన చేపలు, రొయ్యలు, పీతలపై పన్నులను పూర్తిగా రద్దుచేసి, వరి ఉత్పత్తులపై మాత్రం ఏకంగా 67 శాతం పన్ను వసూలు చేశాడు జపాన్ చక్రవర్తి హిడెయోషి(1590). రైతులు పండించిన పంటలో మూడింట రెండొంతులు పన్ను కింద రాజుకి సమర్పించాల్సి వచ్చేది. దీంతో అన్నదాతలకు గుప్పెడు గింజలు మాత్రమే మిగిలేవి. ‘చచ్చినా’ వదలను.. పన్నులేసి ప్రజల్ని చంపిన పాలకులు మనకెరుకే! కానీ చచ్చిన తర్వాత కూడా పన్నులేస్తున్నమహానుభావులూ ఉన్నారు. అది కూడా ఎప్పుడో రాజుల కాలంలోకాదు.. మూడు, నాలుగేళ్ల కిందటే సియాటిల్లోని కింగ్ కౌంటీలో మరణంపైనా పన్ను అమలు చేయడం మొదలుపెట్టారు. మృతుని బంధువులు ఈ మేరకు వైద్య పరీక్ష అధికారి కార్యాలయంలో 50 డాలర్లు చెల్లించాలి. అప్పుడు మాత్రమే ఆ మృతదేహాన్ని తగులబెట్టాలన్నా, సమాధి చేయాలన్నా అనుమతి లభిస్తుంది. దీన్ని స్థానికంగా అందరూ ‘డెత్ ట్యాక్స్’ అని పిలుస్తుంటారు. -
పెరగనున్న బ్రాండ్ వస్త్రాల ధరలు
రూ. వెయ్యికి మించిన బ్రాండెడ్ వస్త్రాలపై ఎక్సైజ్ పన్నును ‘ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ లేకుండా 2 శాతానికి, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్తో 12.5 శాతానికి’ పెంచనున్నట్లు జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ పన్ను ప్రస్తుతం ‘ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ లేకుంటే పూర్తి మినహాయింపు, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్తో 6 శాతం నుంచి 12 వరకు’ ఉంది. అయితే తాజా పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తే వస్త్రాల ధరలు రెండు శాతం నుంచి ఐదు శాతం వరకు పెరగవచ్చని వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. పెద్ద పెద్ద బ్రాండెడ్ సంస్థలకు వస్త్రాలు తయారుచేసి ఇచ్చే చిన్న, మధ్యతరహా వస్త్ర పరిశ్రమలకు ఇది దెబ్బేనని చెప్పారు. -
నిరాశే..
► గిరిజన యూనివర్సిటీకి రూ.కోటి మాత్రమే ► జాడలేని ఐఐఎం సంస్థ ► రోడ్ల విస్తరణకు అవకాశం ► ఉక్కు కర్మాగారానికి ఉత్తచేయి ► మెరుపుల్లేని అరుణ్ జైట్లీ బడ్జెట్ సాక్షి, హన్మకొండ : జిల్లాలో నెలకొల్పబోతున్న గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నిధులు కేటాయించింది. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో గిరిజన యూనివర్సిటీకి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. విభజన చట్టం హామీల అమలులో భాగంగా గిరిజన వర్సిటీ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ (ఐఐఎం) తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పాల్సి ఉంది. వరంగల్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇప్పటికే గిరిజన వర్సిటీ వరంగల్లో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, ఐఐఎం విషయంలో సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభించాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా కోటి రూపాయల నిధులు మాత్రమే కేటాయించింది. దీంతో వర్సిటీ స్థాపన పనుల్లో వేగం మందగించే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పాల్సిన ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ విషయంలో బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. ఉక్కు పరిశ్రమకు ఉత్తచేయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ముడి ఇనుము ఖనిజం పుష్కలంగా ఉన్న గూడూరు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లా బయ్యారం మండలాల పరిధిలో ఉక్కు పరిశ్రమను నిర్మించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సెయిల్కు ఆదేశాలు జారీ చేసింది. తదనంతరం సెయిల్ ప్రతినిధులు పలుమార్లు గూడూరు, బయ్యారం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. దాంతో ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. కేంద్రప్రభుత్వం ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. వరంగల్లో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ పార్క్ విషయంలో సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక మంత్రి పూర్తిగా విస్మరించారు. టెక్స్టైల్స్ పార్కుకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటనా లేదు. రహదారులకు పెద్దపీట జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వే సింది. ప్రస్తుతం రేణిగుంట - సిరోంచ, హైదరాబాద్ - భూ పాలపట్నం జాతీయ రహదారులు జిల్లా మీదుగా వెళ్తున్నా యి. కేంద్ర ప్రభుత్వం రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ రెండు రహదారుల విస్తరణకు నిధుల స మస్య ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్ సందర్భంగా రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పన్ను రహిత బాండ్లు జారీ చేస్తామని కేంద్రం ప్రకటించడం వల్ల యాదగిరిగుట్ట-వరంగల్ హైవే విస్తరణ పనులు ప్రారంభయ్యాయి. సార్టప్లకు ఊతం కొత్తగా స్థాపించబోయే (స్టార్టప్) కంపెనీలకు తోడ్పాటునందిస్తామంటూ కేంద్రమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. ఐటీ పరిశ్రమను వరంగల్లో నిలదొక్కుకునేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఆరంభించింది. ఇప్పటికే ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్ను ప్రారంభించారు. మరోవైపు సెయింట్ కంపెనీ సైతం ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇక్కడ నెలకొల్పబోయే ఐటీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అందించే పన్ను రాయితీలు ఉపకరిస్తాయి. దీనివల్ల మరిన్ని ఐటీ కంపెనీలు వరంగల్ వైపు దృష్టి సారించేందుకు అవకాశం ఉంది. పర్యాటక రంగం పుంజుకునేనా.. కేంద్రమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాహనాల కొనుగోలు ప్రక్రియపై ఉన్న ఆంక్షలను సరళీకృతం చేశారు. దీంతో వా హనాల కొనుగోలు పెరిగే అవకాశం ఉంది. దీని ఫలితంగా చిన్న వాహనాలు పెరిగి ట్రావెనింగ్ ఏజెన్సీలు విస్తరించనున్నారుు. తద్వారా పర్యాటక రంగం పుంజుకుని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే ఆస్కారం ఉంది. కేబుల్టీవీ క్రమబద్ధీకరణలో భాగంగా అనలాగ్ సిస్టమ్ను డిజిటలైజ్ చేస్తున్నారు. 2016 మార్చి 31లోగా మున్సిపాలిటీలలో ఉన్న కేబుల్ టీవీ వినియోగదారులు తప్పనిసరిగా సెట్బాక్సులు అమర్చుకోవాల్సి ఉంది. ఈ బడ్జెట్లో సెట్బాక్సులపై పన్నులు తగ్గించారు. దీనివల్ల మున్సిపాలిటీలలో ఉన్న కేబుల్టీవీ వినియోగదారులకు లాభం చేకూరనుంది. బడ్జెట్పై ఎవరేమన్నారంటే.. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వటం ముదావహం. 2018 నాటికి ప్రతి గ్రామానికి విద్యుత్, 2029నాటికి ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించటం హర్షణీయం. రైతులకు బీమా ద్వారా వారి ఆర్థిక భద్రతకు వీలు కలిగినట్లయింది. సాగునీరుకు రూ.86,500 కోట్లు, ఉపాధి రంగానికి రూ. 38,500 కోట్లు కేటాయించడంతో ఆయూ రంగాలు అభివృద్ధి చెందుతారుు. వ్యవసాయ రంగానికి 35,984 కోట్లు, యువతకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాలను పెంపొందించేందుకు రూ. 9 వేల కోట్లు కేటాయించడమంటే ఆ వర్గాలకు పెద్దపీట వేసినట్టే. - సురేశ్లాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ ఎకనామిక్స్ విభాగం అత్యంత నిరాశాజనకం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత నిరాశజనక ంగా ఉంది. ఆర్ధిక మందగమనంలో 3.1 శాతం ఉన్నప్పటికీ భారత్ 7.6 శాతం జీడీపీ ఉందని ఐఎంఎఫ్ ఆశాజ్యోతిగా కితాబిచ్చింది. భారత్ మంచి స్థితిలోఉన్నప్పుడు ఉద్యోగులకు ,పెన్షనర్లకు మధ్యతరగతి వారికి ఆదాయ పన్ను స్లాబులలో మార్పు సూచించకపోవటం గమనార్హం. రైతులకు గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదు. పాపింగ్ మాల్స్ వారం రోజులు తెరిచి వుండేలా అనుమతి ఇవ్వడంతో చిరు వ్యాపారులపై ప్రభావం పడతుంది. పన్ను ఎగవేత దారులపై కొరడా ఝుళిపించే శక్తి ఈ ప్రభుత్వాలకు లేదు. కార్పొరేట్ శక్తులకే కొమ్ముకాచే ప్రభుత్వం ఇది. - టి.సీతారాం, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లాప్రధాన కార్యదర్శి వేతన జీవులకు మొండిచేయి... ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత పన్ను స్లాబు రేట్లు సవరించకపోవటంతో కేంద్ర ప్రభుత్వం వేతన జీవులపై మి గులను కూడా లాగేసుకుంది. కార్పొరేట్ శక్తులకు రాయితీల పేరుతో వేలకోట్లు ఇస్తున్న ప్రభుత్వం సగటు వేతన జీవిపై కనికరం చూపలేదు. స్టాక్, బీమా ,పెన్షన్ రంగాల్లోలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించటం ద్వారా పింఛన్ సౌకర్యం ప్రమాదంలో పడుతుంది. - బద్దం వెంకటరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాత్కాలిక ప్రయోజనాలకే పరిమితం తాత్కాలిక ప్రయోజనాలకే బ డ్జెట్ను పరిమితం చేశారు. ప్రజల సామాజిక ప్రయోజనాలను కాపాడుతూ దేశాన్ని ముందుకు నడిపేలా రూపొందిస్తే బాగుండేది. ప్రస్తుతం దేశం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో వ్యవసాయ రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటారుుంచాలి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా మార్కెటింగ్ వ్యవస్థ పటిష్టానికి నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకర-త్రిపురనేని గోపిచంద్, చార్టెర్డ్ అకౌంటెంట్ మార్పులకు అనుగుణంగా ఉంది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా బడ్జెట్ తయారుచేశారు. వ్యవసాయ, పారిశ్రమిక రంగాలతో పాటు యువతకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. అరుుతే సామాన్య ప్రజలు అశించిన ఆదాయపు పన్ను రేటు తగ్గించకపోవడం, పన్ను చెల్లింపు పరిమితిలో మాత్రమే రిబేట్ ఇవ్వడం నిరాశ కలిగించింది. - రాజేంద్ర కుమార్, ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ నిర్మాణ రంగాలను ప్రోత్సహించారు గృహనిర్మాణ సంస్థలకు 100శాతం పన్ను మినహాయింపు ఇవ్వ డంతో నిర్మాణ రంగాన్ని ఉత్తేజ పరిచారు. రోడ్లకు, హైవేలకు రూ.55వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. మొత్తంగా ఈ బ డ్జెట్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. సాగునీటి ప్రాజె క్టులకు రూ.85 వేల కోట్లు కేటాయించడంతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. - తిప్పర్తి రాఘవరెడ్డి, చార్టెర్డ్ అకౌంటెంట్ రూ.5వేల మినహాయింపు సరిపోదు బడ్జట్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను పూర్తిగా విస్మరించింది. కేవలం ఆదాయ పన్ను మినహాయింపు 2 వేల నుంచి 5 వేలకు పెంచారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది 90 శాతం మంది ఉద్యోగలకు వర్తించదు. ఎందుకంటే నాలుగో తరగతి ఉద్యోగులు కూడా ప్రస్తుతం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తున్నారు. - కాందారి బిక్షపతి, వీఆర్వోల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు మా అభ్యర్థనలు పట్టించుకోలేదు. జిల్లాలో ఇటీవల జరిగిన అఖిల భారత మహిళా ఉద్యోగులజాతీయ సదస్సులో మహిళలకు ఆదాయ పన్ను పరిమితి కనీసం 4 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశాం. ప్రభుత్వానికి వినతులు ఇచ్చాం. అయినా మా అభ్యర్థన పట్టించుకోలేదు. ఉద్యోగులను బడ్జట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. - ఇ.వి.కిరణ్మరుు, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రచార కార్యదర్శి దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరింపజేసేలా ఉంది గ్రామీణ భారతాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ రానున్న కాలంలో ప్రపంచంలోనే దేశాన్ని అద్బుతంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉంది. బ్యాంకులు, పీఆర్, రైతు రుణాలకు భారీగా నిధులు కేటారుుంచారు. ఎల్పీజీ కనెక్షన్లు, ఆరో గ్య భీమా, 3 సంవత్సరాలలో 100 శాతం గ్రామాల విద్యుద్దీకరణ, రేషన్ షాప్ల ఆన్లైన్ రంగాలకు సముచిత స్థానం కల్పించారు. నిరుపయోగ విమానాశ్రయాల అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించడంతో మామునూరు విమానశ్రాయం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. - పీ.వీవి.నారాయణ రావు, చార్టెర్డ్ అకౌంటెంట్ బడ్జెట్ నిరుత్సాహపరిచింది. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఉద్యోగులను కేంద్ర బడ్జట్ పూర్తిగా నిరుత్సాహపరిచింది. బడ్జట్లో ఉద్యోగుల గురించి ఏ మాత్రం ఆలోచించిలేదు. దొడ్డిదారిన పన్నులు ఎగ్గొట్టే వారిని వదిలి ప్రతి పైసకు పన్ను చెల్లించే ఉద్యోగుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూడడం దుర్మార్గం. - జగన్మోహన్రావు, టీజీవోస్ అధ్యక్షుడు ఆదాయపన్ను పరిమితి పెంచాల్సింది ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను పరిమితి కనీసం 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉంది అయితే ఈ విషయంలో కొంతయినా పెంచితే బాగుండేది. రాష్ట్రంలో 43 శాతం పీఆర్సీ ఇవ్వడంతో దాదాపు ప్రతి ఉద్యోగి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం ఉద్యోగుల పరంగా ఆలోచించక పోవడం బాధాకరం. - కుమారస్వామి, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు రాష్ట్రం ఇస్తుంటే... కేంద్రం తీసుకుంటోంది ఉద్యోగులు పోరాడి 43 శాతం పీఆర్సీ సాధించుకున్నారు. ప్రభుత్వం డీఏ విడుదల చేసింది, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఇలా ఉద్యోగుల పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే... కేంద్రం మాత్రం ఉద్యోగుల నుంచి సాధ్యమైనంత వరకు పన్నులు వసూలు చేసుకునే ఆలోచనతో ఉన్నట్లు బడ్జట్లో స్పష్టమవుతోంది. బడ్జట్పై ఉద్యోగులెవ్వరూ సంతృప్తిగా లేరు. - ఫణికుమార్. ట్రెస్సా కేంద్ర సంఘం కార్యదర్శి -
ఇన్ ఫ్రాకు బూస్ట్
రూ. 2.21 లక్షల కోట్ల కేటాయింపు న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే క్రమంలో.. బడ్జెట్లో ఇన్ఫ్రా రంగానికి రూ. 2.21 లక్షల కోట్లు కేటాయించారు అరుణ్ జైట్లీ. వృద్ధికి అవరోధాల తొలగింపునకు చర్యలు, సంస్కరణలతో పాటు అదనపు నిధుల ఊతంతో ఇన్ఫ్రా రంగం మెరుగుపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్రియాశీలక చర్యలతో 2015లో అత్యధిక సంఖ్యలో రహదారుల కాంట్రాక్టులు ఇవ్వడం జరిగిందని, వృద్ధిని సూచిస్తూ వాహన విక్రయాలు సైతం అత్యధికంగా నమోదయ్యాయని జైట్లీ చెప్పారు. 2016-17కి సంబంధించి ఇన్ఫ్రాకు మొత్తం రూ. 2.21 లక్షల కోట్లు కేటాయించగా, ఇందులో సింహభాగం రూ. 2.18 లక్షల కోట్లు రహదారులు, రైల్వేలకే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిల్చిపోయిన 70 రహదారి ప్రాజెక్టుల్లో దాదాపు 85 శాతం ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాయని పేర్కొన్నారు. దాదాపు 8,003 కి.మీ. ఈ ప్రాజెక్టుల పెట్టుబడుల విలువ సుమారు రూ. 1 లక్ష కోట్లు ఉంటుందన్నారు. జాతీయ రహదారుల భారీగా నిధులు కేటాయించారు. ఇన్ఫ్రాకు కూడా కొత్తగా క్రెడిట్ రేటింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. అటు పోర్టులకు ఊతమిచ్చేలా సాగర్మాలా ప్రాజెక్టుకు రూ. 8,000 కోట్లు కేటాయించారు. ప్రజా రవాణా వ్యవస్థకు మెరుగులు.. ప్రజా రవాణా వ్యవస్థలో పర్మిట్ల చట్టాలను తొలగించ డం మధ్యకాలిక లక్ష్యంగా జైట్లీ పేర్కొన్నారు. సామాన్య ప్రయాణీకుల సౌలభ్యం కోసం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వివిధ రూట్లలో బస్సులను నడపేందుకు అనుమతులిచ్చేలా మోటార్ వెహికల్ చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఆయన చెప్పారు. దీనితో ఈ విభాగంలో పెట్టుబడుల రాకతో పాటు యువతకు ఉపాధి కల్పన, స్టార్టప్ వ్యాపారవేత్తల అభివృద్ధి తదితర సానుకూల పరిణామాలు చోటు చేసుకోగలవన్నారు. -
రెండు కొత్త సెస్సులు
♦ కార్లపై ఇన్ఫ్రా .. సర్వీసులపై కృషి కల్యాణ్ సెస్సు ♦ 15 శాతానికి పెరగనున్న సేవా పన్ను ♦ టన్ను బొగ్గుపై సెస్సు రూ.200 నుంచి రూ.400కు పెంపు న్యూఢిల్లీ: బడ్జెట్లో కేంద్రం కొత్తగా మరో రెండు సెస్సులను ప్రతిపాదించింది. వ్యవసాయ రంగ వృద్ధికి వనరులు సమీకరించే దిశగా.. పన్నులు వర్తించే అన్ని సర్వీసులపైనా కృషి కల్యాణ్ సెస్సు, కార్లపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు విధించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. వీటి ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 8,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. మొత్తం మీద అయిదు ప్రధాన సెస్సుల ద్వారా ఆదాయం 2016-17లో మరో రూ. 23,116 కోట్లు పెరిగి .. రూ. 54,450 కోట్ల పైచిలుకు రాగలదని అంచనా. జూన్ 1 నుంచి మొబైల్ బిల్లులు, హోటళ్లలో భోజనాలు మొదలుకుని విమాన ప్రయాణాల దాకా పన్నులు వర్తించే అన్ని రకాల సర్వీసులపైనా కృషి కల్యాణ్ సెస్సు (కేకేసీ)ని విధించనున్నారు. దీని ద్వారా రూ. 5,000 కోట్లు రాగలవని అంచనా. ఈ నిధులను వ్యవసాయ రంగ వృద్ధికి వినియోగించనున్నారు. కేకేసీ విధింపుతో సర్వీస్ ట్యాక్స్ రేటు అర శాతం మేర పెరిగి 15 శాతం కానుంది. ఇక, కార్లపై ఇన్ఫ్రా సెస్సుతో రూ. 3,000 కోట్లు రావొచ్చని అంచనా. మరోవైపు ఏటా రూ. 50 కోట్లకు మించి ఆదాయాన్ని రాని 13 సెస్సులను జైట్లీ తొలగించారు. ♦ పెట్రోలు, ఎల్పీజీ, సీఎన్జీ ఇంధనం వినియోగించే చిన్న కార్లపై 1 శాతం, నిర్దిష్ట సామర్థ్యం గల డీజిల్ కార్లపై 2.5 శాతం, ఎస్యూవీలు.. పెద్ద కార్లు.. అధిక ఇంజిన్ సామర్ధ్యం గల వాహనాలపై 4 శాతం మేర ఇన్ఫ్రా సెస్సు ఉంటుంది. ♦ త్రిచక్ర వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు, హైబ్రీడ్ వాహనాలు, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఉపయోగించే హైడ్రోజెన్ వాహనాలకు దీన్నుంచి మినహాయింపు లభిస్తుంది. అలాగే, ప్రత్యేకంగా ట్యాక్సీలు, అంబులెన్సులు, వికలాంగుల కోసం ఉపయోగించే కార్లకు సైతం ఇన్ఫ్రా సెస్సు నుంచి మినహాయింపు ఉంటుంది. ♦ బొగ్గు, లిగ్నైట్ మొదలైన వాటిపై విధిస్తున్న సెస్సు పేరు మార్చి... టన్నుకు రూ. 200గా ఉన్నదాన్ని రూ. 400కు పెంచారు. దీని పేరును స్వచ్ఛ ఇంధన సెస్సు నుంచి స్వచ్ఛ పర్యావరణ సెస్సుగా మార్చారు. దీని ద్వారా 2016-17లో రూ. 26,148 కోట్లు రాగలవు. అటు ఆయిల్ ఇండస్ట్రీస్ అభివృ ద్ధి సెస్సును విలువ ఆధారిత రేటుగా మార్చి .. మెట్రిక్ టన్నుకు రూ. 4,500 కాకుండా 20 శాతం రేటు చొప్పున విధిస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గనుంది. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 14,962 కోట్లు రానుండగా, వచ్చేసారి ఇది రూ. 10,303 కోట్లకే పరిమితం కాగలదని అంచనా. -
తగ్గేవి ఇవే...
సాధారణ, రెజిన్ రబ్బరు షీట్లపై పన్నును 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాదరక్షల ధరలు భారీగా తగ్గే అవకాశముంది. ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం వినియోగించే రూటర్లు, బ్రాడ్బ్యాండ్ మోడెమ్లు, టీవీ సెట్టాప్ బాక్స్లపై పన్నును 4 శాతానికి తగ్గించనున్నారు. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఇంజన్లపై పన్నును 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో వాటి ధరలు బాగా తగ్గనున్నాయి. సోలార్ దీపాలు, సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లపై ప్రస్తుతమున్న 12.5 శాతం ఎక్సైజ్ పన్నును పూర్తిగా తొలగించనున్నారు. ఒక కిలోవాట్ నుంచి 1.5 కిలోవాట్ల సామర్థ్యమున్న దేశీ తయారీ మైక్రోవేవ్ ఓవెన్లపై ప్రస్తుతమున్న 10 శాతం పన్నును పూర్తిగా రద్దు చేయనున్నారు. -
‘ఫ్లాగ్ షిప్’.. వేగం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేటాయింపుల జోరు... గ్రామీణ భారత్కు మరింత జవసత్వాలు కల్పించడం... మౌలిక సదుపాయాల పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంగా కీలకమైన ‘ఫ్లాగ్షిప్’ పథకాలపై ప్రధాని మోదీ పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి ఆర్థిక మంత్రి జైట్లీ ఇందులోని అన్ని పథకాలకూ భారీగా నిధుల కేటాయింపులను పెంచడమే దీనికి నిదర్శనం. అంతేకాకుండా.. ఇప్పటికే స్వచ్ఛ భారత్ సెస్సును విధించిన కేంద్రం.. ‘క్లీన్’ సెస్సును మరింతగా పెంచడం ద్వారా అదనంగా నిధులను సమకూర్చుకోనుంది. మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమానికి దాదాపు ఒకటిన్నర రెట్లు కేటాయింపులు పెరగడం గమనార్హం. ఇక వరుసగా రెండేళ్ల కరువు పరిస్థితులతో దుర్భల పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేయూత కల్పించేందుకు ఉపాధి హామీ పథకం నిధులను కూడా భారీగానే పెంచారు. రెండేళ్లలో దేశంలోని అన్ని గ్రామాలకూ పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం... చౌక గృహ నిర్మాణానికి పెద్దపీట వేయడం... పల్లెల్లో రోడ్లపై మరింతగా దృష్టిపెట్టడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి మోదీ సర్కారు ఈ బడ్జెట్లో గట్టి ప్రయత్నమే చేసింది. ఉపాధికి ‘హామీ’... 201617 కేటాయింపు: రూ. 38,500 కోట్లు (11% పెంపు) 201516 కేటాయింపు: రూ. 34,699 కోట్లు(12% పెంపు) గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది. గ్రామాల్లో మౌలిక వసతుల పెంపునకు ఈ పథకాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివాటిని కూడా మోదీ ప్రభుత్వం దీనిలోకి చేర్చింది. ఈ స్కీమ్ ద్వారా వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతలను ఏర్పాటు చేసేవిధంగా ఉపాధి పనులను వాడుకోనున్నట్లు తాజా బడ్జెట్లో జైట్లీ ప్రకటించారు. స్వచ్ఛ భారత్కు దన్ను... భారత్ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. దీనికి సంబంధించిన నిధుల కల్పన కోసం అవసరమైతే సర్వీస్ పన్నుకు అదనంగా జైట్లీ గతేడాది సర్వీసు పన్నుకు (ప్రస్తుతం 14 శాతం) అదనంగా 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్సును అమల్లోకి తీసుకొచ్చారు. జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని తమ ప్రభుత్వం ఒక ఉద్యమంలా చేపడుతోందని జైట్లీ బడ్టెట్ ప్రసంగంలో చెప్పారు. మరోపక్క, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి నిధుల కల్పన కోసం క్లీన్ ఎనర్జీ సెస్ (క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్గా ఇప్పుడు పేరు మార్చారు)ను ఈ బడ్జెట్లో కూడా పెంచారు. బొగ్గు తదితర ఖనిజాలపై ఒక్కో టన్నుపై ఇప్పుడు విధిస్తున్న రూ.200 సెస్ను రూ.400కు చేరుస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పరిధిలోకి స్వచ్ఛ భారత్ అభియాన్(పారిశుద్ధ్యం), జాతీయ గ్రామీణ తాగునీటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. స్వచ్ఛ భారత్ అభియాన్ రూ.9,000కోట్లు (గ్రామీణ)+ రూ.2,300 (పట్టణ) 201617 కేటాయింపు: రూ.9,000 కోట్లు (148 % పెంపు) 201516 కేటాయింపు: రూ.3,625 కోట్లు ♦ 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. ♦ దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎస్బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం. ♦ కాగా, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ర్యాంకింగ్లను ప్రవేశపెట్టింది. దీనివల్ల నగరాలు, పట్టణాల మధ్య నిర్మాణాత్మక పోటీకి తోడ్పడుతుందని జైట్లీ అన్నారు. ♦ అదేవిధంగా ఎస్బీఏలో భాగంగా నగరాల్లోని చెత్తను కంపోస్టుగా మార్చే ఒక ప్రత్యేక పాలసీని ప్రభుత్వం ఆమోదించినట్లు కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్లో వెల్లడించారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం 201617 కేటాయింపు: రూ. 5,000 కోట్లు (92% పెంపు) 201516 కేటాయింపు: రూ.2,611 కోట్లు(76% తగ్గింపు) దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి. గ్రామీణ టెలిఫోనీ... 201617లో: రూ. 2,755 కోట్లు (15% పెంపు) 201516లో: 2,400 కోట్లు (32% తగ్గింపు) 2016 డిసెంబర్ కల్లా మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్(ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్ వినియోగాన్ని పెంచడం. 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,000 కోట్లు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన... 201617 కేటాయింపు: రూ. 8,500 కోట్లు (25% పెంపు) 201516 కేటాయింపు: రూ. 6,800 కోట్లు (32% పెంపు) ♦ విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. ♦ 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని.. వచ్చే 1000 రోజుల్లో వీటికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ హామీనిచ్చారు. ♦ దీనిలో భాగంగానే 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజా బడ్జెట్లో జైట్లీ ప్రకటించారు. ♦ తాజా బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ.3,000 కోట్లు, ఫీడర్లను వేరుచేసే కార్యక్రమం వంటి వాటికి (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్స్) రూ.5,000 కోట్లు చొప్పున కేటాయించారు. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16 ఫిబ్రవరి 23 నాటికి)లో కొత్తగా 5,542 గ్రామాలను విద్యుదీకరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత మూడేళ్లలో మొత్తం విద్యుదీకరించిన గ్రామాలకంటే ఇది అధికమని కూడా జైట్లీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 201617 కేటాయింపు: రూ.20,075 (41% పెంపు) 201516 కేటాయింపు: రూ.14,200 కోట్లు(11% కోత) ♦ అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ బడ్టెజ్లో చౌక గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించింది. పీఎంఎస్వైతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని హౌసింగ్ ప్రాజెక్టులకు(60 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణానికి మించని గృహాలపై) సేవా పన్నును(ప్రస్తుతం ఇది 5.6 శాతంగా ఉంది) పూర్తిగా తొలగిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే చౌక గృహాలకు(60 చదరపు మీటర్ల వరకూ) సంబంధించిన ప్రాజెక్టులకు సైతం ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ♦ దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి. ♦ మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.75,000 చొప్పున ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఇళ్ల అప్గ్రేడేషన్కు రూ.15,000 చొప్పున సాయం అందిస్తారు. ♦ మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. అయితే, స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు. ♦ పట్టణ ప్రాంతాల్లోని పేదల గృహ కల్పనకు సర్దార్ పటేల్ అర్బన్ హౌసింగ్ స్కీమ్గా పేరు పెట్టారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన 201617 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (33% పెంపు) 201516 కేటాయింపు: రూ.14,291 కోట్లు (0.7% తగ్గింపు) ♦ మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పథకం ఇది. ♦ గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న మోదీ సర్కారు దీనికి ఈ బడ్జెట్లో దండిగానే నిధులను విదిల్చింది. ♦ ఈ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.27 వేల కోట్ల నిధులు ఖర్చు చేసే అవకాశం ఉందని జైట్లీ బడ్జెట్లో పేర్కొన్నారు. ♦ 2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ♦ 2011-14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73.5 కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం 100 కిలోమీటర్లకు జోరందుకుందని.. దీన్ని మరింతగా పెంచనున్నట్లు కూడా జైట్లీ పేర్కొన్నారు. -
పెరిగేవి ఇవే..
శీతల పానీయాలు, మినరల్ వాటర్పై పన్నును 18 నుంచి 21 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. పారిశ్రామికంగా వినియోగించే సోలార్ వాటర్ హీటర్లపై పన్నును 7.5 నుంచి 10 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఇళ్లు మారినప్పుడు వినియోగించుకునే ‘ప్యాకర్స్ అండ్ మూవర్స్’ సేవలపై పన్నును 4.2 శాతం నుంచి 5.6 శాతానికి పెంచనున్నారు. లాటరీ టికెట్లను కూడా సేవాపన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. అద్దె వాహనాలను కూడా సేవా పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ సేవలపై 5.6 శాతం పన్ను వసూలు చేయాలని ప్రతిపాదించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సర్క్యూట్ బోర్డులపై పన్నును 1 శాతం పెంచారు. దీంతో దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్ల ధరలు ఒక శాతం వరకు పెరిగే అవకాశముంది ఇమిటేషన్ ఆభరణాలపై పన్నును ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 15 శాతానికి పెంచనున్నారు. -
కరెన్సీ...
♦ ఒక డాలర్ను మన కరెన్సీలోకి మార్చుకోవాలంటే ఇప్పుడు దాదాపు రూ.68.42. 1913లో ఒక్క డాలర్ విలువ రూ.0.0869. అదే 1925లో 10 పైసలు. అంటే ఒక్క రూపాయి కావాలంటే 10 డాలర్లు ఇవ్వాలన్న మాట. 1947లో రూపాయి విలువ ఒక డాలర్తో సమానం. ♦ భారత్లో ఇప్పుడు చలామణిలో ఉన్న అతిపెద్ద నోటు రూ.1000 నోటు. దీన్ని 2010లో కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే 1954 నుంచి 1978 మధ్య రూ.5 వేలు, రూ.10 వేల నోట్లు చలామణిలో ఉండేవి. ♦అమెరికాలో రోజుకు 3.8 కోట్ల నోట్లను ముద్రిస్తారు. వీటి విలువ రూ.4,482 కోట్లు (65.5 కోట్ల డాలర్లు) ఉంటుంది. ఇందులో 95 శాతం నోట్లను చిరిగిపోయిన, పాత లేదా పూర్తిగా పాడయిపోయిన నోట్ల స్థానంలో ప్రవేశపెడతారు. ♦ అమెరికాలో మొదటి కాగితపు కరెన్సీని 1690లో ప్రవేశపెట్టారు. అప్పట్లో అమెరికాలో బంగారం, వెండితో తయారైన నాణేలను తయారు చేసేవారు. దీంతో నాణేల కొరత ఏర్పడటంతో ఈ లోటును పూడ్చేందుకు 1862లో కాగితపు కరెన్సీని అమెరికా ఆర్థిక శాఖ ప్రవేశపెట్టింది. ♦ అమెరికాలో కరెన్సీ నోట్లకు కూడా జీవిత కాలం ఉంటుంది. ఆ తర్వాత అవి చలామణిలో ఉండేందుకు వీల్లేదు. ఒక్క డాలరు నోటు జీవిత కాలం 22 నెలలు. 50 డాలర్ల నోటు 55 నెలలు, 100 డాలర్ల నోటు జీవిత కాలం 89 నెలలు. ♦అమెరికాల కరెన్సీ నోట్లపై ఎప్పుడు పురుషుల బొమ్మలే మనకు కన్పిస్తాయి. అయితే అక్కడి నోట్లపై కనిపించే ఒకే ఒక మహిళ అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ భార్య మార్తా వాషింగ్టన్. ఈమె ఫొటో ఉన్న కరెన్సీ నోట్లు 1886 నుంచి 1891లో చలామణిలో ఉండేవి. ఫిలిప్పైన్స్ నోటు... ♦ ప్రచంలోనే అతిపెద్ద బ్యాంకు నోటు ఎంత ఏమిటో తెలుసా! ఫిలిప్పైన్స్లోని లక్ష పీసోల (ఫిలిప్పైన్స్ కరెన్సీ) నోటు దాదాపు ఏ4 సైజు (నోటు బుక్) అంత పెద్దగా ఉంటుంది. స్పానిష్ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భానికి గుర్తుగా ఈ నోటును 1998లో అక్కడి ప్రభుత్వం ముద్రించింది. అయితే ఈ నోట్లను అక్కడి కలెక్టర్లకు మాత్రమే ఇస్తారు. 130 ఇయర్స్ ఇక్కడ.. ♦ మన ఆర్థిక మంత్రులు ఏడాదికో కొత్త బడ్జెట్ బ్యాగ్ను పట్టుకుని పోజిస్తున్నారు గానీ.. బ్రిటన్లో 130 ఏళ్లకు పైగా.. ఒకే బడ్జెట్ బాక్స్ను వాడారు. ఆ బాక్సే ఇది. దీని పేరు గ్లాడ్స్టోన్ రెడ్ బాక్స్. 1860ల్లో అప్పటి బ్రిట న్ ఆర్థిక మంత్రి విలియమ్ ఎడ్వర్డ్ గ్లాడ్స్టోన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం కోసం దీన్ని తొలిసారిగా వాడారు. అప్పట్నుంచి.. దాదాపు వందేళ్ల పాటు పెచ్చులూడిపోతున్నా.. చిరిగిపోతు న్నా.. ప్రతి ఆర్థిక మంత్రి ఈ బాక్స్నే వాడారు. 1964-67 మధ్య అప్పటి ఆర్థిక మంత్రి జేమ్స్ కలాగన్ దీన్ని కాకుండా కొత్త బ్యాగును వాడారు. తర్వాత మళ్లీ షరా మామూలే. మరో 30 ఏళ్లు దీనిదే హవా. 1997లో గోర్డాన్బ్రౌన్.. 2007 వరకూ కొత్త బ్యాగులను ఉపయోగించారు. మొన్నమొన్నటి వరకూ అంటే 2010 జూన్ వరకూ దీన్నే వాడారు. ఇక వాడితే బాక్స్ బద్దలయ్యే ప్రమాదముందని గ్రహించారో ఏమో.. దీనికి రిటైర్మెంట్ ప్రకటించి.. కేబినెట్ వార్రూమ్లో దాచిపెట్టారు. -
కొత్త పథకాలకు ‘సన్సెట్ డేట్’!
న్యూఢిల్లీ: కొత్త పథకాలపై కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడిని తేనుంది. ఇక నుంచి కొత్తగా ప్రవేశపెట్టే పథకాలకు ముగింపు తేదీ (సన్సెట్ డేట్)ని కూడా ప్రకటించనున్నారు. దీనివల్ల ఆయా పథకాలు నిర్దేశించిన సమయం తర్వాత రద్దవుతాయి. ప్రభుత్వ వ్యయాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు, ప్రభుత్వం తెచ్చే ప్రతీ కొత్త పథకానికి ముగింపు తేదీ కూడా ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనివల్ల ఆయా పథకాల ప్రయోజనాలను సమీక్షించవచ్చని, అర్హులైన లబ్ధిదారులకు సహాయం అందించడానికి సులువవుతుందన్నారు. ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తదుపరి వచ్చే ప్రభుత్వాలు రద్దు చేస్తుండటంతో ఇది రాజకీయ దుమారానికి తావిస్తోంది. ఇప్పుడు చట్టాల్లో, పథకాల్లో ప్రారంభ సమయంలోనే ముగింపు తేదీని ప్రకటించడంపై విస్తృతంగా చర్చకు తెరతీసినట్లయింది. సన్సెట్ క్లాజ్ను పొందుపరిస్తే నిర్ధిష్ట చట్టాలు, పథకాల ప్రయోజనాలు చేకూరిన తర్వాత అవి ఆటోమేటిగ్గా రద్దవుతాయని న్యాయ కమిషన్ ఇటీవల కేంద్రానికి ప్రతిపాదన చేసింది. ఏళ్ల క్రితం తెచ్చిన, భారీగా ఉన్న పథకాలు వాస్తవంలో లేవని, ఇవి చట్టాల పుస్తకాల్లోనే కొనసాగుతున్నాయని కమిషన్ స్పష్టంచేసింది. -
బడ్జెట్ 2016-17.. మన ఊరికి జై
పేదలందరికీ లక్ష రూపాయల ఆరోగ్య బీమా గొడుగు బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్ ప్రైవేట్తో కలసి దేశవ్యాప్తంగా డయాలసిస్ సేవాకేంద్రాలు సాగు, పాడి, వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిపి రూ. 44,485 కోట్లు 28.5 లక్షల హెక్టార్ల భూమికి నీటి పారుదల సదుపాయం దేశవ్యాప్తంగా ఐదు లక్షల ఫామ్ పాండ్లు, ఊట బావుల తవ్వకానికి సాయం సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం రైతు రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం రూ.15 వేల కోట్లు స్థానిక సంస్థలకు రూ.2.87 లక్షల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపాధి హామీకి నిధుల పెంపు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులతో కూడిన 300 రూర్బన్ సమూహాల ఏర్పాటు 2018 మే 1 నాటికి గ్రామీణ విద్యుదీకరణ పూర్తి మూడేళ్లలో ఆరు కోట్ల పల్లె కుటుంబాలకు ‘డిజిటల్ పరిజ్ఞానం’ కిరాణా దుకాణాలను వారమంతా తెరవొచ్చు వార్షిక ఆదాయం రూ. కోటి దాటితే అదనంగా 3 శాతం ‘రాబిన్హుడ్’ పన్ను వ్యక్తులు, సంస్థలకు వచ్చే డివిడెండు రూ. 10 లక్షలు దాటితే 10 శాతం పన్ను సాలీన ఐదు లక్షల లోపు ఆదాయం వచ్చే వారికి ఇస్తున్న రిబేట్ రూ. 2 వేల నుంచి రూ. 5 వేలకు పెంపు బొగ్గు, లిగ్నైట్, పీట్లపై టన్నుకు రూ. 200 నుంచి రూ. 400కు క్లీన్ ఎనర్జీ సెస్ పెంపు బడ్జెట్ మొత్తం 19,78,060 కోట్లు ప్రణాళికా వ్యయం 5,50,010 కోట్లు ప్రణాళికేతర వ్యయం 14,28,050 కోట్లు రెవెన్యూ వసూళ్లు 13,77,022 కోట్లు మూలధన వసూళ్లు 6,01,038 కోట్లు పెరిగేవి.. కార్లు ఇతర వాహనాలు, దిగుమతి చేసుకున్న గోల్ఫ్ కార్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, విమానయానం, కంప్యూటర్లు, బీడీలు మినహా సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, విద్యుత్, ఫోన్ బిల్లుల చెల్లింపులు, రెస్టారెంట్లు సహా అన్ని రకాల సేవలు, రూ. వెయ్యికి పైబడిన విలువ కలిగిన బ్రాండెడ్ వస్త్రాలు, బంగారం, వెండి, వెండితో చేసినవి మినహా మిగతా ఆభరణాలు, మినరల్ వాటర్, శీతల పానీయాలు, రూ. 2 లక్షలకు మించిన వస్తు సేవలు (నగదు రూపంలో), అల్యూమినియం ఫాయిల్, ప్లాస్టిక్ సంచులు, రోప్వే, కేబుల్ కార్ ప్రయాణాలు, దిగుమతి చేసుకున్న ఇమిటేషన్ ఆభరణాలు, పారిశ్రామిక సోలార్ వాటర్ హీటర్లు, న్యాయ సేవలు, లాటరీ టికెట్లు, అద్దె వాహనాలు, ప్యాకర్స్-మూవర్స్ అద్దెలు, ఈ-రీడింగ్ పరికరాలు, ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే పరికరాలు. తగ్గేవి పాదరక్షలు, సోలార్ దీపాలు, రూటర్లు, బ్రాడ్బ్యాండ్ మోడెమ్లు, సెట్టాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లు, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఒకసారి వినియోగించి పడేసే స్టెరిలైజ్డ్ డయాలసిస్ పరికరాలు, 60 చదరపు మీటర్లలోపు స్థలంలో నిర్మించిన తక్కువ ధర గృహాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు, రిఫ్రిజిరేటెడ్ కంటెయినర్లు, పెన్షన్ పథకాలు, మైక్రోవేవ్ ఓవెన్లు, శానిటరీ ప్యాడ్స్, బ్రెయిలీ పేపర్ -
ఎరువుకు నగదు బదిలీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతులకే అందిస్తామని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపడతామని తెలిపారు. ఎరువుల సబ్సిడీకి కేంద్రం ఏటా రూ.73 వేల కోట్ల దాకా వెచ్చిస్తోంది. అయితే ఈ సబ్సిడీని రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు అందిస్తోంది. ఆ కంపెనీలు సబ్సిడీని మినహాయించి రైతులకు ఎరువులు అందిస్తున్నాయి. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, సబ్సిడీ పక్కదారి పడుతోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కేంద్రం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘ఇప్పటికే గ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీ) అనుసరిస్తున్నాం. ఇది విజయవంతమైన నేపథ్యంలో ఎరువులకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నాం’ అని జైట్లీ తెలిపారు. ఎరువులకు డీబీటీ వర్తింజేసేందుకు వీలుగా కేంద్రంలోని ఎరువుల విభాగం రైతులను గుర్తించే కార్యాచరణ రూపొందిస్తోంది. నగదు బదిలీని ఎరువుల పరిశ్రమలు స్వాగతించాయి. -
బడ్జెట్లో కొన్ని..
⇔ పన్ను వివాదాల్లో చిక్కుకున్న సంస్థలు అసలును కట్టేసి.. వడ్డీ, పెనాల్టీ నుంచి మినహాయింపు పొందవచ్చని, తద్వారా కేసును పరిష్కరించుకోవచ్చని వొడాఫోన్, కెయిర్న్ వంటి సంస్థలకు జైట్లీ పరోక్షంగా సూచించారు. ⇔ దేశీ మైనింగ్ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రస్తుత బడ్జెట్లో తక్కువ గ్రేడ్ ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్)పై ఉన్న ఎగుమతి సుంకాన్ని తొలగిస్తున ట్లు ప్రకటించారు. ⇔ ద్రవ్య విధాన కమిటీ(మోనేటరీ పాలసీ కమిటీ-ఎంపీసీ) ఏర్పాటు కోసం 1934 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించాలని తన బడ్జెట్లో ప్రతిపాదించారు. బెంచ్మార్క్ వడ్డీరేట్లను, ద్రవ్యోల్బణ లక్ష్యాలను ఈ ఎంపీసీ నిర్ణయిస్తుంది. ⇔ ఎగుమతిదారుల ప్రయోజనం ఉద్దేశించి.. ‘డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్’ను విస్తృతం చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. మరిన్ని ప్రొడక్టులు, దేశాలకు సంబంధించిన దిగుమతులకు ఈ పథకాన్ని విస్తరిస్తారు. ⇔ కమోడిటీ డెరివేటవ్స్ మార్కెట్లో ఆప్షన్ల వంటి మరిన్ని ట్రేడింగ్ సాధనాలను సెబీ అభివృద్ధి చేయనున్నదని జైట్లీ చెప్పారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్ను మరింత విస్తరించే చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు. ⇔ సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)కు సంబంధించి మరిన్ని బెంచ్ల ఏర్పాటు కోసం సెబీ చట్టాన్ని సవరించనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఇచ్చే ఉత్తర్వులను శాట్లో సవాల్ చేసే వీలుంది. ⇔ కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ సర్వీసుల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.98,995 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ వేలం సహా డాట్ విధించే పలు రకాల ఫీజులు కూడా ఇందులోకే వస్తాయి. -
చక్కెర పరిశ్రమ సమస్యల పరిష్కారం తప్పనిసరి..
హైదరాబాద్: చక్కెర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని దక్షిణ భారత చక్కెర కర్మాగారాల సంఘం (తెలంగాణ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్లకు ఈ మేరకు సంఘం ప్రెసిడెంట్ టి సరితా రెడ్డి, ఇతర ప్రతినిధులు ఇటీవల ఒక వినతిపత్రం సమర్పించారు. రుణ పునర్వ్యవస్థీకరణ, చక్కెర ధరకు అనుగుణంగా చెరకు ధర నిర్ణయానికి రెవెన్యూ షేరింగ్ విధాన రూపకల్పన, ప్రాధాన్యతా రంగంగా రుణ వెసులుబాటు వంటి ప్రయోజనాలను పరిశ్రమలకు కల్పించాలని వారు కోరారు. -
‘రీట్స్’ పెట్టుబడులొస్తున్నాయ్!
స్థిరాస్తి రంగంలో తీరనున్న నగదు కొరత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్థిరాస్తి రంగానికి రీట్లు (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) రూపంలో మంచి రోజులు రానున్నాయి. సింగపూర్, హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సక్సెస్ అయిన రీట్ల విధానాన్ని మన దేశంలోనూ ఆరంభించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదించారు. రీట్స్ పెట్టుబడులు పొందేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న డివెడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)ను తొలగిస్తున్నామని, దీర్ఘకాలిక మూలధనంపై పన్ను విధానాన్ని కూడా హేతుబద్దీకరిస్తున్నామని, అలాగే ప్రస్తుతం ఆదాయం పన్ను మినహాయింపుల్లో భాగంగా ఇస్తున్న ఇంటి అద్దె మినహాయింపులను కూడా రూ.24,000 నుంచి రూ.60,000కు పెంచుతున్నట్లు జైట్లీ తన ప్రసంగంలో వివరించారు. దీంతో చాలా కాలంగా స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న నగదు కొరత రీట్ల రూపంలో తీరనుందని కొలియర్స్ ఇంటర్నేషనల్ ఇండియా సీనియర్ అసోసియేట్ డెరైక్టర్ (రీసెర్చ్) సురభి అరోరా, నైట్ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్, వంటి స్థిరాస్తి రంగం నిపుణులు చెబుతున్నారు. అసలు రీట్లు అంటే ఏంటి? అవెలా పనిచేస్తాయంటే.. రీట్స్తో మ్యూచుఫల్ ఫండ్ల తరహాలోనే నిర్మాణ సముదాయాల్లోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు.. ఇలా అన్ని రకాల నిర్మాణాల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్కు ఓ ట్రస్టు, స్పాన్సర్, మేనేజర్ ఉన్నట్టే రీట్స్కూ ఉంటారు. ఇందులోని ఫండ్ మేనేజర్లకు స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉండాలి. రీట్లు స్టాక్ ఎక్స్ఛెంజ్లో నమోదవుతాయి. అక్కడే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి, పెట్టుబడిదారులకు మంచి లాభాలు గిట్టుబాటయ్యే అవకాశముంది. నిర్మాణం పూర్తయిన వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడుల్ని పెట్టడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిదారులకు అందించడమే రీట్ల ప్రధాన కర్తవ్యం. అంటే అద్దెల రూపంలోనే ఆదాయం గిట్టుబాటవుతుందన్నమాట. దేశ, విదేశీ సంస్థలకు చెందిన నిధుల ప్రవాహం పెరిగితే వాణిజ్య సముదాయాలకు భవిష్యత్తులో మంచి గిరాకీ ఉంటుంది. రీట్స్లో పెట్టుబడులను నిర్మాణం జరిగే వాటిలో పెట్టడానికి ఒప్పుకోరు. 90 శాతం సొమ్మును నిర్మాణం పూర్తయిన వాటిలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా సొమ్మునంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో మదుపు చేస్తానంటే కుదరదు. ఇలాంటి నిబంధనల వల్ల పెట్టుబడిదారులకు ఆదాయం త్వరగానే అందుతుంది. ప్రతి ప్రాజెక్ట్ విలువను ఏడాదికోసారి లెక్కిస్తారు. ఆరు నెలలకోసారి ఎన్ఏవీ (నెట్ అసెట్ వ్యాల్యూ)ని ప్రకటిస్తారు. ఇక్కడ సెబీ ఒక నిబంధనను పొందపర్చింది. ఒకవేళ కొనాల్సి వస్తే.. 110 శాతం కంటే ఎక్కువ సొమ్మును పెట్టకూడదు. అమ్మాల్సి వస్తే ఆస్తి విలువలో 90 శాతం కంటే తక్కువకు విక్రయించకూడదని తెలిపింది. మూడేళ్ల వరకూ పెట్టిన సొమ్మును కదపడానికి వీలుండని రీట్స్లో పెట్టుబడులు చేసేవారికి కార్పొరేట్ పన్ను మినహాయింపు వుంటుంది. క్రమం తప్పకుండా ఆదాయమూ లభిస్తుంది. కొన్ని రీట్లయితే నిర్మాణ సంస్థలకు నేరుగా నిధుల్ని కూడా సమకూర్చుతాయి. వీటన్నింటిని మించి నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి పారదర్శకత నెలకొంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తి రంగం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకూ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య తేడా వల్ల కొంత సొమ్ము నల్లధనం రూపంలో నిర్మాణ సంస్థల ఖాతాలోకి వెళ్లేది. ఫలితంగా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడేది. రీట్ల రాకతో పెట్టుబడులు పెట్టే ముందు ఆస్తి విలువలు పక్కాగా తెలిసే వీలుంటుంది. లావాదేవీల్లో, సొమ్ము చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. నిధుల కొరత పెద్దగా ఉండదు కాబట్టి దేశవ్యాప్తంగా చేపట్టే నిర్మాణాలు ఆలస్యమయ్యే ప్రమాదముండదు. -
రైతుకు ఓకే... ఉద్యోగికి షాకే...
కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు అరుణ్జైట్లీ చాణక్య నీతిని తెలివిగా ప్రదర్శించారు. వాత పెడుతూనే వెన్న రాస్తున్నట్టుగా లెక్కలు చూపించారు. ఆయన సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల వరకు బడ్జెట్పై సానుకూల స్పందనలు వినిపిస్తున్నా, ఉద్యోగులు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ర్టం, జిల్లా విషయానికి వచ్చే సరికి మాత్రం అంతా బీజేపీ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు మోదీనే చెప్పినా, ఆ విషయం బడ్జెట్లో కానరాలేదు. హోదా బదులు నిధులైనా ఇచ్చారా అంటే అదీ లేదు. ఇప్పటికే చాలా విషయాల్లో వెనుకబడిన మన జిల్లా బడ్జెట్ కేటాయింపుల్లోనూ వెనుకబడే ఉంది. ఒక్క ప్రాజెక్టయినా రాకపోవడంతో జిల్లా వాసి ఉసూరుమన్నాడు. మిత్రపక్షం నుంచే నిధులు రాబట్టుకోలేని టీడీపీ నేతల అసమర్థ వైఖరిపై విమర్శలు గుప్పించాడు. - శ్రీకాకుళం, నెట్వర్క్ అన్నదాతకు ఊరటే... రైతులకు రుణాల వడ్డీ మాఫీకి కేటాయింపు, బీమా సదుపాయం కల్పన వంటివి ఊరటనిచ్చే విషయాలు. అయితే రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని ఓ పక్క ప్రకటిస్తూనే మరోవైపు ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆక్షేపణలకు తావిచ్చింది. కొంతవరకు అన్నదాతలు ఈ బడ్జెట్పై సానుకూలంగానే స్పందించారు. ఉద్యోగులకు భంగపాటు ఆదాయ పన్ను పరిమితి పెంచుతారని ఉద్యోగులందరూ భావిస్తూ బడ్జెట్ కోసం ఎదురుచూశారు. వారికి భంగపాటు కలిగింది. పన్ను పరిమితిని యధాతథంగా కొనసాగించడం వారిలో నిస్పృహకు తా విచ్చింది. అయితే సొంత ఇల్లు లేని ఉద్యోగులకు ఇదివరలో 24వేల వరకు ఇంటి అద్దెను పరిగణలోకి తీసుకోగా ప్రస్తుత బడ్జెట్లో ఆ మొత్తాన్ని రూ. 60వేలకు పెంచడం కొంత తృప్తినిచ్చింది. స్థానిక సంస్థలపై ప్రేమ స్థానిక సంస్థలకు అదనపు నిధులను కేటాయించడం పంచాయతీలు, మునిసిపాలిటీలకు వరం కానుంది. జిల్లాలో 1100 పంచాయతీలు, ఒక కార్పొరేషన్, మూడు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. ఆర్థిక సంఘ నిధులు స్థానిక సంస్థల్లో రోడ్లు నిర్మాణానికే వెచ్చించాలని నిబంధన విధించడంతో పన్నులు అంతంతమాత్రంగా వసూలవుతున్న నేపథ్యంలో పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వాటికి ఏటా రూ. 90 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉండడంతో గ్రామస్థాయి ప్రజలు కొంత ఉపశమనం పొందనున్నారు. బీమా... ధీమా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని బడ్జెట్లో పొందుపరచడం జిల్లాలోని లబ్ధిదారులకు ఆనందాన్నిచ్చింది. జిల్లాలో 14వేల మంది పేదలు గ్యాస్ కనెక్షన్లు కోసం దరఖాస్తు చేసుకోగా అవి పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి వారికి ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల బీమా కల్పిస్తామని బడ్జెట్లో ప్రకటిం చడం కూడా జిల్లా ప్రజలకు సంతృప్తినిచ్చింది. సుప్రీంకోర్టు కాదన్నా... ఏ అంశానికీ ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించినా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆధార్ను తప్పనిసరి చేసింది. పలు కీలక పథకాలకు ఆధార్ కార్డు ఉండాలని ప్రకటించింది. జిల్లాలోని సుమారు 15 శాతం మంది పలు కారణాల వల్ల ఆధార్ కార్డును పొందలేకపోయారు. వీరంతా పేద వర్గానికి చెందినవారే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన ఇలాంటి వారు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. పశువులకు గుర్తింపు కార్డులపై విమర్శలు... ప్రజలకే పూర్తిస్థాయిలో గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయిన ప్రభుత్వాలు తాజా కేంద్ర బడ్జెట్లో పశువులకు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. అలాగే ఆరోగ్య కార్డులు, బీమా కల్పిస్తామని చెప్పడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ పథకాలను సవ్యంగా అమలుచేయలేకపోతుండగా కేంద్ర ప్రభుత్వం పశువులను గుర్తింపు కార్డులు,ఆరోగ్య కా ర్డులు ఇచ్చినా ప్రయోజనం ఉండదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఊసే లేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రాకు అ న్యాయమే జరిగింది. రైల్వే బడ్జెట్లోనూ ఆశించిన కేటాయింపులు జరగలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా నిధులైనా కేటాయించాల్సింది. కేవలం టీడీపీ వ్యవహార శైలే దీనికి కారణం. ఇది కేవలం ఆ పార్టీ నాయకుల వైఫల్యమే. - ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కార్మికుల పాలిట శాపం కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు కార్మికులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. తయారీయేతర రంగాల్లో కార్మిక చట్టాలు అమలు తనీఖీలు ఎత్తివేస్తూ తయారుచేసిన మోడల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని బడ్జెట్లో ప్రకటించడం దారుణం. ఇన్సూరెన్స్, పెన్షన్ రంగాల్లో విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి అనుకూలంగా సంస్కరణలు ప్రతిపాదించింది. 2016 ఏప్రిల్ 1నుంచి కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో జమచేసిన మొత్తాలను విత్డ్రాచేసే సమయంలో 60శాతం మీద ప్రభుత్వం పన్ను వేయాలన్న నిర్ణయం అన్యాయం. - డి.గోవిందరావు, సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మధ్య తరగతికి నిరాశే... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి ప్ర జలకు నిరాశ కలి గించింది. ఉద్యోగులకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. ప్రత్యేక హోదాపై కనీసం ప్రస్తావన లేదు. పాత ప్యాకేజీపై కూడా నోరు మెదపలేదు. పంటల బీమా రైతులకు ఊరట కలిగిం చింది. గత బడ్జెట్లో అంకెలను అటు ఇటుగా మార్చినట్టే ఉంది. - దువ్వాడ శ్రీకాంత్, పలు కార్మిక సంఘాల సమాఖ్యల గౌరవధ్యక్షులు, పలాస-కాశీబుగ్గ రైతులకు ఉపయోగమే... రైతులకు ఈ బడ్జెట్ చాలా ఉపయోగం. ముఖ్యంగా జీడి రైతులకు మరింత ఉపయోగం. రైతు శ్రేయ స్సు కోసం బడ్జెట్లో రూ.36 వేల కోట్లు కేటాయించారు. సేంద్రియ ఎరువులపై దృష్టి సారించారు. పప్పు ధాన్యాల దినుసుల కోసం రూ.500 కోట్లు ప్రకటించా రు. జీడి పిక్కల దిగుమతి కోసం కస్టమ్స్ చార్జీలు 5 శాతం పెంచారు. దీని వల్ల స్వ దేశీ పిక్కల రేట్లు పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది. - మల్లా శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్, పలాస ఆశాజనకంగా లేదు... సామాన్యునికి సొంతిల్లు కలే అవుతోంది. సిమెంట్, ఇను ము ధరలు పెంచడం బాలే దు. రైతు సంక్షేమం అంటూ నే వారి నడ్డివిరిచే విధంగా కేటాయింపులు ఉన్నాయి. అరుణ్ జైట్లీ ప్రకటించిన బడ్జెట్ సామాన్యునికి ఆశాజనకంగా లేదు. - కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే ప్రత్యేక హోదా ఏదీ..? కేంద్ర బడ్జెట్లో మనకు ప్రత్యేక హోదా ప్రస్తావించకపోవడం దారుణం. రైల్వే బడ్జెట్తో పాటు సాధారణ బడ్జెట్లో ఏపీ ఆశలు అడియాసలయ్యాయి. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం లేదు. - విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు ఇస్తే బాగుండేది... లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రా కు మరింతగా ఆర్థిక సాయం అందించి ఉంటే బాగుండేది. పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని అనుకున్నాం. ఇచ్చి ఉంటే బాగుండేది. బడ్జెట్లో సంబంధం లేకపోయినా ఇతర మార్గాల ద్వారా నిధులు అధికంగా ఇస్తారని ఆశిస్తున్నాం. - బగ్గు రమణమూర్తి, నరసన్నపేట ఎమ్మెల్యే మరింత ప్రాధాన్యం ఇవ్వాలి శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాలకు కేంద్రం మరింత ప్రాధాన్యం ఇవ్వా ల్సి ఉంది. కేటాయింపులూ పెంచాల్సి ఉంది. వ్యవసాయం సంక్షోభంలో ఉండడంతో కేంద్రం ప్రకటించిన బడ్జెట్ కొంత ఊరటనిచ్చింది. నీటి పారుదల విషయంలోనూ కేంద్రం మంచి నిర్ణయమే తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలకు ఈ సారి పెద్దపీట లభించింది. వచ్చే బడ్జెట్లోనైనా శ్రీకాకుళం జిల్లాకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, కేటాయింపులు పెరగాలని ఆశిస్తున్నా. - గుండ లక్ష్మిదేవి, ఎమ్మెల్యే, శ్రీకాకుళం మళ్లీ మోసపోయారు... ఉద్యోగ ఉపాధ్యాయులు మళ్లీ మోసపోయారు. ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. కనీసం రూ.3లక్షలు నుంచి ఐదు లక్షలకు పన్ను మినహాయింపు వర్తించే చర్యలు తీసకుంటుందని అంతా ఆశించారు. కాని మొండిచేయి చూపడం వల్ల ఈ బడ్జెట్ కూడా నిరాశ పరిచింది. ధరలు విపరీతంగా పెంచారు. దీని వల్ల సామాన్యుడు ఇబ్బందులు పడతాడు. - ఎం. చిన్నబాబు, వైఎస్ఆర్ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్పొరేట్ల కోసమే... కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లు, విదేవీ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. బడుగు, బలహీ న వర్గాలకు ఒనగూరిందేమీ లేదు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్లోనూ న్యాయం జరగలేదు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఊసే లేదు. జన్ధన్ యోజన పథకాన్ని అట్టహాసంగా ప్రవేశపెట్టి మన జిల్లాలో సుమారు 7 లక్షల ఖాతాలు తెరిపించారు. కానీ దాని గురించి పట్టించుకోలేదు. విభజన సమయంలో ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఒక్కటీ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు దక్కలేదు. - రెడ్డి శాంతి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఆదాయ పన్ను పరిమితి పెంచాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా పీఆర్సీలు ప్రకటించిన తర్వాత జీతాలు అందరికీ పెరిగాయి. దీనికి తగ్గట్టుగా ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడంతో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. 11 నెలల జీతమే ఇంటికి వస్తుంది.దీన్ని గమనించి ఆదాయ పన్ను పరిమితి పెంచుతుందని ఆశించాం. నిరాశే మిగిలింది. - బమ్మిడి శ్రీరామ్మూర్తి, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ఉద్యోగులకు తీవ్ర నిరాశే.. కేంద్రం పార్లమెంట్లో ప్రవే శ పెట్టే బడ్జెట్పై ఉద్యోగ వర్గాలు ఆతృతగా ఎదురుచూశాయి. కనీసం ఇన్కం టాక్స్ రాయితీ పెంచుతుం దని ఆశించాం. యదాతథం గా దీన్ని ఉంచడం ఉద్యోగులకు నష్టమే. ఇన్కం టాక్స్ రాయితీ పెంచితే బాగుండేది. - డి.శ్రీనివాస్, ఎన్జీఓ సంఘం, నరసన్నపేట తాలూకా అధ్యక్షుడు పెన్షనర్లకు నిరాశే... పెన్షనర్లకు ఐటీ మినహాయింపు ఇస్తారని గత మూడేళ్లగా భావి స్తూ వస్తున్నాం. కానీ ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. పెంచిన పేస్కేల్ బట్టి ప్రతి చిరుద్యోగితోపాటు విశ్రాంత ఉద్యోగులకు ఐటీ మినహాయింపు లేకపోవడం శోచనీయం. ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి. - డాక్టర్ కె.శ్రీనివాసరావు, డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ రాష్ట్ర మంత్రులు కళ్లు తెరవాలి కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అందరు మంత్రులు కళ్లు తెరవాలి. రాష్ట్రానికి రూ.22వేల కోట్లు అవసరమని అడిగితే కేంద్రం ఇచ్చింది కేవలం రూ.వెయ్యి కోట్లు. మనకు రైల్వేజోన్లోనూ అన్యాయమే జరిగింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాల్సి ఉంది. - తాత మురళీధర్, బీజేపీ మండలాధ్యక్షుడు, హిరమండలం విద్యారంగానికి మొండిచేయి... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వి ద్యారంగానికి మొండి చేయి చూపారు. కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం తెచ్చి నిధులు కేటాయించకపోవడం దారుణం. ఉద్యోగస్తు లు దాచుకున్న సొమ్ము, తీసుకుంటే దానిపై ఆదాయపన్ను భారం విధించడం దుర్మార్గమైన చర్య. - కవిటి పాపారావు, ఐపీటీఎఫ్(1937), జిల్లా ఉపాధ్యక్షుడు బంగారంపై టాక్స్ తగదు బంగారంపై ఒక శాతం టాక్స్ పెంచడం సామాన్యుల నెత్తిన కుంపటి పెట్టినట్టే ఉంది. పెళ్లికి బంగారం కొనుగోలు చేయాలంటే పేదవాడు నానా ఇక్కట్లు పడాల్సిందే. - జె. వెంకటేశ్వరరావు, రోటేరియన్, ఆమదాలవలస పైన పూత... లోన వాత అరుణ్జైట్లీ బడ్జెట్ పైన పూత... లోన వాత అన్నట్లు ఉంది. మన ఎంపీల అసమర్థతన బడ్జెట్లో కనిపిస్తోంది. బడ్జెట్లో రూ.14లక్షల 28వేల కోట్లతో ప్రణాళికేతర వ్యయం, రూ.5లక్షల 50వేల కోట్లతో ప్రణాళికావ్యయం చూపారు. అందులో అసలు మన వాటా ఉందా? తమిళనాడును చూసి మనవారు బుద్ధి తెచ్చుకోవాలి. బడ్జెట్ను పరిశీలిస్తే బొగ్గు ఆధారిత పరిశ్రమలు, హోటళ్లపై సెస్ విధించారు. డీజిల్, పెట్రోలు, బంగారంపై పన్నుభారం మోపారు. కంప్యూటర్ పరికరాలపై కూడా సుంకం విధించారు. ఇది పేద విద్యార్థులపై ప్రభావం చూపుతుంది. రూ.15 వేల కోట్లు మాత్రమే రైతు రుణాలపై వడ్డీ మాఫీకి ఇచ్చారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ప్రజలను సమాయాత్తపరచాల్సిన అవసరం ఉంది. - తమ్మినేని సీతారాం, వైఎస్సార్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు రైతుకు ఊతమే... కేంద్ర బడ్జెట్ రైతులకు ఊరటనిచ్చేలా ఉంది. రైతన్నలు ఏజెంట్లు/బ్రోకర్లపై ఆధారపడకుండా తమ పంటను విక్రయించుకునేలా బడ్జెట్లో ప్రకటించడం సంతోషకరం. సీతంపేట ఏజెన్సీలోని రైతులు ఇతరులపై ఆధారపడకుం డా ఈ ప్లాట్ఫాంల ద్వారా దేశంలో ఎక్కడికైనా కనీసం 10 రకాల ఉత్పత్తులు విక్రయించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 1.55 కోట్ల దీపం కనెక్షన్లు లక్ష్యంగా తీసుకుంటే ఇప్పటికే సుమారు 45లక్షలు మంజూరయ్యాయి. కేంద్ర బడ్జెట్ ప్రకారం పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల అంశం మరింత ఉపయోగపడుతుంది. పంచాయతీలకు నిధుల పెంపు విషయమై కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. శ్రీకాకుళం విషయంలో అర్బన్ మిషన్ కింద ఇప్పటికే అమృత్ నిధులొస్తున్నాయి. గ్రామాల పరిధిలోనూ అర్బన్ మాదిరి సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. గతంలో ఇదే అంశంపై ‘పురా’(ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ టు ది రూరల్ ఏరియాస్) పథకం ఉన్నా సోమవారం నాటి బడ్జెట్లో పేర్కొన్న అంశం మరింత మేలు కలిగించేదిలా ఉంది. - లక్ష్మీనృసింహం, కలెక్టర్ పేదవాడిని విస్మరించారు... కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద వాడిని పూర్తిగా విస్మరించారు. నరేంద్ర మోదీ అభివృద్ధి పేరుతో కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించే విధంగా అరుణ్జైట్లీతో అంకెల గారడీ చేయించారు. -దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి వేతన జీవులకు నిరాశే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2016 కేంద్రబడ్జెట్లో వేతన జీవులకు నిరాశే కలిగింది. ప్రతి ఉద్యోగికీ పన్ను మినహాయింపు 2.50 లక్షలు నుంచి 3.50 లక్షలకు పెంచుతారని ఆశించారు. అయితే ఇక్కడ నిరాశే మిగిల్చింది. గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరికీ గృహం కల్పించే విధంగా రాయితీలు కల్పించడం హర్షణీయం. - హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట వేసిం ది. ఇంత వరకూ ఏ బడ్జెట్లో లేని విధంగా రూ.15వేల కోట్లు రైతులు చెల్లించాల్సిన వడ్డీ మాఫీకి కేటాయించారు. వ్యవసాయ రంగానికి రూ.39వేల కోట్లు కేటాయించారు. విత్తనాలు సేకరించి నిల్వ చేసుకునేందుకు రూ.800కోట్లు కేటాయించారు. - పూడి తిరుపతిరావు, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్ఛా అధ్యక్షుడు లక్ష్యం చేరుతారా..? 2018 నాటికి శత శాతం విద్యుద్దీకరణ చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నా రు. కానీ ఈ లక్ష్యం చేరుతారో లేదో. గతంతో పోల్చుకుంటే గ్రామీణ, మున్సిపాలిటీలకు కేటాయింపులు బాగున్నాయి. నిధులు పక్కాగా విడుదలైతే గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక వసతులు సాధ్యమవుతాయి. గ్రామీణాభివృద్ధికి మాత్రమే రూ. 87.765 కో ట్లు కేటాయించడం బాగుంది. - డాక్టర్ కె.అచ్యుతరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, వాణిజ్య శాస్త్రం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కేటాయింపులు మరిన్ని ఉండాల్సింది... రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వెనుకబడి ఉంది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులైతే చాలవు. ప్రత్యేకంగా ఏపీకి కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిం ది. పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ. 100 కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ. 20 కోట్లు, తిరుపతిలో ఐఐటీకి రూ. 40 కోట్లు, విశాఖపట్నంలో ఐఐఎంకు రూ.30 కోట్లు, తేడేపల్లిగూడేం ఎన్ఐటీకి రూ. 40 కోట్లు, తిరుపతి ఐఐఎస్సీఆర్కు రూ. 40 కోట్లు, విశాఖస్టీల్ ప్లాంట్కు రూ. 1675 కోట్లు, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్కు రూ. 231.61 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయంకు రూ. కోటి మంజూరు చేశారు. బడ్జెట్ కేటాయింపులు పెంచాల్సింది. - ప్రొఫెసర్ గుంట తులసీరావు, వాణిజ్య శాస్త్రం సీనియర్ ప్రొఫెసర్, ప్రధానాచార్యులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రెండంకెల వృద్ధి ఎప్పుడో..? ఇప్పట్లో దేశంలో రెండంకెల వృద్ధిరేటు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వృద్ధి రేటు 7.6 శాతం, ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయి తే ప్రణాళికా వ్యయం కంటే ప్రణాళి కేతర వ్యయానికి ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రాధాన్యత రంగాలకు తక్కువ కేటాయింపుల వల్ల ప్రగతిలో వెనుక బాటు తప్పదు. -ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, ఎకనామిక్స్ విభాగాధిపతి, బీఆర్ఏయా సంపన్న వర్గాల కోసమే... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్న వర్గాలు బాగా అభివృద్ధి చెందడానికే అన్నట్లుగా ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో ఉన్న వారికి ఇంకా కేటాయింపులు చేయాలి. -చింతాడ మంజు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉపాధికి అరకొర నిధులు... గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు నిరోధించే ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అరకొర నిధులు కేటాయిం చారు. మహిళా సాధికారతపై నిర్లక్ష్యం చూపించారు. - దువ్వాడ వాణి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది... కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరం గా విఫలమైంది. నిధులు తీసుకురావడంలో ముఖ్యమంత్రితో పాటు మిగిలిన మంత్రివర్గం విఫలమయ్యారు. -పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు -
మార్కెట్లకు ‘పన్ను’పోటు..!
♦ 848 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్ హెచ్చుతగ్గులు ♦ మెనస్ 660 నుంచి మైనస్ 152కు రికవరీ ♦ 23,002 పాయింట్ల వద్ద ముగింపు ♦ 43 పాయింట్ల నష్టంతో 6,987కు నిఫ్టీ ♦ డీడీటి, ఎస్టీటీ, క్రూడ్, కోల్ సెస్లతో షాక్ అసలే...ఆసియా మార్కెట్లు అల్లకల్లోలమవుతున్న సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంతో దేశీయ స్టాక్ మార్కెట్కు పన్నుపోటు పొడిచారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఆయన ప్రతిపాదించిన వివిధ రకాల పన్నులకు స్టాక్ సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ 22,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. చివరలో దేశీయ సంస్థలు కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టంతో 23,002 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 6,987 పాయింట్ల వద్ద ముగిశాయి. 10 లక్షలకు మించిన డివిడెండ్పై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ను విధించడం, క్రూడ్పై అంచనాలకంటే అధికంగా 20 శాతం సెస్ను ప్రతిపాదించడం, బొగ్గుపై క్లీన్ ఎనర్జీ సెస్ను రెట్టింపుచేయడం, ఆప్షన్స్ లావాదేవీలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ను 0.017 నుంచి 0.05 శాతం పెంచడంతో సెంటిమెంట్ బలహీనపడింది. బడ్జెట్ ప్రతిపాదనల కారణంగా స్టాక్ సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 660 పాయింట్లు క్షీణించింది. మొత్తం మీద సెన్సెక్స్ 848 పాయింట్ల రేంజ్లో కదలాడింది. అయితే ఆర్బీఐ రేట్ల కోత ఉంటుందనే ఊహాగానాల కారణంగా దిగువస్థాయి నుంచి సూచీలు కొంతవరకూ కోలుకున్నాయని నిపుణులంటున్నారు. బడ్జెట్ను మార్కెట్ నియంత్రించజాలదని, బడ్జెట్ మార్కెట్కు నచ్చిందా లేదా అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. భవిష్యత్లో ప్రభావం... బడ్జెట్లో ఆర్థిక మంత్రి తీసిన దెబ్బలు భవిష్యత్తులో స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. అంచనాలకు తక్కువగానే ప్రభుత్వ రంగ బ్యాంకులకు నిధులు కేటాయించడం, ఆప్షన్స్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ను 0.07 శాతం నుంచి 0.05 శాతానికి పెంచడం, రూ. 10 లక్షలకు మించిన డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ను విధించడం, కార్పొరేట్లకు ఎలాంటి పన్ను ఊరట లేకపోవడం, జీఎస్టీ ఊసే లేకపోవడం.. ఈ అంశాలన్నీ రానున్న కాలంలో తప్పక ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వాహనాలపై మౌలిక సెస్ ఇక వివిధ రకాల వాహనాలపై మౌలిక సెస్ విధించడంతో వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 4% వరకూ నష్టపోయాయి. పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 10-15% వరకూ పెంచడంతో ఐటీసీ, గాడ్ఫ్రై ఫిలిప్స్ వంటి షేర్లు ఇంట్రాడేలో 8% వరకూ పతనమయ్యాయి. చివరలో ఐటీసీ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. మరోవైపు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ జైట్లీ కేటాయింపులు పెంచడం వ్యవసాయ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల షేర్లకు జోష్ నిచ్చింది. కావేరి సీడ్ కంపెనీ, ర్యాలీస్ ఇండియా, శక్తి పంప్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. జైన్ ఇరిగేషన్, మోన్శాంటో వంటి కంపెనీల షేర్లు బాగా పెరిగి ఆ తర్వాత లాభాల స్వీకరణతో నష్టాల పాలయ్యాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు నష్టపోయాయి. ఓఎన్జీసీ, భెల్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టుబ్రో, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలివర్, విప్రో, ఆదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, సిప్లా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీకోల్ ఇండియా షేర్లు 10% వరకూ నష్టపోయాయి. ఇక లాభపడిన షేర్ల విషయానికొస్తే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లుపిన్, హెచ్డీఎఫ్సీ పెరిగాయి. ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. -
రాష్ట్రానికి శూన్యహస్తం
కేంద్ర బడ్జెట్పై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ సాక్షి, విజయవాడ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి శూన్యహస్తం అందించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ తెలిపారు. బందరురోడ్డులోని పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్ధసారథి కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసమర్థత స్పష్టంగా కనపడిందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై బడ్జెట్లో ఒక్కముక్క చెప్పలేదని, ఎందుకు ఇవ్వరో వివరించలేదని పేర్కొన్నారు. అయితే కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రం ప్రత్యేకహోదాపై కేంద్రం ఇంకా ఆలోచిస్తోందని చెబుతున్నారని ఎద్దేవాచేశారు. ప్రత్యేక హోదాను, ప్రత్యేక ప్యాకేజ్ను సాధించడంలో కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి అసమర్థులని తేలిపోయిందన్నారు. రూ.32 వేల కోట్ల ఖర్చయ్యే పోలవరం ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.100 కోట్లు, ఈ బడ్జెట్లో మరో రూ.100 కోట్లు ముష్టివేస్తే ఆ ప్రాజెక్టును ఎన్ని ఏళ్లలో పూర్తి చేస్తారని ప్రశ్నించారు. మరొకపక్క 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తానని సిగ్గుఎగ్గూ లేకుండా ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అమరావతిని ప్రపంచంలో ఎనిమిదో వింతగా చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, ఒక్క రూపాయి కూడా రాకుండా ఏవిధంగా చేస్తారని రమేష్ ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు విగ్రహాన్ని పెట్టి చేతకాని అసమర్ధ ముఖ్యమంత్రే ప్రపంచంలో 8వ వింతగా చెప్పాలని ఎద్దేవాచేశారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉన్నా బడ్జెట్లో ఒక్కరూపాయి ఇవ్వలేదన్నారు. ఇప్పటికే మూడు బడ్జెట్లు అయిపోయాయని, ఇంకా రెండు బడ్జెట్లు మాత్రమే ఉన్నాయని ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీసి అడగాలని సూచించారు. లేదంటే చంద్రబాబు అఖిలపక్షం వస్తే ఆయన వెంట ఢిల్లీ వచ్చి నిధులు అడగడానికి తామంతా సిద్ధమని చెప్పారు. చంద్రబాబుకు రాష్ట్రానికి నిధులు రాబట్టి అభివృద్ధి చేయడంపై శ్రద్ధ లేదని, ఎమ్మెల్యేలను రూ.20 కోట్లు పెట్టి కోనేందుకు మాత్రమ శ్రద్ధ ఉందని పేర్కొన్నారు. కేంద్రాన్ని గట్టిగా ఏదైనా ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసులో ఎక్కడ అరెస్టు కావాల్సి వస్తోందనని, తమ కేంద్ర మంత్రుల పదవులు ఎక్కడ పోగోట్టుకోవాల్సి వస్తుందోనని, ఎంపీల సమావేశంలోనూ సామరస్యంగానే మాట్లాడండి అంటూ ఎంపీలకు సర్దిచెప్పారని విమర్శించారు. -
రాజధానికి మొండిచెయ్యి...
⇒ కంటితుడుపులు... చేతి విదిలింపులతో సరి ⇒ రూ.6,769 కోట్ల ‘మెట్రో’కు కేటాయించింది రూ.106 కోట్లే ⇒ రూ.30 వేల కోట్ల పోలవరానికి రూ.100 కోట్లే ⇒ ఈ-మార్కెట్, పంటల బీమా పథకాలతో రైతులకు ఊరట ► రూ.6,769 కోట్ల ‘మెట్రో’కు కేటాయించింది రూ.106 కోట్లే ► రూ.30 వేల కోట్ల పోలవరానికి రూ.100 కోట్లే ► ఈ-మార్కెట్, పంటల బీమా పథకాలతో రైతులకు ఊరట ► మరోసారి పనిచేయని సీఎం పరపతి ► తీవ్రంగా నిరాశపర్చిన జైట్లీ బడ్జెట్ ► పేదలకు ఉచితంగా గ్యాస్, ఆరోగ్య బీమాలతో ఊరట కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్తగా ఏర్పాటైన నవ్యాంధ్ర రాజధానికి ఎటువంటి ప్రత్యేకత చూపలేదు. లోటు బడ్జెట్తో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్కు మిగిలిన రాష్ట్రాల కంటే కొంత ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు భావించారు. అయితే రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపే అంశాలేవీ బడ్జెట్లో లేకపోవడంపై అన్ని వర్గాలూ పెదవి విరుస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఝలక్ ఇచ్చింది. తాజా బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. కేంద్రంలో బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న టీడీపీ రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకొస్తుందని అన్ని వర్గాలూ భావిం చాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, రాజధానికి ప్రత్యేక ప్యాకేజీల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా కేంద్ర బడ్జెట్లో రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అంశాలేవీ లేకపోవడం బీజేపీ, టీడీపీల మిత్రపక్షంలోని డొల్లతనాన్ని తెలియజేసింది. ‘ప్రత్యేకం’ నో చాన్స్... విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చడానికి ప్రత్యేక హోదా కావాలని, బడ్జెట్లో ప్రత్యేక నిధులు, ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షించారు. అయితే కేంద్రం ప్రత్యేకానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రైల్వే బడ్జెట్లో సైతం ప్రత్యేక జోన్ ఊసెత్తలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రకటించలేదు. రాజధాని నిర్మాణానికి రూ.22 వేల కోట్లు ఖర్చు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా ప్రత్యేక నిధులు ఏమీ కేటాయించకపోవడం రాాజధాని వాసుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ‘మెట్రో’కు రూ.106 కోట్లు... విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి రూ. 6,769 కోట్లు వ్యయం అవుతుంది. బడ్జెట్లో రూ.106 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన ఎన్నేళ్లకు పూర్తవుతుందనే అనుమానం కలుగుతోంది. పోలవరానికి రూ.100 కోట్లు.. పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లను మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. సుమారు రూ.30 వేల కోట్లకు చేరిన ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయిస్తే, ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. సొంత ఇల్లు కల నెరవేరుతుందా? విజయవాడ వంటి నగరంలో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది కలగానే మిగులుతోంది. నగరంలోని సుమారు 1.50 లక్షల కుటుంబాలు సొంత ఇల్లు కావాలని కార్పొరేషన్కు ఐదారేళ్ల క్రితమే దరఖాస్తులు చేసుకున్నాయి. తక్కువ ధర కలిగి ఉండే మొట్టమొదటి ఇల్లు కొనుగోలుదారులకు అదనంగా రూ.50 వేల వడ్డీ తగ్గింపును అనుమతించాలని నిర్ణయించింది. దీని వల్ల మధ్య తరగతి కుటుంబాలకు కొంత ఊరట కలగనుంది. -
బడ్జెట్ పై ఎవరేమన్నారు...
గ్రామీణ ఇన్ఫ్రా రంగాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం వల్ల ఉపాధి కల్పనతో సహా డిమాండ్ కూడా పెరుగుతుందని వాల్మార్ట్ ఇండియా ప్రెసిడెంట్ క్రిష్ అయ్యర్ తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఇన్ఫ్రా, సామాజిక రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇన్ఫ్రా రంగంలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. - పవన్ గోయెంకా, ఎంఅండ్ఎం ఈడీ ప్రభుత్వం బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ఇన్ఫ్రా వృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నియోటియా చెప్పారు. ఈ బడ్జెట్ సమగ్రంగా ఉంది. ఎకానమీకి కీలకమైన అన్ని అంశాలనూ ఇది సృజించింది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో దీన్ని ప్రవేశపెట్టిన సంగతి గుర్తుంచుకోవాలి. - చిత్రా రామకృష్ణ, ఎన్ఎస్ఈ ఎండీ ఇది ప్రగతిశీల బడ్జెట్. దేశ వృద్ధికి దోహదపడుతుంది. ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గుదల విషయంపై నాలుగేళ్ల సమయమిచ్చిందని సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ అన్నారు. రూ.10 లక్షల పరిమితి మించిన డివిడెండ్స్పై అదనపు పన్ను విధించడం వల్ల దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లలోకి తక్కువ పెట్టుబడులు రావచ్చు. గతంలోనూ మనం ఇదే పరిస్థితిని చూశాం. - గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్ ఇది అభివృద్ధి అనుకూల బడ్జెట్ అని హిందూజా గ్రూప్ కంపెనీస్ (ఇండియా) చైర్మన్ అశోక్ పి. హిందూజా చెప్పారు. ప్రజల బడ్జెట్.. వేగవంతమైన వృద్ధికి ఈ బడ్జెట్ సూచనగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారి శ్రామికవేత్తలకు స్టాండ్ అప్ ఇండియా స్కీం కింద రూ. 500 కోట్ల కేటాయింపు ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలో జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఏర్పాటు ప్రతిపాదనతో వ్యాపారవేత్తలకు ఆర్థిక అధికార సంపాదన సంవత్సరంగా 2016-17 నిలుస్తుంది. డిజిటల్ లిటరసీ గ్రామీణ భారత్కు బూస్ట్నిస్తుంది. ఆరోగ్య రక్షణ రంగానికి తొలిసారిగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆకస్మికంగా జబ్బుపడ్డ పేద కుటుంబానికి రూ.1 లక్ష ఆరోగ్య బీమా కల్పించే పథకం, 3,000 జన ఔషధి స్టోర్ల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పడం, డయాలసిస్ పరికరాల విడిభాగాలపై పన్ను మినహాయింపులు ఇవ్వడం వంటి చర్యలతో ఆరోగ్య రక్షణ, వైద్య పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుంది. - సంగీత రెడ్డి, చైర్ పర్సన్, ఫిక్కి తెలంగాణ, ఏపీ శాఖ, అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ పన్నుల విషయంలో నిరాశ.. మొత్తంగా వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్ ఇది. వ్యాపారం చేసేందుకు అనువైన వాతావరణం చూపిం చారు. రానున్న రోజుల్లో మంచి ఫలితాలను ఇస్తుం ది. సీఐఐ ప్రతిపాదనలను చాలా వాటిని బడ్జెట్లో స్వీకరించారు. అయితే పన్నుల విషయంలోనే కాస్త నిరాశ. సెజ్ల మీద మ్యాట్ తీసేస్తారని అనుకున్నాం. కానీ కొనసాగిస్తున్నారు. వ్యవసాయం, రైతుల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. కొత్తగా పోర్ట్లు, రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ధి మౌలిక రంగానికి పెద్ద ఊరట. మేక్ ఇన్ ఇండియా, ఎంఎస్ఎంఈకి ప్రోత్సాహకాలు ప్రకటించడం ఆహ్వానించదగ్గది - రమేష్ దాట్ల, సీఐఐ దక్షిణ ప్రాంత వైస్ చైర్మన్ దేశీయ విమానయాన రంగానికి రెక్కలు! దేశీయ విమానయాన రంగానికి జై ట్లీ బడ్జెట్ కొత్త శకానికి నాంది పలికింది. తక్కువ ఖర్చు వాహకాలు (ఎల్సీసీ), మోడ్రన్ ఎయిర్పోర్ట్స్, దేశీయ విమానరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), అధునాతన సమాచార సాంకేతికత, చిన్న విమానాశ్రయాల ఏర్పాటు, ప్రాంతీయ అనుసంధానం వంటివి విమానయాన రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తాయి. రానున్న రోజుల్లో 80-120 సీట్లుంటే విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతుంది.. దీంతో 2020 నాటికి దేశీయ విమానయాన రంగం మూడో అతిపెద్ద విమానయాన రంగంగా.. 2030 నాటికి అతిపెద్ద విమానయాన రంగంగా వృద్ధి చెందుతుంది. - రమేష్ లింగమనేని, ఎయిర్కోస్టా చైర్మన్ బడ్జెట్.. సమతూకం! బడ్జెట్ రూపకల్పనలో సమతూకం పాటించారు. స్టార్టప్స్కు ఊతమిచ్చేలా చర్యలు తీసుకున్నారు. జీఎస్టీ అమలుపై కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు. అయితే పరిశ్రమ ఆశిస్తున్నట్టుగా ప్రస్తుత కేంద్ర పరోక్ష పన్నుల విధానాన్ని ప్రతిపాదిత జీఎస్టీకి అనుగుణంగా అమలు చేయాలి. సర్వీస్ ట్యాక్స్ పెంచకపోవడం ఆహ్వానించదగ్గది. - అనిల్రెడ్డి వెన్నం, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ వ్యవసాయానికి ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైతు లు పెట్టుబడులు తగ్గించేం దుకు వ్యవసాయంలో యాం త్రీకరణ పద్ధతులు ప్రవేశ పెట్టేందుకు అవకాశం కల్పించారు. తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు ఇవ్వడం, పండించిన పం టకు మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడం వంటివి ఆహ్వానించదగిన పరిణామాలు. - జి.వెంకటేశ్వరరావు, సీఐఐ, విజయవాడ జోన్ చైర్మన్ మొత్తంగా బడ్జెట్ భేష్.. బడ్జెట్ ఓవరాల్గా చూస్తే బాగుంది. అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు అధిక ప్రాధాన్యం లభించింది. దేశంలో గ్రామాలు అభివృద్ధి చెందు తాయి. వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. - చిట్టూరి సురేష్రాయుడు, సీఐఐ, ఏపీ చైర్మన్ -
ఊరిస్తున్న ‘అరుణ్’ కిరణాలు
అత్యధికుల జీవితాలు సేద్యం చుట్టూ అల్లుకున్న జిల్లాలో.. ఆ రంగానికి కాస్త మేలు చేకూరుతుందనిపించేలా ఉంది కేంద్ర బడ్జెట్. జిల్లాలో వెయ్యికి పైగా గ్రామాలకూ ఇది అనుకూలమే అనిపిస్తోంది. * ‘స్థానిక’ సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా నిధులు * పంటల బీమా ప్రీమియం గణనీయంగా తగ్గింపు * 3.6 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ * కాకినాడ జీజీహెచ్లో డయాలసిస్ యూనిట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లాలో భిన్నాభిపాయ్యాలు వ్యక్తమవుతున్నా.. మొత్తం మీద ఆయన ప్రకటించిన వరాలు ఊరిస్తున్నాయనే చెప్పాలి. వ్యవసాయం, వైద్య, ఆరోగ్య రంగాలకు మెరుగ్గా నిధులు కేటాయించడంపై జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ సరిపడినన్ని నిధుల్లేక కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్న గ్రామ పంచాయతీలకు, పురపాలక సంఘాలకు ఈ బడ్జెట్లో తీపివార్త వచ్చింది. ఒక్కో పంచాయతీకి రూ.90 లక్షల వరకూ నిధులొస్తాయి. అంటే 228% శాతం అధికంగా నిధులు వస్తాయన్నమాట. అలాగే శ్యామ్ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ కింద 300 అర్బన్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛభారత్ అభియాన్ కింద కూడా నిధులు రానున్నాయి. మొత్తం మీద చూస్తే రెండు నగరపాలక సంస్థలు, ఏడు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీలు, 1,028 గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లాకు దండిగానే నిధులు సమకూరవచ్చు. అయితే 13వ, 14వ ఆర్థిక సంఘాల ద్వారా ఇప్పటికే జిల్లాకు రూ.వంద కోట్ల వరకూ నిధులు వచ్చినా వాటిని ఏవిధంగా ఖర్చు చేయాలనే మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో అవి ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో మూలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్ ద్వారా సమకూర్చే నిధుల వినియోగం స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటేనే ఆశించిన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. జిల్లాకు 300 వర్మీ కంపోస్టు యూనిట్లు, 100 హేచరీలు ఇప్పటివరకూ ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగుచేసే పంటలకు 5.5 శాతం బీమా ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. ఈ బడ్జెట్లో ఆ ప్రీమియాన్ని ఖరీఫ్లో 2 శాతానికి, రబీలో 1.5 శాతానికి తగ్గించారు. జిల్లాలో 5 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పటివరకూ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారి పంటలకు మాత్రమే బీమా సౌకర్యం ఉంది. ఇక ప్రీమియం బాగా తగ్గడం రైతులంతా బీమా సౌకర్యం పొందే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకంగా బడ్జెట్లో నిధులు కేటాయించారు. దీనివల్ల 300 వర్మీ కంపోస్టు యూనిట్లు, 100 వర్మీకంపోస్టు హేచరీలు జిల్లాకు రానున్నాయి. కుప్పనూర్పు కళ్లాలు 500 మంజూరయ్యాయి. వీటన్నింటినీ జాతీయ ఉపాధి హామీ పథకంతో ముడిపెట్టనున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించనుంది. దీనివల్ల కరువు ప్రభావిత ప్రాంతాల్లో చెరువుల్ని అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుంది. మరిన్ని జన్ఔషధి దుకాణాలు కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ అధికమవుతున్న పరిస్థితుల్లో జిల్లా ప్రధానాస్పత్రులకు రక్తశుద్ధి యంత్రం (డయాలసిస్ యూనిట్) ప్రకటించడం ఆయా రోగులకు సాంత్వన చేకూర్చేదే. ఈ చికిత్సకు ఇప్పటివరకూ కిడ్నీ రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. నేషనల్ డయాలసిస్ సర్వీస్ ప్రోగ్రాం కింద నిధులు కేటాయించి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కాకినాడ జీజీహెచ్లో డయాలసిస్ యూనిట్ను నిర్వహించనున్నారు. అలాగే తక్కువ ధరలకు ప్రాణావసర మందులను అందించే జనరిక్ మందుల దుకాణాలు మరిన్ని రానున్నాయి. పీఎం జన్ఔషధి యోజన పథకం కింద వీటిని విస్తరించనున్నారు. ఇక వైద్య సౌకర్యం కోసం ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకూ ప్రయోజనం చేకూర్చేలా కొత్త ఆరోగ్య రక్షణ పథకం అమల్లోకి రానుంది. వయో వృద్ధులకు మరో రూ.30 వేలు అదనంగా ప్రయోజనం కలుగుతుంది. 3.6 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా లభించనుంది. అదీ కుటుంబంలోని మహిళాసభ్యుల పేరుతో మంజూరు చేస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న 16 లక్షల బీపీఎల్ (తెల్లరంగు రేషన్ కార్డుల ప్రకారం) కుటుంబాల్లో ఇప్పటికే 11 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన ఐదు లక్షల కుటుంబాల్లో దీపం పథకం కింద ఇటీవల 1.40 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ఉచితంగా కనెక్షను ఇవ్వడం వల్ల 3.60 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ‘ముద్ర’ నిబంధనలు సరళతరం చేయూలి.. చిరు వ్యాపారులకు రుణసౌకర్యం కల్పించేందుకు ముద్రా రుణాలను పరిచయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏకంగా రూ.1.80 లక్షల కోట్లు కేటాయించింది. అయితే బ్యాంకర్ల సవాల క్ష నిబంధనలు పెడుతుండటంతో ముద్ర రుణాల లక్ష్యం నెరవేరడం లేదు. ఈసారైనా నిబంధనలు సరళతరం చేస్తే చిరు వ్యాపారులకు మేలు చేకూరుతుంది. మరో విశేషం ఏమిటంటే వారంలో అన్ని రోజులు దుకాణాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోల‘వరం’పై చిన్నచూపు.. కాగా వ్యవసాయ ప్రధానమైన జిల్లాకు కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు నామమాత్రంగా నిధులివ్వడంపై నిరసన స్వరం వినిపిస్తోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పినా మరోవైపు చుక్కలను తాకుతున్న ఎరువులు, పురుగుమందులను తగ్గించేందుకు ఎలాంటి రాయితీలు ఇస్తామనేది చెప్పకపోవడంపై రైతులు, ఆదాయపు పన్ను మినహారుుంపు పరిమితి పెంచకపోవడంపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. విభజన అంశాలకు బడ్జెట్లో చోటేదీ? ఆంధ్రప్రదేశ్ విభజన నాటి హామీలకు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడం చూస్తే ఇది పూర్తిగా సీఎం చంద్రబాబునాయుడు అసమర్థతగానే కనిపిస్తోంది. నూతన రాజధాని నిర్మాణంపై ఎంతో నమ్మబలికినప్పటికీ చంద్రబాబుకు బీజేపీ ఇస్తున్న విలువేమిటో కేంద్ర బడ్జెట్ చూస్తే అర్థమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలపై ఎంపీలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమైనా ఏ ఒక్కటీ సాధించలేకపోయారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే విదిలించడాన్ని చూస్తే ఇది ఎన్ని దశాబ్దాలకు పూర్తవుతోందో? అంచనాలు ఎన్నివేల కోట్లకు చేరతాయో? తెలియని పరిస్థితి నెలకొంది. - జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత పోలవరానికి నిధులింతేనా..! కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాంటి కేటాయింపులూ లేకపోవడం విచారకరం. పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు కేటాయించడం ఏమాత్రం సమంజసం కాదు. ఇలాగైతే ఈ ప్రాజెక్టు ఎన్నేళ్లపాటు కడతారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు ప్రకటించిన పన్ను రాయితీ కూడా కంటితుడుపుగానే ఉంది. - దంటు సూర్యారావు, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి సాంకేతిక విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కేంద్రం చెబుతున్న తరుణంలో ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపడవు. యూనివర్సిటీల్లో స్టార్టప్ నెలకొల్పడానికి నిధులు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. మన రాష్ట్రంలో ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు కూడా తక్కువగా నిధులు కేటాయించారు. - కొప్పిరెడ్డి పద్మరాజు, డెరైక్టర్, అకడమిక్ ప్లానింగ్, జేఎన్టీయూకే నెల వేతనం కోతే.. ఆదాయపన్ను రాయితీ పెంచకపోవడం ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరచింది. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెరుగుతున్న ఇంటి అద్దెలనుబట్టే పీఆర్సీ పెంచాలని కోరుతాం. కానీ పీఆర్సీలో పెంచినా, ఆదాయపన్నుతో జీతం కోత వేసేస్తే ఉపయోగం ఏముంది? ఏడాదంతా కష్టపడి 11 నెలలకే జీతం తీసుకుంటున్నట్లు అవుతోంది. ఒక నెల జీతంపై ఆదాయపన్ను కోత పడుతోంది. రూ.10 లక్షల వరకూ మినహాయింపు ఇవ్వాలని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఉపయోగం ఉండడంలేదు. - బూరిగ ఆశీర్వాదం, ఏపీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఏపీకి నిరాశ కేంద్ర బడ్జెట్ ఏపీని నిరాశపరచింది. విభజన చట్టంలో ఉన్నవాటిని ఈ బడ్జెట్లో సాధించుకోలేకపోయాం. రాజధాని అమరావతికి కూడా నిధులు లేవు. సీఎం చంద్రబాబు చెబుతున్న ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా నిధులు లేవు. ప్రత్యేక హోదా ప్రస్తావనకే నోచుకోలేదు. పోలవరం ప్రాజెక్టుకు అంతంతమాత్రంగా నిధులు కేటాయించారు. ఉద్యోగులు, కార్మికులకు శూన్యహస్తం చూపింది. వ్యవసాయ రంగానికి, నీటిపారుదలకు, గ్రామీణ ప్రాంతాలకు మంచి ప్రోత్సాహం అందించింది. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు టీడీపీ ఎంపీలను ‘డిమాండ్ చేయకండి.. రిక్వెస్ట్ చేద్దాం’ అని ఆదేశించడం చంద్రబాబు మార్కు రాజకీయానికి నిదర్శనం. మొన్న రైల్వే బడ్జెట్లో, నేడు సాధారణ బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. - చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట - సేకరణ : కొత్తపేట ప్రజలకు భారాలు.. కార్పొరేట్లకు రాయితీలు ‘ప్రజలకు భారాలు.. కార్పొరేట్లకు రాయితీలు’ అన్నట్టుగా కేంద్ర బడ్జెట్ ఉంది. తగ్గిన ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి పన్నులు పెంచేలా ఈ బడ్జెట్ ఉంది. పన్నుల ద్వారా 2014-15లో రూ.9,03,615 కోట్ల రాబడి వస్తే, 2015-16లో రూ.9,47,508 కోట్లకు పెరగగా, ఇప్పుడు రూ.10,54,101 కోట్లకు పెంచారు. అంటే ఈ ఏడాది రూ.1,06,593 కోట్ల పన్నుల భారాన్ని ప్రజలపై మోపిందన్నమాట. పోలవరం ప్రాజెక్ట్కు కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు సరిపోతుంది? మొత్తం రూ.19,78,060 కోట్లుగా ఉన్న బడ్జెట్లో రూ.5.5 లక్షల కోట్ల బడాబాబుల పన్ను బకాయిలున్నా వాటిమీద ఎటువంటి చర్యలూ లేవు. రైతులు వాడే ఎరువులపై రూ.2వేల కోట్లు, ఆహార సబ్సిడీలు రూ.5 వేల కోట్లు తగ్గించారు. ఎస్సీ సబ్ప్లాన్కు 16 శాతం కేటాయించాల్సి ఉండగా 7 శాతం, ఎస్టీ సబ్ప్లాన్కు 8.6 శాతం కేటాయించాల్సి ఉండగా 4.4 శాతం కేటాయించారు. పాఠశాల విద్యకు 2015-16లో రూ.69,794 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.63,826 కోట్లకు తగ్గించారు. - దువ్వా శేషుబాబ్జీ, సీపీఎం జిల్లా కార్యదర్శి పోలవరానికి మళ్లీ నిరాశే.. కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడం చాలా అన్యాయం. దీంతో ఉభయ గోదావరి జిల్లాల రైతులకు నిరాశే ఎదురైంది. టీడీపీ, బీజేపీ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్ట్ 2018కి పూర్తి చేస్తామని గత ఎన్నికల్లో చెప్పారు. ఇప్పటివరకూ కనీసం రూ.500 కోట్లు కూడా మంజూరు చేయలేదు. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వెంటనే రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయకపోతే పోలవరం పూర్తవదు. - తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి - సేకరణ : కాకినాడ సిటీ -
జైట్లీ సెస్ అస్ర్తం
ఖజానాకు మరింత ఆదాయం రాబట్టే క్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఈసారి సెస్సు అస్త్రాన్ని ప్రయోగించారు. సర్వీసు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వాటన్నింటిపైనా కృషి కల్యాణ్ సెస్సును వడ్డించారు. కార్లపై మౌలిక సెస్సును వేసి వాహన కొనుగోలు భారం చేశారు. మరికొన్ని సుంకాలు, పన్నుల వడ్డింపుతో మరింత ఆదాయంపై దృష్టిపెట్టారు. కార్ల ధరలకు రెక్కలు.. న్యూఢిల్లీ: బడ్జెట్లో వాహనాలపై ప్రవేశ పెట్టిన మౌలిక సెస్ పుణ్యమాని కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. చిన్న కార్లపై రూ.2,000 నుంచి పెద్ద డీజిల్ ఎస్యూవీలపై రూ. లక్ష వరకూ కార్ల ధరలు పెరగనున్నాయి. అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కార్లపై ఎడాపెడా పన్నులు బాదేశారు. ముఖ్యంగా డీజిల్ వాహనాలపై ఆయన ఏమాత్రం కనికరం చూపలేదు. 1,500 సీసీ ఇంజిన్ సామర్థ్యం, 4 మీ. లోపు పొడవున్న డీజిల్ వాహనాలపై 2.5 శాతం సెస్ను ఆర్థిక మంత్రి వడ్డించారు. ఇంతకు మించిన ఇంజిన్ సామర్థ్యం గల కార్లు, ఎస్యూవీలు, సెడాన్లపై 4% సెస్ను జైట్లీ విధించారు. ఇక 1,200 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్/ఎల్పీజీ/సీఎన్జీ కార్లపై 1 శాతం సెస్ ఉంటుందని జైట్లీ చెప్పారు. రూ.10 లక్షలకు మించిన లగ్జరీ వాహనాలపై 1% పన్నును వడ్డించారు. ఎక్సైజ్ సుంకాలు తగ్గించాలని కోరుతున్న వాహన కంపెనీలకు సెస్ విధింపు అశనిపాతమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఊహించని విధింపు... సెస్ విధింపు వల్ల మారుతీ ఆల్టో, టాటా నానో వంటి చిన్న కార్లపై ధరలు రూ.2,500 వరకూ, ఇక రూ.30 లక్షలకు మించిన వాహనాలపై రూ. లక్ష వరకూ ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెస్ విధింపు ఊహించనిదని మారుతీ సుజుకీ చైర్పర్సన్ ఆర్.సి. భార్గవ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్ల ధరలు పెంచక తప్పదని పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్య సమస్య నివారణకు గాను 2020 నుంచి యూరో సిక్స్ నిబంధనలు అమలు చేయాలని అడిగామని, దీనివల్ల కార్ల తయారీకి సంబంధించి తమ పెట్టుబడులు పెరుగుతాయని, కార్ల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. వాహన పరిశ్రమకు మౌలిక సెస్ పెద్ద దెబ్బ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఎంట్రీ లెవల్ కారైన ఈయాన్పై రూ.3,000 వరకూ, శాంటాఫే ఎస్యూవీపై రూ.80,000 వరకూ ధరలు పెరుగుతాయని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇప్పడిప్పడే కోలుకుంటున్న వాహన పరిశ్రమ సెంటిమెంట్పై ఈ సెస్ విధింపు ప్రతికూల ప్రభావం చూపుతుందని టాటా మోటార్స్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. బీమాలో ఎఫ్డీఐ నిబంధనల సడలింపు న్యూఢిల్లీ: పెట్టుబడులు మరిన్ని ఆకర్షించే దిశగా బీమా, పింఛను రంగాలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, అసెట్ రీకన్స్ట్రక్షన్ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలు సడలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీని ప్రకారం బీమా, పింఛను రంగాల్లో ఇకపై 49 శాతం దాకా ఎఫ్డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. ఇప్పటిదాకా ఆటోమేటిక్ పద్ధతిలో 26 శాతం ఎఫ్డీఐలను మాత్రమే అనుమతిస్తున్నారు. అటు నిర్దిష్ట నిబంధనలకు లోబడి అసెట్ రీకన్స్రక్షన్ కంపెనీల్లో (ఏఆర్సీ) ఆటోమేటిక్ పద్ధతిలో ఎఫ్డీఐల పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. దేశీ స్టాక్ ఎక్స్ఛేజీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు. దీని వల్ల దేశీ స్టాక్ ఎక్స్చేంజీలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇక బ్యాంకులు మినహా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) పెట్టుబడుల పరిమితిని ఆటోమేటిక్ పద్ధతిలో ప్రస్తుత 24 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల అమలు సజావుగా సాగేలా.. దేశీయంగా కేంద్ర రాష్ట్ర పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకోవాలని జైట్లీ ప్రతిపాదించారు. ఇది కుదుర్చుకున్న రాష్ట్రాలు.. విదేశీ ఇన్వెస్టర్ల దృష్టిని మరింతగా ఆకర్షించగలవని పేర్కొన్నారు. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ.56,500 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)ల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా ఒనగూరేది రూ.36,000 కోట్లు. మిగిలిన రూ.20,500 కోట్లు వ్యూహాత్మక వాటాల(మెజారిటీ వాటాలు) విక్రయం ద్వారా సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. వ్యూహాత్మక విక్రయాలకు సంబంధించి నష్టదాయక కంపెనీలతోపాటు, లాభదాయక కంపెనీలనూ జాబితాలో చేర్చనుంది. కాగా వ్యూ హాత్మక పెట్టుబడుల విక్రయంలో భాగంగా ఐడీబీఐ బ్యాంక్లో తన వాటాను 50% దిగువకు తగ్గించుకునే విషయాన్ని పరిశీలించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.69,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకోగా రూ.25,312 కోట్లను మాత్రమే సమీకరించుకోగలిగింది. దీంతో వరుసగా ఆరేళ్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని సాధించలేకపోయినట్లయ్యింది. ఈ శాఖకు కొత్తపేరు..: పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పేరు మార్పును బడ్జెట్ ప్రతిపాదించింది. దీనిని ఇకమీదట ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ(డీఐపీఏఎం)గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఫండింగ్కు కొత్త విధాన ప్రతిపాదనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. పీఎస్యూలు నిరుపయోగంగా ఉన్న తమ ఆస్తుల విక్రయం ద్వారా నిధులను సమకూర్చుకోవడం దీని ముఖ్యోద్దేశం. 10 లక్షల డివిడెండుపై పన్ను.. వ్యక్తులు, సంస్థలకు వచ్చే డివిడెండు రూ. 10 లక్షలు దాటితే 10 శాతం పన్ను విధించాలని బడ్జెట్లో జైట్లీ ప్రతిపాదించారు. ఇది డివిడెండు డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)కి అదనంగా ఉండనుంది. ఇప్పటివరకూ డివి డెండ్లు తీసుకునే వాటాదారులు కాకుండా, వాటిని పంపిణీ చేసే కంపెనీలు డీడీటీ చెల్లిస్తుండగా, ఇకపై రూ. 10 లక్షల పైగా డివిఢ డెండు అందుకునే వారు కూడా పన్ను చెల్లించాల్సి వుంటుంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణలు 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగలవు. మరోవైపు ఆప్షన్ ట్రేడింగ్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను 0.017 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు. ఇది జూన్ 1 నుంచి అమల్లోకి రాగలదని అంచనా. ♦ మొబైల్ ఫోన్లు కాస్త ఖరీదు.. ♦ 5% దాకా పెరిగే అవకాశం ♦ ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్, పీసీలు కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దూకుడు మీద ఉన్న మొబైల్ ఫోన్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాపులేటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ (పీసీబీ) దిగుమతులపై 2 శాతం స్పెషల్ అడిషనల్ డ్యూటీ విధించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే చార్జర్లు, అడాప్టర్లు, బ్యాటరీలు, హెడ్సెట్లు, మొబైల్స్లో వాడే స్పీకర్ల దిగుమతులపై ఇప్పటి వరకు ఉన్న పలు సుంకాల మినహాయింపులను కూడా ఉపసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల ధర 5 శాతం పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికే ఈ చర్యలని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. అలాగే ఐటీ, హార్డ్వేర్, క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఉత్పత్తుల ధర తగ్గుతుందని, దేశీయ పరిశ్రమలో పోటీతత్వం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పీసీబీలను ల్యాప్టాప్, పర్సనల్ కంప్యూటర్ల తయారీలోనూ వినియోగిస్తారు. తాజా ప్రతిపాదన ప్రభావంతో వీటి ధరలు కూడా అధికం కానున్నాయి. తిరోగమన చర్య.. పన్నుల పెంపు ఏమాత్రం ఉన్నా అది కస్టమర్లపై వేయకతప్పదని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ) ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ చెప్పారు. స్పెషల్ అడిషనల్ డ్యూటీ విధింపు పరిశ్రమకు తిరోగమన చర్య అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిపాదనపై పరిశ్రమ అసంతృప్తిగా ఉందని లావా ఇంటర్నేషనల్ చైర్మన్ హరి ఓమ్ రాయ్ తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం మొబైళ్లు, ట్యాబ్లెట్ పీసీల ధర 5 శాతం పెరుగుతుందని వెల్లడించారు. కాగా, ఇక నుంచి దిగుమతైన చార్జర్లు, అడాప్టర్లు, బ్యాటరీలు, హెడ్సెట్లు, మొబైల్స్లో వాడే స్పీకర్లపై బేసిక్ కస్టమర్స్ డ్యూటీ 10%, కౌంటర్వెయిలింగ్ డ్యూటీ 12.5 శాతం విధిస్తారు. వాయిదాకు విన్నవిస్తాం.. స్పెషల్ అడిషనల్ డ్యూటీ విధింపు పరిశ్రమకు పెద్ద షాక్ అని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. నిర్ణయాన్ని వాయిదా వేయాల్సిందిగా ఆర్థిక మంత్రిని కలిసి విన్నవిస్తామని చెప్పారు. ‘పీసీబీల తయారీ భారత్లో లేనే లేదు. అసలు ప్రభుత్వం వీటి తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకున్న చర్యలే లేవు. అలాంటప్పుడు ఉన్నఫలంగా డ్యూటీ వేయడం తగదు. కనీసం ఏడాదిపాటు వాయిదా వేయాల్సిందే’ అని వెల్లడించారు. బ్యాంకులకు రూ.25,000 కోట్ల తాజా మూలధనం బ్యాంకులకు వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర రూ.25,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టత, పోటీతత్వం మెరుగుదలకు ప్రభుత్వం తగిన పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంక్ బోర్డ్ బ్యూరో కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. బ్యాంకుల్లో మొండిబకాయిల సమస్య కొత్తదేమీ కాదని, ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బ్యాంకుల రోజూవారీ రుణ మంజూరు విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. బకాయిల్లో రికవరీ వేగంగా జరిగేలా చూడ్డానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ను పటిష్టపరుస్తామని కూడా స్పష్టం చేశారు. బ్యాంకింగ్ రంగానికి వచ్చే ఏడాది రూ.25,000 కోట్లే కాకుండా అవసరమైతే మరింత నిధులు సైతం సమకూర్చుతామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఒక్క రోజులోనే కంపెనీ నమోదు ఒక్క రోజులోనే కంపెనీని నమోదు చేసుకునే వీలుండేలా 2013 నాటి కంపెనీల చట్టాన్ని సవరించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తేనున్నామని జైట్లీ చెప్పారు. వ్యాపారం చేయడం అత్యంత సులభంగా ఉండేలా చూడడం, స్టార్టప్లకు అనుకూలమైన నిబంధనలతో ఈ బిల్లును రూపొందిస్తున్నామని 2016-17 బడ్జెట్ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. కంపెనీల చట్టంపై నియమించిన ప్రభుత్వ కమిటీ ఇటీవలే సమర్పించిన తన నివేదికలో వంద సవరణలను సూచించింది. ఈ సవరణల ఆధారంగా ఈ బిల్లును తయారు చేస్తున్నామన్నారు. పసిడి బాండ్లకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఊరట న్యూఢిల్లీ: పసిడి బాండ్ల పథకానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా .. వీటికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గోల్డ్ బాండ్ స్కీము కింద 5,10,50, 100 గ్రాముల పసిడికి సరిసమానమైన విలువతో గోల్డ్ బాండ్లను ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇవి 5-7 ఏళ్ల కాల వ్యవధితో లభిస్తాయి. ఆర్బీఐ ఇప్పటిదాకా ఈ బాండ్లను 2 సార్లు జారీ చేసింది. మరోవైపు, పసిడి డిపాజిట్ల పథకం కింద ఇచ్చే డిపాజిట్ సర్టిఫికెట్లపై వచ్చే వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్కు పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని జైట్లీ చెప్పారు. పసిడి డిపాజిట్ పథకాన్ని గతేడాది నవంబర్ 5న ప్రారంభించారు. పుత్తడి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో ఈ 2 పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. -
కలలు.. కల్లలు
ఆశల బడ్జెట్ మహానగర వాసులకు నిరాశే మిగిల్చింది. మధ్యతరగతి కలలు కల్లలు చేసింది. ప్మాస్మాటీవీలు, విమానప్రయాణం, స్మార్ట్ఫోన్లు, ఏసీల కొనుగోలు, ఆభరణాలు కొనుగోలు వంటి కోరికలను అందని ద్రాక్షగా మార్చేసింది. తాజా కేంద్ర బడ్జెట్తో మహానగరంలో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి వేతనజీవులు, మధ్యాదాయ వర్గాలకు చేదు కబురే మిగిల్చింది. పలు అంశాల్లో సుంకం పెంపు అంశం ఆయా వర్గాలను ఉస్సూరు మనిపించింది. ఆయా అంశాలపై ఫోకస్... - సాక్షి, సిటీబ్యూరో ఆరోగ్యకర బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రజారోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆరోగ్యకర బడ్జెట్ను రూపొందించింది. స్కిల్ డెవలప్మెంట్కు భారీ నిధులు కేటాయించడం ద్వారా యువతకు తద్వారా నిరుద్యోగ సమస్య తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ విషయానికొస్తే ఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ, మెట్రాలజీ, సీడీఏ వంటి సంస్థలకు భారీ నిధులు కేటాయించడం హర్షనీయం. - ఎంపీ మల్లారెడ్డి స్మగ్లింగ్ను ప్రోత్సహించేలా ఉంది ‘దిగుమతి సుంకాన్ని 10 నుంచి 11శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకొన్న నిర్ణయం స్మగ్లింగ్ను ప్రోత్సహించేలా ఉంది. కేజీ బంగారం ధర రూ.30లక్షలు ఉందనుకొంటే... ప్రస్తుతం పెంచిన దిగుమతి సుంకం వల్ల కేజీ ధర రూ.33లక్షలకు ఎగబాకుతుంది. గ్రాము రూ.30ల చొప్పున 10 గ్రాములకు రూ.300, అలాగే 100 గ్రాములకు రూ.3వేలు ధర పెరుగుతుంది. ద్రవ్యలోటు నియంత్రించాలన్న సాకుతో గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేయడం కేంద్రమే బంగారం వ్యాపారం చేస్తోంది.10-15% మేర వ్యాపారం తగ్గే అవకాశం ఉంది.’- డాక్టర్ జె.రామారావు, సీఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ నిధుల్లో కోత బడ్జెట్లో కేంద్ర పథకాల నిధుల్లో కోత పెట్టారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంపును సాకుగా చూపిస్తూ రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాలకు నిధులు తగ్గించారు. ఫలితంగా సుమారు 28 పథకాల నిధుల కేటాయింపులు 18 నుంచి 20 శాతం వరకు తగ్గ ముఖం పట్టింది. మెట్రో సిటీ లకు పెరుగుతున్న మౌలిక అవసరాలకు సరిపడ నిధులు కేటాయింపు జరుగలేదు. మరో 30 శాతం నిధులు పెంచితే కానీ స్మార్ట్ సిటీ లక్ష్యం సాధ్యం కాదు. జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో పెరిగిన జాబ్స్ కార్డు, కనీస వేతనాలకు సరిపడ నిధుల కేటాయింపు జరుగలేదు. - మద్దిరాల సుధాకర్ డేవిడ్, కో-ఆర్డినేటర్, సెంటర్ ఫర్ రూరల్ స్టడీ అండ్ డెవలప్మెంట్ /బడ్జెట్ సెంటర్, పెట్టుబడిదారులకు అనుగుణంగా బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడుదారులకు, పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసింది. కొత్తసీసాలో పాత సారా అన్న చందంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ను తయారు చేశారు. అట్టడుగు వర్గా లకు ఈ బడ్జెట్ ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదు. వలసల నివారణ ప్రస్తావన బడ్జెట్లో లేదు. - ట్రై ఫెడ్ మాజీ చైర్మన్ ఎం. సూర్యానాయక్ ట్యాక్సీ వాహనాలకు పెంపు నుంచి మినహాయింపు ఉండాలి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు, రూ.10 లక్షలకు పైగా ఖరీదు చేసే కార్లపైన రూ.30 నుంచి రూ.40 వేల వరకు ధర పెరిగే అవకాశం ఉంది. ఈ వాహనాలను వినియోగించే సంపన్నులపైన అది పెద్ద భారం కాబోదు. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వాళ్లు వెనుకాడబోరు. ధరల పెంపు ప్రభావం పెద్దగా ఉండదు. కానీ ట్యాక్సీ వాహనాలపైన మాత్రం ఇది భారమే. కొంతమంది నిరుద్యోగులు, సామాన్యులు సొంతంగా వాహనాలు కొనుగోలు చేసి ట్యాక్సీలుగా నడుపుతారు. అలాంటి వాళ్లకు ఇది భారమే. వ్యక్తిగత వినియోగం కోసం కొనుగోలు చేసే వాహనాలపైన ధరలు పెంచి, రవాణా రంగంలో వినియోగించే టాక్సీని మినహాయిస్తే మంచిది. ట్యాక్సీ వాహనాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. కాబట్టి వీటికి మినహాయింపును ఇవ్వాలి. - రోహిత్కొఠారీ,ఆటోమొబైల్ డీలర్ వేతన జీవులకు నిరాశే కేంద్ర బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలకు, వేతన జీవులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈ బడ్జెట్ వారికి నిరాశనే మిగిల్చింది. మార్కెట్లో వస్తు,సేవలను వినియోగించే మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్నులో రాయితీనివ్వాల్సింది. నిజానికి మధ్యతరగతి వేతన జీవుల వల్లనే ఆర్ధిక రంగం అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించినట్లు కనిపించడం లేదు. ఇక స్వచ్ఛ భారత్కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ప్రజలపైన సెస్ రూపంలో 0.5 శాతం మేర (రూ.9 వేల కోట్ల వరకు) భారం మోపి, అంతే మొత్తాన్ని స్వచ్ఛ భారత్ కోసం కేటాయించారు. ఇదేం బాగాలేదు. కోటి మందికి నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చేసిన ప్రకటన కూడా వాస్తవానికి దూరంగానే ఉంది. - ప్రొఫెసర్ నాగేశ్వర్, సామాజిక, ఆర్ధిక రంగ నిపుణులు పొగరాయుళ్లకు సెగ... గ్రేటర్లో నెలకు సుమారు కే, వంద కోట్ల వరకు సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతుంటాయని అంచనా. పొగాకు ఉత్పత్తులపై 10 నుంచి 15 శాతం ఎక్సైజ్ సుంకం విధించడంతో ఒక్కో సిగరెట్ ప్యాకెట్పై రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. విమానయానం భారమే మధ్యతరగతి కలలు గంటున్న విమాన యానం తాజా బడ్జెట్తో కలగానే మిగలనుంది. జెట్ ఇంధనాలపై 6 శాతం ఎక్సైజ్డ్యూటీ పెంపుతో విమాన చార్జీలకు రెక్కలు రానున్నాయి. దేశ,విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న నగరవాసులు,ఉద్యోగులు,విద్యార్థులు అదనపు భారం భరించక తప్పని పరిస్థితి నెలకొంది. కొందరు విమాన ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. స్టార్టప్లకు పన్ను రాయితీ నగరంలో టీ-హబ్ ప్రారంభంతో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న స్టార్టప్ కంపెనీలు ఆర్జించే ఆదాయంపై వరుసగా మూడేళ్లపాటు వందశాతం పన్ను రాయితీనివ్వడంతో ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు ఊరటనిచ్చే అంశం. ఇక ఒకేరోజులో స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్, అనుమతి ఇస్తామని ప్రకటించడంతో నగరంలో మరిన్ని అంకుర పరిశ్రమలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారు ఆభరణాలు మరీ ప్రియం ఇంటి బడ్జెట్లో కొంత పొదుపు చేసుకొని పెళ్లిళ్లు, వివాహాది శుభకార్యాలకు నగరంలో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఆభరణాల దిగుమతిపై ఒకశాతం ఎక్సైజ్సుంకం విధించడంతో రూ.10 వేలు ఆపై కొనుగోలు చేసే రెడీమేడ్ ఆభరణాల ధరలు అమాంతం పెరిగే అవకాశాలుండడంతో మహిళలు కొనుగోలును వాయిదా వేసుకునే అవకాశాలుంటాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంకెల గారడీలే కేంద్రం ప్రకటించిన బడ్జెట్ అంకెల గారెడీలా ఉంది. మసిపూసి మారేడు కాయ చేయడం తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదు. వేతన జీవులకు ఆదాయ పన్ను నుంచి మరింత ఊరటనిచ్చి ఉండాల్సింది. ఉద్యోగుల పొదుపు మొత్తం ప్రావిడెంట్ ఫండ్ పైన కూడా పన్ను భారం పడుతుంది. ప్రావిడెంట్ ఫండ్ను స్థూల ఆదాయంలో జమ చేయడం వల్ల దానికి కూడా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అలా కాకుండా ఉద్యోగుల స్థూల ఆదాయం నుంచి పీఎఫ్ను పక్కనపెట్టి మిగతా ఆదాయానికి పన్ను విధిస్తే బాగుండేది. అవినీతిని అంతం చేసే ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, పాలనారంగంలో పారదర్శక తను, జవాబుదారీతనాన్ని పెంచకుండా ఇలాంటి బడ్జెట్లు మరెన్ని వచ్చినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదు. - ప్రొఫెసర్ రామచంద్రయ్య,సెస్ పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత తగ్గింది కేంద్ర బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత తగ్గింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఆశించిన మేర కేటాయింపులు జరుగలేదు. మౌళిక సదుపాయల కల్పనపై దృష్టి సారించలేదు. కేవలం బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా రాయితీలు ప్రకటించారు. - అబుల్ ఫత్హే సయ్యద్ బందిగి బాదేషా ఖాద్రీ, డెరైక్టర్, తెలంగాణ చాంబర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ప్రమోషన్ , హైదరాబాద్ చిరుద్యోగులకు ఉపశమనం.. సొంత ఇళ్లు లేని, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె అలవెన్సు పొందని చిరుద్యోగులకు స్వల్ప ఊరట లభించింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80జిజి కింద అద్దె మినహాయింపు పరిమితిని రూ.24 వేల నుంచి రూ.60 వేలకు పెంచడం కాస్త ఊరటనిచ్చింది. వీటి ధరలు తగ్గడం కాస్త ఊరటే.. బ్రెయిలీపేపర్, డయాలసిస్ పరికరాలు, ఈ రీడర్స్, రూటర్స్, బ్రాడ్బ్యాండ్ మోడెమ్స్, సెట్టాప్ బాక్సులు (టీవీ,ఇంటర్నెట్), డిజిటల్ వీడియో రికార్డర్ల ధరలు తగ్గనుండడం ఊరటనిచ్చే అంశం. ఇక యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు తాజా బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు నెలకొల్పుతామనడంతో యువత ఆసక్తిగా ఉన్నారు. లగ్జరీ కారు కొంటే బాదుడే గ్రేటర్లో ఎగువ మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులు అధికంగా కొనుగోలు చేసే లగ్జరీ,ఎస్యూవీ కార్లపై 4 శాతం అదనపు బాదుడుకు శ్రీకారం చుట్టారు. దీంతో పది లక్షలు, ఆపై విలువ చేసే కార్ల ధరలు సుమారు రూ.30 నుంచి రూ.50 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నగరంలోని ఆటోమొబైల్ డీలర్లు తెలిపారు. చిన్న ఇళ్లకు ఊరట 60 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణం ఉండే ఇళ్లు,ఫ్లాట్లు కొనుగోలు చేసే వేతనజీవులపై సేవా పన్ను మినహాయించడం ఊరటనిస్తోంది. మరోవైపు రూ.35 లక్షల లోపు గృహరుణాలు పొందేవారికి రూ.50 వేల మేర వడ్డీ రాయితీ ప్రకటించడం ఉపశమనం కలిగించే అంశం. చల్లటి వస్తువులపై బాదుడే మండు వేసవిలో ఏసీ గాలిలో సేదతీరుదామనుకున్న వారికి నిరాశే మిగిలింది. తాజా బడ్జెట్లో వీటిపై పన్ను బాదుడుకు తెరతీయడంతో వీటి ధరలు శ్రేణిని బట్టి రూ.4 నుంచి రూ.8 వేల వరకు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కిడ్నీ రోగులకు ఓ వరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత లభించింది. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా కల్పించడం అభినందనీయం. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కోసం మారు మూల గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ డయాలసిస్ యూనిట్లు ఏర్పాటుతో పాటు జనఔషధి దుకాణాలు పెట్టి తక్కువ ధరకే మందులు అందించాలని నిర్ణయించడం హర్షనీయం. - డాక్టర్ రూమ సిన్హా, యూరో గైనకాలజిస్ట్, అపోలో ఆస్పత్రి -
ప్చ్
మధ్య తరగతి వర్గానికి భారం కేంద్ర బడ్జెట్తో ఒరిగింది అంతంతే పెదవి విరిచిన వేతన జీవి సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గ్రేటర్ సిటీజనులకు నిరాశను మిగిల్చింది. ఆదాయ పన్ను శ్లాబు రేటు పెరుగుతుందనుకున్న వేతన జీవుల ఆశలు అడియాశల య్యాయి. ప్లాస్మా టీవీ వంటివి కొనుగోలు చేయాలనుకున్న మధ్యతరగతి వాసి కలలు బడ్జెట్ బాదుడుతో కొండెక్కాయి. హైటెక్ నగరిలో స్మార్ట్ఫోన్తో సత్వర వై-ఫై సేవలు పొందాలనుకున్న వారికి ధరల పెరుగుదలతో వాటి కొనుగోలు వాయిదా వేసుకునే పరిస్థితి తలెత్తింది. మండు వేసవిలో ఏసీ గాలులతో సేదదీరదామనుకున్న నగర వాసికి తాజా బడ్జెట్ పట్టపగలే చుక్కలు చూపింది. చిన్నారులకు బ్రాండెడ్ ఆటవస్తువులు, ఇంటిల్లిపాదికీ బ్రాండెడ్ దుస్తులు కొనిపించాలనుకున్న తల్లిదండ్రులూ ఒకటికి రెండుసార్లు పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి. కెమెరాలు, కంప్యూటర్లు కొనుగోలు చేయాలనుకున్న యువతరానికి ఉసూరుమనిపించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకున్న మధ్య తరగతి వర్గానికి తాజా పెరుగుదల శాపంగా పరిణమిస్తోంది. కొద్దోగొప్పో పొదుపు చేసి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకున్న గృహిణుల ఆశలపై తాజా బడ్జెట్ నీళ్లు చల్లింది. మాల్స్లో నచ్చిన, మెచ్చిన వస్తువుల కొనుగోలు పైనా అదనపు సుంకం మోపడం మింగుడు పడని అంశం. ఇంటిల్లీపాదీ కలిసి నెలకోసారి రెస్టారెంట్లో భోజనం చేద్దామనుకున్న మధ్య తరగతిపై సర్వీసు ట్యాక్స్ రూపేణా గుదిబండ మోపడం గమనార్హం. సినిమా, పర్యాటక రంగాలనూ వదలలేదు. వినోదంపైనా 0.50 మేర కృషి కళ్యాణ్ సెస్ విధింపుతో మధ్య తరగతి షాక్నిచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. క్రెడిట్ కార్డులతో కొనుగోలు, బీమా, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, హోటళ్లు, ఆర్కిటెక్చర్, కొత్త ఆస్తుల కొనుగోలుపై సేవా పన్ను రూపేణా బాదుడుకు తెర తీయడంతో గ్రేటర్ సిటీజనులు నిట్టూరుస్తున్నారు. నగరం నలుచెరగులా విస్తరిస్తున్న సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల ఊతానికి కేటాయింపులు లేకపోవడం తో పారిశ్రామిక వర్గాలు సైతం నిరాశ చెందాయి. నిరుపేదలకు రూ.లక్ష ఆరోగ్య బీమా కల్పిస్తామనడం గ్రేటర్ పరిధిలోని 1,470 మురికివాడల్లో ఉన్న లక్షలాది మంది అల్పాదాయ, పేద వర్గాలకు ఊరటకలిగిస్తున్న అంశం. బ్రాండెడ్పై బండ.. గ్రేటర్ పరిధిలోని మాల్స్, ఇతర వస్త్ర దుకాణాలలో నెలకు రూ.300 కోట్ల వరకు దుస్తుల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. వీటిలో మధ్య తరగతి వర్గం, వేతనజీవులు, ఎగువ మధ్య తరగతి వర్గం వివాహాది శుభకార్యాల సందర్భంగా బ్రాండెడ్ దుస్తుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్లో ఈ దుస్తులపై సుంకం పెంపుతో బ్రాండెడ్ షర్టు, ప్యాంటుపై రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే గిరాకీ లేక వెలవెలబోతున్న షోరూమ్లకు తాజా పెంపు శరాఘాతమేనని అంటున్నారు. నిరాశే... ఆదాయ పన్ను శ్లాబు రేటు రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరుగుతుందనుకున్న సగటు వేతన జీవికి బడ్జెట్ నిరాశే మిగిల్చింది. శ్లాబు రేటును పెంచకపోవడంతో వీరంతా పెదవి విరుస్తున్నారు. రూ.ఐదు లక్షల లోపు ఆదాయం కలిగి.. ఈ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారు ప్రస్తుతం రూ.2 వేలు రాయితీ పొందుతున్నారు. ఇక నుంచి ఈ రాయితీని రూ.5 వేలకు పెంచడం గుడ్డిలో మెల్ల. దీంతో గ్రేటర్ పరిధిలో సుమారు ఐదు లక్షల మందికి స్వల్ప ఊరట లభించనుంది. ఆరోగ్యమస్తు గ్రేటర్ పరిధిలో సుమారు 1,470 లక్షల మురికివాడలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 5 లక్షల వరకు అల్పాదాయ, మధ్యాదాయ, కార్మిక వర్గాలు నివాసం ఉంటున్నాయి. తాజా బడ్జెట్లో వీరందరికీ కుటుంబం యూనిట్గా రూ.లక్ష ఆరోగ్య బీమా ప్రకటించడం ఉపశమ నం కలిగిస్తోంది. వయోవృద్ధులకు బీమాలో అదనంగా రూ.30 వేలు ఇవ్వనుండడం ఊరటనిస్తోంది. బ్రాండెడ్పై బండ.. గ్రేటర్ పరిధిలోని మాల్స్, ఇతర వస్త్ర దుకాణాలలో నెలకు రూ.300 కోట్ల వరకు దుస్తుల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. వీటిలో మధ్య తరగతి వర్గం, వేతనజీవులు, ఎగువ మధ్య తరగతి వర్గం వివాహాది శుభకార్యాల సందర్భంగా బ్రాండెడ్ దుస్తుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్లో ఈ దుస్తులపై సుంకం పెంపుతో బ్రాండెడ్ షర్టు, ప్యాంటుపై రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే గిరాకీ లేక వెలవెలబోతున్న షోరూమ్లకు తాజా పెంపు శరాఘాతమేనని అంటున్నారు. -
రూపాయి వచ్చేది, వెళ్లేది ఇలా..
కొన్ని లక్షల కోట్లతో కూడిన బడ్జెట్లో కేటాయింపులు చేయడం అంటే కత్తిమీద సామే అవుతుంది. ఏయే రంగాలకు ఎంత కేటాయించాలి, దానికి ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ కసరత్తు అంతటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పలువురు నిపుణులు పూర్తి చేస్తారు. వారికి మార్గదర్శకాలను మాత్రం ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి తదితరులు ఇస్తారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపాయి రాక, పోకల వివరాలు ఇలా ఉన్నాయి.. రూపాయి రాక 1 అప్పులు, ఇతర రుణాలు - 21 2 కార్పొరేషన్ టాక్స్ - 19 3 ఆదాయపన్ను - 14 4 కస్టమ్స్ -9 5 కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ -12 6 సేవాపన్ను, ఇతర పన్నులు - 9 7 పన్నేతర ఆదాయం - 13 8 రుణేతర కేపిటల్ ఆదాయం 3 ---------------- రూపాయి పోక 1 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికేతర సాయం - 5 2 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికా సాయం - 9 3 కేంద్ర ప్రణాళిక - 12 4 వడ్డీల చెల్లింపు - 19 5 రక్షణ రంగం - 10 6 సబ్సిడీలు - 10 7 ఇతర ప్రణాళికేతర వ్యయం - 12 8 పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా - 23 -
నాన్నకు ఫుల్ మార్క్స్ వేస్తా: జైట్లీ తనయ
న్యూఢిల్లీ: తన తండ్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ కు పూర్తి మార్కులు వేస్తానని ఆయన తనయ సోనాలి అన్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉందని జైట్లీ అల్లుడు వ్యాఖ్యానించారు. కేటాయింపులు పెంపుపై ప్రధానంగా దృష్టి సారించారని చెప్పారు. జైట్లీ బడ్జెట్ పై బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సంతృప్తి వ్యక్తం చేశారు. జైట్లీ పరీక్ష పాసయ్యారని, ప్రతి ఒక్కరికి ఎంతోకొంత కేటాయించారని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలుపైగా కేటాయించడం బడ్జెట్ చరిత్రలో ఇదే మొదటిసారని, ఇది చరిత్రాత్మకమని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారులు శాఖల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఉందని, దేశాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ పెదవి విరిచింది. బడ్జెట్ లో ఏం చేయాల్సిన అవసరముందో అది చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ విమర్శించారు. కుంగుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా బడ్జెట్ లేదని, అలంకారప్రాయంగా ఉందని మనీష్ తివారి దుయ్యబట్టారు. -
పేదలకు పెద్దపీట.. ఆ ఉద్యోగులకు ఊరట
న్యూఢిల్లీ: ఎన్నో అంచనాలు, ఆశల మధ్య కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ చిట్టాను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఊహించినట్టే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేదిశగా జైట్లీ బడ్జెట్ ప్రసంగం సాగింది. గ్రామీణ ప్రాంతాలకు సహకారం అందించడం, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం వంటి పేదల అనుకూల చర్యలను జైట్లీ బడ్జెట్ లో ప్రకటించారు. అదేవిధంగా మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే పలు చర్యలను ఆయన ప్రతిపాదించారు. ఓవైపు జైట్లీ బడ్జెట్ ప్రవేశపెడుతుండగానే మరోవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఓ దశలో 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాలను కొంతమేరకు పూడ్చుకొనే దిశగా సాగింది. జీడీపీ లోటును వచ్చే ఏడాదికి 3.5శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు అనుగుణంగా రోడ్డుమ్యాప్ తయారుచేసుకొని ముందుకువెళుతామని జైట్లీ తెలిపారు. మూడోసారి బడ్జెట్ చిట్టాను ప్రవేశపెట్టిన జైట్లీ సామాజిక పథకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపారు. అయితే, ఈ కేటాయింపులకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు ఎలా సమకూరుస్తుందనేది ప్రధాన సమస్య. ప్రజలు ముఖ్యంగా పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను తెలివిగా సమర్థంగా వినియోగిస్తామని జైట్లీ తెలిపారు. 'నైన్ పిల్లర్స్' (9 మూలస్తంభాల) ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ అజెండాను సమూలంగా మారుస్తామని, ఈ తొమ్మిది మూల స్తంభాల్లో మొదటిది వ్యవసాయం, రైతుల సంక్షేమమేనని జైట్లీ చెప్పారు. ఈ అజెండాలో భాగంగా వ్యవసాయం, సామాజిక సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన, బ్యాంకింగ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంపై విధానపరమైన ఫోకస్ పెడతామని చెప్పారు. 'రైతులకు మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరముంది. ఆహార భద్రతను దాటి వారి ఆదాయ భద్రత గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది. 2022నాటికి రైతుల ఆదాయాన్ని మేం రెట్టింపు చేస్తాం' అని జైట్లీ ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం ఆయన బడ్జెట్ లో రూ. 35,984 కోట్లు ప్రకటించారు. యూపీఏ ప్రతిష్టాత్మక పథకమైన ఉపాధి హామీకి ఈ ఏడాది బడ్జెట్ లో రెట్టింపు నిధులు ప్రతిపాదించడం గమనార్హం. గ్రామీణ అభ్యుదయంలో కీలకమైన ఈ పథకానికి రూ. 38,500 కోట్లు ప్రకటించారు. ఈ మొత్తం నిధులను ఈ ఏడాదికాలంలో ఖర్చు చేస్తే.. ఈ పథకంపై అత్యధికంగా ఖర్చు చేసిన మొత్తం ఇదే కానుందని ఆయన తెలిపారు. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట రూ. ఐదు లక్షల కన్న తక్కువ ఆదాయం ఉన్నవారికి టాక్స్ డిడక్షన్ పరిమితిని రూ. 2వేల నుంచి రూ. 5వేలకు పెంచుతున్నట్టు జైట్లీ ప్రకటించారు. అలాగే సొంతిల్లు లేక అద్దె కడుతున్నా.. తాము పనిచేసే కంపెనీ నుంచి అద్దె అలవెన్సు పొందని ఉద్యోగులకు కూడా టాక్స్ చెల్లింపులో ఊరట కల్పించారు. సొంత ఇళ్లు లేకుండా అద్దె కడుతున్నవారికి ప్రస్తుతం సెక్షన్ 80 జిజి కింద హెచ్ఆర్ఏలో ఏడాదికి రూ. 24 వేల వరకు పన్ను మినహాయింపు ఇస్తుండగా, దాన్ని మాత్రం రూ. 60 వేలకు పెంచారు. -
రాహుల్ చెప్పారు.. జైట్లీ పాటించారు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన సూచనకు కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో చోటు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా లోక్ సభలో వెల్లడించారు. దివ్యాంగులు(వికలాంగులు) ఉపయోగించే బ్రైలీ పేపర్ ను సుంకం నుంచి మినహాయింపు ఇచ్చామని జైట్లీ ప్రకటించారు. రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బ్రైలీ పేపర్ ను సుంకం నుంచి మినహాయించడంతో దివ్యాంగులకు ఊరట లభించనుంది. వృద్ధులపైనా విత్త మంత్రి కరుణ చూపారు. డయాలసిస్ పరికరాలకు బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కొత్త పథకం ప్రారంభించనున్నట్టు జైట్లీ ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేలు ప్రయోజనం అందజేస్తామని హామీయిచ్చారు. ఔషధాలను చౌకగా అందించేందుకు అదనంగా 3000 జనరిక్ దుకాణాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. నామమాత్రపు ప్రీమియంతో ప్రధాని పంటల బీమా అమలు చేస్తున్నట్టు కూడా జైట్లీ తెలిపారు. -
9 పిల్లర్లతో దేశాన్ని మార్చేస్తాం
న్యూఢిల్లీ: దేశాన్ని సమూలంగా మార్చడానికి తొమ్మిది ప్రాధాన్య రంగాలను గుర్తించినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ తొమ్మిది రంగాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం బడ్జెట్ను రూపొందింస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా సామాజిక రంగం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన.. వీటి ద్వారానే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది ప్రాధాన్య రంగాలు ఇవీ.. 1. వ్యవసాయం, రైతు సంక్షేమం 2. గ్రామీణ రంగం 3. సామాజిక రంగం 4. విద్యా నైపుణ్యాలు, ఉద్యోగ కల్పన 5. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు 6. ఆర్థిక రంగ సంస్కరణలు 7. పాలనా సంస్కరణలు, వ్యాపారం మరింత సులభతరం 8. ఆర్థిక క్రమశిక్షణ 9. పన్ను సంస్కరణలు -
బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం
న్యూ ఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల మహిళలకు లబ్థి చేకూర్చేలా వారికి గ్యాస్ కనెక్షన్లు కల్పించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. సోమవారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆయన బీపీఎల్ కుటుంబాలకు ఎల్పీజీ సౌకర్యం కల్పించేందుకు 1000 కోట్ల రూపాయలను కెటాయిస్తున్నాట్లు ప్రకటించారు. రాష్ట్రాల బాగస్వామ్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోనున్నట్లు తెలిపిన అరుణ్ జైట్లీ.. దీని ద్వారా 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు లబ్థి చేకూరుతుందని తెలిపారు. వంట చెరకు ఉపయోగించడం ద్వారా వచ్చే పొగతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆరోగ్యాలు పాడవకుండా ఈ స్కీమ్ దోహదం చేస్తుందన్నారు. అలాగే స్వచ్ఛందంగా ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్న 75 లక్షల కుటుంబాలకు అరుణ్ జైట్లీ కృతఙ్ఞతలు తెలిపారు. -
ఆదాయపన్ను దాదాపు యథాతథం
న్యూఢిల్లీ: వేతన జీవులపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పెద్దగా కనికరం చూపించలేదు. 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ప్రస్తుతం ఉన్న ఆదాయ పరిమితి రూ. 2.50 లక్షలను యథాతథంగా ఉంచారు. అద్దె ఇళ్లలో ఉండేవారికి మాత్రం కొంత ఊరట కల్పించారు. సొంత ఇళ్లు లేకుండా అద్దె కడుతున్నవారికి ప్రస్తుతం సెక్షన్ 80 జిజి కింద హెచ్ఆర్ఏలో ఏడాదికి రూ. 24 వేల వరకు పన్ను మినహాయింపు ఇస్తుండగా, దాన్ని మాత్రం రూ. 60 వేలకు పెంచారు. అలాగే, సెక్షన్ 87 ఎ కింద రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి టాక్స్ రిబేట్ సీలింగును రూ. 2 వేల నుంచి రూ. 5వేలకు పెంచారు. దీంతో సామాన్యుడికి పెద్దగా దీనివల్ల ఉపయోగం కనిపించే అవకాశం లేదు. సొంత ఇళ్లలో ఉండేవారికి అసలే ఉపయోగం ఉండదు. కోటి ఆదాయం దాటిన వారికి సర్ చార్జి 12 నుంచి 15 శాతానికి పెంచారు. 30 లక్షల మంది వరకు ఉన్న చిన్న వ్యాపారవేత్తలకు ఉపయోగపడేలా... ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఎడి కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్ కోసం ఇప్పటివరకు ఉన్న టర్నోవర్ పరిమితిని ప్రస్తుతమున్న కోటి రూపాయల నుంచి 2 కోట్లకు పెంచారు. -
రహదారులకు రూ.97వేల కోట్లు
న్యూఢిల్లీ: రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్ లో రూ.55 వేల కోట్లు కేటాయించారు. ఎన్హెచ్ఏఐ మరో 15 వేల కోట్లను బాండ్ల ద్వారా సేకరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను సోమవారం లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు. రహదారుల రంగంలో మొత్తం రూ. 97వేల కోట్లు వ్యయీకరించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాల్లో 55 వేల కిలోమీటర్ల రహదారులను హైవేలుగా మారుస్తామని తెలిపారు. రూ. 50-100 కోట్లతో 160 విమానాశ్రయాలను ఆధునీకరిస్తామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రోడ్ల మీద ప్రయాణికుల ట్రాఫిక్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా మోటారు వాహనాల చట్టంలో కొన్ని సవరణలు చేస్తాం. బస్సులను కావల్సిన రూట్లలో నడుపుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును మెరుగుపరిచేందుకు దీన్ని అమలు చేస్తాం. దీనిని రాష్ట్రాలు కూడా తమకు అనుగుణంగా అమలు చేసుకోవచ్చు. -
కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి శుభవార్త
న్యూఢిల్లీ: కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వం కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ పెన్షన్ ఫండ్ కు 8.33 శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నెలవారీ జీతం రూ. 15 వేల లోపు ఉన్నవారి కోసం వెయ్యికోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ఆథార్ ఆధారంగానే సబ్సిడీలు, రుణాలు ఉంటాయని, ఈ ఏడాది ముద్ర కింద 1.8లక్షల రుణాలు మంజూరు చేశామన్నారు. బ్యాంకులు, బీమా సంస్థలు దివాళా తీయకుండా కొత్త చట్టం రూపొందిస్తామన్నారు. బ్యాంకుల పునరుద్ధరణకు 25 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రీటైల్ ట్రేడ్ విభాగంలో చాలా కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 8.33 శాతం ఉంటుందన్నారు. చిన్న దుకాణాలు వారంలో ఏడు రోజులూ తెరిచేందుకు అనుమతిస్తామన్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి 500 కోట్లు, ఉపాధి హామీ పథకానికి 38వేల 500 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రా బాండ్లు విద్యుత్ ఉత్పత్తి పెంపుదల కోసం 3వేల కోట్లు వినియోగంలో లేని ఎయిర్పోర్టుల అభివృద్ధికి 150 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో కోటిమందికి నైపుణ్యంలో శిక్షణ ఇస్తామన్నారు. 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను సోమవారం లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు. మిగతా రంగాల గురించి ఆయన ఏమన్నారంటే... ఉన్నత విద్య ఉన్నత విద్యాసంస్థలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలన్నది మా ఉద్దేశం. 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలను ఈ స్థాయికి చేర్చాలని ప్రయత్నిస్తున్నాం. వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని ఏర్పాటుచేస్తాం. అగ్రశ్రేణి సంస్థలలో సదుపాయాలకు ఇవి ఉపయోగపడతాయి. మార్కుల షీట్లు, టీసీలన్నింటినీ సులభంగా తీసుకోడానికి వీలుగా డిజిటల్ డిపాజిటరీని ఏర్పాటుచేస్తున్నాం. చిన్నదుకాణాలకు ఊతం రీటైల్ ట్రేడ్ విభాగంలో చాలా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. షాపింగ్ మాల్స్ వారంలో ఏడు రోజులూ తెరిచి ఉంటున్నాయి. అందుకే చిన్న దుకాణాలనూ అలా తెరిచేందుకు అనుమతిస్తున్నాం. వాటిలో పనిచేసేవాళ్లకు వారంలో ఒకరోజు ఆఫ్ ఇవ్వాలి, పని గంటలు నియంత్రించాలి. -
కుటుంబానికి రూ.లక్ష ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని హామీయిచ్చారు. కేంద్ర 2016-17 ఆర్థిక బడ్జెట్ ను సోమవారం లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.... 'ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా పాడైతే కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇందుకోం కొత్త పథకం ప్రవేశపెడుతున్నాం. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబానికి లక్ష రూపాయలు, సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేలు ప్రయోజనం అందజేస్తాం. జెనెరిక్ మందులను అందించేందుకు అదనంగా దుకాణాలు ఏర్పాటుచేయిస్తాం, ఈ మందులు మరింత చౌక కానున్నాయి. మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారి కోసం డయాలసిస్ ఖర్చు ఏడాదికి రూ. 3 లక్షలు అవుతోంది. పీపీపీ మోడ్లో జాతీయ డయాలసిస్ సర్వీస్ కార్యక్రమం అన్ని జిల్లా ఆస్పత్రులలో ప్రారంభం అవుతుంది. డయాలసిస్ పరికరాల మీద బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు మినహాయిస్తున్నాం. 300 జనరిక్ జౌషధ దుకాణాలను త్వరలోనే ప్రారంభిస్తాం -
వ్యవసాయానికి రూ.35,984 కోట్లు
న్యూఢిల్లీ: అన్నదాతలకు ఆదాయ భద్రత కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీయిచ్చారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను సోమవారం లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు. వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.35,984 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఆహారభద్రతకు వెన్నుముక రైతులే. వాళ్లకు ఆదాయ భద్రత కల్పిస్తాం. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్నది మా లక్ష్యం. 35,984 కోట్లు కేటాయిస్తున్నాం. ఉత్పాదకత పెంచడానికి నీటిపారుదల చాలా ముఖ్యం. 28.5 లక్షల హెక్టార్లకు అదనంగా నీటిపారుదల కల్పిస్తాం. వచ్చే ఏడాది దీనికి 17వేల కోట్లు కేటాయిస్తాం. ప్రత్యేకంగా నాబార్డులో రూ.20 వేల కోట్లతో నీటిపారుదల కోసం ఓ నిధి ఏర్పాటుచేస్తాం. గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా 5 లక్షల ఫామ్ పాండ్స్ ఏర్పాటుచేయిస్తాం. సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ కోసం రూ.368 కోట్లు కేటాయిస్తున్నాం. ఆర్గానిక్ ఉత్పత్తులు పెంచి వాటి ద్వారా ఎగుమతులు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాలపై మరింత దృష్టి ఉంటుంది. ఈ-మార్కెట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయిస్తాం, అన్ని రాష్ట్రాలకు ఇందులో భాగస్వామ్యం కల్పిస్తాం. రైతు రుణాల మీద వడ్డీ చెల్లింపు కోసం రూ.15వేల కోట్లు కేటాయిస్తున్నాం. గ్రామీణ రహదారుల కోసం రూ. 19వేల కోట్లు కేటాయిస్తున్నాం. రాష్ట్రాల వాటాతో కలిపి రూ. 27 వేల కోట్లు అవుతుంది. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ను త్వరలోనే కల్పిస్తాం. పశుగణాభివృద్ధి కోసం 4 కొత్త ప్రాజెక్టులు అమలుచేస్తాం.