Usman Khawaja
-
SL VS AUS 2nd Test: ఉస్మాన్ ఖ్వాజా అరుదైన ఘనత.. తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు
ఆసీస్ (Australia) వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ల్లో 35 ఏళ్ల తర్వాత 3000 పరుగులు సాధించిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ క్రికెట్ చరిత్రలో 35 అంతకుమించిన వయసులో ఎవరూ 3000 పరుగుల మార్కును తాకలేదు. ఖ్వాజాకు ముందు స్టీవ్ వా 2554 పరుగులు (53.30 సగటున) చేశాడు.35 అంతకంటే ఎక్కువ వయసులో ఆసీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..- ఉస్మాన్ ఖ్వాజా-3016 (51.11)- స్టీవ్ వా-2554 (53.30)- అలెన్ బోర్డర్-2473 (42.63)- మైక్ హస్సీ-2323 (50.50)- క్రిస్ రోజర్స్-1996 (44.35)- డాన్ బ్రాడ్మన్-1903 (105.72)శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా ఖ్వాజా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఖ్వాజా 36 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన అనంతరం లయోన్ ఎవరికీ సాధ్యంకాని ఓ ఘనతను సాధించాడు. ఆసియా గడ్డపై టెస్ట్ల్లో 150 వికెట్లు తీసిన నాన్ ఏషియన్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు.శ్రీలంక ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 43 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (36), ట్రవిస్ హెడ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేసి ఔట్ కాగా.. లబూషేన్ నాలుగు పరుగులకే పెవిలియన్కు చేరాడు. తొలి టెస్ట్లో సెంచరీతో కదంతొక్కిన స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్లోనూ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. స్మిత్ 69 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అలెక్స్ క్యారీ (39) క్రీజ్లో ఉన్నాడు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2 వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నాడు.తొలి టెస్ట్లో డబుల్ సెంచరీఉస్మాన్ ఖ్వాజా తొలి టెస్ట్లో డబుల్ సెంచరీతో (232) కదంతొక్కాడు. తద్వారా ఆసీస్ తరఫున డాన్ బ్రాడ్మన్ తర్వాత అత్యంత లేటు వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఖ్వాజా 38 ఏళ్ల 43 రోజుల వయసులో తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్లో ఖ్వాజా డబుల్ సెంచరీ.. స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియా శ్రీలంకపై భారీ విజయం సాధించింది. -
శ్రీలంకను మట్టికరిపించిన ఆస్ట్రేలియా.. లంకేయుల రికార్డు ఓటమి
శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.అయితే, ఈ ఎడిషన్లో ఆఖరిగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది. ఈ టూర్లో భాగంగా రెండు వన్డేలు కూడా ఆడనుంది. ఈ క్రమంలో తొలుత గాలె వేదికగా బుధవారం లంక- ఆసీస్ జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది.ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) డబుల్ సెంచరీ(232)తో చెలరేగగా.. ట్రవిస్ హెడ్ మెరుపు అర్ధ శతకం(40 బంతుల్లో 57) బాదాడు. స్మిత్, ఇంగ్లిస్ శతకాలుమిగతా వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత శతకం(141)తో దుమ్ములేపాడు. ఇక టెస్టు అరంగేట్రంలోనే జోస్ ఇంగ్లిష్ సెంచరీ(102)తో మెరిసి తన విలువను చాటుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(46 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. టెయిలెండర్లలో బ్యూ వెబ్స్టర్(23), మిచెల్ స్టార్క్(19 నాటౌట్) తమ శక్తిమేర పరుగులు రాబట్టారు.ఈ క్రమంలో 154 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఉన్న వేళ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో స్పిన్నర్లు ప్రబాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక తమ తొలి ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే శ్రీలంక తడబడింది.కంగారూ స్పిన్నర్ల ధాటికి కుదేలుఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె ఏడేసి పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. వన్డౌన్లో వచ్చిన దినేశ్ చండిమాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. అయితే, ఆసీస్ స్పిన్నర్ అద్భుత బంతితో చండిమాల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.మిగతా వాళ్లలో ఏంజెలో మాథ్యూస్(15), కెప్టెన్ ధనంజయ డి సిల్వ(22), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(21) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. దీంతో 165 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియాన్ మూడు వికెట్లు కూల్చాడు. పేసర్ మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు దక్కాయి.ఫాలో ఆన్ గండం.. తప్పని ఓటమిఅయితే, తమ తొలి ఇన్నింగ్స్లో లంక కనీసం సగం కూడా స్కోరు చేయకపోవడంతో.. ఆస్ట్రేలియా ధనంజయ బృందాన్ని ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో వెంటనే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 247 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియాన్ ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటారు. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(6), దిముత్ కరుణరత్నె(0) మరోసారి విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు కాసేపు నిలబడ్డారు. చండిమాల్ 31, ఏంజెలో మాథ్యూస్ 41, కమిందు మెండిస్ 32, ధనంజయ డి సిల్వ 39, కుశాల్ మెండిస్ 34 పరుగులు చేశారు. ఇక ఆఖర్లో జెఫ్రీ వాండర్సే ఒక్కడే అర్ధ శతకం(53) చేయగలిగాడు.లంక క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమిఅయితే, ఆస్ట్రేలియా స్కోరుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన శ్రీలంక.. ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది. ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్లోకి!
టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఫామ్లోకి వచ్చిన ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(Steve Smith).. తన జోరును కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో భారీ శతకం(140) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. భారత్ ఆఖరిదైన సిడ్నీ టెస్టులో మొత్తంగా 37 పరుగులు చేసి.. 9999 పరుగుల వద్ద నిలిచాడు. తాజాగా శ్రీలంక(Australia vs Sri Lanka)తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్గా స్మిత్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డుఅతడి కంటే ముందు.. అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఈ ఫీట్ నమోదు చేశారు. అయితే, తాజాగా స్మిత్ పదివేల టెస్టు పరుగుల మైలురాయిని అందుకున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్లో ఒక దేశం తరఫున అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఈ జాబితాలో టీమిండియాతో కలిసి ఆసీస్ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్ను వెనక్కి నెట్టి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ జట్టు ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియాను 3-1తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో ఆఖరిగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు శ్రీలంకకు వచ్చింది.ఖవాజా డబుల్ ధమాకాఈ క్రమంలో గాలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్గా ప్రమోట్ అయిన ట్రవిస్ హెడ్ ధనాధన్ దంచికొట్టి అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. హెడ్ 40 బంతుల్లో 57 పరుగులు సాధిస్తే.. ఖవాజా ఏకంగా 352 బంతులు ఎదుర్కొని 232 రన్స్ చేశాడు.స్మిత్ రికార్డు సెంచరీమరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. మొత్తంగా 251 బంతులు ఫేస్ చేసిన స్మిత్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 141 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో 35వ టెస్టు సెంచరీ నమోదు చేసిన 36 ఏళ్ల స్మిత్.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.సెంచరీల పరంగా రెండోస్థానంలోకి‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత్ టెస్టు సెంచరీల పరంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ 36 శతకాలతో ప్రథమస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 33, టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి 30 సెంచరీలతో స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.అంతేకాదు.. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి శతకాల పరంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ స్థాయిలో విరాట్ కోహ్లి 81 శతకాలతో టాప్(Active Cricketers)లో ఉండగా.. రూట్ 52, రోహిత్ శర్మ 48, స్మిత్ 47 సెంచరీలతో టాప్-4లో నిలిచారు.ఇక శ్రీలంకతో మ్యాచ్లో ఖవాజా(232), స్మిత్(141)లతో పాటు జోష్ ఇంగ్లిస్ కూడా బ్యాట్ ఝులిపించాడు. 94 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు- ఏ దేశం తరఫున ఎందరు?👉ఆస్ట్రేలియా- నలుగురు- అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్, స్టీవ్ స్మిత్👉ఇండియా- ముగ్గురు- సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్👉ఇంగ్లండ్- ఇద్దరు- అలిస్టర్ కుక్, జో రూట్👉శ్రీలంక- ఇద్దరు- కుమార్ సంగక్కర, మహేళ జయవర్దనే👉వెస్టిండీస్- ఇద్దరు- బ్రియన్ లారా, శివ్నరైన్ చందర్పాల్👉పాకిస్తాన్- ఒక్కరు- యూనిస్ ఖాన్👉సౌతాఫ్రికా- ఒక్కరు- జాక్వెస్ కలిస్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన స్మిత్, ఖావాజా.. తొలి ఆసీస్ జోడీగా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రోజు ఆటలో లంక బౌలర్ల భరతం పట్టిన ఆసీస్ బ్యాటర్లు.. రెండో రోజు ఆటలో సైతం అదే తీరును కనబరుస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా కంగారూ జట్టు సాగుతోంది. 117 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా డబుల్ సెంచరీతో మెరిశాడు. . 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్తో ఖావాజా తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మరోవైపు ఆసీస్ సూపర్ స్టార్ స్మివ్ స్మిత్ కూడా సూపర్ సెంచరీతో సత్తాచాటాడు. 251 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో స్మిత్ 141 పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలో స్పిన్నర్ వాండర్సే బౌలింగ్లో ఎల్బీగా స్మిత్ వెనుదిరిగాడు.అరుదైన రికార్డు..కాగా మూడో వికెట్కు ఉస్మాన్ ఖావాజా, స్టీవ్ స్మిత్ మూడో వికెట్కు 266 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని వీరిద్దరూ నెలకొల్పారు. తద్వారా ఓ అరుదైన రికార్డును ఈ వెటరన్ ద్వయం తమ ఖాతాలో వేసుకుంది. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆస్ట్రేలియన్ జోడీగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజాలు ఆడమ్ గిల్క్రిస్ట్, డామియన్ మార్టిన్ పేరిట ఉండేది. 2004లో కాండే వేదికగా జరిగిన లంకతో జరిగిన టెస్టులో గిల్లీ, మార్టిన్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్తో గిల్లీ-డామియన్ ఆల్టైమ్ రికార్డును ఖావాజా-స్మిత్ బ్రేక్ చేశారు.కాగా ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ బెర్త్ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియాకు ఇదే ఆఖరి సిరీస్. ఈ సిరీస్కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఆస్ట్రేలియా ఆడుతోంది.చదవండి: RT 2025: హ్యాట్రిక్తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం -
డబుల్ సెంచరీతో మెరిసిన ఖావాజా.. తొలి ఆసీస్ క్రికెటర్గా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja) అద్బుతమైన ద్విశకతంతో చెలరేగాడు. 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్తో ఖావాజా తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అచితూచి ఆడుతూ శ్రీలంకకు కొరకరాని కొయ్యగా ఈ ఆసీస్ వెటరన్ మారాడు.తొలి రోజు ఆటలో ట్రావిస్ హెడ్,స్టీవ్ స్మిత్తో కలిసి భాగస్వామ్యాలను నెలకొల్పిన ఖావాజా.. రెండో రోజు ఆటలో జోష్ ఇంగ్లీష్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపిస్తున్నాడు. ఇదే అతడికి మొట్టమొదటి అంతర్జాతీయ డబుల్ సెంచరీ. ఇప్పటివరకు 79 టెస్టు మ్యాచ్లు ఆడిన ఖావాజా.. 45.26 సగటుతో 5839 పరుగులు చేశాడు.అతడి టెస్టు కెరీర్లో 16 సెంచరీలతో పాటు 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే భారత్తో జరిగిన సిరీస్లో మాత్రం ఖావాజా తీవ్ర నిరాశపరిచాడు. కానీ అతడిపై నమ్మకం ఉంచిన సెలక్టర్లు శ్రీలంక పర్యటకు ఎంపిక చేశారు. సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయని ఖావాజా తొలి మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు,.భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా..తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో ఖావాజా(204 నాటౌట్), జోష్ ఇంగ్లీష్(44 నాటౌట్) ఉన్నారు. 330/2 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్(141) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది.తొలి ఆసీస్ క్రికెటర్గా..ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఖావాజా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై టెస్టు డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ ఆసీస్ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.ఖావాజా కంటే ముందు శ్రీలంక గడ్డపై ఆస్ట్రేలియా బ్యాటర్ చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు రికార్డు జస్టిన్ లాంగర్ పేరిట ఉండేది. 2004 కొలంబో వేదికగా లంకతో జరిగిన టెస్టులో లాంగర్ 295 బంతుల్లో 166 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో లాంగర్ ఆల్టైమ్ రికార్డును ఖావాజా బ్రేక్ చేశాడు. కాగా ఆస్ట్రేలియాకు ఇదే నామమాత్రపు టెస్టు సిరీస్ మాత్రమే. కంగారులు ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ఆర్హత సాధించింది.చదవండి:జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
శ్రీలంకతో తొలి టెస్టు: టీ20 తరహాలో ట్రవిస్ హెడ్ బాదుడు
శ్రీలంకతో తొలి టెస్టు(Sri Lanka Vs Australia)లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్(Travis Head) ధనాధన్ దంచికొట్టాడు. తనను ఓపెనర్గా పంపినందుకు... అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకుని జట్టుకు శుభారంభం అందించాడు. మెరుపు అర్ధశతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో జూన్లో తలపడనుంది. అంతకంటే ముందు ఈ సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja)కు ఓపెనింగ్ జోడీగా ప్రమోట్ అయిన టీ20 వీరుడు ట్రవిస్ హెడ్ ఆది నుంచే లంక బౌలర్లపై అటాక్ చేశాడు.తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు.. మెరుపు ఫిఫ్టీఇన్నింగ్స్ ఆరంభంలోనే తన మార్కు చూపించిన హెడ్.. తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాదాడు. లంక పేసర్ అసిత ఫెర్నాండో బౌలింగ్లో మూడు, ఐదు, ఆరో బంతికి ఫోర్లు బాదాడు. అదే జోరులో వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 35 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.మొత్తంగా నలభై బంతులు ఎదుర్కొన్న ట్రవిస్ హెడ్.. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. లంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్లో చండీమాల్కు క్యాచ్కు ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక హెడ్ ఇన్నింగ్స్లో పది ఫోర్లతో పాటు.. ఒక సిక్సర్ కూడా ఉంది.టీ20 తరహా వీరబాదుడుఈ నేపథ్యంలో తనను టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ చేసినందుకు హెడ్.. మేనేజ్మెంట్కు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. టెస్టు ఫార్మాట్లోనూ టీ20 తరహా వీరబాదుడు బాదడం అతడికి మాత్రమే చెల్లుతుందంటూ కొనియాడుతున్నారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే.. హెడ్ ఇప్పటి నుంచే ఐపీఎల్ మోడ్లోకి వెళ్లిపోయాడంటూ ఆకాశానికెత్తుతున్నారు.స్టీవ్ స్మిత్ సారథ్యంలోకాగా శ్రీలంకతో టెస్టులకు ఆస్ట్రేలియా రెగ్యులర్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఈ సిరీస్లో కంగారూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక తాజా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా శ్రీలంకతో రెండు టెస్టులతో పాటు.. కొలంబో వేదికగా రెండు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. ఫిబ్రవరి 14న రెండో వన్డేతో ఆసీస్ లంక టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో హెడ్తో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అతడికి సహకారం అందిస్తున్నాడు. లంకతో తొలి రోజు ఆటలో భాగంగా 29 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది.శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టుతుదిజట్లుశ్రీలంకదిముత్ కరుణరత్నే, ఓషద ఫెర్నాండో, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్), ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, ట్రవిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ.చదవండి: Suryakumar Yadav: అతడొక వరల్డ్క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదేA Travis Head half century inside the first hour of Day 1 👀#SLvAUS pic.twitter.com/e5QNF4FaK3— 7Cricket (@7Cricket) January 29, 2025 -
కొన్స్టాస్ ఓవరాక్షన్.. వైల్డ్ ఫైర్లా బుమ్రా!.. నాతోనే పెట్టుకుంటావా..?
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఇరుజట్ల క్రికెటర్లు పోటీపడ్డారు. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామాలు టీమిండియా అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?!బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్లో బుమ్రా కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలో అడిలైడ్లో ఓడిపోయి.. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.రోహిత్ లేకుండానేఅయితే, మెల్బోర్న్ టెస్టులో కనీసం డ్రా చేసుకునే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బ్యాటర్గా, కెప్టెన్గా విఫలమైన రోహిత్ శర్మ(ఐదు ఇన్నింగ్స్లో కలిపి 31 రన్స్) ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆసీస్తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాపార్డర్ విఫలమైన కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4)తో పాటు శుబ్మన్ గిల్(20), విరాట్ కోహ్లి(17) నిరాశపరిచారు.పంత్ పోరాటం.. బుమ్రా మెరుపులుమిడిలార్డర్లో రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) రాణించగా.. నితీశ్ రెడ్డి(0) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్(14), ప్రసిద్ కృష్ణ(3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. పదో స్థానంలో వచ్చిన బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు సాధించాడు.185 పరుగులకు ఆలౌట్ఇక బుమ్రా మెరుపుల కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 185 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు కూల్చగా.. నాథన్ లియాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.కొన్స్టాస్ ఓవరాక్షన్ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడటానికి ముందు ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్(Sam Konstas) ఓవరాక్షన్ చేశాడు.బుమ్రా బౌలింగ్కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా.. బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్- స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కొన్స్టాస్ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్ అయ్యాడు. వైల్డ్ ఫైర్లా బుమ్రా.. ఓ రేంజ్లో టీమిండియా సంబరాలుఈ క్రమంలో కొన్స్టాస్ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా.. బుమ్రా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. దీంతో అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా(2)ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఖవాజా ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగానే టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ‘‘నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’’ అన్నట్లుగా బుమ్రా కొన్స్టాస్ వైపునకు రాగా.. అక్కడే ఉన్న యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా కొన్స్టాస్కు కౌంటర్ ఇచ్చాడు. దీంతో ముఖం మాడ్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆఖరి బంతికి అద్భుతం చేశావు భయ్యా అంటూ టీమిండియా ఫ్యాన్స్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొన్స్టాస్కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేం కాదు. మెల్బోర్న్లో తన అరంగేట్ర టెస్టులో కోహ్లితో గొడవ పెట్టుకున్న కొన్స్టాస్కు.. బుమ్రా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈసారి తనతో నేరుగా పెట్టుకున్నందుకు.. ఆసీస్ను దెబ్బతీసేలా వికెట్తో బదులిచ్చాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!Fiery scenes in the final over at the SCG! How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
‘ఐపీఎల్లో చెత్తగా ఆడినా.. వరల్డ్కప్లో మాత్రం దుమ్ములేపుతాడు’
ఐపీఎల్-2024లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘స్టార్’ గ్లెన్ మాక్స్వెల్ ఒకడు. ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.మాక్సీ ఆట తీరుపై నమ్మకంతో ఈ మేరకు భారీ మొత్తానికి అతడిని రీటైన్ చేసుకుంది. కానీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మేనేజ్మెంట్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు.పదిహేడో ఎడిషన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనతో చతికిల పడ్డ మాక్స్వెల్.. మానసిక ఒత్తిడిని కారణంగా చూపి మధ్యలో కొన్ని మ్యాచ్లలో దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కొన్ని మ్యాచ్లు ఆడగా.. మాక్సీ తిరిగి వచ్చి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.అయితే, ఓవరాల్గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో ముఖ్యంగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.ఇదిలా ఉంటే.. మాక్సీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీ కానున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అతడి ఫామ్లేమి ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్ ఫామ్తో అసలు సంబంధమే లేదు. మాక్సీ ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. సుదీర్ఘకాలంగా మెగా టోర్నీల్లో అద్భుతంగా రాణించే ఆటగాడు.. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు.టీ20 క్రికెట్లో మిడిలార్డర్లో ఆడుతున్నపుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే తనకు తిరుగే ఉండదు.గతం గురించి చర్చ అనవసరం. గతాన్ని అతడు మార్చలేడు. అయితే, భవిష్యత్తును మాత్రం అందంగా మలచుకోగల సత్తా అతడికి ఉంది’’ అని ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్. -
యశస్విని వెనక్కినెట్టిన రచిన్: అవార్డులు గెలిచింది వీళ్లే.. పూర్తి జాబితా
ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్మెషీన్ విరాట్ కోహ్లి మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలవగా.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే గత ఏడాది సూర్య 18 మ్యాచ్లు ఆడి 155.95 స్ట్రయిక్రేట్తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్లో భారత మిడిలార్డర్ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఇక ఈ టీమిండియా స్టార్లతో పాటు 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా చూద్దాం. ►మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 విజేత జట్టు కెప్టెన్ ►మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- విరాట్ కోహ్లి(ఇండియా) డబ్ల్యూటీసీ టైటిల్ ►మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్లలో కలిపి 1210 పరుగులు- ఆసీస్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర యశస్విని వెనక్కినెట్టి ►మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)- వన్డే వరల్డ్కప్లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. డచ్ జట్టు విజయాలకు కారణం ►మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- బాస్ డి లీడే(నెదర్లాండ్స్)- 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి- వన్డే వరల్డ్కప్నకు డచ్ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర- వన్డే ప్రపంచకప్లో 139 పరుగులు- 16 వికెట్లు. మహిళా క్రికెట్లో మహరాణులు ►వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- నాట్ సీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ►వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- చమరి ఆటపట్టు(శ్రీలంక)- 8 మ్యాచ్లలో కలిపి 415 రన్స్ ►వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హేలీ మాథ్యూస్(వెస్టిండీస్)- స్టెఫానీ టేలర్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్ ప్లేయర్- టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్ ►వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఫోబె లిచ్ఫీల్డ్(ఆస్ట్రేలియా)- ఆసీస్ టాపార్డర్కు వెన్నెముకగా నిలిచినందుకు ►వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- క్వీంటర్ అబెల్(కెన్యా)- అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు జింబాబ్వేకే ఆ అవార్డు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు- జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్ ఆటగాడు అకీల్ హుసేన్ను ఓదార్చినందుకు) అంపైర్ ఆఫ్ ది ఇయర్- రిచర్డ్ ఇల్లింగ్వర్త్. ఐసీసీ టెస్టు జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్. ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: ఫోబె లిచ్ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్. ఐసీసీ 2023 వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్. ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్. ఐసీసీ పురుషుల టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్గరవ, అర్ష్దీప్ సింగ్. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! -
వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిన రెండో రోజు ఆట
Australia vs Pakistan, 3rd Test Day 2: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా రెండో రోజు కేవలం 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు షఫీక్ (0), అయూబ్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ షాన్ మసూద్ (35; 3 ఫోర్లు), బాబర్ ఆజమ్ (26; 4 ఫోర్లు) కొద్దిగా పోరాడారు. ఒక దశలో స్కోరు 96/5కి చేరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (88), ఆగా సల్మాన్ (53) సల్మాన్ ఆరో వికెట్కు 94 పరుగులు జోడించారు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాక్ ఇక సులువుగానే తలవంచుతుందని ఆసీస్ భావించింది. కానీ పేస్ ఆల్రౌండర్ ఆమిర్ జమాల్ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాటింగ్లో వీరోచిత పోరాటం చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 77.1 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్ రెండు, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఆట నిలిచే సమయానికి 6/0(2) స్కోరు చేసింది. ఈ క్రమంలో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ 24.3 ఓవర్ వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్(34) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కానీ అర్ధ శతకానికి మూడు పరుగుల దూరంలో ఉన్న ఖవాజా(47)ను ఆమిర్ జమాల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 47వ ఓవర్ ముగిసే సరికి మొదలైన వర్షం తెరిపినివ్వలేదు. దీంతో అక్కడితో ఆటను ముగించేశారు. అప్పటికి లబుషేన్ 23, స్టీవ్ స్మిత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆగా సల్మాన్, ఆమిర్ జమాల్కు చెరో వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్ డేవిడ్ వార్నర్ కెరీర్లో చివరి టెస్టు. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
పాక్ పేసర్ల దెబ్బ: కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. మార్ష్ సెంచరీ మిస్
బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా కలిసి ఆస్ట్రేలియా టాపార్డర్ను కుప్పకూల్చారు. అయితే, మిడిలార్డర్లో స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ అర్ధ శతకాలతో రాణించి ఆసీస్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. కానీ.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఆట ముగిసే సరికి 62.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. కాగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మంగళవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 318 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించగా.. పాక్ తమ మొదటి ఇన్నింగ్స్లో 264 పరుగులకే ఆలౌట్ అయింది. 194/6 ఓవర్నైట్ స్కోరుతో గురువారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన పాక్ మరో 70 పరుగులు మాత్రమే జతచేయగలిగింది. ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాను పాకిస్తాన్ పేసర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్ చేసిన షాహిన్ ఆఫ్రిది.. మార్నస్ లబుషేన్(4) రూపంలో మరో వికెట్ కూల్చాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(6) వికెట్ను మీర్ హంజా తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ట్రవిస్ హెడ్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ ఓపికగా ఆడుతూ పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. మిచెల్ మార్ష్తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను చక్కబెట్టే బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి 150 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే, హంజా బౌలింగ్లో మిచెల్ మార్ష్ బౌల్డ్ కావడంతో ఈ పార్ట్నర్షిప్నకు తెరపడింది. 130 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అగా సల్మాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో స్మిత్కు తోడైన అలెక్స్ క్యారీ ఆచితూచి ఆడాడు. పరుగులు రాబట్టలేకపోయినా వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, మూడో రోజు ఆటలో సరిగ్గా ఆఖరి బంతికి స్మిత్ను షాహిన్ ఆఫ్రిది అవుట్ చేశాడు. దీంతో స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో.. గురువారం 62.3 ఓవర్ వద్ద మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి.. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అలెక్స్ క్యారీ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. Mitch Marsh gone for 96 - to an absolute belter at first slip from Agha Salman! #AUSvPAK pic.twitter.com/KNUP3kDr3j — cricket.com.au (@cricketcomau) December 28, 2023 -
బాబర్ను హత్తుకున్న ఖవాజా చిన్నారి కూతురు.. అందమైన దృశ్యాలు
ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఆసీస్ క్రికెటర్లకు స్వీట్ షాకిచ్చారు పాక్ ప్లేయర్లు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఇండోర్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్న కంగారూ ఆటగాళ్లను బహుమతులతో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా వారి కుటుంబాలకు కానుకలు అందజేసిన పాకిస్తానీ క్రికెటర్లు.. చిన్నపిల్లలకు లాలీపాప్స్ అందించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్ల చర్యకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ సహా డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్ తదితరలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ వారి ప్రయత్నాన్ని అభినందించారు. Warm wishes and heartfelt gifts for the Australian players and their families at the MCG indoor nets 🎁✨ pic.twitter.com/u43mJEpBTR — Pakistan Cricket (@TheRealPCB) December 25, 2023 ఇక ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూతుళ్లు.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను ఆత్మీయంగా హత్తుకుని ధన్యవాదాలు తెలియజేయడం హైలైట్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన అందమైన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. A very cute moment between Babar Azam and Usman Khawaja's daughter ♥️♥️ #AUSvPAKpic.twitter.com/GP5NhpJ95f — Farid Khan (@_FaridKhan) December 25, 2023 ఈ నేపథ్యంలో.. ‘‘మైదానంలో దిగిన తర్వాతే ప్రత్యర్థులం.. మైదానం వెలుపల మాత్రం మేమెప్పటికీ స్నేహితులమే అన్న భావనతో మెలుగుతామని ఈ క్రీడాకారులు మరోసారి నిరూపించారు’’ అంటూ క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మెల్బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాక్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో కాసేపు ఆటను నిలిపివేశారు. అప్పటికి 42.4 ఓవర్లలో ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇక వాన తెరిపినివ్వడంతో మళ్లీ ఆటను ఆరంభించగా.. 50 ఓవర్లలో స్కోరు 126-2గా ఉంది. చదవండి: స్టార్ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్ బోర్డు.. రెండేళ్ల నిషేధం! -
Aus Vs Pak: మేమేం తప్పు చేశాం భయ్యా? షాక్లో పాక్ ఫ్యాన్స్!
David Warner 164- Australia's dominance over Pakistan on Day 1: పాకిస్తాన్తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు గురువారం ఆరంభమైంది. పెర్త్ వేదికగా మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆది నుంచే దూకుడైన బ్యాటింగ్తో పాక్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కొరకరాని కొయ్యగా మారి.. టీ20 తరహా ఇన్నింగ్స్తో 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. దానిని శతకంగా మలచడంలో సఫలమయ్యాడు. మొత్తంగా 211 బంతులు ఎదుర్కొన్న ఈ వెటరన్ ఓపెనర్ 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 164 పరుగులు సాధించాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, వీళ్లిద్దరు అందించిన శుభారంభాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 16 పరుగులకే పెవిలియన్ చేరగా.. స్టీవ్ స్మిత్ 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక వన్డే వరల్డ్కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ మాత్రం 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీ కారణంగా ఈ మేరకు స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్ మొదటి మ్యాచ్ మొదటి రోజే సెంచరీ బాదడం విశేషం. అంతర్జాతీయ టెస్టుల్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్కు ఇది 26వ శతకం కాగా.. ఓవరాల్గా 49వది. ఇలా అద్భుత ఇన్నింగ్స్తో తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్తోనే సమాధానం చెప్పిన వార్నర్పై క్రికెట్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. పాక్ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘మేమేం పాపం చేశాం వార్నర్ భాయ్?’’ అని బాధపడుతూ ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఇమ్రాన్ సిద్ధికీ అనే ఎక్స్ యూజర్.. ‘‘పాకిస్తాన్ మీద వార్నర్కు ఇది ఆరో సెంచరీ.. మేం చేసిన తప్పేంటి భయ్యా!’’ అంటూ వార్నర్ సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియో షేర్ చేయడం హైలైట్గా నిలిచింది. మొత్తానికి ఆస్ట్రేలియా- పాకిస్తాన్ తొలి టెస్టు తొలి రోజు ఆట మొత్తమంతా డేవిడ్ వార్నర్ ట్రెండింగ్లో నిలిచాడు. A century to silence all the doubters. David Warner came out meaning business today.@nrmainsurance #MilestoneMoment #AUSvPAK pic.twitter.com/rzDGdamLGe — cricket.com.au (@cricketcomau) December 14, 2023 Its a 6th Century for David Warner Against Pakistan Bhaii Humne Kya bigara hai ? pic.twitter.com/Gry5QkHbaN — ٰImran Siddique (@imransiddique89) December 14, 2023 -
పాక్ బౌలర్లకు చుక్కలు.. టెస్టులో వార్నర్ టీ20 ఇన్నింగ్స్! చెత్త ఫీల్డింగ్తో
Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్తో తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. పెర్త్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు ఫీల్డింగ్కు దిగిన పాక్కు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. ముఖ్యంగా వార్నర్ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ.. పాకిస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. ఖవాజా మాత్రం ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. Twin boundaries in the first! Shaheen has his tail up despite an expensive first over #AUSvPAK pic.twitter.com/oixensArZG — cricket.com.au (@cricketcomau) December 14, 2023 షఫీక్ ఆ క్యాచ్ జారవిడవడంతో పాక్ అరంగేట్ర పేసర్ ఆమిర్ జమాల్ బౌలింగ్లో లైఫ్ను సద్వినియోగం చేసుకుంటూ.. వార్నర్తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనిస్తున్నాడు. కాగా పదహారో ఓవర్ ఆరంభంలో ఆమిర్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు ఉస్మాన్ ఖవాజా. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా అబ్దుల్లా షఫీక్ క్యాచ్ పట్టినట్టే పట్టి జారవిడిచాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఖవాజా.. మరోసారి తప్పిదం పునరావృతం చేయలేదు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా 25 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది పటిష్ట స్థితిలో నిలిచింది. WTF bcci installed a chip in the ball 😤#AUSvsPAK pic.twitter.com/xoNuaUK3s9 — 𝙕𝙀𝙀𝙈𝙊™ (@Broken_ICTIAN) December 14, 2023 వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు చుక్కలే లంచ్ బ్రేక్ సమయానికి డేవిడ్ వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్తో 67 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు సాధించగా.. ఉస్మాన్ ఖవాజా 84 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సహా ఇతర బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టాలని విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖవాజా ఇచ్చిన సిట్టర్ను డ్రాప్ చేసిన అబ్దుల్లా షఫీక్పై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. ఖవాజా క్యాచ్ను అతడు జారవిడిచిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక ఆస్ట్రేలియాలో పాకిస్తాన్కు టెస్టుల్లో చెత్త రికార్డు ఉందన్న విషయం తెలిసిందే. 1995లో కంగారూ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్.. ఇంతవరకు ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్పై వేటు! తిలక్కు బై బై? Tired of the conventional, David Warner's 12th boundary of the first session was nothing short of inventive! 😯#AUSvPAK @nrmainsurance #PlayOfTheDay pic.twitter.com/8ih9vnjhUj — cricket.com.au (@cricketcomau) December 14, 2023 -
Ashes 2023: ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు! యాషెస్ చరిత్రలో..
The Ashes, 2023- England vs Australia: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(141) సాధించి శుభారంభం అందుకున్న ఈ ఓపెనర్.. మొత్తంగా మూడు అర్ద శతకాలు కూడా సాధించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఓవరాల్గా 496 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో యాషెస్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన ఆసీస్ ఓపెనర్ల జాబితాలో చేరాడు. కాగా 1997లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ మాథ్యూ ఇలియట్ యాషెస్ సిరీస్లో మొత్తంగా 556 పరుగులు చేశాడు. అతడి కెరీర్ మొత్తంలో సాధించిన రన్స్లో సగానికి పైగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ సందర్భంగానే స్కోర్ చేయడం గమనార్హం. 26 ఏళ్ల తర్వాత.. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల తర్వాత ఖవాజా అత్యధికంగా 496 పరుగులు సాధించి మాథ్యూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 1997 తర్వాత యాషెస్ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసీస్ ఓపెనర్గా నిలిచాడు. ఆ రికార్డు మిస్! ఇదిలా ఉంటే.. 1948లో 39 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ యాషెస్లో 508 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక వయసులో 500కు పైగా రన్స్ సాధించిన ఆసీస్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 496 పరుగుల వద్ద నిలిచిపోయిన 36 ఏళ్ల ఖవాజా.. బ్రాడ్మన్ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కే అవకాశం కోల్పోయాడు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్-2023 డ్రాగా ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొంది సిరీస్ను 2-2తో సమం చేయగా.. గత సిరీస్ గెలిచిన ఆసీస్ ట్రోఫీని తమ వద్దే అట్టిపెట్టుకోనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న క్రిస్ వోక్స్.. మిచెల్ స్టార్క్తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పంచుకున్నాడు. యాషెస్-2023లో ఉస్మాన్ ఖావాజా సాధించిన పరుగులు ►ఎడ్జ్బాస్టన్ టెస్టులో- 141, 65. ►లండన్ టెస్టులో- 17, 77. ►లీడ్స్ టెస్టులో- 13, 43. ►మాంచెస్టర్ టెస్టులో- 3, 18. ►ఓవల్ మైదానంలో- 47, 72. చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
యాషెస్ చరిత్రలో తొలిసారి.. ‘అరుదైన’ రికార్డు బద్దలు! ఎంత గొప్పగా అంటే..
England vs Australia, 5th Test: ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ యాషెస్ సిరీస్లో ‘అరుదైన’ రికార్డు నమోదు చేశారు. యాషెస్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్లో ఇన్నింగ్స్ ఆడి రికార్డులకెక్కారు. కాగా లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య గురువారం ఐదో టెస్టు ఆరంభమైంది. లబుషేన్ జిడ్డు బ్యాటింగ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(47), డేవిడ్ వార్నర్(24) ఫర్వాలేదనిపించారు. అయితే, క్రిస్వోక్స్ బౌలింగ్లో వార్నర్ పెవిలియన్ చేరిన క్రమంలో వన్డౌన్లో వచ్చిన మార్నస్ లబుషేన్ జిడ్డు బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తంగా 82బంతులు ఎదుర్కొన్న అతడు 10.98 స్ట్రైక్రేటుతో కేవలం 9 పరుగులు సాధించాడు. రన్రేటు 1.61.. ఖవాజాతో కలిసి 26 ఓవర్ల ఆటలో.. రెండో వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్క్వుడ్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ అవుటయ్యే సమయానికి ఖవాజా 123 బంతులాడి 37 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక వీరిద్దరి పార్ట్నర్షిప్లో రన్రేటు 1.61గా నమోదైంది. వారి రికార్డు బద్దలు కొట్టి యాషెస్ చరిత్రలో.. ఒక ఇన్నింగ్స్లో కనీసం 150 బంతులు ఎదుర్కొని ఈ మేరకు అత్యల్ప రన్రేటుతో పరుగులు రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో 2013 నాటి అడిలైడ్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మైకేల్ కార్బెర్రి, జోరూట్ 1.75 రన్రేటుతో 27 ఓవర్లలో 48 పరుగులు సాధించారు. ఖవాజా, లబుషేన్ ఇప్పుడు వారి రికార్డు బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీకంటే నత్త నయమనుకుంటా. మహగొప్పగా ఆడారు.. 1.61 రన్రేటు గ్రేటు’’ అంటూ ఖవాజా, లబుషేన్లను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐదో టెస్టులో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ స్టీవ్ స్మిత్ 71 పరుగులతో రాణించడంతో.. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులు చేయగలిగింది. ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. చదవండి: 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్ -
Eng Vs Aus: మేమింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం: ఇంగ్లండ్ స్టార్
The Ashes, 2023- England vs Australia, 3rd Test- Day 2- లీడ్స్: యాషెస్ సిరీస్ మూడో టెస్టు ఆసక్తికర మలుపులతో సాగుతోంది. రెండో రోజు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటాపోటీగా పోరాడాయి. రెండో రోజు నాటి శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (43), డేవిడ్ వార్నర్ (1), మార్నస్ లబుషేన్ (33), స్టీవ్ స్మిత్ (2) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 142 పరుగులకు చేరింది. స్టోక్స్ దూకుడు అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 68/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (80; 6 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటిచేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివర్లో మార్క్ వుడ్ (8 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుపులు ఇంగ్లండ్ భారీ ఆధిక్యం కోల్పోకుండా కాపాడాయి. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (6/91) రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ బీబీసీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తామింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు. వికెట్ బాగుందని.. తమ జట్టు కచ్చితంగా ఈ మ్యాచ్లో పైచేయి సాధిస్తుందని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్లో 200 మార్కు దాటడం తమలో సానుకూల దృక్పథం నింపిందన్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండు వికెట్లు పడగొట్టి ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే తాను దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నానన్న అలీ.. రెండు వికెట్లు తీయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజు ఆటలో మొయిన్ అలీ లబుషేన్, స్మిత్ వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజాను క్రిస్ వోక్స్, డేవిడ్ వార్నర్ను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్కు పంపారు. ఇదిలా ఉంటే.. యాషెస్ తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఆసీస్ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో సిరీస్కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్
ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ దెబ్బకు ఉస్మాన్ ఖవాజా మైండ్ బ్లాక్ అయింది. యాషెస్ సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు మూడో టెస్టు ఆడుతున్నాయి. తొలిరోజు ఆటలో భాగంగా టాస్ గెలిచిన స్టోక్స్ ఆసీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. స్టోక్స్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లు తొలి సెషన్లోనే చెలరేగిపోయారు. లంచ్ విరామ సమయానికి నాలుగు వికెట్లు తీసి ఆసీస్ను దెబ్బతీశారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీసినప్పటికి.. హైలెట్ అయింది మాత్రం మార్క్ వుడ్ అని చెప్పొచ్చు. యాషెస్ సిరీస్లో మార్క్ వుడ్కు ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్లోనే గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసురుతూ ఆసీస్కు చాలెంజ్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఖవాజాను ఔట్ చేసిన 13వ ఓవర్లో మార్క్వుడ్ ప్రతీ బంతిని గంటకు 90 మైళ్ల వేగంతో విసరడం విశేషం. గుడ్లైన్ అండ్ లెంగ్త్తో సంధించిన మార్క్వుడ్ ఆఖరి బంతిని ఇన్స్వింగర్ వేశాడు. బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని ఖవాజా కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి లెగ్ స్టంప్ను గిరాటేసింది. 96.5 మైళ్ల వేగం(గంటకు 152 కిమీ)తో వచ్చిన బంతి దెబ్బకు స్టంప్ ఎగిరి కింద పడింది. ఇక యాషెస్ చరిత్రలో మార్క్ వుడ్ వేసిన బంతి రెండో ఫాస్టెస్ట్ డెలివరీగా నిలిచింది. ఇంతకముందు ఆసీస్ స్టార్ మిచెల్ జాన్సన్ 2013 యాషెస్ సిరీస్లో గంటకు 97 మైళ్ల వేగం(గంటకు 156.7 కిమీ)తో బంతిని విసిరాడు. ఇప్పటికి ఈ రికార్డు యాషెస్ చరిత్రలో పదిలంగా ఉంది. అంతకముందు స్టువర్ట్ బ్రాడ్.. వార్నర్ను(4 పరుగులు), వందో టెస్టు ఆడుతున్న స్మిత్(22 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మార్నస్ లబుషేన్ను(21 పరుగుల) క్రిస్ వోక్స్ పెవిలియన్ చేర్చాడు. లంచ్ అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసిది. మిచెల్ మార్ష్ 30, ట్రెవిస్ హెడ్ 17 పరుగులతో ఆడుతున్నారు. It's full and straight and far too quick for Usman Khawaja 🌪️ Australia are 2 down and Mark Wood is on fire! 🔥 #EnglandCricket | #Ashes pic.twitter.com/y5MAB1rWxd — England Cricket (@englandcricket) July 6, 2023 చదవండి: #SteveSmith: వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు #GlennMcGrath: ఇంగ్లండ్కు ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్బాల్ కాదది కజ్బాల్' -
బెయిర్స్టో స్టంపౌట్ వివాదం.. ఆసీస్ ఆటగాడిపై దూషణ పర్వం.. తప్పేమీ లేదన్న అశ్విన్
లార్డ్స్ టెస్టు చివరి రోజు ఆటలో బెయిర్స్టోను స్టంపౌట్ చేసిన తీరు వివాదాన్ని రేపి తీవ్ర చర్చకు దారి తీసింది. లంచ్ ముందు ఈ ఘటన జరిగింది. గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్ను తాకింది. BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 ఆ సమయంలో బెయిర్స్టో క్రీజ్కు చాలా దూరం ఉండటంతో థర్డ్ అంపైర్ బెయిర్స్టోన్ను అవుట్గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఆసీస్ తమ అప్పీల్ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్స్టో మైదానం వీడాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ‘పాత ఆ్రస్టేలియా...ఎప్పటిలాగే మోసగాళ్లు’ అంటూ ప్రేక్షకులంతా గేలి చేశారు. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 లంచ్ సమయంలో పరిస్థితి మరింత ముదిరింది. లార్డ్స్ మైదానంలో ప్రతిష్టాత్మక లాంగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు నడుస్తుండగా కొందరు మాటలతో ఖ్వాజాను దూషించారు. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. దీనిపై ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఎంసీసీకి ఫిర్యాదు చేయగా...వారు చివరకు ఘటనపై క్షమాపణ చెప్పారు. నిబంధనల ప్రకారం చూస్తే బెయిర్స్టో అవుట్లో తప్పు లేదు. బంతి ఇంకా ‘డెడ్’ కాకముందే అతను క్రీజ్ వీడాడు. బయటకు వెళ్లే ముందు అతను తన కాలితో క్రీజ్ లోపల నేలను గీకడం కూడా కనిపించినా బంతి కీపర్ చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉన్న క్యారీ స్టంప్ చేశాడు. దాంతో మరోసారి క్రీడా స్ఫూర్తి చర్చ ముందుకు వచ్చింది. కామెంటేటర్లంతా వాదనకు చెరో వైపు నిలిచారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో స్పష్టంగా ఉండే భారత స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఇందులో తప్పేమి లేదని, అది అవుట్ అని స్పష్టం చేశాడు. ‘ఒకటి మాత్రం నిజం. వెనక అంత దూరం నిలబడిన కీపర్ స్టంప్స్పైకి బంతి విసిరాడంటే అప్పటికే బెయిర్స్టో ఇలాంటి ప్రయత్నం చేసి ఉండటం అతను చూసి ఉంటాడు’ అని అశ్విన్ విశ్లేషించాడు. -
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ యువ పేసర్.. వార్నర్, ఖ్వాజాల ఫ్యూజ్లు ఔట్
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్లో ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనర్లు ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలుత ఉస్మాన్ ఖ్వాజాను (17) అద్భుతమైన ఇన్ స్వింగర్తో బోల్తా కొట్టించిన టంగ్.. ఆతర్వాత ఇటీవలికాలంలో చూడని అత్యద్భుమైన బంతితో వార్నర్ (66) ఖేల్ ఖతం చేశాడు. టంగ్ సంధించిన బంతిని ఎలా ఆడాలో తెలీని వార్నర్ నిశ్రేష్ఠుడిగా చూస్తూ ఉండిపోయాడు. పెవిలియన్కు వెళ్లే సమయంలోనూ వార్నర్ ముఖంలో ఏమీ చేయలేకపోయానన్న ఎక్స్ప్రెషన్ కనిపించింది. టంగ్ వేసిన పేస్ దెబ్బకు లెగ్ వికెట్ విరిగిపోయింది. First Ashes wicket secured 🔒 Masterful from Josh Tongue ✨ #EnglandCricket | #Ashes pic.twitter.com/pS963Awgop — England Cricket (@englandcricket) June 28, 2023 కాగా, కెరీర్లో కేవలం రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న టంగ్.. ఆసీస్ ఓపెనర్లను తొలుత బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే వీరు ఔటయ్యాక క్రీజ్లో వచ్చిన లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ముందు టంగ్ పప్పులు ఉడకలేదు. వారు టంగ్ బౌలింగ్ను సునాయాసంగా ఎదుర్కొన్నారు. 25 ఏళ్ల టంగ్ ఈ సిరీస్కు ముందు ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో తేలిపోయిన అతను.. సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లతో విరుచుకుపడ్డాడు. Warner GONE! 🤩 S̶t̶u̶a̶r̶t̶ ̶B̶r̶o̶a̶d̶ Josh Tongue gets his man! #EnglandCricket | #Ashes pic.twitter.com/3sw6FSU2To — England Cricket (@englandcricket) June 28, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (66), ట్రవిస్ హెడ్ (77), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. లబూషేన్ (47) పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (17), కెమారూన్ గ్రీన్ (0) నిరాశపరిచారు. స్మిత్తో పాటు అలెక్స్ క్యారీ క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. రెండో ఆటగాడిగా!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన రెండో ఆస్ట్రేలియా క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఖ్వాజా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ఖ్వాజా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లకు అడ్డుగా నిలిచి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ మొత్తంలో 518 బంతులు ఎదుర్కొని 206 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ మొదటిరోజే 3/393 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆరోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు నాలుగు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. అనంతరం రెండో రోజు మొత్తం బ్యాటింగ్ చేసిన ఖ్వాజా 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 126 పరుగులు వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖవాజా మరో 15 పరుగులు జోడించి 141 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లడ్.. 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మళ్లీ అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్కు వచ్చింది. నాలుగో రోజు చివరి సెషన్లో 34 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు . మ్యాచులో చివరి రోజైన ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించి మరో 31 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తద్వారా టెస్టు మ్యాచ్లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా ఈ ఆసీస్ ఓపెనర్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు వీరే.. మోత్గనల్లి జైసింహ (భారత్) వర్సెస్ ఆస్ట్రేలియా - 1960 జియోఫ్రీ బాయ్కాట్ (ఇంగ్లండ్) వర్సెస్ ఆస్ట్రేలియా - 1977 కిమ్ హ్యూస్ (ఆస్ట్రేలియా) వర్సెస్ ఇంగ్లండ్ - 1980 అలన్ లాంబ్ (ఇంగ్లాండ్) వర్సెస్ వెస్టిండీస్ - 1984 రవిశాస్త్రి (భారత్) వర్సెస్ ఇంగ్లాండ్ - 1984 అడ్రియన్ గ్రిఫిత్ (వెస్టిండీస్) వర్సెస్ న్యూజిలాండ్ - 1999 ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) వర్సెస్ భారతదేశం - 2006 అల్విరో పీటర్సన్ (దక్షిణాఫ్రికా) వర్సెస్న్యూజిలాండ్ - 2012 చెతేశ్వర్ పుజారా (భారత్) వర్సెస్ శ్రీలంక - 2017 రోరీ బర్న్స్ (ఇంగ్లాండ్) వర్సెస్ ఆస్ట్రేలియా - 2019 క్రైగ్ బ్రాత్వైట్ (వెస్టిండీస్) వర్సెస్ జింబాబ్వే - 2023 టాంగెనరైన్ చందర్పాల్ (వెస్టిండీస్) వర్సెస్ జింబాబ్వే - 2023 ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) వర్సెస్ ఇంగ్లాండ్ - 2023* చదవండి: Asia Cup 2023: అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ స్ట్రాంగ్ కౌంటర్.. తగ్గేదేలేదు! Only in Test Cricket 😍 An unconventional field setup from 🏴 forced Usman Khawaja to come down the track and ended up getting bowled 😲👏#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever pic.twitter.com/jb0XKnBJCv — Sony Sports Network (@SonySportsNetwk) June 18, 2023 -
న్యూ మిస్టర్ కూల్ అంటూ ప్రశంసల వర్షం.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్
England vs Australia, 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో శుభారంభం చేసిన ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉత్కంఠభరిత టెస్టు మ్యాచ్ చూడనేలేదంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆసీస్ సారథిని ‘న్యూ మిస్టర్ కూల్’గా అభివర్ణించిన వీరూ భాయ్.. ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా అద్భుతం అంటూ ఆకాశానికెత్తాడు. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్లో భాగంగా జూన్ 16-20 వరకు మొదటి టెస్టు జరిగింది. బజ్బాల్ విధానం పేరిట సంప్రదాయ క్రికెట్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్.. మొదటి రోజే 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా అద్భుత సెంచరీ(141)కి తోడు.. ట్రవిస్ హెడ్ అర్ధ శతకం(50)తో రాణించడంతో 386 పరుగులకు ఆలౌట్ అయి మొదటి ఇన్నింగ్స్ ముగించింది. అద్భుతం చేసిన కమిన్స్, నాథన్ ఇదిలా ఉంటే.. ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్, వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ నాలుగేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఉస్మాన్ ఖవాజా (65) మరోసారి బ్యాట్ ఝులిపించగా.. ప్యాట్ కమిన్స్, నాథన్ లియోన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కమిన్స్ 73 బంతుల్లో 44 పరుగులతో.. నాథన్ 28 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచి ఓటమి నుంచి ఆసీస్ను గట్టెక్కించి గెలుపుబాట పట్టించారు. దీంతో అనూహ్య రీతిలో సొంతగడ్డపై తొలి టెస్టులోనే ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. వాటే టెస్ట్ మ్యాచ్! ఈ నేపథ్యంలో రెండు వికెట్ల తేడాతో గెలుపొంది 1-0తో ముందంజ వేసిన ఆస్ట్రేలియా, జట్టును గెలిపించిన టెయిలెండర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఆసీస్ను కొనియాడుతూ చేసిన ట్వీట్ అభిమానులను ఆకర్షిస్తోంది. ‘‘వాటే టెస్ట్ మ్యాచ్! ఇటీవలి కాలంలో నేను చూసిన అత్యంత గొప్ప మ్యాచ్ ఇదే. నిజంగా టెస్ట్ క్రికెట్ బెస్ట్ క్రికెట్. మొదటి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వాతావరణం అలా ఉన్న సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం అంటే మాటలు కాదు! ఏదేమైనా ఖవాజా రెండు ఇన్నింగ్స్లో అదరగొట్టాడు. ఇక ప్యాట్ కమిన్స్ టెస్టు క్రికెట్లో మరో మిస్టర్ కూల్గా అవతరించాడు. తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలో కమిన్స్, లియోన్ నమోదు చేసిన భాగస్వామ్యం సుదీర్ఘ కాలం పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది’’ అని సెహ్వాగ్ కమిన్స్ను ప్రశంసించాడు. కాగా సాధారణంగా టీమిండియా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మిస్టర్ కూల్గా అభిమానులు పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. చదవండి: శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్రైజర్స్ కెప్టెన్గా! వెస్టిండీస్తో టీ20 సిరీస్.. శుబ్మన్ గిల్కు నో ఛాన్స్! రుత్రాజ్ రీ ఎంట్రీ బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్.. What a Test Match. One of the best I have seen in recent times. Testcricket is Best Cricket. Was a gutsy decision by England to declare just before close on Day 1, especially considering the weather. But Khawaja was outstanding in both innings and @patcummins30 is the new Mr.… pic.twitter.com/9QqC2hjyzr — Virender Sehwag (@virendersehwag) June 20, 2023 A final day thriller to kick off the series 🏏 🏴 #ENGvAUS 🇦🇺 #Ashes pic.twitter.com/EuAk2CUeWC — England Cricket (@englandcricket) June 21, 2023 -
Ashes 1st Test: స్టీవ్ స్మిత్కు అలా.. ఉస్మాన్ ఖ్వాజాకు ఇలా..!
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన కెప్టెన్సీ నైపుణ్యాన్నంతా బయటపెట్డాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో పదేపదే బౌలర్లను మార్చి ఒకింత సక్సెస్ సాధించిన స్టోక్స్.. ఫీల్డింగ్ మొహరింపు విషయంలో తన వైవిధ్యాన్నంతా రంగరించి ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. తొలుత స్టీవ్ స్మిత్ను ఔట్ చేసేందుకు నాలుగు స్లిప్లు, రెండు లెగ్ స్లిప్లు మొహరించిన స్టోక్స్.. ఆట మూడో రోజు (ఇవాళ, జూన్ 18) ఉస్మాన్ ఖ్వాజాపై ఒత్తిడి తెచ్చేందుకు క్వార్టర్ సర్కిల్లో ఆరుగురు ఫీల్డర్లను మొహరించాడు. స్టోక్స్ ఫీల్డ్ సెట్టింగ్ వల్ల ఒత్తిడికి లోనైన ఖ్వాజా.. వారిపై నుంచి భారీ షాట్ అడేందుకు ప్రయత్నించి రాబిన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇలా వైవిధ్యభరితమైన ఫీల్డ్ సెటింగ్ ద్వారా.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చి ఔటయ్యేలా చేశాడు స్టోక్స్. SIX catchers in and the plan works 👏 Khawaja gone for 141.COME ON ENGLAND! 🏴 #EnglandCricket | #Ashes pic.twitter.com/6MLJcQxzCX— England Cricket (@englandcricket) June 18, 2023 కాగా, 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మరో 75 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయి 386 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను దాదాపుగా చేరుకునేలా చేశాడు. ఖ్వాజాతో పాటు ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (34) పోరాడటంతో ఇంగ్లండ్కు కేవలం 7 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం మాత్రమే దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. -
ENG VS AUS Ashes 1st Test: బజ్బాల్ బెడిసికొట్టింది..!
బజ్బాల్ అప్రోచ్ అంటూ టెస్ట్ క్రికెట్ ఉనికిని చెరిపే ప్రయత్నం చేస్తున్న ఇంగ్లండ్ జట్టుకు తిక్క కుదిరింది. వారు నమ్ముకున్న బజ్బాల్ ఫార్ములా తొలిసారి బెడిసికొట్టింది. ఆసీస్ లాంటి జట్టు ప్రత్యర్ధిగా ఉన్నప్పుడు బజ్బాల్, గిజ్బాల్ అంటూ ఓవరాక్షన్లు చేయకూడదని ఇంగ్లండ్కు తెలిసొచ్చింది. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ తొలి రోజే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ పరిస్థితి ప్రస్తుతం చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా మారింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తిక్క కుదిర్చాడు. అతనికి ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (38) సహకరించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను ఆసీస్ దాదాపుగా చేరుకున్నంత పని చేసింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌటై, 7 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే అలెక్స్ క్యారీ వికెట్ కోల్పోయింది. జేమ్స్ ఆండర్సన్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత ఖ్వాజా.. కమిన్స్ సాయంతో ఆసీస్ స్కోర్ను పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆఖర్లో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 386 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. -
ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఖ్వాజా సెంచరీతో చెలరేగాడు. వార్నర్, లబుషేన్, స్మిత్ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట... ఖ్వాజా ఇంగ్లీష్ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఖ్వాజా విరోచిత పోరాటం ఫలితంగా ఆసీస్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 279 బంతులు ఎదుర్కొన్న ఖావాజా 14 ఫోర్లు, 2 సిక్స్లతో 126 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఖ్వాజాతో పాటు అలెక్స్ క్యారీ(52) పరుగులతో ఉన్నారు. ఖ్వాజా స్పెషల్ సెల్బ్రెషన్ ఇక సెంచరీతో చెలరేగిన ఖ్వాజా స్పెషల్ సెల్బ్రెషన్స్ జరపుకున్నాడు. సెంచరీ మార్క్ను అందుకున్న వెంటనే గట్టిగా అరుస్తూ తన బ్యాట్ను కిందకు విసిరి, ఆసీస్ డ్రస్సెంగ్ రూమ్ వైపు చూస్తూ చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్లోని ఆటగాళ్లు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కాగా ఖ్వాజాకు ఇంగ్లండ్ గడ్డపై ఇదే తొలి సెంచరీ. అందుకే ఖ్వాజా అంతగా ఎమోషనల్ అయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై తన తొలి సెంచరీ మార్క్ను అందుకోవడానికి ఖ్వాజాకు 15 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. ఇక ఓవరాల్గా ఇది ఖ్వాజాకు 15వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఖ్వాజా సెల్బ్రెషన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఇండియాలో మ్యాచ్లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు A magnificent 💯 from Usman Khawaja 😍 The south-paw fights against all odds to get Australia back in the game 👊#SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/yaz1Y7gIt1 — Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023 -
Eng Vs Aus: పట్టుదలగా నిలబడ్డ ఖ్వాజా.. క్యారీ సైతం..! కోలుకున్న ఆస్ట్రేలియా!
England vs Australia, 1st Test- బర్మింగ్హమ్: ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (279 బంతుల్లో 126 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్లు) మొండి పట్టుదలతో ఆడటంతో... ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 94 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (393/8 డిక్లేర్డ్)కు ఆస్ట్రేలియా మరో 82 పరుగుల దూరంలో ఉంది. ఖ్వాజాతో కలిసి అలెక్స్ క్యారీ (80 బంతుల్లో 52 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 14/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో తొలి రెండు బంతుల్లో డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 9; 2 ఫోర్లు), లబుషేన్ (0)లను బ్రాడ్ అవుట్ చేశాడు. కాసేపటికి స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 16) కూడా పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలిచయా 67 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ దశలో ట్రావిస్ హెడ్ (63 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్) తో ఖ్వాజా నాలుగో వికెట్కు 81 పరుగులు... గ్రీన్ (68 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్)తో ఐదో వికెట్కు 72 పరుగులు జత చేసి ఆదుకున్నాడు. గ్రీన్ అవుటయ్యాక వచ్చిన క్యారీ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఖ్వాజాతో ఆరో వికెట్కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. చదవండి: వరల్డ్కప్ క్వాలిఫియర్ మ్యాచ్లకు సర్వం సిద్దం.. ఫోటోలకు ఫోజులిచ్చిన కెప్టెన్లు -
Ashes 1st Test: ఉస్మాన్ ఖ్వాజా శతకం.. పోరాడుతున్న ఆస్ట్రేలియా
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్లో పర్యాటక ఆస్ట్రేలియా పోరాడుతుంది. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన ఆ జట్టును ఉస్మాన్ ఖ్వాజా (102 నాటౌట్) సెంచరీతో ఆదుకున్నాడు. ట్రవిస్ హెడ్ (50) సాయంతో అతను ఇన్నింగ్స్ను నిర్మించాడు. టెస్ట్ల్లో ఖ్వాజాకు ఇది 15వ శతకం. 2022 నుంచి భీకర ఫామ్లో ఉన్న ఖ్వాజా ఈ మధ్యకాలంలో ప్రపంచ క్రికెట్లో అందరు బ్యాటర్ల కంటే అధికంగా 7 శతకాలు బాదాడు. 2022 నుంచి ఖ్వాజా, జో రూట్ మాత్రమే టెస్ట్ల్లో 7 సెంచరీలు చేశారు. వీరి తర్వాత జానీ బెయిర్స్టో 6 సెంచరీలు చేశాడు. Diet Cokes all round! Well batted, @Uz_Khawaja #Ashes pic.twitter.com/UVKJATCsBz— cricket.com.au (@cricketcomau) June 17, 2023 కాగా, ఉస్మాన్ ఖ్వాజా సెంచరీతో ఆదుకోవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ జట్టు 70 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 163 పరుగులు వెనుకపడి ఉంది. ఖ్వాజాకు జతగా అలెక్స్ క్యారీ (3) క్రీజ్లో ఉన్నాడు. 14/0 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి సెషన్లోనే వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), హెడ్ (50), గ్రీన్ (38) వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీలకు తలో 2 వికెట్లు, స్టోక్స్కు ఓ వికెట్ (స్మిత్) దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes 1st Test: సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్ ఖాతాలో వికెట్ -
మన తీరు ఇలా ఉండాలా?
ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు సంకుచితంగా ఉంది. అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్ పౌరుడిగానూ ఉంటున్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అతడిని అనుమానితుడిని చేసింది. అందుకే ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత్ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, వెంటనే అనుమతి దక్కలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, మానవ హక్కుల సూత్రబద్ధ సమర్థకురాలిగా ఉంటున్నందుకు భారత్ గర్వపడుతుంది. మనం ఈ స్వీయ–ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన పట్ల పాకిస్తాన్ ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది. మన సొంత ప్రమాణాలను నిర్దేశించుకోవడానికి మన పొరుగు వాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? పాకిస్తాన్ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిణించుకుంటున్న దేశం, ఐరాసలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? మన దేశాన్ని సందర్శించాలని కోరుకునే పాకిస్తానీయుల పట్ల మనం ఎందుకు చీకాకుగా వ్యవ హరిస్తాం? అయితే మన పట్ల వాళ్ల ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది. కానీ నా అనుభవం అలా లేదని నేను చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా ఇలాంటి వాదన సముచితమైనది కాదు. అది మనకు విలువనివ్వదు కూడా! మొదటి విషయం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానూ, మానవ హక్కుల విషయంలో సూత్రబద్ధ సమర్థకురాలిగానూ ఉంటున్నందుకు భారత్ గర్వపడుతుంది. కానీ మనం దీన్ని గురించి చెప్పినట్లయితే పాకిస్తాన్ అసలు నమ్మదు. అయితే మనం కూడా మన స్వీయ– ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన సొంత ప్రమాణాలను నిర్దేశించు కోవడానికి మన పొరుగువాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? అలా కాదంటే– ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా కాకుండా, దానికి భిన్నంగా వ్యవహ రించడం ద్వారా మనం మరింత మెరుగైనవాళ్లమని దృఢ నిరూపణ చేయాల్సి ఉంటుంది. అనుమానపు చూపు అద్భుతమైన ఆస్ట్రేలియన్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు నేను వర్ణించిన రోత ప్రవర్తనకు ప్రతిరూపమే. నిజానికి ఇది అంతకుమించిన ఘోరమైన విషయం. సంకు చితంగా, ద్వేషపూరితంగా, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నట్లుగా ఉంది. ఇలాంటి వైఖరి భార త్ను పేలవంగా చూపిస్తుంది. దీంట్లోని అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే, ఇదంతా మనకు మనం కలిగించుకున్న నష్టమే. పాకిస్తాన్లో పుట్టిన ఖ్వాజా నాలుగేళ్ల వయసులో ఉండగా కుటుంబంతోపాటు ఆస్ట్రేలి యాకు వలస వెళ్లాడు. ఈరోజు అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అతడు అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్ పౌరుడిగానూ ఉంటు న్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అనుమానితుడిని చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత్ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, అతడికి వెంటనే అనుమతి దక్కలేదు. అది ఎంత ఆలస్యమైందంటే, ఫిబ్రవరి 1న ఖ్వాజా లేకుండానే ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకు వచ్చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ పాలనా యంత్రాంగం నిరసన తెలిపిన తర్వాతే ఖ్వాజా వీసాను పొంద గలిగాడు. ప్రభుత్వాల ప్రామాణిక ధోరణి భారతదేశంలో మనలో ఏ కొద్దిమందికో ఈ విషయం గురించి తెలుసు. అందులో బహుశా చాలా కొద్దిమంది దీని గురించి కలవరపడుతుండవచ్చు. కానీ ఆస్ట్రేలియాలో ఇలా ఉండదు. బీజేపీ ఖ్వాజాను ఆస్ట్రేలియా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిలా కాకుండా పాకిస్తాన్లో పుట్టిన ముస్లింలా చూస్తోందని ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’లో రాసే దేశ అత్యుత్తమ క్రికెట్ వ్యాఖ్యాతల్లో ఒకరైన మాల్కమ్ కోన్ రాశారు. వాస్తవం ఇంతకంటే దారుణంగా ఉంది. భారతీయ వీసాను పొందడంలో సమస్యలు ఎదుర్కోవడం ఖ్వాజాకు ఇదే తొలిసారి కాదు. ‘ది గార్డియన్’ పత్రిక ప్రకారం– మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 2011 లోనే ఈ అనుభవం అతడికి ఎదురైంది. పాకిస్తానీ యుల పట్ల ద్వేషపూరిత వైఖరిని ప్రదర్శించడం భారత ప్రభుత్వాలకు ఒక ప్రామాణికమైన ఆచర ణగా మారిపోయిందని ఇది స్పష్టం చేస్తోంది. ద్వంద్వ పౌరసత్వం ఉన్న పాకిస్తానీయుడు, భారతీయ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను వివరించనివ్వండి. ఆ వ్యక్తి లండన్, న్యూయార్క్ లేదా దుబాయ్ నివాసి అయినప్పటికీ, వారి పాకిస్తానీ పాస్పోర్ట్పైనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది తప్ప మరొక పాస్పోర్ట్ మీద కాదు. దరఖాస్తు సమర్పించగానే భారతీయ రాయబార కార్యా లయం దాన్ని ఢిల్లీకి పంపిస్తుంది. అక్కడ విదేశీ వ్యవహారాల శాఖ కాకుండా, హోమ్ మంత్రిత్వ శాఖ దాన్ని నిర్ణయిస్తుంది. దానికి కొన్ని నెలలు పడుతుంది. మూడు నెలల్లోగా నిర్ణయం వస్తుందని ఆశించవద్దని దరఖాస్తుదారులకు ఆటోమేటిక్గా చెబుతారు. అఖండ భారత్ ఇలాగా? తరచుగా నేను మెజారిటీ కేసులను తడిమి చూశాను. ఎక్కడా స్పందన లేదు. అలాంటి సందర్భాల్లో ఏ వార్తా రాకపోవడం మంచి వార్త కాదు. ఒకవేళ వచ్చిదంటే, ఎవరో మీ కోసం తీగ లాగగలగాలి. అదీ మీరు అదృష్టవంతులైతే! కానీ ఎంతమంది పాకిస్తానీయులకు అలాంటివి చేసి పెట్టేవారు దొరుకుతారు? తుది ఫలితం ఏమిటంటే – భారత్ సందర్శించడానికి చాలా తక్కువ మంది మాత్రమే అనుమతి పొందుతారు. ఒకప్పుడు –అంటే చాలా కాలం క్రితం కాదు– మన తోటి దేశవాసులుగా ఉండిన వారితో మనం నిజంగా వ్యవహరించవలసిన తీరు ఇదేనా? మరీ ముఖ్యంగా, అఖండ భారత్పై మన ప్రకటనలకు (సమర్థన అటుండనీ) మద్దతు గెల్చుకోవడానికి మనం వెళుతున్న మార్గం ఇదేనా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిగణించుకుంటున్న దేశం, ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా ‘అవును’ అనేది సమాధానం అయితే అది నేను నమ్మలేని విషయం అవుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వంతో మనకు దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయనడంలో సందేహమే లేదు. కానీ నిజం ఏమిటంటే పాకిస్తాన్ ప్రజల విషయంలో కూడా ఇది నిజమేనా? ఈ సందర్భంలో దేశ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? లేదా మనం అలాంటి సులభమైన సూక్ష్మ విషయాన్ని కూడా గ్రహించలేనంత అసమర్థులమా? ఈ విషయంలో నిజం ఏదంటే, మనం వీసాలను నిరాకరించడం ద్వారా పాకిస్తానీయులు ఇబ్బందిపడి ఉండవచ్చు లేదా పడకపోయి ఉండ వచ్చు. కానీ ఒక దేశంగా మనం (భారత ప్రభుత్వాలు మాత్రమే కాదు, భారత ప్రజలం కూడా) వికారంగా కనిపించడం లేదా? కాబట్టే మన కోసమైనా మనం ఇలాంటి ధోరణిని తప్పక ఆపివేయాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కోహ్లి క్రీడాస్పూర్తి.. వీడియో వైరల్
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లి అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తన చర్యతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోహ్లి తన జెర్సీని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కేరీకి గిఫ్ట్ అందించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. ఆ తర్వాత కాసేపు వారిద్దరితో మాట్లాడి కెరీర్ పరంగా ఆల్ ది బెస్ట్ చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి కోహ్లి మాత్రం అహ్మదాబాద్ టెస్టు హీరోగా నిలిచాడు. కొంతకాలంగా టెస్టుల్లో సెంచరీ చేయడంలో విఫలమవుతూ వచ్చిన కోహ్లి ఆ కొరతను తీర్చుకోవడమే గాక తన బ్యాటింగ్పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఇరుజట్లు కలిపి నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ కాగా.. ఉస్మాన్ ఖవాజా 180, గ్రీన్ 114 సెంచరీలతో మెరిశారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి 186, శుబ్మన్ గిల్ 128 పరుగులు.. సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 175 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ట్రెవిస్ హెడ్ 90 పరుగుల వద్ద ఔటయ్యి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మార్నస్ లబుషేన్ 63 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మ్యాచ్లో 186 పరుగులు చేసిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. సిరీస్లో పోటాపోటీగా వికెట్లు తీసిన అశ్విన్, జడేజాలు సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పంచుకున్నారు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మార్చి 17 నుంచి మొదలుకానుంది. తొలి వన్డే ముంబై వేదికగా మార్చి 17న జరగనుంది. Virat Kohli presents his match jersey to Usman Khawaja and Alex Carey. Class bloke! pic.twitter.com/tr3ciu1az7 — Vignesh Bharadwaj (@VBharadwaj31) March 13, 2023 -
IND VS AUS 4th Test Day 4: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
91 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (180) రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా బరిలోకి దిగలేదు. భారత బ్యాటింగ్ సందర్భంగా అక్షర్ పటేల్ కొట్టిన సిక్సర్ను ఆపే ప్రయత్నంలో ఖ్వాజా గాయపడ్డాడని, అందుకే అతన్ని ఓపెనర్గా పంపలేదని ఆసీస్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. ఖ్వాజా గాయపడటంతో అతని స్థానంలో ట్రవిస్ హెడ్కు జోడీగా మాథ్యూ కుహ్నేమన్ బరిలోకి దిగాడు. ఖ్వాజా గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అతను చివరి రోజు ఆటలో బరిలోకి దిగుతాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ ఖ్వాజా గాయం పెద్దదై అతను బరిలోకి దిగలేకపోతే, ఆ ప్రభావం ఆసీస్పై భారీగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10 మంది ఆటగాళ్లతో ఆసీస్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే అది ఆసీస్ విజయావకాశాలను భారీ దెబ్బకొడుతుందని, ఇది టీమిండియాకు కచ్చితంగా కలిసొస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు కూడా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. 186 పరుగుల వద్ద కోహ్లి ఔటవ్వగానే టీమిండియా 571/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్లో కోహ్లితో పాటు శుభ్మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 మ్యాచ్ల ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో మూడు మ్యాచ్ల అనంతరం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో టెస్ట్లో భారత్ గెలిస్తే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా అర్హత సాధిస్తుంది. -
చరిత్ర సృష్టించిన ఖవాజా.. 43 ఏళ్ల రికార్డు బద్దలు! ఏకైక ఆటగాడిగా..
అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరగుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఖవాజా (180; 422 బంతుల్లో 21x4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా మరో బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (114; 170 బంతుల్లో 18x4) విరోచిత శతకం సాధించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్లు ఫలితంగా తమ తొలి ఇన్నింగ్లో 480 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ (17 బ్యాటింగ్) శుభ్మన్ గిల్ (18 బ్యాటింగ్) అజేయంగా ఉన్నారు. ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు.. ఈ మ్యాచ్లో అద్భుత శతకంతో చెలరేగిన ఆసీస్ ఓపెనర్ ఖవాజా ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా బ్యాటర్గా ఖవాజా రికార్డులకెక్కాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 422 బంతులు ఆడిన ఉస్మాన్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజ బ్యాటర్ గ్రాహం యాలోప్ పేరిట ఉండేది. 1979లో ఈడెన్ గార్డన్స్ వేదికగా జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో యాలోప్ 392 బంతులు ఆడాడు. ఇక తాజా మ్యాచ్లో 422 బంతులు ఆడిన ఉస్మాన్.. 43 ఏళ్ల యాలోప్ రికార్డు బ్రేక్ చేశాడు. కాగా యాలోప్ తర్వాతి స్థానంలో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(361) బంతులతో ఉన్నాడు. చదవండి: IND vs AUS: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. పరువు పోగట్టుకున్న రోహిత్, జడ్డూ! వీడియో వైరల్ -
Ind Vs Aus: స్మిత్ రికార్డు బద్దలు కొట్టిన ఖవాజా.. అరుదైన ఘనత
India vs Australia, 4th Test- Usman Khawaja: ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ఈసారి భారత పర్యటన అతడి కెరీర్లోనే చిరస్మరణీయంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. గతంలో రెండుసార్లు ఇక్కడికి వచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం డ్రింక్స్ అందించేందుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ఆరంభానికి ముందే తుదిజట్టులో చోటు ఖాయం కాబట్టి.. తనదైన మార్కు చూపించాలని ఆరాటపడ్డాడు. అయితే, మొదటి టెస్టులో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్లో 5 పరుగులకే పరిమితమయ్యాడు. ఢిల్లీ టెస్టుతో పుంజుకున్న అతడు.. మొత్తంగా 87 పరుగులు సాధించాడు. ఇక ఇండోర్ టెస్టులో 60 పరుగులతో సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఉస్మాన్ ఖవాజా మరోసారి బ్యాట్ ఝులిపించాడు. అయితే, ఈసారి ఏకంగా సెంచరీ బాది జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. పట్టుదలగా నిలబడి 422 బంతులు ఎదుర్కొని 180 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఖవాజా అరుదైన ఘనత సాధించాడు. స్మిత్ రికార్డు బద్దలు అహ్మదాబాద్ టెస్టులో 180 పరుగులు సాధించిన ఖవాజా భారత గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన మూడో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో స్మిత్ను వెనక్కినెట్టాడు. భారత్లో టీమిండియాతో మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆసీస్ బ్యాటర్లు 1. డీన్ జోన్స్- 1986- చెన్నైలో- 210 2. మాథ్యూ హెడెన్-2001- చెన్నైలో- 203 3. ఉస్మాన్ ఖవాజా- 2023- అహ్మదాబాద్-180 4. స్టీవ్ స్మిత్- 2017- రాంచిలో- 178 నాటౌట్. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్గా! దరిదాపుల్లో ఎవరూ లేరు Ind Vs Aus: కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు! రోహిత్ సారథ్యంలో 24 గంటల్లోనే రెండుసార్లు! ఇంత ఘోరమా? 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా.. అంతా వాళ్ల వల్లే! అదే జరిగితే టీమిండియా.. -
కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు! రోహిత్ సారథ్యంలో 24 గంటల్లో రెండుసార్లు!
India vs Australia, 4th Test- Rohit Sharma- Virat kohli: భారత గడ్డపై మూడో టెస్టును రెండున్నరోజుల్లోనే ముగించిన ఆస్ట్రేలియా నాలుగో టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. తొలి రెండు మ్యాచ్లలో సునాయాసంగా నెగ్గిన రోహిత్ సేనకు ఊహించని రీతిలో షాకిస్తోంది. ఇండోర్ విజయంతో నేరుగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన కంగారూ జట్టు.. టీమిండియా అవకాశాలపై నీళ్లు చల్లాలని ఉవ్విళ్లూరుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో భారత జట్టు ఆధిక్యాన్ని తగ్గించి.. సమం చేయాలని ఆశపడుతోంది. అందుకు తగినట్లుగానే అహ్మబాదాబాద్లో ఆసీస్ బ్యాటర్లు పట్టుదలగా నిలబడి సెంచరీలతో రెచ్చిపోయారు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2024లో టీమిండియాతో మార్చి 9న మొదలైన ఆఖరి టెస్టులో తొలిరోజే ఉస్మాన్ ఖవాజా శతకం బాదగా.. ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజులో నిలిచాడు. ఒక్క వికెట్ కూడా తీయలేక ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కూడా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు మాదిరి రెండో రోజు కూడా.. ఎంత ప్రయత్నించినా టీమిండియా బౌలర్లు తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఆఖరికి అశ్విన్.. సెంచరీ హీరో కామెరాన్ గ్రీన్(114)ను అవుట్ చేయడం ద్వారా భారత్కు రెండోరోజు తొలి వికెట్ దక్కింది. ఆ తర్వాత వరుసగా అశ్విన్ మరో రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఖవాజా(180)ను అవుట్ చేసి మరో బిగ్బ్రేక్ ఇచ్చాడు. అయితే, అప్పటికే ఆస్ట్రేలియా 400 పైచిలుకు మార్కు అందుకుని పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఇండోర్, అహ్మదాబాద్ టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్షర్ పటేల్ చేతికి బంతినివ్వకపోవడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీ బ్రేక్ ముగియగానే అక్షర్ రంగంలోకి దిగిన వెంటనే ఖవాజా రూపంలో కీలక వికెట్ తీశాడు. ఆ సమయంలో ఎల్బీడబ్ల్యూ విషయంలోనూ రోహిత్ మిన్నకుండిపోగా.. ఛతేశ్వర్ పుజారా రివ్యూ కోరమని చెప్పగా అనుకూల ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. విరాట్ కోహ్లి కెప్టెన్సీతో రోహిత్ను పోల్చి చూస్తూ నెటిజన్లు రోహిత్పై సెటైర్లు పేలుస్తున్నారు. కోహ్లి కెప్టెన్సీలో అలా.. రోహిత్ కెప్టెన్సీలో ఇలా సొంతగడ్డపై టెస్టు మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా సెషన్ ముగియడం కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు జరుగగా.. రోహిత్ శర్మ సారథ్యంలో 24 గంటల్లోనే రెండుసార్లు జరగడం గమనార్హం. ఈ గణాంకాలను హైలైట్ చేస్తూ రోహిత్ను ఆడుకుంటున్నారు నెటిజన్లు!! ఏదేమైనా ఈ టెస్టులో ఫలితం టీమిండియాకు అనుకూలంగా రాకుంటే మాత్రం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్కు కోహ్లి ఆదేశం Ind Vs Aus: గ్రౌండ్లోనే ఇషాన్పై చెయ్యెత్తిన రోహిత్.. సర్వెంట్ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ.. Ind vs Aus: చెలరేగిన అశ్విన్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు! సెంచరీ హీరో అవుట్.. ఇంకా! వీడియో వైరల్ 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా.. అంతా వాళ్ల వల్లే! అదే జరిగితే టీమిండియా.. Wicketless session in test cricket at home •Under Virat kohli -2 in 7 years •Rohit sharma -2 in last 24 hours — Gaurav (@Melbourne__82) March 10, 2023 𝐎𝐧𝐞 𝐛𝐫𝐢𝐧𝐠𝐬 𝐭𝐰𝐨! 🔥🔥 A sigh of relief for #TeamIndia as @ashwinravi99 strikes twice in an over to remove Cameron Green and Alex Carey 💪🏻💪🏻 Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/e8caRqCHOq — BCCI (@BCCI) March 10, 2023 -
23 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసీస్.. అంతా వాళ్ల వల్లే! అదే జరిగితే టీమిండియా..
India vs Australia, 4th Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో మూడో టెస్టుతో ఫామ్లోకి వచ్చిన ఆస్ట్రేలియా.. నాలుగో మ్యాచ్లోనూ దూకుడు కొనసాగిస్తోంది. టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో పరుగులు తీసేందుకు ఆపసోపాలు పడిన ఆసీస్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా బ్యాట్ ఝులిపిస్తున్నారు. ఓవైపు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దంచి కొట్టగా.. ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ శతకం(114)తో మెరిశాడు. అహ్మదాబాద్ టెస్టులో తొలిరోజే ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి 180 పరుగులతో అజేయంగా నిలిచాడు. 421 బంతులు ఎదుర్కొన్న అతడు 21 ఫోర్ల సాయంతో ఈ మేరకు స్కోరు సాధించాడు. అయితే, ఆ వెంటనే అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మిగిలిన వాళ్లలో మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 32, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ నేపథ్యంలో ఖవాజా(180), కామెరాన్ గ్రీన్(114) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 146 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 400 పైచిలుకు స్కోరు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు(తాజా మ్యాచ్ కలిపి) తొమ్మిది సందర్భాల్లో ఈ మేర మొదటి ఇన్నింగ్స్లో 400 పరుగుల మార్కు దాటింది. తాజా మ్యాచ్ మినహాయిస్తే.. ఈ మేర స్కోరు చేసిన సందర్భాల్లో ఒకసారి ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 4సార్లు ఓటమిపాలైంది. మూడుసార్లు మ్యాచ్ డ్రా చేసుకుంది. కాగా ఇప్పటివరకు భారత బౌలర్లలో మహ్మద్ షమీకి రెండు, రవిచంద్రన్ అశ్విన్కు నాలుగు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కాయి. డబ్ల్యూటీసీ ఫైనల్పై ఆశలు టీమిండియాతో మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ సేనకు చిక్కొచ్చిపడింది. ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టులో గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. మ్యాచ్ ఓడినా, డ్రా అయినా.. న్యూజిలాండ్- శ్రీలంక సిరీస్ ఫలితం తేలేంత వరకు ఎదురుచూడాల్సిందే! అయితే, లంక న్యూజిలాండ్ గడ్డపై కివీస్ను క్లీన్స్వీప్ చేస్తేనే టీమిండియాతో పోటీపడే అవకాశం ఉంటుంది. అయితే, విదేశీ గడ్డపై కరుణరత్నె బృందానికి అదేమీ అంత తేలికకాదు. దీంతో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్కు కోహ్లి ఆదేశం! Ind vs Aus: చెలరేగిన అశ్విన్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు! సెంచరీ హీరో అవుట్.. ఇంకా! వీడియో వైరల్ Ind Vs Aus: గ్రౌండ్లోనే ఇషాన్పై చెయ్యెత్తిన రోహిత్.. సర్వెంట్ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ.. 𝐎𝐧𝐞 𝐛𝐫𝐢𝐧𝐠𝐬 𝐭𝐰𝐨! 🔥🔥 A sigh of relief for #TeamIndia as @ashwinravi99 strikes twice in an over to remove Cameron Green and Alex Carey 💪🏻💪🏻 Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/e8caRqCHOq — BCCI (@BCCI) March 10, 2023 -
బ్యాటింగ్లో రికార్డు భాగస్వామ్యం.. సిరీస్లో ఇదే తొలిసారి
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి బ్యాటింగ్లో ఒక రికార్డు నమోదైంది. గత మూడు టెస్టుల్లో బౌలింగ్లోనే రికార్డులు వచ్చాయి తప్పిస్తే బ్యాటింగ్లో పెద్ద సంచలనాలు నమోదు కాలేదు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిసారి బ్యాటర్లు పరుగులు పండగ చేసుకుంటున్నారు. తొలిరోజు పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆటలోనే అదే స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. ఓవర్నైట్ స్కోరు 255/4తో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఖవాజా 129, గ్రీన్ 65 పరుగులతో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 126 పరుగులు అజేయంగా జోడించారు. ఈ సిరీస్లో ఈ భాగస్వామ్యమే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ఇంతకముందు ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్లు అశ్విన్, అక్షర్లు కలిసి ఎనిమిదో వికెట్కు 114 పరుగులు జోడించడం బెస్ట్గా ఉంది. తాజాగా ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్లు దానిని బ్రేక్ చేశారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఇద్దరు కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. చదవండి: పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత భారత్, ఆసీస్ నాలుగో టెస్టు.. రెండో రోజు లైవ్ అప్డేట్స్ -
'గతంలో వచ్చిన రెండుసార్లు డ్రింక్స్ మోశాను.. సెంచరీ విలువైనది'
అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో మొదలైన నాలుగో టెస్టులో తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ఆసీస్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ కనబరిచారు. టీమిండియా బౌలర్లు రోజంతా కష్టపడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఇక తొలిరోజు ఆటలో హైలైట్ అయింది మాత్రం నిస్సందేహంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా నుంచి ఈసారి తన ఆటతో ఎవరైనా భయపెడతారంటే ముందు వినిపించిన పేరు ఖవాజాదే. తాజాగా నాలుగో టెస్టులో ఖవాజా అద్భుత సెంచరీతో మెరిశాడు. 251 బంతుల్లో 104 పరుగులతో ఆడుతున్న ఖవాజా ఇన్నింగ్స్లో 15 ఫోర్లు ఉన్నాయి. అతను ఆడిన ఒక్క షాట్లో కూడా చిన్న పొరపాటు లేదంటేనే ఎంత గొప్ప బ్యాటింగ్ కొనసాగించాడో అర్థం చేసుకోవచ్చు. ఖవాజా టెస్టు కెరీర్లో ఇది 14వ సెంచరీ కావొచ్చు.. కానీ టీమిండియాపై, భారత గడ్డపై ఇదే మొదటి శతకం కావడం విశేషం. అందునా భారత్ గడ్డపై సెంచరీ సాధించడం ఎంతో ఎమెషన్తో కూడుకున్నది. అందుకే తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఖవాజా మాట్లాడుతూ కాస్త ఎమెషన్ అయ్యాడు. ''గతంలో రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు డ్రింక్స్ మాత్రమే మోశాను.. ఈసారి సెంచరీతో మెరిశాను.. అందుకే ఇది ఎంతో విలువైనది'' అని చెప్పుకొచ్చాడు. "ఈ సెంచరీలో చాలా ఎమోషన్ ఉంది. దీని కంటే ముందు ఇండియాకు రెండుసార్లు వచ్చాను. మొత్తం 8 టెస్టుల్లోనూ డ్రింక్స్ మోశాను. ఈ వికెట్ చాలా బాగుంది. నా వికెట్ పారేసుకోకూడదని అనుకున్నాను. ఇది మానసిక యుద్ధం. మన అహాన్ని పక్కన పెట్టాలి. నాకు ఎలాంటి మూఢ నమ్మకాలు లేవు. కేవలం ఆడుతూ వెళ్లడమే" అని ఖవాజా చెప్పాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఖవాజా 104 పరుగులు, గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఐదో వికెట్ కు 85 పరుగులు జోడించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెవాల్సిన పరిస్థితుల్లో ఉన్న టీమిండియా తొలి రోజే ఒత్తిడిలో పడింది. First 💯 for Usman Khawaja against India and what a time to get it 🙌#INDvAUS #BGT2023 #UsmanKhawaja #SteveSmith #ViratKohli #Cricket pic.twitter.com/Xv4QAtP46z — Abdullah Liaquat (@im_abdullah115) March 9, 2023 చదవండి: ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టిన బంగ్లా.. విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్ తయారు చేస్తారా? -
Ind Vs Aus: ఖవాజా అజేయ సెంచరీ.. గ్రీన్ విశ్వరూపం! షమీ ఏం చేశాడంటే!
Ind Vs Aus 4th Test Day 1 Highlights: టీమిండియాతో నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఉస్మాన్ ఖవాజా అజేయ సెంచరీతో రోహిత్ సేనపై పైచేయి సాధించింది. అహ్మదాబాద్లో గురువారం(మార్చి 9) నాటి ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్పూర్, ఢిల్లీ టెస్టుల్లో టీమిండియా, ఇండోర్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టెస్టు గురువారం మొదలైంది. మ్యాచ్ వీక్షించిన ప్రధానులు ఈ క్రమంలో భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్.. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి స్టేడియానికి విచ్చేశారు. ఆటగాళ్లను పలకరించిన ప్రధానులు వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అశ్విన్కు తొలి వికెట్ పేసర్ మహ్మద్ షమీతో బౌలింగ్ అటాక్ ఆరంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. అయితే, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 15.3ఓవర్లో మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(32)ను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత 22.2 ఓవర్లో షమీ మార్నస్ లబుషేన్(3)ను బౌల్డ్ చేసి రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత పట్టుదలగా నిలబడిన ఖవాజా, స్మిత్ జోడీని విడదీసేందుకు టీమిండియా విశ్వప్రయత్నం చేసింది. జడ్డూ బ్రేక్ ఇచ్చాడు సుదీర్ఘ విరామం తర్వాత 63.4 ఓవర్లో రవీంద్ర జడేజా స్మిత్ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత షమీ పీటర్ హ్యాండ్స్కోంబ్ను పెవిలియన్కు పంపి నాలుగో వికెట్ అందించాడు. కానీ.. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఖవాజా.. సెంచరీ సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఖవాజా, గ్రీన్ అద్భుత బ్యాటింగ్ మొదటి రోజు ఆటలో అతడు మొత్తంగా 251 బంతులు ఎదుర్కొని 15 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. తద్వారా ఈ సిరీస్లో రోహిత్ శర్మ తర్వాత శతకం సాధించిన రెండో బ్యాటర్గా నిలిచాడు. మరో ఎండ్లో ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ అతడికి సహకారం అందించాడు. ఆట ముగిసే సరికి 64 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేసి అర్ధ శతకానికి పరుగు దూరంలో నిలిచాడు. ఖవాజా, గ్రీన్ అద్భుత బ్యాటింగ్తో మొత్తానికి తొలి రోజు ఆస్ట్రేలియా టీమిండియాపై ఆధిపత్యం చెలాయించగలిగింది. అశూ, జడ్డూ ఒక్కో వికెట్ తీయగా.. షమీకి రెండు వికెట్లు దక్కాయి. చదవండి: Steve Smith: అంతా బాగానే ఉంది కానీ.. ఇదేంటి స్మిత్! మరీ ఇలా.. కెరీర్లో ఇదే తొలిసారి! Pritvi Shaw: ఆసక్తికర పోస్ట్.. పృథ్వీ షా ఎవరిని టార్గెట్ చేశాడు? As good as it gets! 🔥🔥@MdShami11 uproots the off-stump to dismiss Handscomb for 17! 👏👏 Australia 170/4. Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/2hXFYhvslW — BCCI (@BCCI) March 9, 2023 ICYMI - #TeamIndia's delightful breakthrough!@imjadeja breaks the partnership to get Steve Smith out 👌👌 Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/lJVW7uzi9h — BCCI (@BCCI) March 9, 2023 𝐓.𝐈.𝐌.𝐁.𝐄.𝐑 🔥@MdShami11 sends back Labuschagne to scalp the second wicket for #TeamIndia 👌 Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/LT3ao2kFBk — BCCI (@BCCI) March 9, 2023 -
BGT 2023: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అందుకే ఇలా: రోహిత్ శర్మ
Rohit Sharma Comments Over Indore Test Loss: ‘‘టెస్టు మ్యాచ్ ఓడటానికి అనేక కారణాలు ఉంటాయి. నిజానికి తొలి ఇన్నింగ్స్లో మా బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. మొదటి ఇన్నింగ్స్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ఎంత ముఖ్యమో మాకు ఇప్పుడు మరింత బాగా అర్థమైంది. వాళ్లకు 80-90 పరుగుల ఆధిక్యం లభించినపుడైనా మేము మెరుగ్గా బ్యాటింగ్ బ్యాటింగ్ చేయాల్సింది. కానీ మరోసారి మేము విఫలమయ్యాం. కేవలం 75 పరుగులు మాత్రమే చేయగలిగాం. ఒకవేళ మేము తొలి ఇన్నింగ్స్లో బాగా ఆడి ఉంటే పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. ప్రస్తుతం మేము డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోచించడం లేదు. మా దృష్టి మొత్తం ప్రస్తుతం నాలుగో టెస్టు మీదే ఉంది. అహ్మదాబాద్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం గురించే మా ఆలోచన. తొలి రెండు టెస్టుల్లో మా ఆట తీరు బాగుంది. అహ్మదాబాద్లోనూ అదే పునరావృతం చేయాలని భావిస్తున్నాం. పిచ్ ఎలా ఉందన్న విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం సరిగ్గా చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత మన ప్రణాళికలు సరిగ్గా అమలయ్యాయా? లేదా అన్న అంశం గురించి మాత్రమే ఆలోచించాలి. బ్యాటర్లకు సవాల్ విసిరే పిచ్లపై ఆడినపుడు మరింత ధైర్యంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. నిజానికి వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా నాథన్ లియోన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, తొలి రెండు మ్యాచ్లలో మా బ్యాటింగ్ ఎలా ఉందో అందరూ చూశారు కదా! అయితే, ఈసారి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయలేకపోయాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇండోర్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరేందుకు ఆసీస్ అవకాశాలను మెరుగుపరిచింది. బ్యాటర్ల వైఫల్యం ఇక బుధవారం(మార్చి 1) మొదలైన మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. తొలి ఇన్నింగ్స్లో 109, రెండో ఇన్నింగ్స్లో 163 పరుగులకు ఆలౌట్ కావడమే ఇందుకు నిదర్శనం. రెండు ఇన్నింగ్స్లో కలిపి నయావాల్ ఛతేశ్వర్ పుజారా మొత్తంగా 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా తొలి ఇన్నింగ్స్లో 60 పరుగులతో రాణించి జట్టుకు ఆధిక్యం అందించగా.. రెండో ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ 49, మార్నస్ లబుషేన్ 28 పరుగులతో అజేయంగా నిలిచి విజయలాంఛనం పూర్తి చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాథన్ లియోన్ మొత్తంగా 11 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 24 పరుగులు చేశాడు. చదవండి: సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం Danielle Wyatt: అప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజల్.. ఇప్పుడు తన ప్రేయసితో ఎంగేజ్మెంట్! -
BGT 2023: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. 9 వికెట్ల తేడాతో విజయం
BGT 2023 Ind Vs Aus 3rd Test Indore: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. దీంతో హ్యాట్రిక్ గెలుపు నమోదు చేయాలని భావించిన రోహిత్ సేనకు భంగపాటు తప్పలేదు. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఆసీస్ తొలి విజయం సాధించడంతో టీమిండియాకు ఆఖరి టెస్టులో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసీస్ స్పిన్నర్ల విజృంభణ ఇండోర్ వేదికగా బుధవారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, బంతి తొలి రోజు నుంచే స్పిన్కు టర్న్ అయిన నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభించారు. మాథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లతో చెలరేగగా, నాథన్ లియోన్ 3, టాడ్ మర్ఫీ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో మొదటి రోజే టీమిండియా కేవలం 109 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. విరాట్ కోహ్లి 22, శుబ్మన్ గిల్ 21 పరుగులు చేయగా మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. ఖవాజా ఇన్నింగ్స్ కారణంగా ఈ నేపథ్యంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్ నడ్డి విరుస్తారని భావించిన సగటు అభిమానులకు నిరాశే ఎదురైంది. జడేజా 4, అశ్విన్ 3, పేసర్ ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీసినప్పటికీ ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్ ఖవాజా 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మళ్లీ విఫలమైన టీమిండియా బ్యాటర్లు ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్లోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. ఛతేశ్వర్ పుజారా ఒక్కడే అర్ధ శతకం(59 పరుగులు) చేయగా మిగతా వాళ్లలో శ్రేయస్ అయ్యర్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో ఎవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి 163 పరుగులకు భారత్ రెండో ఇన్నింగ్స్ ముగించింది. నాథన్ లియోన్ 8 వికెట్లతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఫైనల్ అవకాశాలు మెరుగు ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట మొదలుకాగానే అశ్విన్ ఖవాజా వికెట్ తీసి శుభారంభం అందించిన్పటికీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ 49 పరుగులతో అదరగొట్టగా.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 28 పరుగులతో రాణించాడు. ఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు మెరుగయ్యాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు స్కోర్లు: ఇండియా- 109 & 163 ఆస్ట్రేలియా- 197 & 78/1 విజేత- ఆస్ట్రేలియా 4 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
స్టన్నింగ్ క్యాచ్.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి ఇన్నింగ్స్లో ప్రదర్శించిన ఆటతీరునే రెండో ఇన్నింగ్స్లోనూ చూపిస్తుంది. కాకపోతే అప్పుడు వంద పరుగులు చేయడానికి నానా కష్టాలు పడితే.. ఇప్పుడు మాత్రం 150 పరుగుల మార్క్ను అందుకోవడానికి యత్నిస్తుంది. గింగిరాలు తిరుగుతున్న బంతితో బ్యాటర్లు ముప్పతిప్పలు పడుతున్నారు. తాజాగా పుజారాతో కలిసి రెండో ఇన్నింగ్స్లో శ్రేయాస్ అయ్యర్ కాస్త ప్రతిఘటించాడు. 26 పరుగులతో కుదురుకున్నాడని అనుకునే లోపే ఉస్మాన్ ఖవాజా స్టన్నింగ్ క్యాచ్కు పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో అర్థసెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచిన ఉస్మాన్ ఖవాజా ఫీల్డింగ్లోనూ తన విన్యాసంతో అదరగొట్టాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడిన శ్రేయాస్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 26 పరుగులతో జోరు కనబర్చాడు. కానీ అతని దూకుడుకు ఉస్మాన్ ఖవాజా ముకుతాడు వేశాడు. అయ్యర్ 26 పరుగుల వద్ద ఉండగా.. స్టార్క్ బౌలింగ్లో డీప్ మిడ్వికెట్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న ఖవాజా బ్లైండర్ క్యాచ్ అందుకున్నాడు. ఒకవైపుగా డైవ్చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అయితే అంపైర్కు క్యాచ్పై స్పష్టత లేకపోవడంతో సాఫ్ట్ సిగ్నల్ కోసం థర్డ్ అంపైర్ను ఆశ్రయించాడు. రిప్లేలో ఖవాజా బంతిని ఎక్కడా నేలకు తగిలించినట్లు కనిపించకపోవడంతో అయ్యర్ను ఔట్గా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్లో ప్రస్తుతం టీమిండియా స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులుగా ఉంది. పుజారా 49, అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. లియోన్ నాలుగు వికెట్లు తీయగా కుహ్నెమన్, మిచెల్ స్టార్క్లు చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. pic.twitter.com/fg0G1Q7vzH — IPLT20 Fan (@FanIplt20) March 2, 2023 చదవండి: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు: ఆసీస్ మాజీ కెప్టెన్ -
శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. ఖవాజా మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా 262 పరుగులకు ఆలౌటైంది. 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ను అక్షర్ పటేల్(74), అశ్విన్(31)ను అదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 114 పరుగులు జోడించారు. ఇక కేవలం ఒక్క పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను మొదలపెట్టిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో ట్రెవిస్ హెడ్(39), మార్నస్ లబుషేన్(16) పరుగులతో ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ సూపర్ క్యాచ్.. కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ ఊస్మాన్ ఖవాజా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం విఫలమయ్యాడు. టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సంచలన క్యాచ్తో ఖవాజాను పెవిలియన్కు పంపాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన జడేజా బౌలింగ్లో ఐదో బంతికి పాడిల్ స్వీప్ పాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో లెగ్ గల్లీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్.. తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ, తన కుడివైపునకు వెళ్తున్న బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 6 పరుగులు చేసిన నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్లో కూడా రివర్స్ షాట్కు ప్రయత్నించి ఖవాజా తన వికెట్ను కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్లో రాహుల్ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్తో ఖవాజా పెవిలియన్ను పంపాడు. Ravindra Jadeja strikes for India - Khawaja goes now. Great start by Jadeja! — Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2023 చదవండి: నా అద్భుత ఫామ్కు కారణం అతడే: అక్షర్ పటేల్ -
గుడ్డిలో మెల్ల.. తొలి టెస్టు కంటే మెరుగ్గానే
IND Vs AUS 2nd Test Day-1 Analysis.. ఢిల్లీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆటలో టీమిండియానే ఆధిపత్యం కనబరిచింది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్లో మహ్మద్ షమీ నాలుగు వికెట్లతో చెలరేగడం చూస్తుంటే ఆస్ట్రేలియా పేసర్లకు కూడా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వికెట్లు తీసేందుకు మంచి అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే తొలి టెస్టుతో పోలిస్తే ఆసీస్ బ్యాటింగ్ కాస్త మెరుగ్గా అనిపించింది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా రెండో టెస్టులో మాత్రం తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 81 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు వార్నర్ మాత్రం తన వైఫల్యాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నాడు. ఇక తొలి టెస్టులో పర్వాలేదనిపించిన వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగాడు. అశ్విన్ స్పిన్ దెబ్బకు స్మిత్ తోకముడిచాడు. ఆ తర్వాత పనిని జడేజా కానిచ్చాడు. ఖవాజా వికెట్ను ఖాతాలో వేసుకున్న జడేజా ఆఖర్లో మరో రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అయితే జట్టులో మూడో స్పిన్నర్గా ఉన్న అక్షర్ పటేల్కు ఈ మ్యాచ్లో కూడా ఒక్క వికెట్ దక్కలేదు. ఇక తన పేస్ పదును చూపించిన షమీ మొదట వార్నర్ను, మధ్యలో ట్రెవిస్ హెడ్ను.. చివరి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకొని మొత్తానికి తొలిరోజు హీరో అయ్యాడు. ఇక స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుదని క్యురేటర్ పేర్కొన్నప్పటికి అలా జరగలేదు. స్పిన్నర్లు ప్రభావం చూపించినప్పటికి టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అంతకుమించి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియాకు రెండో టెస్టులో ఏదైనా ఓదార్పు ఉందంటే మూడు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయడమే. గుడ్డిలో మెల్ల కనీసం రెండు వందల స్కోరైనా చేసంది. మరి రెండో రోజు ఆటలో ఆసీస్ పేసర్లు జూలు విధిస్తారా.. స్పిన్నర్లు ఏమైనా మ్యాజిక్ చేస్తారా అన్నది వేచి చూడాలి. చదవండి: 'చేసేయాల్సింది ఒక పని అయిపోయేది..' ఆఖర్లో హైడ్రామా.. వెనక్కి వచ్చేయాలంటూ క్రికెటర్లకు పిలుపు -
షమీ, అశ్విన్, జడ్డూ అదుర్స్.. మొదటి రోజే ముగిసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్
India vs Australia, 2nd Test: టీమిండియాతో రెండో టెస్టులో మొదటి రోజే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగించింది. అయితే, నాగ్పూర్లో 177 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ ముగించిన కమిన్స్ బృందం.. ఢిల్లీ మ్యాచ్లో 263 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(81), ఆరో స్థానంలో వచ్చిన పీటర్ హ్యాండ్స్కోంబ్(72 నాటౌట్) రాణించారు. చెలరేగిన షమీ, అశూ, జడ్డూ దీంతో 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ అయి తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది ఆస్ట్రేలియా. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(15)ను అవుట్ చేసి తొలి వికెట్ తీసిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ.. మొత్తంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో సత్తా చాటారు. వార్నర్, ట్రావిస్ హెడ్, నాథన్ లియోన్, మాథ్యూ కుహ్నెమన్ వికెట్లు షమీ తన ఖాతాలో వేసుకోగా.. జడేజా ఖవాజా రూపంలో కీలక వికెట్ సాధించి పలు రికార్డులు నమోదు చేశాడు. ఖవాజా ఒంటరి పోరాటం అదే విధంగా ప్యాట్ కమిన్స్, టాడ్ మర్ఫీ వికెట్లను జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అశ్విన్ మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా(81) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 33 పరుగులతో రాణించాడు. హ్యాండ్స్కోంబ్ విలువైన అర్ధ శతకం ఇక ఆరో స్థానంలో వచ్చిన హ్యాండ్స్కోంబ్(72) అజేయ అర్ధ శతకంతో మెరిసి ఆసీస్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగులతో టీమిండియా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అరుణ్జైట్లీ స్టేడియంలో శుక్రవారం (ఫిబ్రవరి 17) మొదలైన రెండో టెస్టులోనూ పట్టు బిగించి.. విజయం సాధించి ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. చదవండి: IND Vs AUS: షమీ చెవులు పిండిన అశ్విన్.. ఫోటో వైరల్ BGT 2023: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో రాహుల్ అద్భుత క్యాచ్.. బిత్తరపోయిన ఖవాజా.. వీడియో వైరల్ ICYMI - WHAT. A. CATCH 😯😯 WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK — BCCI (@BCCI) February 17, 2023 -
గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో రాహుల్ అద్భుత క్యాచ్.. బిత్తరపోయిన ఖవాజా! వీడియో
India vs Australia, 2nd Test- KL Rahul Catch Video Viral: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విఫలమైనప్పటికీ ఢిల్లీ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకోగలిగాడు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ టెస్టులో ఈ కర్ణాటక బ్యాటర్ కేవలం 20 పరుగులే చేశాడు. 70 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో ఈ మేరకు స్కోరు చేశాడు. దీంతో.. రాహుల్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ను కాదని.. ఫామ్లేమితో సతమతమవుతున్న రాహుల్కు ఛాన్స్ ఇచ్చిన మేనేజ్మెంట్పై ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ క్రమంలో వరుసగా విఫలమవుతున్న రాహుల్కు రెండో టెస్టు జట్టులో చోటు దక్కదని భావించారంతా! కానీ తొలి మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ను తప్పించిన మేనేజ్మెంట్.. రాహుల్ను మాత్రం కొనసాగించింది. శ్రేయస్ అయ్యర్ రాకతో సూర్యకు నిరాశ ఎదురుకాగా.. రాహుల్ వల్ల గిల్కు మరోసారి మొండిచేయి ఎదురైంది. సంచలన క్యాచ్తో ఈ నేపథ్యంలో రాహుల్ పట్ల బీసీసీఐ సెలక్టర్లకు అంత ప్రేమ ఎందుకో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సంచలన క్యాచ్తో మెరిసి మరోసారి వార్తల్లో నిలిచాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకుని కీలక వికెట్ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(81) అద్భుత పోరాటం చేశాడు. బిత్తరపోయిన ఖవాజా ప్రమాదకరంగా మారుతున్న అతడిని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా.. అద్భుత బంతి(45.5 ఓవర్)తో బోల్తా కొట్టించాడు. జడ్డూ వేసిన బాల్ను రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన ఖవాజా ఇచ్చిన క్యాచ్ను రాహుల్ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. నమ్మశక్యం కాని రీతిలో రాహుల్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో ఆశ్చర్యపోవడం ఖవాజా వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన బీసీసీఐ.. వాట్ ఏ క్యాచ్ అంటూ రాహుల్ను కొనియాడింది. ఇదిలా ఉంటే.. ఖవాజాను అవుట్ చేసి జడ్డూ టెస్టుల్లో 250 వికెట్లు పూర్తి చేసుకోవడం విశేషం. చదవండి: Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! Ravichandran Ashwin:'చేసేయాల్సింది ఒక పనైపోయేది..' ICYMI - WHAT. A. CATCH 😯😯 WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK — BCCI (@BCCI) February 17, 2023 -
ఐదేళ్ల వయసులో జాతి వివక్ష.. కట్చేస్తే స్టార్ క్రికెటర్ హోదా
ఉస్మాన్ ఖవాజా.. ఆస్ట్రేలియా క్రికెటర్గా మాత్రమే చాలా మందికి పరిచయం. కానీ ఖవాజా క్రికెటర్గా మాత్రమే గాక సోషల్ యాక్టివిస్ట్ కూడా. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో కొనసాగుతున్న నల్లజాతీయ క్రికెటర్ అతను. ఖవాజా ఐదేళ్ల వయసులో అతని కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. ఖవాజా తండ్రి కర్రీ మేకర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. తన ఐదేళ్ల వయసులో ఖవాజా .. 'Fuking Curry Maker Son' అంటూ జాతి వివక్షకు గురయ్యాడు. అలా జాతి వివక్షను తొలిసారిగా ఎదుర్కొన్న ఉస్మాన్ ఖవాజా ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఖవాజా ఒక క్రికెటర్గా రాణిస్తూనే నల్లజాతీయులపై జరిగిన వివక్షకు వ్యతిరేకంగా నిలబడి తన పోరాటాన్ని కొనసాగించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఖవాజా పౌండేషన్ పేరుతో చారిటీ సంస్థను స్థాపించి మైనారిటీలకు, వలసదారులకు, శరణార్థులకు, మానసికంగా కుంగిపోయిన చిన్నారులకు ఆశ్రయం కల్పించాడు. అలా కర్రీ మేకర్ కొడుకు ఇవాళ స్టార్ క్రికెటర్ హోదా సంపాదించాడు. వ్యక్తిగతంగాను నలుగురికి సహాయపడే పనులు చేస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నాడు. ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్గా రాణిస్తున్న ఉస్మాన్ ఖవాజా టీమిండియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జట్టుకు కీలకం కానున్నాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ఖవాజా గతేడాది నుంచి టెస్టుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియన్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అయితే వీసా సమస్య కారణంగా జట్టుతో పాటు రాలేకపోయిన ఖవాజా ఒకరోజు ఆలస్యంగా భారత్ గడ్డపై అడుగుపెట్టాడు. వచ్చీ రాగానే ప్రాక్టీస్లో తలమునకలయ్యాడు. పశ్చిమాసియా మూలాలున్న క్రికెటర్ కావడంతో ఖవాజా స్పిన్ను సమర్థంగా ఆడగలడు. ఇదే అతన్ని ఈ టెస్టు సిరీస్కు ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత్ లాంటి ఉపఖండపు పిచ్లపై ఖవాజా లాంటి బ్యాటర్ సేవలు చాలా అవసరం. ఫిబ్రవరి 9న నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్ను ప్రారంభించాయి.ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంది. ఆసీస్తో సిరీస్ను టీమిండియా గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. The two facets of the Usman Khawaja Foundation: 1: Allowing kids from low socio-economic backgrounds to play sport for free 2: Giving grants, scholarships and things needed for kids' education Both close to Khawaja's ❤️ pic.twitter.com/REQ6CzAQcP — 7Cricket (@7Cricket) January 30, 2023 చదవండి: భారత్తో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్షాక్! భార్యకు చిత్రహింసలు.. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు -
భారత్తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్
టీమిండియాతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు బుధవారం భారత్కు బయలుదేరనుంది. అయితే ఆసీస్ టెస్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఒకరోజు ఆలస్యంగా వెళ్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) పేర్కొంది. వీసా సమస్యే అందుకు కారణమని సీఏ తెలిపింది. ''ఆస్ట్రేలియా జట్టులో ఉన్న అందరికి వీసాలు మంజూరు అయ్యాయని.. ఉస్మాన్ ఖవాజాకు మాత్రం వీసా ప్రాబ్లమ్ ఏర్పడింది. బుధవారం సాయంత్రం వరకు అది పరిష్కారమవుతుంది. ఈరోజు సాయంత్రంలోగా ఖవాజాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని.. గురువారం ఉదయం కొంతమంది సహాయక సిబ్బందితో కలిసి భారత్కు వెళ్తాడని'' క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే తాను ఫ్లైట్ మిస్సయిన విషయాన్ని ఖవాజా ఒక పాపులర్ మీమ్తో సరదాగా ట్విటర్లో పంచుకున్నాడు. భారతీయ వీసా కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నట్లుగా నా పరిస్థితి తయారూంది. అంటూ పేర్కొన్నాడు.ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. టెస్టు సిరీస్ అనంతరం ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా జరగనుంది. ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంది. ఆసీస్తో సిరీస్ను టీమిండియా 3-1తో గెలిస్తే టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. View this post on Instagram A post shared by Usman Khawaja (@usman_khawajy) Me waiting for my Indian Visa like... #stranded #dontleaveme #standard #anytimenow https://t.co/pCGfagDyC1 — Usman Khawaja (@Uz_Khawaja) February 1, 2023 చదవండి: నెగెటివ్ ట్వీట్ను లైక్ చేసిన క్రికెటర్.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు IND Vs AUS: తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం.. జడ్డూ రీఎంట్రీ -
విజయానికి 13 వికెట్ల దూరంలో.. అసాధ్యం మాత్రం కాదు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో దక్షిణాఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్.. ఆఖరి రోజు లంచ్ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఖాయా జోండో (39), తెంబా బవుమా (35) ఓ మోస్తరుగా రాణించగా.. సిమోన్ హార్మర్ (45 నాటౌట్), కేశవ్ మహారాజ్ (49 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 231 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్ ఆధిపత్యం కనిపిస్తున్నా.. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో రెండు సెషన్ల ఆటలో ఆసీస్ బౌలర్లు మరో 13 వికెట్లు నేలకూల్చగలిగితే.. మ్యాచ్తో పాటు సిరీస్ను క్లీన్స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది అంత సులువు కాదు. కాగా, ఈ మ్యాచ్లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఈ క్రమంతో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్) డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆసీస్ కెప్టెన్ సాహసోపేత నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఖ్వాజాతో పాటు స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. డబుల్ సెంచరీ పూర్తి కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సహచరుడు ఉస్మాన్ ఖ్వాజాకు (195 నాటౌట్) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఖ్వాజా ఒకింత మనస్థాపానికి గురైనా, జట్టు ప్రయోజనాల కోసం చేసేదేమీ లేక సర్దుకుపోవాల్సి వచ్చింది. కమిన్స్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్మీడియాలో అతన్ని ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. నాలుగో రోజు తొలి సెషన్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనప్పటికీ.. కేవలం ఒక్క ఓవర్ పాటు ఖ్వాజాకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినా డబుల్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు కదా అని ఆసీస్ ఓపెనర్పై జాలిపడుతున్నారు. 2004లో నాటి భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా కమిన్స్ లాగే.. సహచరుడు సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఉదంతాన్ని నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజైన ఇవాళ (జనవరి 7) కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. నాలుగో రోజు 59 ఓవర్లు (ఎటువంటి అంతరాయం కలగకపోతే), ఆఖరి రోజు 98 ఓవర్ల ఆట సాధ్యపడితే ఫలితం (సౌతాఫ్రికాను 2 సార్లు ఆలౌట్ చేయాల్సి ఉంటుంది) తప్పక వస్తుందన్న అంచనాతో కమిన్స్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసినట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్ట్లో ఆసీస్ బౌలర్లు 137.3 ఓవర్లలో సఫారీలను 2 సార్లు ఆలౌట్ చేశారు. ఈ ధీమాతోనే కమిన్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్), స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు టీ విరామం సమయానికి (31 ఓవర్లు) 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
డాన్ బ్రాడ్మన్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో శతకొట్టిన స్టీవ్ స్మిత్ (192 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్సర్లు).. కెరీర్లో 30వ సారి ఈ మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ రికార్డు పేరిట ఉన్న 29 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్లో ఉండగా.. స్టీవ్ వా (32) రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం స్మిత్.. మాథ్యూ హేడెన్తో (30) సమంగా మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లలో రికీ పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం స్మిత్తో పాటు మార్నస్ లబూషేన్కు మాత్రమే ఉంది. ప్రస్తుతం భీకరమైన ఫామ్లో ఉన్న లబూషేన్ 33 మ్యాచ్ల్లో 59.43 సగటున 10 సెంచరీల సాయంతో 3150 పరుగులు చేశాడు. ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా ఉన్నప్పటికీ.. వయసు పైబడిన రిత్యా వీరు మరో రెండు, మూడేళ్లకు మించి టెస్ట్ల్లో కొనసాగే అవకాశం లేదు. ప్రస్తుతం వార్నర్ ఖాతాలో 25, ఖ్వాజా ఖాతాలో 13 శతకాలు ఉన్నాయి. స్మిత్ శతకం సాధించిన మ్యాచ్లోనే ఖ్వాజా తన 13వ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో మూడో సెషన్ డ్రింక్స్ సమయానికి ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (195) తన కెరీర్ తొలి డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. మధ్యలో ట్రవిస్ హెడ్ (59 బంతుల్లో 70; 8 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఖ్వాజాకు జతగా మాట్ రెన్షా (5) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు తొలి రోజు డేవిడ్ వార్నర్ (10), లబూషేన్ (79) ఔటయ్యారు. సిరీస్లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఆసీస్ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆతిధ్య జట్టు.. రెండో మ్యాచ్లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్లో తలపడతాయి. -
శతకాల మోత మోగించిన ఆసీస్ ప్లేయర్లు.. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు
AUS VS SA 3rd Test Day 2: 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నామమాత్రపు మ్యాచ్లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. రెండో రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 394 పరుగులు చేసింది. ఓవర్నైట్ బ్యాటర్లు ఉస్మాన్ ఖ్వాజా (335 బంతుల్లో 172 నాటౌట్) కెరీర్లో 13 శతకం బాది డబుల్ సెంచరీ దిశగా సాగుతుండగా, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరీర్లో 30 శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట కేవలం 47 ఓవర్లు మాత్రమే సాగగా.. ఇవాల్టి (జనవరి 5) ఆట షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైంది. టీ విరామం సమయానికి ఖ్వాజాకు జతగా ట్రావిస్ హెడ్ (17) క్రీజ్లో ఉన్నాడు. అచొచ్చిన సిడ్నీ గ్రౌండ్లో ఖ్వాజా (ఈ గ్రౌండ్లో ఇదివరకే 3 సెంచరీలు బాదాడు) ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. సఫారీ బౌలర్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఖ్వాజా తన టెస్ట్ కెరీర్లో నాలుగోసారి 150 మార్కును క్రాస్ చేయగా.. స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ప్రస్తుత సిరీస్లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఆసీస్ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్.. తొలి టెస్ట్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో టెస్ట్లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్లో తలపడతాయి. -
రాణించిన లబూషేన్, ఖ్వాజా.. నిప్పులు చెరిగిన నోర్జే
3 టెస్ట్ల సిరీస్లో భాగంగా సిడ్ని వేదికగా పర్యాటక సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ తొలి రోజు ఆట సాదాసీదాగా సాగింది. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన ఈ రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ సేనను సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ 4 బంతికి వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను అద్భుతమైన బంతితో దొరకబుచ్చుకున్నాడు. 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో కేవలం 10 పరుగులు చేసిన వార్నర్.. మార్కో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన లబూషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా సాయంతో ఇన్నింగ్స్కు పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 135 పరుగులు జోడించిన అనంతరం.. నోర్జే వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తొలి రోజు ఆఖరి బంతికి నోర్జే బౌలింగ్లో వెర్రిన్కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఔటయ్యాడు. వెలుతురు లేమి కారణంగా లబూషేన్ ఔట్ అవ్వగానే అంపైర్లు మ్యాచ్ను ముగించారు. ఈ సమయానికి ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (0) క్రీజ్లో ఉన్నారు. తొలి రోజు ఆటలో ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కాగా, ఈ సిరీస్లోని తొలి రెండు టెస్ట్లలో ఆతిధ్య ఆసీస్ భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఐసీసీ ర్యాంకింగ్స్లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఆసీస్ ఆటగాళ్లు హవా కొనసాగింది. టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ ఆటగాళ్లు అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్లో లబూషేన్ (892), స్టీవ్ స్మిత్ (845) తొలి రెండు స్థానాలను పదిలం చేసుకోగా, పాక్తో సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (757) టెస్ట్ ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఖ్వాజా ఏకంగా 6 స్థానాలు ఎగబాకి 7వ ప్లేస్కు చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (754), విరాట్ కోహ్లి (742)లు తలో ర్యాంక్ కోల్పోయి 8, 10 స్థానాలకు పడిపోయారు. Major changes in the latest @MRFWorldwide ICC Men’s Player Rankings for Tests and ODIs 👀 More ➡️ https://t.co/MsmAFEH2gG pic.twitter.com/5Cr3GbWccp — ICC (@ICC) March 30, 2022 తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా వికెట్కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓ ర్యాంకును మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఈ జాబితా టాప్ 10లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్, టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్, సఫారీ స్పీడ్స్టర్ రబాడ, భారత పేసు గుర్రం బుమ్రా, పాక్ నయా సంచలనం షాహీన్ అఫ్రిది వరుసగా 1 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. టెస్ట్ ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఈ కేటగిరీలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (385), రవిచంద్రన్ అశ్విన్ (341)తొలి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. మరోవైపు ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ను కూడా విడుదల చేసింది. ఇందులో (బ్యాటింగ్ విభాగంలో) పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, కివీస్ ఆటగాడు రాస్ టేలర్ తొలి మూడు స్థానాలను నిలబెట్టుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానం ఎగబాకి ఫోర్త్ ప్లేస్కు చేరాడు. ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్స్టో, పాక్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్లు చెరో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 6, 10 స్థానాలకు ఎగబాకారు. బౌలింగ్లో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా ఏకంగా 6 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి, బంగ్లా వెటరన్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్కు ఎగబాకగా, న్యూజిలాండ్ స్టార్ పేసర్ బౌల్ట్, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్, ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2022: జోరుమీదున్న కేకేఆర్ను ఆర్సీబీ నిలువరించేనా..? -
పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్.. ఓటమి తప్పదా!
లాహోర్: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఉత్కంఠభరిత ముగింపునకు చేరింది. మూడో టెస్టులో 351 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పాక్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హఖ్ (42 బ్యాటింగ్), అబ్దుల్లా షఫీఖ్ (27 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. నేడు చివరి రోజు ఆ జట్టు చేతిలో 10 వికెట్లతో మరో 278 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్ను 3 వికెట్లకు 227 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖాజా (178 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు) సిరీస్లో రెండో సెంచరీ సాధించగా, డేవిడ్ వార్నర్ (51) అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్తో టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్ అందరికంటే వేగంగా (151 ఇన్నింగ్స్లు) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2022కు ఉగ్రదాడి ముప్పు..?! -
స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు!
పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా రికార్డుల హోరు సృష్టిస్తోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఫలితం రాకపోవడంతో మూడో టెస్టులోనైనా గెలవాలనే పట్టుదలతో ఆసీస్ ఆడుతోంది. అందుకు తగ్గట్టుగానే పాక్ తొలి ఇన్నింగ్స్లో బౌలర్లు విజృంభించగా.. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాటర్స్ పండగ చేసుకుంటున్నారు. లాహోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మరో సెంచరీతో మెరిశాడు. ఇప్పటికే కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 160 పరుగులతో రాణించిన ఖవాజా .. తాజాగా టెస్టు కెరీర్లో 12వ సెంచరీ సాధించాడు. నుమాన్ అలీ బౌలింగ్లో రెండు పరుగులు తీయడం ద్వారా ఖవాజా శతకం మార్కును అందుకున్నాడు. యాషెస్ సిరీస్ ద్వారా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఖవాజాకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఇక ఆస్ట్రేలియా సీనియర్ సీనియర్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వార్నర్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఫీట్ను సాధించాడు. కాగా 8వేల పరుగులు చేరడానికి స్మిత్ 85 టెస్టుల్లో 151 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. తద్వారా టెస్టుల్లో 8వేల పరుగుల మార్క్ను అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆటగాడిగా స్టీవ్స్మిత్ ప్రపంచరికార్డు సాధించాడు. ఇంతకముందు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 152 ఇన్నింగ్స్ల్లో ఎనిమిది వేల పరుగుల మార్క్ను చేరుకున్నాడు. 12 ఏళ్ల క్రితం టీమిండియాతో మ్యాచ్లో సంగా ఈ ఫీట్ను సాధించాడు. సంగక్కర తర్వాతి స్థానంలో భారత్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(154 ఇన్నింగ్స్లు), విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్(157 ఇన్నింగ్స్లు), టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్(158 ఇన్నింగ్స్లతో) వరుసగా ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 227 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఖవాజా 104 నాటౌట్, డేవిడ్ వార్నర్ 51 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్ పాకిస్తాన్ ముందు 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటికైతే పాకిస్తాన్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ , ఇమాముల్ హక్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆటకు మరోరోజు మిగిలి ఉండడంతో ఫలితం వచ్చే అవకాశముంది. చదవండి: PAK vs AUS: నిన్న కత్తులు దూశారు.. ఇవాళ చేతులు కలిపారు; శుభం కార్డు పడినట్లే! Manchester United: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎవరా ఆటగాడు? A new world record for Steve Smith! The fastest player ever to 8,000 Test runs #PAKvAUS pic.twitter.com/xmC7iSM7uN — cricket.com.au (@cricketcomau) March 24, 2022 -
Pak Vs Aus 2nd Test: బాబర్ ఆజమ్ సెంచరీ.. సూపర్ అంటూ అశ్విన్ ట్వీట్
Pak Vs Aus 2nd Test- కరాచీ: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పాకిస్తాన్ విజయలక్ష్యం 506 పరుగులు...రెండు రోజులు కలిపి కనీసం 172 ఓవర్ల ఆట మిగిలి ఉంది...తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు ఆటతీరును చూస్తే మంగళవారమే ఆసీస్ విజయం ఖాయమనిపించింది. కానీ పాక్ ఇంకా పోరాడుతోంది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (197 బంతుల్లో 102 బ్యాటింగ్; 12 ఫోర్లు) కీలక దశలో చక్కటి సెంచరీ సాధించగా, అబ్దుల్లా షఫీఖ్ (226 బంతుల్లో 71 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్కు అభేద్యంగా 171 పరుగులు జోడించారు. బుధవారం మ్యాచ్కు చివరి రోజు కాగా...పాక్ మిగిలిన 314 పరుగులు సాధించి లక్ష్యాన్ని అందుకుంటుందా లేక ఆసీస్ బౌలర్లు ప్రత్యర్థిని పడగొడతారా చూడాలి. గెలుపు సాధ్యం కాదనుకుంటే పాక్ చివరి 8 వికెట్లు కాపాడుకుంటూ ‘డ్రా’ కోసం ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 81/1తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా, మరో 16 పరుగుల తర్వాత మార్నస్ లబుషేన్ (44) అవుట్ కాగానే 2 వికెట్లకు 97 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖాజా (44 నాటౌట్) అజేయంగా నిలిచాడు. కాగా సెంచరీ అనంతరం కష్టాల్లో ఉన్న జట్టును ఉద్దేశించి మై హూనా(నేనున్నా కదా) అన్నట్లుగా బాబర్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక బాబర్ ఆజమ్ ఇన్నింగ్స్పై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. నువ్వు అందించబోయే రేపటి అద్భుత ఫినిషింగ్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ప్రశంసించడం విశేషం. The crowd cheers, the lion roars. @babarazam258 owns the day. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/ndM0RNWPTG — Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022 Babar Azam 👏👏, going to be an exciting finish tomorrow. #PAKvAUS — Ashwin 🇮🇳 (@ashwinravi99) March 15, 2022 -
Pak Vs Aus 2nd Test: ఆసీస్ బౌలర్ల ప్రతాపం.. కుప్పకూలిన పాకిస్తాన్..
Pak Vs Aus 2nd Test- కరాచీ: ఆస్ట్రేలియా బౌలర్ల ప్రతాపం ముందు సొంతగడ్డపై పాకిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయిన ఆ జట్టు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 53 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్కు ఏకంగా 408 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (36)దే అత్యధిక స్కోరు. చక్కటి రివర్స్ స్వింగ్తో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా, తొలి టెస్టు ఆడుతున్న లెగ్స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ 2 వికెట్లు తీశాడు. అసాధారణ ఆధిక్యం లభించినా సరే, ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా కెప్టెన్ కమిన్స్ మళ్లీ బ్యాటింగ్కే మొగ్గు చూపాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా సోమవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 81 పరుగులు చేసింది. వార్నర్ (7) పెవిలియన్ చేరగా...లబుషేన్ (37 బ్యాటింగ్), ఉస్మాన్ ఖాజా (35 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఓవరాల్గా ఆసీస్ 489 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 505/8తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 51 పరుగులు జోడించి 556/9 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ Stumps and the Golden Hour at NSK bid farewell to Day 3. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/5ubaJ0KK8e — Pakistan Cricket (@TheRealPCB) March 14, 2022 Fawad gets hold of it! Warner heads back. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/OoS8ql226n — Pakistan Cricket (@TheRealPCB) March 14, 2022 -
మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత
Usman Khawaja: కరాచీ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (127; 13 ఫోర్లు, సిక్స్) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఖ్వాజాకు తోడుగా స్టీవ్ స్మిత్ (72) అర్ధ సెంచరీతో రాణించగా, డేవిడ్ వార్నర్ (48 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. లబూషేన్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ దక్కించుకోగా, లబుషేన్ రనౌటయ్యాడు. తొలి టెస్ట్లో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ఖ్వాజా, ఈ మ్యాచ్లో పట్టుదలగా ఆడి కెరీర్లో పదో శతకాన్ని నమోదు చేశాడు. పాక్లోనే జన్మించిన 35 ఏళ్ల ఖ్వాజా.. తన మాతృదేశంపై సెంచరీ సాధించడంతో పాకిస్థాన్ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఇరు జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ నిర్జీవమైన పిచ్ కారణంగా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. జీవం లేని పిచ్ను తయారు చేసిందుకు గాను పాక్ క్రికెట్ బోర్డుపై ఇరు దేశాల మాజీ క్రికెటర్లు, అభిమానుల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాసిరకం పిచ్ను తయారు చేసి టెస్టు క్రికెట్కున్న గొప్పతనాన్ని నాశనం చేశారంటూ దుమ్మెత్తి పోశారు. ఈ పిచ్పై ఐసీసీ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్ అని.. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా నాసిరకమైన పిచ్ తయారు చేశారంటూ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే ఫైరయ్యాడు. చదవండి: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్' -
శతకం చేజార్చుకున్న ఉస్మాన్ ఖ్వాజా.. పాక్కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్
రావల్పిండి: పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక ఆస్ట్రేలియా ధీటుగా బదులిస్తుంది. పాక్ తొలి ఇన్నింగ్స్ను 476/4 వద్ద డిక్లేర్ చేయగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (159 బంతుల్లో 97; 15 ఫోర్లు) 3 పరుగుల తేడాతో శతకం చేజార్చుకోగా, మరో ఓపెనర్ వార్నర్ (114 బంతుల్లో 68; 12 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్ లబూషేన్ (117 బంతుల్లో 69; 9 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (55 బంతుల్లో 24; 3 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమాన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం కాసేపు అంతరాయం కలిగించింది. అంతకుముందు ఇమామ్ ఉల్ హక్ (157; 16 ఫోర్లు, 2 సిక్స్లు), అజహర్ అలీ (185; 15 ఫోర్లు, 3 సిక్స్లు)లు భారీ శతకాలతో చెలరేగడంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించింది. షఫీఖ్ (44), బాబార్ ఆజమ్ (36) ఓ మోస్తరుగా రాణించగా, మహ్మద్ రిజ్వాన్ (29), ఇఫ్తికార్ అహ్మద్ (13) నాటౌట్గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్, కమిన్స్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టగా, బాబర్ రనౌటయ్యాడు. ఇదిలా ఉంటే, 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయి. నిన్న పెషావర్లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పెషావర్కు మ్యాచ్ వేదిక అయిన రావల్పిండికి 187 కిమీ దూరం మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు. చదవండి: ఐపీఎల్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్లో సీఎస్కేను ఢీకొట్టనున్న కేకేఆర్ -
యాషెస్ సెలబ్రేషన్స్ సమయంలో ఆసీస్ కెప్టెన్ ఏం చేశాడో చూడండి..!
యాషెస్ సిరీస్ 2021-22లో ఇంగ్లండ్ను 4-0 తేడాతో మట్టికరిపించిన అనంతరం, ఆతిధ్య ఆస్ట్రేలియా చేసుకున్న గెలుపు సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే, ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. హోబర్ట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో ఆసీస్ 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం అనంతరం ఆసీస్ ఆటగాళ్లు షాంపేన్ బాటిల్లతో వేదికపై రచ్చ రచ్చ చేస్తుండగా, ఓ ఆసక్తికర సన్నివేశం అందరినీ కట్టి పడేసింది. Pat Cummins realizing that Khawaja had to stand away because of the alcohol so he tells his team to put it away and calls Khawaja back immediately. A very small but a very beautiful gesture❤️pic.twitter.com/KlRWLprbWM — Kanav Bali🏏 (@Concussion__Sub) January 16, 2022 ఇస్లాంను ఆచరించే ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా.. షాంపేన్తో జరుపుకునే వేడుకలకు దూరంగా వెళ్లడం గమనించిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్.. షాంపేన్ బాటిళ్లను వెనకాల పెట్టాల్సిందిగా సహచరులకు సూచించి, ఖ్వాజాను వేదికపైకి రావల్సిందిగా సైగ చేశాడు. కెప్టెన్ పిలుపుతో ఖ్వాజా వేదిక పైకెక్కి సెలబ్రేషన్స్లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. కమిన్స్ చేసిన పనికి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. కంగారూల కొత్త సారథి సిరీస్తో పాటు మనసులు కూడా గెలుచుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, చాలాకాలం తర్వాత ఆసీస్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఖ్వాజా.. నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించి ఘనంగా పునరాగమనాన్ని చాటాడు. చదవండి: ఐపీఎల్ వేలం నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ కెప్టెన్..! -
రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వరుస సెంచరీలు.. యాషెస్లో అన్స్టాపబుల్ ఖవాజా!
Ashes Series 2021 2022: ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుసగా రెండో సెంచరీ సాధించి సత్తా చాటాడు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఖవాజా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టుతో ఖవాజా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కరోనాతో మ్యాచ్కు దూరమైన ట్రవిస్ హెడ్ స్థానంలో టీమ్లోకి వచ్చాడు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్లో 137 పరుగులతో రాణించిన ఖవాజా.. నాలుగో రోజు ఆటలో భాగంగా 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. 138 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమైన వేళ అద్భుతంగా రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఖవాజా బ్యాటింగ్ మెరుపుల నేపథ్యంలో 416 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కంగారూ జట్టు... రెండో ఇన్నింగ్స్ను 265 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇప్పటికే వరుసగా మూడు పరాజయాలతో ట్రోఫీ చేజార్చుకున్న ఇంగ్లండ్ పరువు దక్కించుకునేందుకు పోరాడుతోంది. కాగా యాషెస్ సిరీస్లో ఖవాజా వరుస సెంచరీలను ఉటంకిస్తూ ‘అన్స్టాపబుల్’అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా అతడిపై ప్రశంసల జల్లు కురిపించింది. -
Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ... సెంచరీతో సత్తా చాటాడు.. భావోద్వేగం
Ashes Series 2021-22 Aus Vs Eng: సుమారు రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ముందుగా చెప్పినట్లుగానే సెంచరీ సాధించి సత్తా చాటాడు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రవిస్ హెడ్ నాలుగో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో హెడ్ ఐసోలేషన్కు వెళ్లగా అతడి స్థానంలో ఖవాజాకు తుది జట్టులో చోటు దక్కింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో జరుగుతున్న సిడ్నీ టెస్టుతో రీ ఎంట్రీ ఇచ్చిన అతడు 260 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో 137 పరుగులు సాధించాడు. స్టీవ్ స్మిత్(67 పరుగులు) తప్ప మిగతా బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమైన వేళ ఖవాజా తన విలువేంటో చాటుకున్నాడు. శతకం పూర్తి చేసుకోగానే భావోద్వేగానికి లోనైన ప్రేక్షకుల వైపు చూస్తూ తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. స్టాండ్స్లో ఉన్న అతడి భార్య రేచెల్ సైతం ఉద్వేగానికి లోనైంది. తమ కుమార్తెను ఎత్తుకుని తండ్రి వైపు చూపిస్తూ భర్త ఉద్వేగక్షణాలను తానూ ఆస్వాదించింది. ఇక ఆట విషయానికొస్తే ఖవాజా సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీతో 418 పరుగుల వద్ద ఎనిమిది వికెట్ల నష్టానికి ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆటలో భాగంగా ప్రస్తుతం ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగుతోంది. కాగా ఆసీస్ ఇప్పటికే 3-0 తేడాతో యాషెస్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. Khawaja brings up the ton with a flick through the leg side! And a little nod to LeBron with the celebration! #Ashes pic.twitter.com/7oisT1vAWj — cricket.com.au (@cricketcomau) January 6, 2022 -
Ashes 2021- 22: సిడ్నీ టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే: కెప్టెన్
Australia Playing XI For Sydney Test: ఏకపక్ష విజయాలతో ఇప్పటికే యాషెస్ సిరీస్ సొంతం చేసుకుని జోరు మీదున్న ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాలుగో మ్యాచ్కు తమ తుదిజట్టును ప్రకటించింది. మూడో టెస్టుతో అరంగేట్రం చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన స్కాట్ బోలాండ్ స్థానం నిలుపుకోగా.. ట్రవిస్ హెడ్ స్థానాన్ని ఉస్మాన్ ఖావాజాతో భర్తీ చేశారు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత ఖవాజా పునరాగమనం చేయనున్నాడు. ఈ విషయాల గురించి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ... గాయం కారణంగా జట్టుకు దూరమైన జోష్ హాజిల్వుడ్ ఇంకా కోలుకోలేదని పేర్కొన్నాడు.హోబర్ట్ టెస్టుకు అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అదే విధంగా స్కాటీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని... అతడిని జట్టులో కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. కాగా జనవరి 5 నుంచి ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు మొదలు కానుంది. సిరీస్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ట్రవిస్ హెడ్ కరోనా సోకిన కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడింట గెలిచి ఆతిథ్య ఆస్ట్రేలియా 3-0తో ట్రోఫీని కైవసం చేసుకుంది. యాషెస్ సిరీస్- నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు: మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ -
Ashes: ట్రవిస్ హెడ్ స్థానంలో తుది జట్టులోకి..! కచ్చితంగా సెంచరీ కొడతా..
అద్భుత ప్రదర్శనతో యాషెస్ ట్రోఫీ గెలిచి జోరు మీదుంది ఆస్ట్రేలియా. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే మూడింటిలో విజయం సాధించిన కంగారూలు.. మిగిలిన రెండు కూడా గెలిచి ఇంగ్లండ్ను వైట్వాష్ చేయాలని భావిస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఆసీస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యాషెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రవిస్ హెడ్కు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా ముగ్గురు ఆటగాళ్లు మిచెల్ మార్ష్, నిక్ మ్యాడిసన్, జోష్ ఇంగ్లిస్లను ఎంపిక చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే, ఆటగాళ్లందరికీ నెగటివ్గా తేలిన తర్వాతే జట్టు కూర్పుపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగో టెస్టుతో పునరాగమనం చేసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హెడ్ స్థానంలో తనకు తుది జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను అర్థం చేసుకోగలను. ఏదేమైనా హెడ్ గైర్హాజరీలో సిడ్నీ టెస్టు ఆడినట్లయితే.. కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాను. సెంచరీ చేస్తాననే అనుకుంటున్నా. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడతాను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, తనకు గనుక సిడ్నీ టెస్టు ఆడే అవకాశం వచ్చినా... అది కేవలం ఒక్క మ్యాచ్ వరకే పరిమితమవుతుందని తెలుసునన్నాడు. ఐదో టెస్టు నాటికి ట్రావిస్ హెడ్ కోలుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా 2019లో చివరి టెస్టు ఆడిన ఖవాజా.. తాజా యాషెస్కు ఎంపికైనప్పటికీ ఇంతవరకు ఆడే అవకాశం రాలేదు. ఇక జనవరి 5 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: IPL 2022 Auction: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని కోరుకుంటున్నారు... ఇప్పటికే రాయుడు, అశ్విన్... -
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు బిగ్షాక్.. డేవిడ్ వార్నర్కు గాయం
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియాకు మరో బిగ్షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండో టెస్ట్కు దూరమయ్యాడు. తొలి టెస్ట్లో 94 పరుగులు సాధించి జట్టు విజయంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. వార్నర్ స్ధానంలో ఉస్మాన్ ఖవాజా తుది జట్టులోకి రానున్నాడు. ఇక తొలి టెస్ట్లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. యాషెస్ సిరీస్ను ఘనంగా ఆరంభించింది. ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్16న ప్రారంభం కానుంది. అదే విధంగా ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజల్వుడ్ కూడా రెండో టెస్ట్కు గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు( అంచనా): పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ మార్కస్ హారిస్ అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, జో రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, -
అసలే కోపంలో ఉన్నాడు.. క్రీజులో హెల్మెట్ అడ్డుగా
Weatherald Scolded for Bizarre Helmet-Kicking Video: షఫీల్డ్ షీల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్ సమయంలో సౌత్ ఆస్ట్రేలియా ఆటగాడు వెదర్లాండ్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 8వ ఓవర్కు ముందు బ్రేక్ సమయంలో క్వీన్స్ల్యాండ్ ఫీల్డర్ మ్యాట్ రెన్షా.. క్రీజులో బ్యాటర్స్ గార్డ్ తీసుకునే చోట హెల్మెట్ పెట్టేసి వెళ్లాడు. ఓవర్ ప్రారంభం కావడంతో వెదర్లాండ్ స్ట్రైకింగ్కు వెళ్లాడు. కాగా అప్పటికే వెదర్లాండ్ ఏదో విషయంలో కోపంతో ఉన్నాడు. చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్ అయ్యి బతికిపోయావు.. లేదంటే అంతలో క్రీజులోకి చేరుకున్న వెదర్లాండ్స్.. అక్కడ హెల్మెట్ ఉండడం చూసి చిర్రెత్తిపోయినట్టున్నాడు. దీంతో హెల్మెట్ను ఫుట్బాల్లా భావించి పెనాల్టీ కిక్ ఇవ్వడంతో అది ఎగిరి దూరంగా పడిపోయింది. వెదర్లాండ్ చర్య అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన క్వీన్స్లాండ్ కెప్టెన్ ఉస్మాన్ ఖవాజా జేక్ వెదర్లాండ్స్ దగ్గరకు వచ్చి వాదనకు దిగాడు. ఒక హెల్మెట్ను అలా తన్నడం ఏంటని.. కాస్త హుందాగా ప్రవర్తించాలని కోరాడు. అయితే వెదర్లాండ్స్ ఖవాజాను ఏదో అనబోయి.. వెనక్కి తగ్గాడు. ఇదంతా చూసిన అంపైర్ వెదర్లాండ్స్ను పిలిచి ఇలా చేయడం కరెక్టు కాదని హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో Bizarre things on a cricket field: Matt Renshaw (QLD) carried the helmet from one end to other and kept it right on the batting crease on batters guard. Jake Weatherald (SA) with a penalty kick to that helmet. @beastieboy07 @cric_blog #SheffieldShield pic.twitter.com/fXNarJZUE8 — Nash (@NashvSant) November 25, 2021 -
పాక్ పర్యటన కాబట్టి రద్దు చేసుకున్నారు.. అదే భారత్తో అయితే అలా చేస్తారా..?
Usman Khawaja Reacts To New Zealand, England Pulling Out Of Pakistan Tour: భద్రతా కారణాలను బూచిగా చూపి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాక్ పర్యటనను రద్దు చేసుకోవడంపై ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖ్వాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. సరైన ఆధారాలు లేకుండా ఆ రెండు జట్టు అలా చేయడం నిరాశకు గురి చేసిందని అన్నాడు. పాకిస్థాన్ పర్యటన కాబట్టి అలా చేశారు.. అదే భారత్ పర్యటన అయితే అలా చేయగలరా..? భారత పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకునే ధైర్యం ఏ జట్టుకైనా ఉంటుందా.. అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్కు నో చెప్పే పరిస్థితి లేదని, అందుకు కారణం అక్కడున్న డబ్బే అంటూ భారత్పై తనకున్న వ్యతిరేక భావాన్ని వ్యక్తపరిచాడు. ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ పూర్తయ్యాక తమ జట్టు(ఆసీస్) షెడ్యూల్ ప్రకారం పాక్లో పర్యటిస్తుందని, అందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పాక్లో జన్మించిన ఈ ఆసీస్ క్రికెటర్ పేర్కొన్నాడు. పాక్లో సెక్యూరిటీపై ఆయన స్పందిస్తూ.. మిగతా దేశాల్లో ఎలాంటి భద్రత ఉంటుందో పాక్లో కూడా అలాగే ఉంటుందంటూ పాక్ను వెనకేసుకొచ్చాడు. కొన్ని దేశాల క్రికెటర్లకు పాక్తో వారి స్వదేశంలో క్రికెట్ ఆడటం ఇష్టముండదని, భారత్తో సత్సంబంధాల కారణంగానే వారు అలా ప్రవర్తిస్తుంటారని నిరాధారమైన ఆరోపణలు చేశాడు. కాగా, పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డే(సెప్టెంబర్ 17)కు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం తాము పాక్లో పర్యటించడం లేదంటూ వెల్లడించింది. ఈ రెండు జట్లు పాక్ టూర్ను రద్దు చేసుకోవడంతో పాక్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం పడింది. భవిష్యత్తులో విదేశీ జట్లు పాక్లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి: సన్రైజర్స్కు బిగ్ షాక్.. ఇంటి దారి పట్టిన స్టార్ ఆల్రౌండర్ -
ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు
అబుదాబి: పాకిస్తాన్ సూపర్లీగ్( పీఎస్ఎల్-6)లో భాగంగా గురువారం పెషావర్ జాల్మి, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో ఇస్లామాబాద్ యునైటెడ్ను విజయం వరించింది. ఇస్లామాబాద్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీకి తోడు ఆసిఫ్ అలీ 14 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. వీరికి తోడు కొలిన్ మున్రో 48, బ్రాండన్ కింగ్ 46 పరుగులతో రాణించడంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి ధీటుగానే బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో 6 వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసి 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. షోయబ్ మాలిక్ 68, కమ్రాన్ అక్మల్ 53 పరుగులతో రాణించారు. ఇక పీఎస్ఎల్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్ల్లోనూ 200కు పైగా పరుగులు నమోదవ్వడం 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. 2010లో కరాచీ డాల్ఫిన్స్, లాహోర్ ఈగల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 200కు పైగా స్కోర్లు నమోదు అయ్యాయి. ఈ విజయంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 14 పాయింట్లతో టాప్ స్థానానికి ఎగబాకగా.. పెషావర్ జాల్మి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో -
టైం లేదని గ్రౌండ్లోనే పని కానిచ్చాడు
కాన్బెర్రా: బిగ్బాష్ లీగ్(బీబీఎల్ 10)లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ సమయంలో ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖాజా చేసిన ఒక పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. సిడ్నీ ఇన్నింగ్స్ సమయంలో 9వ ఓవర్ తర్వాత కొన్ని నిమిషాల పాటు బ్రేక్ లభించింది. ఇదే సమయంలో ఖాజా తన అండర్గార్మెంట్లో గార్డ్ సమస్యగా మారడంతో డ్రెస్సింగ్ రూమ్కు కాల్ ఇచ్చాడు. అయితే వారు వచ్చేలోపే ఖాజా తన ప్యాంటును విప్పి తన అండర్గార్డ్ను తొలగించి దానిని సరిచేసే పనిలో పడ్డాడు. అంతలో సిబ్బంది అతని వద్దకు వచ్చి కొత్త గార్డ్ అందించడంతో దాన్ని వేసుకొని మళ్లీ యధావిథిగా ఆటను ప్రారంభించాడు. అయితే ఖాజా చర్యతో మైదానంలోని ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు అంపైర్లు, ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఖాజాకు సంబంధించిన వీడియోనూ సెవెన్ క్రికెట్ డాట్కామ్ తన ట్విటర్లో షేర్ చేసింది. క్రికెట్లో ఇలాంటి సీన్ మీరు ఎప్పుడు చూసి ఉండరు.. అందరూ చూస్తుండగానే ఖాజా గ్రౌండ్లోనే పని కానిచ్చేశాడు అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్గా మారి నవ్వులు పూయిస్తుంది. చదవండి: థ్యాంక్స్ మోదీ జీ.. టీమిండియా ఎమోషనల్ ట్వీట్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ థండర్స్పై 7 వికెట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్ బెర్తుకు మరింత దగ్గరైంది. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కటింగ్ 34, బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ 3 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సామ్ హీజ్లెట్ 74 నాటౌట్ టాప్ స్కోరర్గా నిలవగా.. జిమ్మీ పియర్సన్ 43 పరుగులతో రాణించాడు.చదవండి: కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది Have ... have you ever seen this before 😂 Usman Khawaja had to change everything - on the field! 🙈#BBL10 pic.twitter.com/XOKsXkhLVS — 7Cricket (@7Cricket) January 31, 2021 -
ఆ జోరు అంతర్జాతీయ క్రికెట్లో కనబడదే?
సిడ్నీ: ఇప్పటికే జట్టులో చోటు కోల్పోయి తన కెరీర్పై డైలమాలో పడ్డ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజాపై ఆ దేశ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో ఎప్పుడూ ఖవాజా నుంచి ఒక మంచి ప్రదర్శన చూడలేదన్నాడు. ఖవాజాలో నిలకడైన ప్రదర్శన లేకపోవడమే అతనిపై వేటుకు కారణమన్నాడు. ఇప్పటివరకూ ఖవాజా 44 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. వన్డేల్లో రెండు సెంచరీల సాయంతో 1,554 పరుగులు చేయగా, టెస్టుల్లో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2,887 పరుగులు చేశాడు. అయితే ఈ తరహా ప్రదర్శన సరిపోదు అంటున్నాడు రెండుసార్లు వరల్డ్కప్ గెలిచిన ఆసీస్ జట్టుకు కెప్టెన్గా రికీ పాంటింగ్. ఇక ఖవాజా మళ్లీ ఆసీస్ జట్టులో రీఎంట్రీపై పాంటింగ్ అనుమానం వ్యక్తం చేశాడు. (‘పీఎస్ఎల్లో కశ్మీర్ టీమ్ ఉండాలి’) ‘ ఖవాజాకు ఆసీస్ జట్టులో చోటు కష్టమే. నేను ఎప్పుడూ అతనొక మంచి ప్లేయర్ అని ఫీలవుతూ ఉండేవాడిని. కానీ నేను ఆశించిన స్థాయిలో అంతర్జాతీయ ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. ఏదో కొన్ని మెరుపులు తప్పితే నిలకడ మాత్రం ఖవాజాలో ఎక్కడా కనిపించలేదు. అతనిలో నిలకడ ఉంటే ఆసీస్ జట్టులో కొనసాగేవాడు. అది లేకపోవడం వల్లే జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్లో ఖవాజా చేసిన పరుగులతో పోలిస్తే, అంతర్జాతీయ క్రికెట్లో చాలా తక్కువ చేశాడు. దేశవాళీల్లో భారీ పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్లో తేలిపోతారు. మనం ఎప్పుడూ గొప్ప ఆటగాళ్లమని రాసి ఉండదు. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది. ఈ సీజన్ సమ్మర్ క్రికెట్ ఆరంభమైన తర్వాత తిరిగి ఖవాజాకు అవకాశం వస్తుంది. అక్కడ నిరూపించుకుని మళ్లీ అవకాశం కోసం వేచి చూడాలి. ఒకవేళ మళ్లీ ఆడే అవకాశం వస్తే అప్పుడైనా ఎవర్నీ నిరాశపరచడనే అనుకుంటున్నా’ అని పాంటింగ్ తెలిపాడు. గతేడాది యాషెస్ సిరీస్లో భాగంగా మధ్యలో జట్టులో చోటు కోల్పోయిన ఖవాజాకు మళ్లీ ఆడే అవకాశం రాలేదు. దాంతో ఇటీవల సీఏ విడుదల చేసిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో ఖవాజాకు చోటు దక్కలేదు. (ఈ బ్యాట్తో ఎక్కడ కొడతానో తెలుసా?) -
టాప్ ఆర్డర్ ఆటగాడికి నో చాన్స్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన ఆటగాళ్ల తాజా కాంట్రాక్ట్ జాబితాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖవాజాను కాంట్రాక్ట్ జాబితా నుంచి సీఏ తొలగించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన ఖవాజాకు కాంట్రాక్ట్ జాబితాలో చోటివ్వలేదు. గత జాబితాలో ఉన్న ఖవాజను కొత్త జాబితా నుంచి తప్పించడం ఆసక్తికరంగా మారింది. ఖవాజాతో పాటు పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ హారిస్, షాన్ మార్ష్, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టోయినిస్లను తప్పించింది.( అక్తర్పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) వీరిలో ఖవాజా, షాన్ మార్ష్ కాంట్రాక్ట్లను కొనసాగించకపోవడం చర్చనీయాంశమైంది. ఇక వారి స్థానాల్లో మార్కస్ లబూషేన్, ఆస్టన్ ఆగర్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్సన్, మాథ్యూ వేడ్లకు అవకాశం ఇచ్చింది. గతంలో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 12 అప్గ్రేడ్ పాయింట్లను(మూడు ఫార్మాట్లకు కలిపి) కేటాయించిన సీఏ.. తాజాగా దానిని 8 అప్గ్రేడ్ పాయింట్లకే పరిమితం చేసింది. ఒక్కో టెస్టు మ్యాచ్కు 5 పాయింట్లు, వన్డేకు రెండు పాయింట్లు, టీ20కి ఒక్కో పాయింట్ చొప్పున కేటాయించి ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది. ఈ మేరకు 20 మందితో కూడిన కొత్త జాబితాను ప్రకటించింది. (హిట్మ్యాన్కు స్పెషల్ డే..!) క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ జాబితా ఇదే.. ఆస్టన్ ఆగర్, జో బర్న్స్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, అరోన్ ఫించ్, జోష్ హజల్వుడ్, ట్రావిస్ హెడ్, లబూషేన్, నాథన్ లయాన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, టిమ్ పైన్, జేమ్స్ పాటిన్సన్, జహీ రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
‘కష్టమే అనుకున్నాం.. కానీ కళ్లు చెదిరే క్యాచ్’
సిడ్నీ : క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డర్ మైదానంలో చురుగ్గా కదిలి అందివచ్చిన క్యాచ్ను ఒడిసి పట్టుకుంటేనే ఫలితం ఆశాజనకంగా ఉంటుంది. అయితే, ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు బంతిని అంచనా వేయలేకపోవచ్చు. దాంతో అటు క్యాచ్, ఇటు మ్యాచ్ ప్రత్యర్థి వశం అయ్యే ప్రమాదం ఉంటుంది. లేదంటే పరుగులు సమర్పించుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్బాష్ లీగ్లో శనివారం అద్భుతమైన క్యాచ్ సన్నివేశమొకటి ఆవిష్కృతమైంది. సిడ్నీ థండర్, హోబర్ట్ హారికేన్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో.. హొబర్ట్ ఆటగాడు నాథన్ ఎల్లిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. సిడ్నీ థండర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా ఆట 12వ ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన భారీ షాట్ గాల్లోకి లేచి వేగంగా బౌండరీ లైన్ వైపు దూసుకొచ్చింది. బంతి క్యాచ్ పడుదామని నాథన్ ముందుకు కదిలాడు. కానీ, అతని అంచనా తప్పింది. బంతి తక్కువ ఎత్తులో అతని వైపు రాసాగింది. చాకచక్యంగా వ్యవహరించిన నాథన్.. మోకాళ్లపై కూర్చుని క్యాచ్ పట్టేందుకు యత్నించాడు. అయితే, అంచనాలు తలక్రిందులు చేస్తూ.. బంతి అతని పైనుంచి వెళ్లింది. వెంటనే అలర్టయిన నాథన్ మోకాళ్లపైనే కూర్చుని రెండు చేతులు పైకి చాచడం.. బంతి అతని చేతిలో పడటం చకచక జరిగిపోయాయి. దీంతో 35 పరుగులు చేసిన ఓపెనర్ ఖవాజా పెవిలియన్ చేరక తప్పలేదు. ఈ మ్యాచ్లో హోబర్ట్పై థండర్ విజయం సాధించింది. నాథన్ క్యాచ్ వీడియోపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. చేజారిందనుకున్న క్యాచ్ను నాథన్ చక్కగా ఒడిసిపట్టాడని నెటిజన్లు పేర్కొన్నారు. -
పొరబడి.. తేరుకుని చేతుల్లో బంధించాడు
-
టాస్ వేయమంటే.. బౌలింగ్ చేశావేంట్రా నాయన!
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా దేశవాళీలో భాగమైన మార్ష్ కప్ వన్డే టోర్నీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా-క్వీన్స్లాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరిగింది. ఈ పోరులో ఆస్ట్రన్ టర్నర్ నేతృత్వంలోని వెస్ట్రన్ ఆస్ట్రేలియా గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖవాజా సారథ్యంలో క్వీన్స్లాండ్ 49.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ కాగా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షాన్ మార్ష్(101; 132 బంతుల్లో 13 ఫోర్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేసే క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు అయిన ఉస్మాన్ ఖవాజా-టర్నర్లు మైదానంలోకి వచ్చారు. అయితే కాయిన్ను ఖవాజా అందుకుని టాస్ వేయడానికి సిద్ధమైన క్రమంలో నవ్వులు పూయించాడు. టాస్ను ఒక ఎండ్లో వేస్తే అది దాదాపు మరొక ఎండ్లో పడింది. టాస్ కాయిన్ అందుకున్న ఖవాజా.. టాస్ వేయమని మ్యాచ్ రిఫరీ ఓకే చెప్పగానే కాస్త ముందుకు దూకుతూ వెళ్లాడు. ఆ కాయిన్ను పైకి గట్టిగా విసరగా అది చాలా దూరంగా పడింది. దాదాపు 10 మీటర్ల దూరంగా వెళ్లింది. రిఫరీ నవ్వుకుంటూ కాయిన్ పడిన చోటకు వెళ్లి వెస్ట్రన్ ఆస్ట్రేలియా టాస్ గెలిచిందని చెప్పాడు.(ఇక్కడ చదవండి: ‘వార్న్.. నా రికార్డులు చూసి మాట్లాడు’) ఇక్కడ ఖవాజా ట్రిక్ను ప్రదర్శించినా టాస్ గెలవలేకపోయాడు. సాధారణంగా టాస్ వేస్తే కాయిన్ ఇంచుమించు కెప్టెన్లు నిలబడి ఉన్న చోటనే పడుతుంది. ఖవాజా టాస్ వేసిన తీరును వెస్ట్రన్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఖవాజాపై సెటైర్లు పేలుతున్నాయి. టాస్ వేయమంటే.. బౌలింగ్ చేసేవేంట్రా నాయన అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అది కాయిన్ అనే సంగతి మరచిపోయి ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయాలనుకున్నావా అని కామెంట్లు పెడుతున్నారు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోవడంతో ఆసీస్ జట్టులో ఖవాజా చోటు కోల్పోయాడు. ఆ క్రమంలోనే పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు ఖవాజాను ఎంపిక చేయలేదు. దాంతో దేశవాళీ మ్యాచ్లు ఆడుతూ ఫామ్లోకి రావడానికి యత్నిస్తున్నాడు. మార్ష్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఖవాజా 26 పరుగులే చేశాడు. -
‘వార్న్.. నా రికార్డులు చూసి మాట్లాడు’
బ్రిస్బేన్: తన రికార్డులను చూసి షేన్ వార్న్ మాట్లాడితే బాగుంటుందని ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఘాటుగా బదులిచ్చాడు. ‘ నీవు అప్పుడప్పుడు ఆడే ఏవో కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆసీస్ జట్టులో కొనసాగడానికి ఉపయోగపడవు. ముందుగా ఆసీస్ జట్టులో ఆడాలంటే ఎటువంటి ప్రదర్శన చేయాలో తెలుసుకో. ఖవాజాను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం భేష్’ అంటూ వార్న్ పేర్కొన్నాడు. దాంతో వార్న్-ఖవాజాల మధ్య వార్ మొదలైంది. ఆస్ట్రేలియా జట్టులో కొనసాగాలంటే తాను ఏమి చేయాలో తనకు తెలుసంటూ ఖవాజ్ మండిపడ్డాడు. అదే సమయంలో ఒకవేళ నీకు ఏమైనా అవసరం ఉంటే అలా చేయడానికి యత్నించు అంటూ చురకలంటించాడు. ‘నేను ఎప్పుడూ కూల్గా ఉంటాను. అసలు వార్న్ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పాల్పిన అవసరం నాకు లేదు. నేను బ్యాట్స్మన్. నాకు పరుగులు చేయడం మాత్రమే తెలుసు. అదే నాకు కరెన్సీతో సమానం. నా రికార్డులు చూసి మాట్లాడు. నా షీల్డ్ రికార్డు చూశావా. దేశవాళీ క్రికెట్లో నా వన్డే రికార్డు నీకు తెలుసా. ఆస్ట్రేలియా తరఫున నేను సాధించిన రికార్డు కూడా చూడు. అలాగే బీబీఎల్ రికార్డును కూడా పర్యవేక్షించుకో. నేను ఎక్కడ ఆడినా పరుగులే చేసే జట్టులో కొనసాగా. అంతేగానీ నువ్వు ఏదో సలహా చెబితే నా బాడీ లాంగ్వేజ్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా మార్పు కావాలంటే నువ్వు ట్రై చేయ్’ అంటూ వార్న్కు ఖవాజా కౌంటర్ ఇచ్చాడు.పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు ఖవాజాపై వేటు పడింది. ఎప్పట్నుంచో ఆసీస్ తరఫున టెస్టుల్లో ఓపెనర్గా కొనసాగుతున్న ఖావాజాను పాకిస్తాన్తో సిరీస్కు తప్పించారు. ఇటీవల కాలంలో ఖవాజా ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోవడంతో అతనిపై తప్పిస్తూ సీఏ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దాంతో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్ధించిన వార్న్.. ఖవాజాను కించపరిచేలా మాట్లాడాడు. ఆసీస్ జట్టులో కొనసాగాలంటే ఆడపా దడపా ప్రదర్శనలు సరిపోవంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. -
ఆసీస్కు మరో ఎదురుదెబ్బ
బర్మింగ్హామ్: వరల్డ్కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆసీస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా షాన్ మార్ష్ టోర్నీ నుంచి వైదొలగగా, తాజాగా అదే జాబితాలో ఉస్మాన్ ఖవాజా కూడా చేరిపోయాడు. తొడ కండరాల నొప్పితో సతమవుతున్న ఉస్మాన్ ఖవాజా వరల్డ్కప్ నుంచి నిష్క్రమించినట్లు ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్కప్ చివరి లీగ్ మ్యాచ్లో ఖవాజా తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అతను మిగిలి ఉన్న వరల్డ్కప్ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని లాంగర్ పేర్కొన్నాడు. ‘ ఖవాజాకు మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరం. దాంతో ఖవాజా వరల్డ్కప్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్కు ముందు ఇలా జరగడం బాధాకరం. మా జట్టులో అతను ప్రధాన ఆటగాడు. యాషెస్ సిరీస్ నాటికి ఖవాజా అందుబాటులోకి వస్తాడు’ అని లాంగర్ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఖవాజా ఐదు బంతులు ఆడిన తర్వాత రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరాడు. కాగా, ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఖవాజా బ్యాటింగ్కు వచ్చాడు. ఈ మ్యాచ్లో ఖవాజా 14 బంతులు ఆడి 18 పరుగులు చేశాడు. గాయపడ్డ ఖవాజా స్థానంలో మాథ్యూ వేడ్కు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెక్నికల్ కమిటీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. -
ప్రపంచకప్లో ఆసీస్ మరో విజయం
-
గాయపడ్డాడు.. అయినా ఇరగదీశాడు
సౌతాంప్టన్: మెగా టోర్నీ ప్రపంచకప్ అసలు సమరం ఇంకా మొదలే కాలేదు. ఈలోగానే పలు జట్లను గాయాల బెడద బాధిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్లు గాయాల బారిన పడగా, టీమిండియాలో ఆల్రౌండర్ విజయ్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆసీస్ కూడా చేరింది.ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖవాజా గాయపడ్డాడు. సోమవారం శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా అతడికి ఎడమ మోకాలికి బంతి తగిలింది. దీంతో వెంటనే ఆసీస్ వైద్యుడు వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో ఖవాజా మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రతపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు. అయితే అనంతరం అతడు బ్యాటింగ్ చేసి ఇరగదీశాడు. 105 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక నిర్దేశించిన 240 పరుగుల ఛేదనలో ఖవాజా 89 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఖవాజా గాయం తీవ్రత పెద్దది కాదని తెలుస్తోంది. ప్రస్తుతానికి బాగానే ఉన్నా అసలు పోరు వరకు గాయం ఏమైనా తిరుగబడుతుందో అని ఆసీస్ ఆందోళనలో ఉంది. -
ఖాజా సెంచరీ.. ఆసీస్ భారీ స్కోరు
రాంచీ: భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 314 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ బ్యాటింగ్ ఆరంభించింది. ఆసీస్ ఇన్నింగ్స్ను ఉస్మాన్ ఖాజా-అరోన్ ఫించ్లు ధాటిగా ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత ఫించ్(93; 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. అటు తర్వాత మ్యాక్స్వెల్-ఖాజాల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే ఖాజా(104; 113 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఖాజాకు తొలి వన్డే సెంచరీ. అయితే శతకం పూర్తి చేసుకున్న ఖాజా పెవిలియన్ చేరాడు. (అమర జవాన్లకు టీమిండియా ఘన నివాళి) ఇక్కడ 24 పరుగుల వ్యవధిలో ఆసీస్ నాలుగు వికెట్లను చేజార్చుకోవడంతో స్కోరులో వేగం తగ్గింది. ఖాజా ఔటైన స్వల్ప వ్యవధిలో మ్యాక్స్వెల్(47; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షాన్ మార్ష్(7), హ్యాండ్స్ కోంబ్(0)లు పెవిలియన్ చేరారు. ఇక చివర్లో స్టోయినిస్( 31 నాటౌట్), క్యారీ( 21 నాటౌట్)లు సమయోచితంగా ఆడటంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ షమీ వికెట్ తీశాడు. చెలరేగిన ఫించ్.. చాలా కాలం తర్వాత ఫించ్ చెలరేగి ఆడాడు. తొలుత కుదురుగా ఆడిన ఫించ్.. ఆపై విజృంభించాడు. క్రీజ్లో కుదురుకున్న తర్వాత ఫించ్ బౌండరీలే లక్ష్యంగా తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఈ క్రమంలోనే 51 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఇది ఫించ్కు 19వ వన్డే ఫిఫ్టీ. అయితే వైట్ బాల్ క్రికెట్ పరంగా చూస్తే గతేడాది జూలై తర్వాత ఫించ్కు ఇది తొలి హాఫ్ సెంచరీ. ఓవరాల్గా చూస్తే తొమ్మిది ఇన్నింగ్స్ల తర్వాత ఫించ్ మొదటి అర్థ శతకం సాధించాడు. ధావన్ వదిలేశాడు.. ఖాజా బాదేశాడు.. ఈ మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ పేలవంగా సాగింది. ప్రధానంగా ఓపెనర్ ఖాజా ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను ధావన్ జారవిడిచాడు. జడేజా వేసిన ఏడో ఓవర్ నాల్గో బంతికి ఖాజా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ బంతిని ఖాజా రివర్స్ స్వీప్ ఆడగా అది బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ధావన్ చేతుల్లో పడింది. అయితే ఆ సునాయాసమైన క్యాచ్ను ధావన్ వదిలేయడంతో ఖాజాకు లైఫ్ లభించింది. అంతకుముందు బుమ్రా వేసిన ఆరో ఓవర్లో చివరి బంతి ఎడ్జ్ తీసుకుని ఫోర్కు పోయింది. ఆ సమయంలో స్లిప్లో ఫీల్డర్లు ఎవరూ లేకపోవడం ఖాజాకు కలిసొచ్చింది. ఈ రెండింటిని సద్వినియోగం చేసుకున్న ఖాజా సెంచరీ సాధించి తన వికెట్ ఎంత విలువైందో శతకంతో నిరూపించాడు. ఇక్కడ చదవండి: ఆసీస్కు ఇది మూడోది -
వారి భాగస్వామ్యానికి జడేజా బ్రేక్
సిడ్నీ:టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ మూడో వికెట్ను కోల్పోయింది. ఆసీస్ స్కోరు 133 పరుగుల వద్ద ఉండగా ఉస్మాన్ ఖవాజా(59;81 బంతుల్లో 6 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్కు దిగిన దగ్గర్నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన ఖవాజాను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. జడేజా బౌలింగ్లో ఖవాజా వికెట్లు ముందు దొరికిపోయాడు. భారీ షాట్ ఆడే యత్నంలో ఖవాజా ఎల్బీగా ఔటయ్యాడు. దీనిపై ఖవాజా డీఆర్ఎస్కు వెళ్లినా అతనికి నిరాశ తప్పలేదు. దాంతో ఖవాజా-షాన్ మార్ష్ల 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అరోన్ ఫించ్(6) మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. భువనేశ్వర్ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో ఆసీస్ ఎనిమిది పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఆపై అలెక్స్ క్యారీ (24), ఖవాజాల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత క్యారీ రెండో వికెట్గా పెవిలియన్ చేరారు. కుల్దీప్ బౌలింగ్లో క్యారీ ఔటయ్యాడు. అటు తర్వాత షాన్ మార్ష్-ఖవాజాల జంట అత్యంత నిలకడగా బ్యాటింగ్ చేసింది. ఈ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఖవాజాను ఔట్ చేసిన జడేజా టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. -
మరోసారి అరెస్టైన క్రికెటర్ ఖవాజా సోదరుడు
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ హత్యకు నిజాముదీన్ అనే వ్యక్తి కుట్రపన్నాడని అసత్య ఆరోపణలు చేసిన ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సోదరుడు అర్సలాన్ ఖవాజా ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. ఒక యువతితో ప్రేమకు సంబంధించిన విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతోనే అర్సలాన్ ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో అర్సలాన్ కొన్ని రోజుల క్రితం బెయిలుపై విడుదలయ్యాడు. బయటికి వచ్చిన నాటినుంచి కేసును నీరుగార్చేందుకు... సాక్షిని ప్రభావితం చేస్తున్నాడనే అరోపణలతో గురువారం పోలీసులు అతడిని మరోసారి అదుపులోకి తీసుకున్నారు. కాగా శ్రీలంకకు చెందిన నిజాముదీన్ అనే వ్యక్తి మాజీ ప్రధానిని హత్య చేసేందుకు ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేశాడని పోలీసులను నమ్మించిన అర్సలాన్ అతడిని అరెస్టు చేయించాడు. అయితే విచారణలో భాగంగా నిజాముదీన్కు ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదని తేలడంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అంతేకాకుండా తప్పుడు ఆరోపణలతో ఓ అమాయకుడిని కేసులో ఇరికించాలని ప్రయత్నించిన అర్సలాన్ను అరెస్టు చేయడంతో పాటు.. నిజాముదీన్ కోర్టు ఖర్చులను కూడా పోలీసులే భరించడం విశేషం. ఇక ఉస్మాన్ ఖవాజా ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఆడుతున్న విషయం తెలిసిందే.