health insurance
-
ఆరోగ్య బీమా అంతంతే..
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య బీమా తీసుకునే విషయంలో భారతీయులు వెనకడుగు వేస్తున్నారు. ఆరోగ్య బీమా గురించి 83 శాతం మందికి అవగాహన ఉన్నా.. 23 శాతం మంది మాత్రమే హెల్త్ పాలసీలు తీసుకున్నారు. ఆరోగ్య బీమా లేని భారతీయుల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది అనూహ్యంగా ఎదురయ్యే జీవన, ఆరోగ్య సంక్షోభాల వాస్తవ ఖర్చులపై ముందుచూపు లేక ఇబ్బందులు పడుతున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ వంటివి లేనివారిలో 87 శాతం మంది ఆర్థికంగా పడబోయే భారాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. 13 శాతం మంది మాత్రమే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ అవసరాలను గుర్తిస్తున్నట్లు ‘హౌ ఇండియా బైస్ ఇన్సూరెన్స్ 2.0’పేరిట ‘పాలసీ బజార్ డాట్కామ్’సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు» భారతీయులు ఆరోగ్య సంరక్షణ వ్యయాలు,ఆకస్మిక ఖర్చులను భరించేందుకు సిద్ధంగా లేరు. » దేశ జనాభాలో ఆరోగ్య బీమా లేనివారే అధికం. పాలసీదారుల్లోనూ సుమారు 75 శాతం మంది రూ.10 లక్షల కంటే తక్కువ కవరేజీ ఉన్నవారే. 48 శాతం మంది రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ కవరేజీతో సరిపెట్టుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ఇక్కడ 66 శాతం పాలసీదారులు రూ 5 లక్షల అంతకంటే తక్కువ కవరేజీ కలిగి ఉన్నారు. » పాలసీదారుల్లో 51 శాతం మంది క్యాన్సర్, కిడ్నీ మారి్పడి, గుండె జబ్బుల చికిత్సల ఖర్చు రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటుందనిభావిస్తున్నారు. 47.6 శాతం భారతీయులకు టర్మ్ ఇన్సూరెన్స్ప్రయోజనాల గురించి తెలియదు. » ఇప్పటికీ బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా సంబంధిత పొదుపు పథకాలు, రియల్ ఎస్టేట్ వంటి సంప్రదాయ పెట్టుబడులు ఆధిపత్యం వహిస్తున్నాయి. » బీమా తీసుకోనివారిలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లేకపోవడం ఆందోళనకరంగా మారింది. » చాలామంది తమ కుటుంబ అవసరాలను అంచనా వేసేటప్పుడు పిల్లల విద్య, వివాహం, రుణ బాధ్యతలు, జీవిత భాగస్వామి పదవీ విరమణ, ఆకస్మిక వైద్య ఖర్చుల వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు.అవగాహన పెంచుతున్నాంఈ నివేదికఆధారంగా ప్రజల్లో ఆరోగ్య బీమాపైఅవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసర చికిత్సలతో ఆర్థిక సంక్షోభం ఎదురైనపుడు ఆస్తులను అమ్మటం, అప్పు చేయటానికి బదులు ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకోవటంమంచిది. అందరికీ ఆర్థిక భద్రత ఏర్పడేలా పాలసీలు, ఇతరత్రా సలహాల ద్వారా కష్టమర్లకు ప్రయోజనం కలిగేలా చూడాల్సిఉంది. – సర్బ్వీర్ సింగ్,జాయింట్ గ్రూప్ సీఈఓ, పీబీ ఫిన్టెక్. -
ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్
చెన్నై: కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా ఒక కొత్త బీమా ఉత్పత్తిని ఆవిష్కరించే ప్రణాళికతో ఉన్నట్టు ‘గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’ ఎండీ, సీఈవో జి.శ్రీనివాసన్ తెలిపారు. కస్టమర్ల భిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకురానున్నట్టు చెప్పారు. అదే మాదిరి ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ ఉద్యోగులకు ప్రత్యేక ప్లాన్లపైనా దృష్టి సారించినట్టు ప్రకటించారు. స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన గెలాక్సీకి ఫ్యామిలీ టీవీఎస్ వేణు శ్రీనివాసన్తోపాటు, హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వెటరన్, స్టార్ హెల్త్ వ్యవస్థాపకుడు వి.జగన్నాథన్ సహ ప్రమోటర్లుగా ఉన్నారు.‘ఏదైనా భిన్నంగా చేయాలన్న లక్ష్యంతో ఈ రెండు కుటుంబాలు కలసి గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ను ఏర్పాటు చేశాయి. కస్టమర్లకు కచ్చితంగా వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలతో ఉత్పత్తులను తీసుకొస్తాం’ అని జి.శ్రీనివాసన్ తెలిపారు. కస్టమర్ క్లెయిమ్ దరఖాస్తును వేగంగా పరిష్కరించడంతోపాటు పూర్తి మొత్తాన్ని చెల్లించే విధంగా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద కంపెనీగా అవతరిస్తామని ప్రకటించారు. ఆరంభంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ దృష్టి పెడతామని చెప్పారు. ఇదీ చదవండి: ఆకాశ ఎయిర్లో పెట్టుబడులకు అనుమతి రూ.200 కోట్ల ప్రీమియంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్టు శ్రీనివాసన్ తెలిపారు. ప్రస్తుతం 60 ప్రాంతాల్లో కంపెనీకి కార్యాలయాలు ఉంటే, వీటిని 100కు పెంచుకోనున్నట్టు చెప్పారు. 90 శాతం వ్యాపారం రిటైల్ కస్టమర్ల నుంచి, మిగిలిన 10 శాతం కార్పొరేట్ క్లయింట్ల నుంచి ఉంటుందన్నారు. రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమ ఉత్పత్తులు జబ్బున పడినప్పుడే ఆదుకునే విధంగా ఉండకుండా.. కస్టమర్లు ఆరోగ్యంగా జీవించేందుకు సాయపడతాయని చెప్పారు. తమ ఉత్పత్తుల్లో వెల్నెస్ (ఆరోగ్య సంరక్షణ) అంతర్భాగంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం చాలా కంపెనీల హెల్త్ ప్లాన్లలో లేని ఔట్ పేషెంట్ చికిత్సలపైనా తాము దృష్టి సారిస్తామని తెలిపారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే బీమా విస్తరణ మెరుగ్గా ఉందంటూ.. అదే సమయమంలో ఆరోగ్య బీమా కవరేజీ ఉన్న వారికి సైతం తగినంత రక్షణ లేకపోవడాన్ని గుర్తించినట్టు శ్రీనివాసన్ వెల్లడించారు. -
బీమాతో ధీమా.. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోండిలా
'ఆరోగ్యమే మహాభాగ్యం'.. ఈ మాటను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ కొంత పెద్దయిన తరువాత మహాభాగ్యం అంటే మిద్దెలు, మెడలు అనుకున్నాం. నిజానికి మనిషి ఆరోగ్యంగా లేకపోతే.. ఎంత సంపాదించినా అది వ్యర్థమే. కాలం మారిపోయింది.. ఎప్పుడు ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితిలో బతుకుతున్నాం.చరిత్ర చదువుకేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చదువుకున్నట్లు.. ఆరోగ్యం అంటే కరోనా ముందు, కరోనా తరువాత అన్నట్లు అయిపోయింది. కోవిడ్ మహమ్మారి ప్రజల జీవితాలను అంతలా తలకిందులు చేసింది. చేతిలో డబ్బులు లేక.. ఆసుపత్రులలో ఖర్చులు పెట్టుకోలేక పడ్డ ఇబ్బందులు కోకొల్లలు. ఆ తరువాత చాలామంది కళ్ళు తెరిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు. అవసరానికి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయం బహుశా అందరికీ తెలిసి ఉన్నప్పటికీ.. 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' సందర్భంగా హెల్త్ ఇన్సూరెన్స్ను ఎలా ఎంచుకోవాలనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం..హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. ఆరోగ్య స్థితిని బట్టి మాత్రమే కాకుండా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎలాంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవానుకుంటున్నావు అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో నివసిస్తున్న అనేక మధ్యతరగతి కుటుంబాలకు..హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 5 లక్షలు సరిపోదని స్పష్టమైపోయింది. చాలా మంది ఆర్థిక సలహాదారులు, ఆరోగ్య బీమా నిపుణులు సైతే కనీసం రూ. 10 లక్షల కవరేజ్ సిఫార్సు చేస్తున్నారు.నాణ్యమైన ఆరోగ్య సేవల కోసంతగినంత పెద్ద కవరేజ్ ఉండటం వల్ల.. మీరు మీకు నచ్చిన ఆసుపత్రులు చికిత్స తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందటానికి ఉత్తమమైన మార్గం వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ. వయసులో ఉన్నప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు తక్కువే అయినప్పటికీ.. వయసు మీదపడే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.35 ఏళ్ల వ్యక్తి కనీసం రూ. 10 లక్షల కవర్తో ఇన్సూరెన్స్ ప్రారంభించడం ఉత్తమం. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అవసరం అయినప్పుడు లేదా తరచూ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళకు ఇంకా పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. కాబట్టి వ్యక్తి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. పాలసీ ఎంచుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: బంగారం కొనడానికి ఇదే మంచి సమయం.. మరింత తగ్గిన రేటుమెట్రో నగరాల్లో నివసించేవారికిచిన్న పట్టణాలలో నివసిస్తున్న వారితో పోలిస్తే.. మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారికి పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. ముంబై వంటి మహానగరాల్లో, ఇండోర్ వంటి టైర్-II నగర్లో నివసిస్తున్న వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాలంటే.. కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు కవరేజ్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మీ నగరంలోని ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.కుటుంబంలో ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల వరకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే.. కనీసం రూ. 20 లక్షల కవర్తో ప్రారంభించడం ఉత్తమం. ఆర్థిక స్థోమత అడ్డంకి కాకుండా ఉండాలంటే.. ఆరోగ్య సమస్యలను నుంచి బయట పడాలంటే.. బీమా తీసుకోవాల్సిందే. -
ఆయుష్మాన్ భారత్ పథకంలో అవకతవకలు.. ఈడీ దాడులు
ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (pmjay) పథకంలో అవకతవకులు జరిగాయి. కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడీ ఏక కాలంలో దాడులకు దిగింది. 2023లో పార్లమెంటులో కాగ్ నివేదికను ప్రవేశ పెట్టింది. జార్ఖండ్లో ఆయుష్మాన్ పథకం పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగిందనేది ఆ నివేదిక సారాశం. రోగులను చేర్చుకోకుండా, బీమా మొత్తాన్ని మోసపూరితంగా క్లయిమ్ చేస్తున్నారని అందులో పేర్కొంది. కాగ్ తన రిపోర్ట్లో దేశంలోని 212 ఆస్పత్రులలో పీఎంజేఏవైలో ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. చికిత్స అందించకుండాఈ నేపథ్యంలో శుక్రవారం ఆయుష్మాన్ భారత్ పథకం కింద మోసపూరిత కార్యకలాపాలు, ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించి జార్ఖండ్లోని రాంచీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పీఎంజేఏవైలోని నెట్ వర్క్ ఆస్పత్రులలో ఎటువంటి వైద్య చికిత్స లేకుండా, ఏ రోగిని చేర్చకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ దాడులకు దిగింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పీఎంజేఏవై పథకం కిందపీఎంజేఏవై పథకం కింద కేంద్రం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తుంది. ఈ పథకంలో రూ.5లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ప్రస్తుతం దాదాపు 12.3 కోట్ల కుటుంబాలకు అందుబాటులో ఉంది. తాజాగా కేంద్రం ఈ పథకాన్ని 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వర్తించేలా మార్పులకు శ్రీకారం చుట్టింది. -
కొత్త ఏడాది.. తెలివైన పెట్టుబడి
వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరుగుతున్న ఈ కాలంలో వాటి కోసం కేవలం సొంత డబ్బుపైనే ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. ఊహించని అత్యవసర వైద్య పరిస్థితులు పొదుపు సొమ్మును హరించేస్తాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పెరుగుతున్న వైద్య ఖర్చుల నుండి ఒక ముఖ్యమైన రక్షణ కవచంగా నిలుస్తుంది. ఆర్థిక ఒత్తిడి లేకుండా నాణ్యమైన వైద్య సంరక్షణను అందిస్తుంది. గుర్తుంచుకోండి.. మీరు ఆరోగ్యంపై పెట్టుబడి పెడుతున్నారంటే.. మీతోపాటు కుటుంబ భవిష్యత్తు కోసం కూడా పెట్టుబడి పెడుతున్నారని అర్థం.సంపూర్ణ కవరేజీ ఆధునిక ఆరోగ్య బీమా ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే కాదు.. ఓపీడీ సంప్రదింపులు, టెలిమెడిసిన్, ప్రివెంటివ్ చెకప్లు, వెల్నెస్ కార్యక్రమాలను కూడా కవర్ చేస్తుంది. చాలా పాలసీలు ఇప్పుడు ప్రసూతి సంరక్షణ, మానసిక ఆరోగ్యం, రీహాబిలిటేషన్ థెరపీ వంటి సేవలతో సంపూర్ణ కవరేజీ అందిస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక రక్షణ చాలా కీలకం. వ్యాధి-నిర్దిష్ట విధానాలు, క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు దీర్ఘకాలిక భద్రతను నిర్ధారిస్తాయి.పన్ను ప్రయోజనాలూ..ఇటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద గణనీయమైన పన్ను ప్రయోజనాలను అందించడంతో పాటు అటు అవసరమైన ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించే రెండు వైపులా పదునుండే కత్తిలా హెల్త్ ఇన్సూరెన్స్ పనికొస్తుంది. ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇది ఆర్థికంగా తెలివైన పెట్టుబడిగా మారుతుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు తమ ఆరోగ్య బీమా ప్రీమియంపై సంవత్సరానికి రూ .25,000 వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ల సిటిజన్ల విషయానికి వస్తే.. వారికి వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ పరిమితి రూ .50,000 వరకు ఉంటుంది.ఎస్బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్లో విభిన్న ప్లాన్లుఎస్బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభిన్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరసమైన, సౌకర్యవంతమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ పాలసీలు హాస్పిటలైజేషన్, ఓపీడీ కన్సల్టేషన్లు, ప్రసూతి ప్రయోజనాలు, క్రిటికల్ ఇల్నెస్తో సహా విస్తృతమైన కవరేజీతో పాలసీదారులరకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తాయి.మనం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ఆరోగ్య బీమా పాలసీలో పెట్టుబడి పెట్టడం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వానికి ఒక ముఖ్యమైన దశ. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఖర్చు మాత్రమే కాదు, ఇది మీ ఆర్థిక, శారీరక శ్రేయస్సు కోసం తెలివైన పెట్టుబడి. -
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కు రూ.104.77 కోట్ల డిమాండ్ నోటీసులు
రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఆర్ఈఎల్) అనుబంధ సంస్థ అయిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కు ఆదాయపు పన్ను శాఖ రూ.104.77 కోట్ల డిమాండ్ నోటీసులు పంపించింది. 2020-21, 2021-22 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నట్లు సోమవారం సంస్థ తెలిపింది. ముంబైలోని సెంట్రల్ సర్కిల్ 6(2)లోని ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ నోటీసు పంపినట్లు ఆర్ఈఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.ట్యాక్స్ కన్సల్టెంట్ల సలహా మేరకు కేర్ హెల్త్ నిర్ణీత గడువులోగా ఈ ఉత్తర్వులపై ఫోరమ్ ముందు అప్పీల్ దాఖలు చేస్తుందని ఆర్ఈఎల్ స్పష్టం చేసింది. ఈ డిమాండ్ నోటీసులకు దారితీసిన కచ్చితమైన లెక్కలు లేదా వివాదాల వెనుక ఉన్న వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఆర్డర్ను అంతిమంగా అంగీకరించే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. నిర్ణీత గడువులోగా ఈ నోటీసుపై అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ ప్రకటించడంతో ఇది నిర్ధారణ అవుతుంది.ఇదీ చదవండి: ‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’హెల్త్ ఇన్సూరెన్స్ డొమైన్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రముఖంగా సేవలందిస్తోంది. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్కు ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పన్ను డిమాండ్ను సవాలు చేస్తూ తీసుకున్న నిర్ణయం దాని ఆర్థిక, చట్టపరమైన విధానాలపై విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ నోటీసుపై కంపెనీ ప్రతిస్పందనను పరిశ్రమ వాటాదారులు, రెగ్యులేటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
హెచ్సీఎల్ గ్రూప్తో ప్రుడెన్షియల్ జత
న్యూఢిల్లీ: దేశీయంగా ఆరోగ్య బీమా బిజినెస్ నిర్వహణకు వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్(ఢిల్లీ)తో యూకే సంస్థ ప్రుడెన్షియల్ పీఎల్సీ తాజాగా చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ గ్రూప్ ప్రమోటర్ సంస్థ వామ సుందరితో భాగస్వామ్య కంపెనీ(జేవీ) ఏర్పాటుకు తెరతీసింది. తద్వారా దేశీయంగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ నిర్వహణను చేపట్టనుంది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి జేవీలో యూకే అనుబంధ సంస్థ ప్రుడెన్షియల్ గ్రూప్ హోల్డింగ్స్ 70 శాతం వాటా పొందనుండగా.. మిగిలిన 30 శాతం వాటాను వామ తీసుకోనుంది.దేశీయంగా పెరుగుతున్న ఆరోగ్య బీమా అవసరాలకు అనుగుణంగా జేవీ సేవలు అందించనున్నట్లు ప్రుడెన్షియల్ పీఎల్సీ సీఈవో అనిల్ వాధ్వానీ పేర్కొన్నారు. వెరసి 2047కల్లా అందరికీ ఆరోగ్య బీమా ప్రభుత్వ విజన్కు మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. ప్రుడెన్షియల్ పీఎల్సీతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య బీమాను మరింత విస్తరించడంతోపాటు.. నాణ్యమైన సేవలు అందించనున్నట్లు వామ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శిఖర్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఈ మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని ఆదేశాలుబ్యాక్గ్రౌండ్ ఇదీదేశీయంగా జీవిత బీమా వెంచర్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ 2016లో లిస్టయ్యింది. తద్వారా తొలిసారి ఇన్సూరెన్స్ రంగ కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. ఈ బాటలో పాక్షిక వాటా విక్రయం ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని సైతం లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు గత నెలలో ప్రుడెన్షియల్ ప్రకటించింది. ఇక 1976లో ఏర్పాటైన హెచ్సీఎల్ గ్రూప్ ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీగా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ, హెల్త్కేర్, టాలెంట్ మేనేజ్మెంట్ సొల్యూషన్లు సైతం గ్రూప్ అందిస్తోంది. -
ఇన్సూరెన్స్ ప్రీమియంలపై త్వరలో భారీ నిర్ణయం!
దేశంలోని లక్షలాది మంది బీమా పాలసీదారులకు ఉపశమనం కలగనుంది. ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ GST) త్వరలో తగ్గే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తన సిఫారసులను సమర్పించడంతో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయానికి మార్గం సుగమమైంది.ప్రస్తుతం హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18% జీఎస్టీ విధిస్తున్నారు. ఇన్సూరెన్స్ అన్నది అత్యవసర సేవగా మారిన నేపథ్యంలో చాలా మంది వినియోగదారులకు జీఎస్టీ భారంగా మారింది. ప్రతిపాదిత తగ్గింపు బీమాను మరింత చౌకగా మార్చి తద్వారా ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే బీమా కవరేజీ తక్కువగా ఉన్న భారతదేశంలో బీమా వ్యాప్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.త్వరలోనే నిర్ణయంబీమాపై మంత్రుల బృందం (జీవోఎం) ఏప్రిల్ లో సమావేశమై తమ సిఫార్సులను ఖరారు చేయనుంది. తరువాత వాటిని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం కోసం సమర్పించనుంది. బహుశా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో జరగనున్న తన తదుపరి సమావేశంలో కౌన్సిల్ ఈ విషయాన్ని చర్చించే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి రాష్ట్రాల నుండి విస్తృత మద్దతు లభించింది. బీమా రంగంలో జీఎస్టీ ఉపశమనం ఆవశ్యకతపై రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.జీఎస్టీ తగ్గింపు వల్ల బీమా ప్రీమియంల మొత్తం తగ్గి తద్వారా నేరుగా పాలసీదారులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ చర్య మరింత మందిని ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. వారికి ఆర్థిక భద్రతను, నిశ్చింతను అందిస్తుంది.సవాళ్లూ ఉన్నాయి..ఈ ప్రతిపాదనకు సవాళ్లు లేకపోలేదు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ (ఐటీసీ) క్లెయిమ్ చేసుకునే సామర్థ్యంపై జీఎస్టీ మినహాయింపుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని బీమా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఖర్చులు అంతిమంగా వినియోగదారుల మీదే పడతాయి. దీంతో పన్ను తగ్గింపు ఉద్దేశిత ప్రయోజనాలు దెబ్బతినవచ్చు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, సగటు భారతీయుడికి బీమాను మరింత అందుబాటులో, చౌకగా చేసే దిశగా ఈ చొరవ ఒక సానుకూల అడుగును సూచిస్తుంది. -
ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ
ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆరోగ్య బీమాలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్ఐసీ సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. రానున్న రెండు వారాల్లోగా డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. చర్చలు తుది దశకు చేరడంతో మార్చి 31కల్లా వివరాలు వెల్లడికానున్నట్లు తెలియజేశారు. ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ ప్రవేశించడం సాధారణ అంశమేనని ఇక్కడ జరిగిన జీసీఏ25 వేడుక సందర్భంగా పేర్కొన్నారు. అయితే లక్షిత కంపెనీలో నియంత్రిత లేదా 51 శాతం లేదా అంతకుమించిన వాటా కొనుగోలు చేయబోమన్నారు.ఎంత వాటా సొంతం చేసుకునేదీ టార్గెట్ కంపెనీ విలువ, ఎల్ఐసీ బోర్డు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలను ఆసుపత్రి ఖర్చులు, ఇతర వ్యయాలను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఆఫర్ చేసేందుకు అనుమతించని కారణంగా ఎల్ఐసీ వాటా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్స్ను జారీ చేయాలన్న ప్రతిపాదనలున్నప్పటికీ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ ఈ అంశంపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాని సంగతి తెలిసిందే. మణిపాల్సిగ్నా కొనుగోలు?హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మణిపాల్సిగ్నాలో వాటా కొనుగోలుకి ఎల్ఐసీ చర్చలు నిర్వహిస్తున్నట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. రూ. 4,000 కోట్ల విలువలో డీల్ కుదుర్చుకోనున్నట్లు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ స్టాండెలోన్ ఆరోగ్య బీమా కంపెనీలో ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలుకి చర్చలు చేపట్టినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అయితే ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇందుకు బోర్డు నిర్ణయాలుసహా వివిధ అంశాలు ప్రభావం చూపనున్నట్లు తెలిపింది. 100 ఏళ్ల ప్రభుత్వ బాండ్లు కావాలి..దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల(జీసెక్లు) జారీకి అనుమతించమంటూ జీవిత బీమా పీఎస్యూ ఎల్ఐసీ ఆర్బీఐని కోరింది. 100 ఏళ్ల కాలపరిమితిగల బాండ్ల జారీకి విజ్ఞప్తి చేసింది. తద్వారా దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడి అవకాశాలకు వీలుంటుందని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. 20–30 ఏళ్ల బాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్బీఐ 40 ఏళ్ల కాలపరిమితికీ అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో 50 ఏళ్లు, 100 ఏళ్ల బాండ్లనూ అంచనా వేస్తున్నట్లు చెప్పారు.ఈ అంశంపై ఆర్బీఐతో ఎప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ మార్కెట్లలో పలు దేశాలు 100 ఏళ్ల గడువుతో బాండ్ల జారీని చేపడుతున్నట్లు ప్రస్తావించారు. సెకండరీ మార్కెట్లో పరిమిత డిమాండ్, తక్కువ లిక్విడిటీ కారణంగా భారత్సైతం ఈ తరహా బాండ్లకు తెరతీయవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జీసెక్లలో ఎల్ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’ కామత్ సూచన
పర్సనల్ ఫైనాన్స్(Personal Finance) ప్రణాళికలు మెరుగ్గా ఉంటే భవిష్యత్తులో ఆర్థిక స్వతంత్రం సాధించవచ్చని అనుకుంటారు. దాన్ని సాధించేందుకు చాలామంది స్టాక్మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలవైపు మొగ్గు చూపుతారు. కానీ జెరోధా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు నితిన్ కామత్(Nitin Kamat) మాత్రం పర్సనల్ ఫైనాన్స్ కంటే ముఖ్యమైన అంశాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల కామత్ తన బ్లాగ్లో స్పందిస్తూ పర్సనల్ ఫైనాన్స్ కంటే ప్రతిఒక ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలియజేశారు.‘మీరు చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే అవకాశం ఉంటుంది. అందుకోసం చాలామంది స్టాక్ మార్కెట్లు, ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ కుటుంబంలో మీపై ఆదారపడినవారు ఉంటే ముందుగా మీరు పెట్టుబడుల కంటే జీవిత బీమాకే తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే మీ గొప్ప పెట్టుబడి ఆలోచనవుతుంది. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం మీ ప్రాథమిక బాధ్యత. అది చాలా అవసరం కూడా’ అని కామత్ రాశారు.ఇదీ చదవండి: ఒకే వాహనం.. 14 కెమెరాలు, 9 రాడార్లు, 6 సెన్సార్లు‘మారుతున్న జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల దృష్ట్యా మనుషుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతూ, ఆయుర్దాయం తగ్గుతోంది. ఊహించని వైద్య ఖర్చులను నిర్వహించేలా తగినంత ఆరోగ్య బీమాను ఎంచుకోండి. మీపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మంచి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా కవరేజీని క్రమానుగతంగా పునఃసమీక్షించాలి. ఈ చర్యలు మీ కుటుంబానికి ఆర్థిక కష్టాల నుంచి కాపాడటమే కాకుండా మనశాంతిని అందిస్తాయి. ఫలితంగా పెట్టుబడిదారులు ఆత్మవిశ్వాసంతో తమ ఆర్థిక లక్ష్యాలను కొనసాగించడానికి ఈ విధానాలు వీలు కల్పిస్తాయి’ అని తెలిపారు.దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులుమార్కెట్ కరెక్షన్ల సమయంలో క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)లను ఆపవద్దని కామత్ ఇన్వెస్టర్లకు సూచించారు. ‘మార్కెట్ క్షీణత భయపెట్టవచ్చు, కానీ అవి దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలను అందిస్తాయి’ అని తెలిపారు. క్రమశిక్షణతో ఉండటం, సిప్ కంట్రిబ్యూషన్లను నిర్వహించడం ద్వారా పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. పెట్టుబడి పెట్టడానికి కంటే ముందుకు ప్రతిఒక్కరు విధిగా జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకోవాలని కామత్ కోరారు. -
ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?
ఆరోగ్య అత్యవసర స్థితి చెప్పి రాదు. ఆహారం, నిద్ర వేళల్లో మార్పులు.. గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల ప్రభావంతో జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరిగింది. వీటి కారణంగా ఆస్పత్రి పాలైతే బిల్లులు చెల్లించడం మెజారిటీ వ్యక్తులకు అసాధ్యమే కాదు, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి. ఇలాంటి అనిశ్చితులకు రక్షణ కవచమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కరోనా తర్వాత వీటి ప్రీమియంలు దాదాపుగా రెట్టింపయ్యాయి. మోయలేనంత భారంగా మారాయి. ఇది చూసి ఇప్పటికీ హెల్త్ ప్లాన్కు దూరంగా ఉన్నవారు ఎందరో. కానీ, ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ ఇది తప్పనిసరి. కావాలంటే ప్రీమియం తగ్గించుకునే మార్గాన్ని వెతకండి. అంతేకానీ, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా రక్షణ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్కు దూరంగా ఉండొద్దనేది నిపుణుల మాట! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం ప్రకారం.. దేశంలో 35 శాతం మంది హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నారు. 10 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మరోవైపు వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సా విధానాలు.. మరింత కచ్చితత్వంతో, మెరుగైన ఫలితాలనిచ్చే రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యయాలను అందరూ భరించలేరు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. హెల్త్ ఇన్సూరెన్స్ను వీలైనంత చిన్న వయసులోనే తీసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఖరారవుతుంది. వయసు, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను బీమా సంస్థ పాలసీ జారీకి ముందు మదింపు చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో.. 25 ఏళ్ల వయసు వ్యక్తికి, 40 ఏళ్ల వయసు వ్యక్తికి ప్రీమియంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చిన్న వయసులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, ఆ తర్వాతి కాలంలో ప్రీమియం పెరగదా? అన్న సందేహం రావచ్చు. 35 ఏళ్లు నిండిన తర్వాత, 45 ఏళ్లు, 55 ఏళ్లు, 60 ఏళ్లు నిండిన తర్వాత వయసువారీ ప్రీమియం రేట్లు కచ్చితంగా సవరణకు నోచుకుంటాయి. కానీ, 35–40 ఏళ్ల తర్వాత కొత్తగా పాలసీ తీసుకునే వారితో పోల్చితే, 25 ఏళ్లలోపు వారికి ప్రీమియం తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే, మూడేళ్లలో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్లు దాటేస్తారు. ముందస్తు వ్యాధులకు సైతం కవరేజీ అర్హత లభిస్తుంది. పైగా పాలసీ తీసుకుని 60 నెలలు (ఐదేళ్ల ప్రీమియం చెల్లింపులు) ముగిస్తే, ఆరోగ్య చరిత్రను సరిగ్గా వెల్లడించలేదనో, సమాచారం దాచిపెట్టారనే కారణంతో క్లెయిమ్ను బీమా సంస్థ తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలతోపాటు ప్రీమియం భారం తగ్గుతుంది. బోనస్, రీస్టోరేషన్ కేవలం రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్నే తీసుకున్నప్పటికీ అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కవరేజీని పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బీమా కంపెనీలు నో క్లెయిమ్ బోనస్, రీస్టోరేషన్ ఫీచర్లను అందిస్తున్నాయి. ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే 50–200 శాతం మేర సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా సంస్థలు ఇస్తుంటాయి. అప్పుడు రూ.5 లక్షల కవరేజీ రూ.10–15 లక్షలకు చేరుతుంది. రీస్టోరేషన్ సదుపాయం అన్నది.. హాస్పిటల్లో చేరినప్పుడు కవరేజీ పూర్తిగా అయిపోతే అంతే మొత్తాన్ని తిరిగి ఆ పాలసీ సంవత్సరానికి పునరుద్ధరించడం. కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో ఒక్క రీస్టోరేషన్నే ఇస్తుంటే, కేర్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు కొన్ని ప్లాన్లలో అపరిమిత రీస్టోరేషన్ సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బేస్ సమ్ అష్యూర్డ్ తక్కువగా ఎంపిక చేసుకున్నప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా ప్రీమియం భారం తగ్గుతుంది. చిన్న క్లెయిమ్లకు దూరం ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతేనే నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. కనుక చిన్న క్లెయిమ్లకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్కు ఎలాంటి క్లెయిమ్ లేకపోతే ఏటా 50 నుంచి 100 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. ఒకవేళ క్లెయిమ్ చేస్తే ఎంత అయితే పెరిగిందో, అంతే మేర తగ్గిపోతుంది. కనుక చిన్న క్లెయిమ్ కోసం రూ.2.5–5 లక్షల సమ్ అష్యూర్డ్ను ఒక ఏడాదిలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రూ.50 వేల లోపు చిన్న వ్యయాలను సొంతంగా భరించడమే మంచిది. మంచి ఆహారం, జీవనశైలి.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అన్న భరోసాతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తామా? అలా చేయడం మన సమస్యలను మరింత పెంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం తమ వంతు కృషి చేయాల్సిందే. దీనివల్ల ఆస్పత్రి పాలు కావడాన్ని సాధ్యమైన మేర నివారించొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో చాలా వరకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తే అంత ప్రయోజనం లభిస్తుంది. రోజువారీ నడక, పరుగు, ఏరోబిక్ వ్యాయా మాలు చేయడం ద్వారా హెల్త్ క్రెడిట్స్ పొందొచ్చు. వీటిని ప్రీమియంలో సర్దుబాటు చేసుకోవచ్చు. తద్వారా ప్రీమియంలో 100% రాయితీని సైతం కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం, గుట్కా/జర్దాలకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల గురించి ఆరోగ్య చరిత్రలో వెల్లడించాల్సిందే. వీటి కారణంగా ప్రీమియం గణనీయంగా పెరిగిపోతుంది. వీటిని మానేయడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు.సూపర్ టాపప్ నేటి రోజుల్లో నలుగురు సభ్యుల ఒక కుటుంబానికి కనీసం రూ.10 లక్షల హెల్త్ కవరేజీ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది కూడా చాలకపోవచ్చు. కానీ, రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ కోసం 30 ఏళ్ల వ్యక్తి కుటుంబానికి రూ. 20 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు రూ.5 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ పరిశీలించొచ్చు. దీనికి అదనంగా రూ.5 లక్షల డిడక్టబుల్తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. ఉదాహరణకు రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ రూ.3,000కే వస్తుంది. ఇందులో మొదటి రూ.5 లక్షల బిల్లును మినహాయించి, ఆపై ఉన్న మొత్తానికి చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ ప్రీమియం అందుబాటు ధరలోనే వస్తే, అప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ వ్యక్తిగత రుణ చరిత్రకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.. కొన్ని బీమా సంస్థలు మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు ప్రీమియంలో తగ్గింపు ఇస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉందంటే.. ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని అర్థం. ఇలాంటి వారిని తక్కువ రిస్క్ కస్టమర్లుగా చూస్తూ ప్రీమియంలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. 15 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.ఆన్లైన్లో కొనుగోలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ, ఫీచర్లపై అవగాహన కలిగిన వారు ఆన్లైన్లో కొనుగోలు చేయడం ద్వారా ప్రీమియంలో డిస్కౌంట్ పొందొచ్చు. పైగా పాలసీబజార్ పోర్టల్పై మొబైల్ ఓటీపీతో లాగిన్ అయ్యి, అన్ని బీమా సంస్థల పాలసీలను పరిశీలించొచ్చు. వాటి ఫీచర్లు, ప్రీమియం వ్యత్యాసాన్ని గమనించొచ్చు. తద్వారా మెరుగైన ఫీచర్లతో, తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీని గుర్తించొచ్చు. బీమా సంస్థ పోర్టల్ ద్వారా నేరుగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్వయంగా వివరాలు నమోదు చేయడం, నియమ, నిబంధనల గురించి అవగాహన కూడా ఏర్పడుతుంది. కొంత రాజీపడితే? సదుపాయాల విషయంలో కొంత రాజీధోరణితో వెళ్లేట్టు అయితే అప్పుడు కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇందులో రూమ్ టైప్ ఒకటి. ఆస్పత్రిలో చేరినప్పుడు రోగికి ఐసీయూ వెలుపల పడక అవసరమవుతుంది. జనరల్ వార్డ్, షేరింగ్, సింగిల్ రూమ్, డీలక్స్ రూమ్ ఇలా పలు రకాలుంటాయి. పడక విషయంలో ఎలాంటి పరిమితుల్లేని పాలసీకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుంటారు. ఒక విధంగా ఇదే సౌకర్యమైనది. ప్రీమియం భరించగలిగే వారు రూమ్ రెంట్లో పరిమితులు లేకుండా ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారంగా భావించే వారు.. షేరింగ్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు రూమ్ల్లోని సేవలతో పోల్చినప్పుడు షేరింగ్లో అందించే వైద్య సేవల చార్జీలు తక్కువగా ఉంటాయి. కనుక మొత్తం మీద బిల్లు తగ్గుతుంది. ఇది బీమా సంస్థపై భారాన్ని తగ్గిస్తుంది. షేరింగ్లోనూ రోగికి మెరుగైన సేవలే అందుతాయి. కనుక దీన్ని పరిశీలించొచ్చు. పైన చెప్పుకున్న అన్ని ఆప్షన్లు దాటి వచి్చన తర్వాత కూడా ప్రీమియం భారంగా అనిపిస్తే.. కోపేమెంట్కు వెళ్లడమే. ఈ విధానంలో ప్రతి ఆస్పత్రి బిల్లులో పాలసీదారు తన వంతు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు 10 శాతం కో–పేమెంట్ ఎంపిక చేసుకున్నారని అనుకుందాం. రూ.2 లక్షల బిల్లు వచి్చనప్పుడు రోగి తన జేబు నుంచి రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ కోపేమెంట్ ఆప్షన్కైనా వెళ్లొచ్చు. కానీ, దీనివల్ల ఏటా ప్రీమియం భారం తగ్గుతుంది కానీ, ఆస్పత్రిలో చేరినప్పుడు ఆ మేరకు జేబుపై భారం పడుతుందిఈఎంఐ రూపంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏడాదికి ఒకే వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమాలో మాదిరి నెలవారీ లేదా త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి ఆప్షన్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఒకే విడత అంత మొత్తం అంటే భారంగా అనిపించొచ్చు. అలాంటి వారు ఈఎంఐ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని రకాల కార్డులపై బీమా సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే.. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రులతో ఒక జాబితాను నిర్వహిస్తుంటుంది. తమ క్లయింట్లకు కొంచెం తగ్గింపు రేట్లపై సేవలు అందించే దిశగా ఆయా ఆస్పత్రులతో బీమా కంపెనీకి టైఅప్ ఉంటుంది. కనుక నాన్ నెట్వర్క్ ఆస్పత్రులతో పోల్చి చూస్తే నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం వల్ల తక్కువ చార్జీలు పడతాయి. ఈ మేరకు బీమా కంపెనీలకు ఆదా అవుతుంది. కనుక స్టార్ హెల్త్ వంటి కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఇండివిడ్యువల్ హెల్త్ కవరేజీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది. దీనికి బదులు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో అందరికీ కలిపి కవరేజీ ఒక్కటే అవుతుంది. కనుక ప్రీమియం తగ్గుతుంది. వెల్నెస్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.. తీసుకునే హెల్త్ ప్లాన్లో హెల్త్ చెకప్ వంటి వెల్నెస్ ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏడాదికోసారి ఉచితంగా అన్ని రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు అదనంగా పడే ప్రీమియం ఉండదు. కానీ, ఆరోగ్యం ఎలా ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ మేరకు కొంత ఆదా చేసినట్టే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నివా బూపా హెల్త్పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సైబర్ ముప్పును ఎదుర్కొన్నట్టు ప్రకటించింది. కంపెనీ కస్టమర్ల డేటాబేస్ను హ్యాక్ చేసినట్టు ఓ గుర్తు తెలియని సంస్థ నుంచి బెదిరింపు ఈ–మెయిల్ వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు సమాచారం అందించింది. డేటా లీక్ అయిన విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నట్టు, రిస్క్ను అధిగమించే చర్యలు అమలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. 2024 డిసెంబర్ 31 నాటికి నివాబూపాకు 1.98 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. గతేడాది మరో సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం డేటా చోరీ ఘటనను ఎదుర్కోవడం తెలిసిందే. -
పన్ను ఆదా.. భవిష్యత్తుకు పెట్టుబడి!
మనది పొదుపు సమాజం. మన తల్లిదండ్రులు, తాతలు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేసేవారు. భవిష్యత్ కోసం వీలైన ప్రతి రూపాయినీ ఆదా చేసేవారు. కానీ, నేటి తరం ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతోంది. సౌకర్యాలు, సుఖాలు, ఆడంబరాలు, ఆనందం కోసం ఖర్చుకు వెనుకాడని ధోరణి పెరిగిపోతోంది. ‘ధనవంతుడు కావాలంటే పేదవారిగా బతకాలి’ అన్నది ఆర్థిక నిపుణులు చెప్పే సూక్తి. పేదవారిగా జీవించాలని చెప్పడం కాదు ఇందులోని అసలు అర్థం. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు పోకూడదన్న సూచన ఇందులో కనిపిస్తుంది. తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపన్ను రాయితీలను గణనీయంగా పెంచేశారు విత్త మంత్రి. రూ.12.75 లక్షల వరకు కొత్త విధానంలో పన్ను లేకుండా వరాలు కురిపించారు. దీంతో వివిధ తరగతుల వారికి గరిష్టంగా రూ.లక్ష, అంతకుమించి పన్ను రూపంలో ఆదా కానుంది.ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని ఖర్చు బకెట్లో వేసేసుకుని సంబరపడిపోకుండా.. పెట్టుబడులకూ కొంత కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. తద్వారా భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు మరింత బలం చేకూరుతుంది. త్వరగా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోగలరు. పన్ను భారం తప్పించుకునేందుకు కొత్త విధానంలోకి మారిపోయి.. ఇప్పటి వరకు పాత విధానంలో చేస్తున్న పన్ను ఆదా పెట్టుబడులకు మంగళం పాడే తప్పు అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు. ఆదాయ స్థాయిలకు అనుగుణంగా కొత్త పన్ను విధానంలో ఆదా అయ్యే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వారికి రూ.83,200, రూ.15 లక్షలు సంపాదించే వారికి రూ.32,500 వరకు తాజా ప్రతిపాదనలతో పన్ను ఆదా కానుంది. అలాగే, రూ.24 లక్షల సంపాదనాపరులకు రూ.1.14 లక్షలు, రూ.కోటి ఆదాయ వర్గాలకు రూ.1,25,840, రూ.5 కోట్ల ఆదాయం కలిగిన వారికి రూ.1.43 లక్షల వరకు పన్ను మిగులు లభించనుంది. ఈ కొత్త ప్రతిపాదనలు 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. అంటే 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న రేట్లే వర్తిస్తాయి. పాత విధానంలో వివిధ సెక్షన్ల కింద పలు రకాల పెట్టుబడులతోపాటు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలతో కలుపుకుని రూ.8.50 లక్షల ఆదాయంపై పన్ను ఆదాకు అవకాశం ఉంది. పెట్టుబడులు ఆపొద్దు.. ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక ఉండాలి. జీవితంలో అన్ని ముఖ్య అవసరాలను సాధించే మార్గసూచీగా ఇది ఉంటుంది. ఈ లక్ష్యాలకు పెట్టుబడులే ఆధారం. ఆదాయంలో కనీసం 30 శాతం అయినా పెట్టుబడులకు మళ్లించుకోవాలి. అయితే, జీవిత లక్ష్యాల దృష్టితో కాకుండా పన్ను ఆదా కోసమే పెట్టుబడులను ఆశ్రయించే వేతన జీవులు కూడా ఉన్నారు. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్డీల్లో పెట్టుబడులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై సెక్షన్ 80సీ పరిధిలో (పాత పన్ను వ్యవస్థ) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనికి అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్కు సెక్షన్ 80డీ పరిధిలో పన్ను మినహాయింపులు ఉన్నాయి. గృహ రుణం తీసుకుని అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ పరిధిలో, వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 పరిధిలో చూపించుకోవచ్చు. కొత్త పన్ను వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండడంతో, ఇంతకాలం పన్ను ఆదా దృష్టితో కొనసాగించిన ఈ పెట్టుబడులను నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. ఈ తప్పు అస్సలు చేయొద్దు. కొత్త పన్ను విధానం సూటిగా, సరళంగా ఉంటుంది. పన్నుల గందరగోళం వద్దనుకునే వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. కానీ, అదే సమయంలో పాత పన్ను విధానం ప్రోత్సహిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, మదుపులను విస్మరించకుండా, వాటిని కొనసాగించడం ద్వారానే గరిష్ట ప్రయోజాన్ని పొందగలరు. పన్ను ఆదా కోసం ఉద్దేశించినవి కాకపోయినా, మెరుగైన ఇతర సాధనాల్లో అయి నా పెట్టుబడులు కొనసాగించుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ ఒక విభాగం. ఇందులో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో ఇతర ఈక్విటీ ఫండ్స్ అంత అమ్మకాల ఒత్తిడి వీటిల్లో ఉండదు. కనుక స్థిరత్వం ఎక్కువ. మల్టీక్యాప్ (ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేయగలదు) విధానంతో పెట్టుబడులు పెడుతుంటుంది. పదేళ్ల కాలంలో 12–18 శాతం మధ్య, ఐదేళ్లలో 13–27 శాతం మధ్య రాబడులు ఈ పథకాల్లో గమనించొచ్చు. కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు ఈఎల్ఎస్ఎస్లోనే ఇన్వెస్ట్ చేయాలని లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీక్యాప్, ఇండెక్స్ ఫండ్స్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, బీమా పథకాలకు పన్ను ఆదాకు మించి ప్రయోజనాలను ఇచ్చే సామర్థ్యం ఉన్నట్టు సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ పార్ట్నర్ కునాల్ సవాని పేర్కొన్నారు. కొత్త విధానంలోకి వెళ్లినా కానీ, భవిష్యత్ కోసం ఉద్దేశించిన ఈ పెట్టుబడులను నిలిపివేయొద్దని సూచించారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా (టర్మ్, ఎండోమెంట్) పాలసీల ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పాత వ్యవస్థలో పన్ను మిననహాయింపు ఉంది. వార్షిక ప్రీమియం మొత్తం కవరేజీలో (సమ్ అష్యూర్డ్/రక్షణ) 10 శాతం మించకపోతే, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను లేదు. ఈ పన్ను ప్రయోజనం కోసం ఎండోమెంట్, టర్మ్ పాలసీలను కొందరు తీసుకుంటున్నారు. ఏ పన్ను విధానంలో ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా, కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన ప్రతి వ్యక్తీ తన పేరిట తగినంత బీమా కవరేజీతో అచ్చమైన టర్మ్ పాలసీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తన వార్షిక ఆదాయానికి సుమారుగా 20 రెట్ల మేర సమ్ అష్యూర్డ్ ఉండేలా చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆర్జించే వ్యక్తి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే, వచ్చే బీమా పరిహారంతో అతనిపై ఆధారపడిన కుటుంబం సాఫీగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నేడు జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. కనుక ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఇది కేవలం పన్ను ఆదా కోసం ఉద్దేశించిన సాధనం కానే కాదు. పెద్ద ప్రమాదం లేదా కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ఆస్పత్రి పాలైతే, హెల్త్ కవరేజీ లేని పరిస్థితుల్లో అప్పటి వరకు కూడబెట్టినదంతా కరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం వల్ల ఆర్థికంగా సమస్యల్లోకి వెళ్లకూడదని కోరుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్ను తీసుకోవాలి. ఒక కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10లక్షలు ఉండేలా చూసుకోవాలి. దీనిపై అదనపు కవరేజీని సూపర్ టాపప్ ప్లాన్ రూపంలో తీసుకోవచ్చు. ఉద్యోగం చేసే సంస్థ తరఫున గ్రూప్ హెల్త్ కవరేజీ ఉన్న వారు సైతం విడిగా తమ కుటుంబానికి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణంతో కంపెనీని వీడినా, ఉద్యోగం మానేసినా కవరేజీ కొనసాగుతుంది.ఖర్చు కంటే పెట్టుబడి ముఖ్యం చాలా మంది తమ ఆదాయంలో ఖర్చులుపోను మిగులుంటే అప్పుడు పెట్టుబడులకు మళ్లిస్తుంటారు. కానీ, ముందు పెట్టుబడులకు కేటాయింపులు చేసిన తర్వాతే ఖర్చులకు వెళ్లాలన్నది నిపుణుల సూచన. కొత్త పన్ను వ్యవస్థలో మిగిలే నిధులను ఎన్పీఎస్ తదితర పెన్షన్ ప్లాన్లకు కేటాయించుకోవాలని సింఘానియా అండ్ కో పార్ట్నర్ బన్సాల్ సూచించారు. దీనివల్ల గణనీయమైన రిటైర్మెంట్ ఫండ్ ఏర్పడుతుందన్నారు. చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యాన్ని పెద్దగా పట్టించుకోరు. 60 ఏళ్ల తర్వాత సంగతి కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ, ఉద్యోగంలో చేరిన నాటి నుంచే రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం పెట్టుబడి చేసుకుంటూ వెళ్లడం ద్వారా స్వల్ప మొత్తమే పెద్ద నిధిగా మారుతుందన్నది తెలుసుకోవాలి.కొత్త–పాత పన్ను వ్యవస్థలు ఏ విధానంలో కొనసాగాలన్నది తమ ఆదాయం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. హెచ్ఆర్ఏ, గృహ రుణ ప్రయోజనాలు, ఎల్టీసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ పెట్టుబడులతో రూ.8 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్తో రూ.50 వేలు మొత్తంగా రూ.8.50 లక్షల వరకు పాత పన్ను వ్యవస్థలో మినహాయింపులున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే రూ.24 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి పాత వ్యవస్థ అనుకూలమని నిమిత్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు నితేష్ బుద్దదేవ్ తెలిపారు. ఒకవేళ తమ పెట్టుబడులు ఈ స్థాయిలో లేకపోతే కొత్త విధానాన్ని పరిశీలించొచ్చు. రూ.24 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి కొత్త విధానమే అనుకూలం. ఎన్పీఎస్ రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాల్లో ఎన్పీఎస్ ఒకటి. అతి తక్కువ నిర్వహణ చార్జీలతోపాటు, పెట్టుబడిపైనా, రాబడి ఉపసంహరణపైనా పన్ను ప్రయోజనాలున్నాయి. ఇందులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై సెక్షన్ 80సీసీఈ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80సీ గరిష్ట ప్రయోజనం కిందకే ఇది కూడా వర్తిస్తుంది. దీనికి అదనంగా సెక్షన్ 80సీసీడీ (1బి) కింద ఎన్పీఎస్ టైర్–1 ఖాతాలో మరో రూ.50,000 పెట్టుబడికి సైతం పన్ను మినహాయింపు ఉంది. ఈ సెక్షన్ కిందే ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడికీ పన్ను ఆదా ప్రయోజనాన్ని 2025–26లో బడ్జెట్లో కల్పించారు. తమ పేరు మీద లేదా తమ కుమార్తె లేదా కుమారుల పేరిట ఎన్పీఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బి) కింద గరిష్ట ప్రయోజనం రూ.50వేలకు పరిమితం. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకంలో సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మరో 40 శాతం మొత్తానికి పింఛను ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో చేసే జమలపైనా పాత విధానంలో పన్ను ప్రయోజనాలున్నాయి. సెక్షన్ 80సీసీడీ (2) కింద మూలవేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని ఉద్యోగి తరఫున యాజమాన్యం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి తరఫున ప్రభుత్వమే జమ చేస్తుంటే అప్పుడు 14 శాతంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పించారు. కొత్త విధానంలో ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ టైర్–1లో జమ చేస్తే (మూలవేతనం, డీఏలో 10 శాతం / వచ్చే ఏప్రిల్ నుంచి 14 శాతం) ఆ మేరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ హామీతో కూడిన డెట్ పెట్టుబడి సాధనాలు. వీటిల్లో రిస్క్ సున్నా. ఈ రెండు సాధనాల్లో ఏటా చేసే పెట్టుబడులను పాత పన్ను వ్యవస్థలోని సెక్షన్ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తంపై పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో పన్ను లేదు. పన్ను ప్రయోజనాలున్న ఈ మెరుగైన పథకాలు ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిందే. తమ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం ఈ సాధనాలకు కేటాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్కు మళ్లించుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడికి కొంత రక్షణతోపాటు దీర్ఘకాలంలో అధిక రాబడిని సొంతం చేసుకోగలరు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో పెట్టుబడులకు వర్తించే వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ వీటి రేట్లను ప్రకటిస్తుంటుంది. పీపీఎఫ్లో ప్రస్తుతం 7.10 శాతం రేటు అమల్లో ఉంది. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. అనంతరం మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.2 శాతం రేటు అమల్లో ఉంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని ప్రారంభించుకోవచ్చు. బాలికల వయసు 10 ఏళ్లు మించకూడదు. ఆలోపు వయసున్న వారి పేరుతో ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తెలకు 21 ఏళ్లు నిండగానే పథకం ముగిసిపోతుంది. లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత, 21 ఏళ్లు రాక ముందే వారికి వివాహం నిశ్చయమైతే అప్పుడు ఈ పథకం నుంచి వైదొలగొచ్చు. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు అనుకూలమేనని వేద్ జైన్ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అంకిత్ జైన్ సూచించారు. ఎందుకంటే ఈ రెండు పథకాల్లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనం కొత్త వ్యవస్థ కింద లేకపోయినా కానీ, వడ్డీ రాబడికి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉన్నట్టు తెలిపారు. కుమార్తెల వివాహం, ఉన్నత విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బడ్జెట్ 2025: గిగ్ వర్కర్లకు ఇక మంచిరోజులు
న్యూఢిల్లీ, సాక్షి: అసంఘటిత రంగాల ఉద్యోగులకు(గిగ్ వర్కర్లకు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్(Union Budget 2025) ద్వారా వాళ్లకు గుర్తింపుతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్స్కు లాభం చేకూరనుంది. ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే.. ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన(PM-JAY) కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాది ఐదు లక్షల దాకా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు. అలాగే గిగ్ వర్కర్ల సామాజిక భద్రత త్వరలో కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలనూ వర్తింపజేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారామె. గిగ్ వర్కర్లు అంటే..తాత్కాలికంగా.. తమకు ఉన్న వీలును బట్టి ఉద్యోగాలను చేసేవాళ్లను గిగ్ వర్కర్లు అంటారు. ప్రత్యేకించి.. యాప్ల ద్వారా సేవలందించే ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉన్నారు. డెలివరీ యాప్లు, రైడ్ యాప్లతో పని చేసే ఉద్యోగులతో పాటు ఫ్రీలాన్సర్లు, ఆన్లైన్ ట్యూటర్లు ఈ విభాగంలోకి వస్తారు. అయితే.. సంప్రదాయ ఉద్యోగులకు ఉన్నట్లు వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు. అది కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నా.. ఈ తరహా ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు ఇంతకాలం తీవ్రంగా భావించాలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు.. రాబోయే రోజుల్లో వాళ్లకు మంచి రోజులు వస్తాయనే సంకేతాలు అందించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. పది కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఆ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. కిందటి బడ్జెట్లో గిగ్ వర్కర్ల కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. అయితే ఈసారి బడ్జెట్లో కచ్చితమైన నిర్ణయాలు ప్రకటించడం గమనార్హం. -
10 శాతం మించడానికి వీల్లేదు
ముంబై: ఆరోగ్య బీమా రంగ కంపెనీలు ఇకపై సీనియర్ సిటిజన్ల వార్షిక ప్రీమియంలో పెంపుదలను 10 శాతంలోపునకే పరిమితం చేయవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. తక్కువ ఆదాయ వనరులతో జీవించే సీనియర్ సిటిజన్లకు దీంతో ఉపశమనం లభించనుంది. వయసురీత్యా పలు కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వయసురీత్యా ఆరోగ్య పరిరక్షణ మరింత అవసరమయ్యే వీరికి పెరుగుతున్న బీమా ప్రీమియంలు ఆర్థికంగా భారమవుతున్న సంగతి తెలిసిందే. -
బీమా పరిశ్రమకు ధీమా
భారత జీడీపీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడిస్(Moody's) అంచనా వేసింది. 2025–26లో 6.6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ బలమైన విస్తరణతో బీమా రంగం ప్రయోజనం పొందనున్నట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance)కు పెరుగుతున్న డిమాండ్తో బీమా కంపెనీలు ప్రీమియంలో స్థిరమైన వృద్ధిని చూడనున్నాయని వివరించింది. అధిక ప్రీమియం ఆదాయం, పెరుగుతున్న ప్రీమియం ధరలు, ప్రభుత్వ సంస్కరణలతో బీమా రంగం లాభదాయకత మెరుగుపడనున్నట్టు అంచనా వేసింది.‘భారత ప్రైవేటు బీమా కంపెనీలు తమ వినియోగదారుల బేస్ను పటిష్టం చేసుకోవడం కొనసాగనుంది. కాకపోతే అండర్రైటింగ్ ఎక్స్పోజర్, నియంత్రణపరమైన మార్పులతో వాటి క్యాపిటల్ అడెక్వెసీపై ఒత్తిళ్లు కొనసాగనున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25లో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ముందటి సంవత్సరంలో వృద్ధి 8.2 శాతం కంటే కొంత తక్కువ. భారత తలసరి ఆదాయం–కొనుగోలు శక్తి సమానత్వం సైతం వృద్ధి చెందుతోంది. 11 శాతం వృద్ధితో 2024 మార్చి నాటికి ఇది 10,233 డాలర్లకు చేరింది’ అని మూడిస్ పేర్కొంది. భారత జాతీయ గణాంక కార్యాలయం (NSO) 2024–25 సంవత్సరానికి జీడీపీ 6.4 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనా కంటే మూడిస్ అంచనాలు బలంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుభారీ అవకాశాలు..అధిక సగటు ఆదాయం, వినియోగదారుల రిస్క్ ధోరణి బీమాకు, ముఖ్యంగా ఆరోగ్య బీమాకు డిమాండ్ను పెంచుతున్నట్టు మూడిస్ పేర్కొంది. 2024 మొదటి ఎనిమిది నెలల్లో బీమా ప్రీమియం ఆదాయం 16 శాతం పెరిగినట్టు తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రీమియంలో 8 శాతం వృద్ధిని అధిగమించినట్టు వివరించింది. ‘భారత్లో బీమా విస్తరణ రేటు (జీడీపీలో బీమా ప్రీమియంల వాటా) 2024 మార్చి నాటికి 3.7 శాతంగానే ఉంది. యూకే 9.7 శాతం, యూఎస్ 11.9 శాతంతో పోల్చి చూస్తే చాలా తక్కువ. అందుకే భారత బీమా రంగం బలమైన విస్తరణకు పుష్కల అవకాశాలున్నాయి’ అని పేర్కొంది. -
ఆదుకోని హెల్త్ ఇన్సూరెన్స్!
సాక్షి, అమరావతి: అత్యవసర సందర్భాల్లో ఆదుకోవాల్సిన ఆరోగ్య బీమా అక్కరకు రావడం లేదని.. బీమా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా క్లెయిమ్ల ఆమోదంలో ఆలస్యం చేస్తున్నాయని మెజారిటీ శాతం పాలసీదారులు వాపోతున్నారు. నిరీక్షణ రూపంలో పాలసీదారుల సహనానికి పరీక్ష పెడుతూ చివరకు తక్కువ క్లెయిమ్ మొత్తాన్ని అంగీకరించేలా కావాలనే జాప్యం చేస్తున్నాయని ప్రతి 10 మంది పాలసీదారుల్లో ఎనిమిది మంది పేర్కొంటున్నారు. ఆస్పత్రుల్లో చేరిన గంట లోపు నగదు రహిత క్లెయిమ్లను,డిశ్చార్జి అయిన మూడు గంటల్లోగా క్లెయిమ్ సెటిల్మెంట్ను పరిష్కరించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) గతేడాది బీమా కంపెనీలకు స్పష్టం చేసింది. అయితే ప్రతి 10 మంది పాలసీదారుల్లో ఆరుగురికి క్లెయిమ్ల ఆమోదానికి ఆరు గంటల నుంచి రెండు రోజుల సమయం పడుతోందని లోకల్ సర్కిల్ సంస్థ సర్వేలో వెల్లడైంది. బీమా కంపెనీల సేవలపై దేశవ్యాప్తంగా 327 జిల్లాల్లో లక్ష మందికిపైగా పాలసీదారుల అభిప్రాయాలను సేకరించారు. సర్వేలో 67 శాతం పురుషులు, 33 శాతం మంది మహిళలు పాల్గొన్నారు.పారదర్శకత లేదన్న 83 శాతం మందిక్లెయిమ్ల ప్రాసెసింగ్ కోసం బీమా కంపెనీలకు పారదర్శ కమైన వెబ్ ఆధారిత సమాచార వ్యవస్థలు లేవని భావిస్తున్నారా? అని 15,031 మందిని ఆరా తీయగా 83 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. ప్రతి దశలో వంద శాతం వెబ్ ఆధారిత ప్రాసె సింగ్ను తప్పనిసరి చేసేలా చూడాలని ఐఆర్డీఏఐని కోరారు. తొమ్మిది శాతం మంది మాత్రమే కమ్యూనికేషన్ వ్యవస్థలు సరిగానే పని చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఐఆర్డీఐఏ నివేదిక ప్రకారం 2024లో దేశంలో రూ.1.2 లక్షల కోట్ల క్లెయిమ్లు నమోదు కాగా అందులో 71.3 శాతం మేర మాత్రమే బీమా కంపెనీలు చెల్లింపులు జరిపాయి.జాప్యం.. పాక్షిక ఆమోదంగత మూడేళ్లలో క్లెయిమ్ల పట్ల బీమా కంపెనీల ప్రతిస్పందన ఎలా ఉందని 28,700 మందిని ప్రశ్నించగా చెల్లని కారణాలతో క్లెయిమ్లు తిరస్కరించారని 20 శాతం మంది, క్లెయిమ్ మొత్తంలో పాక్షికంగా ఆమోదించారని 49 శాతం మంది, మొత్తానికి ఆమోదం లభించిందని 25 శాతం మంది తెలిపారు. పది మందిలో ఐదుగురు పాలసీదారులు తమ క్లెయిమ్లను బీమా కంపెనీలు తిరస్కరించాయని, పాక్షికంగా ఆమోదించారని తెలిపారు. క్లెయిమ్ల తిరస్కరణ కారణంగా 50 శాతం మంది పాలసీదారులు ఇబ్బందులు పడుతున్నట్టు వెల్లడవుతోంది. ఆస్పత్రుల్లో చేరినప్పుడు దాఖలు చేసిన క్లెయిమ్లు ఆమోదానికి ఎంత సమయం పట్టిందని 30,366 మందిని ఆరా తీయగా 24–48 గంటల సమయం పట్టిందని 21 శాతం మంది, 12–24 గంటలని 12 శాతం మంది, 9–12 గంటలు తీసుకున్నారని 14 శాతం మంది, 6–9 గంటలు పట్టిందని 12 శాతం మంది తెలిపారు. -
మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
ప్రస్తుతం మానసిక ఆరోగ్యాన్ని(Mental health) పరిరక్షించుకోవడమనేది సవాలుగా మారుతోంది. శారీరక ఆరోగ్యం(Health)తో సమానంగా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై అవగాహన పెరుగుతుండటంతో వీటిని సైతం ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా గుర్తిస్తున్నారు. అయితే, ఇందుకు అవసరమైన సహాయాన్ని పొందడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డంకిగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా సంస్థలు తమ పథకాల్లో మానసిక ఆరోగ్య కవరేజీని చేర్చడం ప్రారంభించాయి. దీనితో కౌన్సిలింగ్, థెరపీ, ప్రివెంటివ్ కేర్ వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయకరంగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా(health insurance) ప్లాన్ ఎంపిక చేసుకునేటప్పుడు, అది అందించే కవరేజీ, ప్రయోజనాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అలా పరిశీలించతగిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..సమగ్ర కవరేజీకౌన్సిలింగ్, థెరపీ సెషన్లు వంటి మానసిక ఆరోగ్య సేవలను కవర్ చేసేవిగా పథకాలు ఉండాలి. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులను కలిసే అవకాశాన్ని కల్పించాలి. టెలిమెడిసిన్ వంటి సౌకర్యాలు కూడా ఉండాలి. దీంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు కూడా డాక్టర్లతో ఆన్లైన్లో సంప్రదించేందుకు వీలవుతుంది. అదనంగా, ఔట్పేషంట్ డిపార్ట్మెంట్ (ఓపేడీ) కవరేజీ ఉంటే ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా డాక్టర్ను సందర్శించవచ్చు, ఇది సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది.వెల్నెస్ ప్రోగ్రాంలుఅనేక బీమా కంపెనీలు ఇప్పుడు తమ పథకాలలో వెల్నెస్ ప్రోగ్రాంలను చేరుస్తున్నాయి. ఇవి మైండ్ఫుల్నెస్ సెషన్లు, ఒత్తిడిని అధిగమించేందుకు వర్క్షాప్లు నిర్వహించడం లేదా ఫిట్నెస్పరమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేవిగా ఉంటున్నాయి. ఉచిత యోగా తరగతులు, జిమ్ మెంబర్షిప్లు లేదా వెల్నెస్ యాప్(Wellness App)లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా కొన్ని పథకాలు అందిస్తున్నాయి. హోమ్ హెల్త్కేర్ సేవలుదీర్ఘకాలిక సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నవారికి క్లినిక్లకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి హోమ్ హెల్త్కేర్ ప్రయోజనాలు ఉన్న పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి వద్దే సంరక్షణ సేవలను సౌకర్యవంతంగా అందుకునేందుకు ఈ పాలసీలు సహాయపడతాయి. ఇన్సెంటివ్లు, రివార్డులుకొన్ని బీమా పథకాలు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తూ రివార్డులు అందిస్తాయి. ఉదాహరణకు, మీరు రెగ్యులర్ హెల్త్ చెక్–అప్స్ చేయడం లేదా ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా రెన్యువల్పై డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని పథకాలు వాకింగ్ లేదా వ్యాయామం మొదలైన వాటికి పాయింట్లు అందిస్తాయి. వీటిని తరువాత రిడీమ్ చేసుకోవచ్చు.వెల్నెస్ ప్రోగ్రాంలుఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు తోడ్పడే వెల్నెస్ ప్రోగ్రాంలు, ప్రివెంటివ్ కేర్లాంటివి అందించే పాలసీ(Policy)లను ఎంచుకోవాలి. డిస్కౌంట్లు, రివార్డులు మొదలైనవి ఇచ్చే పాలసీల వల్ల బీమా వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. డబ్బూ ఆదా అవుతుంది. ఇక టెలిమెడిసిన్, హోమ్ హెల్త్కేర్ ఫీచర్లు సత్వరం సేవలను పొందడాన్ని సులభతరం చేస్తాయి.ఇదీ చదవండి: ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడనేది మరింత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. చికిత్స చేయకపోవడం వల్ల పలు రకాల పరిస్థితులు రోజువారీ జీవితానికి అడ్డంకులుగా మారతాయి. సంబంధాలను నాశనం చేస్తాయి. అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. డాక్టర్లను పదే పదే కలవాల్సి రావడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ కవరేజీ అవసరాల వల్ల ఆర్థికంగా కూడా ఇది మరిన్ని ఖర్చులకు దారి తీస్తుంది. కాబట్టి తగినంత కవరేజీ ఉండే పాలసీని ఎంచుకోవడం వల్ల భావోద్వేగాలపరంగానూ, ఆర్థికంగాను సవాళ్లను అధిగమించేందుకు సహాయకరంగా ఉంటుంది. -
రూ.2.50 లక్షల వరకు ‘ఆరోగ్య బీమా’
సాక్షి, అమరావతి: ఆరోగ్య బీమా(Health insurance) పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రూ.2.50 లక్షల వరకు వైద్య సేవలను బీమా పరిధిలోకి తెస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2,500 చొప్పున ప్రీమియం చెల్లిస్తామన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలోని 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా వర్తిస్తుందని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు బీమా వర్తింపజేస్తే ప్రైవేటు ఆస్పత్రులు మనుగడ సాగించడం కష్టమన్నారు.మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో విఫలమైన బీమా విధానాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా.. ఆయా రాష్ట్రాల్లో నిర్వహణ లోపాల వల్లే బీమా విధానం విఫలమైందని మంత్రి చెప్పారు. ఆ సమస్యలు ఇక్కడ తలెత్తకుండా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. రూ.2.50 లక్షల పైబడిన చికిత్సలను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అందిస్తామన్నారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని కొనసాగించాలో, లేదో పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ముందుకు తీసుకెళ్లడానికి ట్రాన్సాక్షన్ అడ్వైజర్ను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం కోసం నేషనల్ మెడికల్ కమిషన్కు దరఖాస్తులు చేయబోమని మంత్రి స్పష్టం చేశారు. చైనాలో కొత్త వైరస్ గురించి వార్తలు వస్తున్నాయని.. అయితే అధికారికంగా ధ్రువీకరణ కాలేదన్నారు. జేసీ.. నోరు అదుపులో పెట్టుకో! టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి బీజేపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఆయనకు వైఎస్ జగన్పై అంత ప్రేమ ఉంటే.. ఆయన పంచనే చేరాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం తన బస్సులు తగలబెట్టిందని జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన ఆరోపణలు అర్థరహితమన్నారు. వచ్చే వారంలో పింఛన్ లబ్ధిదారులకు స్క్రీనింగ్.. అనర్హులైన పింఛన్ లబ్ధిదారులను ఏరివేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పింఛన్ లబ్ధిదారులకు స్క్రీనింగ్ చేపట్టడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. వచ్చే వారంలో వైద్యులు బృందాలుగా ఏర్పడి.. కదల్లేని స్థితిలో ఉన్న పింఛన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్క్రీనింగ్ చేస్తారని తెలిపారు. ప్రతి బృందంలో ఆర్థో, జనరల్ మెడిసిన్, పీహెచ్సీ వైద్యుడు ఉంటారని వివరించారు. -
రూ.15,100 కోట్ల క్లెయిమ్లను అనుమతించలేదు!
ఆరోగ్య బీమా సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,100 కోట్ల విలువైన క్లెయిమ్(Claim)లను అనుమతించలేదు. దాఖలు చేసిన మొత్తం క్లెయిమ్ల్లో ఇవి 12.9 శాతానికి సమానమని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సాధారణ, స్వతంత్ర ఆరోగ్య బీమా(Health Insurance) సంస్థలకు వచ్చిన మొత్తం రూ.1.17 లక్షల కోట్ల క్లెయిమ్లలో.. రూ.83,493.17 కోట్లు లేదా 71.29 శాతం చెల్లింపులు జరిగాయి. బీమా సంస్థలు రూ.10,937.18 కోట్ల (9.34 శాతం) క్లెయిమ్లను తిరస్కరించాయి. 2024 మార్చి నాటికి మొత్తం రూ.7,584.57 కోట్ల (6.48 శాతం) విలువైన క్లెయిమ్లు బకాయి ఉన్నాయి. 2023–24లో సుమారు 3.26 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిమ్లు వచ్చి చేరాయి. వీటిలో 2.69 కోట్ల (82.46 శాతం) క్లెయిమ్లు పరిష్కారం అయ్యాయి. ఒక్కో క్లెయిమ్కు చెల్లించిన సగటు మొత్తం రూ.31,086గా ఉంది.నగదు రహితం 66.16%.. సెటిల్ అయిన క్లెయిమ్ల సంఖ్య పరంగా 72 శాతం థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ (TPA) ద్వారా, మిగిలిన 28 శాతం కంపెనీల అంతర్గత యంత్రాంగం ద్వారా పరిష్కారం అయ్యాయి. క్లెయిమ్ల సెటిల్మెంట్ విధానంలో 66.16 శాతం నగదు రహితంగా, మరో 39 శాతం రీయింబర్స్మెంట్ విధానంలో పరిష్కరించారు. 2023–24 సంవత్సరంలో సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు పర్సనల్ యాక్సిడెంట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ మినహాయించి రూ.1,07,681 కోట్ల ఆరోగ్య బీమా ప్రీమియం వసూలు చేశాయి. బీమా ప్రీమియం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 20.32 శాతం వృద్ధిని నమోదు చేసింది. పర్సనల్ యాక్సిడెంట్(Accident), ట్రావెల్ ఇన్సూరెన్స్ బీమా కింద జారీ చేసిన పాలసీలు మినహా సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు 2.68 కోట్ల ఆరోగ్య బీమా పాలసీల ద్వారా 57 కోట్ల మందికి కవరేజ్ ఇచ్చాయి.ఇదీ చదవండి: ‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’165.05 కోట్ల జీవితాలను..2024 మార్చి చివరి నాటికి 25 సాధారణ బీమా సంస్థలు, 8 స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు సేవలు అందించాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ప్రమాద బీమా కింద పరిశ్రమ మొత్తం 165.05 కోట్ల జీవితాలను కవర్ చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), ఈ–టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రయాణ బీమా కింద కవర్ చేయబడిన 90.10 కోట్ల జీవితాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలైన న్యూ ఇండియా, నేషనల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ విదేశాలలో ఆరోగ్య బీమా వ్యాపారం చేస్తున్నాయి. -
రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహార అలవాట్లలో తేడాలొస్తున్నాయి. దానికితోడు శారీరక శ్రమ లోపించి చాలామంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఏదైనా కారణాలతో హాస్పటల్లో చేరితే ఆర్థికంగా భారం కాకూడదని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) తీసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా వరకు రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన గతంలో ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా?రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచ్చినప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. అలాకాకుండా రెండింటిలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కోసారి రెండూ రెజెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.ఒకటికి మించిన ప్లాన్లు ఎందుకు?అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చినా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కల్పించే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్(Topup Plan) జోడించుకోవడం మరొక మార్గం. -
నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేషియో క్షీణత
న్యూఢిల్లీ: నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలో నికర చెల్లింపులు (క్లెయిమ్ రేషియో) 2023–24లో స్వల్పంగా తగ్గి 82.52 శాతంగా ఉన్నట్టు బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 82.95 శాతంగా ఉంది. నాన్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కలసి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల ప్రీమియాన్ని నమోదు చేశాయి. 12.76 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం 9 శాతం వరకు పెరిగి రూ.82,891 కోట్ల నుంచి రూ.90,252 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ప్రీమియం రూ.1.88 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.58 లక్షల కోట్లుగానే ఉంది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల లాభం రూ.10,119 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రూ.2,556 కోట్ల మేర నష్టాలను నమోదు చేయడం గమనార్హం. నివేదికలోని వివరాలు..2023–24లో నెట్ ఇన్కర్డ్ (నికర) క్లెయిమ్లు 15.39 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వరంగ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 99.02 శాతంగా ఉంటే, 2023–24లో 97.23 శాతానికి తగ్గింది.ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 76.49 శాతానికి మెరుగుపడింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 75.13 శాతంగా ఉంది.స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 61.44 శాతంగా ఉంటే, 2023–24లో 63.63 శాతానికి మెరుగుపడింది.స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 66.58 శాతంగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 73.71 శాతంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్జీవిత బీమా కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.77 లక్షల కోట్లను పాలసీదారులకు చెల్లించాయి. పాలసీదారుల నుంచి వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో చెల్లింపులు 70.22 శాతంగా ఉన్నాయి. పాలసీల సరెండర్లు/ఉపసంహరణలకు సంబంధించిన ప్రయోజనాలు 15 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల వాటా 58 శాతంగా ఉంది.2023–24లో 18 జీవిత బీమా కంపెనీలు నికర లాభాలను నమోదు చేశాయి. జీవిత బీమా కంపెనీల ఉమ్మడి లాభం 11 శాతం పెరిగి రూ.47,407 కోట్లకు చేరింది.ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్ఐసీ) లాభం 11.75 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా కంపెనీల లాభంలో 5 శాతం వృద్ధి నమోదైంది.మొత్తం బీమా వ్యాప్తి 2022–23లో 4 శాతంగా ఉంటే 2023–24లో 3.7 శాతానికి పరిమితమైంది. జీవిత బీమా వ్యాప్తి 3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గగా.. సాధారణ బీమా వ్యాప్తి (ఆరోగ్య బీమా సహా) ఒక శాతం వద్దే స్థిరంగా ఉంది. -
హెల్త్ ఇన్సూరెన్స్ ‘పోర్టింగ్’.. తొందరొద్దు!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సాధనం. రక్షణ కవచం కూడా. ఎప్పుడు ఏ రూపంలో అనారోగ్యం లేదా ప్రమాదం ఎదురవుతుందో ఊహించలేం. ఖరీదైన వైద్య వ్యయాల భారాన్ని మోయలేం. జీవితకాల కష్టార్జితాన్ని ఒకేసారి ఎత్తుకుపోయే కరోనా మాదిరి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. వీటన్నింటికీ పరిష్కారమే హెల్త్ ఇన్సూరెన్స్. విస్తృత ప్రచారం నేపథ్యంలో నేడు చాలా మంది ఆరోగ్య బీమా ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రీమియం కష్టమైనా తీసుకుంటున్నారు. తీరా ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత.. కంపెనీ సేవలు నచ్చకపోవచ్చు. మంచి ఫీచర్లతో తక్కువ ప్రీమియానికే మరో బీమా కంపెనీ హెల్త్ప్లాన్ ఆకర్షించొచ్చు. అటువంటి సందర్భంలో కనిపించే ఏకైక ఆప్షన్ పోర్టింగ్. ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్కు మొబైల్ నంబర్ మార్చుకున్నంత సులభంగానే.. హెల్త్ ఇన్సూరెన్స్ను సైతం పోర్ట్ పెట్టుకుని మరో కంపెనీ ప్లాన్లో చేరిపోవచ్చు. పోర్టింగ్తో ఎన్నో ప్రయోజనాలున్నాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటి గురించి అవగాహన తప్పనిసరి. బలమైన కారణాలుంటేనే, అది కూడా సమగ్రమైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ‘పోర్టింగ్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, బిజినెస్ డెస్క్తమ కంపెనీ ప్లాన్లోకి ‘పోర్ట్’ పెట్టుకోవాలంటూ ఇటీవలి కాలంలో మార్కెటింగ్ కాల్స్ రావడం కొందరికి అనుభవమే. బీమా మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో ఈ ధోరణి ఏర్పడింది. కొత్త కస్టమర్ల కోసం మార్కెటింగ్ బృందాలు అన్ని మార్గాల్లోనూ జల్లెడ పడుతున్నాయి. అప్పటి వరకు అసలు ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేని కస్టమర్లకు హెల్త్ ప్లాన్ ఇవ్వడం మంచిదే. కానీ, ఇతర బీమా కంపెనీల కస్టమర్లను సైతం ఆకర్షించేందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి.‘‘పోర్ట్ పెట్టేసుకుని, మా కంపెనీ ప్లాన్లోకి మారిపోండి. మంచి ఫీచర్లు, మెరుగైన కవరేజీతో బీమా రక్షణ పొందండి’’ అంటూ ఆఫర్లు ఇస్తున్న ధోరణి కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి లక్ష్యాల్లో భాగంగా కొత్త కస్టమర్లను సంపాదించేందుకు కొందరు అనైతికంగానూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడే పోర్టింగ్ ఆప్షన్ను పరిశీలించాలి. చేదు అనుభవం..కేరళ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ (53)కు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్తో కానీ, బీమా కంపెనీతో కానీ అతడికి ఎలాంటి సమస్యల్లేవు. కానీ, ప్రముఖ ఆన్లైన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఒకరోజు కాల్ వచ్చింది. పాలసీని పోర్ట్ పెట్టుకోవాలంటూ మార్కెటింగ్ సిబ్బంది సూచించారు. మెరుగైన సదుపాయాలున్న ప్లాన్ను పోర్టింగ్తో పొందొచ్చంటూ ఆయన్ను ప్రోత్సహించారు. ‘‘11 ఏళ్ల నుంచి నాకు హెచ్డీఎఫ్సీ ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ ఉంది. అన్నేళ్లలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు.అయినా కానీ, పాలసీ ప్రీమియాన్ని గణనీయంగా పెంచేశారు. దీంతో మంచి ఫీచర్లున్న కొత్త పాలసీకి పోర్ట్ పెట్టుకోవాలంటూ పాలసీబజార్ కస్టమర్ కేర్ ప్రతినిధి నాకు సూచించారు’’అని కుమార్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కానీ, జరిగిన నష్టం ఏంటో ఆ తర్వాత కానీ తెలియలేదు. పోర్టింగ్ నిర్ణయం పట్ల కుమార్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కుమార్ పూర్వపు పాలసీలో రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్ ఉంది. మరో రూ.10 లక్షలకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) కూడా ఉంది. అంటే మొత్తం రూ.20 లక్షల బీమా రక్షణ ఉన్నట్టు. పాలసీ తీసుకుని 10–11 ఏళ్లు కావడంతో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్ నిబంధనలను కుమార్ అధిగమించేశారు. పాత పాలసీలోనే కొనసాగి ఉంటే ఎలాంటి క్లెయిమ్కు అయినా అర్హత కొనసాగేది. కానీ, పోర్టింగ్తో నో క్లెయిమ్ బోనస్ కొత్త పాలసీలోకి బదిలీ కాలేదు. పైగా ఒకే విడత మూడేళ్ల ప్రీమియంలను కుమార్తో కట్టించారు సదరు మార్కెటింగ్ సిబ్బంది. వారి సూచనతో సూపర్ టాపప్ ప్లాన్ కూడా కొనుగోలు చేశారు. పాలసీ కొనుగోలు తర్వాత సేవలు దారుణంగా ఉన్నాయని కుమార్ విచారించడం మినహా మరో మార్గం లేకపోయింది. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు అన్ని పోర్టింగ్ కేసుల్లోనూ తప్పనిసరిగా బదిలీ కావాలని లేదు. ఈ విషయంలో బీమా సంస్థల షరతులను అర్థం చేసుకోవాలి. పోర్టింగ్ ప్రక్రియ ఇలా..పోర్టింగ్ పెట్టుకోవాలంటే ప్రస్తుత పాలసీ రెన్యువల్ ఇంకా కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 60 రోజుల గడువు ఉందనగా ప్రక్రియ ప్రారంభించాలి. ఉదాహరణకు ఫిబ్రవరి 28న తదుపరి ప్రీమియం చెల్లించాల్సిన గడువు అనుకుంటే, మీరు రెండు నెలల ముందుగా డిసెంబర్ 31నుంచి ప్రారంభించొచ్చు. రెన్యువల్కు 30 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్నా కానీ, బీమా సంస్థ తన విచక్షణ మేరకు పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించొచ్చని ఐఆర్డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత బీమా కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వక్కర్లేదు. పోర్టింగ్తో ఏ కంపెనీ ప్లాన్లోకి వెళ్లాలనుకుంటున్నారో, ఆ కంపెనీని సంప్రదించాలి. పోర్టబులిటీ, ప్రపోజల్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.పోర్టింగ్ సమయంలో తాజా ఆరోగ్య సమాచారం మొత్తాన్ని వివరంగా వెల్లడించాల్సిందే. అప్పటి వరకు ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, లోగడ హెల్త్ క్లెయిమ్ల గురించి కూడా వెల్లడించాల్సి రావచ్చు. ఈ వివరాల ఆధారంగా రిస్క్ను మదింపు వేసి బీమా సంస్థ ప్రీమియంను నిర్ణయిస్తుంది. అవసరమైతే అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియంను పెంచొచ్చు.పోర్టింగ్ దరఖాస్తును కొత్త సంస్థ ఆమోదించి, పాలసీ జారీ చేసే వరకు పాత పాలసీని రద్దు చేసుకోవద్దు. ఎందుకంటే పాలసీదారు ఆరోగ్య చరిత్ర, రిస్క్, ఇతర అంశాల ఆధారంగా కొత్త సంస్థ ప్రీమియంను గణనీయంగా పెంచేస్తే అది అంగీకారం కాకపోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాల విషయంలోనూ కొత్త సంస్థ నిబంధనలు నచ్చకపోతే, పోర్టింగ్ అభ్యర్థనను ఉపసంహరించుకుని పాత సంస్థలో కొనసాగొచ్చు. ఆచరణ వేరు..ప్రస్తుత హెల్త్ ప్లాన్లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్ ఉందనుకోండి. దీనికి మరో రూ.10 లక్షలు నో క్లెయిమ్ బోనస్ తోడయ్యింది. అప్పుడు సదరు పాలసీదారు రూ.20 లక్షల క్లెయిమ్కు అర్హులు. పోర్టింగ్తో వేరే కంపెనీ ప్లాన్లోకి మారాలనుకుంటే.. అప్పుడు రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ పాత ప్లాన్లో మాదిరే రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్ను కొత్త సంస్థలోనూ ఎంపిక చేసుకుంటే.. రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ కోల్పోయినట్టు అవుతుంది.పోర్టింగ్తో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే అంత మొత్తానికి తాజా వెయిటింగ్ నిబంధన కొత్త సంస్థలోనూ అమలు కాదు. ముందస్తు వ్యాధులకు (పాలసీ తీసుకునే నాటికి) 3–4 ఏళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ క్లాజ్ ఉంటుంది. పాలసీ తీసుకుని అన్నేళ్ల పాటు రెన్యువల్ చేసుకున్న తర్వాతే, ఆయా వ్యాధుల తాలూకూ క్లెయిమ్లకు అర్హత లభిస్తుంది. కనుక ఒక ప్లాన్లో వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకునే ముందు సమ్ అష్యూరెన్స్ ఎంపికలో వివేకంతో వ్యవహరించాలి.ఐఆర్డీఏఐ ఉత్తర్వులు ఉన్నా...సమ్ అష్యూరెన్స్, నో క్లెయిమ్ బోనస్, నిర్దేశిత వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్కు సంబంధించిన అర్హతలను పోర్టింగ్తోపాటు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది ఆరంభంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కానీ, బీమా సంస్థలు తెలివిగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు.. ప్రస్తుత ప్లాన్లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్తో, అన్ని వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అధిగమించేసి ఉన్నారని అనుకుందాం.పోర్టింగ్ సమయంలో కొత్త సంస్థలో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాత ప్లాన్లో రూ.10 లక్షలకే వెయిటింగ్ పీరియడ్ను పూర్తి చేశారు కనుక, కొత్త సంస్థ కూడా అంతే మొత్తానికి ఆ ప్రయోజనాన్ని కొనసాగిస్తుంది. మరో రూ.10 లక్షల మొ త్తానికి అన్ని వెయిటింగ్ పీరియడ్లు తాజాగా అమల్లోకి వస్తాయని తెలుసుకోవాలి. దీనర్థం.. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి క్లెయిమ్ మొత్తం రూ.10 లక్షలు మించిన సందర్భాల్లో రూ.10 లక్షలకే పరిహారం పరిమితమవుతుంది.కుమార్ విషయంలో ఈ తప్పిదమే చోటుచేసుకుంది. పాత ప్లాన్లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్, రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ ఉన్నప్పటికీ.. పోర్ట్ తర్వాత రూ.10 లక్షలకే సమ్ అష్యూరెన్స్ను ఎంపిక చేసుకున్నారు. దీంతో నో క్లెయిమ్ బోనస్ కోల్పోవడమే కాకుండా, ఆ మొత్తానికి వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కోల్పోయినట్టు అయింది. పోర్టింగ్ ఏ సందర్భాల్లో..?ముఖ్యమైన కారణాలుంటేనే పోర్టింగ్ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఏజెంట్ల సూచన మేరకు పోర్టింగ్ చేసుకుంటే, ఇన్సూరెన్స్ పాలసీ ప్రపోజల్ పత్రంలో అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నాయేమో ఒక్కసారి ధ్రువీకరించుకోవాలి. చాలా సందర్భాల్లో ఏజెంట్లు అధిక కమీషన్ కోసం పోర్టింగ్ పేరుతో, తాజాగా పాలసీలు అంటగడుతుంటారు’’ అని హోలిస్టిక్ వెల్త్ సహ వ్యవస్థాపకుడు నిషాంత్ బాత్రా తెలిపారు. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ప్రీమియం తగ్గుతుందన్న ఆశతో పోర్టింగ్ పెట్టుకునే తప్పిదం చేయవద్దన్నది బాత్రా సూచన. పోర్టింగ్ ద్వారా వచి్చన పాలసీదారులను కొత్తవారిగానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. పోర్టింగ్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలో క్లెయిమ్కు వెళితే, అందులోని వాస్తవికతను అవి సందేహించే అవకాశం లేకపోలేదు. మరి పోర్టింగ్ ఏ సందర్భాల్లో పరిశీలించాలన్న సందేహం రావచ్చు. ప్రస్తుత ప్లాన్లో లేని మెరుగైన ఫీచర్లు కొత్త ప్లాన్లో వస్తుంటే, మరిన్ని వ్యాధులకు కవరేజీ లభిస్తుంటే, అవి తమకు ఎంతో ప్రయోజనకరమని భావిస్తే అప్పుడు పోర్టింగ్ను పరిశీలించొచ్చు.అలాగే, ప్రస్తుత ప్లాన్లో రూమ్ రెంట్ విషయంలో పరిమితులు ఉండి, పోర్టింగ్తో వెళ్లే ప్లాన్లో ఎలాంటి రూమ్ రెంట్ పరిమితులు లేనట్టయితే అప్పుడు కూడా ఈ ఆప్షన్ వినియోగించుకోవడం సరైనదేనని బాత్రా సూచించారు. ఇక ప్రస్తుత బీమా సంస్థ క్లెయిమ్ల పరంగా ఇబ్బందులు పెడుతుంటే, క్లెయిమ్ మొత్తంలో కోతలు పెడుతుంటే లేదా క్లెయిమ్ ఆమోదంలో చాలా జాప్యం చేస్తుంటే, కస్టమర్ సర్వీస్ విషయంలో సంతోషంగా లేకపోయినా కానీ పోర్టింగ్ సహేతుకమే. ఇవి తెలుసుకోవాలి..⇒ పోర్టింగ్తో పాత పాలసీలో పొందిన నో క్లెయిమ్, వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్ ప్రయోజనాలను కొత్త సంస్థ కూడా నిబంధనల మేరకు అందిస్తుందా? లేదా అన్నది ముందే ధ్రువీకరించుకోవాలి. ⇒ పాత కంపెనీలో ముందస్తు వ్యాధులకు 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ నిబంధనను పూర్తి చేశారని అనుకుందాం. పోర్టింగ్ తర్వాత కొత్త సంస్థ ప్లాన్లో వెయిటింగ్ పీరియడ్ 4 ఏళ్లుగా ఉంటే.. అప్పుడు మరో ఏడాది తర్వాతే క్లెయిమ్ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. ఒకవేళ పాత కంపెనీలో వెయిటింగ్ పీరియడ్ను సగమే పూర్తి చేసి ఉంటే, అప్పుడు కొత్త సంస్థలో నిబంధనల మేరకు మిగిలిన కాలానికి వెయిటింగ్ పీరియడ్ కొసాగుతుంది. ⇒ పోర్టింగ్కు ప్రీమియం ఒక్కదానినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే వయసు, ఆరోగ్య చరిత్ర వివరాల ఆధారంగా ఈ ప్రీమియం మారిపోవచ్చు. అధిక రిస్్కలో ఉన్నారని భావిస్తే బీమా సంస్థలు అధిక ప్రీమియంను నిర్ణయిస్తాయి. ⇒ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను నేరుగా బీమా సంస్థ నుంచి తీసుకున్నా, ఏజెంట్ సాయంతో తీసుకున్నా ప్రీమియంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. కొన్ని కంపెనీలు ఏ రూపంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ ఒక్కటే ప్రీమియం అమలు చేస్తున్నాయి. ⇒ పోర్టింగ్ తర్వాత అధిక సమ్ అష్యూరెన్స్ను ఎంపిక చేసుకోవచ్చు. మరింత సమ్ అష్యూరెన్స్ ఇవ్వడమా? లేదా అన్న దానిని అండర్రైటింగ్ నిబంధనల మేరకు బీమా కంపెనీలు నిర్ణయిస్తాయి. ⇒ అన్ని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ ఇండెమ్నిటీ పాలసీలకు పోర్టింగ్ అర్హత ఉంటుంది. ఇక గ్రూప్ హెల్త్ పాలసీల్లో కవరేజీ ఉన్న వ్యక్తులు, కుటుంబాలకు మాత్రం.. ఆ గ్రూప్ నుంచి తప్పుకున్నప్పుడు లేదా గ్రూప్ పాలసీలో మార్పులు చేసినప్పుడు (ప్రీమియం పెంపు సహా) లేదా గ్రూప్ పాలసీని ఉపసంహరించుకున్న సందర్భాల్లో పోర్టింగ్కు వీలు కల్పించాల్సి ఉంటుంది. ⇒ పోర్టింగ్ దరఖాస్తుపై 15 రోజుల్లో బీమా సంస్థ తన నిర్ణయాన్ని పాలసీదారునకు తెలియజేయాల్సి ఉంటుంది. పాత పాలసీలో ఉన్న కవరేజీకి తక్కువ కాకుండా బీమా రక్షణను కొత్త సంస్థ అందించాలి. -
బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!
ఆరోగ్యం, సంపద... ఏ మనిషి జీవితంలోనైనా ప్రధాన పాత్ర పోషించే అంశాలివి. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే... ఏమీ ప్రయోజనం ఉండదు. అదే... సంపద లేకపోయినా ఆరోగ్యం బాగుంటే చాలు... ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యం అత్యంత ప్రధానం అన్న విషయం దీన్నిబట్టి మనకు స్పష్టంగా తెలుస్తోంది.ఇవాళ్టి రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత తేలిక్కాదు. కోవిడ్ మన జీవితాల్ని ఎంత ప్రభావితం చేసిందో ఎరుకే.. అదీగాక... మారిన కాలమాన పరిస్థితుల్లో... ఎప్పుడు ఎలాంటి రోగాలు పుట్టుకొస్తాయి ఎవ్వరం చెప్పలేం. అప్పటిదాకా ఎంతో హాయిగా.. ఎలాంటి చీకూ చింతా లేకుండా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క అనారోగ్యం వాళ్ళ ఆర్ధిక పరిస్థితుల్ని తల్లకిందులు చేసేస్తోంది. అప్పటికప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తే... లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే.. చూస్తూ చూస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా... అంచేత అప్పో సొప్పో చేసి అయినా వైద్యం చేయిస్తాం.పల్లెలు పట్టణాలుగా, పట్నాలు నగరాలుగా మారిపోతూ ట్రాఫిక్ విచ్చలవిడిగా పెరిగిపోయి.. ఎప్పుడు ఏ ఆక్సిడెంట్ అవుతుందో... బయటకు వెళ్లిన మనిషి సురక్షితంగా వస్తాడో రాడో అంతుచిక్కని రోజులివి. ఇలా ఆకస్మికంగా తలెత్తే అనివార్య ఖర్చుల్ని తలెత్తుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటప్పుడే... మన చేతిలో ఆరోగ్య బీమా కార్డు ఉంటే... కొండంత ధైర్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లే. పైగా నేటి రోజుల్లో కుటుంబానికంతటికీ జీవిత బీమా తో పాటు, ఆరోగ్య బీమా ఉండటం అత్యవసరంగా మారిపోయింది. ఈనేపథ్యంలో ఆరోగ్య బీమా స్థితిగతులను ఓసారి పరిశీలిద్దాం.మనదేశంలో ఆరోగ్య బీమాను అందించే ప్రముఖ కంపెనీలు ఇవి.స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్కేర్ హెల్త్ ఇన్సూరెన్స్హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ తదవనివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీఅకో జనరల్ ఇన్సూరెన్స్టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్వైద్యం ఖరీదైన అంశంగా మారిపోయిన ఈరోజుల్లో మీరు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ మిమ్మల్ని వైద్య ఖర్చులనుంచి గట్టెక్కిస్తుంది.కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు పాలసీ తీసుకోవచ్చు.వయోపరిమితిని బట్టి ప్రీమియం రేట్లు ఉంటాయి. చిన్న వయసులో తక్కువ ప్రీమియం కే పెద్ద పాలసీ తీసుకోవచ్చు.ఏదైనా ఒక రోగంతో హాస్పిటల్ పాలైనప్పుడు ఆ వైద్యానికయ్యే ఖర్చుల్ని మనం ఎలాంటి నగదు చెల్లించనక్కర్లేకుండా పొందవచ్చు. మనం పాలసీ తీసుకునే ముందు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.వీటిలో అత్యంత ప్రధానమైంది మనం బీమా తీసుకునే సంస్థ ఏయే హాస్పిటల్స్ తో అనుసంధానం అయివుందో తెలుసుకోవడం.అంటే దేశవ్యాప్తంగా ప్రముఖ హాస్పిటల్స్ తో పాటు, స్థానిక హాస్పిటల్స్ లో కూడా వైద్యం చేయించుకోవడానికి వీలుగా కవరేజ్ కలిగి ఉండాలి.ఒక రోగానికి సంబంధించి హాస్పిటల్ లో జాయిన్ కావడానికి ముందు 30 రోజులు, డిశ్చార్జ్ అయ్యాక 30 రోజుల పాటు వైద్య ఖర్చులు పొందే సౌలభ్యాన్ని వివిధ బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందు వాటి వివరాలు తెలుసుకోవాలి.మనం తీసుకునే పాలసీ కి చెల్లించే ప్రీమియానికి కొంచెం అదనంగా చెల్లించడం ద్వారా పర్సనల్ ఆక్సిడెంట్ కవర్, క్రిటికల్ ఇల్నెస్ కవర్ వంటి వాటిని కూడా ఎంచుకోవాలి.యాక్సిడెంట్ అయ్యి... ప్రాణాపాయం తప్పి శాశ్వత అంగ వైకల్యానికి లోనైతే... అడిషనల్ రైడర్స్ తీసుకోవడం వల్ల పెన్షన్ మాదిరి నెలనెలా (మన సమ్ అష్యురెడ్ ని బట్టి) సొమ్ములు పొందవచ్చు. సాధారణంగా వృద్ధాప్యానికి మరోపేరే అనారోగ్యం. కాబట్టి కచ్చితంగా ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు వయోపరిమితితో సంబంధం లేకుండా.. ఎంత వయసువారైనా బీమా పాలసీ లు తీసుకోవడానికి ఐఆర్డీఏ వెసులుబాటు కల్పించింది. ఇది సీనియర్ సిటిజెన్లకు వరమనే చెప్పాలి. అలాగే ఒకే ప్రీమియం తో మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమా రక్షణ కల్పించే విధంగా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.పాలసీ తీసుకునే టైం కే రోగాలు ఉన్నా కూడా వాటిని కవర్ చేస్తూ బీమా సదుపాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే సమయంలో ఏయే బీమా సంస్థలు ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ను పేర్కొంటున్నాయో తెలుసుకోవాలి.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డ్ కింద మనం కట్టే ప్రీమియానికి (షరతులకు లోబడి) రూ. 25,000 నుంచి రూ.75,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.సాధారణంగా 24 గంటలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే పాలసీ వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని సంస్థలు అవుట్ పేషెంట్ గా చేయించుకునే వైద్యానికయ్యే ఖర్చులను కూడా బీమా కవరేజ్ లోకి తీసుకుంటున్నాయి. అంతేకాదు... ప్రత్యేకించి ఓపీ చికిత్సల కోసమే ఉపయోగపడే విధంగా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.ఎలాంటి ఆరోగ్య సేవలు పొందవచ్చు, ప్రీమియంలు ఎలా ఉంటాయి ఇత్యాది అంశాలను మరోసారి చర్చించుకుందాం.-బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
ఆరోగ్య బీమా ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో..
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే, ఆసుపత్రుల కార్పొరేటీకరణ కారణంగా దేశీయంగా ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం ఆసియా మొత్తం మీద భారత్లో ఇందుకు సంబంధించిన ద్రవ్యోల్బణం అత్యధికంగా 14 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పెరిగే వైద్య చికిత్స వ్యయాల భారాన్ని తట్టుకునేందుకు ఆరోగ్య బీమా అనేది ఎంతగానో ఉపయోగపడే సాధనంగా ఉంటోంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం, ఆర్థికంగా ఆదా చేసుకోవడం రెండూ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ పథకాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. పటిష్టమైన ఆరోగ్య బీమా పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీదారులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకోవచ్చు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఆరోగ్య బీమా పథకాలు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని: నగదురహిత చికిత్స: పాలసీదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం తమ పాలసీ నంబరును ఇచ్చి, వైద్య చకిత్సలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. మెడికల్ ఎమర్జెన్సీల్లో పాలసీదారును ఇబ్బంది పెట్టకుండా బిల్లులను నేరుగా బీమా కంపెనీతో ఆసుపత్రి సెటిల్ చేసుకుంటుంది. నో క్లెయిమ్ బోనస్: క్లెయిమ్లేమీ చేయని పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు చాలా కంపెనీలు నో–క్లెయిమ్ బోనస్ను ఆఫర్ చేస్తున్నాయి. తదుపరి సంవత్సరంలో ప్రీమియంను తగ్గించడమో లేదా సమ్ అష్యూర్డ్ను పెంచడం రూపంలోనో ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. టాప్–అప్, సూపర్ టాప్–అప్ ప్లాన్లు: బేసిక్ సమ్ ఇన్సూర్డ్ పరిమితి అయిపోతే, అదనంగా కవరేజీని పొందేందుకు టాప్–అప్, సూపర్ టాప్–అప్ ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చులో అదనంగా కవరేజీని పొందేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. వెల్నెస్, ప్రివెంటివ్ కేర్: బీమా సంస్థలు వెల్నెస్, ప్రివెంటివ్ కేర్పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పాలసీదారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ఈ ప్రోగ్రాంల కింద ఉచితంగా హెల్త్ చెకప్లు, జిమ్ మెంబర్షిప్లు, డైట్ కౌన్సిలింగ్ మొదలైనవి అందిస్తున్నాయి. తద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించేలా బీమా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా కవరేజీ: పాలసీదారులు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కవరేజీని తీసుకునే విధంగా ఆధునిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉంటున్నాయి. వీటికి అదనంగా రక్షణ కోసం రైడర్లను జోడించుకోవడం కావచ్చు లేదా నిర్దిష్ట కవరేజీ ఆప్షన్లను ఎంచుకోవడం కావచ్చు పాలసీదారులకు కొంత వెసులుబాటు ఉంటోంది. -
3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్పై క్లారిటీ
పాలసీదారుల కీలక సమాచారం లీక్ కావడంతో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ తన భద్రతను పటిష్టం చేసుకునేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఈ తరహా డేటా లీకేజీ ఘటన మరోసారి చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్రాయ్ తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్లో జరిగిన డేటా లీకేజీ ఘటనలో 3.1 కోట్ల స్టార్ హెల్త్ కస్టమర్ల మొబైల్ ఫోన్, పాన్, చిరునామా తదితర సున్నిత సమాచారం బయటకు రావడం గమనార్హం. షెంజెన్ అనే హ్యాకర్ ఈ సమాచారాన్ని ఏకంగా ఒక పోర్టల్లో విక్రయానికి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సిందే..‘ఒకరితో ఒకరు అనుసంధానమై పనిచేయాల్సిన ప్రపంచం ఇది. ఏజెంట్లు, ఆసుపత్రులు, బీమా కంపెనీలు అన్ని అనుసంధానమై పని చేసే చోట తమ వంతు రక్షణలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. బలహీన పాస్వర్డ్లు తదితర వాటిని హ్యాకర్లు సులభంగా గుర్తించగలరు. కేవలం అంతర్గతంగానే కాకుండా, స్వతంత్ర నిపుణుల సాయంతో మేము ఇందుకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకున్నాం’ అని ఆనంద్రాయ్ వివరించారు. ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయంటూ, బీమా కంపెనీలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: ట్రెండింగ్లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..అసలేం జరిగింది..?స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి ఉంచినట్లు గతంలో గుర్తించారు. స్టార్ హెల్త్ ఇండియాకు చెందిన కస్టమర్ల అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే అందించిందని హ్యాకర్ షెంజెన్ క్లెయిమ్ చేయడం గమనార్హం. మద్రాస్ హైకోర్ట్ ఆదేశాల మేరకు స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులతో ఫోరెన్సిక్ దర్యాప్తు చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?
బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించడంతోపాటు బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను పెంచకూడదని ప్రచార కార్యక్రమాలు సాగనున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా జీవిత బీమా ఉద్యోగుల సంఘం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.నరసింహన్ పేర్కొన్నారు.బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు, బీమా కంపెనీల్లో ఎఫ్డీఐ పెట్టుబడుల పరిమితులను కట్టడి చేయాలనే డిమాండ్తోపాటు కొత్త కార్మిక విధానాల (న్యూ లేబర్ కోడ్) ఉపసంహరణకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు నరసింహన్ చెప్పారు. 2010 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం అమలవుతోంది. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలనే డిమాండ్లను కూడా లేవనెత్తనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: జీడీపీ మందగమనంబీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కల్పించనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ప్రీమియంపై ట్యాక్స్ మినహాయించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్డీఐకు అనుమతి ఉంది. దీన్ని 100 శాతానికి పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ బీమా రంగంపై విదేశీ ఇన్వెస్టర్ల విధానాలు అమలవుతాయి. దాంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆరోగ్య బీమా.. పాలసీ సంస్థ మారుతున్నారా?
మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోంది. ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది ఆరోగ్య బీమాను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ ప్రస్తుతం మారుతున్న విధానాలకు అనుగుణంగా లేకపోవచ్చు. మార్కెట్లో పోటీ నెలకొని ఇతర కంపెనీలు తక్కువ ప్రీమియంతో మరింత మెరుగైనా సదుపాయాలుండే పాలసీని అందిస్తుండవచ్చు. అలాంటి సందర్భంలో పాలసీను రద్దు చేసుకోకుండా ‘పోర్టబిలిటీ’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల పాలసీను వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీని పెంచడానికి, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ‘పోర్టబిలిటీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వెయిటింగ్ పీరియడ్ను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య బీమా పాలసీని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు.ప్రస్తుత పాలసీ నిబంధనలు, షరతులు మీ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు పోర్ట్కు ప్రయత్నించాలి.పాలసీ చెల్లించే విలువ తక్కువగా ఉంటూ, ప్రీమియం అధికంగా ఉన్నప్పుడు పోర్ట్ను పరిశీలించవచ్చు. అయితే అందులో అధిక క్లెయిమ్ ఇచ్చే సంస్థలను ఎంచుకుంటే ఉత్తమం.స్థానిక ఆసుపత్రులు బీమా సంస్థ నెట్వర్క్ కవరేజ్ జాబితాలో లేనప్పుడు ఈ విధానాన్ని పరిశీలించాలి.ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పాలసీ రెన్యువల్ చేయడానికి 45 రోజుల ముందే అవసరమైన చర్యలు ప్రారంభించాలి.ప్రస్తుతం చాలా సంస్థలు రెన్యువల్కు ఒక రోజు ముందు, పాలసీ గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పోర్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.పోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మేలు.తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత కొత్త సంస్థ పాలసీని ఇవ్వలేమంటే ఇబ్బందులు ఎదురవుతాయి.గమనించాల్సినవి..పాలసీని పోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు ప్రధానంగా బీమా మొత్తంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక బీమా సంస్థలో రూ.5లక్షల పాలసీ ఉందనుకుందాం. బోనస్తో కలిపి ఈ మొత్తం రూ.7.50లక్షలు అయ్యింది. కొత్త బీమా సంస్థకు మారి, రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు కొత్త సంస్థ రూ.7.5 లక్షల వరకే పాత పాలసీగా భావిస్తుంది. మిగతా రూ.2.5 లక్షలను కొత్త పాలసీగానే పరిగణిస్తుంది. ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనికి ఇతర షరతులూ వర్తిస్తాయి.ఇదీ చదవండి: 13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్వివరాలు అన్నీ తెలపాలి..కొత్త సంస్థకు మారేటప్పుడు ఇప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లెయిమ్ వివరాలు స్పష్టంగా చెప్పాలి. ఆరోగ్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించీ వివరించాలి. పాలసీ ఇవ్వరు అనే ఆలోచనతో చాలామంది ఇవన్నీ చెప్పరు. కానీ, పాలసీ వచ్చిన తర్వాత ఇవి బయటపడితే పరిహారం లభించదు. -
‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో అనారోగ్యాలు పెరుగుతున్నాయి. దాంతో వైద్య ఖర్చులు అధికమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో వైద్య ఖర్చులకు బీమా మొత్తం సరిపోకపోవచ్చు. కాబట్టి కొంత ‘ఆరోగ్య నిధి’ని సైతం ప్రత్యేకంగా సమకూర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్య బీమా సరిపోనట్లయితే అత్యవసర నిధిని ఉపయోగించాల్సి రావొచ్చు. దాంతోపాటు అప్పు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పటివరకు చేసిన పొదుపు, పెట్టుబడులు కరిగిపోకుండా ఇది రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రత్యేక అనారోగ్య పరిస్థితులున్నవారు ఈ నిధిని తప్పకుండా సిద్ధం చేసుకోవాలి.ఈ నిధి ఎందుకంటే..ఆరోగ్య బీమా పాలసీలో కేవలం వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు మాత్రమే అందిస్తారు. కానీ వైద్యేతర ఖర్చులు పాలసీదారులే భరించాలి. ఒకేవేళ పాలసీ తీసుకునే సందర్భంలో కో-పే(కొంత పాలసీ కంపెనీ, ఇంకొంత పాలసీదారు చెల్లించే విధానం) ఎంచుకుంటే మాత్రం వైద్య ఖర్చుల్లో కొంత పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. వైద్యం పూర్తవ్వకముందు, వైద్య పూర్తయిన తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.చిన్నపాటి ఖర్చుల కోసం..అత్యవసర పరిస్థితులకు ఆరోగ్య బీమా సరిపోతుంది. అయినప్పటికీ కొద్ది మొత్తంలో వైద్య నిధిని ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు రూ.15వేల లోపు వైద్య బిల్లులు అయితే దానికోసం ఆరోగ్య బీమాను వినియోగించకపోవడమే మేలు. ఒకవేళ క్లెయిమ్ చేస్తే పాలసీ రిన్యువల్ సమయంలో వచ్చే అదనపు బోనస్ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగని అప్పుచేసి ఆ ఖర్చులు భరించాలని కాదు. అందుకే ఇలాంటి ఖర్చుల కోసం సొంతంగా ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!ఎంత ఉండాలంటే..ఈ నిధి ఎంత మొత్తం అవసరం అనేదానికి కచ్చితమైన అంచనాలేం లేవు. మీ జీవినశైలి, మీరున్న ప్రాంతంలో ఖర్చులు, నెలవారీ మిగులుపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు సొంతంగా భరించాలి. కాబట్టి అందుకు అనుగుణంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, ఈ నిధిని సొంతంగా నిర్ణయించుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీలో కో-పే లేకపోతే రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అత్యవసర ఆరోగ్య నిధి ఉంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. -
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
దివ్యాంగులకు ఆరోగ్య బీమా.. ఈ 5 తప్పిదాలు చేయొద్దు
సరైన ఆరోగ్య బీమా పథకమనేది దివ్యాంగులకు ఒక రక్షణ కవచంలాంటిది. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా తగిన పథకాన్ని తీసుకోగలిగితే ఆర్థిక భద్రత లభిస్తుంది. అయితే, సరైన బీమా పథకాన్ని ఎంచుకోవడంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. అర్థం కాని పరిభాష, పైకి కనిపించని నిబంధనలు, అనేకానేక ఆప్షన్లు మొదలైన వాటితో ఇదో గందరగోళ వ్యవహారంగా ఉంటుంది.ఒక్క చిన్న తప్పటడుగు వేసినా సరైన కవరేజీ లేకుండా పోవడమో, ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావడమో లేక అత్యవసర పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురుకావడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దివ్యాంగులు ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు నివారించతగిన తప్పిదాలపై అవగాహన కల్పించడం ఈ కథనం ఉద్దేశం. అవేమిటంటే..కీలక వివరాలను పట్టించుకోకపోవడం: ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు స్పష్టంగా కనిపించే కీలక విషయాలను కూడా అంతగా పట్టించుకోకపోవడమనేది సాధారణంగా చేసే తప్పిదాల్లో ఒకటిగా ఉంటుంది. దివ్యాంగుల విషయానికొస్తే, పాలసీలోని ప్రతి చిన్న అంశమూ ఎంతో ప్రభావం చూపేదిగా ఉంటుంది. కాబట్టి అన్ని నియమ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, పరిమితులు మొదలైన వాటి గురించి జాగ్రత్తగా చదువుకోవాలి.నిర్దిష్ట అనారోగ్యాలు, చికిత్సలకు బీమా వర్తించకుండా మినహాయింపుల్లాంటివేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలాంటి వివరాలను పట్టించుకోకపోతే ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావచ్చు లేదా క్లెయిమ్ పూర్తి మొత్తం చేతికి రాకపోవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు.కేవలం ప్రీమియంనే ప్రాతిపదికగా ఎంచుకోవడం:ప్రీమియం అనేది ముఖ్యమైన అంశమే అయినప్పటికీ కేవలం ప్రీమియం తక్కువగా ఉందనే ఆలోచనతో పథకాన్ని ఎంచుకుంటే చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. సాధారణంగా ప్రీమియంలు తక్కువగా ఉంటే మన జేబు నుంచి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సి రావచ్చు.కవరేజీ పరిమితంగానే ఉండొచ్చు లేదా దివ్యాంగుల నిర్దిష్ట అవసరాలకు బీమా ఉపయోగపడని విధంగా పరిమితుల్లాంటివి ఉండొచ్చు. ప్రీమియం కాస్త ఎక్కువైనప్పటికీ గణనీయంగా మెరుగైన కవరేజీని ఇచ్చే పథకాన్ని ఎంచుకుంటే మంచిది. దీనివల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా కావడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా మెరుగ్గా ఉంటుంది.కో–పే, సబ్–లిమిట్స్ తెలుసుకోకపోవడం: క్లెయిమ్ చేసేటప్పుడు చేతికి వచ్చే మొత్తంపై కో–పే, సబ్–లిమిట్స్ అనే కీలకాంశాలు చాలా ప్రభావం చూపుతాయి. కో–పే అనేది క్లెయిమ్ సమయంలో పాలసీదారు తాను భరించేందుకు అంగీకరించే నిర్దిష్ట శాతాన్ని తెలియజేస్తుంది. కో–పే పరిమితులు ఎంత ఎక్కువగా ఉంటే బీమా కంపెనీ చెల్లించే క్లెయిమ్ పేఅవుట్ అంత తక్కువవుతుంది.అలాగే, సబ్–లిమిట్స్ అనేవి నిర్దిష్ట అనారోగ్యాలు లేక చికిత్సలు, అంటే ఉదాహరణకు క్యాటరాక్ట్, మోకాలి మార్పిడి మొదలైన వాటికి వర్తించే కవరేజీ మొత్తాన్ని ఒక స్థాయికి పరిమితం చేస్తాయి. ఈ పరిమితులను చూసుకోకపోతే జేబుకు గణనీయంగా చిల్లు పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్ను పరిగణనలోకి తీసుకోకపోవడం: కాలం గడిచే కొద్దీ ఆరోగ్య అవసరాలు మారుతుంటాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకునే ప్లాన్ను ఎంచుకోవడం కీలకం. దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి అదనపు సంరక్షణ లేక విభిన్నమైన చికిత్సలు అవసరమవుతాయి. ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు, ప్రస్తుత అవసరాలు మాత్రమే కాకుండా భవిష్యత్లో తలెత్తే అవకాశము న్న అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.వివిధ ఆప్షన్లను పరిశీలించకపోవడం: ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు కనిపించిన మొదటి పథకాన్ని తీసేసుకోకుండా వివిధ ప్లాన్లను పరిశీలించి చూసుకోవాలి. కవరేజీ, ఖర్చులు, ప్రొవైడర్ నెట్వర్క్లు, అదనపు ప్రయోజనాలపరంగా వివిధ పథకాల్లో మార్పులు ఉంటాయి. పలు ప్లాన్లను పోల్చి చూసుకునేందుకు కాస్త సమయం వెచ్చించాలి. దివ్యాంగులకు సంబంధించి ఒక్కో ప్లాన్లో కవరేజీ ఏ విధంగా ఉందనేది పరిశీలించి చూసుకోవాలి.ఇందుకోసం కంపారిజన్ వెబ్సైట్ల వంటి సాధనాలను ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే బీమా అడ్వైజర్ల సలహా తీసుకోవాలి. ప్లాన్ వివరాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇలాంటి విధానాన్ని పాటిస్తే అవసరాలకు తగినట్లుగా ఉండే సమగ్రమైన, చౌకైన పథకాన్ని ఎంచుకోవడానికి వీలవుతుంది. స్థూలంగా చెప్పాలంటే, పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్నంగా చదువుకోవాలి. ప్రీమియం మాత్రమే చూసుకోవద్దు. కవరేజీ పరిమితులను పరిశీలించుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్లాన్ చేసుకోవాలి. వివిధ ఆప్షన్లను పోల్చి చూసుకోవాలి. -
గిగ్ వర్కర్లకూ ‘ఈ–శ్రమ్’తో భద్రత
సాక్షి, అమరావతి: ‘విజయవాడకు చెందిన సంతోశ్కు తాను చేస్తున్న ఉద్యోగంలో వచ్చే నెల జీతం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రైడ్ యాప్ల గురించి తెలుసుకుని పార్ట్టైమ్గా పనిచేసేందుకు వాటిలో రిజిస్టర్ చేయించుకున్నాడు. సంతోశ్ను ఒక వ్యక్తి తనను ఎయిమ్స్ వరకు తీసుకెళ్లాలని యాప్ ద్వారా సంప్రదించాడు. సరేనని తీసుకెళ్లాక.. నిర్మానుష్య ప్రదేశంలో సంతోశ్పై దాడిచేసి సెల్ఫోన్, నగదు, బంగారం దోచుకెళ్లాడు. ఆ షాక్ నుంచి బయటపడటానికి సంతోశ్కు చాలా కాలం పట్టింది’.. ఇది కేవలం ఒక్క సంతోశ్ అనుభవం మాత్రమే కాదు.. వేలాది మంది గిగ్ వర్కర్లు నిత్యం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా తగిన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమాతో పాటు ఎన్నో ప్రయోజనాలుమన దేశంలో ప్రస్తుతం 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు పెరుగుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా. ఒక్కో కార్మికుడు వారానికి ఐదు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తే నెలకు దాదాపు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు సంపాదించవచ్చు. అయితే వీరికి సామాజిక భద్రత అనేది ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోంది. అందుకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించింది. అందులో భాగంగా ముందుగా గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్య బీమా లభిస్తుంది. నిరుద్యోగ భృతి, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా వంటి ఇతర సౌకర్యాలూ లభిస్తాయని కేంద్రం చెబుతోంది. కార్మికుల వివరాలు నమోదు చేయాల్సిందిగా ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత ఆన్లైన్ ప్లాట్ఫామ్ సంస్థలకు కేంద్రం సూచించింది. నమోదు ఇలా.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డ్–2024ను ప్రారంభించింది. దరఖాస్తుదారులందరికీ రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ–శ్రమ్ కార్డు సహాయంతో 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.3,000 పెన్షన్ కూడా లభిస్తుంది. ఆన్లైన్లో eshram.gov.in ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చు. పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, పాన్, రేషన్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, తాజా విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్బుక్, ఐఎఫ్ఎస్సీ కోడ్తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దరఖాస్తుకు సంబంధించి ఏదైనా సహాయం కోసం ఫోన్ నంబర్ 011–23710704ను సంప్రదించవచ్చు. -
ఐదు కొత్త రైడర్లు.. 60కి పైగా ప్రయోజనాలు: టాటా ఏఐజీ
రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్టుల సమగ్రతను పెంచడమే లక్ష్యంగా భారతదేశపు అగ్రగామి సంస్థ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. కొత్తగా 60 పైగా ప్రయోజనాలను అందించే అయిదు రైడర్లను ఆవిష్కరించింది. వైద్య ఖర్చులు పెరుగుతూ, ఆరోగ్య సంరక్షణ అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఆరోగ్యం మీద తలెత్తుతున్న సరికొత్త ఆందోళనలు, జీవన విధానాల్లో మార్పుల సమస్యలను పరిష్కరించేలా ఈ రైడర్లు వ్యక్తిగత అవసరాలకు అనుగణంగా డిజైన్ చేశారు.కస్టమర్లకు వినూత్నమైన, సందర్భోచితమైన సొల్యూషన్స్ అందించడం ద్వారా ఆరోగ్య బీమా రంగంలో పురోగతి సాధించడంపై టాటా ఏఐజీకి గల నిబద్ధతకు ఈ ఆవిష్కరణలు నిదర్శనంగా నిలుస్తాయి. కంపెనీ ఆవిష్కరించిన కొత్త రైడర్లలో మెంటల్ వెల్బీయంగ్, ఎంపవర్హర్, ఓపీడీ కేర్, క్యాన్కేర్, ఫ్లెక్సీ షీల్డ్ ఉన్నాయి. ఇవి మానసిక ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ కేర్ వంటి క్రిటికల్ హెల్త్కేర్ అవసరాలను తీర్చేవిగా రూపొందాయి.ఎంపవర్హర్ రైడర్ అనేది మహిళల్లో వంధ్యత్వం, పీసీవోఎస్, ఇతరత్రా జననేంద్రియ సమస్యల్లాంటి వాటికి సమగ్రమైన పరిష్కారం అందించడం లక్ష్యంగా తయారైంది. ఇక మెంటల్ వెల్బీయింగ్ అనేది పరిశ్రమలోనే తొలిసారిగా మెంటల్ హెల్త్ ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ అండ్ రీహాబిలిటేషన్ కవరేజీని అందిస్తుంది. క్యాన్కేర్ రైడర్ అనేది క్యాన్సర్ సంబంధ రక్షణ కల్పిస్తుంది. పెరుగుతున్న వైద్య వ్యయాలు, రోజువారీ ఆరోగ్య ఖర్చుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించే విధంగా ఓపీడీ కేర్, ఫ్లెక్సీ షీల్డ్ అనేవి ఉంటాయి.మెరుగ్గా క్లెయిమ్స్ ప్రక్రియకస్టమర్ల నమ్మకాన్ని పెంచడానికి కీలకమైన క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రక్రియను టాటా ఏఐజి గణనీయంగా మెరుగుపరుచుకుంది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 67.7 శాతంగా ఉన్న క్యాష్లెస్ క్లెయిమ్స్ వినియోగం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 76.95 శాతానికి పెరిగింది. 96 శాతం క్యాష్లెస్ క్లెయిమ్స్ నాలుగు గంటల్లోనే ప్రాసెస్ చేస్తున్నారు. 85 శాతం రీయింబర్స్మెంట్ క్లెయిమ్లు అయిదు రోజుల వ్యవధిలోగానే సెటిల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో అంతటా క్యాష్లెస్ విధానాన్ని 100% అమలు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.కస్టమర్లకు సంతృప్తికరంగా సేవలు అందించడం, సమర్ధమైన పనితీరు విషయాల్లో పరిశ్రమలోనే కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ వేగవంతమైన, నిరాటంకమైన విధంగా సేవలు అందించడంలో టాటా ఏఐజీకి గల నిబద్ధతకు ఈ మెరుగుదలలు నిదర్శనంగా నిలుస్తాయి.నెట్వర్క్ విస్తరణదేశవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు టాటా ఏఐజి తన నెట్వర్క్ను గణనీయంగా విస్తరించింది.గడిచిన 18 నెలల్లో 64 శాతం మేర పెంచుకోవడం ద్వారా భారతదేశవ్యాప్తంగా 11,700 పైచిలుకు నెట్వర్క్ హాస్పిటల్స్తో టాటా ఏఐజీ తన కార్యకాలాపాలు విస్తరించింది. ముఖ్యంగా సేవలు అంతగా అందని ప్రాంతాల్లో కూడా సర్వీసులను విస్తరించేందుకు కట్టుబడి ఉంది. 5,000 మంది కంటే ఎక్కువ డాక్టర్లు, 3,000 పైగా డయాగ్నోస్టిక్ ప్రొవైడర్లు గల ఓపీడీ నెట్వర్క్ అనేది 10 పైగా భాషల్లో పటిష్టమైన టెలీకన్సల్టేషన్ సర్వీసు మద్దతుతో కస్టమరుకు మరింత సౌకర్యవంతంగా సమగ్రమైన హెల్త్కేర్ కవరేజీ అందేలా తోడ్పడుతోంది.ఆరోగ్య బీమా విభాగంలో వేగవంతమైన వృద్ధిని సాధించే దిశగా మా వ్యూహంలో భాగంగా ఈ రైడర్లు ఆవిష్కరించాము. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో విస్తరించడంపై మేము మరింతగా దృష్టి పెడుతున్నాం. ఈ ప్రాంతాల్లో హెల్త్కేర్ యాక్సెస్, అవగాహన వేగంగా పెరుగుతోంది. మా శాఖల నెట్వర్క్, ఏజంట్లు, హాస్పిటల్ భాగస్వాముల సంఖ్యను పెంచుకోవడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత మందికి అందుబాటులోకి తేవాలని మేము నిర్దేశించుకున్నాం. ఆరోగ్య బీమా విభాగంలో ఇదే మా వృద్ధి అంచనాలకు తోడ్పడనుందని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్-ఏజెన్సీ ప్రతీక్ గుప్తా అన్నారు.220 ప్రాంతాల్లో, 11,700+ ఆస్పత్రుల నెట్వర్క్తో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తూనే ఆరోగ్య బీమా రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు టాటా ఏఐజీ కట్టుబడి ఉంది.రైడర్ల ప్రత్యేకతలుఎంపవర్హర్: పీసీవోఎస్, వంధ్యత్వం, గైనకాలజీ అంశాలు, మహిళల్లో వచ్చే క్యాన్సర్లతో పాటు మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సమగ్రమైన కవరేజీనిచ్చే విధంగా ఈ రైడర్ తయారైంది. సర్వికల్ క్యాన్సర్ టీకాల్లాంటి ప్రివెంటివ్ కేర్ కవరేజీలను కూడా ఇది అందిస్తుంది.మెంటల్ వెల్బీయింగ్: ముందస్తుగానే గుర్తించి, సకాలంలో చికిత్సను అందించడంలో తోడ్పడే విధంగా, పరిశ్రమలోనే తొలిసారిగా ప్రివెంటివ్ మెంటల్ హెల్త్ స్క్రీనింగ్స్, సైకలాజికల్ థెరపీ, రీహ్యాబిలిటేషన్ సర్వీసులు సహా మానసిక ఆరోగ్య సమస్యలకు కవరేజీని అందిస్తుంది.క్యాన్కేర్: నిర్దిష్ట తీవ్రత గల క్యాన్సర్ ఉన్నట్లుగా వైద్యపరీక్షల్లో వెల్లడైన పక్షంలో సమ్ ఇన్సూర్డ్ను ఏకమొత్తంగా చెల్లించే విధంగా విస్తృతమైన క్యాన్సర్ కవరేజీని అందిస్తుంది.ఓపీడీ కేర్: డాక్టర్ కన్సల్టేషన్స్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లులు, కంటి చూపు సంరక్షణ వంటి అవుట్పేషంట్ ఖర్చులకు కవరేజీనిస్తుంది. తద్వారా రోజువారీ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడంలో తోడ్పాటు అందిస్తుంది.ఫ్లెక్సీ షీల్డ్: వైద్యపరమైన ద్రవ్యోల్బణం నుంచి పాలసీదార్లకు రక్షణ కల్పించే విధంగా డిజైన్ చేశారు. రిస్టోర్ ఇన్ఫినిటీ+ ద్వారా సమ్ ఇన్సూర్డ్ను అపరిమితంగా రిస్టోర్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్లేషన్ షీల్డ్ కింద సమ్ ఇన్సూర్డ్ పెంపుదలతో పెరిగే వైద్య వ్యయాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ సెకండ్ ఒపీనియన్, ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధి/వ్యాధులకు డే 31 కవరేజీ, ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్ క్యాష్తో పాటు మరెన్నో ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుంది. -
బీమాపై జీఎస్టీ కోతకు ఓకే!
న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ పట్ల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విస్తృత ఏకాభిప్రాయం వచి్చంది. దీనిపై వచ్చే నెల చివర్లోగా నివేదిక సమర్పించాలని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన గల మంత్రుల బృందాన్ని (జీవోఎం) కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ నివేదిక అందిన తర్వాత దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో బీమా పాలసీలపై ప్రీమియం తగ్గింపు ప్రధానంగా చర్చకు వచి్చంది. నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండడంతో పన్ను రేటు తగ్గింపు పట్ల చాలా రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కలి్పంచనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సరీ్వస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. కేన్సర్ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు: కొన్ని రకాల కేన్సర్ ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి.. కేదార్నాథ్ తదితర పర్యటనల కోసం వినియోగించుకునే హెలికాప్టర్ సేవలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. చార్టర్ హెలీకాప్టర్లపై ఎప్పటి మాదిరే 18 శాతం జీఎస్టీ అమలు కానుంది. ఆన్లైన్ గేమింగ్పై 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతం జీఎస్టీని అమలు చేయడం వల్ల ఆదాయం 412 శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. విదేశీ ఎయిర్లైన్స్ సంస్థలు దిగుమతి చేసుకునే సేవలపై జీఎస్టీని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. -
జీఎస్టీ తగ్గింపు.. కౌన్సిల్ కీలక నిర్ణయాలు
జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని క్యాన్సర్ మందులపై రేట్లను తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య బీమాపై రేటు తగ్గింపు అంశం వాయిదా పడింది. నవంబర్లో జరిగే తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీతారామన్.. కొన్ని క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. అలాగే నామ్కీన్ స్నాక్స్పైన కూడా జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. రీసెర్చ్ ఫండ్పై జీఎస్టీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకోగా కారు సీట్లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.గత ఆరు నెలల్లో ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం 412 శాతం పెరిగి రూ. 6,909 కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీంతో పాటు గత ఆరు నెలల్లో క్యాసినోల ద్వారా ఆదాయం 34 శాతం పెరిగిందన్నారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటు తగ్గింపుపై కొత్త మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని, ఇది అక్టోబర్ చివరి నాటికి తమ నివేదికను సమర్పిస్తుందని సీతారామన్ చెప్పారు. -
ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..
జీవనశైలిలో మార్పు, విభిన్న ఆహార అలవాట్లతో అనారోగ్యబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉందనే ధీమాతో ఆసుపత్రిలో చేరిన కొందరి క్లెయిమ్లను కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. అయితే బీమా తీసుకునే సమయంలోనే పాలసీదారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఇలా క్లెయిమ్ అందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్ ఎలాంటి పరిస్థితుల్లో తిరస్కరిస్తారు.. అలా కంపెనీలు క్లెయిమ్లు తిరస్కరించకూడదంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం.బీమా పాలసీ డాక్యుమెంట్లు గతంలో సామాన్యులకు అర్థంకాని కఠిన పదాలతో ఉండేవి. కానీ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీ పత్రాలు సరళమైన భాషలో ఉండాలని ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అన్ని కంపెనీలు అందరికీ అర్థమయ్యే విధంగా పాలసీ పత్రాలను వెల్లడిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ జారీ చేస్తుంటాయి. అయితే వాటిని సరిగా అర్థం చేసుకుని బీమా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.ఆరోగ్య సమాచారం సరిగా తెలపడంపాలసీ తీసుకునేప్పుడు ఆరోగ్య విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ గతంలో ఏదైనా సర్జరీలు, అనారోగ్య సమస్యలుంటే తప్పకుండా కంపెనీలకు ముందుగానే చెప్పాలి. దానివల్ల స్వల్పంగా ప్రీమియం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలున్నా ముందుగానే తెలియజేయడం ఉత్తమం.వెయిటింగ్ పీరియడ్పాలసీ తీసుకున్న వెంటనే కొన్ని రకాల జబ్బులకు కంపెనీలు వైద్య ఖర్చులు అందించవు. అలాంటి వ్యాధులకు బీమా వర్తించాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. అయితే కంపెనీలకు బట్టి ఈ వ్యాధులు మారుతుంటాయి. మీకు ఇప్పటికే కొన్ని జబ్బులుండి వాటికి వైద్యం చేయించుకోవాలనుకుంటే మాత్రం అన్ని వివరాలు తెలుసుకోవాలి.సరైన ధ్రువపత్రాలతో రీయింబర్స్మెంట్బీమా కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఆసుపత్రులు అందుబాటులో లేనివారు ఇతర హాస్పటల్లో వైద్యం చేయించుకుంటారు. తర్వాత బీమా కంపెనీకి బిల్లులు సమర్పించి తిరిగి డబ్బు పొందుతారు. అయితే అందుకు సరైన ధ్రువపత్రాలు అవసరం. వైద్యం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి అవసరమైన పత్రాలు, బిల్లులు, ఆరోగ్య నివేదికలు తీసుకొని నిబంధనల ప్రకారం రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి.ఇదీ చదవండి: అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..క్లెయిమ్ను తిరస్కరించకుండా ఏ జాగ్రత్తలు పాటించాలంటే..బీమా పాలసీ తీసుకునేముందే అన్ని నిబంధనలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సందర్భాల గురించి అవగాహన కలిగి ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలోనే అన్ని అంశాలను పరిశీలించాలి.బీమా సంస్థ నియమాలను తప్పకుండా అనుసరించాలి. పైన తెలిపిన విధంగా ఆరోగ్య విషయాల వెల్లడిలో పొరపాటు చేయకూడదు. ప్రతిపాలసీకు కొన్ని షరతులు, మినహాయింపులు, పరిమితులుంటాయి. వాటిపై పూర్తిగా అవగాహన ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగితే పాలసీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే చేరాలి. అత్యవసరం అయితే తప్పా ఇతర హాస్పటల్స్లోకి వెళ్లకూడదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితే డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కోపే(కొంత బీమా కంపెనీ, ఇంకొంత పాలసీదారులు చెల్లించాలి) ఎంచుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం కొంత పాలసీదారులు చెల్లించాలి.కొన్నిసార్లు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు. ఆ సందర్భంలో పరిహారం చెల్లించదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. కంపెనీ వెబ్సైట్లో వాటిని అప్డేట్ చేస్తుంటారు.బీమా క్లెయిమ్ చేసుకునే విధానంలో ఎదైనా సందేహాలుంటే కంపెనీలను సంప్రదించాలి. బీమా సంస్థలు పాలసీదారులకు ఆసుపత్రులను ఎంపిక చేసుకోవడంతోపాటు, ఇతర అంశాలపైనా సహాయం చేస్తాయి. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..?
ఆరోగ్యబీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు అంశానికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 9వ తేదీన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగానే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే రూ.650 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు వరకు కేంద్ర ఖజానాపై భారం పడనుంది.దేశంలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చు ఏటా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం మేర అధికమవుతున్నాయి. దాంతో చాలామంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రతివ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి పాలసీదారులకు అండగా నిలిచేలా ప్రభుత్వం తాము చెల్లిస్తున్న బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలోనూ ప్రతిపక్ష నేతలు, నితిన్ గడ్కరీ వంటి పాలకపక్ష నేతలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీను తొలగించాలని ఆర్థికశాఖకు సిఫార్సు చేశారు. దాంతో త్వరలో జరగబోయే సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే బీమా కంపెనీలు మరింత ఎక్కువగా పాలసీలు జారీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆయా కంపెనీల రెవెన్యూ పెరుగుతుందని మార్కెట్ భావిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, జీఎస్టీని పూర్తిగా మినహాయించకుండా కొన్ని షరతులతో పన్ను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
హెల్త్ ఇన్సూరెన్స్పై జీఎస్టీ ఎత్తేస్తారా?
వస్తు, సేవల పన్ను (GST) కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ సమావేశంలో బీమా రంగం, ప్రభుత్వ ఖజానాపై విస్తృత ప్రభావాలను కలిగించే ఒక ముఖ్యమైన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు ఆ ప్రధాన ప్రతిపాదన.దీని వల్ల ఏటా ప్రభుత్వ ఆదాయానికి రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.“జీఎస్టీ నుంచి ఆరోగ్య బీమాను పూర్తిగా మినహాయిస్తే, నష్టం దాదాపు రూ. 3,500 కోట్లు. సెప్టెంబరు 9న జరిగే సమావేశంలో జీఎస్టీ నుండి ఆరోగ్య బీమా మినహాయింపును కౌన్సిల్ ఆమోదిస్తే భారీ ఆదాయ నష్టం కలిగిస్తుంది” అని ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్’ పేర్కొంది.కమిటీ సిఫార్సులే కీలకంప్రస్తుతం అన్ని రకాల ఆరోగ్య, జీవిత బీమా పాలసీలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈ పన్ను నుండి ఆరోగ్య బీమాను మినహాయించాలనే ప్రతిపాదన రాష్ట్ర, కేంద్ర రెవెన్యూ అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ చర్చలో ఉంది. జీఎస్టీ రేట్లలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించి కౌన్సిల్కు సిఫార్సులు చేయడం కమిటీ బాధ్యత.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ మినహాయింపు ప్రభుత్వ రెవెన్యూపై ఎంత మేర ప్రభావాన్ని చూపుతుందన్నది ఫిట్మెంట్ కమిటీ విశ్లేషించి సిఫార్సులు చేస్తుంది. వీటిపైనే కౌన్సిల్ తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. -
ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం..
తినే తిండి.. పీల్చేగాలి.. తాగే నీరు అన్నీ కలుషితం అవుతున్న రోజులివి. దాంతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వైద్య ఖర్చులకోసం ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకుంటారు. అయితే పాలసీ తీసుకోవడం ముఖ్యం కాదు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే క్లెయిమ్ అయ్యేలా ఉండే బీమాను ఎంచుకోవడం అవసరం. పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆర్థిక భారం తప్పుతుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఎంత మొత్తం అవసరం..?ఏటా మెడికల్ బిల్లులు పెరుగుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 30-40 శాతం మేర మెడికల్ బిల్లులు అధికమవుతున్నాయి. అందుకు తగినట్లుగా మీ వయసు, మీపై ఆధారపడిన వారి పరిస్థితులకు అనుగుణంగా ఎంత మొత్తం పాలసీ కవర్ ఉండాలో నిర్ణయించుకోవాలి.క్లెయిమ్ సెటిల్మెంట్మార్కెట్లో ఆరోగ్య బీమా కంపెనీలు చాలానే ఉన్నాయి. తీవ్ర వ్యాధుల వైద్యానికి అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు రూ.లక్షల్లో ఉన్న క్లెయిమ్లు సెటిల్ చేయకుండా కొర్రీలు పెడుతున్నాయి. తక్కువ కవర్ ఉన్న పాలసీను క్లెయిమ్లు చేస్తూ సెటిల్మెంట్ రేషియోను పెంచుకుంటున్నాయి. అయితే ఈ వివరాలు ఐఆర్డీఏఐ అధికారిక వెబ్సైట్లో ఉంటాయి. వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. 90 శాతం కంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉండే కంపెనీలను ఎంచుకుంటే ఉత్తమం.రూమ్ లిమిట్మెడికల్ బిల్లులు, డాక్టర్ ఛార్జీలు, ఇతర సదుపాయాలకు అయ్యే ఖర్చులు మొత్తంగా ఆసుపత్రి రూమ్ రెంట్పై ఆధారపడుతాయి. ఉదాహరణకు పాలసీలో సింగల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అని సెలక్ట్ చేసుకుంటే దాని రెంట్కు అనుగుణంగానే ఇతర బిల్లులు చెల్లిస్తారు. అంతకుమించి ఖర్చు అయితే మాత్రం పాలసీదారులు భరించాల్సి రావొచ్చు. కాబట్టి రూమ్ రెంట్కు సంబంధించిన పరిమితులు ఉండకుండా చూసుకోవాలి.క్యాష్లెస్ ఆసుపత్రులుఉద్యోగ రీత్యా చాలామంది హైదరాబాద్, బెంగళూరు, ముంబయి.. వంటి నగరాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగం శాశ్వతం కాదు కదా. భవిష్యత్తులో సొంత ఊళ్లకు వెళ్లాల్సి వచ్చినపుడు కూడా ఆసుపత్రులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. దాంతోపాటు ప్రస్తుతం మీరు ఉంటున్న ప్రాంతాల్లో దగ్గర్లో ఎలాంటి నెట్వర్క్ ఆసుపత్రులున్నాయో తెలుసుకోండి. పాలసీ నెట్వర్క్ హాస్పటల్స్లో వైద్యం చేయించుకుంటే కవరేజీ పరిమితి వరకు బీమా కంపెనీలే భరిస్తాయి. ఒకవేళ ప్రమాదం జరిగిన చోట నెట్వర్క్ ఆసుపత్రి లేకపోయినా కంగారు పడకూడదు. వైద్యం తర్వాత సదరు ధ్రువపత్రాలతో ఆ డబ్బును తిరిగి పొందవచ్చు.కో-పే మంచిదేనా..?కో-పే అందిస్తున్న బీమా పాలసీల ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది. అయితే వైద్యం తీసుకున్నాక కో-పే ప్రకారం బీమా కంపెనీ కొంత, పాలసీదారులు ఇంకొంత చెల్లించాలి. ఎలాంటి కో-పే లేకుండా కొంత ప్రీమియం ఎక్కువైనా మొత్తం డబ్బు బీమా కంపెనీలే చెల్లించే సదుపాయాన్ని ఎంచుకోవాలి.రిస్టోరేషన్ సౌకర్యంపాలసీదారులు తమతోపాటు కుటుంబం సభ్యులకు కలిపి ఫ్యామిలీ ఫ్లోటింగ్ పాలసీ తీసుకుంటారు. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగి పాలసీ లిమిట్ మొత్తాన్ని వాడుకున్నారనుకోండి. మళ్లీ ఇంట్లో ఇంకొకరికి ఆరోగ్య సమస్యలు వస్తే పరిస్థితి ఏంటీ? అందుకే ఏడాదిలో ఎన్నిసార్లైనా బీమా మొత్తం తిరిగి రిస్టోర్ అయ్యే పాలసీని తీసుకుంటే మేలు.ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!ఇవీ గమనించండి..డేకేర్ ట్రీట్మెంట్ అందించే పాలసీలు ఎంచుకోవాలి.ఏదైనా అత్యవసర సమయాల్లో ఇంటివద్దే వైద్యం అందిచేలా ఉండాలి.అంబులెన్స్ ఛార్జీలు కవర్ అవ్వాలి.ఫ్రిహెల్త్ చెకప్ సౌలభ్యం ఉండాలి.డాక్టర్కు సంబంధించిన ఆన్లైన్ కన్సల్టేషన్ ఛార్జీలు అందించాలి.ఇప్పటికే ఉన్న జబ్బులకు తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండే పాలసీ బెటర్.పిల్లలు కావాలనుకునే వారు మెటర్నిటీ వైద్య ఖర్చులు కవర్ అయ్యే పాలసీ ఎంచుకుంటే మేలు. -
బీమా సొమ్ముకు దోమ కాటు!
దేశంలో బీమా సొమ్మును దోమలు ఖాళీ చేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లలో దోమల కారణంగా వచ్చే వ్యాధులది మూడో స్థానమంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దోమలతో వచ్చే రోగాల కేసులు అంతకంతకూ పెరుగుతుండగా.. అదే స్థాయిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్లూ రెట్టింపవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ పాలసీ బజార్ ఇటీవల క్లెయిమ్స్పై దేశవ్యాప్తంగా అధ్యయనం చేసింది. దేశంలో హెల్త్ పాలసీలకు సంబంధించి ఏ ఏ వ్యా«ధులకు సంబంధించి క్లెయిమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే దానిపై చేసిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. బీమా సంస్థలు నమోదు చేసిన ఆరోగ్య బీమా క్లెయిమ్లలో దాదాపు మూడింట ఒక వంతు సీజనల్ అంటు వ్యాధులకే అవుతున్నాయని సర్వేలో తేలింది.వీటిలోనూ డెంగీ, మలేరియా తదితర సాంక్రమిత వ్యాధులదే అగ్రభాగంగా ఉంది. ప్రతి పది పాలసీల్లో 4 వరకూ దోమకాటుతో వచ్చే వ్యాధులవేనని పాలసీ బజార్ వెల్లడించింది. జూలై, ఆగస్ట్లలో ఎక్కువగా.. దోమకాటు కారణంగా క్లెయిమ్లు ఎక్కువగా రెండు నెలల్లోనే జరుగుతున్నాయి. జూలై, ఆగస్ట్లో వచ్చే క్లెయిమ్స్ దరఖాస్తుల్లో 60 శాతం వరకూ దోమకాటు వ్యాధులవే ఉన్నాయి. సెప్టెంబర్ లోనూ ఈ తరహా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని సర్వేలో తేలింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దోమల బెడద ఎక్కువగా ఉందనడానికి ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు. పాలసీ బజార్ ద్వారా నివేదించిన ఆరోగ్య బీమా క్లెయిమ్ల అధ్యయనం ప్రకారం.. సీజనల్ వ్యాధుల క్లెయిమ్లలో డెంగీ, మలేరియా వంటి సాంక్రమిత వ్యాధులు 15 శాతం ఉన్నాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల చికిత్సకు సాధారణంగా రూ.50,000 నుంచి రూ.1,50,000 వరకూ ఖర్చవుతోంది. జీర్ణకోశ వ్యాధులదీ అదే దారి.. వర్షాకాలంలో వచ్చే మరో అనారోగ్య సమస్య స్టమక్ ఫ్లూ వంటి జీర్ణకోశ వ్యాధులకూ క్లెయిమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి మలేరియాతో సమానమైన చికిత్స ఖర్చులుంటాయి. సీజనల్ క్లెయిమ్లలో 18 శాతం ఈ వ్యాధికి సంబంధించినవే. కాలానుగుణ అనారోగ్య క్లెయిమ్లలో మరో 10 శాతం వివిధ అలెర్జీలకు సంబంధించినవి ఉన్నాయి. అదే విధంగా.. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు, బ్రోన్కైటిస్ కారణంగా వచ్చే క్లెయిమ్లు 20 శాతం, సీజనల్ వ్యాధులకు మరో 12 శాతం క్లెయిమ్స్ జరుగుతున్నాయి. అయితే వీటి చికిత్స ఖర్చు రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు మాత్రమే. సీజనల్ వ్యాధులకే ఎక్కువగా క్లెయిమ్లు దేశంలో సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ వీటి బారిన ప్రజలు ఎక్కువగా పడుతున్నారు. దీనివల్ల క్లెయిమ్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తోంది. ఇంతకు ముందు ఇళ్లల్లోనే చికిత్స పొందేవారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పెరగడం వల్ల ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. క్లెయిమ్ చేసుకోవచ్చనే ధీమాతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు వస్తుండటం సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. – సిద్ధార్థ్ సింఘాల్, పాలసీబజార్ ఇన్సూరెన్స్ హెడ్ -
ప్రాణాంతక వ్యాధులున్నా.. బీమా సొమ్ము!
తినే తిండి.. పీల్చేగాలి.. తాగే నీరు అన్నీ కలుషితం అవుతున్న రోజులివి. దాంతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి. అందులోనూ క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకుంటూంటారు. ఏదైన జబ్బుపడి ఆసుపత్రిలో చేరితేనే ఆ బీమా పరిహారం వస్తుంది. కానీ ట్రీట్మెంట్కు ముందు, తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడినపుడు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.క్రిటికల్ ఇల్నెస్ పాలసీలుక్యాన్సర్..లివర్..గుండెజబ్బు వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమికంగా గుర్తించినపుడే పరిహారం అందించే పాలసీలు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కేటగిరీలోకి వస్తాయి. ప్రమాదవశాత్తు ఏదైనా వ్యాధి బారిన పడినా పాలసీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. ఈ పాలసీలో భాగంగా బీమా సంస్థలు కనీసం రూ.5 లక్షల నుంచి బీమా అందిస్తున్నాయి. గరిష్ఠంగా ఎంత పాలసీ తీసుకోవాలనేది పాలసీదారుల ప్రత్యేక అవసరాలపై ఆధారపడుతుంది. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే బీమా కంపెనీలు డబ్బు చెల్లిస్తాయి. కాబట్టి ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చాక కూడా వైద్య ఖర్చులు భరించే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: క్రూడ్ దిగుమతులు 40 శాతం పెంపు.. అయినా భారత్కు మేలే!ఒక్కో ప్రాణాంతక వ్యాధికి సంబంధించి ప్రత్యేకంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీలున్నాయి. కుటుంబంలో తీవ్ర వ్యాధులున్నవారికి ఎలాంటి పాలసీ నప్పుతుందో దాన్నే తీసుకోవచ్చు. ఈ రోగాలకు నిత్యం వైద్యం అవసరమవుతూనే ఉంటుంది. కాబట్టి చాలిచాలని జీతాలు, ఆదాయాల వల్ల కుటుంబం చితికిపోకుండా ఉండాలంటే ఈ పాలసీలు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పాలసీ తీసుకునేముందు కచ్చితంగా అన్ని నిబంధనలు తెలుసుకోవాలంటున్నారు. -
ఇన్సూరెన్స్పై జీఎస్టీ తొలగింపు!.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్
లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ మీద 18 శాతం జీఎస్టీ తొలగించాలనే ఇండియా కూటమి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. జీఎస్టీ రాకముందు నుంచే మెడికల్ ఇన్సూరెన్స్ మీద టాక్స్ ఉండేది. ఇది కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇది ఉందని వెల్లడించారు.ఇక్కడ నిరసన తెలుపుతున్నవారు తమ రాష్ట్రాల్లో ఈ పన్ను తొలగింపు గురించి చర్చించారా? వారు తమ తమ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు దాని గురించి లేఖలు వ్రాసి, రాష్ట్రాలకు 2/3 వంతు ఉన్న GST కౌన్సిల్లో దానిని పెంచాలని కోరారా? లేదు. కానీ ఇక్కడ మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి డ్రామా అని నిర్మలా సీతారామన్ అన్నారు.జీవిత, వైద్య బీమాలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీను ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిని కోరుతూ నితిన్ గడ్కరీ మొదట లేఖ రాసారు. ఈ చర్య బీమా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించడమే కాకూండా.. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో కీలకమైన బీమా ఉత్పత్తుల డిమాండ్ను పెంచుతుందని ఆయన అన్నారు.నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్.. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి నాకు మెమోరాండం సమర్పించింది. యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య లైఫ్ అండ్ మెడికల్పై GST ఉపసంహరణకు సంబంధించినదని గడ్కరీ అన్నారు.Tax has been there on medical insurance even before GST was introduced. There was already a Service Tax on medical insurance, before the GST was introduced. This is not a new tax, it was already there in all the states. Those protesting here, did they discuss regarding the… pic.twitter.com/iPfSp8goRr— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) August 7, 2024 -
స్టార్ హెల్త్ నుంచి ‘హోమ్ హెల్త్కేర్’ సేవలు
చెన్నై: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇంటి వద్దే ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రారంభించింది. ‘హోమ్ హెల్త్కేర్ సర్వీస్’ పేరుతో తీసుకొచి్చన ఈ సేవలను రానున్న రోజుల్లో మిగిలిన పట్టణాలకు సైతం విస్తరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కస్టమర్ల ఇంటివద్దే ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు వీలుగా కేర్24, పోరి్టయా, కాల్హెల్త్, అతుల్య హోమ్కేర్, అర్గాలాతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. కోయింబత్తూర్, పుణె, ఢిల్లీ, కోల్కతాలో ఈ సేవలను పరీక్షించి చూశామని, ఆ తర్వాతే ఇతర పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించినట్టు ఆనంద్రాయ్ వెల్లడించారు. జ్వరం, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్, తీవ్రమైన గ్యాస్ట్రైటిస్, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు 044–69006900 నంబర్కు లేదా స్టార్ హెల్త్ మొబైల్ అప్లికేషన్ నుంచి అభ్యర్థన పంపి, ఇంటి వద్దే వైద్య సేవలను అందుకోవచ్చు. కస్టమర్ నుంచి అభ్యర్థన వచి్చన వెంటనే వైద్య బృందం స్టార్ హెల్త్ కస్టమర్ ఇంటికి చేరుకుని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు సూచిస్తారు. ఐదు రోజుల చికిత్సకు (వైద్యులు, నర్సుల ఫీజులు సహా) ఒక్క రోగి రూ.7,000–7,500 వరకు చెల్లించాల్సి ఉంటుందని స్టార్ హెల్త్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిహర సూదన్ తెలిపారు. తదుపరి చికిత్స అవసరం పడితే సమీపంలోని హాస్పిటల్ను సూచిస్తామని చెప్పారు. -
ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెంపు..?
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ 2024లో ప్రతిపాదనలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే వార్షిక కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వారికి విస్తరించాలని యోచిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎంజేఏవై)ను 12 కోట్ల కుటుంబాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. మరో రూ.646 కోట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు కేటాయించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే నేషనల్ హెల్త్ అథారిటీ రూపొందించిన అంచనాల ప్రకారం కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.12,076 కోట్ల అదనపు భారం పడుతుంది.ఇదీ చదవండి: అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలిబడ్జెట్ రూపొందించడానికి ముందు ప్రభుత్వం వివిధ పరిశ్రమ వర్గాలను సంప్రదించింది. అందులో బడ్జెట్లో ఆర్థిక వనరులను పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. ఆరోగ్యంపై ప్రభుత్వం తక్కువ ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాసిన లేఖలో ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దేశ జీడీపీలో 1.1 శాతం నుంచి 1.6 శాతం మాత్రమే ఆరోగ్య సంక్షేమానికి కేటాయింపులు ఉన్నాయని తెలిపింది. వీక్షిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్య రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పింది. పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి ప్రాధాన్యతా రంగంగా ఆరోగ్య రంగాన్ని మార్చాలని సూచించింది. -
రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా
బెంగుళూరుకు చెందిన హాస్పిటల్ చైన్ నారాయణ హెల్త్ కొత్త వెంచర్ నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (NHIL) తన మొదటి బీమా ఉత్పత్తిని ప్రకటించింది. 'అదితి' పేరుతో తీసుకొచ్చిన ఈ బీమా శస్త్రచికిత్సలకు రూ. 1 కోటి, వైద్య నిర్వహణ ఖర్చుల కోసం రూ. 5 లక్షలు హామీతో కుటుంబానికి సమగ్ర కవరేజీని అందిస్తుంది.తక్కువ ప్రీమియంకే సమగ్ర కవరేజీని అందించడం ద్వారా దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడం ఈ ప్లాన్ లక్ష్యం అని డాక్టర్ దేవి శెట్టి నేతృత్వంలోని ఈ హెల్త్కేర్ మేజర్ పేర్కొంది. ఈ కొత్త బీమాను సంవత్సరానికి రూ. 10,000 ప్రీమియంతో పొందవచ్చు. సాధారణంగా ఇలాంటి బీమాకు ప్రీమియం అధికంగా ఉంటుంది. గరిష్టంగా నలుగురు సభ్యులున్న కుటుంబం ఈ బీమా ప్లాన్ తీసుకునేందుకు అవకాశం ఉంది.నారాయణ హెల్త్ దేశంలో బీమా కంపెనీని కలిగి ఉన్న మొదటి హాస్పిటల్ చైన్గా నిలిచింది. దేశం అంతటా దాదాపు 21 హాస్పిటల్ నెట్వర్క్లు, అనేక క్లినిక్లను కలిగి ఉంది. బెంగళూరులో ఇది దాదాపు 7 ఆసుపత్రులు, 3 క్లినిక్లను కలిగి ఉంది. ఎన్హెచ్ఐ వెంచర్ కింద ‘అదితి’ పైలట్ ప్లాన్ మొదట మైసూరు, బెంగళూరులో తర్వాత కోల్కతా, ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడితో సహా శస్త్ర చికిత్సలకు కోటి రూపాయల వరకు, వైద్య చికిత్సల కోసం రూ. 5 లక్షల వరకు అదితి కవరేజీని అందజేస్తుంది.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి కార్డియాక్ సర్జన్. ఆయన లక్షకు పైగా గుండె ఆపరేషన్లు చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం దేవి శెట్టిని 2004లో పద్మశ్రీ , 2012లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. -
ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్ ఎలా?
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా మంది రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.గతంలో వేరు.. ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన లోగడ ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా? రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచి్చనప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు రూ.5 లక్షల చొప్పున రెండు ప్లాన్లు ఉన్నాయని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు వచి్చంది. అప్పుడు తొలుత ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాలి. అక్కడి నుంచి వచి్చన చెల్లింపులు మినహాయించి, అప్పుడు మిగిలిన మొత్తానికి రెండో బీమా సంస్థ నుంచి పరిహారం కోరాలి. ఒక పాలసీలో రూమ్రెంట్ పరంగా పరిమితులు ఉండి, దానివల్ల క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లోనూ.. మిగిలిన మొత్తాన్ని రూమ్రెంట్ పరిమితులు లేని మరో పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని పాలసీల్లో రూమ్ రెంట్, కొన్ని చికిత్సలకు పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ హెల్త్ ప్లాన్లలో ఇవి చూడొచ్చు. అలాంటప్పుడు రూ.5 లక్షల కవరేజీ ఉన్నప్పటికీ పూర్తి మొత్తం రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.7లక్షల ఆస్పత్రి బిల్లుకు సంబంధించి రూ. 5 లక్షల గ్రూప్ పాలసీలో రూ.4 లక్షలే క్లెయిమ్ కింద వచి్చందని అనుకుంటే.. అప్పుడు మిగిలిన రూ. 3 లక్షలను రెండో పాలసీ కింద రీయింబర్స్మెంట్ కోరవచ్చు. ఒక బీమా సంస్థ క్లెయిమ్ దరఖాస్తును తిరస్కరించినా, రెండో బీమా సంస్థను సంప్రదించవచ్చు. వేతన జీవులు పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ప్లాన్, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా ఇండివిడ్యు వల్ ప్లాన్ కలిగి ఉన్నప్పుడు.. మొదట గ్రూప్ హెల్త్ ప్లాన్ నుంచి క్లెయిమ్కు వెళ్లడం మంచి ఆప్షన్. గ్రూప్ హెల్త్ ప్లాన్లో క్లెయిమ్ సెటిల్మెంట్ సులభంగా ఉంటుంది. క్లెయిమ్ మొత్తం ఒక బీమా పాలసీ కవరేజీ పరిధిలోనే ఉంటే ఒక్క సంస్థ వద్దే క్లెయిమ్కు పరిమితం కావాలి. దీనివల్ల రెండో ప్లాన్లో నో క్లెయిమ్ బోనస్ నష్టపోకుండా చూసుకోవచ్చు.నగదు రహిత చికిత్సబీమా సంస్థ నెట్వర్క్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత చికిత్సకు బీమా సంస్థలు నేడు అవకాశం కలి్పస్తున్నాయి. కాకపోతే ఆస్పత్రి నిషేధిత జాబితాలో లేని వాటికే ఈ సదుపాయం పరిమితమని గుర్తుంచుకోవాలి. రెండు ప్లాన్లలోనూ నగదు రహిత చికిత్సకు వెళ్లొచ్చు. కానీ, ఒక సంస్థ నుంచే నగదు రహిత క్లెయిమ్కు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మిగిలిన మొత్తం కోసం రీయింబర్స్మెంట్ విధానానికి వెళ్లాలని సూచిస్తుంటాయి. అలాంటప్పుడు నగదు రహిత విధానంలో గరిష్ట పరిమితి మేరకే ఒక బీమా సంస్థ నుంచి చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లించి, దాన్ని రాబట్టుకునేందుకు రెండో బీమా సంస్థను సంప్రదించాలి. దీనికోసం మొదట క్లెయిమ్ చేసిన బీమా సంస్థ నుంచి ‘క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ’ తీసుకోవాలి. అలాగే, హాస్పిటల్ బిల్లులు, చికిత్సకు సంబంధించి అన్ని పత్రాల ఫొటో కాపీలను సరి్టఫై (అటెస్టేషన్) చేసి ఇవ్వాలని మొదటి బీమా సంస్థను కోరాలి. వీటితో రెండో బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. రెండు బీమా సంస్థల వద్ద రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే.. మొదట ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆస్పత్రి నుంచి అన్ని బిల్లుల కాపీలు, డిశ్చార్జ్ సమ్మరీ, ల్యాబ్ రిపోర్ట్లు తీసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. క్లెయిమ్ ఆమోదం అనంతరం, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీతోపాటు, అన్ని డాక్యుమెంట్ల ఫొటో కాపీలతో రెండో సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలుకు కాలపరిమితి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15–30 రోజులు దాటకుండా క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. ఒకరికి ఎన్ని ప్లాన్లు? అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచి్చనా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కలి్పంచే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మరొక మార్గం.రీయింబర్స్మెంట్కు కావాల్సిన డాక్యుమెంట్లు డిశ్చార్జ్ సమ్మరీ, నగదు/కార్డు ద్వారా చెల్లింపులకు సంబంధించి రసీదులు, ల్యాబ్ రిపోర్ట్లు, వైద్యులు రాసిచి్చన ప్రిస్కిప్షన్లు, ఎక్స్రే ఫిల్మ్లు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ.ఏడాదిలో ఎన్ని క్లెయిమ్లు? ఏడాదిలో ఎన్ని క్లెయిమ్లు అన్న దానితో సంబంధం లేకుండా, గరిష్ట బీమా కవరేజీ పరిధిలో ఎన్ని విడతలైనా పరిహారం పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిమ్ల సంఖ్య పరంగా పరిమితులు విధించొచ్చు. కనుక పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ను తప్పకుండా చదివి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. రెండు రకాల పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ సాధారణంగా రెండు రకాలు. ఇండెమ్నిటీ ఒక రకం అయితే, ఫిక్స్డ్ బెనిఫిట్తో కూడినవి రెండో రకం. ఇండెమ్నిటీ పాలసీలు ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలతోపాటు.. ఎంపిక చేసిన డేకేర్ ప్రొసీజర్స్ (చికిత్స తర్వాత అదే రోజు విడుదలయ్యేవి)కు మాత్రమే కవరేజీ ఇస్తాయి. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను ఫిక్స్డ్ బెనిఫిట్ పాలసీలుగా చెబుతారు. ఇందులో కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఈ రెండింటి పరంగా గందరగోళం అక్కర్లేదు. ఇండెమ్నిటీ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ రెండూ కలిగిన వారు.. ఏదైనా తీవ్ర వ్యాధి (క్రిటికల్ ఇల్నెస్) బారిన పడినప్పుడు ఇండెమ్నిటీ ప్లాన్ కింద కవరేజీ పొందొచ్చు. అలాగే, వ్యాధి నిర్ధారణ పత్రాలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కింద క్లెయిమ్ దాఖలు చేసి పూర్తి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. దీనివల్ల ఆయా వ్యాధులకు సంబంధించి ఎదురయ్యే భారీ వ్యయాలను తట్టుకోవడం సాధ్యపడుతుంది. టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు ఇక హెల్త్ ఇన్సూరెన్స్లో టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు కూడా ఉంటాయి. ఇందులో సూపర్ టాపప్ ఎక్కువ అనుకూలం. ఇవి డిడక్షన్ క్లాజుతో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వారు, రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ కూడా జోడించుకున్నారని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు మొదటి రూ.5 లక్షలు దాటిన తర్వాతే సూపర్ టాపప్ ప్లాన్ కింద కవరేజీ పొందగలరు. రూ.50 లక్షల వరకు బిల్లు ఎంత వచ్చినా సరే.. మొదటి రూ.5 లక్షలకు సూపర్ టాపప్లో పరిహారం రాదు. దాన్ని సొంతంగా భరించడం లేదంటే బేస్ ప్లాన్ నుంచి కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా రూ.50 లక్షల బేస్ ఇండెమ్నిటీ ప్లాన్తో పోలి్చతే.. రూ.5–10 లక్షల మేర బేస్ ప్లాన్ తీసుకుని, 50 లక్షలకు సూపర్ టాపప్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది. -
విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?
విహార యాత్రల కోసం విదేశాలకు వెళుతున్నారా..? ఎన్ని రోజులు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా..? మరి, వెళ్లినచోట ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే..వెంటతీసుకెళ్లిన సామాగ్రి పోగొట్టుకుంటే.. కంగారు పడకండి.. అలాంటి వారికోసమే చాలా కంపెనీలు ప్రయాణబీమా అందిస్తున్నాయి. అందుకు సంబంధించిన ప్రీమియం చెల్లించి విదేశీ ప్రయాణాన్ని మరింత ధీమాగా పూర్తి చేయవచ్చు. అయితే ఈ ప్రయాణ బీమాకు సంబంధించిన కొన్ని అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.విహారయాత్రలు, ఇతర పనుల నిమిత్తం కొంతకాలంపాటు విదేశాలకు వెళ్లేవారు ప్రయాణానికి సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఊహించని ఖర్చులు ఎదురైతే మొత్తం ప్రయాణంపై ప్రభావం పడుతుంది. అందుకోసం వారు సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రయాణ బీమా భరోసానిస్తుంది. ఇందుకు సంబంధించి కంపెనీలు ఎలాంటి పాలసీలను అందిస్తున్నాయో తెలుసుకుందాం.ఆరోగ్య అవసరాల కోసం..నిత్యం మనదేశం నుంచి వేలసంఖ్యలో విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తుంటారు. వారికి ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావొచ్చు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల చికిత్సలు కవర్ అయ్యేలా ఉండే బీమా పాలసీను ఎంచుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా పూర్తి వైద్య ఖర్చులను చెల్లించే పాలసీను తీసుకువాలి.ఒకటికి మించి దేశాలకు ఒకే పాలసీ..ఒకసారి బీమా తీసుకుంటే చాలా ప్రయాణాలకు ఉపయోగపడే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ వర్తించేలా ఒకే పాలసీని తీసుకోవచ్చు. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే బీమా ప్రీమియం కంపెనీను అనుసరించి దాదాపు రూ.700-రూ.800 వరకూ ఉంటుంది.సామగ్రి అందకపోయినా..ఒకటి కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించేవారు నిత్యం సామగ్రి వెంట తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇతరదేశంలోని చిరునామాలో తమ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కోసారి ఆ సామగ్రి చేరడం ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఇబ్బందులు పడకుండా బీమా సంస్థ పరిహారం ఇచ్చేలా పాలసీలున్నాయి. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి పరిహారం అందిస్తుంది.ఈ ప్రయాణ బీమా పాలసీలను ఆన్లైన్ ఫ్లాట్ఫాంల ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. బీమా సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి, కావాల్సిన విధంగా పాలసీని ఎంచుకోవచ్చు. ప్రయాణ వ్యవధి, ఎంత మొత్తానికి బీమా కావాలి, ప్రయాణం రద్దు, ఆరోగ్య అవసరాల్లాంటివన్నీ పాలసీలో ఉండేలా చూసుకోవాలి. బీమా కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ఉంటాయి. ఆ జాబితాను ఒకసారి పరిశీలించాలి.ఇదీ చదవండి: మొబైల్లో ఆర్డర్చేసి కిచెన్లోకి వెళితే వంట రెడీ!పాలసీ తీసుకునేపుడు గుర్తుంచుకోవాల్సినవి..పాలసీ తీసుకునేటప్పుడు మీ పర్యటన జరిగే అన్ని రోజులకు వర్తించేలా చూసుకోవాలి. పాలసీలోని మినహాయింపులు, పరిమితులు ముందే తెలుసుకోవాలి. ముందస్తు వ్యాధుల చికిత్సకు వర్తిస్తుందా లేదా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక అవసరాలు ఉండొచ్చు. వాటికీ పాలసీ వర్తించేలా చూసుకోవాలి. ఏ క్షణమైనా మీకు సేవలను అందించేలా సహాయ కేంద్రాలు పనిచేస్తున్నాయా.? మీరు వెళ్లే ప్రాంతాల్లో ఎన్ని ఆసుపత్రులతో ఒప్పందాలున్నాయి అనే విషయాన్ని పరిశీలించాలి. -
క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
ఆరోగ్య బీమా పాలసీదారు క్లెయిమ్ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్సపై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి తుది బిల్లు వచ్చాక మూడు గంటల్లోపు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. బుధవారం ఈమేరకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై ఉన్న 55కు పైగా ఆదేశాలను క్రోడీకరించి దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.సర్క్యూలర్లోని వివరాల ప్రకారం..క్లెయిమ్ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీమా సంస్థలు, థర్డ్పార్టీ ఏజెన్సీలు తమకు అవసరమైన పత్రాలను పాలసీదారుల నుంచి కాకుండా నేరుగా ఆసుపత్రుల నుంచే సేకరించాలి. వయసు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా బీమా పాలసీని అందించాలి. అవసరాన్ని బట్టి కొత్త పాలసీలను తీసుకొచ్చే అవకాశం బీమా సంస్థలకు ఉంది.ఐఆర్డీఏఐ చేసిన కొన్ని మార్పులు..డిశ్చార్జీకి మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం జరిగి ఆసుపత్రి ఏదైనా అదనపు ఛార్జీలు విధిస్తే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ భరిస్తుంది.చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే వెంటనే క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. తక్షణమే ఆసుపత్రి నుంచి మృత దేహాన్ని తమ బంధువులకు అప్పగించాలి.పాలసీదారులకు సహాయం చేయడానికి బీమా కంపెనీలు ఆసుపత్రిలో ఫిజికల్ మోడ్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయవచ్చు.ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్న పాలసీదారులు తమకు ఆమోదయోగ్యమైన క్లెయిమ్ పొందగలిగే పాలసీని ఎంచుకోవచ్చు.పాలసీ తీసుకునేందుకూ, పాలసీ పునరుద్ధరణ, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి.బీమా కంపెనీలు పాలసీ డాక్యుమెంట్తో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ని కూడా అందించాలి. బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజీ వివరాలు, మినహాయింపులు.. వంటివి సులభ పదాల్లో తెలియజేయాలి.పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్లు చేయకపోతే వారికి నో క్లెయిమ్ బోనస్ లేదా ప్రీమియం తగ్గించే అవకాశాన్ని కల్పించవచ్చు.ఇదీ చదవండి: పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్లుఇటీవల లోకల్ సర్కిల్ చేసిన సర్వేలో 43 శాతం బీమా పాలసీదారులు గత మూడేళ్లలో తమ బీమా క్లెయిమ్లను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. చాలామంది పాలసీదారులు ఆసుపత్రిలో చేరిన చివరి రోజు వరకు తమ క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సర్వే తెలిపింది. -
ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉంది. ఇందుకోసం ఇన్ఆర్గానిక్ అవకాశాలను (వేరే సంస్థను కొనుగోలు చేయడం వంటివి) పరిశీలిస్తామని సంస్థ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలి పారు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని వివరించారు.అగ్ని ప్రమాద బీమా వంటి జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఎల్ఐసీకి నైపుణ్యాలు లేవని, కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ మా త్రం చేయగలదని మొహంతి తెలిపారు. ఇన్సూరెన్స్ చట్టాన్ని సవరించి ఒకే గొడుగు కింద లైఫ్, జనరల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేసే విధంగా బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్సులు జారీ చేయొచ్చనే అంచనాల నేపథ్యంలో మొహంతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఎల్ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. -
ప్రీమియం భారమైతే.. పరిష్కారం?
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరోసారి ప్రీమియం బాదుడు షురూ చేశాయి. ‘కర్ణుడి చావుకి కోటి కారణాలన్నట్టు’.. బీమా సంస్థలు కూడా ప్రీమియం పెంచడానికి ఎన్నో కారణాలు చూపిస్తుంటాయి. లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో.. గడిచిన ఏడాది కాలంలో తమ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం 25 శాతం పెరిగినట్టు 52 శాతం మంది చెప్పారు. హెల్త్ ఇన్సూరెన్స్ నూతన పాలసీల ప్రీమియం సైతం ఈ ఏడాది మొదటి మూడు నెలలల్లోనే 5.54 శాతం మేర పెరిగినట్టు బీమా పంపిణీ ప్లాట్ఫామ్ ‘పాలసీఎక్స్’ చెబుతోంది. రెక్కలు తొడిగిన పక్షి మాదిరిగా ఇలా ప్రీమియం గణనీయంగా పెరుగుతూ పోతుంటే కొత్తగా పాలసీ తీసుకునే వారికే కాదు, అప్పటికే పాలసీ తీసుకున్న వారిపైనా అదనపు భారం పడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రీమియం భారం కొంత తగ్గించుకునే మార్గాలేంటన్నది చూద్దాం. ప్రీమియం ఎందుకు పెరుగుతోంది..హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం గణనీయంగా పెరిగిపోవడానికి వైద్య ద్రవ్యోల్బణం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ద్రవ్యోల్బణం నిత్యావసరాలకు (వినియోగ ధరల, టోకు ధరల ఆధారిత) సంబంధించినది. ఇది 5–6 శాతం మధ్య ఉంటోంది. కానీ, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఇంతకు రెట్టింపు 14–15 శాతంగా ఉంటోంది. చికిత్సల వ్యయాలు ఈ స్థాయిలో ఏటా పెరిగిపోతుండడంతో, బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్లు వస్తున్నాయి. దీంతో వాటిపై చెల్లింపుల భారం పడుతోంది. ‘‘వైద్య రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వసతులు మెరుగుపడడం, ప్రాణాలను కాపాడే అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడం.. ఇవన్నీ వ్యయాలు పెరగడానికి దారితీస్తున్నాయి’’ అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు. ఔషధాలు, ఇంప్లాంట్లు, ఇతరత్రా వ్యయాలు పెరగడం వల్లే ఆస్పత్రుల చికిత్సల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్టు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్ హెడ్ మనీష్ దొదేజా సైతం పేర్కొన్నారు. జీవనశైలి, ఇతర వ్యాధుల రిస్క్ పెరగడం కూడా అధిక క్లెయిమ్లకు దారితీస్తున్నట్టు చెప్పారు. ‘‘మనదేశం ప్రపంచ మధుమేహం రాజధానిగా మారుతోంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ సైతం పెరుగుతోంది’’అని ఇన్సూరెన్స్ సమాధాన్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు శిల్పా అరోరా తెలిపారు. కరోనా సమయంలో, ఆ తర్వాత కూడా ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. దీంతో బీమా సంస్థలకు పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్లు గణనీయంగా పెరిగాయి. ఈ భారాన్ని దింపుకునేందుకు బీమా సంస్థలు విడతలవారీగా పాలసీదారులకు ప్రీమియం వాత పెడుతున్నట్టు విశ్లేషకులు చెబతున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియం సవరణ ఇప్పడే మొదటిసారి కాదు. లోగడ ఒకటి రెండు సార్లు కూడా అవి సవరించాయి.అందరికీ కవరేజ్ లేకపోవడమూ కారణమే...ఇక మనదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అందరికీ లేకపోవడం కూడా ప్రీమియం అధికంగా ఉండడానికి మరొక కారణమంటున్నారు నిపుణులు. ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బీమా సంస్థలు వ్యయాలను మరింత మంది పాలసీదారులతో పంచుకోవడానికి వీలు ఏర్పడుతుంది. దీంతో విడిగా ఒక్కొక్కరిపై పడే ప్రీమియం భారం తగ్గుతుంది. ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ సైతం మరో పిడుగులాంటిదే. ఉదాహరణకు రూ.10వేల వార్షిక ప్రీమియంపై రూ.1,800 జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తోంది. బీమా సంస్థలు వయసుల వారీగా ప్రీమియం పెంచుతుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 35 ఏళ్లు నిండి 36వ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు ప్రీమియం పెరిగిపోతుంది. అలాగే 45 ఏళ్లు నిండి 46లోకి ప్రవేశించినప్పుడు కూడా ప్రీమియం టారిఫ్లను బీమా సంస్థలు సవరిస్తుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు అధికమవుతుంటాయి. దీంతో చికిత్సల క్లెయిమ్ల రిస్క్ పెరిగిపోతుంటుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బీమా సంస్థల ముందున్న ఏకైక పరిష్కారం ప్రీమియం బాదుడే. ఇక బీమా పాలసీ తీసుకున్న వారు కూడా పెద్ద పట్టణాల్లోని ప్రముఖ హాస్పిటల్స్లో చికిత్సలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో సాధారణంగానే వైద్య చికిత్సల చార్జీలు ఎక్కుగా ఉంటాయి. దీంతో బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్ బిల్లులు వస్తున్నాయి. ఇది కూడా ప్రీమియం పెరిగేందుకు కారణమవుతోంది. ఇటీవలే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐర్డీఏఐ) ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. మారటోరియం పీరియడ్ను ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. దీనివల్ల కూడా క్లెయిమ్లు పెరుగుతాయన్న అంచనాతో బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తున్నాయి. వచ్చే 12 నెలల కాలంలోనూ ప్రీమియంలు పెరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అసలు హెల్త్ ప్లాన్ అవసరమా?హెల్త్ ప్లాన్ లేకపోతే ఆర్థికంగా కుటుంబం గుల్ల కాక తప్పదు. ప్రీమియం భారంగా మారిందని హెల్త్ ప్లాన్ ప్రీమియం కట్టడం మానేయవద్దు. ఎందుకంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. అదే సమయంలో అత్యాధునిక చికిత్సా విధానాలతో వ్యయాలు కూడా పెరిగాయి. హెల్త్ ప్లాన్ తీసుకోకపోతే.. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు లేదా రోడ్డు ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, రుణాలతో గట్టెక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకని ఆరోగ్య బీమా రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.– లోకల్ సర్కిల్స్ సర్వే వివరాలివి...→ 21 % మంది గడిచిన ఏడాదిలో తమ పాలసీ ప్రీమియం 50 శాతం కంటే ఎక్కువే పెరిగినట్టు చెప్పారు. 31 % మంది 25–50 % మధ్య ప్రీమియం గతేడాదితో పోలిస్తే పెరిగినట్టు తెలిపారు. → 15 శాతం మంది తమ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదన్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రూప్ హెల్త్ ప్లాన్లో ఉన్నవారే.→ మొత్తం 11,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. భారం ఎలా తగ్గించుకోవాలి? పోరి్టంగ్: ఆరోగ్య బీమా ఒకసారి కొనుగోలు చేసి మర్చిపోయే వస్తువు కాదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ పాలసీలోని సదుపాయాలు ఉన్నాయా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. సహేతుక ప్రీమియంపై మరింత మెరుగైన ఫీచర్లను వేరొక బీమా సంస్థ ఆఫర్ చేస్తుంటే, అందులోకి మారిపోవడం మంచి నిర్ణయమే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకోవచ్చు. కేవలం ప్రీమియం కొంత తక్కువగా ఉందని చెప్పి పోరి్టంగ్ ఆప్షన్ను పరిశీలించడం సరైనది కాదు. ప్రీమియంలో చెప్పుకోతగ్గ వ్యత్యాసానికి తోడు, కొత్త సంస్థ ప్లాన్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పుడే పోరి్టంగ్ను పరిశీలించొచ్చు. పోరి్టంగ్తో వేరొక బీమా సంస్థకు మారిపోయిన తర్వాత.. అక్కడ కూడా పాలసీ రెన్యువల్ (పునరుద్ధరణ) సమయంలో ప్రీమియం పెంచరని చెప్పలేం. అన్ని బీమా సంస్థలూ తమ క్లెయిమ్, ప్రీమియం నిష్పత్తి ఆధారంగానే ప్రీమియం పెంపు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. కనుక ప్రీమియం పెంచినప్పుడల్లా దాన్ని తగ్గించుకునేందుకు కంపెనీని మారడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఒకేసారి మూడేళ్లు: ప్రీమియంను ఒకేసారి మూడేళ్లకు చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఇలా ఒకేసారి మూడేళ్లకు ప్రీమియం చెల్లిస్తే 10–15 శాతం ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల మూడేళ్ల పాటు ప్రీమియం పెంపు భారాన్ని తప్పించుకోవచ్చు. వయసువారీ శ్లాబు మారే ముందు మూడేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లించడం వల్ల.. అక్కడి నుంచి మూడేళ్ల పాటు పెంపు లేకుండా చూసుకోవచ్చు. సూపర్టాపప్: ప్రస్తుత పాలసీలో ఎంత కవరేజీ ఉందన్నది ఒక్కసారి గమనించండి. ఒకవేళ రూ.10 లక్షల కవరేజీ ఉంటే, దాన్ని రూ.5 లక్షలకు తగ్గించుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం మరో మార్గం. దీనివల్ల బేస్ ప్లాన్ ప్రీమియం తగ్గుతుంది. సూపర్ టాపప్ చౌకగా వస్తుంది. దీనివల్ల మొత్తం మీద ప్రీమియంలో 10–15 శాతం తగ్గుతుంది. ఫ్లోటర్ ప్లాన్: అవివాహితులు ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకుని ఉంటే.. వివాహం తర్వాత జీవిత భాగస్వామితో కలసి కొత్త ప్లాన్కు వెళ్లొద్దు. అప్పటికే ఉన్న ప్లాన్ను ఫ్లోటర్గా మార్చుకుని, జీవిత భాగస్వామిని చేర్చుకోవాలి. దీనివల్ల జీవిత భాగస్వామి ఒక్కరికే వెయిటింగ్ పీరియడ్ తదితర నిబంధనలు వర్తిస్తాయి. కొంత ప్రీమియం కూడా తగ్గుతుంది. గ్రూప్ ప్లాన్: ప్రీమియం భారంగా పరిణమిస్తే.. అప్పుడు పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ ప్లాన్ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. లేదంటే దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్లు గ్రూప్ హెల్త్ప్లాన్లను తమ కస్టమర్లకు తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. యాక్టివ్ హెల్త్ ప్లాన్: కొన్ని బీమా సంస్థలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే వారికి ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. రోజువారీ వ్యాయామం, నడక తదితర సాధనాలు చేయడం వల్ల అనారోగ్యం రిస్క్ తగ్గుతుందని తెలుసు. దీనివల్ల బీమా సంస్థలకు క్లెయిమ్ల రిస్క్ తగ్గుతుంది. పాలసీదారులను ఆరోగ్య సంరక్షణ దిశగా ప్రోత్సహించి, తమ క్లెయిమ్లను తగ్గించుకునేందుకు బీమా సంస్థలు ఇలాంటి ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో 50 శాతం వరకు ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. కోపే: బీమా ప్రీమియం కట్టలేనంత భారంగా మారిపోతే.. అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ రద్దు కావడం కంటే.. కో పే ఆప్షన్కు వెళ్లొచ్చు. ఉదాహరణకు 20 % కో పే ఎంపిక చేసుకుంటే.. ప్రీమియంలోనూ అంతే మేర డిస్కౌంట్ వస్తుంది. హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నప్పుడు వచ్చే బిల్లులో 80 శాతాన్నే బీమా సంస్థ చెల్లిస్తుంది. 20 శాతాన్ని పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. నో క్లెయిమ్ బోనస్: దాదాపు అన్ని బీమా సంస్థలు నో క్లెయిమ్ బోనస్ను ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే, మరుసటి సంవత్సరం రెన్యువల్ అనంతరం 10–100 శాతం వరకు ఏటా కవరేజీని పెంచుతుంటాయి. ఇలా గరిష్టంగా 100–200 శాతం వరకు కవరేజీ పెరుగుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల హెల్త్ ప్లాన్పై 50 శాతం నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ ఉందనుకుంటే.. ఒక ఏడాదిలో క్లెయిమ్ లేకపోతే మరుసటి సంవత్సరం కవరేజీ రూ.15 లక్షలకు పెరుగుతుంది. రెండో ఏడాది కూడా క్లెయిమ్ లేకపోతే రూ.20 లక్షలకు పెరుగుతుంది. మూడో ఏడాది క్లెయిమ్ వస్తే, అప్పుడు పెరిగిన రూ.10 లక్షల నుంచి 50 శాతం అంటే రూ.5 లక్షలను తగ్గిస్తాయి. కానీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే సుప్రీమ్ ప్లాన్లో సమకూరిన నో క్లెయిమ్ బోనస్ను క్లెయిమ్ చేసుకున్నా డిడక్షన్ అమలు చేయడం లేదు. అంటే నో క్లెయిమ్ బోనస్ కూడా కవరేజీగానే మిగిలిపోతుంది. కనుక బేస్ కవర్ రూ.5 లక్షలు తీసుకోవడం ద్వారా ఈ ప్లాన్లో మెరుగైన కవరేజీని పొందొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. పెద్దలు ఉంటే వారిని ప్రత్యేక ప్లాన్ కింద వేరు చేయాలి. -
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
ఆరోగ్య బీమా రంగ సంస్థలు పాలసీదారులకు షాకివ్వబోతున్నాయి. గతేడాదిగా పాలసీ ప్రీమియంను దాదాపు 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రీమియం ఛార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని లోకల్సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు.ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు 2023లో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలు పొందుతున్నాయి. వాటి సరాసరి వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా నమోదవుతుంది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, క్రమంగా తగ్గుతోంది. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా!
అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. అలాగే, సీనియర్ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. ఒక్క భారత్లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణే దిక్కు. అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. దేశంలోని సీనియర్ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. -
Health Insurance: ఎక్కడైనా నగదు రహిత వైద్యం!
ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో ఉన్న ముఖ్యమైన సదుపాయాల్లో ఒకటి నగదు రహిత వైద్యం. ముందస్తు ప్రణాళికతో లేదా అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఈ సదుపాయం ఎంతో అక్కరకు వస్తుంది. సాధారణంగా బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే ఈ నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేది. నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే, సొంతంగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తప్పిస్తూ.. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత వైద్యం పొందేందుకు వీలుగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ ఏడాది జవనరి నుంచి ‘ఎక్కడైనా నగదు రహితం’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలేమిటో చూద్దాం. బీమా సంస్థ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లోనూ నగదు రహిత చికిత్స పొందడమే నూతన విధానంలోని సౌలభ్యం. ప్రతి బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ పేరుతో ఒక జాబితా నిర్వహిస్తుంటుంది. ఆ జాబితాలోని ఏ హాస్పిటల్లో చికిత్స పొందినా బీమా సంస్థే నేరుగా చెల్లింపులు చేస్తుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ నెట్వర్క్ ఆస్పత్రిలోనే చికిత్స పొందాలంటే సాధ్యపడకపోవచ్చు. ప్రమాదానికి గురైనప్పుడు వేగంగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఆ ఆస్పత్రి బీమా నెట్వర్క్లో భాగంగా లేకపోతే? బిల్లు భారీగా వస్తే..? ఆ మొత్తాన్ని రోగి సంబందీకులు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయి, సత్వర వైద్యం అందాల్సిన సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి తరుణంలో సమీపంలోని హాస్పిటల్కు వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎక్కడైనా నగదు రహితం ఉపయోగపడుతుంది. అత్యవసరమనే కాదు, ముందుగా అనుకుని నిర్ణిత సమయానికి తీసుకునే చికిత్సలకు సైతం నాన్ నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కడైనా నగదు రహితం విధానం ఎలా పనినిచేస్తుందో తెలుసుకోవడం అవసరం. నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే.. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి రావడానికి ముందు కూడా కొన్ని బీమా సంస్థలు నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ జనరల్, బజాజ్ అలియాంజ్ జనరల్ సైతం నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశాయి. ముందస్తుగా నిర్ణయించుకుని, తీసుకునే చికిత్స విషయంలో బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్ (టీపీఏ)కు రెండు నుంచి మూడు రోజుల ముందు (48–72 గంటలు) తెలియజేయడం తప్పనిసరి. ఈ మెయిల్ లేదంటే ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా లేదంటే లిఖిత పూర్వకంగా బీమా సంస్థకు తెలియజేయవచ్చు. అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సి వస్తే కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరిన 24 నుంచి 48 గంటల్లోపు (బీమా సంస్థ ఆధారంగా వేర్వేరు) విషయాన్ని తెలియజేయాలి. 15 పడకలు తప్పనిసరి.. నగదు రహిత వైద్యం పొందేందుకు ఎంపిక చేసుకునే ఆస్పత్రిలో కనీసం 15 పడకలు (బెడ్స్) ఉండాలన్నది నిబంధన. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నిబంధనలకు అనుగుణంగా, హాస్పిటల్ అనే నిర్వచనానికి అనుగుణంగా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పనిచేస్తూ ఉండాలి. గుర్తింపు కార్డులు, పాలసీ డాక్యుమెంట్లు, మెడికల్ రిపోర్ట్లు, పి్రస్కిప్షన్లు, బిల్లులు నిర్ధేశిత ఫార్మాట్లో బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుంది. నగదు రహిత వైద్యానికి అనుమతించే ముందు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి ఆమోద లేఖను చాలా బీమా సంస్థలు కోరుతున్నాయి. ఆస్పత్రి బిల్లులు నిజమైనవేనా? ప్రామాణిక అడ్మిషన్ ప్రక్రియ విధానాన్నే అనుసరిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగానే చికిత్సా విధానాలు ఉన్నాయా? అని బీమా సంస్థలు పరిశీలిస్తాయి. ఇక పాలసీకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధుల చికిత్సా క్లెయిమ్లో వేచి ఉండాల్సిన కాలం), కోపే క్లాజ్, మినహాయింపులు, ముందస్తు వ్యాధుల నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని గమనించాలి. కొన్ని చికిత్సలకు సంబంధించి (ఉదాహరణకు కేటరాక్ట్) ఉప పరిమితులు ఉంటే, వాటి విషయంలోనూ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. పాలసీలో ప్రత్యేకమైన రైడర్ తీసుకుంటే తప్ప కాటన్, ఫేస్ మాస్్కలు, సర్జికల్ గ్లోవ్లు, నెబ్యులైజేషన్ కిట్లకు పరిహారం రాదు. ఏవైనా అదనపు చార్జీలు (కవరేజీలోకి రానివి) విధిస్తే, పాలసీదారు సొంతంగా చెల్లించుకోవాలి. చార్జీల పట్ల అవగాహన నెట్వర్క్ ఆస్పత్రులు వివిధ రకాల చికిత్సలకు వసూలు చేసే చార్జీల వివరాలు బీమా సంస్థ రికార్డుల్లో ఉంటాయి. దీనివల్ల పాలసీదారు సొంత పాకెట్పై భారం పడదు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్సలకు ఎంత చార్జీ వసూలు చేస్తారన్నది కీలకం అవుతుంది. నెట్వర్క్ హాస్పిటల్కు మించి నాన్ నెట్వర్క్ ఆస్పత్రి చార్జీ చేస్తే, అప్పుడు క్లెయిమ్ పూర్తిగా రాకపోవచ్చు. పైగా ఆస్పత్రి పడకలు, ఏ ప్రాంతంలో ఉందన్న దాని ఆధారంగా చికిత్సల ధరలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చికిత్సకు నెట్వర్క్ హాస్పిటల్లో రూ.50,000 పరిమితి ఉందనుకోండి. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ఇదే చికిత్సకు రూ.70,000 వేలు చార్జ్ చేస్తే, పాలసీదారు తాను సొంతంగా రూ.20,000 చెల్లించాల్సి వస్తుంది. అందుకని నగదు రహిత వైద్యం కోరుకునే వారు తమ పాకెట్ నుంచి పెద్దగా చెల్లించొద్దని భావిస్తే, అప్పుడు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్లడం మంచిది. కొన్ని సందర్భాల్లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. అలాంటప్పుడు పాలసీదారు సొంతంగా చెల్లించి, డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్మెంట్కు వెళ్లాల్సి వస్తుంది. రోగికి శరవేగంగా చికిత్స అవసరమైతే తప్పించి, మిగిలిన వాటికి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ను ఎంపిక చేసుకోకపోవడం మంచిది. నెట్వర్క్–నాన్ నెట్వర్క్ బీమా సంస్థ నగదు రహిత వైద్యం అందించేందుకు వీలుగా పలు ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందానికి వచ్చిన ఆస్పత్రులు నెట్వర్క్ జాబితాలో ఉంటాయి. ఇలా ఒప్పందం చేసుకునే సమయంలోనే చికిత్సల ధరల విషయంలో బీమా సంస్థ ఆస్పత్రులతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. దీనివల్ల బీమా సంస్థకు కొంత భారం తగ్గుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్తో ఈ అనుకూలత బీమా సంస్థలకు ఉండదు. బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు అన్నింటికంటే ముఖ్యమైనది.. చికిత్స కోసం ఎంపిక చేసుకునే నాన్ నెట్వర్క్ ఆస్పత్రి బీమా సంస్థ బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. బ్లాక్ లిస్ట్లోని ఆస్పత్రిలో చేరడం వల్ల నగదు రహిత వైద్యం అందదు. రీయింబర్స్మెంట్కు కూడా అవకాశం ఉండదు. దీనివల్ల మొత్తానికే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అత్యవసరంగా చికిత్స అవసరమైనప్పుడు కూడా బీమా సంస్థ పోర్టల్కు వెళ్లి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితాను ఓ సారి పరిశీలించడం ఎంతో మంచిది. ఇక ముందస్తు ప్రణాళికతో తీసుకునే చికత్సలకు బీమా సంస్థ నెట్వర్క్లోని హాస్పిటల్కు వెళ్లడమే మేలు. ఎందుకంటే నెట్వర్క్ ఆస్పత్రులు బీమా సంస్థ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు దాదాపుగా ఎదురుకావు. నెట్వర్క్ హాస్పిటల్తో లాభాలు ► నెట్వర్క్ (ఎంపానెల్డ్) ఆస్పత్రుల్లో టారిఫ్లు బీమా సంస్థతో కుదిరిన అంగీకారం మేరకు ఉంటాయి. చికిత్సల చార్జీలు నిర్ధేశిత పరిమితుల పరిధిలోనే ఉంటాయి. దీంతో క్లెయిమ్కు సత్వర ఆమోదం లభిస్తుంది. వేగంగా డిశ్చార్జ్ కావచ్చు. ► నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ పరిష్కారం సాఫీగా, వేగంగా జరుగుతుంది. ► నెట్వర్క్ ఆస్పత్రులు అన్నింటిలోనూ చికిత్సల నాణ్యాత ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో రోగులకు చికిత్సల తర్వాత సమస్యల రిస్క్ తగ్గుతుంది. ► ఆస్పత్రి, బీమా సంస్థ మధ్య విశ్వసనీయమైన బంధం వల్ల చికిత్సల బిల్లులను మరీ పెద్దవి చేసి చూపించడం ఉండదు. అనవసర ప్రక్రియలు, ఔషధాల వినియోగం ఉండదు. మోసాల రిస్క్ తగ్గుతుంది. -
తీవ్ర వ్యాధులపై బ్రహ్మాస్త్రం..!
జీవనశైలి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అదే సమయంలో వైద్య శాస్త్రం పురోగతి, అత్యాధునిక టెక్నాలజీ, రోబోటిక్ పుణ్యమా అని మెరుగైన చికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కనుక ఇప్పుడు ఏదైనా తీవ్ర ఆరోగ్య సమస్య వస్తే, వైద్యుల కృషితో విజయవంతంగా అధిగమించొచ్చు. కానీ, ఇందుకు కావాల్సిందల్లా ముందస్తు సన్నద్ధత. అందుకే ఆరోగ్య బీమా ఎంత అవసరమో.. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో.. అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు, ముందస్తుగా అనుకుని ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు కవరేజీ వర్తిస్తుంది. కానీ, ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ (మొండి వ్యాధులు, తీవ్ర అనారోగ్యం) కారణంగా ఎక్కువ రోజుల పాటు చికిత్స అవసరం పడితే ఏంటి పరిస్థితి..? రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న కవరేజీ సరిపోతుందా..? చాలకపోవచ్చు. రెగ్యులర్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని రకాల వ్యాధుల్లోనూ గట్టెక్కిస్తుందని అనుకోవద్దు. తీవ్ర వ్యాధుల్లో చికిత్సల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే అప్పుడు ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి సందర్భాలను అధిగమించేందుకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఆదుకుంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ విడిగా ప్లాన్ రూపంలోనూ లేదంటే రైడర్ రూపంలోనూ తీసుకోవచ్చు. పాలసీలో పేర్కొన్న ఏదైనా వ్యాధి బారిన పడినట్టు తేలితే నిబంధనల మేరకు పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. ఇండెమ్నిటీ పాలసీలు కేవలం ఆస్పత్రిలో అయ్యే వ్యయాలకే పరిహారాన్ని చెల్లిస్తాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అలా కాదు. ఏక మొత్తంలో చెల్లింపులు చేస్తాయి. దీంతో ఆయా తీవ్ర వ్యాధుల చికిత్సకు అయ్యే భారీ వ్యయాలను తట్టుకోగలరు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కింద ఏకమొత్తంలో వచి్చన పరిహారాన్ని దేనికి అయినా వినియోగించుకోవచ్చు. చికిత్స కోసమే వినియోగించాలని లేదు. కనుక రెగ్యులర్ ఇండెమ్నిటీ ఆధారిత ఆరోగ్య బీమా పాలసీ కింద ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, అదనంగా అయ్యే వ్యయాలను క్రిటికల్ ఇల్నెస్ కవరేజీతో గట్టెక్కొచ్చు. కానీ, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ తీసుకున్న వెంటనే అమల్లోకి రాదు. ఓ చిన్న కొర్రీ ఉంటుంది. అదే సర్వైవల్ పీరియడ్. అలాగే, మరికొన్ని షరతులు కూడా ఉంటాయి. వీటిపై అవగాహనతోనే క్రిటికల్ ఇల్నెస్ కవర్ తీసుకోవాలి. సరై్వవల్ పీరియడ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ను ఇండివిడ్యువల్ ప్లాన్గాను, లేదంటే రైడర్గానూ తీసుకోవచ్చు. జీవిత బీమా కంపెనీలు దీన్ని ఎండోమెంట్, టర్మ్ ప్లాన్లకు రైడర్గా అందిస్తుంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాండలోన్ పాలసీగా ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో సరై్వవల్ పీరియడ్ (జీవించి ఉండే కాలం) అనే క్లాజ్ ఉంటుంది. ఏదేనీ క్రిటికల్ ఇల్నెస్ (జాబితాలోని) బారిన పడితే పరిహారం అన్నది, వెంటనే రాదు. క్లెయిమ్ చేసుకోవాలంటే, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత నిరీ్ణత రోజుల పాటు పాలసీదారు జీవించి ఉండాలి . ఉదాహరణకు 30 రోజుల సరై్వవల్ పీరియడ్ ఉందనుకోండి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాతి నుంచి 30 రోజుల పాటు జీవించి ఉన్నప్పుడే క్లెయిమ్కు అర్హత వస్తుంది. ఈ 30 రోజుల్లోపు మరణించినట్టయితే బీమా సంస్థ నుంచి పరిహారం పొందేందుకు అర్హత లభించదు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా 30 రోజుల సరై్వవల్ పీరియడ్ అమలు చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు ఈ సరై్వవల్ పీరియడ్ను తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అయితే 30 రోజుల కాలాన్ని, 15 రోజులకు తగ్గించేందుకు అంగీకరిస్తోంది. ఇందుకు గాను 5 శాతం అదనంగా ప్రీమియంను చార్జ్ చేస్తోంది. మరో 5–10 శాతం అదనపు ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వస్తే, అప్పుడు సరై్వవల్ పీరియడ్ 7 రోజులకు లేదంటే సున్నాకు తగ్గిస్తోంది’’అని ప్రమోట్ ఫిన్టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిషా సంఘ్వి తెలిపారు. వెయిటింగ్ పీరియడ్... పాలసీ కొనుగోలు చేసిన రోజు నుంచి 90–180 రోజుల వరకు క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా కానీ, క్లెయిమ్కు అర్హత లభించదు. ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాత నుంచి పాలసీ అమలు సమయంలో ఎప్పుడైనా వ్యాధి నిర్ధారణ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్నా కానీ, కవరేజీ లేని కాలంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ప్రముఖ బీమా సంస్థలు ఎక్కువ శాతం 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ను అమలు చేస్తున్నాయి. ఎన్నింటికి కవరేజీ..? క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లో మొత్తంగా ఎన్ని వ్యాధులకు కవరేజీ వరిస్తుందన్నది ముఖ్యంగా చూడాల్సిన అంశాల్లో ఒకటి. ఎందుకంటే నేడు జీవనశైలి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధులు, కేన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటోంది. కొన్ని పాలసీలు లేదా రైడర్లు 10–20 వ్యాధులకు కవరేజీ ఆఫర్ చేస్తున్నాయి. 60 నుంచి 99 వ్యాధుల వరకు కవరేజీనిచ్చేవీ ఉన్నాయి. ఎన్ని ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉంటే, అంత మంచిదనుకుంటారేమో..? కానీ, ఇది తప్పుడు అభిప్రాయం. తీసుకునే ప్లాన్లో ముఖ్యమైన వ్యాధులకు, అది కూడా సమగ్రమైన కవరేజీ ఉందా? అన్నదే కీలకం. ‘‘60 లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీనిచ్చే ప్లాన్, కేన్సర్ను పలు దశలుగా వేరు చేసి ఆఫర్ చేయవచ్చు. మరో పాలసీలో కేవలం 25 వ్యాధులకే కవరేజీ ఉండొచ్చు. ఈ ప్లాన్ అన్ని కేన్సర్లను ఒక్కటిగానే పరిగణించి, నిర్ధారణ అయిన వెంటనే క్లెయిమ్కు అనుమతించొచ్చు’’అని ఎలిఫెంట్ డాట్ ఇన్ (అలియన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్) ప్రొడక్ట్ హెడ్ కల్పేష్ చవాన్ పేర్కొన్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం టాప్–5 తీవ్ర వ్యాధులకు సంబంధించి 90% క్లెయిమ్లు వస్తున్నాయి. టాప్–10 క్రిటికల్ ఇల్నెస్లు కాకుండా, ఇతర వ్యాధుల కారణంగా వచ్చే క్లెయిమ్లు చాలా తక్కువ. కనుక దాదాపు 60 అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉందంటే, వాటి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఏ ప్లాన్ తీసుకోవాలనే సందేహం రావచ్చు. అధిక వ్యాధులకు కవరేజీ ఇస్తూ, అందులో ఒక్కో వ్యాధి వారీ కవరేజీ పరిమితి లేకపోవడం, ఉన్నా మెరుగైన కవరేజీ, అన్ని కేన్సర్లను ఒకటిగానే పరిగణించేట్టు అయితే ఆ ప్లాన్ను తీసుకోవచ్చు. లేదంటే ఎలాంటి షరతుల్లేకుండా ఆఫర్ చేసే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, అది టాప్ 25–30 వ్యాధులకు కవరేజీ ఇచ్చేది అయినా నిస్సందేహంగా తీసుకోవచ్చు. సంఖ్య కంటే షరతులు, కవరేజీకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైడర్ – స్టాండెలోన్ ప్లాన్ క్రిటికల్ ఇల్నెస్ను రైడర్గా లేదంటే, స్టాండలోన్ పాలసీగా తీసుకుంటే ఏవైనా వ్యత్యాసాలు ఉంటాయా? అన్న సందేహం కలగొచ్చు. రైడర్ రూపంలో అయితే సులభంగా తీసుకోవచ్చు. బీమా పాలసీ తీసుకునే సమయంలోనే ఈ రైడర్ను కూడా ఎంపిక చేసుకుంటే, ఒకేసారి వైద్య పరీక్షలు చేస్తారు కనుక, మళ్లీ విడిగా తీసుకోవడాన్ని నివారించొచ్చు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్తోపాటు తీసుకుంటే కవరేజీ పరంగా పరిమితి ఉంటుంది. జీవిత బీమా కవరేజీ మించి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కవరేజీ తీసుకోవడానికి అనుమతించరు. అంటే కోరుకున్నంత కవరేజీ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. జీవిత బీమా ప్లాన్తో వచ్చే రైడర్లలో సాధారణంగా వ్యాధి ముదిరిన దశలోనే కవరేజీ అనే షరతు ఉంటుంది. ఉదాహరణకు కేన్సర్ మొదటి దశను ఇవి కవర్ చేయవు. అలాగే, రైడర్లలోనూ రెండు రకాలు ఉన్నాయి. కాంప్రహెన్సివ్ రైడర్ అయితే, బేస్ పాలసీ కవరేజీకి అదనంగా ఉంటుంది. యాక్సిలరేటెడ్ రైడర్ అయితే, బేస్ పాలసీలో భాగంగానే కవరేజీ ఉంటుంది. యాక్సిలరేటెడ్ రైడర్ తీసుకుని ఏదైనా తీవ్ర వ్యాధి బారిన పడి క్లెయిమ్కు వెళితే, ఆ మేరకు బేస్ కవరేజీ తగ్గిపోతుంది. స్టాండలోన్ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లో కవరేజీ విస్తృతంగా ఉంటుంది. పైగా జీవిత బీమా లేదా టర్మ్ ఇన్సూరెన్స్తో తీసుకునే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ జీవితాంతం పనిచేయదు. జీవిత బీమా ఎంత కాలానికి తీసుకుంటారో? అంత వరకే పరిమితం అవుతుంది. విడిగా తీసుకుంటే మీరు జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ సమగ్రంగా చదవడం ద్వారా వేటికి కవరేజీ వస్తుంది, వేటికి రాదు? షరతులు అన్నీ తెలుస్తాయి. స్టాండలోన్ ప్లాన్ ప్రీమియం, రైడర్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. స్టాండలోన్ ప్లాన్లో ప్రీమియం ప్రతి కొన్నేళ్లకోసారి పెరుగుతూ వెళుతుంది. ఈ పెరుగుదల, రైడర్తో పోలి్చనప్పుడు అధికంగా ఉంటుంది. రైడర్లో కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, ప్రతికూలతలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. జీవితాంతం రెన్యువల్కు అవకాశం ఉందా? వ్యాధులకు విస్తృతమైన కవరేజీ ఉందా? సర్వైవల్ పీరియడ్ జీరో లేదంటే 7–15 రోజులుగా ఉందా? (వీలైనంత తక్కువ) అని కూడా చూడాలి. అలాగే, విడిగా ఒక్కో వ్యాధికి సంబంధించి కవరేజీ ఎందులో ఎక్కువ ఉంటే, అదే అనుకూలంగా పరిగణించొచ్చు. ఒకవేళ రైడర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తే, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ను 85–90 ఏళ్ల కాలానికి తీసుకుని, రైడర్ను జోడించుకోవడం సరైనది. అప్పుడు జీవితాంతం టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. ఇక ఇప్పటికే జీవిత బీమా పాలసీ తీసుకుని ఉంటే, అటువంటి వారు ఎలాంటి సందేహం లేకుండా స్టాండలోన్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ను తీసుకోవడం సరైనది. మరీ ముఖ్యంగా కవరేజీ విస్తృతంగా ఉండాలని చెప్పి, భారీ ప్రీమియంతో కూడిన ప్లాన్ తీసుకుంటే, ఆర్థికంగా భారం అవుతుందేమో ఓసారి ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా వ్యాధి బారిన పడితే, ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పి, ప్రస్తుత బడ్జెట్ను భారంగా మార్చుకోరాదు. కనుక తమ పూర్వీకుల ఆరోగ్య చరిత్ర, వ్యాధుల రిస్్కను వైద్య నిపుణుల సూచనతో మదింపు వేసుకుని, అప్పుడు ఎంతకు కవరేజీ తీసుకోవాలనే విషయంలో స్పష్టతకు రావాలి. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, సాధారణ అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే ఆదుకోదు. కనుక రెగ్యులర్ హెల్త్ ప్లాన్ తీసుకోవడం కూడా ఎంతో అవసరం. అందుకే క్రిటికల్ ఇల్నెస్ను బెనిఫిట్ ప్లాన్గా చెబుతారు. రెగ్యులర్ హెల్త్ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ను ఒకే సంస్థ నుంచి తీసుకుంటే కొంత అనుకూలం. టాప్ క్రిటికల్ ఇల్నెస్లు / చికిత్సలు కేన్సర్, యాంజియోప్లాస్టీ(ప్రొసీజర్), హార్ట్ఎటాక్, అరోటా సర్జరీ, హార్ట్ వాల్వ్ వైఫల్యం, కార్డియో మయోపతి, ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్, సీఏబీజీ, క్రానిక్ లంగ్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్, కోమ, స్ట్రోక్, అల్జీమర్స్, మసు్క్యలర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్స్, బ్రెయిన్ సర్జరీ, పోలియోమైలైటిస్, మోటార్ న్యూరాన్ డిసీజ్, బ్యాక్టీరియల్ మెనింజైటిస, ఎన్సెఫలైటిస్, ఎయిడ్స్ (రక్త మార్పిడి వల్ల), థర్డ్ డిగ్రీ కాలిన గాయాలు. కవరేజీ ఎంత..? గుండె జబ్బులకు సంబంధించి శస్త్రచికిత్సల ఖరీదు నేడు 2–5 లక్షల మధ్య ఉంది. వైద్య ద్రవ్యోల్బణం 10 శాతం పైనే ఉంటోంది. కనుక భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత చికిత్సల చార్జీలకు ఐదు నుంచి పది రెట్లు అధికంగా కవర్ తీసుకోవాలి. లేదంటే కనీసం నాలుగైదేళ్ల వార్షిక ఆదాయానికి సమానమైన కవర్ తీసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.5 లక్షలు ఉందంటే, కనీసం రూ.25 లక్షలు అవసరం. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి, ఇండెమ్నిటీ హెల్త్ కవరేజీ చాలనప్పుడు, అదనంగా అయ్యే వ్యయాలను తట్టుకునేందుకు, ఆ కాలంలో నిలిచిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ మాత్రమైనా ఉండాల్సిందే. -
అనివార్య ఖర్చులు, సరదా ఖర్చులు, పొదుపు
ట్రెండ్స్ స్థిరంగా ఉండనట్లే ఆలోచనలు, అభిప్రాయాలు కూడా స్థిరంగా ఉండవు. జెన్ జెడ్, మిలీనియల్స్ కొత్త ప్రయాణం కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? యోలో(వైవోఎల్వో–యూ వోన్లీ లివ్ వన్స్) సెగ్మెంట్లో ఉన్న యువతరం అవసరానికి మించి ఖర్చు చేయడానికి తప్ప‘ఆర్థిక భద్రత’కు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అయితే ఈ ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘యోలో’ నుంచి 50–30–20 కాన్సెప్ట్ వైపు ప్రయాణించడానికి యువతరం ఆసక్తి చూపుతున్నారు... సినిమాల గురించి తప్ప మరో లోకంతో సంబంధం లేనట్లుగా ఉండే మిలీనియల్స్, జెన్ జెడ్ ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్ వరకు ఎన్నో విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది మ్యూచువల్ ఫండ్స్లో నిర్ణీత మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసికం చొప్పున పెట్టుబడిగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్ను అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పదిహేను సంవత్సరాల లాక్–ఇన్ వ్యవధిని కలిగి ఉన్న ప్రభుత్వ పథకం ఇది.‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనే మాట వినబడగానే ‘ఇది నాకు సంబంధించిన విషయం కాదు’ అన్నట్లుగా పట్టించుకునే వారు కాదు చాలా మంది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనేది వయసు మళ్లిన వారికి సంబంధించిన విషయం అన్నట్లుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎర్లీ ఏజ్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తగిన అవగాహనతో ఉన్నారు. అన్ ఎక్స్పెక్టెడ్ మెడికల్ సిచ్యువేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. యాన్యువల్ హెల్త్బడ్జెట్ను ప్లాన్చేసుకుంటున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్’పై ఆసక్తి చూపుతున్నారు. ‘సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జీవన ప్రయాణానికి దిక్సూచి లాంటిది’ అనే మాటను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా కాకుండా ఆచి తూచి సరిౖయెన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఎంచుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ ప్లాన్’ అనే మాట వినబడగానే ఒకప్పుడు యువతరం నోటి నుంచే వచ్చే మాటలు... ‘అబ్బే! అంత టైమ్ లేదు’ ‘ఫైనాన్షియల్ విషయాలు నాకు బొత్తిగా తెలియవు’ ఇప్పుడు మాత్రం ‘బొత్తిగా తెలియదు’ అనుకునే విషయాలపై టైమ్ చేసుకొని మరీ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో మిలీనియల్స్, జెన్ జెడ్ను బాగా ఆకట్టుకున్న కాన్సెప్ట్ 50–30–20 ‘50–30–20’ కాన్సెప్ట్ ప్రకారం సం΄ాదించే జీతంలో అనివార్య ఖర్చులకు 50 శాతం ఖర్చుచేయాలి. ఇంటి అద్దె నుంచి భోజన ఖర్చు వరకు ఇందులో ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం 30 శాతం ఖర్చు చేయాలి. ట్రెండీ దుస్తులు కొనుక్కోవడం నుంచి సినిమాలు చూడడం వరకు ఇందులో వస్తాయి. 20 శాతం మాత్రం తప్పనిసరిగా పొదుపు చేయాలి. ‘మిలీనియల్స్లో చాలామంది ఇన్సూరెన్స్ల గురించి పట్టించుకోవడం లేదు. అనారోగ్యం లేదా ప్రమాదం జరిగిన సందర్భాల్లో మన ఖజానా అంతా ఖాళీ అవుతుంది. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే లైఫ్, హెల్త్, ఆటో ఇన్సూరెన్స్పై మిలీనియల్స్ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి’ అంటున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శరద్ కోహ్లీ. శరద్ సలహా చదివి మారిన వారిలో తేజస్విని ఒకరు. దిల్లీకి చెందిన తేజస్వినికి ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆసక్తి, అవగాహన లేదు. ఇప్పుడు మాత్రం రకరకాల పాలసీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న మిలీనియల్స్, జెన్ జెడ్ దగ్గర ‘ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిటైర్మెంట్’ ప్రస్తావన తెస్తే పెద్దగా నవ్వుతారు లేదా ‘రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం ఎందుకు!’ అన్నట్లుగా మాట్లాడుతారు. అయితే ఈ ధోరణిలో కూడా మెల్లగా మార్పు వస్తుంది. ‘రిటైర్మెంట్ లేదా భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు అత్యవసర సమయాల్లోనే కాదు విదేశీ ప్రయాణం చేయాలి లాంటి చిరకాల కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ప్రతి ఉద్యోగి ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. కొన్ని సమయాల్లో ముందస్తు పదవీ విరమణ తప్పనిసరి కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ ఫర్ రిటైర్మెంట్ను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి’ అంటున్నాడు శరద్ కోహ్లీ. స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కు మాత్రమే యువతప్రాధాన్యత ఇస్తుంది. స్టాక్మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లాంటి మాటలు వినబడితే దూరంగా పారిపోయే వారిని కూడా తన మాటలతో, రాతలతో ఆకట్టుకొని నాలుగు మంచి విషయాలు చెబుతుంది నేహా నగార్. ఎంబీయే చేసిన నేహా స్టార్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్గా యువతలో ఎంతోమంది ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. స్టాక్మార్కెట్, క్రిప్టోకరెన్సీ, ట్యాక్స్యేషన్, ట్రేడింగ్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థం అయ్యేలా చెబుతుంది. ‘మనం ఎలా చెబుతున్నాం అనేదానిపై అవతలి వారి ఆసక్తి ఆధారపడి ఉంటుంది. ఆకట్టుకునేలా, సులభంగా అర్థమయ్యేలా చెప్పగలితే వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు’ అంటుంది నేహా నాగర్. -నేహా నాగర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ -
బీమా ప్రీమియం చెల్లించేందుకు రుణాలు
న్యూఢిల్లీ: ఫిన్టెక్ స్టార్టప్ ‘ఫిన్కేస్’ బీమా ప్రీమియం చెల్లింపుల కోసం రుణ సాయాన్ని అందిస్తోంది. 2025 మార్చి నాటికి ఇలా 10 లక్షల మంది హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారులకు రుణ సాయాన్ని సమకూర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను గడువులోపు చెల్లించడం తప్పనిసరి. పైగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండదు. ఏడాదికి ఒకే ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంత ప్రీమియం ఒకేసారి చెల్లించడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది. అలాంటి వారికి ఈ సంస్థ రుణ సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే, ఆర్థిక ఆస్తులపైనా రుణాలను సమకూరుస్తుంటుంది. ఫిన్కేస్ అందించే రుణంతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించి.. ఆ తర్వాత నెలవారీ ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. డిజిటల్ ఇన్సూరెన్స్లో వెటరన్ అయిన అలోక్ భటా్నగర్ను ఆపరేషన్స్ హెడ్గా నియమించుకుంది. కాగా, దేశంలో 51.4 కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణలో ఉన్నట్టు ఫిన్కేస్ తెలిపింది. ఇందులో కేవలం 10 కోట్లు మాత్రమే రిటైల్ హెల్త్ పాలసీలని (సొంతంగా తీసుకున్నవి) పేర్కొంది. -
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్హెచ్సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా.. రెండు టాపప్ ప్లాన్లు తీసుకోవచ్చా?
నేను స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నాను. రూ.4 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కూడా ఉంది. అంటే నా ముగ్గురు సభ్యుల కుటుంబానికి మొత్తం రూ.10 లక్షల కవరేజీ ప్రస్తుతానికి ఉంది. రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.40 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ను మరో బీమా సంస్థ ఆఫర్ చేస్తోంది. దాని ప్రీమియం చాలా తక్కువ. ఇప్పుడు రూ.40 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే మొత్తం కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా? నేను రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండొచ్చా? – తన్మోయ్ పంజా టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిడక్టబుల్కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్ అంటే, అంత మొత్తాన్ని పాలసీదారు భరించాల్సి ఉంటుంది. అంతకు మించిన మొత్తానికి సూపర్ టాపప్ కవరేజీ అమల్లోకి వస్తుంది. సూపర్ టాపప్ ప్లాన్ తీసుకునేందుకు బేసిక్ కవరేజీ ఉండాలనేమీ లేదు. బేసిక్ టాపప్ ప్లాన్లో డిడక్టబుల్ అనేది హాస్పిటల్లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. కానీ, సూపర్ టాపప్ ప్లాన్లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్ ఖర్చులకు డిడక్టబుల్ అమలవుతుంది. కనుక టాపప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాపప్ ప్లాన్ మరింత ప్రయోజనకరం అని చెప్పుకోవాలి. ఒకే సమయంలో రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు. ప్రస్తుతం ఉన్న ప్లాన్లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్ టాపప్ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్ పాలసీలో లేని రక్షణను సూపర్ టాపప్ ప్లాన్ ఇస్తుంటే తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ రూ.2 లక్షల కవరేజీని ఇస్తుంటే, రూ.2 లక్షల డిడక్టబుల్తో రూ.5 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ ఉంటే.. ఇప్పుడు రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.10 లక్షలకు మరో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్ పాలసీ నుంచి రూ.2 లక్షలు, మొదటి సూపర్ టాపప్ నుంచి రూ.5 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.11 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి రూ.10 లక్షలు చెల్లింపులు వస్తాయి. మిగిలిన రూ.లక్షను పాలసీదారుడు భరించాల్సి ఉంటుంది. అయితే, ఎక్కువ సూపర్ టాపప్ ప్లాన్లు ఉంటే బీమా ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. బేసిక్ పాలసీకి అదనంగా ఒక సూపర్ టాపప్ ప్లాన్ను కలిగి ఉండడం సూచనీయం. మూడు బీ మా సంస్థల వద్ద క్లెయిమ్ కోసం చేయాల్సిన పేపర్ పని ప్రతిబంధకంగా మారుతుంది. కనుక కవరేజీని సాధ్యమైనంత సులభంగా ఉంచుకోవాలి. నేను 1994లో మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. అందుకు సంబంధించి భౌతిక సర్టిఫికెట్ నా వద్ద ఉంది. ఈ మొత్తాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి? వీటి విలువ ఎంత? – వచన్ 2014లో మోర్గాన్ స్టాన్లీ భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయింది. మోర్గాన్ స్టాన్లీ నిర్వహణలోని ఎనిమిది మ్యూచువల్ ఫండ్ పథకాలను హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్ హెచ్డీఎఫ్సీ లార్జ్క్యాప్ ఫండ్లో విలీనం అయింది. హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ 2009 వరకు హెచ్డీఎఫ్సీ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్గా కొనసాగింది. 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన అనంతరం ఇది ఓపెన్ ఎండెడ్ పథకంగా మార్పు చెందింది. ఇప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే, హెచ్డీఎఫ్సీ అస్సె ట్ మేనేజ్మెంట్ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్లో మీ పెట్టుబడులకు సంబంధించి ఆధారాలను సమరి్పంచాలి. అ ప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమైన వారి నుంచి తగిన సహకారం లభిస్తుంది. సమాధానాలు ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆరోగ్య బీమా భారం తగ్గేదెలా..?
రమణ్సింగ్ (68)కు ఇటీవలే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ రెన్యువల్ నోటీస్ వచి్చంది. చూస్తే ప్రీమియం గతేడాది కంటే గణనీయంగా పెరిగిపోయింది. ఏకంగా 30 శాతం అధికంగా చెల్లించాల్సి రావడంతో దీన్ని ఎలా అధిగమించాలా? అనే ఆలోచనలో పడ్డాడు. రమణ్సింగ్కు మాత్రమే ఈ అనుభవం పరిమితం కాదు. దాదాపు అన్ని బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇటీవలి కాలంలో పెంచేశాయి. దీంతో సగటు మధ్యతరగతి వాసులపై హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో భారం పెరిగిపోయింది. కరోనా విపత్తు తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం పాలసీదారులకు తెలిసిన అనుభవమే. దీనికి క్లెయిమ్లు భారీగా పెరిగిపోవడమే కారణమని బీమా సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో వృద్ధులకు హెల్త్ కవరేజీ విషయంలో కొన్ని బీమా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అధిక ప్రీమియంకు తోడు, పలు షరతులు పెడుతున్నాయి. వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారంగా మారుతున్న తరుణంలో దీన్ని తగ్గించుకునే మార్గాల గురించి చర్చించే కథనమే ఇది. బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2020–21లో 94 శాతంగా ఉంటే, అది 2021–22 సంవత్సరానికి 109 శాతానికి పెరిగింది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 100 శాతానికి దిగువన ఉంటేనే బీమా సంస్థలకు లాభం ఉన్నట్టు. 100 అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, తమకు వస్తున్న ప్రీమియానికి మించి అవి చెల్లింపులు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పెరిగిపోయాయి. కరోనా తర్వాత అన్ని వయసుల వారి నుంచి క్లెయిమ్లు 10–30 శాతం వరకు ఎక్కువయ్యాయి. దీనివల్ల వృద్ధులపై భారం పెరిగిపోయింది. వీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పైగా వృద్ధుల్లో క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే సదుపాయం అందరికీ ఉండదు’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ. దీంతో ఈ వయసులోని వారికి సహజంగానే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో క్లెయిమ్లు పెరగడంతో బీమా సంస్థలు ప్రీమియంను మరింత పెంచాయి. ‘‘వృద్ధులకు సహజంగా హెల్త్ రిస్క్లు ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరు హెల్త్ కవరేజీ ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. కనుక క్లెయిమ్ల రిస్క్ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ధారిస్తుంటాయి. 30 ఏళ్ల వయసు వారి ప్రీమియంతో పోలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 2.5 రెట్ల నుంచి 4 రెట్ల వరకు అధికంగా ఉంటుంది’’ అని గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది తెలిపారు. సీనియర్ సిటిజన్లలో కొందరికి బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. వారికి ముందస్తుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వచి్చన ఫలితాలే దీనికి కారణమని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. కోపేమెంట్.. కోపేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే, ప్రతి క్లెయిమ్లో పాలసీదారు తన వంతు కొంత భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. సాధారణంగా ఈ కోపేమెంట్ అనేది బీమా కవరేజీలో 10 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటుంది. 20 శాతం కోపేమెంట్ ఎంపిక చేసుకుంటే, క్లెయిమ్ మొత్తంలో పాలసీదారు 20 శాతం, మిగిలిన 80 శాతం బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. క్లెయిమ్లో తన వైపు భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థ ప్రీమియంలో తగ్గింపును ఇస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోపేమెంట్తో ప్రీమియంలో ఆదా అయిన మొత్తం కంటే, క్లెయిమ్ వచి్చనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తమే అధికంగా ఉంటుంది. అయినా సరే భారీ ప్రీమియం చెల్లించడం కష్టమనుకునే వారు కోపేమెంట్ ఆప్షన్ను పరిశీలించొచ్చు. దీనివల్ల పాలసీ ప్రీమియంలో 30–40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ‘‘వృద్ధులకు అదనపు వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది. కనుక వారు ఆసుపత్రిలో చేరితే ఎక్కువ రోజుల పాటు ఉండాల్సి రావచ్చు. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ను ఎంపిక చేసుకునే వారు ఇన్ పేషెంట్ (ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే వారు)లో గరిష్ట కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్ను పరిశీలించాలి. వ్యాధుల వారీగా ఎవైనా మినహాయింపులు, ఉప పరిమితులు, కోపేమెంట్ ఉన్నాయేమో పరిశీలించాలి’’ అని తపన్ సింఘాల్ సూచించారు. డిడక్టబుల్.. పాలసీదారులు ప్రీమియం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో మరొకటి డిడక్టబుల్ క్లాజ్. ఇది కూడా కోపేమెంట్ మాదిరే పనిచేస్తుంది. ఉదాహరణకు రూ.50,000 డిడక్టబుల్ అనే క్లాజ్ ఉందనుకుంటే.. రూ.50,000 మించిన క్లెయిమ్లకే బీమా సంస్థలు చెల్లింపులు చేస్తాయి. కోపేమెంట్ అలా కాదు. 10 శాతం కోపే ఉంటే రూ.50,000 క్లెయిమ్లో పాలసీహోల్డర్ రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. బీమా సంస్థ రూ.45,000 చెల్లిస్తుంది. కోపేమెంట్ అనేది ప్రతి క్లెయిమ్కు వర్తిస్తుంది. అదే డిడక్టబుల్ అనేది ఏడాది మొత్తానికి (కొన్ని బీమా సంస్థల్లో) స్థిరంగా ఉంటుంది. డిడక్టబుల్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే, ప్రీమియం అంత మేర తగ్గుతుంది. క్లెయిమ్లలో ఆ మేర భారం పాలసీదారులపై పడుతుంది. మరొక ఉదాహరణలో.. ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకుంటే రూ.2,00,000 బిల్లు వచి్చంది. డిడక్టబుల్ రూ.20,000 ఉంటే, అప్పుడు పాలసీదారు ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన రూ.1,80,000 కోసం బీమా సంస్థ వద్ద క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్టబుల్లో ఇప్పటి వరకు చెప్పుకున్నది స్వచ్చందమైనది. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిప్పుడు పొందే రూమ్ వసతి కూడా ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఎలాంటి పరిమితులు లేని ప్లాన్తో పోలిస్తే సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్ ఆప్షన్తో కూడిన పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు ఉంటాయి. అన్నింటిలోకి షేరింగ్ తక్కువగా ఉంటుంది. కనుక షేరింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రీమియం తగ్గేలా చూసుకోవచ్చు. ఒకవేళ షేరింగ్ ఎంపిక చేసుకుంటే.. ఆస్పత్రిలో చేరినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ షేరింగ్ వసతికే పరిమితం కావడం మంచిది. ఖరీదైన వసతి తీసుకుంటే ఆస్పత్రి బిల్లులో కొంత పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం రూమ్ రెంట్ వరకే పరిమితం కాదు. ఎందుకంటే ఖరీదైన వసతిలో ఉండి పొందే వైద్యం సాధారణ షేరింగ్ రూమ్లో పొందే వైద్యంతో పోలిస్తే అధిక వ్యయాలతో ఉంటుంది. కనుక పాలసీ క్లాజ్లో ఉన్న వసతికి మించి ఖరీదైన వసతిలో ఉంటే బిల్లులో కొంత మొత్తాన్ని పాలసీదారు చెల్లించాలి. ఫిట్గా ఉంటే ప్రయోజనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం ద్వారా ప్రీమియంలో తగ్గింపు పొందే అవకాశం ఉంది. రోజువారీ వ్యాయామం చేసే పాలసీహోల్డర్లకు బీమా సంస్థలు రివార్డు పాయింట్లు కేటాయిస్తున్నాయి. ఒక ఏడాది మొత్తం మీద ఇలా పొందిన రివార్డు పాయింట్లను, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంలో తగ్గింపునకు వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు రోజువారీ 10,000 అడుగులు నడవడం. లేదంటే రోజులో కనీసం 4,000 అడుగులు నడవడం వంటివి. లేదా జాగింగ్ చేయడం ద్వారా హెల్త్ రివార్డులు సంపాదించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ రివార్డులతో ప్రీమియంలో నూరు శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. పోర్టింగ్ మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరే, హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు పోర్టింగ్ పెట్టుకోవచ్చు. బీమా సంస్థ సేవలు నచ్చకపోయినా, ప్రీమియం భారం అనిపించినా.. కారణం ఏదైనా పోర్టింగ్ సదుపాయం ఉంది. పోర్టింగ్ వల్ల పూర్వపు బీమా సంస్థలో పొందిన ప్రయోజనాలు క్యారీ ఫార్వార్డ్ (బదిలీ) అవుతాయి. పోర్టింగ్ వల్ల నో క్లెయిమ్ బోనస్ ఒక్కటి నష్టపోవాల్సి రావచ్చు. పాత సంస్థలో ముందు నుంచి ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ పూర్తి చేసి ఉంటే, కొత్త సంస్థలో మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. పాలసీ రెన్యువల్ గడువుకు 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు కొత్త సంస్థ వద్ద పోర్టింగ్ అభ్యర్థన దాఖలు చేసుకోవాలి. ప్రస్తుత పాలసీలోని కవరేజీ ఫీచర్లతో పోలిస్తే, మెరుగైన సదుపాయాలతో తక్కువ ప్రీమియంతో ఆఫర్ చేస్తున్న సంస్థకు మారిపోవడం వల్ల కొంత ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. సూపర్ టాపప్ వృద్ధాప్యంలో నామమాత్రపు కవరేజీ చాలకపోవచ్చు. మెరుగైన కవరేజీతోనే తగినంత రక్షణ లభిస్తుంది. కానీ, మెరుగైన కవరేజీ కోసం ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ ఇండెమ్నిటీ ప్లాన్ను పరిమిత కవరేజీతో తీసుకోవాలి. దీనివల్ల ప్రీమియం తగ్గించుకోవచ్చు. దీనికి అదనపు కవరేజీతో సూపర్ టాపప్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకే పాలసీని అధిక కవరేజీతో తీసుకోవడంతో పోలిస్తే ప్రీమియం చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షలకు బేసిక్ ప్లాన్ తీసుకుని, దీనికి రూ.20 లక్షల సూపర్ టాపప్ చేసుకున్నారని అనుకుందాం. క్లెయిమ్ రూ.5 లక్షలు దాటినప్పుడు, అదనపు మొత్తానికి సూపర్ టాపప్ ఇచి్చన బీమా సంస్థ నుంచి చెల్లింపులు వస్తాయి. రెగ్యులర్ ప్లాన్తో పోలిస్తే ఇలా చేయడం వల్ల ప్రీమియంను 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ టాపప్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కానీ టాపప్, సూపర్ టాపప్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. టాపప్ ప్లాన్లో ఒక పాలసీ సంవత్సరంలో ప్రతి క్లెయిమ్కు విడిగా నిర్ణీత మొత్తం దాటినప్పుడే చెల్లింపులు లభిస్తాయి. సూపర్ టాపప్ ప్లాన్లో అలా కాదు. ఏడాది మొత్తం మీద నిర్ధేశిత డిడక్టబుల్ ఒక్కటిగానే ఉంటుంది. అంటే బేస్ ప్లాన్ రూ.5 లక్షలు తీసుకున్నారు. దీనికి టాపప్ జోడించుకుంటే, ప్రతి క్లెయిమ్లోనూ రూ.5 లక్షలు మించినప్పుడే, రూ.5 లక్షలు మినహాయించి (డిడక్టబుల్) మిగిలినది టాపప్ నుంచి చెల్లింపులు వస్తాయి. అదే సూపర్ టాపప్లో.. ఒక ఏడాదిలో మూడు పర్యాయాలు ఆస్పత్రిలో చేరి (రూ.3లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు) రూ.10 లక్షలు బిల్లు వచి్చ నా, రూ.5 లక్షలు డిడక్టబుల్ పోను, మిగిలిన రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకోవచ్చు. బేస్ ప్లాన్ పరిమిత కవరేజీతో తీసుకుని, సూపర్ టాపప్ జోడించుకోలేని వారు.. చిన్న వాటికి క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే మంచిది. దీనివల్ల నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీని ఎలాంటి అదనపు ప్రీమియం లేకుండా నూరు శాతం వరకు పెంచుకోవచ్చు. వీటిని అనుసరించొచ్చు.. హెల్త్ ఇన్సూరెన్స్ను చిన్న వయసులోనే తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆ వయసులో ఉండవు. దీంతో ప్రీమియం తక్కువగా ఉంటుంది. నేరుగా 60 ఏళ్ల తర్వాత పాలసీ తీసుకునే వారితో పోలిస్తే, ముందు నుంచే హెల్త్ కవరేజీలో ఉన్న వారికి ప్రీమియం కొంత తక్కువ ఉంటుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధిక ప్రీమియాన్ని కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఆన్లైన్ ద్వారా నేరుగా బీమా సంస్థ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రీమియం 5–10% తక్కువగా ఉంటుంది. కమీషన్లు, ఇతర వ్యయాల భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థలు డిస్కౌంట్ ఇస్తాయి. పైగా ఆన్లైన్లో అన్ని బీమా సంస్థల ప్లాన్ల ఫీచర్లు, ప్రీమియంను పోల్చి చూసుకునే వెసులుబాటు పాలసీబజార్ వంటి వేదికలు కలి్పస్తున్నాయి. ఈ విధంగానూ ప్రీమియం భారం తగ్గవచ్చు. ► విడిగా ప్లాన్ తీసుకోవడానికి బదులు కుటుంబం అంతటికీ ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ► అవసరం లేని కవరేజీలకు దూరంగా ఉండాలి. అవసరం లేని యాడాన్లను జోడించుకుంటే ప్రీమియం భారం పెరుగుతుంది. ► రూ.5 లక్షల బేసిక్ కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకుంటే ప్రీమియం ఆదా అవుతుంది. ► తమ పిల్లలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుంటే, వారి కార్యాలయం తరఫున తల్లిదండ్రులు కవరేజీ కల్పించుకోవడం ఒక మార్గం. గ్రూప్ ప్లాన్ కావడంతో ప్రీమియం తగ్గుతుంది. ► ఇక ప్రీమియంలో ఆదా కోరుకునే వారు ఒక ఏడాదికి కాకుండా మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించడాన్ని పరిశీలించొచ్చు. దీనివల్ల ప్రీమియంలో 10 శాతం వరకు ఆదా అవుతుంది. -
టాటా ఏఐజీ నుంచి హెల్త్ సూపర్ చార్జ్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్.. ‘హెల్త్ సూపర్ చార్జ్’ ప్లాన్ను ప్రారంభించింది. దీని కింద పాలసీదారులు ఐదు రెట్లు అధికంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందొచ్చు. ఏటా 50 శాతం రెన్యువల్ బోనస్ చొప్పున గరిష్టంగా 500 శాతం (ఐదు రెట్లు) కవరేజీని పెంచుకోవచ్చు. టైర్–1 నుంచి టైర్–4 వరకు పట్టణాల్లో నివసించే వారి భిన్న రకాల ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్ను తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్, సమ్ ఇన్సూర్డ్ అపరిమిత రీస్టోరేషన్ సదుపాయం, ముందు నుంచి ఉన్న వ్యాధుల వేచి ఉండే కాలాన్ని నాలుగేళ్ల నుంచి 30 రోజులకు తగ్గించుకునే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద రూ.5–20 లక్షల కవరేజీని పొందొచ్చు. ఏటా ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం కూడా ఉంది. -
‘మీరే ఇలా చేస్తే ఎలా?’, కోర్టులో టీసీఎస్కు ఎదురు దెబ్బలు.. భారీ ఫైన్!
దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా డల్లాస్ కోర్టు టీసీఎస్ 210 మిలియన్లను స్థానిక సంస్థ డీఎక్స్సీ టెక్నాలజీకి వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అయితే, అమెరికా సుప్రీం కోర్టు అదే టీసీఎస్..‘ఎపిక్ సిస్టమ్’కు 140 మిలియన్ల జరిమానా కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిన వారం వ్యవధిలో డల్లాస్ కోర్టు సైతం టీసీఎస్కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. టీసీఎస్ అమెరికా చట్టాలను అతిక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందా? మేధో సంపత్తిని తస్కరించడం, ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల తాలుకూ రహస్యాల్ని బహిర్ఘతం చేయడం, సొంత లాభం కోసం ఆయా సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఉపయోగించి వ్యాపారం చేస్తుందా? అంటే అవుననే అంటున్నాయి అమెరికా న్యాయ స్థానాలు. టీసీఎస్ వర్సెస్ కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (సీఎస్సీ) 2018లో టీసీఎస్..కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (సీఎస్సీ) సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాన్స్అమెరికాలోని 2,200 మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. దీంతో పాటు సీఎస్సీ (ఇప్పుడు సీఎస్సీ డీఎక్స్సీ టెక్నాలజీలో కలిసింది) సొంతంగా తయారు చేసుకున్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సోర్స్ కోడ్తో పాటు ఇతర సమాచారాన్ని సేకరించింది. దాని సాయంతో ఇన్సూరెన్స్ మార్కెట్లోని ఇతర కంపెనీలకు గట్టిపోటీ ఇచ్చేలా సొంత ఫ్లాట్ఫామ్ను తయారు చేసుకుంది. అనంతరం 2018లోనే ట్రాన్స్అమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి 10 ఏళ్ల పాటు టెక్నాలజీ సేవలందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఎంఓయూ ఖరీదు 2 బిలియన్ డాలర్లు. ఆ తర్వాత కోవిడ్-19, ఆర్ధిక అనిశ్చితి కారణంగా ట్రాన్స్ అమెరికా .. టీసీఎస్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సమాచారాన్ని తస్కరించి ఈ నేపథ్యంలో సీఎస్సీ యాజమాన్యం టీసీఎస్ తీరును తప్పుబడుతూ డల్లాస్లోని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థకు చెందిన సమాచారాన్ని ఉపయోగించి లైఫ్ ఇన్సూరెన్స్, యాన్యుటీ పాలసీ సేవల్ని కష్టమర్లకు అందించేలా సైబర్లైఫ్ సాఫ్ట్వేర్ను డెవలప్ చేసిందని ఆరోపించింది. తగిన ఆధారాల్ని కోర్టు ముందు ఉంచింది. ఇరువురి వాదనల విన్న కోర్టు టీసీఎస్కు మొట్టికాయలు వేసింది. ‘ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీ మీది. మీరే ఇలా చేస్తే ఎలా? మీరు చేసింది ముమ్మాటికి తప్పే’ అంటూ తీర్పిచ్చింది. 210 మిలియన్లు సీఎస్సీ చెల్లించాలని తీర్పు వెలువరించింది. న్యాయ పోరాటం చేస్తాం కోర్టు తీర్పును సవాలు చేసేందుకు టీసీఎస్ సిద్ధమైంది. న్యాయస్థానం విధించిన జరిమానా కట్టేందుకు తాము సిద్ధంగా లేమని, ఈ అంశంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని టీసీఎస్ అధికార ప్రతినిధి కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. టీసీఎస్ వర్సెస్ ఎపిక్ సిస్టం ఈ తీర్పు వెలువరించక వారం రోజుల ముందు అదే అమెరికా సుప్రీం కోర్టులో టీసీఎస్ (టాటా అమెరికా) కు వ్యతిరేకంగా మరో కేసు విచారణ జరిగింది. 2014లో ఎపిక్ సిస్టం, టాటా లు కలిపి ఓ సంస్థకు (మ్యూచువల్ క్లయింట్)కు సేవలందిస్తున్నాయి. ‘ఆ సమయంలో టీసీఎస్ మా అనుమతి తీసుకోకుండా ఫేక్ ఐడీలతో తమ వెబ్ పోర్టల్ను యాక్సెస్ చేసుకుని 6,000 వేల సమాచారాన్ని తస్కరించింది. ఆ సమాచారంతో మా కాంపిటీటర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాప్ట్వేర్ను డెవలప్ చేయడానికి ఉపయోగించుకుందని ఎపిక్ సిస్టం ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని గతంలో కోర్టు మెట్లెక్కింది. తప్పదు.. చెల్లించాల్సిందే న్యాయ స్థానాలు భారీ ఎత్తున జరిమానా విధించగా.. ఆ ఫైన్ను తగ్గించాలని టీసీఎస్ వాదిస్తుంది. తాజాగా ఈ కేసులో టీసీఎస్కు పై కోర్టు యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద సెవెన్త్ సర్క్యూట్ (యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్) ఇచ్చిన తీర్పు సమంజసంగా ఉందని, 140 మిలియన్లు పే చేయాలని ఆదేశించింది. -
సీనియర్ సిటిజన్స్కు ఆరోగ్య బీమా భరోసా
దేశీయంగా వయస్సు పైబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీఆర్బీ గణాంకాల ప్రకారం 2050 నాటికి 14.4 కోట్ల మంది పైచిలుకు సీనియర్ సిటిజన్స్ ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యానికి, సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మన కుటుంబాల్లో కూడా పెద్దవారికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఆరోగ్య బీమా అవసరం ఎంతైనా ఉంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు వారి అవసరాలను దృష్టిలోఉంచుకోవాలి. ఇందుకోసం అయిదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి: ఆరోగ్యబీమా పాలసీ కవరేజీ సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెయిటింగ్ పీరియడ్, అలాగే ఎలాంటి మెడికల్ చెకప్లు అవసరం లేకుండా అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా కవరేజీ లభించేలా చూసుకోవాలి. ఉదాహరణకు, మణిపాల్ సిగ్నా అందించే ప్రైమ్ సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సీనియర్ల విభిన్న ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినది. ఎటువంటి మెడికల్ చెకప్లు అవసరం లేకుండా 91వ రోజు నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ అనారోగ్య పరిస్థితులకు కవరేజీని అందిస్తుంది. ► కో–పే, ఉప–పరిమితులు ఉండొద్దు: కో–పే, ఉప–పరిమితులు ఉండని హెల్త్ ప్లాన్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే సబ్–లిమిట్ ఉన్న ప్లాన్ వల్ల మళ్లీ మన జేబుపై భారం పడుతుంది. పాలసీ పరిధిలోకి రాని కొన్ని ఖర్చులను మనమే భరించాల్సి వస్తుంది. ► అపరిమితంగా సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరణ: ఆరోగ్య బీమాలో పరిగణనలోకి తీసుకోతగిన మరో పెద్ద అంశం ఏమిటంటే, సమ్ ఇన్సూర్డ్ను అపరిమితంగా రీస్టోర్ చేసే అవకాశం. ఉదాహరణకు మీరు ఏదైనా నిర్దిష్ట అనారోగ్యానికి సంబంధించిన, లేక దానికి సంబంధించని మరోదాని కోసమైనా కొత్తగా క్లెయిమ్ చేసినప్పుడు, మీ హెల్త్ ప్లాన్ తప్పకుండా సమ్ ఇన్సూర్డ్ 100 శాతం పునరుద్ధరించేటువంటిదై ఉండాలి. ► క్యుములేటివ్ బోనస్: క్లెయిమ్స్ గానీ దాఖలు చేయని పక్షంలో కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో సమ్ ఇన్సూర్డ్కి ఏటా 10 శాతం మేర క్యుములేటివ్ బోనస్ జతవుతుంటుంది. సమ్ ఇన్సూర్డ్కి 100 శాతం స్థాయికి చేరే వరకు ఈ బోనస్ ఏటా జతవుతూనే ఉంటుంది. ఫలితంగా పదేళ్లలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కవరేజీ రెట్టింపవుతుంది. ► ప్రివెంటివ్ చెకప్: తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వయో వృద్ధులు తరచుగా వైద్యులను సంప్రదించాల్సి వస్తుంటుంది. అపాయింట్మెంట్లు లభించడం కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. కాబట్టి బీమా సంస్థల నెట్వర్క్ పరిధిలోని డాక్టర్లు, స్పెషలిస్టులతో అపరిమిత టెలీకన్సల్టేషన్స్ (ఫోన్ లేదా చాట్ ద్వారా) సదుపాయం ఇచ్చే ప్లాన్ను ఎంచుకోవడం మంచిది. అలాగే ఏటా నగదురహిత హెల్త్ చెకప్ అందించేదిగా కూడా పాలసీ ఉండాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, వాటి ఫీచర్లు, వ్యయాలను జాగ్రత్తగా పోల్చి చూసుకోవాలి. సీనియర్ సిటిజన్స్కు శారీరకంగాను, ఆర్థికంగాను ప్రయోజనకరంగా ఉండే సమగ్రమైన ఆరోగ్య బీమా కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవాలి. – ప్రియా గిల్భిలే, సీవోవో, మణిపాల్సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ -
మనోళ్ల ‘హెల్త్ కవర్’ అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: జీవిత బీమా, హెల్త్ కవర్–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇదీ అధ్యయనం... తాజాగా భారతీయ టెక్–ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్ కవర్ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్లిమిటెడ్ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్రెంట్ క్యాపింగ్ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది. -
నెలవారీ ప్రీమియంలలో హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.1 కోటి వరకు బీమా కవరేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు దేశంలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలంటే ఏడాది ప్రీమియం ఒకేసారి చెల్లించాల్సిందే. ఇక నుంచి సులభంగా నెల వాయిదాల్లో హెల్త్ పాలసీ తీసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్పే భారత్లో తొలిసారిగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఆరోగ్య బీమా సంస్థలతో ఫోన్పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ చేతులు కలిపింది. ‘రూ.1 కోటి వరకు బీమా కవరేజ్ ఉంది. ఎటువంటి పరిమితి లేకుండా ఆసుపత్రిలో గదిని ఎంచుకోవచ్చు. క్లెయిమ్ చేయనట్టయితే ఏడాదికి బేస్ కవర్ మొత్తం మీద ఏడింతల వరకు బోనస్ కవర్ పొందవచ్చు’ అని ఫోన్పే ప్రకటించింది. ఇదీ చదవండి ➤ IT Dept clarification on PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ ప్రస్తుతానికి ఫోన్పే వేదికగా కేర్ హెల్త్, నివా బూపా నెల వాయిదాల్లో ఆరోగ్య బీమా పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56 లక్షలకుపైగా పాలసీలను విక్రయించినట్టు ఫోన్పే తెలిపింది. ఇక ఫోన్పే యూజర్ల సంఖ్య 47 కోట్లకుపైమాటే. -
హెల్త్ ఇన్సూరెన్స్ సగటు క్లెయిమ్ రూ.42,000
న్యూఢిల్లీ: దేశంలో సగటు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం రూ.42,000గా ఉంది. మొత్తం మీద 15 శాతం క్లెయిమ్లు మాత్రమే రూ.లక్ష మించి ఉంటున్నాయి. సెక్యూర్ నౌ ఈ వివరాలను ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. హాస్పిటల్లో 5 రోజులకు పైగా ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు, క్లెయిమ్ రూ.5 లక్షలు మించుతుందనే విషయాన్ని పాలసీదారులు పరిగణనలోకి తీసుకోవాలని.. అలాగే, బీమా సంస్థలు సైతం పాలసీల రూపకల్పనలో ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని నివేదిక ప్రస్తావించింది. రీయింబర్స్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను పరిశీలించినప్పుడు.. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, క్లెయిమ్ మొత్తం? పరిష్కార శాతం, భారత్లో క్లెయిమ్ పరిష్కార ప్రక్రియలో సమర్థత అంశాలు తెలుస్తాయని సూచించింది. 3,846 రీయింబర్స్మెంట్ క్లెయిమ్ల పత్రాలను సెక్యూర్నౌ విశ్లేషించింది. భౌగోళికంగా భిన్న ప్రాంతాలు, వివిధ బీమా సంస్థల క్లెయిమ్లను పరిశీలించినప్పుడు ఈ అంశాలు తెలిశాయి. క్లెయిమ్లలో 3 శాతం ప్రమాదం కారణంగా ఉంటున్నాయి. వీటి సగటు క్లెయిమ్ రూ.33,000గా ఉంటోంది. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటున్నారనేది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లలో కీలక అంశంగా సెక్యూర్ నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. సాధారణంగా హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవడం అన్నది రెండు రోజులుగా ఉంటుంటే, 21 శాతం కేసుల్లో మూడు రోజులకంటే ఎక్కువగా ఉంటున్నట్టు ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్లో చేరాల్సి వస్తే రక్షణ ఇచ్చే కాంప్రహెన్సివ్ కవర్ అవసరమని తెలిపింది. మేటర్నిటీ క్లెయిమ్లు ఎక్కువ 50 శాతానికి పైగా క్లెయిమ్ల్లో పరిష్కార రేటు 80 శాతానికి పైన ఉంటోంది. మేటర్నిటీ క్లెయిమ్లు మొత్తం క్లెయిమ్ల్లో 20 శాతంగా ఉంటున్నాయి. జ్వరానికి సంబంధించి 5, కంటి సర్జరీలకు సంబంధించి 5 శాతం, ప్రమాదాలకు సంబంధించి 3 శాతం క్లెయిమ్లు వస్తున్నాయి. మొత్తం క్లెయిమ్లలో కేన్సర్ కేసులకు సంబంధించినవి కేవలం ఒక్క శాతంగానే ఉన్నాయి. కాకపోతే సగటు క్లెయిమ్ మొత్తం అధికంగా ఉంటోంది. -
మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? బ్లాక్ లిస్ట్ హాస్పిటల్స్ గురించి తెలుసా?
హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఒకవైపు జీవనశైలి వ్యాధులతో అస్పత్రుల్లో చేరాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు మధ్యతరగతి వాసులకు ఆరోగ్యపరమైన సామాజిక రక్షణ ఏదీ ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే ఆర్థికంగా గుల్ల కాకుండా ఉండాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఉండాల్సిందే. కరోనా ముందు నాటితో పోలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యాన్ని ఎక్కువ మంది నేడు అర్థం చేసుకుంటున్నారు. దీంతో దీన్ని కొనుగోలు చేసే వారి సంఖ్యలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. అయితే ఎవరో చెప్పారనో, ఏదైనా ప్రకటన చూసో హెల్త్ ప్లాన్ తీసుకోవడం కాదు. ఎంపిక చేసుకునే ప్లాన్లో రక్షణ ఏ మేరకు? ఏ ఏ వ్యాధులకు కవరేజీ ఉంది? ఉప పరిమితులు ఉన్నాయా? పాలసీ తీసుకున్న వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చా? ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలకు కవరేజీ లభిస్తుందా? ఇలాంటి ముఖ్యమైన అన్నింటి గురించి పాలసీదారులు తెలుసుకుని ఉండాల్సిందే. లేదంటే క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చికిత్సకు అయిన బిల్లు మొత్తంలో కోతపడుతుంది. పాలసీదారుడు తనవంతు చెల్లించాల్సి వచ్చినప్పుడు విచారిస్తే వచ్చేదేమీ ఉండదు. ఇటువంటి కీలక అంశాలను వివరించే కథనమిది... మన దేశంలో ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ను పన్ను ఆదా కోణంలో తీసుకుంటూ ఉంటారు. పాలసీదారులకు సాధారణంగా కొన్ని ఫీచర్లపై అవగాహన ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మేటర్నిటీ ప్రయోజనాలు ఉంటాయి. నో క్లెయిమ్ బోనస్ ఉంటుందనే విషయాలపై సాధారణంగా అవగాహన ఉంటుంది. కానీ, ఎక్కువ మందికి తెలియని విషయం బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ గురించి. మీరు కొనుగోలు చేయబోయే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కువ ఆస్పత్రుల్లో చికిత్సలకు కవరేజీ ఇచ్చే విధంగా ఉండాలి. ఇంటి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందినా కవరేజీ వస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ, ఇంటి సమీపంలోని హాస్పిటల్ బ్లాక్ లిస్ట్లో ఉంటే, అందులో నగదు రహిత చికిత్స కాదు కదా, ముందే డబ్బులు చెల్లించి తీసుకున్న చికిత్సకు సైతం రీయింబర్స్మెంట్ రాదు. ఎందుకంటే సదరు ఆస్పత్రిని బీమా సంస్థ బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్లేనని తెలుసుకోవాలి. అందుకనే హెల్త్ పాలసీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ముందుగా బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితా చూడాలి. అలాగే, మీరు నివాసం ఉండే ప్రాంతంలో నగదు రహిత చికిత్సలను అనుమతి ఉన్న ఎన్ని ఆస్పత్రులు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ జాబితాలో ఉన్నదీ చూడాలి. కొన్ని చిన్న ఆస్పత్రులు లేదా వ్యక్తులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. మోసపూరిత క్లెయిమ్లు చేస్తుంటారు. అందుకని అన్ని బీమా సంస్థల పరిధిలో సొంతంగా ఓ ఇన్వెస్టిగేషన్ డెస్క్ ఉంటుంది. ఏదైనా ఒక ఆస్పత్రి నుంచి క్లెయిమ్లు భారీగా వస్తుంటే అప్పుడు సదరు ఆస్పత్రిపై ఓ కన్నేసి ఉంచాలని బీమా సంస్థ తన ఇన్వెస్టిగేషన్ డెస్క్ను కోరుతుంది. అప్పు డు సంబంధిత విభాగం క్లెయిమ్లు ఎక్కువగా వస్తున్న లేదా అనుమానాస్పద క్లెయిమ్లు ఎక్కువగా వస్తున్న ఆస్పత్రికి వెళ్లి విచారణ నిర్వహిస్తుంది. తమ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బీమా సంస్థ తదుప రి చర్యలు తీసుకుంటుంది. క్లెయిమ్ల విషయంలో చట్టవిరుద్ధమైన చర్యలు లేదా నిబంధనలకు వ్యతిరేకంగా, మోసపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తేలితే ఆయా ఆస్పత్రిని నిషేధిత జాబితాలోకి మారుస్తుంది. ఇలా బీమా సంస్థలు తాము నిషేధించిన, బ్లాక్ లిస్ట్లో పెట్టిన హాస్పిటల్స్ వివరాలను పాలసీదారులతో ఎప్పటికప్పుడు పంచుకుంటాయి. వెయిటింగ్ పీరియడ్: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే ఏ సమస్య వచ్చినా క్లెయిమ్ చేసుకుంటామంటే నిబంధనలు అంగీకరించవు. కొన్ని రకాల వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉంటుంది. ఈ వివరాలు పాలసీ డాక్యుమెంట్లో వివరంగా ఉంటాయి. ఉదాహరణకు మెటర్నిటీ (ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరడం) కవరేజీ అనేది చాలా పాలసీల్లో ఉన్నా, మొదటి రోజు నుంచే కవరేజీ వస్తుందనుకోవద్దు. ఇందుకోసం కనీసం 12 నెలలు అంతకుమించి వేచి ఉండే కాలం నిబంధన ఉంటుంది. ఆ తర్వాతే మెటర్నిటీ కవరేజీ క్లెయిమ్ చేసుకోగలరు. మరికొన్ని రకాల వ్యాధులకు 24 నెలల వెయిటింగ్ పీరియడ్ అమల్లో ఉంటుంది. పాలసీ తీసుకునే నాటికే వ్యాధులు కలిగి ఉంటే, వాటిని పాలసీ ప్రపోజల్లో వెల్లడించి ఉంటే, కవరేజీ పొందేందుకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) సేవలకు అన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు. ఇది యాడాన్ కవరేజీగా వస్తుంది. హాస్పిటల్లో కనీసం 24 గంటల పాటు చేరి చికిత్స తీసుకుంటేనే ఇండెమ్నిటీ ప్లాన్లో క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. డే కేర్ చికిత్సల కోసం అయితే ఆస్పత్రిలో ఇన్ని గంటల పాటు చేరాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకునే వాటికి కనీసం 24 గంటల నిబంధన అమలవుతుంది. కనుక పాలసీదారులు మొదట బ్లాక్ లిస్ట్ హాస్పిటళ్లు, తర్వాత ఏ వ్యాధికి కవరేజీ కోసం ఎంత కాలం పాటు వేచి ఉండాలి, క్లెయిమ్ కోసం ఎంత సమయం పాటు ఆస్పత్రిలో చేరాలనే విషయాలను తెలుసుకోవాలి. ఫీచర్లపై అవగాహన అవసరం: బీమా సంస్థ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో సాధారణ నిబంధనలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ, ఒక్కో బీమా సంస్థ తమ ఉత్పత్తిని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని అదనపు ఫీచర్లు, కవరేజీలను పాలసీల్లో భాగం చేస్తుంటాయి. ఉదాహరణకు రీస్టోరేషన్ ఫీచర్. దీన్ని చాలా సంస్థలు అందిస్తున్నాయి. ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా మొత్తం ఖర్చయిపోయిందని అనుకోండి. అప్పుడు అదే ఏడాది మరో వ్యక్తి లేదా అదే వ్యక్తి మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వస్తే? అలాంటి సందర్భాల్లో ఆదుకునేదే రిస్టోరేషన్ ఫీచర్. ఏదైనా క్లెయిమ్ కారణంగా బీమా కవరేజీ ఖర్చయిన సందర్భాల్లో బీమా సంస్థలు తిరిగి అంతే మొత్తాన్ని రీసోర్టేషన్ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే ఏడాది మరోసారి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు అది ఆదుకుంటుంది. కొన్ని బీమా సంస్థలు అయితే ఒక ఏడాదిలో ఎన్నిసార్లు ఇలా క్లెయిమ్లు వచ్చినా, అన్ని సార్లు రీస్టోరేషన్ ఫీచర్ను అందిస్తున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరి పూర్తి బీమా కవరేజీని క్లెయిమ్ పొందాడనుకుందాం. అప్పుడు అదే వ్యక్తి అదే వ్యాధితో హాస్పిటల్లో చేరితే రీస్టోరేషన్ కవరేజీని చాలా ప్లాన్లు ఇవ్వడం లేదు. కొన్ని మాత్రం ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినా లేక మరో సమస్యతో చేరాల్సి వచ్చినా రీస్టోరేషన్ కింద కవరేజీని పునరుద్ధరిస్తున్నాయి. కనుక ఈ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకున్న తర్వాతే ప్లాన్ను ఎంపిక చేసుకోవాలి. తప్పక తెలిసి ఉండాలి: ముందు నుంచి ఉన్న వ్యాధులు: అధిక రక్తపోటు, కేన్సర్, మధుమేహం, ఆస్తమా, డిప్రెషన్, స్లీప్ ఆప్నియా, గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు (సీవోపీడీ), స్థూలకాయం, లూపస్, అధెరోస్కెలరోసిస్, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు. పాలసీ కొనుగోలు చేసే నాటికి నాలుగేళ్ల ముందు వైద్యులు నిర్ధారించి, చికిత్స తీసుకున్నవి ముందస్తు వ్యాధుల జాబితాలోకి వస్తాయి. ముందస్తు వ్యాధుల సమాచారం కావాలని వెల్లడించకపోతే.. తర్వాత క్లెయిమ్ సమయంలో బీమా సంస్థ దీన్ని గుర్తిస్తే పరిహారాన్ని నిరాకరిస్తుంది. పాలసీ తీసుకుని ఎనిమిదేళ్లు ముగిసిన తర్వాత క్లెయిమ్ వస్తే అది ముందుగా వెల్లడించని వ్యాధి అయినా సరే తిరస్కరించడం కుదరదు. కనుక పాలసీ దరఖాస్తులో అంతకుముందుగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా, చికిత్స తీసుకున్నా ఆ వివరాలను తప్పకుండా వెల్లడించడం మంచిది. 30 రోజుల వెయిటింగ్: పాలసీ విడుదల చేసిన తేదీ నుంచి మొదటి 30 రోజుల్లో ప్రమాదం లేదా ప్రమాదం కారణంగా తలెత్తే సమస్యలకే క్లెయిమ్ చేసుకోవచ్చు మరే విధమైన చికిత్సకూ క్లెయిమ్ను బీమా సంస్థలు అనుమతించవు. స్పెసిఫిక్ వెయిటింగ్: ముందు నుంచి ఉన్న వ్యాధులు కాకుండా పాలసీ తీసుకున్న తర్వాత 24 నెలల వరకు క్లెయిమ్ చేసుకోలేని ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిజం, జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోస్కోపిక్ మోకాలు సర్జరీ, చెవి, ముక్కు, గొంతు సమస్యలు లేదా సర్జరీలు (సైనసైటిస్, అడెనాయిడ్స్), ప్రొస్టేటిక్ హైపర్ట్రోఫీ, క్యాటరాక్ట్, ఫిస్టులా, హెమరాయిడ్స్, గ్యాస్టిక్ డుయోడినల్ అల్సర్లు, అన్ని రకాల హెర్నియా, హిస్టరెక్టమీ, ఫైబ్రోమయోమా, ట్యూమర్లు, కిడ్నీలో రాళ్లు, యూరెటెరిక్ స్టోన్స్, గ్లాల్ బ్లాడర్లో రాళ్లు, వారికోస్ వెయిన్స్, పార్కిసన్స్/అల్జీమర్స్/డిమెన్షియా తదితర వాటితో బీమా కంపెనీ డాక్యుమెంట్లో 24 నెలల వెయిటింగ్ జాబితా ఉంటుంది. వీటికి రెండేళ్ల తర్వాతే క్లెయిమ్ వస్తుంది. శాశ్వత మినహాయింపులు: హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, దేనికైనా పరిహారం వస్తుందిలేనని అనుకోవద్దు. కొన్నింటికి శాశ్వతంగా క్లెయిమ్ రాదు. వీటి జాబితా బీమా నియమ, నిబంధనల డాక్యుమెంట్లో ఉంటుంది. ఏదైనా వ్యాధి నిర్ధారణ కోసం ఆస్పత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. వైద్యుల సిఫారసు లేకుండా బరువు తగ్గేందుకు సొంతంగా తీసుకునే చికిత్సలు, లింగమార్పిడి చికిత్సలు, కాస్మెటిక్ లేదా ప్లాస్టిక్ సర్జరీలకు (ప్రమాదం కారణంగా చేసుకోవాల్సిన వాటికి మినహాయింపు) క్లెయిమ్ రాదు. మెటర్నిటీ వెయిటింగ్: సాధారణంగా మెటర్నిటీ కవరేజీ కోసం బీమా సంస్థలు ఏడాది నుంచి మూడేళ్ల పాటు వేచి చూడాలనే నిబంధన అమలు చేస్తున్నాయి. వెయిటింగ్ను తగ్గించుకోవచ్చా..? వేచి ఉండే కాలాన్ని తగ్గించుకునేందుకు చాలా బీమా సంస్థలు ప్రత్యేక రైడర్తో అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకు అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ముందస్తు వ్యాధులకు కవరేజీని 2 ఏళ్లకు తగ్గిస్తున్నాయి. పాలసీ తీసుకున్న నాటి నుంచే ముందస్తు వ్యాధులకూ కవరేజీనిచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. గ్రూప్ హెల్త్ ప్లాన్లో దాదాపుగా వెయిటింగ్ పీరియడ్ ఉండడం లేదు. వేచి ఉండే కాలంలో కొత్తగా నిర్ధారణయ్యే వ్యాధులను ముందు నుంచి ఉన్నవిగా పరిగణించరు. సమీప బంధువులకు షేర్ చేయాలి: ఆస్పత్రిలో చేరిన వెంటనే బీమా సదుపాయం ఉందా? అని అక్కడ సిబ్బంది ప్రశ్నించడం వినే ఉంటారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెబితే, అందులో చికిత్స వ్యయాలకు ఎంత మేర కవరేజీ వస్తుంది? రాదనే విషయాలను వారు చెబుతారు. ముందుగా నిర్ణయించుకుని తీసుకునే చికిత్సల విషయంలో కవరేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే డిశ్చార్జ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే సాధారణంగా పాలసీదారులు చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఆస్పత్రిలో చేరగా, వారి సంబంధీకులు బీమా తదితర వ్యవహారాలు చూస్తుంటారు. వారికి కవరేజీ విషయమై అవగాహన ఉండదు. అందుకని పాలసీదారులు తమ బీమా క్లెయిమ్కు సంబంధించి తమ కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు కొన్ని ఫీచర్లు, ముఖ్యమైన అంశాల గురించి తప్పకుండా చెప్పాలి. అందులో ముఖ్యమైనది రూమ్రెంట్ కవరేజీ. రూమ్ రెంట్కు ఎలాంటి పరిమితులు లేనట్టయితే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ షేర్డ్ రూమ్, సింగిల్ రూమ్ అని నిబంధన ఉంటే మిమ్మల్ని ఆస్పత్రిలో ఆయా వసతుల్లోనే చేర్చాలని సూచించాలి. పాలసీలో చెప్పినదానికంటే ఖరీదైన వసతి తీసుకుంటే బిల్లు ఎక్కువ వస్తుంది. దాంతో ఆ మేరకు బీమా సంస్థ క్లెయిమ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. అప్పుడు మిగిలినది పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ముందు నుంచి వ్యాధులు ఉండి, వాటిని పాలసీ దరఖాస్తులో వెల్లడించి ఉంటే వాటి గురించి వివరంగా చెప్పాలి. లేదంటే లిఖితపూర్వకంగా ఈ విషయాలను ఒక పేపర్పై రాసి ఇవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. హాస్పిటల్ క్యాష్ ఫీచర్ ఉంటే అది కూడా తప్పకుండా చెప్పాలి. హాస్పిటల్ క్యాష్ అనేది.. చికిత్స కోసం ఆసుపత్రిలో పాలసీదారు చేరినప్పుడు, వారికి సహాయంగా ఉండే వారికి రోజువారీ చెల్లింపులు చేస్తుంది. ఇది రోజువారీ రూ.500 నుంచి రూ.2,000 మధ్య ఉంటుంది. రీస్టోరేషన్ గురించి కూడా చెప్పాలి. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనేది కొన్ని ప్లాన్లలో ఇన్బిల్ట్గా ఉంటే, కొన్నింటిలో యాడాన్ కవర్గా వస్తోంది. -
పొదుపు సూత్రం మర్చిపోతున్న భారతీయ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విప్లవం, పాశ్చాత్య ధోరణి ప్రభావంతో వ్యక్తుల ఆదాయానికి, ఖర్చుకు మధ్య పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. పేరుకే ఉద్యోగం.. చివరికి మిగిలేది అప్పే అన్నట్లుగా ఉద్యోగుల పరిస్థితి దిగజారింది. సంపాదనకు తగిన విధంగా పొదుపు చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిధుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. అకస్మాత్తుగా లే–ఆఫ్లు వస్తే కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని దుస్థితిలో భారతీయ ఉద్యోగులు ఉండటం శోచనీయం. ఉద్యోగం కోల్పోతే నెల కూడా ఉండలేరు.. 75 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఎటువంటి పొదుపు మొత్తాన్ని దాచుకోవట్లేదని దేశీయ ఆర్థిక, పెట్టుబడి, స్టాక్ మార్కెట్ కోర్సులు, రీసెర్చ్ టూల్స్ సంస్థ ఫినాలజీ తాజా సర్వేలో వెల్లడించింది. మూడు లక్షల మంది భారతీయ ఉద్యోగుల నుంచి ‘ఇండియాస్ మనీ హ్యాబిట్స్’ పేరిట డేటాను సేకరించింది. దీని ప్రకారం.. ఉన్నపళంగా ఉద్యోగం కోల్పోతే ప్రతి నలుగురిలో ఒకరు ఒక నెలపాటు కూడా పరిస్థితులను తట్టుకోలేరని వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆరోగ్య బీమా లేదని.. ఆనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు ఎదురైతే పరిస్థితి అగమ్యగోచరమేనని తెలిపింది. భద్రత పాలసీలకు దూరంగా.. ఇక దేశంలో కొంతమేర పెరిగిన అవగాహన, కంపెనీల్లో తప్పనిసరి కావడంవల్ల 30–40 ఏళ్ల వయస్సు ఉద్యోగులు బీమా పాలసీలను తీసుకుంటే.. 20–30 ఏళ్ల వయస్సు వారి బీమా పాలసీ స్కోరు చాలా దారుణంగా ఉందని నివేదిక పేర్కొంది. అధిక ఆర్జన కారణంగా విలాసవంతమైన జీవనశైలిపై ఎక్కువ ఖర్చుచేయడం వారి ప్రధాన అంశంగా మారిపోయిందని.. ఫలితంగా పొదుపు సూత్రాన్ని పాటించడమే లేదని సర్వే కుండబద్దలు కొట్టింది. ప్రతీ ఆరుగురు భారతీయ ఉద్యోగుల్లో కనీసం ఒకరికి కూడా ఎటువంటి పాలసీ కవరేజీ లేకపోవడం భవిష్యత్తు ఆలోచనకు దూరంగా ఉండటమేనని చెప్పింది. క్రిటికల్ ఇల్నెస్లో 69 శాతం మందికి, ప్రమాదవశాత్తూ మరణిస్తే 65 శాతం మందికి సరైన భరోసా దక్కట్లేదని గుర్తించింది. ఈ క్రమంలోనే కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే 68 శాతం మంది స్టాక్మార్కెట్లు నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. 15 రోజులకే జీతం ఖాళీ.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఉద్యోగుల జీతం 15 రోజులకే ఖాళీ అయిపోతున్నట్టు తెలిపింది. అలాగే.. ♦ ఇక్కడ నలుగురిలో ఒకరు రోజుకు వచ్చే జీతం కంటే ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. ♦ ఆరుగురిలో ఒకరు తమ వద్ద ఉన్నదాని కంటే రెండు రెట్లు బాకీ ఉన్నారు. ♦ ఈఎంఐలు కట్టడానికి డబ్బులు అందుబాటులో లేకుంటే మెజారిటీ ఉద్యోగులు స్టాక్స్ వెనక్కి తీసుకుంటుంటే.. 24శాతం మంది ఈఎంఐలు కట్టడానికే తిరిగి రుణాలు తీసుకుంటున్నారు. ♦ ఐదు శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ♦ 15 శాతం మంది ఈఎంఐలు కట్టలేక ఎగ్గొడుతున్నట్లు సర్వే వెల్లడించింది. అప్పుల ఊబిలో.. మరోవైపు.. ప్రతీ ఐదుగురు భారతీయ ఉద్యోగుల్లో ఇద్దరు ఎప్పటికీ అప్పుల ఊబి నుంచి తప్పించుకోలేరని నివేదిక హెచ్చరించింది. 27 శాతం మంది ప్రస్తుతం అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుండగా 68 శాతం మంది పదవీ విరమణ ప్రణాళిక లేకుండా గడిపేస్తున్నారని ప్రస్తావించింది. ఇక 53 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు చూసుకుంటున్నారని.. 36 శాతం మంది పెన్షన్ ఫండ్స్, 7 శాతం మంది అద్దె వస్తుందని, నాలుగు శాతం మంది తమ పిల్లలు చూసుకుంటారనే ధీమాలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. -
ప్రస్తుత హెల్త్ పాలసీ నచ్చడం లేదా? మరో పాలసీకి మారిపోండిలా..
హైదరాబాద్కు చెందిన క్రాంతి కుమార్ గతేడాది అత్యవసరంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సింగిల్ ఏసీ రూమ్ను ఆయన ఆసుపత్రిలో తీసుకున్నారు. మూడు రోజులకు కలిపి రూ.88,000 బిల్లు వచ్చింది. అతడికి రూ.4 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండడంతో నిశ్చింతగా ఉన్నాడు. కానీ, బీమా సంస్థ నుంచి పూర్తి పరిహారం అందలేదు. క్రాంతి తన వంతుగా రూ.33,000ను చెల్లించాల్సి వచ్చింది. అదేమని ప్రశ్నించగా.. బీమా కవరేజీలో రూమ్ రెంట్ పరిమితి 1 శాతంగా ఉంది. కానీ, అతడు ఎంపిక చేసుకున్న రూమ్ రోజువారీ అద్దె 1 శాతం కంటే మించి ఉంది. ఈ షరతు చూసిన తర్వాత అతడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీంతో కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. ఇది క్రాంతి కుమార్ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. దశాబ్దం క్రితం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుని, కొనసాగుతున్న వారంతా ఎదుర్కొంటున్నారు. క్లెయిమ్ పరిష్కారాల్లో జాప్యం, ఏదో రకమైన కొర్రీ పెట్టి తక్కువ పరిహారాన్ని చెల్లించడం, అధిక ప్రీమియం వసూలు లేదా నాసిరకమైన సేవలతో సరిపెట్టడం.. ఇలా ఎన్నో కారణాలతో పాలసీదారులు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంటోంది. దీంతో చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ఫలితంగా ఎన్నో సర్జరీలకు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏర్పడడం లేదు. అదే రోజు డిశ్చార్జ్ అయి వెళ్లొచ్చు. ఒకవైపు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ.. మరోవైపు జీవనశైలి వ్యాధులతో ఔట్ పేషెంట్ సేవల అవసరం పెరుగుతోంది. మారుతున్న ఈ అవసరాలు అన్నీ మన ఆరోగ్య బీమా కవరేజీలో భాగంగా ఉన్నప్పుడు అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే సమగ్రమైన హెల్త్ కవరేజీతో ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న పాలసీ సమగ్ర కవరేజీకి భరోసా ఇవ్వనట్టయితే.. చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంటే, బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోతే, ప్రీమియం భారంగా మారితే అప్పుడు మన ముందు రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బీమా సంస్థను మార్చడం. లేదంటే ప్రస్తుత సంస్థలోనే మెరుగైన ప్లాన్కు మారిపోవడం (మైగ్రేషన్). వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సేవల పట్ల సంతృప్తిగానే ఉండి, పాలసీలోని కవరేజీ ఫీచర్లు, ప్రీమియం విషయంలో సంతృప్తిగా లేకపోతే అప్పుడు మీ ప్లాన్ను పోర్టింగ్ పెట్టుకోవడానికి బదులు, అదే బీమా సంస్థలో మెరుగైన ఫీచర్లతో కూడిన మరో ప్లాన్ను మైగ్రేట్ అవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. పోర్టింగ్ అంటే ప్రస్తుత బీమా సంస్థను వీడి, మరో బీమా సంస్థకు మారిపోవడం. మైగ్రేషన్ అంటే ప్రస్తుత బీమా సంస్థలోనే మరో ప్లాన్కు మారిపోవడం. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనల కింద ఒక వ్యక్తి తన పాలసీని ఎలాంటి బ్రేక్ లేకుండా వరుసగా నాలుగేళ్ల పాటు రెన్యువల్ చేసుకుంటే, అప్పుడు ప్రస్తుత బీమా ప్లాన్ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మైగ్రేషన్కు అర్హత లభిస్తుంది’’అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. ఎప్పుడు మార్చుకోవాలి..? ‘‘కస్టమర్లు ప్రస్తుత హెల్త్ ప్లాన్ కవరేజీ పట్ల అసంతృప్తితో ఉంటే లేదా ప్రస్తుత బీమా సంస్థ సేవలు నచ్చకపోతే లేదా సమగ్రమైన, వినూత్నమైన బీమా పాలసీ అందుబాటు ప్రీమియానికి లభిస్తుంటే పోర్ట్ పెట్టుకోవచ్చు. కాకపోతే నూతన పాలసీ ప్రయోజనాలు, నూతన సంస్థ సేవల సదుపాయాలను ప్రధానంగా చూడాలి’’అని షా సూచించారు. ‘‘మార్కెట్లో ఉన్న ప్రతీ నూతన ఉత్పత్తి అందరికీ సరిపోకపోవచ్చు. వేరొక సంస్థలోని ప్లాన్లో ఉన్న ఆకర్షణీమయైన ఫీచర్లను చూసి మారిపోవడం సరికాదు. మీ అవసరాలు, కుటుంబ సభ్యులు, వయసు తదితర అంశాల ఆధారంగా కొత్త ఉత్పత్తిని మదింపు వేయాలి’’అని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోయినా, కస్టమర్ సేవలు నచ్చకపోయినా, ప్రస్తుత బీమా సంస్థ అందిస్తున్న సేవలు నాసిరకంగా ఉన్నా, సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్ను తిరస్కరించినా అప్పుడు మారిపోవడాన్ని పరిశీలించొచ్చని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాథుర్ సూచించారు. సరైన సమాచారం పొందలేకపోవడం, పారదర్శకత లేమి, కంపెనీ నుంచి సత్వర స్పందన లేకపోవడం, విలువ ఆధారిత సేవలు లేకపోయినా పోర్టింగ్ను పరిశీలించొచ్చని తెలిపారు. ఇప్పటికే బీమా పాలసీ ఉండి, అందులోని నిబంధనల వల్ల సొంతంగా చెల్లింపులు చేసుకోవాల్సి వస్తుంటే, రూమ్ రెంట్ పరంగా ఉప పరిమితులు ఉంటే, మీకు దీర్ఘకాలిక వ్యాధి ఉండి ఓపీడీ లేదా డేకేర్ కవరేజీ లేకపోతే, మీ ప్లాన్లో రీస్టోరేషన్ (బీమా ఖర్చయితే తిరిగి పునరుద్ధరించడం) ఫీచర్ లేకపోయినా, ముందు నుంచి ఉన్న వ్యాధులకు దీర్ఘకాలం వెయిటింగ్ పీరియడ్ ఉన్నా, అప్పుడు మీ వంతు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. దీనికి బదులు వేరొక ప్లాన్కు మారిపోవడమే నయం. ఉదాహరణకు నివాబూపా సంస్థ రెండు గంటలకు మించి హాస్పిటలైజేషన్ అయితే చాలు చెల్లింపులు చేస్తోంది. అదే ఆదిత్య బిర్లా సంస్థ అయితే ఆరోగ్యకర జీవనశైలిని (కంపెనీ చెప్పినట్టు) అనుసరిస్తే అప్పడు ప్రీమియంలో నూరు శాతం వరకు రాయితీని ఆఫర్ చేస్తోంది. సాధారణంగా పోర్టింగ్ లేదా మైగ్రేషన్కు ప్రీమియం ఒక్కటినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే అన్ని బీమా సంస్థలు కొన్నేళ్లకోసారి ప్రీమియంను సవరిస్తుంటాయి. అలాగే వయసు వారీగా కూడా ప్రీమియం పెంపు ఉంటుంది. అలాగే, బీమా కవరేజీని పెంచుకునేందుకు సైతం పోర్టింగ్ సరికాదు. దీనికి బదులు టాపప్ లేదా సూపర్ టాపప్ రూపంలో అదనపు కవరేజీని యాక్టివేట్ చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ కవరేజీకి మించి క్లెయిమ్ వచ్చిన సందర్భాల్లోనే టాపప్, సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తాయి. ఏమి చూడాలి..? మీ అవసరాలకు సరిపడే ప్లాన్ను ఎంపిక చేసుకోవాలి. పాలసీ వర్డింగ్స్, పాలసీ బ్రోచర్ను అన్ని పేజీలు చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి. తద్వారా ప్లాన్ ఆకర్షణీయమా? కాదా? అన్నది చూడొచ్చు. క్లెయిమ్ పరిష్కారాల విషయంలో నూతన సంస్థ పనితీరును విశ్లేషించాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, క్లెయిమ్ చెల్లింపుల సామర్థ్యాలను చూడాలి. క్లెయిమ్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంతో బీమా సంస్థల స్పందనను చూడాలి. ప్రీమియం ఎక్కువ ఉన్నా సరే, క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారం పడని పాలసీని ఎంపిక చేసుకోవాలి. ఓపీడీ కవరేజీ, డేకేర్, రీస్టోరేషన్ కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో ఒక క్లెయిమ్ వల్ల బీమా కవరేజీ మొత్తం ఖర్చయినప్పుడు.. రీస్టోరేషన్ కింద బీమా సంస్థ అంతే మొత్తాన్ని పునరుద్ధరిస్తుంది. దీనివల్ల అదే ఏడాది మళ్లీ ఆసుపత్రిలో చికిత్స అవసరం పడితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులోనూ కొన్ని సంస్థలు ఒక ఏడాదిలో ఒకరు ఎన్ని సార్లు ఆసుపత్రిలో చేరినా, గతంలో క్లెయిమ్ చేసిన వ్యాధులకు సైతం రీస్టోరేషన్ (అన్ లిమిటెడ్) ఇస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు సాధారణంగా 3–4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనివల్ల వాటికి కవరేజీ కోసం అన్నేళ్లు ఆగక తప్పదు. దీనికి బదులు ఏడాది, అసలు వెయిటింగ్ పీరియడ్ లేని (రైడర్) పాలసీలు మెరుగైనవి. నో క్లెయిమ్ బోనస్ అనేది ప్రీమియం తగ్గింపు రూపంలో కాకుండా, బీమా కవరేజీ పెంపు రూపంలో ఉంటే ఎక్కువ ప్రయోజనం. రూమ్ రెంట్ పరిమితులు లేకుండా చూసుకోవాలి. ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సి వస్తే (కరోనా వంటి సమయాల్లో) కవరేజీనిచ్చే డోమిసిలరీ ట్రీట్మెంట్ కవరేజీ ఫీచర్ ఉంటే మంచిదే. దరఖాస్తు తిరస్కరణ..? మంచి ఆరోగ్య చరిత్ర ఉండి, సరైన వివరాలు, డాక్యుమెంట్లు అందిస్తే నూతన సంస్థ పోర్టింగ్ అభ్యర్థనను ఆమోదించి పాలసీ మంజూరు చేస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండి, ఇచ్చిన సమాచారంలో అస్పష్టత, గోప్యత ఉంటే, లేదా ఇతర కారణాలతో పాలసీ ప్రపోజల్ను తిరస్కరించొచ్చు. ఎందుకంటే అప్పటికే ఉన్న ఆరోగ్య చరిత్రను పాత సంస్థ నుంచి నూతన బీమా సంస్థ తీసుకుంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. పాత బీమా సంస్థకు దరఖాస్తు సమయంలో ఇచ్చిన దానికి భిన్నమైన సమాచారం కొత్త సంస్థకు అందించినట్టయితే తిరస్కరణకు అవకాశాలుంటాయి. అటువంటి సందర్భంలో కొత్త సంస్థను బతిమిలాడే బదులు, ఉన్న సంస్థతోనే కొనసాగడం మంచి నిర్ణయం అవుతుంది. దీనికి బదులు ప్రస్తుత బీమా సంస్థలోనే మెరుగైన ఫీచర్లతో కూడిన ప్లాన్కు మైగ్రేట్ అవ్వడం మరో మంచి ఆప్షన్. అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే, పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించాలనేమీ లేదు. ముఖ్యంగా తనకున్న వ్యాధులకు పాత ప్లాన్లో క్లెయిమ్ చేసుకుని ఉంటే పోర్టింగ్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత పాలసీ రెన్యువల్కు సంబంధించి ల్యాప్సెస్ ఉంటే అది కూడా తిరస్కరణకు కారణం అవుతుంది. నిబంధనల మేరకు రెన్యువల్ సమయంలో సంప్రదించకుంటే అప్పుడు పోర్టింగ్ విజయవంతం కాదు. అందుకే రెన్యువల్కు 60రోజుల ముందు సంప్రదించాలి. 70 ఏళ్లు దాటిన వారికి పోర్టింగ్కు అవకాశం ఉండదు. పోర్టింగ్ ఎలా..? నూతన సంస్థకు మారిపోవాలని నిర్ణయించుకుంటే రెన్యువల్ సమయంలోనే అనుమతిస్తారు. పాలసీ రెన్యువల్ తేదీకి 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు నూతన బీమా సంస్థకు పోర్టింగ్ గురించి తెలియజేయాలి. ఈ సమయంలో వీలు కాకపోతే, తిరిగి రెన్యువల్ వరకు వేచి చూడాల్సిందే. ప్రపోజల్ పత్రం, పోర్టబులిటీ దరఖాస్తు పత్రాలను నింపాలి. ఆరోగ్య చరిత్ర, బీమా సంస్థ కోరిన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ, ఇతర పత్రాలను కూడా అందించాలి. గత పాలసీ పరిధిలో క్లెయిమ్ చేసి ఉంటే, డిశ్చార్జ్ సమ్మరీ జోడించాలి. అనంతరం ప్రస్తుతం బీమా సంస్థకు పోర్టింగ్ సమాచారం వెళుతుంది. అప్పుడు ప్రస్తుత సంస్థ సదరు పాలసీదారుకు సంబంధించి క్లెయిమ్, ఇతర సమాచారాన్ని కొత్త సంస్థతో పంచుకోవాలి. అప్పుడు నూతన బీమా సంస్థ 15 రోజుల్లోపు తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పాలసీ దరఖాస్తును ఆమోదిస్తే ప్రీమియం చెల్లించాలి. వీటిని గమనించాలి.. పోర్టింగ్ సమయంలో పాత ప్లాన్లో నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలు ఉంటే, కొత్త ప్లాన్లోనూ జతవుతాయి. కానీ, దీనికి కంపెనీలు షరతు పెడుతున్నాయి. ప్రస్తుత కవరేజీ రూ. 5 లక్షలు ఉండి, కొత్త సంస్థలోనూ రూ.5 లక్షలే తీసుకుంటే, పాత ప్లాన్ పరిధిలోని నో క్లెయిమ్ బోనస్ పోర్టింగ్ అవ్వదు. అదే రూ.6 లక్షలు తీసుకుంటే నో క్లెయిమ్ బోనస్ కలుస్తుంది. పోర్టింగ్ లేదా మైగ్రేషన్ను కొత్త ప్రపోజల్గానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. అండర్రైటింగ్ నిబంధనల మేరకు ప్రీమియం నిర్ణయిస్తాయి. బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ను మాత్రమే మరో బీమా సంస్థ పరిధిలోని బీమా ఇండెమ్నిటీ ప్లాన్కు మార్చుకోగలరు. అంతేకానీ, టాపప్ లేదా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ను మార్చుకోలేరు. ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు హెల్త్ ప్లాన్ను పోర్టింగ్ పెట్టుకుంటే ఎలాంటి చార్జీల్లేవు. కార్పొరేట్ లేదా గ్రూప్ ప్లాన్లల ఉన్న వారికి ఇండివిడ్యువల్ ప్లాన్కు పోర్టింగ్ అవకాశం లేదు. వారు అదే సంస్థతో కొసాగాల్సిందే. -
ఇవి తెలుసుకోకుండా ఆరోగ్య బీమా కంపెనీ ఎంచుకోకండి
కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా అవసరంపై అవగాహన పెరిగింది. అయితే దేశీయంగా 24 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, 5 ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నందున సరైన బీమా సంస్థను ఎంచుకోవడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా సంస్థను ఎంచుకునే ముందు పరిశీలించాల్సిన అయిదు ముఖ్య అంశాల గురించి వివరించేదే ఈ కథనం. ► క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి: బీమా సంస్థకు ఎన్ని క్లెయిమ్స్ వస్తే అది ఎన్నింటిని సెటిల్ చేసిందనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. 93–94 శాతం లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తి ఉన్న సంస్థలను మాత్రమే ఎంచుకోవడం మంచిది. ► వినియోగదారుల ఫిర్యాదులు: ఇది వరకే ఉన్న వినియోగదారులు సదరు బీమా సంస్థపై ఏమైనా ఫిర్యాదులు చేశారా అనేది కూడా చూసుకోవాలి. క్లెయిమ్ ఫిర్యాదులు, పాలసీ ఫిర్యాదుల వివరాలు ‘Nఔ–45 (గ్రీవెన్స్ డిస్పోజల్) ఫారం’లో ఉంటాయి. దీన్ని ప్రతి బీమా కంపెనీ అందుబాటులో ఉంచాలి. ఫిర్యాదులు తక్కువగా ఉండటం మెరుగైన కస్టమర్ అనుభవాన్ని సూచిస్తుంది. ► ఆన్లైన్ కస్టమర్ రేటింగ్స్: గూగుల్, ఫేస్బుక్లో లభించే కస్టమర్ రేటింగ్స్ వల్ల కూడా కస్టమర్లు ఎంత సంతృప్తిగా ఉన్నారనేది తెలుసుకోవచ్చు. రేటింగ్ ఎక్కువగా ఉన్న బీమా సంస్థలు మెరుగై న సర్వీసులు అందిస్తున్నాయని భావించవచ్చు. ► ప్రీమియం చార్జీలు, ప్రయోజనాలు: మనం తీసుకునే పాలసీకి ఎంత ప్రీమియం వసూలు చేస్తున్నారనేది అందరూ ఎక్కువగా గమనించే అంశం. అయితే, ప్రీమియం తక్కువగా ఉందనే ప్రాతిపదికన పాలసీలను ఎంచుకోవడం అన్ని వేళలా సరి కాకపోవచ్చు. బీమా సంస్థ అందించే ఆరు కీలక ప్రయోజనాలతో ప్రీమియంను పోల్చి చూసుకోండి. గది అద్దెపై పరిమితి లేకపోవడం, సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ లేదా పునరుద్ధరణ బెనిఫిట్ (ఎటువంటి మినహాయింపుల నిబంధనలు లేకుండా), ఆఫర్ చేసే క్యుములేటివ్ బోనస్ పర్సంటేజీ (కనిష్టంగా 50 శాతం, అంతకంటే ఎక్కువ), కో–పేమెంట్ లేకుండా, కన్జూమబుల్స్కు కూడా మంచి కవరేజీ, ప్రీ–పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రయోజనం (కనీసం 60/90 రోజుల వరకు), అలాగే అవయవదాత ఖర్చులు వీటిలో ఉంటాయి. ► డిస్కౌంట్లు: మీరు ఎంచుకున్న పాలసీ ఖరీదైనది అయితే ప్రీమియంను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. నేడు మార్కెట్లో ఉన్న చాలా బీమా సంస్థలు 5–20 శాతం తగ్గింపు అందిస్తున్నాయి. అధిక వెయిటింగ్ పీరియడ్ కోసం తగ్గింపు, డిడక్టబుల్స్, ధూమపానం చేయని వారికి డిస్కౌంట్, ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి (750 అంతకంటే ఎక్కువ), పాత కస్టమర్గా ఉండటం, సిటీ డిస్కౌంట్లు (మీరు జోన్–2లో నివసిస్తుంటే) వంటి అంశాలు వీటిలో ఉంటాయి. ► ఆరోగ్య బీమా సంస్థను ఎంచుకునేటప్పుడు ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే తుది నిర్ణయం తీసుకునే ముందు పాలసీ నిబంధనలు, షరతులను తప్పకుండా చదవాలని గుర్తుంచుకోండి. -
మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారికి బీమా
న్యూఢిల్లీ: సాధారణ, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వైకల్యం ఉన్న వారు, హెచ్ఐవీ బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను తీసుకు రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలకు (2016) అనుగుణంగా ఈ ఉత్పత్తుల ప్రీమియం ధరలను నిర్ణయించాలని తన తాజా సర్క్యులర్లో పేర్కొంది. ఈ తరహా వ్యక్తులకు సంబంధించి పాలసీల క్లెయిమ్లు తిరస్కరించకుండా బోర్డు స్థాయిలో ఆమోదం పొందిన అండర్రైటింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించింది. ఏడాది కాల వ్యవధితో బీమా ఉత్పత్తి ఉండాలని, దాన్ని ఏటా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
హెల్త్ ఇన్సూరెన్స్పై కీలక సర్వే! ఈ విషయాలు తెలుసుకోండి!
ముంబై: అవసరమైతే ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉండి మరీ, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో 85 శాతం మంది ఇదే చెప్పారు. 19 పట్టణాల నుంచి 6,600 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కరోనాతో అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులతో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడినట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ కన్సల్టేషన్ (వైద్య సలహా) కూడా భాగంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కనుక మానసిక ఆరోగ్యంపై అత్యవసర అవగాహన అవసరం ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తర్వాత ఆరోగ్యం, శ్రేయస్సుపై తమ అవగాహన పెరిగినట్టు 84 శాతం మంది సర్వేలో చెప్పారు. వైద్య అత్యవసరాల్లో వినియోగించుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టనున్నట్టు 52 శాతం మంది తెలిపారు. ఖర్చు దృష్ట్యా తాము మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేందుకు వెనుకాడినట్టు 35 శాతం మంది వెల్లడించారు. తాము బరువు, రక్తపోటు తదితర ఆరోగ్య అంశాలను తరచూ పర్యవేక్షించుకోవడం లేదని ప్రతి ముగ్గురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో ప్రజల ఆలోచన విధానం మారిందని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు అత్యవసర పరిస్థితుల పట్ల సన్నద్ధతను అర్థంచేసుకుంటున్నారని ఆదిత్య బిర్లాహెల్త్ ఇన్సూరెన్స్ సర్వే నివేదిక తెలిపింది. ‘‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరాన్ని కరోనా తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో తాము తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించుకుంటున్నారు’ ’అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. -
ఖర్చులు తగ్గించుకుని అయినా హెల్త్ ఇన్సూరెన్స్
ముంబై: అవసరమైతే ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉండి మరీ, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో 85 శాతం మంది ఇదే చెప్పారు. 19 పట్టణాల నుంచి 6,600 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కరోనాతో అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులతో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడినట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ కన్సల్టేషన్ (వైద్య సలహా) కూడా భాగంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కనుక మానసిక ఆరోగ్యంపై అత్యవసర అవగాహన అవసరం ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తర్వాత ఆరోగ్యం, శ్రేయస్సుపై తమ అవగాహన పెరిగినట్టు 84 శాతం మంది సర్వేలో చెప్పారు. వైద్య అత్యవసరాల్లో వినియోగించుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టనున్నట్టు 52 శాతం మంది తెలిపారు. ఖర్చు దృష్ట్యా తాము మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేందుకు వెనుకాడినట్టు 35 శాతం మంది వెల్లడించారు. తాము బరువు, రక్తపోటు తదితర ఆరోగ్య అంశాలను తరచూ పర్యవేక్షించుకోవడం లేదని ప్రతి ముగ్గురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో ప్రజల ఆలోచన విధానం మారిందని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు అత్యవసర పరిస్థితుల పట్ల సన్నద్ధతను అర్థం చేసుకుంటున్నారని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే నివేదిక తెలియజేసింది. ‘‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరాన్ని కరోనా తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో తాము తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించుకుంటున్నారు’’అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల కోసం కూడా త్వరలోనే బీమా పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు జునో జనరల్ ఇన్సూరెన్స్ (గతంలో ఎడెల్వీస్ జనరల్ ఇన్సూరెన్స్) సీడీవో రాకేశ్ కౌల్ తెలిపారు. ప్రస్తుతం రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి అంశాలకు సంబంధించి అధ్యయనం చేస్తున్నట్లు ఆయన వివరించారు. త్వరలో మరికొన్ని హెల్త్ పాలసీలను కూడా ప్రవేశపెడుతున్నట్లు కౌల్ పేర్కొన్నారు. తమ వ్యాపారంలో దాదాపు 35 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉంటోందని ఆయన పేర్కొన్నారు. 30 లక్షల పైగా కస్టమర్లు, 1,000 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లు ఉన్నట్లు కౌల్ తెలిపారు. -
సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త పాలసీ.. ప్రయోజనాలు ఇవే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీనియర్ సిటిజన్స్ కోసం మణిపాల్సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ తాజాగా ప్రైమ్ సీనియర్ పేరిట ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టింది. తక్కువ వెయిటింగ్ పీరియడ్, పాలసీ తీసుకున్న 91వ రోజు నుంచీ ప్రీ–ఎగ్జిస్టింగ్ (అప్పటికే ఉన్న) అనారోగ్య సమస్యలకు కవరేజీ మొదలైన ప్రత్యేకతలు ఈ పాలసీలో ఉన్నట్లు సంస్థ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. కో–పే, ఉప–పరిమితులు, పాలసీ తీసుకునే ముందు తప్పనిసరి మెడికల్ చెకప్ వంటి బాదరబందీలేమీ ఇందులో ఉండవని వివరించారు. నాన్–మెడికల్ ఐటమ్లకు కూడా కవరేజీ లభిస్తుందని, అపరిమిత టెలీ కన్సల్టేషన్, హెల్త్ చెకప్లు వంటి ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇది ప్రైమ్ సీనియర్ క్లాసిక్, ప్రైమ్ సీనియర్ ఎలీట్ అని రెండు వేరియంట్లలో ఉంటుందని వివరించారు. (ఇదీ చదవండి: ట్రాయ్ నిబంధనలు కఠినతరం! కాల్ సేవల నాణ్యత మెరుగుపడేనా?) -
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్.. ఒకే ప్లాన్లో అధిక ప్రయోజనాలు
హైదరాబాద్: రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ‘రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ’ పేరుతో ప్రీమియం ఉత్పత్తిని విడుదల చేసింది. ఈ ప్లాన్లో అపరిమిత కవరేజీ సదుపాయం ఉంటుందని సంస్థ తెలిపింది. రూ.5 కోట్ల వరకు కవరేజీ తీసుకోవచ్చని, మేటరి్నటీ కవరేజీ, అంతర్జాతీయ కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ (సమ్ ఇన్సూరెన్స్ అయిపోతే పునరుద్ధరించడం), 15 వరకు యాడాన్ ప్రయోజనాలు ఉన్నట్టు సంస్థ ప్రకటించింది. ఆర్థికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వారికి రివార్డులు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. మెరుగైన క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి, శారీరక వ్యాయామాలతో ఆరోగ్యకర బీఎంఐను నిర్వహిస్తున్న వారికి రివార్డులు అందించనుంది. ఓపీడీ కన్సల్టేషన్ చార్జీలకు సైతం కవరేజీ ఉంది. అలాగే, ఒక్కటే క్లెయిమ్ సమ్ ఇన్సూరెన్స్ దాటినప్పుడు నూరు శాతం అదనపు కవరేజీ లభిస్తుంది. హాస్పిటల్ రూమ్ల విషయంలో పరిమితులు కూడా లేవు. -
ఆరోగ్య బీమా.. ఆదుకునే నేస్తం
క్రాంతి (40) ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితమే ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మెరుగైన ప్యాకేజీ కోసం మారాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాతే, మెరుగైన ప్యాకేజీ ఎందుకిచ్చారో అతడికి బోధపడింది. ఉదయం 7 గంటలకు వెళితే రాత్రి ఇంటికొచ్చేసరికి 10 అవుతోంది. ‘మనకొద్దురా బాబూ ఈ జాబు’ అనుకుని ఉన్నట్టుండి రాజీనామా ఇచ్చేశాడు. మరో కంపెనీలో ఉద్యోగం కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. కానీ, దురదృష్టం ప్రమాదం రూపంలో ఎదురైంది. బైక్పై వెళుతున్న సమయంలో ప్రమాదం కారణంగా తీవ్ర గాయాలయ్యాయి. కాలికి, చేతికి ప్లేట్లు వేయాల్సి వచ్చింది. ఆసుపత్రి బిల్లు సుమారు రూ.4 లక్షలు వచ్చింది. ఈ మొత్తాన్ని అతడు క్రెడిట్ కార్డుపై సర్దుబాటు చేయాల్సి వచ్చింది. కారణం పాత కంపెనీలో ఉన్న గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ.. రాజీనామా ఇచ్చిన నెలతోనే ముగిసిపోయింది. అది తప్ప అతడికి మరో ప్లాన్ లేదు. ఈ చిన్న తప్పిదం అతడి మూడేళ్ల పొదుపు సొమ్మును పట్టుకుపోయింది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పనిచేస్తున్న కంపెనీలపై ఆధారపడకుండా, తమకంటూ మెరుగైన కవరేజీతో రక్షణ కల్పించుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. మనిషి ప్రాణాలను కాపాడే విషయంలో, ఆయువును పెంచడంలో వైద్య రంగం ఎంతో ప్రగతి సాధించింది. కానీ, ఇందుకు అదనపు ఖర్చు అవుతుంది. నేడు జీవన శైలి వ్యాధులు పెరిగిపోయాయి. కేన్సర్ మహమ్మారి మన సమాజంలో వేగంగా విస్తరిస్తోంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాలు, లివర్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ మారిన జీవనశైలి కారణంగా ప్రబలుతున్నవే. వీటికయ్యే వ్యయం సామాన్యులు, మధ్య తరగతి ప్రజల వల్ల అయ్యే పనికాదు. పైగా ఏటేటా వైద్య చికిత్సల వ్యయాలు 10–15 శాతం మేర భారమవుతున్నాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏటా కొంత ప్రీమియం చెల్లించడం ద్వారా కుటుంబం అంతటికీ రక్షణ కల్పించుకోవచ్చు. ఏటా తమ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ప్రీమియం రూపంలో చెల్లించడం అసాధ్యమేమీ కాదు. కానీ, ఆరోగ్య సమస్య లేదా ప్రమాదం కారణంగా హాస్పిటల్లోచేరితే వచ్చే బిల్లును పాకెట్ నుంచి చెల్లించడం నిజంగా తలకు మించిన భారం అవుతుంది. దీని కారణంగా అప్పుల పాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా మహమ్మారి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నింటినో అప్పుల పాలు చేసింది. ఆస్తులున్న వారు అమ్ముకుని ఒడ్డెక్కాల్సి వచ్చింది. ఈ అనుభవాలు, వాస్తవలను చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక రూపంలో హెల్త్ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ప్రయోజనాలు.. ఆరోగ్య అత్యవసర సమయాల్లో ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఉంటే అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరాల్సి వస్తే అక్కడ చికిత్సల చార్జీలు, వైద్యుల కన్సల్టేషన్, అంబులెన్స్ చార్జీలు, రూమ్ చార్జీలను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అంతేకాదు డిశ్చార్జ్ చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు ఔషధాలు, వైద్య పరీక్షలకు అయ్యే వ్యయాలను కూడా భరిస్తాయి. హాస్పిటల్లో చేరడానికి ముందు అదే సమస్య కోసం నిర్ణీత రోజుల కు చేసిన వైద్య వ్యయాలను సైతం చెల్లిస్తాయి. ఆర్థిక స్థిరత్వం వైద్యం ఎప్పుడు అవసరపడుతుందన్నది ఎవరూ చెప్పలేరు. ఎలాంటి చికిత్స అవసరపడుతుంది? ఎంత ఖర్చవుతుందన్నది ఊహించడం కష్టం. అలాంటి పరిస్థితి వస్తే పొదుపు సొమ్ము అంతా కరిగిపోకుండా, అప్పుల పాలు కాకుండా, ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన అగత్యం రాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆర్థికంగా ఆదుకునే సాధనం కూడా అవుతుంది. మెరుగైన వైద్య చికిత్సలు/రక్షణ తమతోపాటు, తమపై ఆధారపడిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల.. వైద్యం అవసరమైన సందర్భంలో వెనుకాడాల్సిన పని ఉండదు. అదే హెల్త్ ప్లాన్ లేదనుకోండి.. తగినంత ఆర్థిక పొదుపుల్లేనప్పుడు, హాస్పిటల్కు వెళ్లే విషయంలో చికిత్సల వ్యయాల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచి హాస్పిటల్కు వెళ్లి, ఖర్చుకు వెనుకాడకుండా నాణ్యమైన వైద్యం పొందే ధైర్యం వస్తుంది. ఖర్చు గురించి కాకుండా, మంచి చికిత్స గురించి ఆలోచించే స్వేచ్ఛ హెల్త్ ప్లాన్తో వస్తుంది. జీవిత లక్ష్యాలకు మిగులు వైద్య చికిత్సల వ్యయాలు ఏటేటా పెరుగుతుంటాయి. ముఖ్యంగా నేడు వాతావరణ కాలుష్యం, జీవనశైలి వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కేన్సర్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. వీటికి పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. ఈ భారాన్ని తమపై పడకుండా చూసుకుంటే.. జీవితంలో ముఖ్యమైన పిల్లల విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. హెల్త్ మాదిరిగా ఈ లక్ష్యాలకు ఎలాంటి కవరేజీ ఉండదని గుర్తు పెట్టుకోవాలి. పన్ను ప్రయోజనాలు హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద 60 ఏళ్లలోపు వ్యక్తులు, తాను, తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం చెల్లించే హెల్త్ ఇన్సరెన్స్ ప్రీమియం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 వరకు ఉంటే, ఈ మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రూ.50వేల ప్రీమియంపై ఆదాయపన్ను మినహాయింపు ఉంది. సొంతంగా ఉండాల్సిందే ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఆయా సంస్థలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుంటాయి. దీంతో వారు విడిగా హెల్త్ ప్లాన్ ఎందుకులేనని అనుకుంటుంటారు. కానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు భద్రత ఉండదని తెలుసు. కంపెనీలు ఇచ్చే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగం మానివేయడంతో నిలిచిపోతుంది. అందుకుని విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తప్పకుండా తీసుకోవాలి. పనిచేస్తున్న సంస్థ నుంచి మెరుగైన కవరేజీ లేకపోయినా, ఇది ఆదుకుంటుంది. తక్కువ కవరేజీకి తీసుకుని, దానికి సూపర్ టాపప్ జోడించుకోవచ్చు. ఎంత ముందు అయితే అంత మంచిది వైవాహిక జీవితం ఆరంభించినప్పుడు లేదా ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడే హెల్త్ కవరేజీ ఉండాలి. 20ప్లస్లోనే ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్ల తిరస్కరణ సమస్య ఎదురుకాదు. ఎందుకంటే 20ప్లస్లో ఆరోగ్య సమస్యలు దాదాపుగా ఉండవు. కానీ, నేడు 30 దాటిన దగ్గర్నుంచి రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, శ్వాసకోస సమస్యలు వేధిస్తున్నాయి. ఆలస్యం చేసినకొద్దీ, ఇవన్నీ పూర్వం నుంచి ఉన్న ఆరోగ్య సమస్యల కిందకు వస్తాయి. కనుక వీటిని పాలసీ డిక్లరేషన్లో తప్పకుండా వెల్లడించాలి. అలా చేసినప్పుడు అధిక ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంది. పైగా అప్పటికే ఉన్న వాటికి కవరేజీ కోసం 3–4 ఏళ్లు వేచి చూడాల్సి రావచ్చు. పలు రకాల ప్లాన్లు.. వ్యక్తిగత ఆరోగ్య బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్, క్రిటికల్ ఇల్నెస్, టాపప్, సూపర్ టాపప్ ఇలా పలు రకాల పాలసీలు ఉన్నాయి. బేసిక్ ప్లాన్ ఏదైనా కానీ, కాంప్రహెన్సివ్ అయి ఉండాలి. అంటే అన్ని రకాల కవరేజీలతో కూడి ఉండాలి. వివాహం అయిన వారు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి. వృద్ధులైన తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే, వారికి విడిగా మరో ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. ఇక క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు అనేవి.. కేన్సర్, మూత్ర పిండాల సమస్యలు, గుండె జబ్బులు, లివర్ ఫెయిల్యూర్, స్ట్రోక్ ఇలా దీర్ఘకాలిక సమస్యలు నిర్ధారణ అయినప్పుడు బీమా మొత్తాన్ని ఒకే విడత చెల్లించే ప్లాన్లు. టాపప్ ప్లాన్లు అనేవి.. బేసిక్ హెల్త్ కవరేజీ మించి వైద్య చికిత్సల వ్యయాలు అయినప్పుడు.. బేసిక్ కవరేజీ పోను అదనపు మొత్తాన్ని చెల్లించేవి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.. ► ఎంపిక చేసుకునే బీమా కంపెనీ జాబితాలో ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయనేది చూడాలి. ముఖ్యంగా మీరు నివాసం ఉంటున్న పట్టణంలో ఎన్ని హాస్పిటల్స్ బీమా కంపెనీ నెట్వర్క్ కింద ఉన్నాయో చూడాలి. నెట్వర్క్ హాస్పిటల్ అయితే నగదు రహిత వైద్యం పొందొచ్చు. లేదంటే చికిత్సల ఖర్చు అంతా సొంతంగా భరించి, తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం శ్రమతో, సమయంతో కూడుకున్నది అవుతుంది. ► బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను చూడాలి. తనవద్దకు వచ్చే క్లెయిమ్లలో ఎన్నింటికి చెల్లింపులు చేస్తుంది.. అలాగే వచ్చిన క్లెయిమ్ అమౌంట్లో, ఎంత మొత్తానికి చెల్లింపులు చేసిందనే విషయాన్ని ముందే తెలుసుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు పూర్తిగా తిరస్కరిస్తే, కొన్ని కంపెనీలు క్లెయిమ్లో కోతలు పెడుతుంటాయి. కనీసం 90 శాతానికి పైనే సెటిల్మెంట్ రేషియో ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది. ► హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు కవరేజీ ఉంటుందో (ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్) చూడాలి. సాధారణంగా 30–180 రోజుల వరకు ఈ కాలం ఉంటుంది. గరిష్ట కాలానికి చెల్లింపులు చేసే ప్లాన్లు అయితే అనుకూలం. ఎందుకంటే కొన్ని సమస్యలకు డిశ్చార్జ్ తర్వాత కూడా చాలా కాలం పాటు ఔషధాలు తీసుకోవాల్సి రావడం, మళ్లీ, మళ్లీ వైద్యుల రివ్యూలు అవసరపడతాయి. ► ఎంపిక చేసుకునే ప్లాన్కు తప్పకుండా రీస్టోరేషన్ సదుపాయం ఉండాలి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎవరైనా హాస్పిటల్లో చేరి కవరేజీ మొత్తం ఖర్చయిపోతే ఈ ఫీచర్ అక్కరకు వస్తుంది. కొన్ని ఒకటి నుంచి మూడు సార్లు రీస్టోరేషన్ ఇస్తుంటే, కొన్ని అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీనివల్ల అదే ఏడాది తదనంతరం హాస్పిటలైజేషన్కూ కవరేజీ ఉంటుంది. ► రూమ్ రెంట్ పరిమితులు, కోపే ఆప్షన్ లేని ప్లాన్ తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఉండవు. కోపే ఆప్షన్లో క్లెయిమ్ ఎదురైన ప్రతి సందర్భంలోనూ పాలసీదారు తనవంతు కొంత భరించడం. రూమ్ రెంట్ పరంగా షేరింగ్, సింగిల్ రూమ్ అనే పరిమితులు ఉంటే, హాస్పిటల్లో చేరినప్పుడు ఆయా రూమ్ల్లోనే చేరుతున్నామా? అన్నది జాగ్రత్త పడాలి. లేదంటే ఈ రూపంలోనూ పాలసీదారుపై అదనపు భారం పడుతుంది. ► నో క్లెయిమ్ బోనస్ ఫీచర్ కూడా ఉపయోగకరం. దీనికింద క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరానికి నిర్ణీత శాతం మేర కవరేజీని బీమా కంపెనీలు పెంచుతాయి. క్లెయిమ్ వస్తే అంతే మేర తగ్గిస్తాయి. ► డైలీ క్యాష్ బెనిఫిట్ను చాలా బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఆసుపత్రిలో ఎక్కువరోజుల పాటు ఉండాల్సి వస్తే, పేషెంట్కు సాయంగా ఉండేవారికి అయ్యే వ్యయాలకు ఇది పనికొస్తుంది. ► అదనపు సభ్యులను చేర్చుకునే ఫీచర్ ఉండాలి. ► డేకేర్ చికిత్సలకు కవరేజీ ఇచ్చే ప్లాన్ మంచిది. కొత్త టెక్నాలజీలు, పరిశోధనలతో కొన్ని సమస్యలకు చికిత్సలు తేలిగ్గా మారుతున్నాయి. వీటికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడదు. కానీ, బీమా కంపెనీలు ఆఫర్ చేసే ఇండెమ్నిటీ ప్లాన్లలో కవరేజీ కోసం కనీసం 24 గంటల పాటు అడ్మిట్ కావాల్సి ఉంటుంది. డేకేర్ చికిత్సలకు ఇది వర్తించదు. ► అంబులెన్స్ చార్జీలను చెల్లించేలా ఉండాలి. ► ఆధునిక, రోబోటిక్ చికిత్సలకు, అవయవమార్పిడి చికిత్సలకు కూడా కవరేజీ ఉండాలి. ► పెళ్లయి, పిల్లలు ఇంకా లేని వారు అయితే తప్ప కుండా మేటర్నిటీ కవరేజీ ఉండే ప్లాన్కు వెళ్లాలి. ► ఏడాదికోసారి ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను బీమా కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తుందా? అన్నది చూడాలి. ► పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం సాధారణంగా 4 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. ఆ కాలంలో ముందు నుంచి ఉన్న వాటికి క్లెయిమ్ చేసుకోలేరు. కొన్ని ప్లాన్లు 1–2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్తో ఉంటున్నాయి. కాకపోతే వీటి ప్రీమియం అధికంగా ఉంటుంది. ► తీసుకున్న ప్లాన్ జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే ఫీచర్తో ఉండాలి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు కంపెనీ సేవల నాణ్యత, ఎంత వేగంగా చెల్లింపులు చేస్తుంది? ఇతర కంపెనీల ప్లాన్లతో పోలిస్తే ప్రీమియం వ్యత్యాసం ఎంతన్నది తెలుసుకోవాలి. ► కొన్ని రకాల చికిత్సలకు కవరేజీ ఉండదు. పైగా కొన్ని రకాల చికిత్సలకు 2 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వీటి వివరాలను పాలసీ వర్డింగ్ డాక్యుమెంట్ చదివి తెలుసుకోవాలి. -
ప్రైవేట్ బీమానా? కార్పస్ ఫండా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకంలో భారీ సంస్కరణలు తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) తీరుపై అసంతృప్తి నేపథ్యంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని యోచిస్తోంది. వైద్య సేవల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది. ప్రస్తుత నగదు రహిత ఆరోగ్య పథకం స్థానంలో రెండు ప్రత్యామ్నాయ పథకాలపై దృష్టిసారించింది. ఒకటి ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థకు అప్పగించి.. వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించడం. ఇందులో ఎవరికైనా జబ్బు చేస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లి నగదు రహిత వైద్య సేవలు పొందేలా చూడాలని భావిస్తోంది. దీనికి ఉద్యోగులు ఏడాదికి రూ.20 వేలు ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రభుత్వం కూడా కొంత చెల్లించాలని యోచిస్తోంది. రెండో ప్రత్యామ్నాయమేంటంటే... ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయడం. ఉద్యోగులు, ప్రభుత్వం కలిపి ఏడాదికి రూ.700 కోట్లు కార్పస్ ఫండ్ తయారు చేసి, ఉద్యోగ కుటుంబ సభ్యులు వైద్యం పొందిన వెంటనే సంబంధిత ఆసుపత్రులకు సొమ్ము అందించేలా చూడటం. ఆరోగ్యశ్రీకి రీయింబర్స్మెంట్..! ప్రస్తుతం రీయింబర్స్మెంట్ పథకం కూడా ఉన్నా.. డబ్బులు చెల్లించి వైద్య సేవలు తీసుకున్న ఉద్యోగులు రీయింబర్స్మెంట్ పొందడం గగనంగా మారింది. వైద్య విద్యాసంచాలకుల పరిధిలో ఉన్న ఆ వ్యవస్థను ఆరోగ్యశ్రీకి అప్పగించడం ద్వారా సులభతరం చేయాలని కూడా సర్కారు యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆయా పథకాలను అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించింది. కీలకమైన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యామ్నాయ వైద్య పథకంపై చర్చించనున్నారు. ఇక ఎన్ఏబీహెచ్ ఆసుపత్రుల్లోనే... నగదురహిత వైద్యం అందిస్తున్నా, ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. కార్పొరేట్, ప్రైవే టు ఆసుపత్రులు తమను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్దారులు లాందుతున్నారు. రాష్ట్రంలో 96 ప్రభుత్వ నెట్వర్క్, 236 ప్రైవేటు నెట్వర్క్, 67 డెంటల్ ఆసుపత్రులున్నాయి. వీటిలో ప్రభుత్వం పేర్కొన్నట్లుగా దాదాపు 900 రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు. సాధారణ వైద్య సేవలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, కేవలం శస్త్రచికిత్సలకే పరిమితమవుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. నగదు రహిత వైద్యం ఉండి కూడా డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన అగత్యం ఏర్పడిందని, మరోవైపు రీయింబర్స్మెంట్లో కోత కోస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆరోగ్య పథకంలో సంస్కరణలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కొత్తగా తెచ్చే పథకాన్ని కొన్ని ఆసుపత్రులకే పరిమితం చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్)లోనే అమలు చేయాలని యోచిస్తోంది. అంటే కార్పొరేట్, సూపర్స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు అందుతాయన్నమాట. నాలుగు స్థాయిల్లో వాటా! ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కేడర్ వారీగా సొమ్ము వసూలు చేస్తారు. అలాగే రాష్ట్రంలోనూ వేతనాలను బట్టి లెవెల్స్ నిర్ధారించి నాలుగు శ్లాబుల్లో ఉద్యోగుల నుంచి వాటాను తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా నిధులు సేకరించి కార్పస్ ఫండ్ తయారుచేస్తారు. తక్కువ వేతనదారుల నుంచి రూ.250, భారీ వేతనం తీసుకునే వారి నుంచి రూ.500–600 వసూలు చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. తాము నెలకు రూ. 500 చెల్లించడానికైనా సిద్ధమని ఉద్యోగులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అలా చేస్తే ఏడాదికి రూ. 350 కోట్లు వసూలవుతుంది. దానికి ప్రభుత్వం రూ. 350 కోట్లు ఇస్తే, మొత్తం రూ.700 కోట్లతో కార్పస్ఫండ్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనివల్ల తమ సమస్యలు తీరుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించే రెండు ప్రత్యామ్నాయాల్లో దేనికైనా తాము సిద్ధమేనని అంటున్నారు. -
ఆరోగ్య బీమా పట్ల జీవిత బీమా కంపెనీల ఆసక్తి
ముంబై: హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించేందుకు జీవిత బీమా కంపెనీలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి తిరిగి అనుమతించే అంశాన్ని బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సానుకూలంగా పరిశీలిస్తుండడం వాటిల్లో ఉత్సాహానికి కారణం. ఎల్ఐసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు 2016లో ఐఆర్డీఏఐ నిషేధం విధించే వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించినవే. ఐఆర్డీఏఐ ఆదేశాలతో నాటి నుంచి ఇవి కేవలం ఫిక్స్డ్ బెనిఫిట్ హెల్త్ ప్లాన్లకు పరిమితం అయ్యాయి. ఇండెమ్నిటీ (హాస్పిటల్లో చేరినప్పుడు చెల్లించేవి) పాలసీలను విక్రయించేందుకు అనుమతి లేదు. జీవిత బీమా కంపెనీలను తిరిగి హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి అనుమతించడానికి ఇది సరైన తరుణమని, లాభ, నష్టాలను పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవలే ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా సంకేతం ఇవ్వడం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో తిరిగి ఆశావహ పరిస్థితికి దారితీసిందని చెప్పుకోవాలి. 2030 నాటి కి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ను చేరువ చేయాలన్న లక్ష్యంతో మరిన్ని సంస్థలను ఈ విభాగంలోకి అనుమతించాలన్నది ఐఆర్డీఏఐ యోచనగా ఉంది. సిద్ధంగా ఉన్నాం.. హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్టు ఎల్ఐసీ పేర్కొంది. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారానికి హెల్త్ ఇన్సూరెన్స్ సమన్వయంగా ఉంటుందని తెలిపింది. ‘‘మేము ఇప్పటికే దీర్ఘకాల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను, గ్యారంటీడ్ హెల్త్ ప్లాన్లను విక్రయిస్తున్నాం. ఐఆర్డీఏఐ చేసిన సూచనను పరిశీస్తున్నాం’’అని ఎల్ఐసీ చైర్మన్ ఎంటీ కుమార్ తెలిపారు. అచ్చమైన హెల్త్ ప్లాన్ల విక్రయం తమకు కష్టమేమీ కాదని, ఇప్పటికే తాము కొన్ని రకాల హెల్త్ ప్లాన్లను (ఫిక్స్డ్ బెనిఫిట్) ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు 24.50 లక్షల మంది ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు 3.60 లక్షలకు మించి లేరు. లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలను సైతం హెల్త్ ఇన్సూరెన్స్కు అనుమతిస్తే అప్పుడు భారీగా ఏజెంట్లు ఆయా ఉత్పత్తులను కస్టమర్లకు చేరువ చేయగలరన్న అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలను ఒకే సంస్థ మార్కెట్ చేసుకునే విధానం ఉందని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇప్పటికీ 2.63 లక్షల మంది కస్టమర్లకు ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్కవరేజీని అందిస్తోంది. 2016లో నిషేధం తర్వాత మిగిలిన కస్టమర్లు పోర్ట్ పెట్టుకుని వెళ్లిపోగా, వీరు ఇంకా మిగిలే ఉన్నారు. అలాగే, హెచ్డీఎఫ్సీ లైఫ్ వద్ద కూడా ఇలాంటి కస్టమర్లు కొందరు మిగిలే ఉన్నారు. అందుకనే ఈ సంస్థలు మళ్లీ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సైతం తాము హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్రకటించింది. తమకు ఈ విభాగంలో ఎంతో అనుభవం ఉన్నట్టు చెప్పింది. -
ఉద్యోగ భద్రత లేదా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య భద్రత, పింఛన్, పదోన్నతులకు ఆమడ దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో కొలువులు చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులు, పిల్లల విద్య, వైద్యం వ్యయాలను తాము భరించలేకపోతున్నామని, బతుకుబండి లాగాలంటే తమకు పేస్కేల్– ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. డిమాండ్ల సాధనకు 28 రోజులుగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో కీలకం.. రాష్ట్రంలో మొత్తం 23,000 మంది వీఆర్ఏలు ఉన్నారు. అందులో 20,000 మంది ఇదే వృత్తిని సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. వీరిలో గరిష్టంగా 80 ఏళ్ల వయసు వారు కూడా వీఆర్ఏలుగా కొనసాగుతున్నారు. వీరంతా రూ.10,500 వేతనంతో బతుకుబండి నెట్టుకువస్తున్నారు. కాగా, 23,000 మందిలో 3,000 మంది 2012లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యారు. వీరిలో 60 శాతం మంది మహిళలు ఉన్నారు. పంటల నమోదు, గ్రామాల్లో చెరువులను, కుంటలను, కుంట శిఖాలను, ప్రభుత్వ భూములను పరిరక్షించడం వీరి విధుల్లో ముఖ్యమైనవి. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు వారికి క్షేత్రస్థాయిలో సహకారం అందింస్తుంటారు. గ్రామాల్లో కీలకంగా ఉన్నా.. వీరికి ఎలాంటి పేస్కేలు, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, పింఛన్ వంటి సదుపాయాల్లేవు. 24 గంటల్లో ఏ క్షణమైనా విధులకు వెళ్లాల్సి ఉంటుంది. పనిభారం పెరిగినా.. పదోన్నతుల్లేవు! కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారికి ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. 2017లో వీరిలో అర్హులకు ప్రమోషన్లు రావాల్సి ఉండగా.. జిల్లాల విభజన వీరికి శరాఘాతంగా మారింది. అదనపు జిల్లాలు, మండలాలు, రెవెన్యూడివిజన్లతో పనిభారం పెరిగింది. వాస్తవానికి సర్వీస్రూల్స్ ప్రకారం.. మూడేళ్ల తరువాత వీఆర్ఏలను అటెండర్, నైట్ వాచ్మన్, జీపు డ్రైవర్గా ప్రమోట్ చేయాలి. అయితే వీరిలో కొందరు ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కనీసం పింఛన్ సదుపాయం కూడా లేదు. ఇపుడున్న వీఆర్ఏలలో చాలామంది 40 ఏళ్లు సర్వీసు ఉన్న వారూ నామమాత్రం వేతనానికి పనిచేస్తున్నారు. పదోన్నతులు ఇవ్వాల్సిందే దశాబ్దాలుగా పనిచేస్తున్నా మాకు కనీస హక్కులు అమలు కావడం లేదు. 2017లో సీఎంతో వీఆర్ఏలు భేటీ అయిన సందర్భంలో అర్హతలు ఉన్న వారికి వివిధ దశల్లో పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. కారుణ్యనియామకాల ద్వారా వచ్చిన వీఆర్ఏలకు డబుల్ బెడ్రూం, అటెండర్ ఉద్యోగాలిస్తామన్న హామీలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. – కందుకూరి బాపుదేవ్, వీఆర్ఏ రాష్ట్ర సహాధ్యక్షుడు మెటర్నిటీ లీవులు కరువు దేశంలో మహిళలకు, అందులోనూ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెటర్నిటీ లీవులు విధిగా ఇవ్వాలి. కానీ, ఇంతవరకూ వీఆర్ఏలకు ఇది అమలు కావడం లేదు. గర్భిణులుగా ఉన్నా.. రాత్రీ పగలు లేకుండా.. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నాం. బాలింతలు కూడా డ్యూటీలు చేయాల్సిన దుస్థితి ఉంది. – కంది శిరీషారెడ్డి, రాష్ట్ర జేఏసీ కో–కన్వీనర్ -
ఆరోగ్య బీమాలో రెండో స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఆరోగ్య బీమా కలిగిన కుటుంబాల్లో రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలబెట్టాయి. 2019–21 సంవత్సరాలకు రాష్ట్రంలోని 80.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉందని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి–2022 నివేదిక వెల్లడించింది. 87.94 శాతం కుటుంబాలతో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. 2015–16లో రాష్ట్రంలో 74.6 శాతం కుటుంబాలకే ఆరోగ్య బీమా ఉంటే 2019–21 సంవత్సరాలకు ఇది ఏకంగా 80.2 శాతానికి పెరిగినట్లు నివేదిక తెలిపింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆరోగ్య శ్రీ పథకానికి జవసత్వాలను కల్పించారు. అంతే కాకుండా ఆరోగ్య శ్రీ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. అంటే పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు కూడా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింప చేయడం ద్వారా ఆరోగ్య బీమాను కల్పించారు. ఇలా రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీని వర్తింప చేయడంతో రాష్ట్రంలో 80.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తిస్తోంది. అంతే కాకుండా చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీని వర్తింపచేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో 69.2 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉన్నట్లు నివేదిక తెలిపింది. దేశంలో అత్యల్పంగా మణిపూర్లో 16.4 శాతం, బిహార్ 17.4 శాతం, నాగాలాండ్లో 22 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉన్నట్లు నివేదిక తెలిపింది. -
‘హెల్త్ ఇన్సూరెన్స్’ పేరిట రూ.700.. ట్రిపుల్ ఐటీ.. ‘బీమా’ ఏదీ..?
నిర్మల్/బాసర: పేదింటి విద్యార్థులు చదివే బాసర ట్రిపుల్ఐటీ తీరెలా ఉందో మరోమారు బయటపడింది. ఇటీవల చనిపోయిన తమ విద్యార్థి సంజయ్కిరణ్ కుటుంబాన్ని పరామర్శించని వర్సిటీ అధికారులు.. కనీసం అతడికి ‘ఆరోగ్యబీమా’కూడా ఇవ్వలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ పేరిట ప్రతీ విద్యార్థి నుంచి రెండేళ్లకోసారి రూ.700 చొప్పున అధికారులు వసూలు చేస్తున్నారు. డబ్బులైతే సకాలంలో తీసుకున్నారు కానీ విద్యార్థులకు అందించాల్సి బీమాపై మాత్రం దృష్టిపెట్టలేదు. కొన్నేళ్లుగా అసలు ఇన్సూరెన్స్ కంపెనీలనే సంప్రదించలేదన్న విషయం విస్మయానికి గురిచేస్తోంది. ఈక్రమంలోనే సంజయ్కిరణ్కు ఆరోగ్యబీమా దక్కలేదని స్పష్టమవుతోంది. రూ.700 చొప్పున.. బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ను 2017లో అప్పటి ఇన్చార్జి వీసీ అశోక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రెండేళ్లకు రూ.700 చొప్పున విద్యార్థుల నుంచి వసూలుచేశారు. ఏడాదికి రూ.350 చొప్పున వర్తిస్తుందని, ఆ మేరకు బీమా అందుతుందని చెప్పారు. రెండేళ్లపాటు వివిధ సంస్థలకు చెల్లింపులు చేశారు. ఆపై ఇన్చార్జి వీసీ మారడం, మరో ఐఏఎస్ రాహుల్ బొజ్జా రావడం, కోవిడ్ పరిణామాలతో విద్యార్థుల బీమా అటకెక్కింది. సంస్థలు ముందుకు రాలేదని.. కోవిడ్ సమయంలోనూ విద్యార్థుల నుంచి డబ్బులను తీసుకున్నారు. కానీ ఏ బీమా సంస్థకు బాధ్యతను అప్పగించలేదు. ఈక్రమంలో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో వసూలుచేసిన డబ్బులు ఏమయ్యాయనే దానికి సమాధానం లేదు. రెండేళ్లకు రూ.700 చొప్పున తొమ్మిదివేల మంది విద్యార్థుల నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు. సంజయ్కు దక్కని బీమా.. వరంగల్రూరల్ జిల్లా ఎల్గూరు రంగంపేటకు చెందిన శాబోతు సంజయ్కిరణ్ అనే పీయూసీ–2 విద్యార్థి ఈనెల 26న మృతిచెందాడు. సంజయ్ సైతం వర్సిటీకి రూ.700 హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లించాడు. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజుల క్రితం మరణించిన సంజయ్కు ఆరోగ్యబీమా దక్కలేదు. బీమా రాలేదు.. వర్సిటీలో భోజనం బాగుండదని, తినాలనిపించట్లేదని సంజయ్ చెప్పేవాడు. దీంతోనే అతడి ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స కోసం శక్తికి మించి రూ.16 లక్షలు ఖర్చుచేశాం. కానీ సంజయ్ ప్రాణాలు దక్కించుకోలేకపోయాం. వర్సిటీకి డబ్బు లు చెల్లించినా వైద్యానికి ఎలాంటి ఆరోగ్యబీమా అందలేదు. –శాబోతు శ్రీధర్, సంజయ్కిరణ్ తండ్రి విచారణ చేయించాం.. 15 రోజుల క్రితమే ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టాను. విద్యార్థులు చెల్లించిన బీమా డబ్బులు ఏమయ్యాయి, సంస్థలు ఎందుకు ముందుకు రాలేదనే దానిపై ఓయూ అధ్యాపకులతో విచారణ చేయించాం. కోవిడ్ కారణంగా బీమా సంస్థలు ముందుకు రాలేదని తేలింది. బీమా సంస్థల ను ఫైనల్చేసి, చెల్లించిన డబ్బుల మేరకు విద్యార్థులకు ఆరోగ్యబీమా చేస్తాం. – ప్రొ.వెంకటరమణ, ఇన్చార్జి వీసీ, ఆర్జీయూకేటీ -
రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్పై ఐసీఐసీఐ లాంబార్డ్ గురి..
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్న రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అదనపు పెట్టుబడులు పెట్టినట్టు సంస్థ వార్షిక నివేదికలో వాటాదారులకు తెలియజేసింది. సంస్థ స్థూల ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) గత ఆర్థిక సంవత్సరానికి రూ.17,977 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.14,003 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. వార్షికంగా ప్రీమియం ఆదాయంలో 28.7 శాతం వృద్ధి నమోదైంది. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్కు సంబంధించి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని విజయవంతంగా విలీనం చేసుకుంది. ఈ విలీనం అనంతరం జీడీపీఐ పరంగా పరిశ్రమలో రెండో స్థానానికి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ చేరుకుంది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ 2021–22లో 11 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘పరిశ్రమకు హెల్త్ ఇన్సూరెన్స్ అత్యధిక వ్యాపారాన్ని తెచ్చి పెడుతోంది. ఈ విభాగంలో ఐసీఐసీఐ లాంబార్డ్ కూడా మంచి వృద్ధిని చూస్తోంది. రిటైల్ హెల్త్ విభాగంలో వృద్ధి అవకాశాల దృష్ట్యా మా పెట్టుబడులను పెంచాం. రిటైల్ హెల్త్ ఏజెన్సీ బృందంలో విక్రయదారుల సంఖ్యను పెంచాం’’అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్గుప్తా వాటాదారులకు వివరించారు. అధిక వృద్ధి నమోదు.. ‘‘సంస్థ మోటారు ఇన్సూరెన్స్ వ్యాపారం గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పరిమిత వృద్ధినే చూసింది. సరఫరా సమస్యలు, డిమాండ్ సెంటిమెంట్ తక్కువగా ఉండడం కారణాలు. ఇక ద్వితీయ ఆరు నెలల్లో మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంది. పరిశ్రమ కంటే కంపెనీయే అధిక వృద్ధిని సాధించింది’’అని దాస్ గుప్తా తెలిపారు. ఎస్ఎంఈ విభాగంలో 17.8 శాతం వృద్ధిని చూసింది. ఫైర్ ఇన్సూరెన్స్లో సంస్థ వాటా 12.8 శాతం, ఇంజనీరింగ్లో 15.2 శాతం, మెరైన్కార్గో ఇన్సూరెన్స్లో 17.9 శాతానికి చేరుకుంది. -
సీనియర్లు అయితే హెల్త్ క్లెయిమ్ ఆలస్యం
న్యూఢిల్లీ: వృద్ధులు (60 ఏళ్లు దాటిన వారు) హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు. 60 ఏళ్లలోపు వారితో పోలిస్తే వారం ఆలస్యంగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు ‘సెక్యూర్ నౌ’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఆస్పత్రిలో చేరినా కానీ, తమ చికిత్స గురించి బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో వారు జాప్యం చేస్తున్నారు. నగదు రహిత చికిత్సను వృద్ధులు ఎంపిక చేసుకోపోతే, వారు క్లెయిమ్లను కచ్చితత్వంతో దాఖలు చేసేందుకు ఆస్పత్రులు, బీమా సంస్థలు, మధ్యవర్తులు సాయం అందించాలని మెహతా సూచించారు. 60 ఏళ్లలోపు వారికి క్లెయిమ్ పరిష్కారం అయ్యేందుకు 23 రోజుల సయం పడుతోంది. అదే సీనియర్ సిటిజన్లు అయితే 28 రోజుల సమయం తీసుకుంటోంది. ఇతరులతో పోలిస్తే వృద్ధులు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారన్న విషయాన్ని మెహతా గుర్తు చేశారు. 30 ఏళ్ల వ్యక్తికి ప్రీమియం రూ.10,365గా ఉంటే, 45 ఏళ్లకు ఇది రూ.15,239, 60 ఏళ్లకు రూ.31,905 అవుతున్నట్టు చెప్పారు. ఇక 75 ఏళ్ల వయసులో వీరు రూ.66,368 చెల్లించాల్సి వస్తుందన్నారు. డయేరియా, కేన్సర్, ప్రొస్టేట్ పెరుగుదల సమస్య, కరోనరీ గుండె జబ్బులకు క్లెయిమ్ నిష్పత్తి (వృద్ధులకు) తక్కువగా ఉంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. -
ధీమాగా బీమా ఇలా..!
ఆరోగ్య బీమా అవసరాన్ని గతంతో పోలిస్తే నేడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. డిజిటల్ వేదికలు విస్తృతం కావడం, స్మార్ట్ఫోన్ల వినియోగం ఊపందుకోవడం హెల్త్ ఇన్సూరెన్స్పై అవగాహన పెరగడానికి సాయపడుతున్నాయి. కరోనా మహమ్మారి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలిసేలా చేసింది. కానీ, ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలున్నాయి. బీమా పాలసీని తీసుకునేందుకు ఇవి అడ్డుపడొచ్చు. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పనిచేసే విధానం, క్లెయిమ్కు సంబంధించి కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు. ఇలాంటి కొన్ని అపోహలు, వాటికి సంబంధించి వాస్తవాలను నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రొడక్ట్స్, క్లెయిమ్స్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా వెల్లడించారు. ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స తీసుకుంటేనే బీమా క్లెయిమ్కు అర్హత లభిస్తుందన్నది అపోహే. కానీ వాస్తవం వేరు. ఆధునిక పరిశోధన ఆధారిత ఔషధాలు, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో చాలా చికిత్సలకు నేడు 24 గంటల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఏర్పడడం లేదు. వీటిని డే కేర్ ట్రీట్మెంట్స్గా (రోజులో వచ్చి తీసుకుని వెళ్లే వీలున్నవి) చెబుతారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాటరాక్ట్ ఆపరేషన్, కిడ్నీల్లో రాళ్లు తొలగించే సర్జరీ ఇలాంటివన్నీ డేకేర్ ట్రీట్మెంట్స్ కిందకు వస్తాయి. డేకేర్ ట్రీట్మెంట్స్లో చాలా వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ లభిస్తోంది. కేన్సర్కు సంబంధించి ఓరల్ కీమోథెరపీకి అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్లలో కవరేజీ ఉంటోంది. క్లెయిమ్ మొత్తం వస్తుందనుకోవద్దు నియంత్రణ సంస్థ అనుమతి మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వేటికి చెల్లింపులు చేయవో తెలియజేస్తూ ఒక జాబితా నిర్వహిస్తుంటాయి. పీపీఈ కిట్, మాస్క్, బ్యాండేజ్, నెబ్యులైజర్ తదితర ఇలా చెల్లింపులు చేయని వాటి జాబితాను బీమా సంస్థలు పాలసీ వర్డింగ్స్లో ప్రత్యేకంగా పేర్కొంటాయి. అందుకుని ఆస్పత్రిలో అయ్యే బిల్లు మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయని అనుకోవద్దు. అయితే, వీటికి కూడా చెల్లింపులు చేసే రైడర్లను కొన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. రైడర్ను జోడించుకుని, కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా డిస్పోజబుల్స్కు సైతం క్లెయిమ్ తీసుకోవచ్చు. ఇక పాలసీల్లో మరికొన్ని ఇతర పరిమితులు కూడా ఉంటాయి. కోపేమెంట్, రూమ్రెంట్, డాక్టర్ కన్సల్టేషన్ చార్జీల పరంగా చెల్లింపుల పరిమితులు ఉంటాయి. అంటే వీటికి సంబంధించి బీమా సంస్థలు పాలసీ నియమ, నిబంధనల్లో పేర్కొన్న మేరకే చెల్లింపులు చేస్తుంటాయి. కనుక క్లెయిమ్ మొత్తం వస్తుందని అనుకోవద్దు. చెల్లింపుల్లో పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు సింగిల్ రూమ్ అని పాలసీ డాక్యుమెంట్లో ఉంటే.. హాస్పిటల్లో సాధారణ సింగిల్ రూమ్లో చేరినప్పుడే చికిత్సకు అయ్యే వ్యయాలపై పూర్తి చెల్లింపులు పొందడానికి ఉంటుంది. డీలక్స్ రూమ్/సూట్లో చేరితే అది పరిమితికి మించినది అవుతుంది. దీంతో క్లెయిమ్లో కొంత మేర కోత పడుతుంది. దీన్నే రూమ్ రెంట్ క్యాప్ అని కూడా అంటారు. వీటిపై పాలసీదారులు ముందే తగిన అవగాహనతో ఉండాలి. అందుకని కచ్చితంగా పాలసీ డాక్యుమెంట్ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. లేదంటే బీమా సంస్థ కస్టమర్ కేర్ లేదా ఏజెంట్ను సంప్రదించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది పేషెంట్ కోలుకున్న తర్వాత నిర్ణీత కాలం పాటు అతనికి బీమా సంస్థ కొత్త పాలసీని ఆఫర్ చేయకపోవడం. కానీ, దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా ఎత్తివేయాలని పాలసీదారులు భావిస్తుంటారు. అంతేకాదు, బీమా సంస్థలు ఆరోగ్యవంతులు, ఆస్పత్రి అవసరం ఏర్పడని వారికే పాలసీని ఆఫర్ చేస్తాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ వెనుక ఉన్న తార్కికత ఏమిటంటే.. ఒక ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకున్న తర్వాత ఏవైనా కొత్త సమస్యలు ఏర్పడతాయేమో అంచనా వేసేందుకు కావాల్సిన సమయంగా అర్థం చేసుకోవాలి. కరోనా చికిత్స లేదా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పాలసీదారులు మరింత కవరేజీకి అర్హత సాధిస్తారు. వీటిని ముందస్తు నుంచి ఉన్న సమస్యలుగా బీమా సంస్థలు పరిగణించవు. అలాగే క్లెయిమ్ సమయంలో అస్పష్టతను కూడా తగ్గిస్తుంది. ఎక్కడైనా క్యాష్లెస్ బీమా క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం, సౌకర్యంగా మార్చడంపై బీమా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. క్లెయిమ్ను క్యాష్లెస్ (పాలసీదారు చెల్లించాల్సిన అవసరం లేకుండా) లేదా రీయింబర్స్మెంట్ విధానంలో దాఖలు చేసుకోవచ్చు. కానీ, నగదు రహిత చికిత్స సేవలు పొందాలంటే మీరు చేరే హాస్పిటల్.. బీమా సంస్థ క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్లో భాగమై ఉండాలి. ఇలా కాకుండా పాలసీదారు చికిత్స తీసుకుని అందుకు సంబంధించిన మొత్తం వారే చెల్లించి తర్వాత బీమా సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ని రకాల పత్రాలను సమర్పించాలి. అప్పుడే బీమా సంస్థ క్లెయిమ్ను ప్రాసెస్ చేయగలదు. క్యాష్లెస్ అన్నది సౌకర్యమైనది. దీనివల్ల ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సకు అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా సమకూర్చుకునే ఇబ్బంది తప్పుతుంది. పైగా డిశ్చార్జ్ ప్రక్రియ క్యాష్లెస్ విధానంలో సులభంగా పూర్తవుతుంది. బీమా వ్యాపారం అన్నది ప్రజల నిధులతో కూడుకున్నదని అర్థం చేసుకోవాలి. ప్రజల డిపాజిట్లకు సంరక్షకుడిగా బీమా సంస్థ అన్ని రకాల నిజమైన క్లెయిమ్లను గౌరవించాల్సి ఉంటుంది. బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్ను అర్థం చేసుకునేందుకు వీలుగా సులభ పరిభాషతో రూపొందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కొనుగోలుకు ముందు శ్రద్ధగా వీటిని చదవడం వల్ల.. క్లెయిమ్ల సమయంలో అనవసర తలనొప్పులను రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. అధిక కవరేజీ కోసం హెల్త్ చెకప్ పాలసీ జారీ చేసే ముందు అన్ని బీమా సంస్థలూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరడం లేదు. పెద్ద వయసులో ఉన్నారని లేదా అధిక కవరేజీ కోరుతున్నారని వైద్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలనేమీ లేదు. ఉదాహరణకు ప్రముఖ హెల్త్ ప్లాన్లు అన్నింటికీ ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు. కొన్ని ప్రత్యేక కేసుల్లోనే నిర్ధేశిత వైద్య పరీక్షలను బీమా సంస్థలు కోరుతుంటాయి. దరఖాస్తుదారులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా గతంలో ఏవైనా ఎదుర్కోని ఉంటే ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరతాయి. ఇందుకు అయ్యే వ్యయాలను బీమా సంస్థలు పూర్తిగా భరిస్తుంటాయి. -
IRDAI: జీవితబీమా పాలసీల ఆవిష్కరణలకూ స్వేచ్ఛ
న్యూఢిల్లీ: తన నుంచి ముందస్తు అనుమతి లేకుండా అన్ని రకాల హెల్త్, సాధారణ బీమా పాలసీల ఆవిష్కరణకు ఇటీవలే అనుమతించిన బీమా రంగ అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ.. తాజాగా జీవిత బీమా పాలసీల విషయంలోనూ ఇదే స్వేచ్ఛ కల్పించింది. జీవిత బీమా సంస్థలు తన నుంచి ముందు అనుమతి తీసుకోకుండా ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చని ప్రకటించింది. దీంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల రూపకల్పన, ప్రీమియం ధరల్లో వాటికి వెసులుబాటు లభించనుంది. కొత్త ప్లాన్లను ముందుగా విడుదల చేసి, ఆ తర్వాత వాటి అనుమతికి బీమా సంస్థలు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఒక ఉత్పత్తిని వేగంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టొచ్చు. అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడక్కర్లేదు. ముందు అనుమతి తీసుకోవడానికి.. ఉత్పత్తి ఆవిష్కరించిన తర్వాత అనుమతి పొందడానికి మధ్య వ్యత్యాసం ఉంది. ముందస్తు అనుమతి పొందేట్టు అయితే ఎన్నో పరిమితులు, నిబంధనల పరిధిలో ఉత్పత్తుల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. కానీ, అనుమతి తీసుకోకుండా జారీ చేసే ఉత్పత్తుల రూలకల్పన విషయంలో కంపెనీలు స్వేచ్ఛగా వ్యవహరించగలవు. ఇప్పటి వరకు అన్ని రకాల జీవిత బీమా పాలసీలు, రైడర్లకు ముందస్తు అనుమతి అమల్లో ఉండడం గమనార్హం. భారత్ను మరింత బీమా రక్షణ కలిగిన దేశంగా మార్చేందుకు సంస్కరణలకు సుముఖంగా ఉన్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. ‘‘మారుతున్న మార్కెట్ ధోరణులకు తగ్గట్టు బీమా పరిశ్రమ వేగంగా స్పందించేందుకు.. ఉత్పత్తుల డిజైన్, ధరలు, వ్యాపార నిర్వహణ సులభతరం చేసేందుకు వీలుగా.. జీవిత బీమా ఉత్పత్తులకు సైతం ‘యూజ్ అండ్ ఫైల్ ప్రక్రియ’ను విస్తరించాలని నిర్ణయించాం’’అని ఐఆర్డీఏఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీనివల్ల బీమా సంస్థలు మార్కెట్ అవసరాలకు వీలుగా వేగంగా ఉత్పత్తులను విడుదల చేయగలవని పేర్కొంది. సానుకూలం ఐఆర్డీఏ తీసుకున్న నిర్ణయం పరిశ్రమకు సానుకూలమని పీఎన్బీ మెట్లైఫ్ ఎండీ, సీఈవో ఆశిష్ కే శ్రీవాస్తవ తెలిపారు. మరింత ఆవిష్కరణలకు వీలు కల్పిస్తుందని, ప్రజలు తమ భవిష్యత్తుకు సంబంధించి ప్లాన్ల ఎంపికలకు ఆప్షన్లను విస్తృతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది చాలా సానుకూల నిర్ణయమని, ఉత్పత్తులకు అనుమతుల ప్రక్రియల సులభంగా మారినట్టు ఇన్సూరెన్స్బ్రోకర్ ‘సెక్యూర్ నౌ’ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా పేర్కొన్నారు. -
ప్రెగ్నెన్సీ ఇన్సూరెన్స్ ప్లాన్: హాస్పిటల్ బిల్ ఎన్నిరోజులకు చెల్లిస్తారు!
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు.. బీమా సంస్థలు సగటున 20 నుంచి 46 రోజుల సమయాన్ని తీసుకుంటున్నట్టు ‘సెక్యూర్నౌ’ అనే ప్లాట్ఫామ్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ► మెజారిటీ పాలసీదారులు తమ ఆస్పత్రిలో చేరిన తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ విషయాన్ని బీమా సంస్థలకు వెంటనే తెలియజేస్తున్నారు. కానీ, అదే సమయంలో చెల్లింపులు చేసేందుకు అవి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ► మేటర్నిటీ క్లెయిమ్లకు (ప్రసవ సంబంధిత) చెల్లింపులు చేయడానికి 7 నుంచి 108 రోజుల సమయం తీసుకుంటున్నాయి. సిజేరియన్ క్లెయిమ్ చెల్లింపులకు 9–135 రోజుల సమయం పడుతోంది. ► అతి తక్కువగా కీమోథెరపీకి 12–35 రోజుల్లోపు పరిహారం చెల్లిస్తున్నాయి. ►ఏటా కోటి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు నమోదవుతున్నాయి. ►క్లెయిమ్ చేసిన మొత్తంలో 13–26 శాతాన్ని బీమా సంస్థలు కోత పెడుతున్నాయి. కన్జ్యూమబుల్స్, పరిపాలనా చార్జీల కింద ఈ పనిచేస్తు నాయి. వీటికి సాధారణంగా పరిహారం రాదు. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల పరిధిలో ఆస్పత్రిలో చేరే వారి పాలసీదారుల రేటు తక్కువగా ఉంటోంది. దీంతో తక్కువ క్లెయిమ్లు రావడం, ఫలితంగా ప్రీమియం రేట్లు తక్కువగా ఉంటున్నాయి మరిన్ని వివరాలు వెల్లడించాలి.. ‘‘ఆరోగ్యబీమా ఎలా అభివృద్ధి చెందిందన్న దానికి ఇది సంకేతం. క్లెయిమ్లకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను బహిరంగ పరచడం తదుపరి అడుగు కావాలి. అప్పుడు క్లెయిమ్ల పరిష్కారంలో బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టడానికి వీలుంటుంది’’అని సెక్యూర్నౌ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా పేర్కొన్నారు. చదవండి: ఎల్ఐసీ బంపరాఫర్, మరికొన్ని రోజులే..ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు! -
ఆర్థిక భద్రతా అవసరమే..
చిన్న వయసు.. ఉరకలెత్తే ఉత్సాహం, మంచి ఆరోగ్యం.. ఇవన్నీ భవిష్యత్తును గుర్తు చేయవు. ఏరోజుకారోజు హాయిగా గడిచిపోతుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని మంచి అలవాట్లకు చోటు కల్పిస్తే.. జీవితాంతం ఆర్థిక భద్రతకు ఢోకా లేకుండా చూసుకోవచ్చు. రేపటి రోజు కోసం మీ ప్రణాళికలో కొంత చోటు కల్పిస్తే చాలు. అందులో ఉండే మ్యాజిక్ ఆ తర్వాత తెలిసొస్తుంది. అందుకే అంటారు వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోమని..! రిటైర్మెంట్ కోసం రూ.కోటి కావాలంటే.. నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. 25 సంవత్సరాల వయసులో మొదలు పెట్టి, ఏటా 12 శాతం రాబడులు వచ్చేట్టు చూసుకున్నా.. ఈ మొత్తం సమకూరుతుంది. కానీ, 15 ఏళ్లు ఆలస్యం చేసి 45లో మొదలు పెట్టారనుకోండి అప్పుడు రూ.కోటి కోసం నెలకు రూ.21,000 ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సిప్ ఆరంభం.. తివారి (30) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఐదేళ్ల క్రితమే అంటే 25 ఏళ్ల వయసు నుంచే మ్యూచువల్ ఫండ్స్లో ప్రతీ నెలా రూ.2,000 చొప్పున మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత వెసులుబాటు లేకపోవడంతో సిప్ ఆపేశాడు. కానీ, అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అలాగే ఉంచేశాడు. ఒకరోజు ఏజెంట్ కాల్ చేసి.. రూ.72,000 పెట్టుబడి రూ.1.8 లక్షలు అయినట్టు చెప్పడంతో ఆశ్చర్యపోవడం తివారీ వంతు అయింది. ఎవరో ఫ్రెండ్ చెబితే సిప్ మొదలు పెట్టిన తివారీ.. అంత నిధిని చూసేసరికి పెట్టుబడి ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నాడు. పెట్టుబడి చిన్నదైనా క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. రాబడి రుచి తెలిసిన తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టకుండా ఉంటారా? అందుకే తివారీ మళ్లీ సిప్ మొదలు పెట్టడమే కాదు.. ఈ విడత రూ.2,000 చొప్పున రెండు పథకాల్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్జించే ప్రతి ఒక్కరూ తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా వెంటనే సిప్ ఆరంభించాలి. సిప్ అన్నది ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లిపోతుంది. క్రమశిక్షణతో పెట్టుబడికి సిప్ వీలు కల్పిస్తుంది. సిప్ అనగానే ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి? అన్న సందేహం వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం లార్జ్క్యాప్ విభాగానికి 50–60%, మిడ్ స్మాల్క్యాప్ విభాగానికి 20–30%, డెట్ విభాగానికి 10–20% కేటాయింపులు చేసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. అలాగే, మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని పథకాలు ఉండాలన్నది నిర్ణ యించుకోవాలి. సిప్ పెట్టుబడులు సైతం మార్కెట్ ప్రతికూలతల్లో నష్టాలను చూపిస్తాయి. అయినా నిరాశ చెందకుండా ఓపికతో పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొన సాగించాలి. పీపీఎఫ్ ఖాతా డెట్ సాధనాల్లో ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) మెరుగైన ఎంపిక. మూడు రకాల ప్రయోజనాలు దీన్నుంచి అందుకోవచ్చు. మొదట ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై వచ్చే వడ్డీ రాబడిపైనా పన్ను ఉండదు. గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకునే మొత్తంపైనా పన్ను లేదు. ప్రస్తుతం ఇందులో చేసే పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతీ నెలా 12,500 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో 22,50,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. రాబడి ప్రస్తుత 7.1 శాతం ప్రకారం రూ.16,94,599 వస్తుంది. భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత ఐదేళ్ల చొప్పున గడువు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఖాతాను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏటా కొంత చొప్పున ఉపసంహరించుకోవచ్చు. బ్యాలన్స్పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఏడేళ్ల తర్వాత నుంచి ఇందులో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. రుణ సదుపాయానికి కూడా వీలుంది. పీపీఎఫ్ సొమ్మును కోర్టులు కూడా జప్తు చేయడానికి ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ తమపై ఆధారపడిన వారు ఉంటే (తల్లిదండ్రులు లేదా భార్యా, పిల్లలు) తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ, ఏదేనీ కారణంతో మరణం సంభవిస్తే పాలసీలో ఎంపిక చేసుకున్న మేరకు పరిహారాన్ని బీమా సంస్థ కుటుంబ సభ్యులకు అందిస్తుంది. టర్మ్ కవరేజీ అన్నది తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ ఇచ్చే అచ్చమైన బీమా సాధనం. ఇందులో పెట్టుబడి కలసి ఉండదు. కట్టిన ప్రీమియం జీవించి ఉంటే వెనక్కి రాదు. మరణించిన సందర్భాల్లోనే ఈ పాలసీ నుంచి పరిహారం అందుకోగలరు. కనుక తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్నే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ అన్నది 30 ఏళ్లలోపు తీసుకోవడమే మంచిది. తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, ఇంకా వివాహం చేసుకోకపోతే.. ముందుగానే తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల ప్రీమియం పెరిగిపోతుంది. ఈలోపు ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే ప్రీమియం భారం మరింత పెరుగుతుంది. మంచి చెల్లింపుల చరిత్ర కలిగిన కంపెనీల మధ్య టర్మ్ ప్రీమియం వ్యత్యాసాన్ని పరిశీలించి.. ఆకర్షణీయమైన ప్లాన్ను ఎంపిక చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. భారీ బిల్లుతో ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఎందరో ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఇదే కనిపించింది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్ కవరేజీ తప్పకుండా ఉండాల్సిందే. అందుకే హెల్త్ ప్లాన్ను ఆరోగ్యంపై పెట్టుబడిగా చెబుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వైద్య బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడులు క్షేమంగా ఉంటాయి. హెల్త్ ప్లాన్ లేకపోతే పెట్టుబడులు కరిగిపోతాయి. లేదంటే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. వైద్య చికిత్సల వ్యయాలు ఎంతో ఖరీదుగా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటేటా చార్జీలు పెరుగుతూనే పోతున్నాయి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాకుండా.. కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. అరకొర కవరేజీతో తీసుకుంటే అవసరాలు తీరకపోవచ్చు. ఒక అంచనా ప్రకారం మధ్యతరగతి ప్రజల్లో 90 శాతానికి పైగా హెల్త్ కవరేజీ లేదు. ఉన్నా తగినంత కవరేజీ లేదు. ముఖ్యంగా చిన్న వయసులో వ్యాధుల రిస్క్ అంతగా ఉండదు. 40 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఈ రిస్క్ పెరుగుతుంది. యుక్త వయసులో మంచి ఆరోగ్యాన్ని చూసి హెల్త్ ఇన్సూరెన్స్ను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఒక్కసారి ఆరోగ్య సమస్యలు వెలుగు చూసిన తర్వాత బీమా తీసుకోవాలంటే ప్రీమియం భారం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక బీమా ఏదైనా కానీయండి ముందుగానే తీసుకోవాలి. ప్రీమియం తప్పకుండా చెల్లిస్తూ వెళ్లాలి. వైద్య బీమా తీసుకునే వారు 10 ఏళ్ల తర్వాత వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ప్రతీ పదేళ్లకు కవరేజీని సమీక్షించుకుని పెంచుకోవాలి. రుణాలకు దూరం విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా రుణాలు తీసుకోవడం నష్టానికి దారితీస్తుంది. మీ చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాల మీద రుణాలు తీసుకుని చెల్లింపులు కష్టమైతే.. క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో ముఖ్యమైన రుణాలకు సమస్యలు ఏర్పడొచ్చు. జీవితంలో లాభదాయకమైన రుణం ఏదైనా ఉందంటే అది గృహ రుణమే. పన్ను ప్రయోజాలను పరిగణనలోకి తీసుకుంటే గృహ రుణం ఒక్కదానిని పరిశీలించొచ్చు. అలాగే, అవసరానికి పిల్లల ఉన్నత విద్య కోసం రుణ బాట కూడా పట్టొచ్చు. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ రుణాలన్నవి విలువను తగ్గించేవి. వీటికి దూరంగా ఉండాలి. రుణ చెల్లింపులు నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని మించకూడదన్నది ప్రాథమిక సూత్రం. ద్రవ్యోల్బణానికి చోటు సగటు ద్రవ్యోల్బణం 7 శాతం ఉంటుందని అనుకుంటే నేటి రూ.లక్ష విలువ కాస్తా.. 30 ఏళ్ల తర్వాత రూ.13,000 అవుతుంది. అంటే నేడు రూ.లక్షకు లభించే ఏదేనీ సేవ కోసం 30 ఏళ్ల తర్వాత ఏడున్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకనే భవిష్యత్తుకు ప్లాన్ చేసుకునే సమయంలో ద్రవ్యోల్బణానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. భవిష్యత్తులో పిల్లల విద్య, వివాహం, రిటైర్మెంట్ అవసరాలకు ఎంత కావాలన్నది నిర్ణయించుకునే ముందు ద్రవ్యోల్బణ రేటును అంచనాల్లోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పొదుపు విలువ పెంచుకోవాలంటే.. పెట్టుబడులపై దీర్ఘకాలంలో సగటు రాబడి రేటు 14 శాతం అయినా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని నిపుణుల సూచన. ఈపీఎఫ్ నిధికి ప్రాముఖ్యత ఉద్యోగం మారినప్పుడు, ముఖ్యమైన అవసరాలకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి ఉపసంహరించుకోవడం చాలా మంది చేసే పని. గతంలో అంటే సంస్థను మారినప్పుడల్లా, పాత ఖాతాను బదలాయించుకోవడం తలనొప్పిగా భావించి దాన్ని మూసేసేవారు. సంస్థను మారిప్పుడల్లా కొత్త ఖాతాను తెరిచేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సల్ ఖాతా నంబర్ విధానం అమల్లోకి వచ్చింది కనుక ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. సంస్థను మారినా పాత ఖాతాను బ్యాలన్స్ సహా బదలాయించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా అవసరమైనప్పుడల్లా ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేస్తుండడం వల్ల పెద్ద నిధిని సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇంటి నిర్మాణానికి, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. మరే ఇతర మార్గం లేనప్పుడు ఈపీఎఫ్ నిధిని పరిశీలించొచ్చు. అంతేకానీ, ఇతరత్రా అవసరాలకు భవిష్య నిధిని కదపకపోవడమే సూచనీయం. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయంలో కాంపౌండింగ్ మహిమతో మంచి నిధిని అందుకోవచ్చు. కాంపౌండింగ్ పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు, ఆలస్యం చేయవద్దు. వాయిదా వేయడం వల్ల కాంపౌండింగ్ మ్యాజిక్ను కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండింగ్ పెట్టుబడిని మరింతగా వృద్ధి చేస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడి ప్రకారం అంచనా వేస్తే 15 ఏళ్లకు రూ.20 లక్షలు అవుతుంది. దీన్ని మరింత కాలం కొనసాగిస్తూ వెళితే అప్పుడు రాబడికి రాబడి కలుస్తూ పెద్ద మొత్తం సమకూరుతుంది. పొదుపు/పెట్టుబడి పొదుపునే పెట్టుబడిగా భావించే వారు కూడా ఉన్నారు. బ్యాంకు ఖాతాలో ఉంచినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దాన్ని పెట్టుబడిగా పరిగణించడం మెరుగైన ఆర్థిక జీవనానికి మార్గం కానే కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్పై వచ్చే వడ్డీ రాబడి 3 శాతమే. ఇది ద్రవ్యోల్బణం రేటులో సగం. కరెన్సీ విలువను హరించే మేరకు రాబడి కూడా ఇవ్వనిది పెట్టుబడి సాధనం ఎలా అవుతుంది.? అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేటు 6.5 శాతం మించి లేదు. ఇది కూడా ద్రవ్యోల్బణం రేటుకు సమానమే. పైగా ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్లో రిస్క్ తీసుకుంటే రాబడి రేటు 8 శాతం అందుకోవచ్చు. ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇవ్వని ఏదీ కూడా పెట్టుబడి సాధనం కాబోదు. అందుకనే సంపాదనలో ఆదా చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టినప్పుడే పెట్టుబడి అవుతుంది. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైనవి. 20–30 ఏళ్ల కాలంలో వీటిల్లో రాబడి 12–18 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. -
హెల్త్ బీమా ఎందుకు తప్పనిసరి?
నేటి జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ప్రతి కుటుంబానికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంతో ఉంది. అయినా, ప్రీమియం భారంగా భావించి హెల్త్ కవరేజీ తీసుకోని వారు మన సమాజంలో ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. కనుక అందరూ కాకపోయినా కొందరు అయితే నూటికి నూరు శాతం హెల్త్ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. లేదంటే, ఆర్థిక పరమైన సంక్షోభాన్ని హెల్త్ రిస్క్ రూపంలో ఎదుర్కోవాల్సి రావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం..? అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే హెల్త్ కవరేజీ ఉంటే ఆ నిశ్చింతే వేరు. వయసు పెరుగుతున్న కొద్దీ పలు అనారోగ్యాలు, వ్యాధులు పలకరిస్తుంటాయి. కొందరికి చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఫిట్నెస్తో సంబంధం లేకుండా వచ్చే కేన్సర్ వంటి మహమ్మారులూ ఉన్నాయి. అందుకని ఆరోగ్య బీమాను మంచి పెట్టుబడిగా.. ధైర్యాన్నిచ్చే, అవసరంలో రక్షణనిచ్చే మంచి ఆయుధంగా చూడాలి. సంపాదన మొదలు పెట్టిన నాటి నుంచి లేదా కనీసం పెళ్లయిన వెంటనే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో వ్యాధుల చరిత్ర ఉన్నవారు ఆరోగ్య బీమాను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడం లేదా ఆలస్యం చేయడం సరికాదు. నిర్లక్ష్యం చేస్తే రిస్క్ను ఆహ్వానించినట్టే అవుతుంది. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అలాగే, పిల్లల్ని కనే వయసులోని మహిళలు, అంటువ్యాధులు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఉండేవారు, తరచూ ప్రయాణించే వారు (విమాన ప్రయాణం కావచ్చు.. ఉద్యోగరీత్యా తరచూ వాహన ప్రయాణం చేసే వారు) ఆరోగ్య బీమాను వెంటనే తీసుకోవాలి. తీసుకుంటే పాలసీదారులకే ప్రయోజనం. బీమా కంపెనీలకు కాదు. వీలైనంత చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఆ వయసులో వ్యాధుల రిస్క్ ఉండదు. తక్కువ ప్రీమియానికే మెరుగైన కవరేజీ లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ ఉండాలి. కానీ, ఇక్కడ చెప్పుకున్న విభాగాల్లోని వారికి హెల్త్ ప్లాన్ పక్కా ఉండాల్సిందే. కుటుంబ చరిత్ర కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నేడు వంశపారంపర్యంగా మారాయి. ఇందుకు ఆయా కుటుంబాల జీవనశైలి, ఆహార నియమాలు, జీన్స్ ఇలా ఎన్నో అంశాలు నేపథ్యంగా ఉండొచ్చు. గుండె జబ్బులు, మధుమేహం, పలు రకాల కేన్సర్ సమస్యలు ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి. కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా బీమా కవరేజీ తీసుకుని రక్షణ కల్పించుకోవాలి. ఆయా వ్యాధులు పలకరించక ముందు నుంచే బీమా ఉంటుంది కనుక.. ముందు నుంచి ఉన్న వ్యాధుల పరిధిలోకి అవి రావు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీ తీసుకున్న నాటి నుంచి కనిష్టంగా రెండేళ్లు.. గరిష్టంగా నాలుగేళ్ల వరకు వేచి ఉండాలని కోరుతుంటాయి. కంపెనీల మధ్య ఈ వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉండొచ్చు. ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే.. ఆరో గ్య సమస్యలు వెలుగుచూస్తాయి. దీంతో బీమా కంపెనీలు నిర్ణీత కాలం పాటు వెయిటింగ్ తర్వాతే వాటికి కవరేజీని ఆఫర్ చేస్తాయి. అది కూడా అధిక ప్రీమియానికే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీరి నుంచి క్లెయిమ్ల రిస్క్ ఉంటుంది. అవన్నీ మదింపు వేసి, అందుకు తగ్గ ప్రీమియాన్ని అవి వసూలు చేస్తాయి. ఆరోగ్యవంతులకు, ఆరోగ్య సమస్యలున్న వారికి ఒక్కటే ప్రీమియం వసూలు చేయ డం అన్నది అసాధ్యం. వెయిటిం గ్ పీరియడ్ వల్ల ఆయా కాలంలో అవే ఆరోగ్య సమస్య లతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. ఖర్చంతా పాలసీదారు స్వయంగా భరించా ల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకనే చిన్న వయసులోనే బీమా రక్షణ కల్పించుకో వాలని నిపుణులు సూచిస్తుంటారు. కొన్ని ప్రాంతాలు వేరు.. దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు ఉంటుంటాయి. ఆయా ప్రాంతాల్లో డెంగీ, చికెన్ గున్యా, మలేరియా కేసులు అప్పుడప్పుడు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటాయి. అందుకని వీటికి కవరేజీని ఆఫర్ చేసే బీమా ప్లాన్లను ఆయా ప్రాంతాల్లో నివసించే వారు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా అవుట్ పేషెంట్ కవరేజీతో ఈ ప్లాన్లు ఉండేలా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొన్ని వ్యాధులు తరచూ కనిపిస్తుంటాయి. స్థానికులు వాటిపై అవగాహనతో కవరేజీ ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి సమస్యలకు అవుట్ పేషెంట్గా వైద్యం చేయించుకోవాలన్నా భారీగా ఖర్చవుతుంది. హెల్త్ప్లాన్లలో ఇన్పేషెంట్ (ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలు) కవరేజీ విషయంలో సందేహం అక్కర్లేదు. అదే సమయంలో అవుట్ పేషెంట్గా చేసే ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ ఎంపిక జరగాలి. నేడు చాలా బీమా సంస్థలు అవుట్ పేషెంట్ కవరేజీ (ఓపీడీ)ని అందిస్తున్నాయి. వీటికి కొన్ని పరిమితులు, షరతులు, కొంత అదనపు ప్రీమియం అమలవుతుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ బీఫిట్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ డిజిటల్ కేర్ ప్లాన్లు రూ.1,000 నుంచి రూ.10,000 ఓపీడీ కవరేజీ కోసం రూ.300 నుంచి రూ.3,000 వరకు ప్రీమియం వసూలు చేస్తున్నాయి. వీటిని యాడాన్గా లేదంటే పాలసీలో భాగంగా తీసుకోవచ్చు. ఓపీడీ కవరేజీలో టెలిమెడికల్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్లు ఉచితంగా లభిస్తాయి. తరచూ ప్రయాణాలు.. ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసే వారికి అన్ని బీమా సంస్థలు ప్లాన్లను ఆఫర్ చేయడం లేదు. కొన్ని మాత్రం కఠిన అండర్ రైటింగ్ నిబంధనలకు లోబడి కవరేజీని ఇస్తున్నాయి. తరచూ ప్రయాణాలు చేసే వారికి కూడా ఎన్నో రకాల రిస్క్లు ఎదురవుతుంటాయి. వీరు సులభంగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇతర వృత్తులతో పోలిస్తే ఇలా తరచూ ప్రయాణించే వారికి ఆరోగ్య సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా వ్యక్తులు క్యాష్లెస్ కవరేజీ నెట్వర్క్లో ఎక్కువ ఆస్పత్రులు ఉండే బీమా సంస్థ నుంచి ప్లాన్ తీసుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా సమీపంలోని నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్లి నగదు రహిత వైద్యాన్ని పొందడానికి వీలుంటుంది. క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న బీమా సంస్థల ప్లాన్లలోని సదుపాయాలను విశ్లేషించిన తర్వాత ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. సొంత ప్రాంతంలో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు నగదు రహిత చికిత్సల ఆస్పత్రి కాకపోయినా.. ఎవరో ఒకరి నుంచి బదులు తీసుకుని చికిత్స తీసుకోవచ్చు. కానీ, ప్రయాణాల సమయంలో సమస్య వస్తే అప్పుడు ఆదుకునేది నగదు రహిత వైద్యమే అని గుర్తు పెట్టుకోవాలి. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. విదేశాల్లోనూ కవరేజీ లభించే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ను కూడా తీసుకోవాల్సి రావచ్చు. దీనికంటే కూడా ప్రయాణాలు చేసే వృత్తుల్లోని వారు డొమెస్టిక్ హెల్త్ప్లాన్లోనే విదేశీ వైద్యానికి కూడా కవరేజీ ఉండే ఆప్షన్తో తీసుకోవడం మంచిది. మణిపాల్ సిగ్నా లైఫ్ టైమ్ హెల్త్ప్లాన్ 27 రకాల క్రిటికల్ ఇల్నెస్లకు విదేశాల్లో కవరేజీని ఆఫర్ చేస్తోంది. అలాగే, ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ప్లాన్ 16 రకాల తీవ్ర ఆరోగ్య సమస్యలకు విదేశాల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ను అందిస్తోంది. ఈ తరహా వ్యక్తులు అధిక కవరేజీ (రూ.కోటి వరకు) తీసుకోవడం అత్యవసర పరిస్థితుల్లో అర్థవంతంగా ఉంటుంది. కూర్చుని చేసే ఉద్యోగాలు కదలికలు తక్కువగా ఉండి, సిస్టమ్ ముందు గంటలపాటు కూర్చుని పనిచేసే వారికి దీర్ఘకాలంలో వ్యాధుల రిస్క్ ఎక్కువ. వీరికి జాయింట్స్, స్పైన్ సమస్యలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూనే.. మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీకి కూడా ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అందులోనూ సమగ్ర కవరేజీ ఉండేలా చూసుకోవాలి. పెళ్లయిన మహిళలు వివాహ బంధంలోకి అడుగుపెట్టి పిల్లల కోసం ప్లాన్ చేసుకునే మహిళలు బీమా కవరేజీ పట్ల ముందుగా దృష్టి సారించాలి. దాదాపు అన్ని బీమా సంస్థలు మెటర్నిటీ కవరేజీ కోసం వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తున్నాయి. కేవలం కొన్ని ప్లాన్లు వెయిటింగ్ పీరియడ్ లేకుండా పరిమితంగా మెటర్నిటీ కవరేజీ ఇస్తున్నాయి. ఉద్యోగం చేస్తుంటే సంస్థ నుంచి గ్రూపు హెల్త్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే గ్రూపు హెల్త్ ప్లాన్లలో మొదటి రోజు నుంచే కవరేజీ లభిస్తుంది. స్టార్హెల్త్ యంగ్ స్టార్ గోల్డ్ ప్లాన్, టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియర్ ప్లాన్, ఫ్యూచర్ జనరాలి ప్రోహెల్త్ ప్లస్ మెటర్నిటీ కవరేజీని రూ.30,000–50,000 మధ్య ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంది. పుట్టే బేబీలకు మొదటి రోజు నుంచి కవరేజీ ఆప్షన్తో ఉన్న ప్లాన్ మెరుగైనది అవుతుంది. బజాజ్ అలియంజ్ హెల్త్ సుప్రీమ్ ప్లాన్లో.. ఆస్పత్రిలో చేరడానికి ముందు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వ్యయాలకూ చెల్లింపులు చేస్తుంది. బేబీకి 90 రోజుల వరకు ఇచ్చే టీకాలకూ క్లెయిమ్ లభిస్తుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు అన్నీ కూడా కొత్తగా వచ్చే పిల్లలకూ కవరేజీని ఇచ్చే ఆప్షన్తోనే ఉంటాయి. గ్రూపు హెల్త్ ప్లాన్లలో వెయిటింగ్ పీరియడ్ ఉండదు. అందుకని పనిచేసే చోట గ్రూపు హెల్త్ప్లాన్ తీసుకుని, విడిగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. వ్యక్తులు వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర, జీవనశైలి, వయసు ఇలాంటి అంశాలన్నీ పరిశీలించుకుని, ఆయా సమస్యలకు కవరేజీనిచ్చే, సమగ్ర ఆరోగ్య ప్లాన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. కారణం ఏదైనా కానీ, పాలసీ తీసుకునే నాటికి ఏవైనా వ్యాధులు ఉంటే వాటి కోసం వేచి చూడక తప్పదు. అటువంటి సందర్భంలో అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం కవరేజీ కోరుకునేట్టు అయితే.. కొన్ని సంస్థలు అధిక ప్రీమియంతో వెంటనే కవరేజీనిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు తక్కువ వెయిటింగ్ పీరియడ్తో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే వీటి ప్రీమియం ధరలు అధికంగా ఉంటాయని మర్చిపోవద్దు. ఎందుకంటే అండర్రైటింగ్ (వాటి రిస్క్ను సర్దుబాటు చేసుకోవడం) నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి వస్తుంది. గుండె జబ్బులు, కేన్సర్ తదితర తీవ్ర అనారోగ్య సమస్యలకు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మొదటి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్తో కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. కానీ, రెగ్యులర్ ప్లాన్లో వేచి ఉండే కవరేజీతో పోలిస్తే ఇలా తీసుకునే వాటి ప్రీమియం చాలా ఎక్కువ. పైగా తీసుకునే బీమా కవరేజీ కూడా ఇక్కడ కీలకమవుతుంది. కుటుంబంలో తీవ్ర ఆరోగ్య సమస్యల చరిత్ర ఉన్నా.. తీసుకునే నాటికి ఆరోగ్య సమస్యలు పలకరించినా.. రూ.5 లక్షల కవరేజీ ఏ మూలకు సరిపోకపోవచ్చు. ము ఖ్యంగా కేన్సర్ చికిత్సకు రూ.5 లక్షల కవరేజీ చాలదు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లలో బెనిఫిట్ ఆప్షన్తో ఉన్న వాటికి ఎంపిక చేసుకుంటే జాబితాలోని వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆ మేరకు మొత్తం చెల్లించేస్తాయి. -
కోవిడ్ భయపెట్టినా.. పాఠాలు నేర్వని హైదరాబాదీలు
Max Life Insurance Survey: గడిచిన వందేళ్లలో యుద్ధాలను, ప్రకృతి వైపరిత్యాలను మినహాయిస్తే మానవాళిని అత్యంత భయాందోళనకు గురి చేసింది కరోనా వైరస్. ముఖ్యంగా మొదటి రెండు వేవ్లలో కరోనా బారిన పడి.. చికిత్స కోసం చేసిన ఖర్చులతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయాయి. చాలా మంది అప్పులపాలై ఆస్తులు అమ్మేసుకున్నారు. ఇప్పుడిప్పుడే దేశం కరోనా నుంచి కోలుకుంటోంది. అయితే కరోనా తీవ్రంగా భయపెట్టినా ఆరోగ్య భద్రత, ఆర్థిక స్థిరత్వం కోణంలో హెల్త్ ఇన్సురెన్సు చేయించడంలో హైదరాబాదీలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. కోవిడ్ అనంతరం హెల్త్ ఇన్సురెన్స్ విషయంలో భారతీయు ఆలోచణ ధోరని ఎలా ఉందో తెలుసుకునేందుకు మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ సంస్థ ఇటీవల దేశంలో ఉన్న 22 నగరాల్లో సర్వే నిర్వహించింది. మొత్తం 5729 శాంపిల్స్ సేకరించి ఈ నివేదిక రూపొందించారు. దేశంలో ఒమిక్రాన్ వైరష్ విజృంభించిన సమయంలో అంటే 2021 డిసెంబరు నుంచి 2022 జనవరి మధ్యన ఈ శాంపిల్స్ సేకరించారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను పరిశీలిస్తే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోషెంట్కి సంబంధించి దేశ సగటు 53 పాయింట్లుగా ఉంది. ఇక ప్రధాన మెట్రో నగరాలను పరిశీలిస్తే ముంబై 55, కోల్కతా, చెన్నై 52 స్థానాల్లో నిలిచాయి. 48 పాయింట్లు సాధించిన హైదరాబాద్ మెట్రో నగరాల్లో అన్నింటికంటే దిగువన నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో గత పదిహేనేళ్లుగా ప్రభుత్వతమే ఆరోగ్యశ్రీ పేరుతో సామాజిక హెల్త్ ఇన్సురెన్స్ స్కీం అమలు చేయడం వల్ల ఇక్కడ కొంత మేర ప్రైవేట్ ఇన్సురెన్స్ తగ్గి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
వ్యక్తిగతమా.. గ్రూప్ పాలసీనా...
కోవిడ్–19 రాకతో ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల అవసరాన్ని గుర్తించి, కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రకరకాల హెల్త్ పాలసీలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేవి ఎక్కువగా ప్రాచుర్యంలో కనిపిస్తుంటాయి. వీటి గురించి వివరించేదే ఈ కథనం. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణంగా ఒక గ్రూప్గా ఉండే వ్యక్తుల కోసం ఈ తరహా పాలసీలను కంపెనీలు రూపొందిస్తుంటాయి. ఉదాహరణకు ఒకే కంపెనీలో పనిచేసే వ్యక్తుల కోసం ఇలాంటి పాలసీలు ఉంటాయి. పాలసీదారు కుటుంబ సభ్యులకు కూడా చాలా సందర్భాల్లో పాలసీ ప్రయోజనాలను వర్తింపచేసినా .. ఒక్కో సభ్యుడికి ఒక్కో రకమైన కవరేజ్ అంటూ ఉండదు. ప్రాథమికంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. పాలసీదారులు ప్రమాదం కారణంగానైనా లేదా కోవిడ్–19 సహా ఇతరత్రా ఏదైనా అనారోగ్యంతోనైనా ఆస్పత్రిలో చేరితే కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి పాలసీల కోసం బీమా కంపెనీలు మెడికల్ చెకప్ గురించి అడగవు. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు తక్కువగానే ఉంటాయి. గ్రూప్ అంగీకరించే కొటేషన్ను బట్టి ప్రతీ ఏడాది కవరేజీ మారవచ్చు. ఈ పాలసీల ప్రీమియాన్ని కంపెనీయే భరించవచ్చు లేదా సభ్యుడి నుంచి వసూలు చేయవచ్చు. గ్రూప్లో అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య బీమా.. ఈ పాలసీలను వ్యక్తులు నేరుగా కొనుగోలు చేస్తారు. వివిధ రకాల అస్వస్థతలు, ఆస్పత్రిలో చేరితే అయ్యే ఖర్చులు, ఇతరత్రా చికిత్సాపరమైన ఖర్చుల నుంచి రక్షణ పొందేందుకు .. పాలసీదారు తన అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీల కవరేజీని ఎంచుకోవడానికి వీలు ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త మామలు వంటి మీ మీద ఆధారపడిన వారికి కూడా కవరేజీ లభించేలా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి నేరుగా ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది. సకాలంలో పునరుద్ధరించుకోకపోతే పాలసీ గడువు ముగిసిపోతుంది. పాలసీ తీసుకునే వ్యక్తికి సంబంధించిన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా బీమా కంపెనీ అడగవచ్చు. ఎవరికి ఏవి అనువైనవంటే.. ప్రీమియంలు చౌకగా ఉండటంతో పాటు యజమానే కడతారు కాబట్టి యుక్తవయస్కులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అర్థవంతంగానే ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతలు ఉన్నవారు.. తగినంత కవరేజీతో కూడిన వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ సంస్థ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ భారీగానే ఉన్నట్లయితే.. గ్రూప్ ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూర్డ్తో సరిపోయే టాప్–అప్ కవర్ని తీసుకోవచ్చు. ఇది చౌకగానే రావడంతో పాటు మీకు తగినంత స్థాయిలో కవరేజీనీ అందిస్తుంది. కొన్ని కంపెనీలు భవిష్యత్తులో అవసరమైతే టాప్–అప్ను బేస్ కవర్గా మార్చుకునేందుకు కూడా అవకాశమిస్తున్నాయి. కాబట్టి హెల్త్ పాలసీని తీసుకునేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. సుధా రెడ్డి, హెడ్ (హెల్త్ విభాగం) డిజిట్ ఇన్సూరెన్స్ -
Insurance: బేసిక్ పాలసీ సరిపోదు.. ఇవి కూడా ఉంటేనే లాభం
ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన విస్తృతమవుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రతాపంతో బీమా అవసరాన్ని చాలా మంది తెలుసుకున్నారు. ఊహించని పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లుతో ఆర్థికంగా గుల్లవకుండా బీమా ప్లాన్ కాపాడుతుంది. అయితే, ఆరోగ్య బీమా అవసరమైనంత కవరేజీతో, సమగ్ర రక్షణతో ఉన్నప్పుడే అసలు లక్ష్యం సిద్ధిస్తుంది. కానీ, బేసిక్ పాలసీ ఒక్కటే సరిపోతుందా? అంటే సందేహమే. వ్యక్తులు తమ అవసరాలు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా అదనపు రైడర్లను జోడించుకోవడం ద్వారా బీమా రక్షణను మరింత సమగ్రంగా మార్చుకోవచ్చు. ప్రమాద మరణం లేదా ప్రమాదంలో వైకల్యం, తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆదుకునే రైడర్లను బేసిక్ హెల్త్ ప్లాన్లకు జోడించుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం కథనం. రైడర్ అన్నది అదనపు ప్రయోజనంతో కూడినది. సాధారణ హెల్త్ ప్లాన్లతోపాటు వీటిని తీసుకోవచ్చు. రైడర్ ద్వారా తక్కువ ప్రీమియంకే అదనపు రక్షణ సాధ్యపడుతుంది. ఈ రైడర్లు అన్నవి అందరికీ అన్నీ అవసరమవుతాయని కాదు. అవసరాలు అన్నవి భిన్నంగా ఉండొచ్చు. అందుకనే భిన్న రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కవరేజీని రైడర్ ద్వారా మరింత పెంచుకోవచ్చు. లేదంటే ప్రమాదంలో మరణిస్తే అదనపు పరిహారాన్నిచ్చే రైడర్ను తీసుకోవచ్చు. లేదంటే ప్రమాదం కారణంగా పాలసీదారు వైకల్యం పాలైనా పరిహారాన్నిచ్చే రైడర్ను అటు జీవిత బీమా పాలసీలతోనూ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతోనూ కలిపి తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ ఇలా ఎన్నో రైడర్లు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనుకోని పరిణామం ఎదురైనా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకుండా గట్టెక్కడానికి వీలుంటుంది. రైడర్ల వల్ల అంత ప్రయోజనం ఉంది. పాలసీదారులు అవసరమైన అదనపు కవరేజీలను అందుబాటు ప్రీమియంకు అందించడమే రైడర్ల ఉద్దేశ్యం. ఇక వైద్య రంగంలో ద్రవ్యోల్బణం సవాళ్లనూ రైడర్ల వల్ల అధిగమించే అవకాశం ఉంది. రూమ్ రెంట్ వెయివర్ రూమ్ రెంట్ వెయివర్ రైడర్ తీసుకున్నట్టయితే.. ఆస్పత్రిలో చేరినప్పుడు అందుబాటులో ఉన్న ఏ కేటగిరీ సదుపాయాన్నైనా తీసుకోవచ్చు. మరింత పరిమితి ఇచ్చే లేదంటే అసలు గది అద్దె పరిమితినే రద్దు చేసే రైడర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ హెల్త్ ప్లాన్లలో స్టాండర్డ్ లేదా సెమీ ప్రైవేటు రూమ్లకే చెల్లింపులు చేసేలా నిబంధనలు ఉంటుంటాయి. లేదంటే రూమ్ రెంట్ను బీమా కవరేజీలో 1–2 శాతం పరిమితిగా విధిస్తుంటాయి. రూమ్ రెంట్ వెయివర్ రైడర్తో పాలసీదారులు తమకు ఇష్టమైన గదిని ఆస్పత్రిలో తీసుకోవచ్చు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఎక్కువ మంది పాలసీదారులు ఈ రైడర్ను ఎంపిక చేసుకుంటుంటారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినప్పుడు వైద్య పరమైన ఖర్చులే కాకుండా.. ఇతర ఖర్చులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో హాస్పిటల్ డైలీ క్యాష్ రైడర్ అక్కరకు వస్తుంది. వందల నుంచి వేల రూపాయల వరకు రోజువారీగా ఈ రైడర్ కింద పాలసీదారులకు కంపెనీలు చెల్లిస్లాయి. ఏ అవసరం కోసమైనా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. పాలసీలో కవరేజీ లేని వాటికి కంపెనీలు చెల్లింపులు చేయవు. అటువంటి వాటికి ఈ రైడర్ అవసరపడుతుంది. మెటర్నిటీ రైడర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో చాలా వరకు ప్రసవ ఖర్చులను చెల్లించే ఆప్షన్ రావు. కనుక పాలసీ తీసుకునే ముందే.. మేటర్నిటీ కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే మేటర్నిటీ రైడర్ను తీసుకోవచ్చు. దీనివల్ల డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలను కంపెనీయే చెల్లిస్తుంది. కాకపోతే ఈ రైడర్ తీసుకున్న నాటి నుంచి కనీసం 2–3 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ అమలవుతుంది. అంటే ఆ తర్వాతే మేటర్నిటీ ఖర్చులను క్లెయిమ్ చేసుకోగలరు. అందుకే పెళ్లయిన వెంటనే ఈ రైడర్ను జోడించుకోవడం మంచిది. క్రిటికల్ ఇల్నెస్ కవర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్కు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీని తీసుకోవడం ఎంతో అవసరం. మారిన జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఒక వయసు తర్వాత ఎదుర్కోవాల్సి వస్తోంది. కనుక క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ప్రతీ ఒక్కరికీ అవసరమే. దీన్ని అదనపు రైడర్గా తీసుకోవడం మంచిది. కేన్సర్ లేదా స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్, మూత్రపిండాల వైఫల్యం ఇలా ఎన్నో క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీని పొందొచ్చు. బీమా కంపెనీలు జాబితాలో పేర్కొనే ఏ క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా.. ఏక మొత్తంలో బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. వీటిని బెనిఫిట్ ప్లాన్లు అంటారు. అలా కాకుండా క్రిటికల్ ఇల్నెస్తో ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుల వరకే చెల్లింపులు చేసే ఇండెమ్నిటీ ప్లాన్లు కూడా ఉంటాయి. బెనిఫిట్ ప్లాన్ను (వ్యాధి నిర్ధారణతో చెల్లింపులు చేసేవి) తీసుకోవడం ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం కారణంగా పాలసీదారు మరణిస్తే.. నిలిచిపోయిన ఆదాయం, రుణాల చెల్లింపులకు ఆ పరిహారం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కేన్సర్ లేదా మూత్రపిండాల వైఫల్యం వెలుగు చూసిన తర్వాత.. మరణానికి మధ్య విరామం ఉంటుంది. ఆ సమయంలో ఆస్పత్రిలో చేరడం వల్లే కాకుండా ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యంలో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏక మొత్తంలో చెల్లించేసే రైడర్లను హెల్త్ప్లాన్తో పాటు తీసుకోవాలి. కన్జ్యూమబుల్స్ కవర్ ఆస్పత్రుల్లో కన్జ్యూమబుల్స్కు అయ్యే వ్యయాలను బీమా కంపెనీలు చెల్లించవు. చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఉత్పత్తులను రోగులకు వాడిన తర్వాత పడేస్తుంటారు. చేతి తొడుగులు, పీపీఈ కిట్లు, సర్జికల్ పరికరాలు ఇలాంటి కన్జ్యూమబుల్స్ చాలానే ఉంటాయి. బీమా కంపెనీలు మినహాయింపుల జాబితాలో కన్జ్యూమబుల్స్ గురించి వివరంగా పేర్కొంటాయి. వీటికి అయ్యే వ్యయాలను పాలసీదారే తన జేబు నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్జ్యూమబుల్స్ కవరేజీ తీసుకుంటే అప్పుడు వాటికయ్యే వ్యయాలన్నింటినీ కంపెనీయే చెల్లిస్తుంది. ఇది కూడా పాలసీదారులకు ఉపయోగపడే కవరేజీయే. వ్యక్తి ప్రమాద బీమా క్రిటికల్ ఇల్నెస్ మాదిరే పర్సనల్ యాక్సిడెంట్ (ప్రమాద బీమా) కవరేజీ కూడా ముఖ్యమైనదే. ప్రమాదంలో మరణించినట్టయితే సాధారణ బీమా కవరేజీకి అదనంగా ఈ మొత్తాన్ని కూడా కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం పాలైతే (పాక్షికం, పూర్తి) పరిహారాన్ని కూడా చెల్లిస్తాయి. నామమాత్రపు ప్రీమియానికే ఈ కవరేజీలు లభిస్తాయి. కనుక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే వారు జీవిత బీమా ప్లాన్ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ రైడర్ లేకపోతే.. ఉదాహరణకు ప్రమాదం కారణంగా అంగవైకల్యం పాలైతే అప్పుడు మునుపటి మాదిరిగా జీవితం ఉండకపోవచ్చు. ఆదాయం లోటు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితుల్లో రైడర్ ఆదుకుంటుంది. ఓపీడీ కవరేజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో అధిక శాతం.. ఆస్పత్రిలో చేరడం వల్ల అయ్యే ఖర్చులనే చెల్లిస్తుంటాయి. ఔట్ పెషెంట్గా (ఓపీడీ) వెళ్లి తీసుకునే చికిత్సలకు కవరేజీ ఉండదు. అటువంటప్పుడు ఈ ఓపీడీ కవరేజీ సాయంగా నిలుస్తుంది. ఇది ఉంటే ఆస్పత్రిలో చేరకుండా డాక్టర్ వద్దకు వెళ్లి తీసుకునే చికిత్సలకు సైతం పరిహారం అందుకోవచ్చు. ఎన్సీబీ ప్రొటెక్షన్ ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే నో క్లెయిమ్ బోనస్(ఎన్సీబీ)ను కంపెనీలు ప్రకటిస్తుంటాయి. తిరిగి క్లెయిమ్ ఎదురైతే అంతే పరిమా ణంలో అదనంగా ఇచ్చిన కవరేజీని కంపెనీలు తగ్గిస్తుంటాయి. క్లెయిమ్ చేసుకున్నా అప్పటికే ఎన్సీబీ రూపంలో ఇచ్చిన ప్రయోజనాన్ని కంపెనీలు ఉపసంహరించుకోకుండా ఈ రైడర్ కాపాడుతుంది. -
World Diabetes Day: డయాబెటీస్ ఉంటే ఆరోగ్య బీమా ఎందుకు తీసుకోవాలి?
ప్రతి ఏడాది నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1991లో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య & ప్రపంచ ఆరోగ్య సంస్థ గుండె రుగ్మతలు వంటి మధుమేహంతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి ఒక రోజు అవసరం అని భావించాయి. 2007లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 14ను ప్రపంచ మధుమేహ దినోత్సవంగా గుర్తిస్తూ 61/225 తీర్మానాన్ని ఆమోదించింది. మధుమేహం అనేది మీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహ సమస్య వస్తుంది. ఆహారం తీసుకున్నప్పుడు వచ్చే బ్లడ్ గ్లూకోజ్ నుంచి శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ప్యాంక్రియాస్.. ఇన్సులిన్ అనే హార్మోన్ను తయారు చేస్తుంది. ఈ హార్మోన్ గ్లూకోజ్ను కణాలు గ్రహించేందుకు సహాయపడుతుంది. ఒకవేళ శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉత్పత్తి చేయకపోతే.. డయాబెటిస్ సమస్య వస్తుంది. అప్పుడు గ్లూకోజ్ మీ రక్తంలోనే ఉంటుంది. చివరికి, మీ శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా పేరుకొనిపోయి గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, కంటి సమస్యలు మొదలైన రోగాలు వస్తాయి. ఆరోగ్య బీమా ఎందుకు? ప్రస్తుతం మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ఖర్చు ఆకాశాన్నంటుతోంది. భారతదేశంలో 25 శాతం కుటుంబ ఆదాయం మధుమేహం వంటి రోగాల నయం కోసం ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలపై భారీగా భారం పడుతుంది. తద్వారా పిల్లల విద్య, తిరిగి రుణాలు చెల్లించడం, ఇతర ప్రధాన గృహ ఖర్చులను చెల్లించడం కష్టం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాది కోసం చేసే ప్రత్యక్ష ఆరోగ్య సంరక్షణ వ్యయం 2025 నాటికి 213-396 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కొన్ని దేశాలలో, ఇది వారి మొత్తం ఆర్థిక అంచనాలో 40% వరకు ఉంటుంది. (చదవండి: ఆకాశంలో అద్భుతం.. 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!) అందువల్ల, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆర్థికంగా సంరక్షించుకోవడానికి సమగ్ర ఆరోగ్య బీమా పథకం ఉపయోగపడుతుంది. వేరే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు ఆరోగ్య బీమా లభించదనే అభిప్రాయం వినియోగదారుల్లో ఉంది. ఆరోగ్య బీమా కొనడానికి వారు తరచుగా వాయిదా వేయడానికి ఇదే కారణం. అయితే, ఈ భావన ఖచ్చితంగా నిజం కాదు. మీకు ముందుగా ఉన్న వ్యాధి ఉన్నప్పటికీ, మీరు సులభంగా ఆరోగ్య బీమాను పొందవచ్చు. ఆరోగ్య బీమా కొనుగోలు చేసేటప్పుడు మీ వైద్య చరిత్రను వెల్లడించడం చాలా ముఖ్యం. తరచుగా ప్రజలు దానిని వెల్లడించకుండా తప్పు చేస్తారు. అయితే, ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఫలితంగా తర్వాత క్లెయింలు తిరస్కరించవచ్చు. ఒకవేళ మీకు ప్రీ ఎక్సిటింగ్ డిసీజెస్- పిఈడి ఉన్నట్లయితే, కొనుగోలు చేయడానికి ముందు పాలసీ నియమనిబంధనలను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చదవండి. సబ్ లిమిట్లు, కో పేమెంట్లు, రూమ్ రెంట్ ఛార్జీల కోసం చెక్ చేయండి. ఇలా చేస్తే ఆసుపత్రిలో చేరే సమయంలో మీ స్వంత పాకెట్ నుంచి మీరు డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదు. (చదవండి: Jeff Bezos: నా గుండె పగిలి ముక్కలయ్యింది) -
ఏపీలో అందరికీ ఆరోగ్య ధీమా
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా ఆరోగ్య బీమా వర్తిస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఏపీలో 94.4 శాతం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులో ఉందని తెలిపింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 97.3 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తిస్తుండగా పట్టణాల్లో 86.8 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ఆరోగ్య బీమాతో అత్యధికంగా ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాల కిందకు ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో సర్వేలో విశ్లేషించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 92 శాతం కుటుంబాలకు వర్తిస్తున్నట్లు తేలింది. తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకమే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండో స్థానంలో నిలిచింది. గోవాలో ఆరోగ్య బీమా పథకం 80.4 శాతం కుటుంబాలకు వర్తిస్తోంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 57.7 శాతం మందికే వర్తిస్తున్నట్లు సర్వే పేర్కొంది. మిగిలిన చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలు కాకుండా కేంద్ర పథకాలను వర్తింప చేస్తున్నప్పటికీ ఎక్కువ కుటుంబాలకు బీమా ప్రయోజనం దక్కడం లేదని సర్వే తెలిపింది. ఇవీ కారణాలు.... ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ బాధ్యతలు చేపట్టగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని గాడిలో పెట్టారు. తెల్లరేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు కోసం వార్షిక ఆదాయ పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచారు. వార్షిక ఆదాయ పరిమితిని పెంచడంతో నెలకు రూ.40 వేల ఆదాయం పొందే మధ్య తరగతి కుటుంబాలు కూడా పథకం పరిధిలోకి వచ్చాయి. వైఎస్సార్ నవశకం ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రత్యేకంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. దీంతో ఏపీలో అత్యధిక కుటుంబాలు ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చాయి. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరును నిరంతర ప్రక్రియగా ముఖ్యమంత్రి చేపట్టారు. గత ఏడాది జూన్ 9వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు 2.86 లక్షల మందికి కొత్తగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. -
ఎల్ఐసీ నుంచి కొత్త హెల్త్ ఇన్ఫూరెన్స్ ప్లాన్
హైదరాబాద్: ఎల్ఐసీ "అరోగ్య రక్షక్" పేరుతో ఒక హెల్త్ ఇన్ఫూరెన్స్ ప్లాన్ను తీసుకొచ్చింది. సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ ఎం.జగన్నాథ్ బెంగళూరులో ఈ పాలసీని ప్రారంభించారు. నిర్దేశిత ఆరోగ్య సమస్యలకు ఈ ప్లాన్ స్థిరమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. ఒకే ప్లాన్లో కుటుంబ సభ్యులందరూ భాగం కావచ్చు. ఒక్కరే విడిగానూ తీసుకోవచ్చు. 18-45 ఏళ్ల వయసులోని వారు ఎవరైనా ప్లాన్ను ప్రాథమిక పాలసీదారుగా తీసుకోవచ్చు. ఇందులో 91 రోజుల నుంచి 20 ఏళ్ల వయసు పిల్లలకూ కవరేజీ ఉంటుంది. పిల్లలకు అయితే 25 ఏళ్లు వచ్చే వరకు, ఇతర కుటుంబ సభ్యులకు 80 ఏళ్లు వచ్చే వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. తమకు అనుకూలమైన స్థిర ప్రయోజనాన్ని ఇందులో ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులోనూ పలు అష్టన్లు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితే వైద్య ఖర్చులతో సంబంధం లేకుండా పాలసీదారు ఎంపిక చేసుకున్న మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఆటో స్టెపప్, నో శ్లేయమ్ బెనిఫిట్ రూపంలో కవరేజీ పెంచుకునేందుకు అవకాశం ఉంది. పాలసీదారు తనతో పాటు తన కుటుంబం అంతటికీ ప్లాన్ను తీసుకున్న తర్వాత.. ఏదేనీ కారణంతో ప్రాధమిక పాలసీదారు మరణించినట్టయితే, ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లింపు రద్దయ్యే అప్షన్ కూడా ఉంది. రైడర్లు కూడా ఉన్నట్టు ఎల్ఐసీ తెలిపింది. -
Indian Athletes: వైద్యం కోసం 5 లక్షలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అథ్లెట్ల విషయంలో క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 13 వేల మందికిపైగా క్రీడాకారులతో పాటు వారితో పనిచేసే సహాయక సిబ్బందికి కూడా ఆరోగ్య బీమా చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం తన ప్రకటనలో పేర్కొంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారి వైద్యం కోసం రూ. 5 లక్షలు, రోడ్డు ప్రమాదంలో మరణించినట్లయితే రూ. 25 లక్షల వరకు బీమా లభించనుంది. గతంలో ఈ ఇన్సూరెన్స్ జాతీయ శిక్షణ శిబిరాలకు మాత్రమే వర్తించగా... ప్రస్తుతం ఏడాది మొత్తం ఉండనుంది. అంతే కాకుండా బీమా పొందే అథ్లెట్ల సంఖ్యను కూడా పెంచింది. బీమా అంశం గురించి కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘ అథ్లెట్లు జాతీయ సంపద. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు. చదవండి: బ్లాక్ ఫంగస్: భారత షూటింగ్ కోచ్ కన్నుమూత ‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’ -
ఆరోగ్య బీమా పాలసీలపై ఐఆర్డీఏఐ కీలక నిర్ణయం
ప్రస్తుతం ఉన్న బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని భీమా సంస్థలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. పాలసీల్లో మార్పుల వల్ల బీమా ప్రీమియంలు పెరిగి పాలసీదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది అని తెలిపింది. వ్యక్తిగత బీమా, ప్రయాణ బీమా కవరేజీల జోలికీ వెళ్లరాదని తెలిపింది. పాలసీదారుల అంగీకారంపై స్టాండలోన్ ప్రీమియం రేటుతో ప్రస్తుత ప్రయోజనాలకు కొత్త వాటిని జత చేసుకోవచ్చని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది. అలాగే ఆరోగ్య బీమా వ్యాపారంలో పాలసీల కోసం గత ఏడాది జూలైలో జారీ చేసిన ఏకీకృత మార్గదర్శకాలకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకునేలా అనుమతి ఇచ్చింది. బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 74 శాతానికి పెంచేందుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో బీమా సంస్థల మూలధన అవసరాలను తీర్చడానికి ఎఫ్డీఐ దోహద పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఓ కీలక నిర్ణయం వెల్లడించింది. ఆరోగ్య బీమా ఉన్నవారు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రియాక్షన్కు గురై ఆస్పత్రిలో చేరినట్లయితే ఆ ఖర్చులు బీమా పరిధిలోకి వస్తాయని గురువారం ప్రకటించారు. దేశంలో ఆరోగ్య బీమా విస్తరణను కాంక్షిస్తూ బీమా రంగ నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏఐ) ఆరోగ్య సంజీవని(ప్రామాణిక బీమా పాలసీ) పాలసీ కింద కనీస ఆరోగ్య బీమా కవరేజీని రూ.50,000కు తగ్గించింది. అదే సమయంలో ఈ పాలసీ కింద గరిష్ట కవరేజీని రూ.10లక్షలకు పెంచింది. ప్రజలు అర్థం చేసుకునేందుకు సులభమైన ఆరోగ్య బీమా ప్లాన్ను ఆరోగ్య సంజీవని పేరుతో తీసుకురావాలంటూ ఐఆర్డీఏఐ గతంలో ఆదేశించింది. దీంతో దాదాపు అన్ని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు ఆరోగ్య సంజీవని ప్లాన్ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్లాన్ కింద రూ.1-5లక్షల మధ్య కవరేజీని ఆఫర్ చేయాలని అప్పట్లో ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.50,000-10,00000గా సవరించింది. ఈ ఏడాది మే 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ఐఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త! -
ఫ్లిప్కార్ట్ కస్టమర్లకు ఐసీఐసీఐ ‘హాస్పిక్యాష్’
బెంగళూరు: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఫ్లిప్కార్ట్ వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు ఐసీఐసీఐ లాంబార్డ్కు చెందిన గ్రూపు ఇన్సూరెన్స్ పాలసీ ‘గ్రూపు సేఫ్ గార్డ్’ను ఆఫర్ చేయనుంది. ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే చికిత్సల వ్యయాలతో సంబంధం లేకుండా.. ఈ పాలసీలో ప్రతిరోజూ ఎంచుకున్న మేరకు నగదును చెల్లించడం ఉంటుందని ఇరు కంపెనీలు ఉమ్మడిగా ఓ ప్రకటనలో తెలిపాయి. గ్రూపు సేఫ్ గార్డ్ పాలసీలో హాస్పిక్యాష్ బెనిఫిట్ కింద ప్రతిరోజూ కనీసం రూ.500 నుంచి గరిష్టంగా ఎంచుకున్న మేరకు పరిహారాన్ని పాలసీదారులు పొందడానికి వీలుంటుంది. అందుబాటు ధరలకే, కాగిత రహిత, సౌకర్యవంతమైన పాలసీ ఇదని, ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరినా లేదా ముందుగా నిర్దేశించుకున్న మేర చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరినా నగదు ప్రయోజనాన్ని పొందొచ్చని ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు తీపికబురు -
సంక్షోభాలను తట్టుకునేదెలా?
సంపాదించామా.. ఖర్చు చేశామా.. చాలా మంది ధోరణి ఇదే. ఆర్థిక సూత్రాలకు ఇది పూర్తి విరుద్ధం. ఆర్థిక భద్రతనూ ప్రశ్నార్థకంగా మారుస్తుంది ఇది. 2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. సంక్షోభ సమయాల్లో ఆర్థిక సన్నద్ధత అవసరాన్ని మరోసారి అందరికీ తెలియజేసింది. ఆ సమయంలో ఏర్పడిన ఇబ్బందులు, ఎదురైన సవాళ్లను పరిశీలిస్తే ఎన్నో ఆర్థిక అంశాలు, పాఠాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అత్యవసర నిధి ఎంతో అవసరమని ఇది తెలియజేసింది. అంతేకాదు, ప్రభుత్వపరమైన లేదా కనీసం వ్యక్తిగతమైన ఆరోగ్య బీమా రక్షణ అయినా ఉండి తీరాల్సిన అవసరాన్ని అర్థమయ్యేలా చేసింది. గతేడాది సంక్షోభం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు... రిస్క్ నిర్వహణ కరోనా నామ సంవత్సరం తెలియజేసిన మరో పాఠం రిస్క్ నిర్వహణ. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ఇది కూడా ఒక అంశం. ‘‘నా కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స చేయించేందుకు సరిపడా బీమా కవరేజీ ఉందా?.. నేను అకాల మరణం చెందితే నాపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు ఉన్నాయా?’’ అని ప్రతీ ఒక్కరు ప్రశ్నించుకోవాలి. సామాన్య, మధ్యతరగతి వాసులు అందరూ ఈ తరహా రిస్క్లను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికాయుతంగా అనుసరించాలని కరోనా తెలియజేసింది. ఎందుకంటే హెల్త్ కవరేజీ లేని వారు చికిత్స కోసం ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితిని చూశాము. ఎటువంటి లైఫ్ కవరేజీ లేకుండా కరోనాతో మరణించిన వారి కుటుంబాల కష్టాలు చూశాము. బీమా రక్షణ ఏర్పాటు చేసుకుని ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. అయితే రిస్క్ అంటే ఇదే కాదు.. పెట్టుబడుల నిర్వహణలోనూ రిస్క్ ఉంటుంది. గుడ్లన్నింటినీ తీసుకువెళ్లి ఒకే బాక్స్లో పెట్టడం ఎలా మంచిది కాదో.. పెట్టుబడులు అన్నింటినీ ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరికాదు. తమ సామర్థ్యం, అవసరాలకు తగిన రిస్క్ నిర్వహణ ప్రణాళిక అవసరం. సంక్షోభం ఏదైనా కానీ, తమ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు తాము నిర్ణయించుకున్న విధంగా అస్సెట్ అలొకేషన్ను కొనసాగించాలి. ఆర్థిక క్రమశిక్షణ అవసరం ఆర్థిక క్రమశిక్షణ ఏంటో కూడా కరోనా మహమ్మారి తెలియజేసింది. ప్రయాణాలు, బయట ఆహార పదార్థాలపై ఆంక్షలు అమలయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు రెండు నెలలకుపైగా తెరుచుకోలేదు. సినిమా థియేటర్ల తలుపులు తెరుచుకునేందుకు ఆరు నెలలకు పైనే సమయం పట్టింది. దీంతో వీటి రూపేణా తాము ఎంత ఖర్చు చేస్తున్నామన్న ఆలోచన కలిగింది. పొదుపులను పెంచుకుని, ఖర్చులను తగ్గించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలనూ నేర్పింది. దీనివల్ల అనూహ్యంగా ఎదురయ్యే షాక్లను తట్టుకునే నమ్మకాన్ని, మనో ధైర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నిజానికి ఆర్థిక క్రమశిక్షణ పాటించే వారు, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్న వారు కరోనా సంక్షోభంలో ధైర్యంగానే ఉన్నారు. ముఖ్యంగా ఆదాయాన్ని ఏ రూపంలో ఎలా ఖర్చు చేయాలన్న విషయమై మరింత అవగాహనకు కరోనా దారి చూపిందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ అనుభవ పాఠాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఫలితం ఒనగూరుతుంది. బాండ్లకూ ఉంది సత్తా.. ఈక్విటీల ర్యాలీ చూసి, బాండ్ల రాబడుల పట్ల నిర్లిప్తత తగదని 2020 ఉదంతం తెలియజేస్తోంది. కరోనా సవాళ్లతో ఈక్విటీల పతనం మొదలైంది. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్లు మంచి ర్యాలీ చేశాయి. దీనివల్ల బాండ్లలో లాభాల స్వీకరణతో స్టాక్స్ను తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసుకోవడం ద్వారా రెండు విధాల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మొత్తం ఈక్విటీల్లోనే కాకుండా.. కొంత మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గుతుంది. విల్లు ప్రాధాన్యం.. ప్రతీ కుటుంబ పెద్దకు విల్లు అవసరం. అకాల మరణానికి గురైతే.. ఆస్తుల పంపకాన్ని విల్లు ఎంతో సులభతరం చేస్తుంది. నామినేషన్ అన్నది సంబంధిత ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసే అర్హతనిస్తుంది. కానీ, విల్లు హక్కునిస్తుంది. బీమా ప్లాన్కు ఒకరిని నామినీగా ఏర్పాటు చేసి.. బీమా ప్లాన్ క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చిన సందర్భంలో దాన్ని ఎవరికి ఏ మేరకు పంపకం చేయాలన్నది విల్లులో పేర్కొంటే.. చట్ట ప్రకారం అదే నెరవేరుతుంది. రిటైర్మెంట్ ప్రాధాన్యం.. కోట్ల మంది భారతీయుల రిటైర్మెంట్పై కరోనా మహమ్మారి ప్రభావం పడింది. కరోనా కారణంగా గతంలో వేసుకున్న ప్రణాళికతో పోలిస్తే రిటైర్మెంట్ నిధి ఏర్పాటుకు తాము ఎక్కువ కాలమే కష్టపడాల్సి వస్తుందని ఇంత మంది భావిస్తున్నట్టు ఓ సర్వే రూపంలో తెలిసింది. కారణం.. కరోనా మాదిరి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు వీరు తగిన సన్నద్ధులుగా లేకపోవడం వల్ల.. రిటైర్మెంట్ సేవింగ్ను సగటున మూడేళ్లపాటు పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘విలువ’ తెలిసొచ్చింది కాలం విలువను కూడా కరోనా తెలియజేసింది. కుటుంబ సభ్యులతో ఎంత సమయం వెచ్చించాలి, అందులోని ప్రయోజనాలు, కుటుంబ అవసరాల కోసం ఏ మేరకు కష్టపడాలి, ముఖ్యమైనవి ఏవి? అనవసరాలు ఏవి ఈ విషయాలన్నీ చాలా మందికి అవగాహనలోకి వచ్చాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం.. ఆర్థిక విజయంలో మొదటి సూత్రం. మూడు బకెట్ల విధానం ప్రతీ ఇన్వెస్టర్కు కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తగిన పెట్టుబడుల ప్రణాళిక, విధానం అవసరమని కరోనాతో అర్థమయ్యింది. అందుకే ప్రతీ ఇన్వెస్టర్కు మూడు బకెట్ల విధానం అవసరం. ఇందులో మొదటి బకెట్ అన్నది ఏడాది, రెండేళ్ల కాల అవసరాల కోసం ఉద్దేశించినది. లిక్విడ్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో ఉంచుకోవాలి. మధ్యకాలిక బకెట్ను రెండు నుంచి ఐదేళ్ల కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం పక్కన పెట్టుకోవాలి. ఈ నిధిని మీడియం టర్మ్ ఫండ్స్, బాండ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక అవసరాల కోసం మూడో బకెట్ను కేటాయించుకోవాలి. ఈ నిధిని ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. ఇటువంటి విధానంతో ఏ కాలంలో ఎదురయ్యే అవసరాలను అయినా సులభంగా అధిగమించొచ్చు. సంక్షోభాలే సంపదకు దారులు.. అందరూ భయపడుతున్న వేళే పెట్టుబడులకు అనుకూల సమయం అన్నది మరోసారి 2020 రుజువు చేసింది. గతేడాది మార్చిలో ఈక్విటీ మార్కెట్లు ఇన్వెస్టర్ల ఆందోళనతో కూడిన అమ్మకాలతో కుప్పకూలాయి. నిఫ్టీ 7,500 మార్క్ వరకు పడిపోయింది. కానీ, ఏప్రిల్ నుంచి మళ్లీ రికవరీ మొదలుపెట్టి దాదాపు తొమ్మిది నెలల్లో రెట్టింపయింది. అందరూ భయపడుతున్న సమయంలో ధైర్యం చేసి కొన్న కొద్ది మంది పెట్టుబడి రెట్టింపు, రెండింతలు అయ్యింది. మార్కెట్లు పడిపోతున్న సమయంలో అప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు.. వాటిని విక్రయించకుండా, ధైర్యంగా నిలబడిన వారి మొహాల్లోనూ ఇప్పుడు లాభాల కాంతులు కనిపిస్తాయి. చారిత్రకంగా చూస్తే మార్కెట్లు 30 శాతానికి మించి పడిపోయిన ప్రతీసారీ పెట్టుబడులపై మంచి లాభాల వర్షం కురిపించాయి. రీబ్యాలన్స్ అవసరం ఇక అస్సెట్ అలోకేషన్లో భాగంగా రీబ్యాలన్స్ కూడా ముఖ్యం. గతేడాది మార్చిలో స్టాక్స్ పెట్టుబడుల విలువ పడిపోయి, డెట్ పోర్ట్ఫోలియో, బంగారం విలువ పెరిగి ఉంటుంది. ఒకవేళ ఈక్విటీలకు 50% అని నిర్ణయించుకుని ఉంటే, మార్కెట్లు పడిపోవడం కారణంగా ఈక్విటీల విలువ 30 శాతానికి తగ్గి ఉంటుంది. దాంతో ఇతర బకెట్ల నుంచి ఈక్విటీలకు మరో 20 శాతాన్ని భర్తీ చేసుకోవాలి. -
కోవిడ్ ఎఫెక్ట్... ఆరోగ్య బీమా జోరు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 పుణ్యమాని భారత్లో ఆరోగ్య బీమా పాలసీలు ఒక్కసారిగా పెరిగాయి. ఆసుపత్రి ఖర్చులకు భయపడ్డ ప్రజలు ప్రైవేటు బీమా కంపెనీల వద్దకు పరుగెత్తారు. అటు ఐఆర్డీఏఐ చొరవతో బీమా కంపెనీలు కరోనా కవచ్ పేరుతో ప్రత్యేక పాలసీలను సైతం ఆఫర్ చేశాయి. దీంతో 2020 ఏప్రిల్–సెప్టెంబర్లో నాన్–లైఫ్ బీమా కంపెనీలు వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో హెల్త్ ఇన్సూరెన్స్ వాటా దూసుకెళ్లి 29.7 శాతం కైవసం చేసుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15.8 శాతం అధికం. ఇక మోటార్ ఇన్సూరెన్స్ వాటా 13.8% తగ్గి 29%కి పరిమితమైంది. నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఆరోగ్య బీమా గత 2 దశాబ్దాల్లో తొలిసారి గా వాహన బీమా విభాగాన్ని దాటడం గమనార్హం. 2014–15లో ఆరోగ్య బీమా వాటా 23.4%, మోటార్ విభాగం వాటా 44.4% నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో వృద్ధి పరంగా ఫైర్ విభాగం 33.5 శాతంతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య బీమా వచ్చి చేరింది. ఇండివిడ్యువల్ పాలసీలే అధికం.. వాస్తవానికి ఆరోగ్య బీమా రంగంలో గ్రూప్ పాలసీలదే హవా. ఈసారి మాత్రం ఇండివిడ్యువల్స్ నుంచి దరఖాస్తులు ఎక్కువయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇండివిడ్యువల్ పాలసీల ప్రీమియం 2020 ఏప్రిల్–సెప్టెంబర్లో 34 శాతం అధికమైతే, గ్రూప్ పాలసీల వృద్ధి 16 శాతానికే పరిమితమైంది. దీంతో హెల్త్ ప్రీమియంలో ఇండివిడ్యువల్ పాలసీల శాతం 36 నుంచి 41 శాతానికి చేరింది. అయితే నాన్–లైఫ్ విభాగంలో పోటీ పడుతున్న 32 సంస్థల్లో 23 కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. హెల్త్ విభాగంలో దిగ్గజ కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ కేవలం 5 శాతం వృద్ధి సాధించింది. యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్ 57.9 శాతం, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 45.6 శాతం వృద్ధిని దక్కించుకున్నాయి. 2014–15 నుంచి 2018–19 మధ్య కంపెనీలు వసూలు చేసిన ప్రతి రూ.100 ప్రీమియంలో క్లెయిమ్స్ కింద సగటున రూ.96 చెల్లించాయి. అదే మోటార్ విభాగంలో రూ.84, ఫైర్ సెగ్మెంట్లో రూ.81 చెల్లించాయి. మహమ్మారి కారణంగా.. జూలై 2017–జూన్ 2018 మధ్య చేపట్టిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 85.9%, పట్టణాల్లో 80.9% మందికి బీమా పాలసీలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్య బీమా ప్రయోజనాల పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని మణిపాల్సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో ప్రసూన్ సిక్దర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కోవిడ్–19తో ఆరోగ్య బీమా తప్పనిసరన్న భావన ప్రజల్లో వచ్చింది. ఆరోగ్య బీమా పరిశ్రమ (పర్సనల్ యాక్సిడెంట్తో కలిపి) ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్లో 14% వృద్ధి చెంది రూ.31,132 కోట్ల ప్రీమియం వసూలైంది. మణిపాల్సిగ్నా 30% వృద్ధితో రూ.329 కోట్ల ప్రీమియం పొం దింది. రానున్న రోజుల్లో పరిశ్రమ సానుకూలంగా ఉంటుంది’ అని చెప్పారు. కాగా, బీమా కంపెనీలకు రూ.8,000 కోట్ల విలువైన కోవిడ్–19 క్లెయిమ్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో రూ.3,500 కోట్ల విలువైన క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని సమాచారం. -
కరోనా: బీమా ఉందని ధీమాతో వెళితే!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్తో బాధపడుతున్న మల్కజ్గిరికి చెందిన డి.నరసింహ్మ(67) ఈ నెల 10న సికింద్రాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు ఆరోగ్య బీమా కార్డు ఉన్నప్పటికీ నగదు చెల్లించేందుకు అంగీకరిస్తేనే అడ్మిట్ చేసుకుంటామని ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు. దీంతో కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే కేవలం ఐదు రోజులకే రూ.6.29 లక్షలు బిల్లు వేశారు. అప్పటికే రూ.2.50 లక్షల వరకు చెల్లించారు. మిగిలిన మొత్తం కూడా చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అంత మొత్తం తాము చెల్లించే పరిస్థితిలో లేమని చెప్పారు. ఆస్పత్రి ఒప్పుకోకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది ఒక్క నరసింహ కుటుంబ సభ్యులు మాత్రమే ఎదురైన అనుభవం మాత్రమే కాదు...కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన అనేకమంది ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మూడు ఆస్పత్రులపై కేంద్రానికి ఫిర్యాదు: నగరంలోని ప్రధాన ఆస్పత్రులన్నీ ఇందుకు నిరాకరిస్తుండటంతో బీమా కంపెనీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో బాధితులు నేరుగా నేషనల్ ఫార్మాష్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తున్నారు. సామాజిక కార్యకర్త విజయ్ ఇటీవల ఇదే అంశంపై నగరంలోని కేర్, యశోద, మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రులపై ఫిర్యాదు చేయడం విశేషం. కోవిడ్ చికిత్సల్లో ఉపయోగించిన మందులు, వాటి ధరలు, చికిత్స ఖర్చులను తెలియజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం విశేషం. బీమా..గీమా జాంతానై... కరోనా సోకినపుడు ఆరోగ్య బీమా కార్డు ఉందనే ధీమాతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళితే ఆయా ఆస్పత్రులు ఈ పాలసీ దారులకు చికిత్సలను నిరాకరిస్తున్నాయి. నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులన్నీ ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నగదు చెల్లించేందుకు అంగీకరిస్తేనే అడ్మిషన్ ఇస్తామంటూ మెలిక పెడుతున్నాయి. ఆపదలో చేసేది లేక కొంత మంది చెల్లిస్తున్నారు.తీరా డిశ్చార్జి సమయంలో తాము ఇప్పటి వరకు చెల్లించిన మొత్తానికి బిల్లు ఇస్తే ఇన్స్రెన్స్ క్లెయిమ్కు వెళ్తామని బాధిత కుటుంబ సభ్యులు చెబితే అందుకు కూడా అంగీకరించడం లేదు. మచ్చుకు కొన్ని ఘటనలు ⇔ పాతబస్తీకి చెందిన సలీంఖాన్కు ఇటీవల మలక్పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ చేశారు. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు. చికిత్సకు రూ.5 లక్షలు ఛార్జీ చేశారు. ఇప్పటికే రూ.2 లక్షలు చెల్లించారు. ఆయనకు బీమా ఉంది. అయినప్పటికీ మొత్తం బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ⇔ చంపాపేటకు చెందిన ఉమావతి(55)ని చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఈ నెల 15వ తేదీన మలక్పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సస్పెక్టెడ్ కోవిడ్గా నిర్ధారించి, చికిత్స ప్రారంభించారు. మూడు రోజులకు రూ.2.50 లక్షలు బిల్లు వేశారు. మరో రెండు వారాల పాటు చికిత్స చేస్తామని.. రూ.14 లక్షల బిల్లు అవుతుందన్నారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ⇔ ఖమ్మంజిల్లా నాయుడుపేటకు చెందిన వ్యక్తి(52) ఈనెల 5న సోమాజిగూడలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. కోలుకోవడంతో రెండు రోజుల క్రితం ఆయన్ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.1,213,932 బిల్లు వేశారు. అప్పటికే ఆయన రూ.7.50 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లిస్తేనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ జీఓ నెంబర్ 248 ప్రకారం బిల్లు చెల్లించేందుకు బాధితుని బంధువులు అంగీకరించారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఆ జీఓలేవీ తమ వద్ద చెల్లవని, మొత్తం బిల్లు చెల్లిస్తేనే డిశ్చార్జి చేస్తామని స్పష్టం చేయడంతో చేసేది లేక వారు అడిగిన మొత్తం చెల్లించి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. -
కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభం, మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించిన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తన పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే శుక్రవారం ప్రకటించారు. దీంతో దేశంలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. అలాగే ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వైరస్ రోగుల చికిత్స ఫీజును కూడా పరిమితం చేసింది మహాత్మా జ్యోతిబా ఫులే జన్ ఆరోగ్య యోజన పథకం కింద రాష్ట్రంలోని ప్రజలు ఉచిత, నగదు రహిత ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం వంటి పత్రాలు సమర్పించాల్సి వుంటుంది. ప్రస్తుతం, ఈ పథకం జనాభాలో 85 శాతం ప్రయోజనం పొందుతున్నారనీ, తాజా నిర్ణయంతో మిగిలిన 15శాతం మందికి కూడా లబ్ధి చేకూరనుందని రాజేష్ తోపే చెప్పారు. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, వైట్ రేషన్ కార్డుదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పూణే, ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 రోగుల చికిత్స కోసం ప్రభుత్వం జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ సెక్టార్ అసోసియేషన్ (జిప్సా) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తోపే తెలిపారు. అన్ని ఆసుపత్రులలో చికిత్స రుసుమును ప్రామాణీకరించడానికి, వివిధ ప్యాకేజీలను రూపొందించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇంతకుముందు 496 ఆస్పత్రులు ఈ పథకంలో ఉండగా, తాజాగా 1,000 కి పైగా ఆస్పత్రులు దీని పరిధిలోకి వస్తాయని ఆయన చెప్పారు. కాగా భారతదేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పటివరకు 11,506 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,000 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం 485 మంది మరణించారు. దేశంలో 37,336 మందికి సోకగా 1218 మంది మరణించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ మే 17 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. (ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులకు కరోనా) చదవండి : హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట -
వాయిదా పద్ధతిలో ఆరోగ్య బీమా చెల్లింపునకు అవకాశం
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వాయిదా పద్ధ్దతిలో ఆరోగ్య బీమా చెల్లింపులను స్వీకరించే విధంగా బీమా కంపెనీలకు వెసులుబాటు ఇచ్చింది. అయితే.. నెలా, త్రైమాసికం, ఆరు నెలల చెల్లింపులకు అవకాశం కల్పించే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టనిచ్చింది. పాలసీ ప్రీమియం, ప్రాడక్ట్ ఆధారంగా బీమా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కారణంగా లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కునే అవకాశాలు ఉన్నందున ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల్లో వెసులుబాటుకు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు సంబంధించిన పాలసీలకు వాయిదా పద్ధతి అమల్లో ఉండనుంది. -
కరోనా: పోలీసులకు యోగి నజరానా!
లక్నో: కరోనా నివారణ చర్యల్లో వైద్య సిబ్బందితో పాటు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసులకు రూ. 50 లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పించనున్నట్టు బుధవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులను త్వరలోనే వెలువరిస్తామని యూపీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనిష్ అవస్థి ట్విటర్లో పేర్కొన్నారు. (ట్రంప్ బెదిరించారు.. మీరు ఇచ్చేశారు) మీడియా ప్రతినిధులు కచ్చితంగా ముఖానికి మాస్క్లు ధరించాలని కోరారు. మాస్క్లు ధరించకపోతే వారిని పోలీసులు ఆపుతారని చెప్పారు. సోషల్ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి రూ. 50లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పిస్తామని ఇంతకుముందే పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనాపై పోరాటంలో నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందచేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన వారైనా పరిహారం వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. (పాపం గంగమ్మ.. బాధాకరం) -
ఆరోగ్య బీమా.. అసలైన ధీమా!
సాక్షి, హైదరాబాద్: బీమా.. వ్యక్తిగతమైనా, సామూహికమైనా ప్రస్తుత జీవన విధానంలో అత్యవసరమైన పొదుపు సాధనం. కుటుంబ యజమాని లేక ఇతర సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోయినా, గాయపడినా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. లేదంటే సాధారణం నుంచి అసాధారణ వ్యాధుల వరకు చికిత్స పొందేందుకు బీమా పద్ధతి విస్తృత ప్రయోజనాలను కల్పిస్తుంది. ఈ బీమా అనేది దేశంలో ఎప్పటినుంచో ఉన్నా ఆరోగ్య బీమా మాత్రం గత ఐదేళ్లలో చాలా విస్తృతమైందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను వెల్లడించిన తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం 2014–15లో దేశవ్యాప్తంగా ఆరోగ్యబీమా కింద చెల్లించిన ప్రీమియం మొత్తం రూ.20,096 కోట్లు కాగా, 2018–19లో అది రూ.44,873 కోట్లు.. అంటే దాదాపు 120 శాతం పెరిగిందన్న మాట. ఇందులో కూడా గత మూడేళ్లలోనే రూ.20 వేల కోట్ల మేర ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు పెరగటం గమనార్హం. దేశంలో 47 కోట్ల మందికి బీమా ఐఆర్డీఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోని 130 కోట్ల మందికి పైగా జనాభాలో 2018–19లో 47 కోట్ల మంది ఆరోగ్య బీమా చేయించుకున్నారు. మొత్తం 2.07 కోట్ల పాలసీల ద్వారా వీరు బీమా పరిధిలోకి వచ్చారు. ఇందులో మూడో వంతు మంది ప్రభుత్వ సంస్థల ద్వారా బీమా పరిధిలోనికి రాగా, ఒకటో వంతు మంది సామూహిక, వ్యక్తిగత బీమాలు చేయించుకున్నారు. ఈ బీమా పాలసీల ద్వారా ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో 2018–19 లో రూ.5,672 కోట్లు ప్రీమియం కట్టగా, సామూహిక బీమా కింద రూ.21,676 కోట్లు, వ్యక్తిగతంగా రూ.17,525 కోట్ల ప్రీమియం కట్టారు. మొత్తం ఆరోగ్య బీమా ప్రీమి యందారుల్లో 31 శాతం మంది మహారాష్ట్రలోనే ఉండగా, తమిళనాడు 11%, కర్ణాటక 10%, ఢిల్లీ 8%, గుజరాత్ 6 శాతం మంది ఉన్నారు. ఈ 5 రాష్ట్రాలు పోను మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 31% బీమా ప్రీమియం చెల్లించాయి. -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకు వైద్య బీమాతో పాటు ఇతరత్రా తీసుకోతగిన చర్యలు సూచించే కథనమే ఇది. 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్గా తీసుకునే చికిత్సలకు అన్ని పాలసీల్లోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఇంటి నుంచే నర్సింగ్, చికిత్సల సేవలను పొందాల్సి వస్తే అయ్యే వ్యయాలు ఎక్కువగానే ఉంటాయి. అత్యవసర నిధి ఉంటే దాన్నుంచి వీటికి చెల్లింపులు చేసుకోవచ్చు. ఒక్కసారి అత్యవసర నిధి సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్లో పెద్దలకు చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేస్తే ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం హెడ్ అమిత్ ఛబ్రా పేర్కొన్నారు. అవసరమైనంత కవరేజీ తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవడం ఎంతో అవసరం. ‘‘మీరు నివసించే ప్రాంతం, జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. ఆలస్యం చేయవద్దు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. కోపేమెంట్ ఎంత..? సీనియర్ సిటిజన్ పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కోపేమెంట్ ఆప్షన్ ఉంటోంది. కోపేమెంట్ అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30 శాతం మధ్య ఉండొచ్చు. క్లెయిమ్ మొత్తంలో ఈ మేరకు పాలసీదారులు భరించగా, మిగిలినది బీమా కంపెనీలు చెల్లిస్తాయి. కనుక కోపేమెంట్ క్లాజ్ లేని పాలసీ తీసుకోవాలి. లేదంటే పాలసీదారుని వాటా తక్కువగా ఉండేదానిని ఎంచుకోవడం మంచిది. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం కావొచ్చు. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే దాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. వీటితో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందుగానే వీటన్నింటినీ తెలుసుకోవాలి. వేచి ఉండే కాలం సీనియర్ సిటిజన్ పాలసీల్లో రెండు రకాల వేచి ఉండే కాలావధి (వెయిటింగ్ పీరియడ్) ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు వర్తించేది ఒకటి. పాలసీ తీసుకున్నాకా రెండు నుంచి నాలుగేళ్లు Výæడిచాకే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర (కొంత కాలానికి వ్యాప్తి చెందేవి) చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్నాక రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు అన్ని పాలసీల్లోనూ ఈ నిబంధనలు ఉంటున్నాయి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ♦ 18% తల్లిదండ్రులకే హెల్త్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ♦ 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతుల మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ♦ 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. -
సినీ కార్మికులకు ఆరోగ్యభీమా కల్పిస్తాం
‘‘నిత్యం పోటీ ఉండే చిత్ర పరిశ్రమలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. కాదంబరి కిరణ్తో పాటు ‘మనంసైతం’ బృందాన్ని అభినందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని విభాగాల కార్మికులకు ఆరోగ్య భీమా సౌకర్యం లేదని తెలిసింది. అలాంటి శాఖల సినీ కార్మికులకు ఎఫ్డీసీ నుంచి సగం ఖర్చు తగ్గిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తాం’’ అని ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్లో జరిగిన ‘మనం సైతం’ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ రావు పదిమంది పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘చిత్రపురి కాలనీలో ఓ వైద్యశాల నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ‘మనం సైతం’ కార్యక్రమానికి నేను ఎప్పుడు అందు బాటులోనే ఉంటాను’’ అన్నారు. ‘‘మానవత్వం ఇంకా మిగిలే ఉందని మనం సైతం కార్యక్రమానికి వచ్చిన తర్వాత అనిపిస్తోంది. చాలా మంచి కార్యక్రమం’’ అని మాజీ మంత్రి లక్షా్మరెడ్డి సతీమణి శ్వేతా లక్షా్మరెడ్డి అన్నారు. ‘‘నేను ఎదుర్కొన్న బాధలు, కోపం, కసి, ప్రతీకారం, ఆవేదనల నుంచి మొదలైనదే ఈ మనం సైతం కార్యక్రమం. ఏడుగురు సభ్యులతో మొదలైన మా బృందంలో ఇప్పుడు దాదాపు లక్షా డెబ్భై వేలమంది ఉన్నారు’’ అన్నారు కాదంబరి కిరణ్. దర్శకుడు దశరథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ మూడింటికే ఎక్కువ క్లెయిమ్లు
న్యూఢిల్లీ: ‘ఆయుష్మాన్ భారత్– ప్రధాన్మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) కింద కేన్సర్, కీళ్లు, గుండె సంబంధ వ్యాధులకే ఎక్కువ క్లెయిమ్లు అందినట్లు జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) తెలిపింది. గుండె వ్యాధుల ప్యాకేజీలో ఉన్న యాంజియో ప్లాస్టీ, స్టెంట్ల అమరిక వంటి ఖరీదైన వైద్య సౌకర్యాన్ని అత్యధికులు వినియోగించుకున్నారని వివరించింది. గత ఏడాది సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంతో ఇప్పటి వరకు 10.8 లక్షల మంది లబ్ధి పొందారని పేర్కొంది. ఈ పథకం కింద గుర్తించిన 14,756 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.1,041 కోట్ల విలువైన 8 లక్షల క్లెయిమ్లు అందగా రూ.808 కోట్ల విలువైన ఆరు లక్షల క్లెయిమ్లకు ఆమోదం తెలిపినట్లు ఎన్హెచ్ఏ వివరించింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, దగ్గర్లోని ఆస్పత్రుల వివరాలు, సహాయం పొందే విధానం వంటి వివరాలతో రూపొందించిన యాప్ను ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా మంగళవారం ప్రారంభించారు. ఇప్పటికే ఈ యాప్ను 10,460 మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఎన్హెచ్ఏ తెలిపింది. -
ఇక ఆయుష్మాన్ భారతం
రాంచి: దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. జార్ఖండ్లోని రాంచీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ను ప్రారంభించిన ప్రధాని.. పేదల సేవకు ఉద్దేశించిన పథకాల్లో ఇది అత్యంత ప్రభావవంతమైందని పేర్కొన్నారు. ఆదివారం నుంచే ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ‘పీఎంజేఏవై – ఆయుష్మాన్ భారత్ పథకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం. ఈ పథకం ద్వారా భారత్లో లబ్ధిపొందేవారి జనాభా.. అమెరికా, కెనడా, మెక్సికోల జనాభా మొత్తంతో సమానం’ అని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వాలు పేదలకు సాధికారత కల్పించకుండా.. వారిని ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, జార్ఖండ్ సీఎం రఘువీర్ దాస్, గవర్నర్ ద్రౌపది ముర్ము తదితరులు పాల్గొన్నారు. సేవ చేసేందుకు అవకాశంగా.. ‘ప్రజలు ఈ పథకాన్ని మోదీ కేర్ అని, ఇంకా వేర్వేరు పేర్లతో పిలుస్తున్నారు. కానీ మేం మాత్రం దీన్ని పేదలకు సేవ చేసేందుకు మరో అవకాశంగా భావిస్తున్నాం. సమాజంలో బడుగు, బలహీన వర్గాలకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేయడంలో సహకరించే ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. అధికారులందరికీ.. 50 కోట్ల మంది లబ్ధిదారుల ఆశీస్సులు అందుతాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రెండో, మూడో తరగతి నగరాల్లో 2,500 ఆసుపత్రులు ఏర్పాటుకానున్నాయన్నారు. ‘ఇప్పటికే 13వేల ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగమయ్యాయి. మా ప్రభుత్వం పేదలకు వైద్యసేవలు అందుబాటులో ఉంచేందుకు సమగ్రమైన విధానంతో ముందుకెళ్తోంది’ అని ఆయన తెలిపారు. ‘గరీబీ హఠావో నినాదాన్ని వింటూనే వస్తున్నాం. ఇది పేదలను మోసం చేసే కార్యక్రమం మాత్రమే. అప్పటినుంచే సంక్షేమ పథకాలు సరిగ్గా అమలుచేసి ఉంటే.. నేటికి దేశం మరింత అభివృద్ధి చెంది ఉండేది. నేను పేదరికంలోనే పెరిగాను. పేదరికాన్ని చూశాను. బీజేపీ ఒక్కటే పేదలకు న్యాయం చేస్తోంది. సాధికారత కల్పిస్తోంది’ అని పేర్కొన్నారు. వైద్యశాలలు ఖాళీగానే ఉండాలి ‘ఎవరైనా ఆసుపత్రులకు వెళ్లే అవసరం రావొద్దనే దేవుడిని ప్రార్థిస్తాను. కానీ ఒకవేళ పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సివస్తే.. ఆయుష్మాన్ కవర్ వారికి సేవచేస్తుంది. ధనికులు అనుభవిస్తున్న వసతులను.. నాదేశ పేదలు కూడా అందుకోవాలనేదే ఈ పథకం ఉద్దేశం. కుల, మతాలకు అతీతంగా ఈ పథకాన్ని అమలుచేస్తాం. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటాం’ అని మోదీ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఈ పథకం ఓ ఉదాహరణలా మిగిలిపోతుందన్నారు. రాంచీ ప్రభాత్ తారా మైదానంలో జరిగిన కార్యక్రమంలో కొందరు లబ్ధిదారులకు ఆయన హెల్త్ కార్డులు అందజేశారు. అనంతరం చాయ్బాసా, కోడర్మాల్లోని వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారు. 15 కొత్త ఎయిమ్స్లు వైద్య సేవల మెరుగు కోసం దేశ్యవాప్తంగా 15 కొత్త ఎయిమ్స్లకు ఆమోదం తెలిపామన్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ను నిర్మిస్తామని ఆయన చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో దేశవ్యాప్తంగా లక్ష మంది వైద్యులకు శిక్షణనిచ్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జార్ఖండ్లో 10 వెల్నెస్ సెంటర్లను మోదీ ప్రారంభించారు. ‘జార్ఖండ్లో వెల్నెస్ కేంద్రాలు 40కి చేరాయి. దేశవ్యాప్తంగా మొత్తం 2,300 సెంటర్లు పనిచేస్తున్నాయి. వచ్చే నాలుగైదేళ్లలో ఈ సంఖ్యను 1.5లక్షలకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ వెల్నెస్ కేంద్రాలు క్షయ, కేన్సర్, మధుమేహం వంటి వ్యాధుల విషయంలో నివారణోపాయాలను సూచిస్తాయి. పథకం ప్రత్యేకతలివి.. ► సమాజంలో పదికోట్ల వెనుకబడిన కుటుంబాల్లోని దాదాపు 50 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వస్తారు. ► ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. అయితే లబ్ధిదారుడిగా నమోదు చేయించుకునేందుకు ఎన్నికల గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించాలి. ► గ్రామాలు, పట్టణాల్లో జరిపిన తాజా సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ) ఆధారంగా డీ1, డీ2, డీ3, డీ4, డీ5, డీ7 కేటగిరీల్లో ఉన్నవారు లబ్ధిదారులవుతారు. ఎస్ఈసీసీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణాల్లో 2.33 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని పొందవచ్చు. ► ఇప్పటికే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో భాగంగా ఉన్నవారినీ ఆయుష్మాన్తో జోడిస్తారు. దేశవ్యాప్తంగా 445 జిల్లాల్లో ఈ పథకం ప్రారంభమైంది. ► ఈ పథకంలో గుండెకు బైపాస్ శస్త్రచికిత్స, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, మోకాలిచిప్ప మార్పిడులు, మధుమేహం సహా 1,300కు పైగా వ్యాధులు వర్తిస్తాయి. ► ఒక కుటుంబంలో ఇంతమందికే అన్న నిబంధనేమీ లేదు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు క్యాష్లెస్, పేపర్లెస్ వైద్యాన్ని అందజేస్తారు. ► ఈ పథకంలో లబ్ధిదారులు ఆసుపత్రి పాలైతే.. చికిత్స కోసం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం సూచించిన లేదా.. పథకం జాబితాలో ఉన్న ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి. ► ఇలాంటి ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ మిత్ర హెల్ప్ డెస్క్ల్లో సరైన గుర్తింపుకార్డులు చూపించాలి. ► పథకం అమలును పర్యవేక్షించే నేషనల్ హెల్త్ ఏజెన్సీ (ఎన్హెచ్ఏ) ఝ్ఛట్చ.pఝ్జ్చy.జౌఠి.జీn సైట్ను, 14555 హెల్ప్లైన్ నెంబర్ను ప్రారంభించింది. ► లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ ఉన్న లేఖలు ఇస్తారు. వీటిని చూపించి వైద్యం చేయించుకోవాలి. ► ఇప్పటికే 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు మాత్రం ఒప్పందంపై సంతకాలు చేయలేదు. -
మహిళలకు ఉచితంగా పారామెడికల్ విద్య
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా రంగంలోని అపోలో మ్యునిక్ హెల్త్ ఇన్సూరెన్స్... మహిళా సాధికారతకు ముందుకొచ్చింది. అపోలో మెడ్స్కిల్స్ లిమిటెడ్తో కలసి ఆర్థికంగా, సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన 10వేల మంది మహిళలకు రోష్ని కార్యక్రమం కింద పారామెడికల్ విద్యను ఉచితం గా అందించనున్నట్టు ప్రకటించింది. తగిన శిక్షణ పొందిన పారామెడికల్ నిపుణుల కొరతను ఇది కొంత వరకు తీరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘గడిచిన పదేళ్లలో మా ఇన్నోవేటివ్ ఉత్పత్తులు, సేవల ద్వారా 3 కోట్ల మందికి చేరువయ్యాం. ఏ గందరగోళం లేని ఉత్పత్తులతో ఆరోగ్య, దృఢమైన భారత్ను సాకారం చేయాలన్న లక్ష్యంలో ముందుకెళ్లాం’’ అని అపోలో మ్యునిక్ హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో ఆంటోనీ జాకబ్ చెప్పారు. -
నేతన్నలకు బీమా కొనసాగించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నేతన్నలకు ఆరోగ్య బీమా, జీవిత బీమా పథకాలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కె.తారకరామారావు కోరారు. ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో కేటీఆర్ సహా అన్ని రాష్ట్రాల జౌళి శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయన్న అంశాలపై ప్రధాన చర్చ జరిగింది. చేనేత కళాకారుల పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ సమావేశంలో వివరించారు. చేనేత రంగానికి ప్రభుత్వం రూ.1,270 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. అలాగే ఈ రంగాన్ని నిరంతరం ప్రోత్సహించేందుకు హ్యాండ్లూమ్కు ఒక కార్పొరేషన్, పవర్ లూమ్కు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నూలు, రసాయనాలపై నేతన్నలకు సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మగ్గాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ ద్వారా యూనిక్ కోడ్ జారీ చేసి ప్రభుత్వ పరంగా అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే నేతన్నలు తయారు చేసే గుడ్డను ప్రభుత్వమే కొనడం, చేనేతకారులు వారి ఉత్పత్తులను నేరుగా ఆన్లైన్లో అమ్ముకొనేందుకు అమెజాన్ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారని, చేనేత కళాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించినట్లు కేటీఆర్ మీడియాకు తెలిపారు. హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయండి చేనేత కళాకారులకు గతంలో ఉన్నట్లు ఆరోగ్య బీమా, జీవన బీమా పథకాలను పునరుద్ధరించాలని కేటీఆర్ కోరారు. చేనేత రంగాన్ని మొత్తంగా జీఎస్టీలో 5 శాతం శ్లాబ్లో తీసుకురావాలని విన్నవించారు. తెలంగాణలో కొత్తగా మరో 14 హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రతి రాష్ట్రంలో యార్న్ వేర్ హౌస్లు ఏర్పాటుకు కేంద్రం తరఫున సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రం నుంచి కేటీఆర్తోపాటు జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, అదనపు డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
మెడికల్ రికార్డూ రహస్యమేనా?
మన ఆసుపత్రుల్లో బిల్లింగ్ చేసే గుమాస్తా చేతుల్లో రోగి బతుకు కొట్టుకులాడుతూ ఉంటుంది. డాక్టర్లతో పాటు, ఇతర వైద్యసిబ్బంది పైన, బిల్లు రాసే వాడిపైన రోగి హక్కులు ఆధారపడి ఉంటాయన్నది నిజం. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసు గాని మన అనారోగ్యం పెద్ద దుకాణ దవాఖానాలకు మహాభాగ్యం అని నిన్నమొన్నటిదాకా తెలియదు. ఇదివరకు పల్స్ చూసి వైద్యుడు రోగికి చికిత్స మొదలుపెట్టేవాడు. తరువాత పర్స్ చూసారు. ఇప్పుడు నీకు బీమా ఉందా అని అడుగుతున్నారు. ఉంటేనే బతుకు. ప్రజల ఆరోగ్య రక్షణనూ, పోషకాహార స్థాయినీ జీవన ప్రమాణాలనూ పెంచి ప్రజారోగ్యం వృద్ధి చేయడం రాజ్యం ప్రాథమిక బాధ్యత అని ఆర్టికల్ 47 నిర్దేశించింది. కేంద్రం సామాన్యుల ఆరోగ్యబీమా –మోదీకేర్ పేరుతో ఒక భారీ పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రీయ స్వాస్థ్య యోజన కింద 30వేల బీమా డబ్బు రూ.5 లక్షలకు పెంచారు. ఇప్పడు 5లక్షల రూపాయలకు తక్కువ ఆరోగ్య మహాభాగ్యాన్ని ఊహించలేము. ఆర్థికంగా బలహీనమైన 50 కోట్ల కుటుంబాలకు (41.3 శాతం) ఆరోగ్య లాభం కల్పించే పథకం ఇది. అనారోగ్యంపాలై, అందువల్ల అప్పుల పాలై, ఆరోగ్యాన్నీ, జీవితాన్నీ కోల్పోతున్న మామూలు మనుషులకు ఇది వరమే. పౌరుల ఆర్థిక స్వాతంత్య్రాన్ని లెక్కించి ప్రపంచంలో ఆయా దేశాల స్థితిని నిర్ణయించే హెరిటేజ్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ 2018 ప్రకారం సార్వజనిక ఆరోగ్యపథకాలున్న హాంగ్కాంగ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, స్విట్జర్లాండ్, డెన్మార్క్ దేశాలు తొలి పది అగ్రస్థానాలలో ఉన్నాయి. 180 దేశాలలో మన దేశం మాత్రం 130వ స్థానంలో ఉంది. లక్షమందికి మనదేశంలో ఉన్న వైద్యులు కేవలం 80 మంది. ఇదీ మన దేశ అనారోగ్య దౌర్భాగ్యం. బతికే హక్కు సరే, ఆరోగ్యంగా బతికే హక్కు ఉందా? కనీసం ఆరోగ్య సమాచారమైనా తెలుసుకునే హక్కుందా? ఆరోగ్యభీమా పథకాలు సరే కానీ అనారోగ్యం పీడితులైన పేదలకు మధ్యతరగతి వారికి సహాయం సులువుగా అందుతున్నదా? ఆ మార్గాలకు ఇంకా అన్వేషించవలసి ఉంది. ఇక హక్కుల సంగతి: మనదేశంలో వైద్య మండలి ఒకటి ఉంది. 2002లో కోడ్ ఆఫ్ ఎతిక్స్ రెగ్యులేషన్ (íసీఓఇఆర్) ప్రకటించింది. ఇందులో వైద్యుల బాధ్యతలు, విధులు వివరించారేగాని రోగుల హక్కులేమీ లేవు. భారత వినియోగదారుల మార్గదర్శక మండలి రోగుల హక్కుల జాబితా ప్రకటించారు. 1. నీ జబ్బుగురించి మొత్తం వివరాలు తెలుసుకునే హక్కు నీకుంది. చికిత్సపత్రాలను నీకు వివరించే హక్కు, నీకు నిర్దేశించిన చికిత్సలో ఉన్న ప్రమాదాలు, అనుబంధ సమస్యలు వివరించే హక్కు ఉన్నాయి. 2. నీకు భౌతిక పరీక్షలు, చికిత్స జరుగుతున్న సమయంలో నీ గౌరవానికి భంగం కలగకుండా వైద్యసిబ్బంది తగిన శ్రద్ధతో వ్యవహరించాల్సిన హక్కు. 3. నీ వైద్యుడి విద్యార్హతలను తెలుసుకునే హక్కు. నీవే అంచనా వేయలేనప్పుడు ఇతరులచేత పరిశీలింపజేసే హక్కు. 4. నీ రోగాల గురించి పూర్తిగా గోప్యత పాటించే హక్కు. 5. నీకు నిర్దేశించిన చికిత్సపై నీకు అనుమానం ఉన్నపుడు, ముఖ్యంగా శస్త్రచికిత్స జరపాలన్నపుడు రెండో నిపుణుడిని సంప్రదించే హక్కు. 6. నీకు శస్త్ర చికిత్స అవసరమని ముందే తెలియజేసే హక్కు. 7. డిశ్చార్జి చేయించుకుని మరో ఆస్పత్రికి వెళ్లే హక్కు, నచ్చిన డాక్టర్ను అడిగి ఏ హాస్పిటల్కు వెళ్లాలో నిర్ణయించుకునే హక్కు. 8. నీవు కోరితే చికిత్సకు సంబంధించిన పత్రాలు పొందే హక్కు. ఈ హక్కులన్నీ అనుకోవడమేగాని ఏ చట్టంలోనూ ఇవ్వలేదు. బిల్లింగ్ చేసే గుమాస్తా చేతుల్లో రోగి బతుకు కొట్టుకులాడుతూ ఉంటుంది. వేలరూపాయలు చెల్లించే రోగులను, వారి సన్నిహితులను ఈ గుమాస్తా దుర్మార్గంగా నిలబెట్టుకుంటాడు. డాక్టర్ మర్యాదగా ఉంటాడు కానీ ఈ గుమాస్తా దురహంకార దుర్మార్గాల్ని భరిం చడం కష్టం. డాక్టర్లతో పాటు, ఇతర వైద్య సిబ్బంది పైన, బిల్లు రాసే వాడిపైన రోగి హక్కులు ఆధారపడి ఉంటాయన్నది నిజం. పార్లమెంటు 2010లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం రూపొందించింది. పెట్టబోయే హాస్పిటల్ వివరాలన్నీ ముందే ప్రకటించాలని, వారు అభ్యంతరాలు తెలిపే వీలు కల్పించాలని సెక్షన్ 26 వివరిస్తుంది. ప్రభుత్వానికి రికార్డులను, రిపోర్టులను, రిటర్న్లను ఇవ్వాలని నిర్దేశించింది. చికిత్సలో వాడే వస్తువు ధరను సేవల ఖరీదును ఇంగ్లిష్, స్థానిక భాషల్లో వివరంగా ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన రీతిలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను, ఎలక్ట్రానిక్ వైద్య రికార్డులను సరిగ్గా నిర్వహించాలి. హాస్పిటల్కు సంబంధిం చిన పూర్తి వివరాలు ప్రకటించి ప్రజల అభిప్రాయాలు అభ్యంతరాలు స్వీకరించాలి. ఈ అభ్యంతరాలను పరి శీలించిన తరువాత హాస్పిటల్కు తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఇస్తారు. వైద్యసంస్థలు 12వ సెక్షన్ కింద రోగి చికిత్సా వివరాలను సరిగ్గా నిర్వహించాలన్న నియమాలు కూడా ఉన్నాయి. వారికి సమాచారం ఇవ్వాలని స్పష్టమైన గ్యారంటీ హక్కు లేదు. రోజువారీ చికిత్స వివరాలు మరునాటి ఉదయానికి రోగి చేతిలో ధ్రువీకరించి ఇచ్చే కఠినమైన నిబంధన ఉండాలి. ఉల్లంఘిస్తే భారీ జరి మానా ఉండాలి. (7.4.2018 నాటి కేంద్ర రాష్ట్రాల సమాచార కమిషనర్ల జాతీయ సదస్సులో రచయిత సమర్పించిన పత్రంలో ఒక భాగం) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
గృహిణులూ! మీకూ కావాలివి!!
దేశంలో ఎక్కువ మంది మహిళలు వివాహానంతరం ఇంటికి సంబంధించిన బాధ్యతలతో గృహిణి పాత్రలో కనిపిస్తుంటారు. భర్త కేవలం వృత్తి, లేదా ఉద్యోగ బాధ్యతలకు పరిమితమైతే ఆమె ఆ ఇంటిని అన్నీ తానై నడిపిస్తుంటుంది. మరి ఈ విధంగా కుటుంబ బాధ్యతలకు అంకితమైన ఆమె భవిష్యత్తు భద్రతను నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికమనే కాదు తనకు సంబంధించి మరెన్నో కీలక అంశాలపై ఆమె ముందు జాగ్రత్త పడాలి. అవేంటన్నది తెలియజేసే కథనమే ఇది. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం నగదు పరిహారం మీరు గృహిణి అయితే మీ జీవిత భాగస్వామి ప్రతి నెలా ఇంటి అవసరాల కోసం కొంత మొత్తం నగదును ఇస్తూ ఉండొచ్చు. ఇందులో మీ వ్యక్తిగత అవసరాలకు కావాల్సిన మొత్తం కూడా ఉందా, లేదా అన్నది గమనించండి. ఇంటికి సంబంధించి మీరు చేసే పనులకు కావాల్సిన మొత్తాన్ని తీసుకునే హక్కు మీకు ఉంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ 2011 నాటి అధ్యయనం ప్రకారం సగటున మన దేశంలో ప్రతీ గృహిణి రోజులో ఆరు గంటలు ఇంటి కోసం ఎటువంటి నగదు ప్రయోజనం లేకుండా కష్టపడుతోంది. మరి ఈ ప్రకారం చూస్తే ప్రతీ గృహిణి ప్రతీ నెలా ఎంత మొత్తం పొందాల్సి ఉంటుందో ఆలోచించండి. తమ జీవిత భాగస్వామి ఆర్జన మేరకు ఈ మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్య బీమా తప్పనిసరి కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం నేడు ఎంతో ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే అందులో తమ పేరు కూడా ఉండేలా చూసుకోవడం గృహిణి బాధ్యత. మెట్రో నగరంలో నివసిస్తుంటే, హెల్త్ కవరేజీ కనీసం రూ.5–10 లక్షలు ఉండాలి. వయసు పెద్దది అవుతుంటే బేసిక్ వైద్య బీమాకు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా అవసరపడుతుంది. వైద్య పరమైన ద్రవ్యోల్బణం ఏటేటా పెరుగుతుండడం వల్ల ఆ మేరకు పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి, జీవన శైలి వ్యాధులు పెరిగిపోతుండడం వల్ల క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ ఆదుకుంటుంది. కవరేజీ కనీసం రూ.20–25 లక్షలు ఉండాలి. భార్యా, భర్తలు ఇద్దరికీ అవసరమే. జీవిత బీమా... గృహిణులకు వ్యక్తిగతంగా ఎటువంటి ఆదాయం లేకపోతే, పిల్లలు కూడా ఉండి ఉంటే, జీవిత భాగస్వామి పేరిట రుణాలు ఉంటే జీవిత బీమా తీసుకోవడం తప్పనిసరి. ఒకవేళ జీవిత భాగస్వామికి ఏదైనా జరిగి అతను దూరమైతే ఆ గృహిణి తనపై పడే ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు జీవిత బీమా అక్కరకు వస్తుంది. తన జీవిత భాగస్వామి వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర తక్కువ కాకుండా, రుణాలు ఏవైనా తీసుకుని ఉంటే ఆ మొత్తాన్ని కూడా కలిపి అంత కవరేజీకి టర్మ్ ప్లాన్ తీసుకునేలా చూసుకోవడం ప్రతీ గృహిణి మర్చిపోని అంశం. సంప్రదాయ బీమా పాలసీలు, మనీబ్యాక్ పాలసీలు అక్కరకు రావు. భారీ మొత్తంలో కవరేజీకి టర్మ్ ప్లాన్ తక్కువ ప్రీమియానికే లభిస్తుంది. నామినీగా మీ పేరు కుటుంబ ఆర్థిక విషయాలు, పెట్టుబడుల్లో గృహిణుల పాత్ర కూడా అవసరం. తమకెందుకులేనన్న నిరాసక్తత, బిడియంతో ఉండొద్దు. కనీసం పెట్టుబడులు, బీమా పాలసీల్లో నామినీగా మీ పేరును నమోదు చేశారా, లేదా అని చూసుకోవాలి. అలాగే, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ తెలిసి ఉండాలి. అన్ని రకాల పెట్టుబడుల్లో జాయింట్ హోల్డర్ లేదా నామినీగా తమ పేరును ప్రతిపాదించేలా చూసుకోవాలి. బ్యాంకు ఖాతా కొనసాగింపు వివాహానంతరం ముందు నుంచీ ఉన్న బ్యాంకు ఖాతాను కొనసాగించుకోవడం మంచిది. అలాగే, పెట్టుబడులు కూడా. ముందు నుంచి ఉన్న బ్యాంకు ఖాతాను జాయింట్ అకౌంట్గా మారుద్దామని జీవిత భాగస్వామి ప్రతిపాదించినప్పటికీ దాన్ని మీ ఒక్కరి పేరు మీదే కొనసాగించుకోవాలి. అవసరమైతే జీవిత భాగస్వామితో విడిగా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తమ పేరిట ఉన్న ఖాతాను మాత్రం యథావిధిగా కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రిటైర్మెంట్ అవసరాలు ప్రతీ మహిళ పురుషులతో పోలిస్తే సగటున 5–7 ఏళ్లు అధికంగా జీవిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. కనుక జీవిత భాగస్వామి దూరమైనా ఆ తర్వాత తమ విశ్రాంత జీవన అవసరాలను తీర్చే నిధి కోసం ప్రణాళిక వేసుకోవాలి. కనుక ఆ మేరకు అవసరాలను తీర్చే విధంగా నిధి ప్రణాళిక అమల్లో పెట్టాలని జీవిత భాగస్వామిని కోరాలి. ఇక ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంటే ఆ మేరకు అదనపు నిధి అవసరం అవుతుంది. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు గృహిణి అయినప్పటికీ డిజిటల్ అనుసంధానం నేడు అవసరం. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటున్న రోజులు. కనుక నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు తెలిసే ఉంటాయి. లేకపోతే వెంటనే తెలుసుకోవాలి. ఆర్థిక లావాదేవీలపైనా అవగాహన కల్పించుకోవాలి. ఆన్లైన్లో పెట్టుబడులు, చెల్లింపులు, క్లెయిమ్లు, సమాచారం తదితర విషయాలను అవసరమైతే జీవిత భాగస్వామి సహకారంతో అయినా వెంటనే తెలుసుకుని ఉంటే మంచిది. -
స్వయం ఉపాధికీ... ఖర్చులవేగా?
♦ ఇతరుల్లాగే ఖర్చులున్నపుడు ప్రణాళిక తప్పనిసరి ♦ రిజర్వు నిధులతో పాటు జీవిత. ఆరోగ్య బీమా ఉండాలి ♦ స్థిరమైన ఆదాయం ఉన్నట్టుగానే పెట్టుబడి వ్యూహాలు ♦ అందుకోసం సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఉత్తమం ♦ రిటైర్మెంట్ నిధికీ ప్లానింగ్ ఉండాలంటున్న నిపుణులు స్థిరమైన ఆదాయం లేనివారికి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటమనేది చాలా క్లిష్టమైన సవాలు. మన దేశంలో కోటిన్నర మంది స్వయం ఉపాధిని నమ్ముకున్న వారే. వీరికి స్థిరమైన ఆదాయం ఉండదు. ఒక నెల ఎక్కువగా ఉండొచ్చు. మరో నెలలో తగ్గిపోవచ్చు. కానీ, నెలసరి ఖర్చులు అలా ఉండవు కదా!!. అందుకే ఈ తరహా వ్యక్తులు అనుసరించాల్సిన ఆర్థిక ప్రణాళిక గురించి నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఆ వివరాలివీ... పన్నులకు ప్రణాళిక ఉందా? స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు జీఎస్టీ సహా రవాణా, తరుగుదల వ్యయాలపై పన్ను మినహాయింపుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయం రూ.50 లక్షల్లోపు ఉంటే సెక్షన్ 44ఏడీఏ కింద మొత్తం ఆదాయంలో 50 శాతం మేర ఊహాత్మక వ్యయాల కింద చూపించుకోవచ్చు. అందుకే స్వయం ఉపాధిలో ఉన్నవారు తమ ఆదాయం, వ్యయాల వివరాలను ఓ రికార్డు నిర్వహించడం వల్ల పన్ను రిటర్నుల సమయంలో ఏదీ మర్చిపోయేందుకు అవకాశం ఉంది. పెట్టుబడికి ఎస్టీపీ బెటర్... వేతన జీవులకు సిప్ చక్కని సాధనం. నెలనెలా క్రమం తప్పకుండా ఇంత మొత్తం పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. కానీ, అస్థిర ఆదాయంలో ఉన్న వారికి సిప్ సాధ్యం కాకపోవచ్చు. అందుకే వీరికి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) అనువైనది. అధిక ఆదాయం వచ్చినప్పుడు లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి నెలనెలా కొంత మొత్తాన్ని డెట్, బ్యాలన్స్డ్, ఈక్విటీ ఫండ్స్లోకి ఎస్టీపీ చేసుకోవచ్చు. సుదర్శన్ మార్కెటింగ్లో ఉన్నాడు. ప్రతీ నెలా రూ.10,000 మొత్తానికి సిప్ ఎంచుకున్నాడు. కానీ, ఏడాదిలోపే ఆ సిప్ కాస్తా రూ.5,000కు తగ్గించాడు. పరిస్థితి బాగులేకపోతే ఈ మొత్తాన్ని కూడా ఎత్తేసే అవకాశం లేకపోలేదు. అందుకే ఎస్టీపీ అన్నది స్వయం ఉపాధిలో ఉన్న వారికి చక్కని సాధనం. టర్మ్ పాలసీ తప్పనిసరి!! తమపై ఆధారపడిన వారికి ఇచ్చే అపూర్వ కానుక జీవిత బీమా. సంప్రదాయ పాలసీల్లో రూ.లక్ష కవరేజీకే రూ.6,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఇంతే మొత్తానికి రూ.40–50 లక్షల టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. బీమా కవరేజీ కూడా తగినంతగా ఉండాలి. తాను లేకపోతే, తన ఆర్జన అవసరాలు కుటుంబానికి ఇంకా ఎన్నేళ్లు అవసరమో అంత మేర టర్మ్ కవరేజీ ఉండాలన్నది నిపుణుల సూచించేది. కనీసం పదేళ్ల వార్షిక సంపాదన మేరకైనా టర్మ్ కవరేజీ ఉండాలి. రిటైర్మెంట్ కోసం నిధి... నిరుద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు ఏ పింఛను పథకంలోనూ కవర్ కారు. విశ్రాంత జీవనంలో పోషణావసరాలకు, వైద్య ఇతర అవసరాలకు గాను తగిన నిధిని సమకూర్చుకునేందుకు ముందునుంచే ప్రణాళిక వేసుకోవాలి. పీపీఎఫ్, ఎన్పీఎస్ తరహా పథకాలను ఇందుకు పరిశీలించొచ్చు. నిధులను వెనక్కి తీసుకునేందుకు అవకాశం లేని పథకాలతోనే మలి జీవితానికి కావాల్సిన నిధి సాధ్యమవుతుంది. ఎన్పీఎస్ ఈ తరహాలోనే పనిచేస్తుంది. పైగా ఇందులో వ్యయాలు తక్కువ. 60 ఏళ్లకు కాల వ్యవధి తీరుతుంది. ఈక్విటీలకు గరిష్టంగా 50 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. మెచ్యూరిటీ అనంతరం వచ్చే ఫండ్లో 40 శాతాన్ని కచ్చితంగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఆ మొత్తంపై నెలనెలా పెన్షన్ అందుతుంది. దీనిపై సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000కు పన్ను ప్రయోజనం కూడా ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల పన్ను ప్రయోజనానికి ఇది అదనం. -
ఆరోగ్య బీమా...ఖర్చుకాదు పెట్టుబడి
♦ ఏదో ఒక పాలసీ అనుకోవద్దు ♦ కవరేజీలో అన్ని అంశాలూ చూశాకే ఓకే చెప్పాలి ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమనేది తప్పనిసరైపోయింది. ఒకరకంగా ఇది కూడా పెట్టుబడే. ఎందుకంటే వైద్య శాస్త్రం పురోగమిస్తున్న కొద్దీ కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. పర్యావరణ కాలుష్యం, క్రమపద్ధతి లోపించిన జీవన విధానాలు తదితరాలతో హృద్రోగాలు, క్యాన్సర్, హైపర్టెన్షన్, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు.. ఇలాంటివెన్నో తలెత్తుతున్నాయి. వీటి చికిత్సా వ్యయాలు కూడా భారీగా ఉంటూ తలకు మించిన భారమవుతున్నాయి. వీటి వల్ల అప్పుల బారిన పడే సందర్భాలూ తలెత్తుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు భారత్లోనే ఉన్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉంటున్నప్పటికీ... దేశీయంగా తగినంత స్థాయిలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువే. మొత్తం జనాభాలో స్వచ్ఛందంగా ఏదో ఒక హెల్త్ కవరేజీ తీసుకున్న వారి సంఖ్య 3 శాతం కన్నా తక్కువే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీ ప్రాధాన్యం తెలిపేందుకే ఈ కథనం. సరైన ప్లాన్ ఎంచుకోవాలి.. ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనేక ఆప్షన్లతో ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తున్నాయి. అనేకం ఉన్నప్పటికీ.. మనకు అనువైనది ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాలసీ ఎంపికలో ప్రీమియం ఒక్కటే ప్రామాణికం కాదు. ప్రీమియం తక్కువగా ఉండటంతో పాటు పాలసీ సమగ్రమైనదిగా ఉండాలి. వ్యక్తిగత పాలసీ తీసుకో వాలా లేక ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంచుకోవాలా అన్నది చూసుకోవాలి. గతం నుంచీ ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ ఉంటోందా? లైఫ్టైమ్ రెన్యూవల్ సదుపాయం ఉందా? ప్రీ..పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలకు కవరేజీ లభిస్తోందా? నగదు రహిత చికిత్స ప్రయోజనాలు .. డే కేర్ ట్రీట్మెంట్ వంటి వి ఉన్నాయా? ఇవన్నీ పరిశీలించుకోవాలి. అలాగే దేనికి ఎంత వరకూ కవరేజీ (సబ్ లిమిట్స్) ఉం టోంది చూసుకోవాలి. క్యాన్సర్, హార్ట్ఎటాక్, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు సర్వసాధారణంగా మారిపోతున్న నేపథ్యంలో వీలైతే రెగ్యులర్ ప్లాన్తో పాటు టాప్ అప్ ప్లాన్ కూడా తీసుకునే అవకాశాన్నీ పరిశీలించవచ్చు. ఆరోగ్య జీవన విధానానికి రివార్డులు.. ఈ మధ్య కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం సాగించే పాలసీదారులకు నో క్లెయిమ్ బోనస్తో పా టు మరికొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. నగదుకు సమానమైన రివార్డులు అందిస్తున్నాయి. ఔషధాలు కొనుక్కునేందు కు, వైద్య పరీక్షల ఖర్చుల చెల్లింపులకు, అవుట్ పేషంట్ వ్య యాలు, డే కేర్ ట్రీట్మెంట్ లాంటి వాటికి వీటిని ఉపయోగించుకోవచ్చు. లేదా భవిష్యత్ ప్రీమియంల చెల్లింపులకు సర్దుబాటు కూడా చేసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అంశాలేమీ దాచిపెట్ట కుండా ఉండటం శ్రేయస్కరం. సగం సగం సమాచారమిచ్చినా.. లేదా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలినా .. కచ్చితంగా అవసరం తలెత్తినప్పుడు పాలసీని కంపెనీలు తిరస్కరించే ప్రమాదం ఉంది. కనుక ఆరోగ్యం.. అనారోగ్యం వివరాలేమీ దాచిపెట్టకుండా వెల్లడించడమే శ్రేయస్కరం. అలాగే.. పాలసీ పరిభాషను, నిబంధనలను కూడా క్షుణ్నంగా తెలుసుకోవాలి. పాలసీ సెటిల్మెంట్ టైమ్, సెటిల్మెంట్ నిష్పత్తి, కో–పేమెంట్ షరతులు మొదలైన నిబంధనలు అనేకం ఉంటాయి. పన్ను ఆదాకు మించి ప్రయోజనాలు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కొంత పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. దీంతో పన్ను ఆదా అవుతుంది కదా అనే ఉద్దేశంతో కూడా ఈ పాలసీలు తీసుకునే వారున్నారు. అయితే, కేవలం ఆ దృష్టితో మాత్రమే చూడకుండా.. అనూహ్యంగా తలెత్తే చికిత్స ఖర్చులతో అస్తవ్యస్తం కాకూడదన్నదే పాలసీ కొనుగోలు పరమార్ధం అయి ఉండాలి. -
బీమా లేని చికిత్సా..? బాబోయ్!!
♦ ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాల్సిందే ♦ రకరకాల పాలసీలను చూసి సందిగ్ధంలో పడొద్దు ∙ ♦ వయసు, అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి ♦ ముందే వైద్య పరీక్షలు బెటర్ ♦ సబ్ లిమిట్స్, కో–పే వంటి పరిమితులు లేకుంటేనే నయం రాజారావు (42) ఉన్నట్టుండి ఛాతీ భాగంలో నొప్పిగా ఉందంటూ కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గుండెకు ఆపరేషన్ చేసి రాజారావు ప్రాణాన్ని నిలబెట్టారు. కుటుంబంలో తిరిగి సంతోషం వెల్లివిరిసింది. కానీ, ఆస్పత్రి బిల్లు రూ.4 లక్షలు చూశాక ఆ సంతోషం ఆవిరైపోయింది. కారణం రాజారావుకు వైద్య బీమా లేదు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఆ బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఆ అప్పులు తీర్చడానికి వారికి రెండేళ్లు పట్టింది. వైద్య వ్యయాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్నది రాజారావును చూస్తే తెలియకమానదు. గుండె సంబంధిత చికిత్సలకు రూ.1.50 లక్షలకన్నా తక్కువ కావడం లేదు. కేన్సర్ చికిత్సకు రూ.3 లక్షల వరకు, ఫ్రాక్చర్, ఇతరత్రా చికిత్సలకూ రూ.లక్ష వరకు ఖర్చవుతున్న రోజులివి. అనారోగ్యం పాలైనపుడు ఇల్లు గుల్ల కాకూడదనుకుంటే వెంటనే బీమా పాలసీ తీసుకోవాల్సిందే... బీమా పాలసీ ఎంపిక అన్నది ఓ పెద్ద ప్రహసనం. ఎన్నో నిబంధనలు, పరిమితులు, ఓ పట్టాన అర్థం కాని టెర్మినాలజీ పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నాయి. సబ్లిమిట్స్, కోపేమెంట్స్, వెయిటింగ్ పిరియడ్ తదితర కీలక అంశాల గురించి వివరించడంతోపాటు, ఏ పాలసీ అనువైనదో చెప్పేదే ఈ సమగ్ర కథనం. వేచి ఉండే కాలం ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం వేచి ఉండాలన్న నిబంధనను చూసి వ్యాధులను దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. తర్వాతి కాలంలో వైద్య పరీక్షల్లో ఆ వ్యాధి అప్పుడే మొదలైంది కాదన్న విషయం బయటపడితే క్లెయిమ్ను కంపెనీలు తీరస్కరించే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, పాలసీ రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందే సమగ్ర వైద్య పరీక్షలకు సిద్ధం కావడం (కంపెనీ కోరకపోయినా) మంచిది. ఎక్కువ శాతం బీమా కంపెనీలు ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీని ఇచ్చేందుకు నాలుగేళ్ల పాటు వేచి ఉండాలన్న నిబంధన అమలు చేస్తున్నాయి. అదే సమయంలో అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రీస్టోర్, రాయల్ సుందరం లైఫ్లైన్ సుప్రీమ్, సిగ్నా టీటీకే ప్రో హెల్త్ ప్లస్ పాలసీల్లో మూడేళ్లుగానే ఉంది. మ్యాక్స్ బూపా హార్ట్బీట్ (ప్లాటినం, గోల్డ్ ప్లస్) పాలసీల్లో వెయిటింగ్ పిరియడ్ రెండేళ్లే. కాకపోతే ప్రీమియం ఎక్కువ. యుక్త వయసులో ఉంటే... 30ఏళ్లలోపు అవివాహితులు ప్రీమియం తక్కువ ఉంది కదా అని ఏదో ఒక హెల్త్ పాలసీ తీసుకున్నారనుకోండి. 30 ఏళ్లు దాటాక ఎక్కువగా క్లెయిమ్స్ అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మీరు తీసుకున్న పాలసీ ఆ అవసరాలను తీర్చకపోతే ఆర్థికంగా భారమే. ఉద్యోగం చేసే సంస్థ నుంచి గ్రూపు హెల్త్ పాలసీ ఉందన్న ధీమా పనికిరాదు. వాటిలో పలు మినహాయిం పులు ఉండొచ్చు. అందుకే వ్యక్తిగతంగా ఓ మంచి హెల్త్ పాలసీ ఉండితీరాలి. 30 ఏళ్ల వయసులో ఉన్న వారికి సాధారణ వైద్య బీమా పాలసీ సరి పోతుంది. సమ్ ఇన్సూర్డ్ రీస్టోరేషన్, నో క్లెయిమ్ బోనస్ కోసం చూడక్కర్లేదు. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుంటే నాలుగేళ్ల ‘ప్రీ ఎగ్జిస్టింగ్ డీసీజెస్’ నిబంధన ఉన్న పాలసీ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఏ పాలసీలు అనువు... రెలిగేర్ హెల్త్ కేర్, రాయల్ సుందరం లైఫ్లైన్ సుప్రీమ్, మ్యాక్స్బూపా హెల్త్ కంపానియన్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఈ పాలసీల్లో హాస్పిటల్ రూమ్ అద్దెలపై ఎటువంటి పరిమితులు, ఇతరత్రా ఎటువంటి చార్జీల విధింపు లేదు. రూ.5 లక్షల వైద్య బీమా కవరేజీకి ఏడాదికి ప్రీమియం రూ.5,500 – రూ.6,500 మధ్యలో ఉంటుంది. వివాహితులకు 30–40 ఏళ్ల మధ్య వయసులో, వివాహితులైన వారికి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు అనువుగా ఉంటాయి. ఇందులో పాలసీదారుడితో పాటు అతని జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది. 40 ఏళ్లు దాటితే... జీవిత భాగస్వాములు ఇద్దరూ 40 ఏళ్ల పైబడి ఉంటే... వారికి బీమా కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. అందుకని రీస్టోరేషన్ సదుపాయం ఉన్న పాలసీని ఎంచుకోవాలి. ఒకవేళ హైపర్టెన్షన్ సంబంధిత సమస్యలు ఉన్న వారు ముందస్తు వ్యాధులకు కవరేజీ కోసం దీర్ఘకాలం పాటు చూసే నిబంధన ఉన్న పాలసీలను ఎంచుకోవద్దు. 60 ఏళ్లు దాటిన వారికి... కొన్ని కంపెనీలు గరిష్టంగా 65 ఏళ్ల వరకే పాలసీ తీసుకునేందుకు అనుమతిస్తున్నాయి. కొన్నింటిలో ఏ వయసు వారైనా వైద్య బీమా పొందొచ్చు. బీమా పాలసీ తీసుకున్న తర్వాత ఏ వయసు వారికైనా రెన్యువల్కు తిరస్కరించడానికి లేదు. ఆరోగ్యంగా ఉండి ఉంటే సీనియర్ సిటిజన్ పాలసీలకు బదులు రెగ్యులర్ హెల్త్ పాలసీలు అనువైనవి. వీటిలో సబ్ లిమిట్స్, కో–పే నిబంధనలుండవు. రాయల్ సుందరం లైఫ్లైన్ సుప్రీమ్, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్, అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రీస్టోర్ పాలసీల్లో కోపే లేదు. రీస్టోరేషన్ సదుపాయం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో ఒక ఏడాదిలో బీమా కవరేజీ మొత్తాన్ని ఒకరు వినియోగించుకున్నా, మరో వ్యక్తి రీస్టోరేషన్ కింద తిరిగి బీమా కవరేజీని అదే ఏడాదిలో పొందవచ్చు. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబం రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకుంటే అది వారి అవసరాలకు సరిపోదు. ఏకకాలంలో ఇద్దరు అనారోగ్యం బారిన పడితే బీమా కవరేజీ సరిపోకపోవచ్చు. అదే సమయంలో అధిక బీమా కవరేజీ తీసుకుంటే ప్రీమియం భారం కావచ్చు. ఇటువంటి వారికి రీస్టోరేషన్ సదుపాయం అక్కరకు వస్తుంది. ఇందులో ఉన్న నిబంధనల్లా ఒకరు వ్యాధి బారినపడి పూర్తి బీమా కవరేజీని వినియోగించుకుంటే రీస్టోరేషన్ కింద తిరిగి అదే వ్యక్తి అదే వ్యాధి కోసం ఆ ఏడాదిలో మళ్లీ పరిహారం కోరేందుకు అవకాశం ఉండదు. సదరు వ్యక్తి మరో వ్యాధికి గురైతే పరిహారం పొందొచ్చు. అలాగే కుటుంబంలోని మిగిలిన సభ్యులు సైతం పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం వద్దనుకుంటే రూ.10లక్షల పాలసీపై ప్రీమియం రూ.1,000–2000 వరకు తగ్గుతుంది. సబ్లిమిట్స్ పాలసీలో సబ్ లిమి ట్, కో పే ఆప్షన్లను ఎంచుకోవద్దు. వీటిని ఎంచుకోవడం వల్ల ప్రీమియం కొంచెం తగ్గొచ్చేమో కానీ, క్లెయిమ్ ఎదురైతే అధిక మొత్తం జేబులోంచి పెట్టాల్సి వస్తుంది. రూమ్ చార్జీలు సహా ఆస్పత్రి వ్యయ భారాన్ని కొంత తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిబంధనను అమలు చేస్తుం టాయి. ప్రభుత్వ రంగ కంపెనీల వైద్య బీమా పాలసీల ప్రీమియం ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కానీ, ప్రభుత్వ రంగ బీమా కంపెనీల పాలసీల్లో సబ్లిమిట్స్ ఉన్నాయి. గది అద్దె, ఐసీయూ, అంబులెన్స్ ఇలా పలు రకాల చార్జీలపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు అంబులెన్స్కు రూ.10వేలు చార్జీ అయితే, బీమా కంపెనీ రూ.2,000కే పరిహా రాన్ని పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు న్యూఇండియా అష్యూరెన్స్ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ సమ్ ఇన్సూర్డ్ మొత్తంలో గది అద్దెను 1 శాతానికి పరిమితం చేసింది. రూ.5 లక్షల బీమా పాలసీలో రూమ్ అద్దె రూ.5 వేల వరకే కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ఆస్పత్రిలో గది అద్దె రూ.10వేలు ఉందనుకుంటే మిగిలిన మొత్తాన్ని పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. ఈ కోత దీనికే పరిమితం కాదండోయ్. మిగిలిన క్లెయిమ్ మొత్తానికీ దీన్నే అమలు చేస్తాయి. ఉదాహరణకు క్లెయిమ్ రూ.లక్ష ఉందనుకుంటే రూ.50వేలే చెల్లిస్తాయి. గది అద్దె రూ.10వేలలో సగమే చెల్లిస్తున్నందున అదే నిబంధన మిగిలిన క్లెయిమ్ మొత్తానికీ వర్తిస్తుంది. రెలిగేర్ హెల్త్ కేర్, అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రీస్టోర్, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్ తదితర పాలసీల్లో ఈ తరహా సబ్ లిమిట్స్ లేవు. నో క్లెయిమ్ బోనస్ వైద్య బీమాలో ఓ ఏడాదిలో ఒక్క క్లెయిమ్ కూడా లేకుంటే కంపెనీలు కొంత బోనస్ను ఇస్తుంటాయి. వైద్యం ఏటేటా ఖరీదవుతున్నందున ఇది కొంత మేర ఉపశమనం ఇచ్చేదే. దాదాపు అన్ని కంపెనీలు ఈ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఓ ఏడాదిలో క్లెయిమ్ లేకుంటే మరుసటి ఏడాది సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) 10 నుంచి 20 శాతం పెరుగుతుంది. దీనికి ఎటువంటి అదనపు ప్రీమియం చెల్లించక్కర్లేదు. బేసిక్ బీమా కవరేజీకి సమాన స్థాయి వరకూ నో క్లెయిమ్ బోనస్ రూపంలో కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే రూ.లక్ష పాలసీకి ఏటేటా 20 శాతం నో క్లెయిమ్ బోనస్ చొప్పున ఐదేళ్ల పాటు బీమా కవరేజీ రూ.లక్ష వరకు పెరిగి మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. రెండేళ్లపాటు నో క్లెయిమ్ బోనస్ రూపంలో రూ.లక్ష పాలసీకి రూ.44వేల కవరేజీ పెరిగిందనుకోండి. మూడో ఏట క్లెయిమ్ వస్తే అప్పుడు సమ్ ఇన్సూర్డ్లో 20 శాతం తగ్గిపోతుంది. ఆ తర్వాతి సంవత్సరంలోనూ క్లెయిమ్ వస్తే మరో 20 శాతం తగ్గి బేసిక్ సమ్ ఇన్సూర్డ్ దగ్గర ఆగిపోతుంది. అయితే, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్, రాయల్ సుందరం లైఫ్లైన్ పాలసీల్లో మాత్రం నో క్లెయిమ్ బోనస్ కింద సమ్ ఇన్సూర్డ్ ఏటా 20 శాతం పెరుగుతుంది. కానీ, ఆ తర్వాతి సంవత్సరాల్లో క్లెయిమ్ వచ్చినప్పటికీ ఈ పెరిగిన సమ్ ఇన్సూర్డ్లో కోత విధించడం లేదు. ఇదో ఆకర్షణీయాంశం. కో పేమెంట్... అంటే సహ చెల్లింపు. క్లెయిమ్ మొత్తంలో కంపెనీతోపాటు పాలసీదారుడూ కొంత శాతాన్ని భరించడం. ఉదాహరణకు 20 శాతం కోపే ఉంటే, ఆస్పత్రి బిల్లు రూ.2 లక్షలు వచ్చిందనుకుంటే బీమా కంపెనీ రూ.1.60 లక్షల పరిహారమే చెల్లిస్తుంది. మిగిలిన రూ.40వేలను పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. హోమియో, ఆయుర్వేద చికిత్సలకూ... సాధారణంగా ఎక్కువ పాలసీలు అల్లోపతీ వైద్య చికిత్సలకే బీమా కవరేజీని పరిమితం చేస్తున్నాయి. హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ తరహా వైద్య విధానాలకూ కవరేజీ కోరుకునే వారి కోసం మాక్స్ బూపా హెల్త్ కంపానియన్, రాయల్ సుందరం లైఫ్లైన్ పాలసీలను పరిశీలించొచ్చు. -
విదేశీ విద్యకు ‘కవరేజీ’ ఉందా!!
♦ స్టూడెంట్ ట్రావెల్ పాలసీ లేకుంటే కష్టం ♦ స్థానిక హెల్త్ పాలసీలకన్నా ఇవే చౌక ♦ విద్య ముగిసే వరకూ కవరేజీ గడువు శ్రీకర్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అంతా బాగానే ఉన్నా కొత్త వాతావరణం కావటంతో ఇమడలేకపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స చేయించుకోవటానికి ఆసుపత్రికి వెళ్లాడు. కానీ అక్కడి వ్యయం భరించటం తన వల్ల కాలేదు. చేసేదేమీ లేక తల్లిదండ్రులను సంప్రతించి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అదే శ్రీకర్ కనక ట్రావెల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే...! పరిస్థితి మరోలా ఉండేది. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేయాలన్న అభిలాష మన దేశ విద్యార్థుల్లో ఏటేటా పెరుగుతూనే ఉంది. నిజానికి పిల్లల్ని విదేశాలకు పంపటం అంత తేలిక్కాదు. విదేశాల్లో విద్య, వసతి రూపేణా ఎదురయ్యే అధిక వ్యయాలను భరించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా రుణాల కోసం దరఖాస్తు చేస్తారు. ఇంతా చేసి... విదేశీ గడ్డపై అడుగు పెట్టాక ఎదురయ్యే అవాంఛనీయ పరిస్థితులను తట్టుకునేందుకు ముందుగానే సరైన రక్షణ చర్యలు తీసుకోవడాన్ని మాత్రం మర్చిపోతారు. అందుకే ఇన్ని చేసిన వారు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు. వైద్య, దంత చికిత్సలు స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు అందులో వైద్య, ప్రమాద కవరేజీ ఉండేలా చూసుకోవాలి. దాంతో విదేశాల్లో అనుకోకుండా ఎదురయ్యే భారీ వైద్య ఖర్చుల నుంచి రక్షణ లభిస్తుంది. దంత చికిత్సల కవరేజీ కూడా చాలా అవసరం. ఎందుకంటే విదేశాల్లో దంత వైద్య ఖర్చులు మన దేశంతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. డాక్యుమెంట్లు, న్యాయపరమైన ఖర్చులకూ... ట్రావెల్ ఇన్సూరెన్స్లో... న్యాయపరంగా తలెత్తే ఖర్చులు, పాస్పోర్ట్, ఇతర విలువైన డాక్యుమెంట్లు చోరీకి గురైతే ఆదుకునే కవరేజీ కూడా ఉండేలా చూసుకోవడం అవసరం. కాంప్రహెన్సివ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు ఈ కోవలోకి వస్తాయి. బ్యాగేజీ తనిఖీలు ఆలస్యమైనా పరిహారం ఇస్తాయి. స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది ట్రావెల్ ఇన్సూరెన్స్కు భిన్నమైనది. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఓ వ్యక్తి పర్యటనకు మాత్రమే కవరేజీ ఇస్తుంది. పర్యటన పూర్తితో ఇది ముగిసిపోతుంది. కానీ, స్టూడెంట్ ట్రావెల్ బీమా మాత్రం విదేశాల్లో అకడమిక్ కాల వ్యవధి వరకు అమల్లో ఉంటుంది. పాలసీ వ్యయం విదేశాల్లో తీసుకునే పాలసీ కంటే మన దేశంలో తీసుకునే స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చు తక్కువ. అయితే, ఈ ప్రీమియం కూడా ఏ దేశానికి వెళుతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో ఉన్నత విద్య పర్యటనకు పాలసీ వ్యయం ఆఫ్రికాతో పోల్చుకుంటే ఎక్కువ. కారణం అమెరికాలో వైద్య వ్యయాలు భారీగా ఉండడమే. కొలంబియా యూనివర్సిటీ 3 లక్షల డాలర్ల హెల్త్ కవరేజీని రూ.1,30,000కు అందిస్తోంది. అదే 5 లక్షల డాలర్ల కవరేజీని స్వదేశంలో రూ.46,851కే పొందే అవకాశం ఉంది. ఇక కెనడా వెళ్లే విద్యార్థులు అక్కడ యూనివర్సిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను తీసుకునే సదుపాయం ఉంది. ఇందుకు ఏటా రూ.40,000 వ్యయం అవుతుంది. అయితే, పాలసీ ఎంపికలో ప్రీమియం కీలకం కాదు. వైద్య చికిత్సలు సులభంగా పొందటమే ముఖ్యం. కొన్ని బీమా సంస్థలు అందించే పాలసీలతో నెట్వర్క్ హాస్పిటళ్లలో నగదు రహిత చికిత్సలు పొందొచ్చు. యూనివర్సిటీ పాలసీ ఎంచుకుంటే మాత్రం అందులో ఉన్న లాభ, నష్టాల గురించి ముందుగానే విచారించి తగిన నిర్ణయం తీసుకోవాలి. పాలసీ తీసుకునే ముందు... విద్యా సంస్థలు కూడా తమ విద్యార్థులకు ఈ బీమా ఉండాల్సిన అవసరాన్ని అర్థం చేసుకుంటున్నాయి. దీంతో విదేశాల్లోని కొన్ని కళాశాలలు తమ విద్యార్థులకు స్వయంగా కొన్ని రకాల పాలసీల్ని సూచిస్తున్నాయి. అయితే, కొన్ని విదేశీ కళాశాలలు తా ము సూచించిన సంస్థల నుంచే పాలసీని తీసుకోవాలన్న నిబంధనను అమలు చేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. కాకపోతే ఇది అన్నింటికీ వర్తించదు. కొన్ని యూనివర్సిటీలే ఇలా చేస్తున్నాయి. కొన్ని సాధారణ నిబంధనలను సూచిస్తున్నాయి. వాటికి సరిపోయే పాలసీని ఏ సంస్థ నుంచైనా తీసుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి బయల్దేరే ముందే స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లేదా అక్కడికి వెళ్లిన తర్వాత సాధారణ ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు. కానీ ఈ రెండింటిలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉత్తమం. ఎందుకంటే ఇది ఎన్నో రకాల కవరేజీలను అందించే సమగ్ర పాలసీ. అలాకాక పరాయి దేశంలో సాధారణ ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అకడమిక్ గడువులోపు స్వదేశానికి వెళ్లి వచ్చే ప్రతిసారీ విడిగా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు తాము అడ్మిషన్ పొందిన కళాశాలల నిబంధనల ప్రకారం బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరా, కాదా అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. ఉన్నతమైన సేవలు ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి పరిహార చెల్లింపుల ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. చాలా వరకు మనదేశంలోని బీమా సంస్థలు విదేశాల్లోని అత్యవసర సేవల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. క్లెయిమ్ కోసం ఏ దేశంలో అయితే ఉన్నారో అక్కడి స్థానిక నంబర్ను కాల్ చేయాల్సి ఉంటుంది. -
షరతుతో.. ప్రీమియం తగ్గుతుంది!
► క్లెయిమ్ సమయంలో కొంత భరించటానికి సిద్ధపడాలి ► మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది ► భారం తగ్గినందుకు ప్రీమియంలో రిబేట్ ► దీనివల్ల లాభనష్టాలు రెండూ ఉంటాయి ► గ్రూపు హెల్త్ పాలసీ ఉన్న వారికి అనుకూలం నలుగురు సభ్యులున్న కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కావాలంటే తక్కువలో తక్కువ ఏడాదికి ప్రీమియం రూ.15వేలు అయినా చెల్లించుకోవాలి. సామాన్యులకు ఇది కొంచెం భారమే. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఓ మార్గం ఉంది. అది... క్లెయిమ్ చేసినపుడు ఆ భారాన్ని బీమా కంపెనీతో కలసి పంచుకోవడానికి సిద్ధ పడితే చాలు.! ప్రీమియం తగ్గించేందుకు కంపెనీలు సిద్ధం. ఒక్క ఆరోగ్య బీమాలోనే కాదు మోటారు బీమాలోనూ ఈ సదుపాయం ఉంది. దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసేదే ఈ కథనం. ఎవరికి ప్రయోజనమంటే... పనిచేస్తున్న సంస్థలో గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న వారికి ఈ తరహా పాలసీలు నప్పుతాయి. అంటే ఇవి అచ్చం సూపర్ టాపప్ ప్లాన్ మాదిరిగా పనిచేస్తాయ్. ఉదాహరణకు రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ అందిస్తున్న లైఫ్లైన్ క్లాసిక్ గురించి చెప్పుకోవాలి. మోటారు బీమాలో... మోటారు వాహనాల బీమా విభాగంలోనూ కంపెనీలు ఈ తరహా పాలసీలను ఎప్పటి నుంచో అందిస్తున్నాయి. ఇలా మినహాయింపులతోనూ, మినహాయింపులు లేకుండానూ ఉన్నాయి. మినహాయింపులతో ఎంచుకుంటే... రూ.2,500, రూ.5,000, రూ.7,500, రూ.15,000 వీటిలో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంచుకున్న మేరకు పాలసీదారుడు తన జేబు నుంచి భరించాలి. మిగిలిన మొత్తాన్ని కంపెనీలు చెల్లిస్తాయి. కారు ఖరీదును బట్టే... రూ.5 లక్షల ధరలోపు ఉన్న కార్ల బీమా పాలసీల్లో డిడక్టబుల్కు, అది లేకుం డా ఇచ్చే పాలసీలకు మధ్య ప్రీమియం వ్యత్యాసం తక్కువే. ఖరీదైన కార్లలో ప్రీమియం తగ్గింపు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ మోడల్కు రెండో ఏడాది వార్షిక ప్రీమియం రూ.10,000కు పైనే ఉంది. రూ.5,000 డిడక్టబుల్ ఎంచుకుంటే ప్రీమియం రూ.8,000కు దిగొస్తుంది. వ్యత్యాసం రూ.2,000. కానీ ఒక్క క్లెయిమ్ ఎదురైనా మిగిలే ప్రీమియం కంటే తన జేబు నుంచి భరించాల్సిన మొత్తమే ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. కో–పే ఆప్షన్ లేదా ఫిక్స్డ్ డిడక్టబుల్! క్లెయిమ్లో నిర్ణీత శాతాన్ని పాలసీదారుడు సొంతంగా భరించాల్సి ఉంటుంది. సాధారణంగా వృద్ధులైన వారికి అందించే ఆరోగ్య బీమా పాలసీల్లో కంపెనీలు ఈ ‘కో–పే’ను ఎప్పటి నుంచో తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆప్షన్ను ప్రీమియం తగ్గాలని ఆశించే ఇతర వయస్కులైన వారికీ ఆఫర్ చేస్తున్నాయి. ఎంత మేర...? పైన చెప్పుకున్నట్టు శ్రీకర్ వార్షిక ప్రీమియం రూ.14,000. అతడు 30 శాతం కో–పే ఆప్షన్ ఎంచుకున్నాడని అనుకుందాం. అప్పుడు అతడికి తగ్గే ప్రీమియం సైతం 25 నుంచి 30 శాతం మధ్య ఉంటుంది. దాంతో వార్షిక ప్రీమియం కనీసం రూ.4,000 తగ్గే వెసులుబాటు లభిస్తుంది. లాభమా... నష్టమా...? పనిచేస్తున్న సంస్థ నుంచి ఆరోగ్య బీమా కవరేజీ ఉన్న వారు విడిగా మరో ఆరోగ్యబీమా పాలసీ తీసుకునేట్టు అయితే, అలాగే ఆర్థికపరమైన రిస్క్ భరించగలిగే సామర్థ్యం ఉన్న వారు ఈ కో–పే ఆప్షన్ ఎంచుకోవచ్చని ఐసీఐసీఐ లాంబార్డ్ క్లెయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్దత్తా సూచించారు. అయితే ఏటా రూ.4,000 ప్రీమియం తగ్గుతుంది కదా అని 30 శాతం కో–పే ఆప్షన్ను శ్రీకర్ ఎంచుకున్నాడని అనుకుందాం. 9 ఏళ్ల తర్వాత అనుకోకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఆసుపత్రిలో చేర్పించడంతో బిల్లు రూ.2,00,000 వచ్చిం దనుకుంటే... అప్పుడు శ్రీకర్ సొంతంగా రూ.60,000 భరించాల్సి వస్తుంది. కానీ, ఈ కో–పే కారణంగా 9 ఏళ్లలో అతడు మిగుల్చుకున్నది రూ.36,000 మాత్రమే. ఒకవేళ ఆస్పత్రి బిల్లు ఇంకా ఎక్కువే వస్తే ఈ భారం మరింత పెరుగుతుంది. శ్రీకర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. వయసు 30. నెల వేతనం రూ.25వేలు. భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ.5 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలని అనుకున్నాడు. వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.14,000. కానీ, అంత మొత్తం అంటే శ్రీకర్ ఒకడుగు వెనక్కి వేశాడు. ‘ప్రీమియం తగ్గే అవకాశం లేదా...? అని ప్రశ్నించాడు. బీమా కంపెనీ ప్రతినిధి నుంచి ఉందనే సమాధానం వినిపించింది. ప్రీమియం తగ్గిస్తాం కానీ... ‘క్లెయిమ్ వచ్చినప్పుడు కొంత భారాన్ని మీరు మోయాల్సి ఉంటుంది’ అని బీమా కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశాడు. -
ఏపీ బడ్జెట్లో చేనేతలపై వివక్ష
⇒ ఎన్నికల్లో 1,000 కోట్లు ఇస్తాం అన్నారు.. 5% కూడా ఇవ్వలేదు ⇒ ఆరోగ్య బీమా అమలవడం లేదు ⇒ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు విన్నవించుకున్న చేనేత నాయకులు ⇒ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చిన విపక్ష నేత సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో చేనేత రంగంపై ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శించిందని చేనేత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించి కేటాయింపులు పెంచేలా ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలో పలువురు నాయకులు ఆదివారం ఉదయం జగన్ను ఆయన నివాసంలో కలుసుకుని తమకు జరి గిన అన్యాయాన్ని, సమస్యలను వివరిం చారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పిం చారు. చేనేత రంగం సంక్షేమానికి రూ. 1,000 కోట్ల నిధులు కేటాయిస్తామని టీడీపీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, అయితే బడ్జె ట్లో 5 శాతం నిధులూ ఇవ్వలేదని వారు వాపోయారు. కాంగ్రెస్ హయాంలో చేనేత కార్మికులకు ఉన్న ఆరోగ్య బీమా పథకం కూడా ప్రస్తుతం లేదన్నారు. చేనేత కార్మికు లకు నూలుపై ఇచ్చే 20 శాతం సబ్సిడీని కూడా ఇవ్వలేదన్నారు. చేనేత సహకార బ్యాంకులు నెలకొల్పాలని, చేనేత మగ్గాలకు 50 యూనిట్ల వరకూ ఉన్న ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని 200 యూనిట్లకు పెంచాలని, బీమా యోజన పరిధిలోకి కార్మికులందరినీ తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే చేనేత సహకార సంఘాలపై ఆస్తి పన్నును కూడా రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. వారి సమస్యలు విన్న వైఎస్ జగన్ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత వృత్తిని కొనసాగిస్తూ ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షలైనా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తానన్నారు. తమ సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చినందుకు చేనేత నాయకులు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇంకా 5% మందికే ఆరోగ్య బీమా
⇒ అవసరం తెలియకపోవడమే కారణం ⇒ సిగ్నా టీటీకే డిప్యూటీ సీఈవో జ్యోతి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రజలు పొదుపుకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆరోగ్య బీమాకు ఇవ్వడం లేదని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ అంటోంది. ప్రభుత్వం కల్పించినది మినహాయిస్తే 5 శాతం మందికి మాత్రమే భారత్లో ఆరోగ్య బీమా పాలసీ ఉందని కంపెనీ డిప్యూటీ సీఈవో జ్యోతి పుంజా బుధవారమిక్కడ మీడియాతో అన్నారు. అదికూడా తక్కువ కవరేజ్ ఉంటోందని చెప్పారు. ‘బీమా అవసరం అత్యధికులకు తెలియదు. పొదుపు చేసేందుకే ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. మేము ఆరోగ్యంగానే ఉన్నాం.. మాకేం కాదు అన్న ధీమా చాలా మందిలో ఉంది. పాలసీ కింద చెల్లించిన మొత్తం వెనక్కి రాదనేది వారి అభిప్రాయం. బీమాపట్ల అవగాహన లేకపోవడమూ ఇందుకు కారణం’ అని చెప్పారు. పాలసీ తీసుకోవడానికి ప్రీమియం వ్యయం ఏమాత్రం అడ్డంకి కాదని ఆమె స్పష్టం చేశారు. చిన్న వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుందని, రెన్యువల్ భారం పెద్దగా ఉండదని సూచించారు. పాలసీలు అమ్మడమేనా.. సిగ్నా టీటీకే విషయంలో బీమా కంపెనీ అంటే పాలసీలు అమ్మడానికే పరిమితం కాదని జ్యోతి అన్నారు. ఆన్లైన్లో కస్టమర్లకు ఆర్యోగ సలహాలు ఇవ్వడం, సదస్సుల నిర్వహణ వంటివి చేపడుతున్నట్టు చెప్పారు. హెల్తీ రివార్డ్స్ ఇచ్చి కస్టమర్లను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా హెల్త్ కోచ్లను దేశంలో తొలిసారిగా నియమించినట్టు వివరించారు. ఇక పాలసీల విషయంలో క్యాష్లెస్ 90 నిముషాల్లో, రీ–యింబర్స్మెంట్ 5 రోజుల్లో సెటిల్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఆంధ్రాబ్యాంకు 800 శాఖల ద్వారా కంపెనీ తన పాలసీలను విక్రయిస్తోంది. మరో 2,000 శాఖలకు ఈ సేవలను విస్తరించనుంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరిలో కంపెనీ 55 శాతం వృద్ధి నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 1,000 మంది ఏజెంట్లను నియమించుకోనుంది. -
హెల్త్ బాగుంటే ప్రీమియం వెనక్కి!
► 2 శాతం నుంచి 30 శాతం దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ► ఆరోగ్య విధానాల్ని పాటించటానికే ఈ ప్రోత్సాహం ► నాలుగేళ్లలో పది శాతం మార్కెట్ వాటాపై దృష్టి ► ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ బత్వాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా పాలసీలంటే ఎంతసేపూ అనారోగ్యం గురించి భయపెట్టేలానే ఉంటాయి. ఇలా కాదంటూ... ఆరోగ్య బీమాను పాజిటివ్ కోణంలో చూపించాలనుకుంటోంది కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ (ఏబీహెచ్ఐ). ఆరోగ్యకరమైన జీవన విధానాల్ని పాటించే పాలసీదారులకు కొంత ప్రీమియం తిరిగిచ్చేలా పాలసీలు రూపొందించింది. వాటి ప్రత్యేకతలు, కంపెనీ ప్రణాళికలను సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు సంస్థ సీఈవో మయాంక్ బత్వాల్. ఆ వివరాలు సంక్షిప్తంగా .. ఇప్పటికే పలు స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. కొత్తగా మీరు ఏం సాధించగలమనుకుంటున్నారు? హెల్త్ ఇన్సూరెన్స్లో ముందు హెల్త్ (ఆరోగ్యం).. తర్వాతే ఇన్సూరెన్స్ (బీమా). ఇదే కాన్సెప్ట్పై మేం దృష్టి పెడుతున్నాం. ప్రస్తుతం పాలసీలు విక్రయించే కంపెనీలు... మీకేమైనా అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైపోతాయి.. ఇబ్బందుల పాలైపోతారు కాబట్టి మా పాలసీ తీసుకోండి అంటున్నాయి. సాధారణంగా కస్టమర్లు ఇలాంటి నెగటివ్ ప్రతిపాదనలు వినటానికి ఇష్టపడరు. అందుకే మేం దానికి పూర్తి భిన్నంగా కస్టమర్లలో సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించేలా మా యాక్టివ్ హెల్త్ పాలసీని రూపొందించాం. ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటిస్తే.. దానికి ప్రతిఫలంగా ప్రీమియంలో కొంత మొత్తం వాపస్ చేస్తామనే ప్రతిపాదన తెచ్చాం. అటుపైన ఏదైనా జరిగితే బీమా కవరేజీ ఎలాగూ ఉంటుంది. ఈ ప్రతిపాదన ఇటు కంపెనీకి, అటు పాలసీదారుకు కూడా మంచిదే. పాలసీదారు ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. దీంతో కట్టిన ప్రీమియంలో కొంత తిరిగి వస్తుంది. అది పాలసీదారుకు రెండు రకాలుగా లాభం. పాలసీదారు అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువ కావడం వల్ల.. క్లెయిమ్లు కూడా తక్కువుంటాయి. మాకు లాభం. ప్రీమియంల క్యాష్బ్యాక్కి సంబంధించి పాలసీదారు జీవన విధానాన్ని ఎలా ట్రాక్ చేస్తారు? ప్రస్తుతం ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. పాలసీదారు తన ఫోన్లో సదరు యాప్ను, మా యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ రెండింటినీ అనుసంధానించాలి. అక్కణ్నుంచి నడక, వ్యాయామం మొదలైన వాటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఏరోజుకారోజు మా యాప్ ట్రాక్ చేస్తుంది. ఉదాహరణకు ఇవాళ ఎన్ని అడుగులు వేశారు (వాకింగ్), ఎంత సేపు జిమ్ చేశారు, కరిగిన కేలరీలు మొదలైన వివరాలన్నీ రికార్డవుతాయి. తదనుగుణంగా స్కోరింగ్, హెల్త్రిటర్న్స్ పేరిట రివార్డులుంటాయి. యాప్ ద్వారా లెక్కించేందుకు వీలు కాని యోగా వంటివి చేస్తున్న పక్షంలో మా వైద్య నిపుణులు ఫిట్నెస్ పరీక్ష సేవలు, తగు సూచనలు అందించేందుకు అందుబాటులో ఉంటారు. ఇలా మెరుగైన ఆరోగ్య విధానాలను పాటించేవారికి ... కట్టిన ప్రీమియంలో రెండున్నర శాతం నుంచి గరిష్టంగా 30 % దాకా రిటర్న్ ఇస్తాం. ఈ మొత్తాన్ని తదుపరి ప్రీమియం కట్టేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇతర సంస్థల నుంచి పోటీ ఎలా ఉంది? సుమారు ఇరవై కోట్ల మందికి ఆరోగ్య బీమా ఉంది. కానీ అది ప్రభుత్వ పథకాలు లేదా కార్పొరేట్ గ్రూప్ పాలసీల రూపంలోనే ఉంటోంది. వ్యక్తిగత హెల్త్ పాలసీల సంఖ్య 3 కోట్ల స్థాయిలోనే ఉంది. మరోవైపు వైద్య చికిత్స వ్యయాలు 12–14 శాతం మేర పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ పాలసీలపై అవగాహన క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం దాదాపు రూ. 27,000 కోట్లుగా ఉన్న దేశీ హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందనుంది. మేం కార్పొరేట్ పాలసీలతో పాటు యాక్టివ్ హెల్త్ పేరిట రిటైల్ పాలసీ అందిస్తున్నాం. ఇందులోనే ప్రాథమికమైన, తీవ్రమైన అనారోగ్యాలు మొదలైన వాటికి వేర్వేరు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. డయాబెటిస్, బీపీ, ఆస్తమా వంటి నాలుగు క్రానిక్ డిసీజెస్ చికిత్సకు ఉచిత అప్గ్రెడేషన్ ఫీచర్ అందిస్తున్నాం. ఇప్పటికే ఇవి ఉన్నవారు గానీ పాలసీ తీసుకున్నా కూడా తొలి రోజు నుంచే కవరేజీ అందిస్తున్నాం. రిటైల్కి సంబంధించి ప్రోడక్టు ప్రస్తుతం ఒకటే అయినప్పటికీ .. సమగ్రంగా అన్నీ అందిస్తున్నాం. పోటీ అంటారా!! ఎన్ని సంస్థలు వచ్చినా ఆరోగ్యకరమైన పోటీనే ఉంటుంది. అంతిమంగా వినియోగదారులకు మంచిదే. వ్యాపార ప్రణాళికలేంటి? ప్రస్తుతం మా నెట్వర్క్లో సుమారు 150 నగరాల్లో 1600 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. రెండువేలకు పైగా ఏజెంట్లున్నారు. ఏజేంట్లు, బ్యాంకులు, ఆన్లైన్ మొదలైన అన్ని మాధ్యమాల ద్వారా మా పాలసీల్ని విక్రయిస్తున్నాం. ప్రస్తుతం బ్యాంకెష్యూరెన్స్కి సంబంధించి కొన్ని బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో శాఖలున్నాయి. రాబోయే ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో 100 నగరాల్లో ఏజెన్సీలను విస్తరిస్తాం. రాబోయే నాలుగేళ్లలో హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లో కనీసం 8–10 శాతం వాటాను దక్కించుకోవాలని లకిష్యస్తున్నాం. ఒకే బ్యాంకు దాదాపు మూడు బీమా సంస్థల పాలసీలు విక్రయించేందుకు అనుమతులుండటం కలిసొచ్చే అంశం. దీనివల్ల పోటీ ఎలా ఉన్నా.. మరింత మందికి చేరువ అయ్యే వీలు దక్కుతుంది. పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్.. ఫిన్టెక్ స్టార్టప్ ‘ఫిన్లే’లో ఇట్జ్క్యాష్ పెట్టుబడులు ముంబై: దేశీ ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ రంగ సంస్థ ‘ఇట్జ్క్యాష్’ తాజాగా బెంగళూరుకు చెందిన ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ఫిన్టెక్ స్టార్టప్ ‘ఫిన్లే’లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లను చేసింది. దీంతో తమ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కార్యకలాపాలు మరింత పటిష్టంగా తయారవుతాయని ఇట్జ్క్యాష్ పేర్కొంది. కంపెనీలకు సంబంధించిన ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ మార్కెట్లో 25 బిలియన్ డాలర్లమేర వృద్ధి అవకాశాలున్నాయని ఇట్జ్క్యాష్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ భవికా వాసా తెలిపారు. ఫిన్లే స్టార్టప్ కంపెనీల కోసం ఒక ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ టూల్ను తయారు చేసిందన్నారు. రూ.24 లక్షల కోట్లకు ఆస్తుల విలువ: ఎల్ఐసీ ముంబై: బీమా రంగ దిగ్గజం– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రీమియం తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి తొమ్మిది నెలల ఆడిట్ గణాంకాలను ప్రకటించింది. వీటి ప్రకారం సంస్థ మొత్తం ప్రీమియం ఆదాయం 12.43 శాతం వృద్ధితో రూ.1.29 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఎల్ఐసీ మొత్తం ఆస్తుల విలువ కూడా 12.81 శాతం వృద్ధితో రూ.21.6 లక్షల కోట్ల నుంచి రూ.24.4 లక్షల కోట్లకు ఎగసింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44,000 మంది ఏజెంట్లను నియమించుకుంది. ఆర్థిక అక్షరాస్యతకు ఉజ్జీవన్ బ్యాంక్ షార్ట్ఫిల్మ్ ముంబై: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ (ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ) తాజాగా వినియోగదారుల్లో ఆర్థిక అక్షరాస్యత తీసుకురావడం కోసం ఒక ఎడ్యుకేషనల్ షార్ట్ఫిల్మ్ ‘పైసన్ కి ఏబీసీడీ’ని నిర్మించింది. ఇది పరిణామ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ఈ సినిమాను తీసింది. ప్రదీప్ సర్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ద్వారా వినియోగదారుల్లో బ్యాంకింగ్పై ఉన్న అపోహలను తొలగించి, బ్యాంక్ ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలను వారికి తెలియజేస్తామని ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ పేర్కొంది. -
మీ ఆరోగ్యం విలువెంత?
ఎంత బీమా అవసరమో తెలుసుకోండి తీసుకునేటపుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ఒకవైపు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తుంటే.. మరొకవైపు ఎప్పటి నుంచో ఉన్నవి మరింతగా విస్తరిస్తూ వాటి తడాఖా చూపిస్తున్నాయి. రోగం వచ్చి ప్రాణం బాగులేక ఆసుపత్రికి వెళితే.. అక్కడ వారి బిల్లులు చూశాక గుండె గుభేలుమంటోంది. ఇలాంటి సమయాల్లో అందరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. దురదృష్టవశాత్తూ ఇది కొందరికే ఉంటోంది. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్లుగా.. దీనికి కూడా చాలా కారణాలున్నాయి. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా తీసుకుని తీరాల్సిందే. అపుడేమైనా జరగరానిది జరిగితే అది మనకు ఆర్థికంగా కొంత బాసటగా నిలుస్తుంది. మన కుటుంబానికి అండగా ఉంటుంది. మరి ఎంత మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలి? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది. దీనికి సమాధానమే ఈ కథనం. ప్రీమియం చెల్లింపే ఆధారం... మార్కెట్లో పలు బీమా సంస్థలున్నాయి. అవి అనేక రకాల పాలసీలను విక్రయిస్తున్నాయి. అందుకే మన అవసరాలకు, ప్రాధాన్యాలకు అనువైన పాలసీలను ఎంచుకోవాలి. ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలనే అంశం.. మీరు ఎంత మేరకు ప్రీమియం చెల్లించగలరనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ముందుగా అందుబాటు ప్రీమియం చెల్లింపుల్లో అనువైన పాలసీలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. అంతేకానీ ఆరోగ్య బీమా తీసుకోవడంలో ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. స్వల్ప బీమా కవరేజ్కైనా సరే బీమాను వెంటనే తీసుకోవాలి. తర్వాత కావాల్సి వస్తే కవరేజ్ను పెంచుకోవచ్చు. చిన్న వయసులోనే బీమా ఎంత త్వరగా బీమా తీసుకుంటే అంత మంచిది. చిన్న వయసులో ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి. అప్పుడు బీమా తీసుకోవడం వల్ల ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. గత మూడేళ్లలో హాస్పిటల్ ఖర్చులకు మనం ఎంత వెచ్చించామో ఒకసారి లెక్కించాలి. వార్షిక వేతనంలో సగభాగాన్ని, మూడేళ్లలో అయిన హాస్పిటల్ ఖర్చులను కలిపితే వచ్చే మొత్తానికి సమానంగా మన బీమా కవరేజ్ ఉండాలి. ఉదాహరణకు రాము అనే వ్యక్తికి వార్షిక వేతనం రూ. 5,00,000గా ఉంది. అతని మూడేళ్ల వైద్య ఖర్చులు రూ.50,000గా ఉన్నాయి. అప్పుడు రాము బీమా కవరేజ్ రూ.3,00,000గా ఉండాలి. ఇక్కడ హాస్పిటల్ను బట్టి కవరేజ్ మొత్తం మారుతుంది. అలాగే భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా కవరేజ్ తీసుకోవాలనుకుంటే.. అప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను ఎంచుకోవడం మంచిది. కుటుంబంలోని ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత పాలసీ తీసుకోవడం కన్నా అందరికీ కలిసి ఫ్లోటర్ ప్లాన్ని తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది. ఇక కంపెనీలు కూడా ఉద్యోగులకు ఆరోగ్య బీమాను ఆఫర్ చేస్తుంటాయి. అయితే ఇవి సమగ్రమైన కవరేజ్ను అందిస్తాయో లేదో తెలియదు. వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ సరిపోదు అనుకుంటే.. టాప్–అప్ ప్లాన్స్ను తీసుకోవాలి. ఇవి అదనపు కవరేజ్ను అందిస్తాయి. కొత్త పాలసీ తీసుకోవడానికి లేదా ఉన్న పాలసీని అప్గ్రేడ్ చేసుకోవడానికయ్యే ఖర్చు కన్నా టాప్–అప్ ప్లాన్స్ చౌకే. ఈ విషయాలు మరవొద్దు ♦ రీయింబర్స్మెంట్ పాలసీ కన్నా క్యాష్లెస్ పాలసీని తీసుకోవడానికి మొగ్గుచూపండి. అప్పుడే వైద్యానికి డబ్బు ముందు చెల్లించి, దాన్ని తిరిగి తర్వాత తీసుకోవాల్సిన పని తప్పుతుంది. ♦ హాస్పిటల్లో రూమ్ అద్దె ఖర్చు, డాక్టర్ ఫీజు, మందులకయ్యే వ్యయం వంటివి పాలసీ కవరేజ్లో భాగమో కాదో తెలుసుకోండి. అన్ని పాలసీలు అన్ని వ్యయాలను భరించవనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ♦ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్య హాస్పిటల్లోనే వైద్యం చేయించుకోవాలా? లేదా ఏ హాస్పిటల్లో చేయిం చుకున్నా రీయింబర్స్మెంట్స్ చెల్లిస్తారా? అనే అంశాలను మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. -
సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా పాలసీలు
మా అమ్మా,నాన్నల కోసం ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలనుకుంటున్నాను. అందుబాటులో ఉన్న సీనియర్ సిటిజన్లకు సంబంధించిన మంచి ఆరోగ్య బీమా పాలసీలను సూచించండి. –రవి కుమార్, విశాఖపట్టణం సీనియర్ సిటిజన్లకు పలు సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. అపోలో మ్యూనిచ్ ఆప్టిమ సీనియర్, రెలిగేర్ హెల్త్కేర్, స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్.. ఈ సంస్థల çపాలసీలను పరిశీలించవచ్చు. సీనియర్ సిటిజన్ అవసరాలను తీర్చేలా ఈ పాలసీలను రూపొందించారు. హాస్పిటల్లో చేరినా, డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ (మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఇంటి దగ్గరే చికిత్స పొందే)లను కవర్ చేసేలా ఈ పాలసీలున్నాయి. ఈ పాలసీల ప్రీమియమ్లు కూడా అధికంగానే ఉంటాయి. ఈ పాలసీల ప్రీమియమ్లు, ఫీచర్లు, మినçహాయింపులు, పాలసీ తీసుకునేటçప్పటికే ఉన్న జబ్బులకు కవరేజ్ తదితర పలు అంశాలను పరిశీలించి మీకు తగిన పాలసీని ఎంచుకోండి. నగదు రహిత వైద్యం అందించడమే వైద్య బీమా పాలసీల ముఖ్య లక్షణంగా ఉండాలి. అందుకని మీరు తీసుకునే పాలసీలో నగదు రహిత వైద్యమందించే నెట్వర్క్ హాస్పిటల్స్ను చెక్ చేసుకోవాలి. మీరు ఉండే నగరంలో గానీ, మీ నగరానికి సమీపంలో ఉండే ఇతర నగరాల్లో కానీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేలా చూసుకోవాలి. నేను ప్రవాస భారతీయుడిని. చాలా ఏళ్ల క్రితమే కెనడా వెళ్లి అక్కడే స్థిరపడ్డాను. నేను భారత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? –సాగర్, ఈ మెయిల్ ద్వారా అమెరికా, కెనడాల్లోని ప్రవాస భారతీయుల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ స్వీకరించే కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి. వాటి వివరాలు.., బిర్లా సన్లైఫ్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా మ్యూచువల్ ఫండ్, ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్, సుందరమ్ మ్యూచువల్ ఫండ్.. వీటిల్లో మీ ఇన్వెస్ట్మెంట్ అవసరాలకు తగిన ఫండ్ను ఎంచుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇటీవల కాలంలో ఫార్మా, ఐటీ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు సరిగ్గా లేదు. భవిష్యత్తులో వీటి పనితీరు బాగా ఉంటుందనే అంచనాలతో ఫా ర్మా, ఐటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)విధానంలో కనీసం ఐదేళ్ల పాటు ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. నా నిర్ణయం సరైనదేనా? –జాకబ్, కరీంనగర్ ఫార్మా, ఐటీ, ఇలా ఒకే రంగంపై దృష్టి సారించే సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కొంత రిస్క్తో కూడిన వ్యవహారమే. సంబంధిత రంగంలో ఏర్పడే ప్రతికూలతల కారణంగా ఇలాంటి సెక్టోరియల్ ఫండ్స్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్చేసేవారు ఆయా రంగాల్లో వస్తున్న పరిణామాల పట్ల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ప్రతికూల పరిస్థితులు తలెత్తబోతాయని అంచనా వేసినప్పుడు తక్షణం ఆ ఫండ్ల నుంచి వైదొలగాలి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయగలిగాలి. సాధారణ ఇన్వెస్టర్లకు ఈ అవగాహన ఉండదు. అందుకని ఈ తరహా ఫండ్స్కు దూరంగా ఉండటమే మంచిది. కాదు కూడదు తప్పనిసరిగా సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీ పోర్ట్ఫోలియోలో స్వల్పమొత్తంలోనే పెట్టుబడులను ఈ సెక్టోరియల్ ఫండ్స్కు కేటాయించాలి. ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్మెంట్ అవసరాలను ఇప్పుడు పలు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ తీరుస్తున్నాయి. ఈ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ వివిధ రంగాల్లోని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిని నిర్వహించే ఫండ్ మేనేజర్లు ప్రొఫెషనల్గా వ్యవహరిస్తారు. ఏ రంగం భవిష్యత్తు ఎలా ఉంటుందో, వివిధ పరిణామాల కారణంగా ఏ రంగం ఎంత తీవ్రంగా ప్రభావితమవుతుందో తదితర అంశాలపై అవగాహన సాధారణ ఇన్వెస్టర్ కన్నా ఇలాంటి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లకు అధికంగా ఉంటుంది. అందుకని సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా మంచి ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రాబడులు పొందుతారు. అందుకని మంచి రేటింగ్ ఉన్న ఒకటి, లేదా రెండు ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. నేను చాలా సంవత్సరాల క్రితమే అమెరికాకు వెళ్లి, అక్కడే సెటిల్ అయ్యాను. నా కూతురు అమెరికాలోనే పుట్టింది. అమెకు ఇప్పుడు 9 సంవత్సరాలు. పీఐఓ (పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్–పీఐఓ) హోదా ఉన్న నా కూతురు పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవ వచ్చా? –ప్రకాశ్ జైన్, ఈ మెయిల్ మీ కూతురు భారత్లో జన్మించనందున సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కు ఆమె అర్హురాలు కాదు. ప్రవాస భారతీయులు, పీఐఓ, ఓసీఐ హోదా ఉన్నవారికి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో చేరడానికి అర్హత ఉండదు. భారత్లోనే పుట్టి, భారత్లోనే పెరిగే బాలికలకే ఈ స్కీమ్ కింద ఖాతా ప్రారంభించే అర్హత ఉంటుంది. -
జర్నలిస్టుల సంక్షేమానికి పోరాటం
– ప్రభుత్వ మెడలు వంచి ఆరోగ్య బీమాను తీసుకొచ్చాం – వెనుకబడిన ప్రాంతాలాభివృద్ధిలో పాత్రికేయులదే ప్రథమ స్థానం – కర్నూలు జిల్లాలో కోటి రూపాయలతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు – ఏపీయూడబ్ల్యూజే ప్రాంతీయ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జర్నలిస్టుల సంక్షేమానికి పోరాటాలు చేసేందుకు ఏపీయూడబ్ల్యూజే సిద్ధంగా ఉందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు, బండపల్లి అక్కులప్ప పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను ప్రభుత్వం మెడలు వంచి సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం జర్నలిస్టులకు అందుతున్న ప్రతి పథకం ఏపీయూడబ్ల్యూజే పోరాటాల ఫలితమేనని చెప్పారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏపీయూడబ్ల్యూజే కర్నూలు, అనంతపురం ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాల అభ్యున్నతి–మీడియా పాత్ర అనే అంశంపై జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుతోపాటు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, మహాలక్ష్మి కమ్యూనికేషన్ ఎండీ సత్య, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థి కేజేరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ..కర్నూలులోని జర్నలిస్టులకు హౌస్ ఫర్ ఆల్ స్కీంలో రేషన్కార్డు ఉన్నా లేకున్నా ఇళ్లు నిర్మించేందుకు కలెక్టర్, హౌసింగ్ పీడీలకు లేఖ రాశానని, వెంటనే జర్నలిస్టుల జాబితాను తనకు అందజేస్తే ఇళ్లు మంజూరుకు మార్గం సుగమం అవుతుందన్నారు. స్థలమున్న వారు ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కర్నూలులో పాత్రికేయుల కోసం రిక్రియేషన్ క్లబ్ నిర్మించాలని సీఎం కోరుతానని చెప్పారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న మాట్లడుతూ..పాత్రికేయుల కోసం కోటి రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీయూడబ్ల్యూ సభ్యత్వం ఉన్న రిపోర్టర్ చనిపోయినా, ప్రమాదంలో గాయపడినా ఆదుకోవడానికి ఈ నిధి నుంచి సాయాన్ని అందిస్తామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను అమ్ముకుని దర్జాగా తిరుగుతున్న వారిపై పోరాటం తప్పదన్నారు. మరోవైపు వెనుకబడిన కర్నూలు, అనంతపురం జిల్లాల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, పాత్రికేయులు తమ కథనాలతో ప్రజలను మేల్కోపాలని సూచించారు. సదస్సుకు ముందు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ వరకు జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు రాజు, హుస్సేన్, కిశోర్, జమ్మన్న, శ్రీనివాసులుగౌడ్, శీను, శేఖర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులు మౌలాలి, స్నేహాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్
-
ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్
ఎంఎంఐతో కలసి జాయింట్ వెంచర్గా ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సేవల రంగంలో పేరొందిన ఆదిత్యా బిర్లా గ్రూప్.. తొలిసారిగా ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ (ఏబీహెచ్ఐసీఎల్) బ్రాండ్ పేరిట మార్కెట్లోకి ప్రవేశించింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఎంఎంఐ హోల్డింగ్స్తో కలసి 51:49 జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్యబీమా రంగంలోకి ప్రవేశించినట్లు ఏబీహెచ్ఐసీఎల్ సీఈఓ మయాంక్ భత్వాల్ గురువారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం రెండు గ్రూపుల్లో 4 రకాల పాలసీలు, ఒక రిటైల్ పాలసీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. 150 నగరాల్లోని 1,500 ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య బీమా పరిశ్రమ 3.5 బిలియన్ డాలర్లుగా ఉందని, పాలసీలు తీసుకునే వారు మాత్రం 5 శాతం లోపే ఉన్నారని తెలిపారు. బీమా పాలసీ మీద సరైన అవగాహనలేమి, ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువగా ఉండటమే ఇందుకు కారణాలని అభిప్రాయపడ్డారు. దీన్నే వ్యాపార సూత్రంగా మార్చుకునేందుకు ‘హెల్త్ ఫస్ట్’ పేరిట ఆరోగ్య బీమాపై విస్తృతస్థాయిలో ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అజయ్ కక్కర్ పాల్గొన్నారు. -
‘ఆరోగ్యానికి’ జీడీపీలో 1 శాతమే
భారత వైద్య పరిశోధనా మండలి డీజీ సౌమ్యా స్వామినాథన్ - పేదరికం ఊబిలోకి ఏటా 10 లక్షల మంది - భారీగా ఔషధ ఎగుమతులు... మనకేమో అందవు - బీపీ, షుగర్లతోనే గుండెపోటు మరణాలు - రాజకీయ చిత్తశుద్ధితోనే ప్రజారోగ్యం - సార్వత్రిక ఆరోగ్య బీమా రావాలి సాక్షి, హైదరాబాద్: మన దేశంలో ప్రజారోగ్యంపై చేస్తున్న ఖర్చు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఒక శాతం మాత్రమే! అదే కెనడా తన జీడీపీలో 7 శాతం వెచ్చిస్తోంది’’ అని భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. వైద్య పరిశోధనకు దేశంలో ఎక్కువగా నిధులు కేటాయించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రజారోగ్య సాధనకు రాజకీయ చిత్తశుద్ధి అవసరమన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) 60వ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం ఇక్కడ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ‘దేశంలోని పేదలకు అందుబాటులో ఆరోగ్య భద్రత’ అన్న అంశంపై ఆమె ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. కొన్ని దశాబ్దాల క్రితం అంటురోగాలతో ఎక్కువ మంది చనిపోయేవారని, ఇప్పుడు మాత్రం జీవన శైలి (దీర్ఘకాలిక) రోగాల కారణంగా అధికంగా మరణిస్తున్నారని వివరించారు. ‘‘ప్రాథమిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే జీవిత కాలాన్ని పెంచవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా ఉప ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఆరోగ్య, స్వస్థత కేంద్రాలను కూడా నెలకొల్పాలి. డాక్టర్ల కొరత తీర్చేందుకు ఆయుష్ వైద్యులకు ప్రత్యేక బ్రిడ్జ్ కోర్సు నిర్వహించి వారి సేవలను వాడుకోవాలి’’ అని సూచించారు. మన దేశంలో గుండె సంబంధిత మరణాలే అధికంగా చోటుచేసు కుంటున్నాయి. జీవనశైలిలో మార్పుల వల్ల బీపీ, షుగర్ వంటివి పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణం. పట్టణాల్లో కాలు ష్యంతో అనేక వ్యాధులకు కారణమవు తోంది. గ్రామాల్లో ఇప్పటికీ మహిళలు కట్టెల పొయ్యి ఎక్కువగా వాడు తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. దేశంలో జననాల రేటు నమోదు కచ్చితంగా ఉంది గానీ కానీ మరణాల రేటు సరిగా నమోదవడం లేదు. అంతేగాక మరణాల కు కారణాలపై సరైన సమాచారమే ఉండట్లేదు. దాంతో ప్రజారోగ్యంపై అవగాహనకు రాలేకపోతున్నాం’’ అని ఆమె వివరించారు. ఏటా 10 లక్షల మంది పేదరికం వైపు దేశంలో ఏటా 10 లక్షల మంది పేదరికపు ఊబిలోకి కూరుకుపోతున్నారని సౌమ్య ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ప్రపంచ ఔషధ ఎగుమతుల్లో మన దేశ వాటా 30 శాతం. కానీ మన ప్రజలకు మాత్రం అవి అందుబాటు ధరల్లో లభించడం లేదు. కాబట్టి సార్వత్రిక ఆరోగ్య కవరేజీ కల్పించే దిశగా ఓ సమగ్ర ప్యాకేజీ రావాల్సిన అవసరముంది’’ అని ఆమె అన్నారు. ‘‘ఆరోగ్య సంరక్షణ కోసం నూతన వైద్య విధానం రావాలి. రాష్ట్రాల్లోని ఆరోగ్య పథకాలతో కేంద్రం అనుసంధానం కావాలి. వైద్య ఖర్చులను ప్రజలు పెట్టుకునే దుస్థితి పోవాలి. దేశంలో 400 వైద్య కళాశాలలుంటే పరిశోధనలు జరుగుతున్న వాటి సంఖ్య 25ను మించడం లేదు. వైద్య కాలేజీల్లో పరిశోధనలు విస్తృతం కావాలి. దేశంలో ప్రత్యామ్నాయ వైద్య విధానాన్ని అధికారికంగా గుర్తించేందుకు ఒక కమిటీ వేయాలి’’ అని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 80 శాతం డాక్టర్లు, 70 శాతం డిస్పెన్సరీలు పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అన్నారు. ఆరోగ్య రంగం 80 శాతం ప్రైవేటు చేతిలోనే ఉంద న్నారు. ‘‘వ్యక్తుల జీవితకాలం కేరళలో 72 ఏళ్లుంటే మధ్యప్రదేశ్లో 56 ఏళ్లే. ఒకే దేశంలో ఇంతటి వ్యత్యాసముండటం నిజంగా బాధాకరం’’ అన్నారు. -
మెడిక్లెయిమ్కు పరిమితులుంటాయ్!
► అది ఆరోగ్య బీమా లాంటిది కాదు ► పాలసీ తీసుకునే ముందే నిబంధనలు చూడాలి ► చాలా ఖర్చులు, వ్యాధులు దీని పరిధిలోకి రావు ► క్యాష్లెస్కూ కొన్ని ఇబ్బందులుంటాయి ఆరోగ్య బీమాకు సంబంధించి మెడిక్లెయిమ్ పాలసీలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. చాలా మంది దీన్ని ఒకరకంగా జీవిత బీమా పాలసీగా కూడా భావిస్తారు. అయితే, రెండింటికీ మధ్య చాలా తేడా ఉంటుందన్న సంగతి చాలామందికి తెలియదు. అలాగే, చికిత్స వ్యయాలకు సంబంధించి పరిమితుల ప్రతిబంధకాలూ ఉంటాయన్న విషయమూ తెలియదు. పైగా మెడిక్లెయిమ్ విషయంలో అపోహలు అనేకం ఉన్నాయి. వాటిని నివృత్తి చేసేదే ఈ కథనం... అన్ని వ్యాధులకు కవరేజీ ఉంటుందా? అన్నింటికీ ఉండదు. కేవలం అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు మాత్రమే కవరేజి ఉంటుంది. ఒకవేళ అనారోగ్యం కారణంగా మీరు సంపాదించలేని పరిస్థితి ఏర్పడితే దీని ద్వారా పరిహారమేమీ లభించదు. ఉదాహరణకు క్యాన్సర్ చికిత్సకు చాలా ఖర్చవుతుంది. కానీ దీని కారణంగా చాలా ఏళ్ల పాటు ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. ఇలాగే, సుఖవ్యాధులు, టీకా సంబంధ సమస్యలు మొదలైనవి మెడిక్లెయిమ్ పరిధిలోకి రావు. ఎన్ని ఆస్పత్రులు మారినా, రీయింబర్స్మెంట్ లభిస్తుందా? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆస్పత్రి మారడానికి అవకాశం ఉంటుంది. 1) మరింత మెరుగైన చికిత్స కోసం 2) పాలసీ నియమ నిబంధనలకు అనుగుణంగా కేసును బట్టి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) అనుమతిస్తేనే ఇలాంటివి సాధ్యపడతాయి. చికిత్సకు ఎంత ఖర్చయినా రీయింబర్స్ అవుతుందా? దేనికైనా అపరిమితమైన ఖర్చులు రీయింబర్స్ కావు. ఆరోగ్య సమస్యను బట్టి ఆస్పత్రి వ్యయాలకు సంబంధించి చాలా మటుకు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉపపరిమితులుటాయి. ఇవి తెలుసుకోకపోతే మన జేబు నుంచి అదనంగా పెట్టుకోవాల్సి రావొచ్చు. సమ్ అష్యూర్డ్ కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ మొత్తం చికిత్స వ్యయాలను బీమా కంపెనీ క్లియర్ చేయకపోవచ్చు. గది అద్దె మొదలుకుని ఐసీయూ వ్యయాలు, డాక్టర్ ఫీజులు, ఎనస్థటిస్ట్, అంబులెన్స్ చార్జీలు, ఔషధాలు, ఆక్సిజన్, రక్తం, ఎక్స్రే వంటి పరీక్షలు మొదలైన వివిధ రకాల వ్యయాలకు మెడిక్లెయిమ్లో చాలావరకూ పరిమితులుంటాయి. సాధారణంగా ఒక రోజు వ్యవధి సమ్ అష్యూర్డ్ మొత్తంలో గది అద్దె వ్యయాలు ఒక్క శాతానికే పరిమితం. అదే ఐసీయూ చార్జీలపై పరిమితి రెండు శాతంగా ఉంటుంది. ఇవే కాకుండా ఆస్పత్రిలో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎదురయ్యే వ్యయాలపైనా ఉప–పరిమితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెరుగైన ఆరోగ్యం కోసం ఈ రెండూ కీలకమే. క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీనా? సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీలతో.. తీవ్ర అనారోగ్యం వల్ల సంపాదించే సామర్ధ్యం తగ్గితే వాటిల్లే నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. ఆసుపత్రి బిల్లు ఎంతైనా సరే పూర్తి సమ్ అష్యూర్డ్ మొత్తం లభిస్తుంది. అయితే, మెడిక్లెయిమ్ అనేది ఆస్పత్రి చికిత్స వ్యయాల కవరేజీ కోసం మాత్రమే ఉద్దేశించినది. హాస్పిటలైజేషన్ సహా అన్ని ఖర్చులకు కవరేజీ ఉంటుందా? పూర్తిగా కాదు. దాదాపు ముప్ఫై రోజుల దాకా డాక్టర్లు, నర్సుల ఫీజులు, ఓటీ చార్జీలు, ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, డయాగ్నస్టిక్ మెటీరియల్స్, ఎక్స్రే, కీమోథెరపీ, రేడియోథెరపీ, పేస్మేకర్, అవయవ మార్పిడి దాత ఖర్చులు మొదలైనవి నేరుగా ఆస్పత్రికి చెల్లించడం గానీ లేదా రీయింబర్స్ చేయడం గానీ జరుగుతుంది. ఈ ప్రక్రియలో మీకు ఆర్థికపరమైన ఆదాయమేమీ లభించదు. నిర్దిష్ట ప్రీ–హాస్పిటలైజేషన్, పోస్ట్–హాస్పిటలైజేషన్ చార్జీలు రీయింబర్స్ అవుతాయి. క్యాష్లెస్తో అంతా సులభమేనా? ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా.. పాలసీదారు చేరిన ఆస్పత్రితో సదరు బీమా సంస్థకు ఒప్పందం ఉండాలి. అంతేకాదు ఆస్పత్రిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ డెస్క్ ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే అవకాశం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడూ ఒకే నిబంధనలు ఉంటాయా? అలాంటిదేమీ ఉండదు. వయస్సు పెరిగే కొద్దీ రిస్కూ పెరుగుతుంది కాబట్టి మెడిక్లెయిమ్ ప్రీమియంలూ పెరుగుతుంటాయి. స్థూలంగా.. మెడిక్లెయిమ్ ఒక్కటే సరిపోదు. అలాగని హడావుడిగా అనేకానేక రైడర్లు, కవర్లు జోడించుకుంటే అనవసర గందరగోళం తప్ప అదనపు ప్రయోజనమేమీ ఉండదు. కనుక మీ కంపెనీ అందించే మెడిక్లెయిమ్ పాలసీని గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయండి. ఏవి వర్తిస్తాయో, ఏవి వర్తించవో తెలుసుకోండి. తద్వారా పూర్తి ప్రయోజనాలు పొందండి. చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్, అవీవా ఇండియా -
దుబాయ్ లో ఇక ఇన్సూరెన్స్ తప్పనిసరి
-
దుబాయ్ లో ఇక ఇన్సూరెన్స్ తప్పనిసరి
దుబాయ్: దుబాయ్ లో నివసించే వారెవరైనా ఇకనుంచి తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. వచ్చే జనవరి 1 నుంచి దుబాయ్ లో నివసించే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందేనని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే భారీ జరిమానాలు విధిస్తారు. ఇన్సూరెన్స్ లేని పక్షంలో నెలకు 500 వందల దిర్హమ్స్ (ఇప్పుడున్న రేటు ప్రకారం దాదాపు 9 వేల రూపాయలు) జరిమానా వేస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే ఇక వీసా రెన్యువల్ చేయరు. ఉన్న వీసాకు పొడగింపు కూడా అనుమతివ్వరని నిబంధనలు పెట్టారు. దుబాయ్ లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఇకనుంచి వారిని స్పాన్సర్ చేస్తున్న వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించాలి. లేదా, పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం సిబ్బందికి ఇన్సూరెన్స్ చెల్లించాలి. అలా చేయని పక్షంలో సొంతగానైనా హెల్త్ ఇన్సూరెన్స్ విధిగా చేయించుకోవాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ కనుక ఒక్క ఉద్యోగికి మాత్రమే ఇన్సూరెన్స్ కల్పిస్తే ఆ ఉద్యోగి తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులను కూడా అందులో చేర్పించుకోవాలి. ఆ మేరకు వచ్చే జనవరి 1 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు దుబాయ్ హెల్త్ అథారిటీ (డీహెచ్ ఏ), జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్ అఫేర్స్ (జీడీఆర్ ఎఫ్ ఎ) ప్రకటించింది. అయితే ఈ తప్పని సరి ఇన్సూరెన్స్ ఒక్క దుబాయ్ లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దుబాయ్ లోని అన్ని కంపెనీలు తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వర్కర్ల జాబితాలను సమర్పించాలని డీహెచ్ ఏ ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ కోసం రకరకాల ప్లాన్స్ ఇవ్వగా, అందులో బేసిక్ ప్లాన్ ప్రకారం ఏడాదికి 565 నుంచి 650 దిర్హమ్స్ చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 4 వేలకు తక్కువగా వేతనం పొందే వారి కోసం ఈ బేసిక్ ప్లాన్ రూపొందించినట్టు అధికారులు వివరించారు. బేసిక్ ప్లాన్ పై 1,50,000 దిర్హమ్స్ కవరేజీ ఉంటుందని డీహెచ్ ఏ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫండింగ్ హైదర్ అల్ యూసుఫ్ తెలిపారు. భారత దేశం నుంచి వెళ్ల అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, వివిధ కంపెనీల్లో వర్కర్లుగా పనిచేస్తున్న వారి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయా కంపెనీలు ఇన్సూరెన్స్ సొమ్ము భరించని పక్షంలో అలాంటి వారందరికీ ఎంతో భారంగా మారుతుందని చిన్నా చితకా పనులు చేసుకుంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇలా భారత్ నుంచి యూఈఏకు వలస వెళ్లిన వాళ్లు మొత్తం 40లక్షల మంది ఉండగా వారిలో కేరళ నుంచి పది లక్షల మంది, తమిళనాడు నుంచి నాలుగున్నర లక్షలమంది, ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారున్నారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ నిబంధన దుబాయ్లో మాత్రమే అమలు చేయనున్నారు. -
appకీ కహానీ...గెట్ ప్రోయాక్టివ్
పాలసీదారులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గించుకునేలా ప్రోత్సహించడానికి ఆరోగ్య బీమా సంస్థ సిగ్నా టీటీకే తాజాగా ‘గెట్ ప్రోయాక్టివ్’ పేరిట ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్లపై పనిచేస్తుంది. ‘గెట్ ప్రోయాక్టివ్’ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ⇔ నిర్దిష్ట వేరబుల్ పరికరాలకు గెట్ ప్రోయాక్టివ్ ను అనుసంధానించి సిగ్నా టీటీకే పాలసీదారులు వ్యాయామ సరళిని ట్రాక్ చేసుకోవచ్చు. ⇔ అదే సమయంలో ఒక్కో యాక్టివిటీకి పాయిం ట్లూ పొందొచ్చు. వాకింగ్ చేస్తే వేల అడుగులకు 0.25 పాయింటు, 10 వేల అడుగులకు 1 పాయిం టు చొప్పున రివార్డు పాయింట్లు ఉంటాయి. ⇔ సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వాటికి మరిన్ని పాయింట్లు లభిస్తాయి. ⇔ ఒక్కో హెల్తీ రివార్డ్ పాయింటు విలువ రూ. 1కి సమానం. ⇔ వీటిని రెన్యువల్ ప్రీమియంలో డిస్కౌంటుకు లేదా ఇతరత్రా హెల్త్ మెయింటెనెన్స్ ప్రయోజనాలు క్లెయిమ్ చేయడానికి వాడొచ్చు. -
అందరి భాగస్వామ్యంతోనే సుపరిపాలన
-
అందరి భాగస్వామ్యంతోనే సుపరిపాలన
ప్రధాని మోదీ ఉద్ఘాటన * ప్రజాస్వామ్యంలో ఫిర్యాదుల పరిష్కారమే కీలకం * ప్రజాస్వామ్యం ఓటుకే పరిమితం కాకూడదు * తొలి టౌన్హాలు ప్రసంగంలో వ్యాఖ్యలు * 8% వృద్ధి కొనసాగితే మనదే అగ్రస్థానం న్యూఢిల్లీ: ఉత్తమ పాలనకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తప్పనిసరని, ప్రజాస్వామ్యంలో అదే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుపరిపాలన సాధించాలంటే ప్రతి ఒక్కరూ పాలనలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. అమెరికా తరహాలో మొదటిసారి నిర్వహించిన టౌన్హాలు(పాలనలో పౌరుల సమస్యలపై చర్చ) కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం మోదీ ప్రసంగించారు. MyGov.in వెబ్సైట్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఈ సభలో పీఎంఓ వెబ్సైట్ను అనుసంధానించే మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మోదీ సమాధానమిచ్చారు. ప్రసంగం ముఖ్యాంశాలు మోదీ మాటల్లోనే సుపరిపాలనతో సాధ్యం.. ‘ప్రజాస్వామ్యంలో అంత్యంత ప్రభావిత అంశం ఏంటంటే ప్రజా ఫిర్యాదుల్ని పరిష్కరించే వ్యవస్థే.. ప్రతి పౌరుడి సమస్యకు స్పందించడంతో పాటు పరిష్కరించాలి. ప్రభుత్వ వ్యవస్థ నెమ్మదిగా సాగే చోట్ల, పౌరుల పనులు సులువుగా పరిష్కారమయ్యేందుకు సుపరిపాలనను అభివృద్ధి చేయాలి. పాలనలో అందరూ భాగస్వాములే... ప్రతి దశలో ఏ సమస్య వచ్చినా ప్రధానినే బాధ్యులుగా చూస్తారు. అది సరైన విధానం కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బాధ్యతాయుత పాలన సాగితేనే సుపరిపాలన సాధ్యం. అభివృద్ధి, సుపరిపాలన సమతుల్య సంబంధాలు కలిగి ఉండాలి. చిట్టచివరి లబ్ధిదారుడికి ప్రభుత్వ లబ్ధి చేకూరాలి’. ప్రభుత్వాల మార్పుతో అభివృద్ధి అసాధ్యం... ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వంతో ప్రజలు ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఆ ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో వేరే రాజకీయ పార్టీకి విజయం కట్టబెడుతున్నారు. ఓటు వేసి ఐదేళ్లు వేచిచూడడం అలవాటుగా మారడంతో పాటు ప్రభుత్వమే అన్ని పనులు చేస్తుందన్న అలక్ష్యం నెలకొంది. కేవలం ఓటు వేసేందుకు ప్రజాస్వామ్యం పరిమితమైతే దాని స్ఫూర్తి వృద్ధి చెందదు. ఎన్నికల్లో గెలిచాక తర్వాతి ఎన్నికల్లో ఎలా గెలవాలా? అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. దీంతో అభివృద్ధి కుప్పకూలుతోంది.’ నిరుపేదలకు ఆరోగ్య బీమా... ‘వ్యాధుల్ని అదుపు చేసే, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలపై దృష్టిపెట్టాలి. టీకాల కోసం ప్రకటనల రూపంలో ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నాం. అయినా చాలా మంది పిల్లలకు టీకాలు వేయించడం లేదు. ఆరోగ్య విభాగం ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరిని కలుస్తుంది. బడ్జెట్లో ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడంతో నిరుపేదలు కూడా మంచి వైద్యం పొందుతారు.’ ఆధునిక సేద్యం అవసరం ‘మన ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే సామర్థ్యం వ్యవసాయ రంగానికుంది. సంప్రదాయ విధానాల నుంచి ఆధునిక వ్యవసాయం వైపు రైతులు మారాల్సి ఉంది. వ్యవసాయంతో పాటు ఆదాయం పెంచుకునేందుకు పశుపోషణ, తేనెటీగల పెంపకాన్ని రైతులు చేపట్టాలి.’ చేనేతకు చేయూత ‘ఆగస్టు 7న చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలు తమ దుస్తుల అవసరాల్లో 5 శాతం ఖాదీ, చేనేత వస్త్రాలు వినియోగించండి. వస్త్ర పరిశ్రమకు సహాకారం అందిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది.’ ఆర్థిక వృద్ధితో అగ్రస్థానం ‘ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలి. మనం అగ్రస్థానంలో నిలిచేందుకు ఇది తప్పనిసరి. 30 ఏళ్ల పాటు మనం 8 శాతం వృద్ధి రేటు కొనసాగిస్తే మనం ప్రథమస్థానంలో నిలుస్తాం. ప్రపంచం ప్రస్తుతం ఆర్థిక మాద్యంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు శక్తి తగ్గుతున్నా 7.6 శాతం వృద్ధి రేటుతో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. గత ఆరు నెలల్లో 40 లక్షల మంది పర్యాటకులు దేశాన్ని సందర్శించారు. పారిశుద్ధ్యం ఈ మార్పుకు దోహదపడింది.’ విదేశాంగ విధానంలో రాజీలేదు ‘ద్వైపాక్షిక అంశాల్లో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలే ముఖ్యం. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడ్డాయి. చాలా అంశాల్లో కలిసికట్టుగా సాగడం ఒక నిబంధనగా మారింది. విదేశాలతో భారత్ ఒప్పందాలు బలోపేతమయ్యేలా ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత దేశం బలమంతా భిన్నత్వంలోనే ఉంది.’ అలసటకు చోటులేదు.. ‘విదేశాల్లోని భారతీయులు త రచూ జెట్లాగ్(విమాన ప్రయాణ అలసట) గురించి మాట్లాడతారు. అంతదూరం ప్రయాణించి మళ్లీ వెంటనే ఆఫీసుకు ఎలా వెళతారని ప్రశ్నిస్తుంటారు. నేనెప్పుడూ అలసిపోను. 125 కోట్ల మంది ప్రజలు, వారి కలలు, వారి పరిస్థితులు హృదయపూర్వకంగా ముందుకు సాగేలా చేస్తున్నాయి. ఎక్కువ శక్తి ఉండడంతో అంతగా కష్టపడుతున్నారని నాతో చెపుతుంటారు. అది సరికాదు. అంతపని చేయాల్సి ఉందని తెలిసినప్పుడు శక్తి దానంతట అదే వస్తుంది. ’ రూర్బన్ పథకంపై... ‘నగరాల్లోని మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ సేవలు గ్రామాల్లోను కల్పించేందుకు దేశవ్యాప్తంగా 300 గ్రామాల్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికతో ఉంది. రూర్బన్ మిషన్ పేరిట ‘స్మార్ట్ సిటీ ప్లస్’ కింద ఈ గ్రామాల్ని గుర్తించాం. నగర తరహా సదుపాయాలు కల్పించేటప్పుడు గ్రామీణ వాతావరణం చెడిపోకుండా చూస్తాం.’ గోరక్షణ పేరిట అక్రమాలు ‘రాత్రిళ్లు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పగలు గోరక్షకులుగా ప్రచారం చేసుకుంటున్న వారిపై ఆగ్రహంగా ఉన్నాను. తమ అక్రమ వ్యాపారాల్ని కప్పిపుచ్చుకునేందుకు చాలా మంది గోరక్షకులుగా చెప్పుకుంటున్నారు. వారిలో 80 శాతం సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్నట్లు సమాచారం. వారి పూర్తి వివరాల్ని సిద్ధం చేయమని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నా. ప్రజల్ని భయపెట్టడం, దాడులు చేసేందుకు స్వచ్ఛంద విభాగాలు, సంస్థలు ఏర్పాటు చేయొద్దు. గోవధ కన్నా ప్లాస్టిక్ బ్యాగులు తినడం వల్లే ఎక్కువ గోవులు మరణిస్తున్నాయి. జంతు పరిరక్షణకు కృషిచేయాలనుకుంటే గోవులు ప్లాస్టిక్ను తినకుండా చూడాలి. అదే పెద్ద సేవ. జంతువుల కోసం గతంలో నేను నిర్వహించిన ఒక వైద్య శిబిరంలో ఒక ఆవు నుంచి రెండు బకెట్ల ప్లాస్టిక్ ను తొలగించాం’ -
ముందుగా బీమా.. ఆరోగ్యానికి ధీమా
కంపెనీ పాలసీతో పాటు సొంతదీ ఉండాలి వైద్య ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రాథమిక వైద్యానికి సంబంధించిన కేటాయింపులు ఎప్పటికప్పుడు భారీగా పెంచుతోందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా కోసం ఎంత ముందు నుంచీ ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. 23 సంవత్సరాల నేహా శర్మను ఉదాహరణగా తీసుకుంటే... ఈ మధ్యే తను ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో ట్రైనీ ఎగ్జిక్యూటివ్గా చేరింది. జీతం నెలకు రూ.25 వేలు. కంపెనీ తరఫున ఒక పీఎఫ్ ఖాతా, పేరెంట్స్ బహుమతిగా ఇచ్చిన ఒక ఎల్ఐసీ పాలసీ ఉంది. ఆ వయసులోని మిగతా వారిలానే నేహాకు ప్రత్యేకంగా సొంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదీ లేదు. కంపెనీ తరఫునున్న రూ.5 లక్షల కవరేజీ పాలసీ తప్ప. తను ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభంలో ఉంది.. ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరమేంటి అన్నది తన అభిప్రాయం. ఇరవైలలో ఉన్న నేహా విషయాన్ని కాస్సేపు అలా ఉంచితే... ముప్ఫైలలో ఉన్న వారు కూడా చాలా మంది ఇదేరకంగా భావిస్తుండటం ఆలోచించతగ్గ విషయం. ఎందుకంటే... ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్స చేయించాలనుకుంటే ఎక్కడ లేని డబ్బూ సరిపోదు. రూ.3 లక్షల కవరేజీ ఉన్నా కూడా సంక్లిష్టమైన సర్జరీ లేదా తీవ్ర అనారోగ్యాల వంటి వాటి బారిన పడితే 5 రోజుల హాస్పిటల్ ఖర్చులకు మించి రావడం లేదు. పోనీ అలాగని వ్యక్తిగతంగా పొదుపు చేసి, ఆ మొత్తాన్ని వైద్యానికి ఉపయోగించుకుందామంటే అయ్యే పని కాదు. అందుకని సాధ్యమైనంత ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇటు పొదుపు మొత్తాలు భద్రంగా ఉంటాయి. అటు మీరెంతగానో ప్రేమించే కుటుంబానికీ భరోసా ఉంటుంది. రెండు రకాలుగా ప్రయోజనాలు... వైద్య బీమాను సాధ్యమైనంత ముందుగా తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. మొదటిదేమంటే... పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన రిస్కులు తక్కువగానే ఉంటాయి, దీర్ఘకాలం పాటు ఎక్కువ కవరేజీ లభిస్తుంది. ఇక రెండోది.. ఎంత ముందుగా తీసుకుంటే ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. అదే నలభై ఏళ్లు వచ్చే దాకా ఆగి అప్పుడు తీసుకుంటే.. జీవిత కాలం తక్కువగా ఉంటుంది కనుక ప్రీమియం మొత్తం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఎంత ముందయితే.. అంత మంచిది...! కంపెనీ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పటికీ.. సొంతంగా కూడా ఒకటి తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఒకవేళ మీరో, లేదా మీ కుటుంబసభ్యులో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు ఒకోసారి కంపెనీ ఇచ్చే పాలసీ మొత్తం చికిత్స ఖర్చులకు సరిపోకపోవచ్చు. అలాగే, మీరు రిటైరయిన తర్వాత కంపెనీ ఇచ్చే పాలసీ కవరేజీ కూడా ముగిసిపోతుంది. సొంతంగా తీసుకున్న పాలసీనే అప్పుడు అక్కరకొస్తుంది. లేకపోతే కష్టపడి పొదుపు చేసిన డబ్బును ఖరీదైన వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. పోనీ అప్పుడు పాలసీ తీసుకుందామనుకుంటే 60 ఏళ్లు వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే కష్టమవుతుంది. ప్రస్తుతం చాలా మటుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు డే-కేర్ ప్రొసీజర్స్ మొదలుకుని, మెటర్నిటీ, ఓపీడీ మొదలైన వాటన్నింటికీ కూడా కవరేజీ ఇస్తున్నాయి. కాబట్టి ఆస్పత్రిలో చేరకపోయినా కూడా జీవితంలో చాలా మటుకు వైద్యం ఖర్చులను ఎదుర్కొనేందుకు హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయి. అయితే, పాలసీ తీసుకున్నాక నిర్దిష్ట సమయం తర్వాత మాత్రమే కొన్ని రకాల అనారోగ్యాలు, ప్రత్యేక ట్రీట్మెంట్స్కు కవరేజీ వర్తిస్తుంది. కనుక, సాధ్యమైనంత ముందుగా తీసుకుంటే.. వీలైనంత త్వరగా మెరుగైన కవరేజీ అందుకునేందుకు వీలవుతుంది. స్థూలంగా చెప్పాలంటే.. అరవయ్యో పడిలోకి వచ్చేదాకా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఆ తర్వాత వైద్యం ఖర్చులకు భారీ మొత్తాలను జేబులో నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు పాలసీ తీసుకోవాలనుకున్నా ప్రీమియం కూడా భారీగానే కట్టుకోవాల్సి వస్తుంది. కనుక, ఎంత ముందుగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అంత మంచిది. - అమిత్ భండారి హెడ్ (క్లెయిమ్స్ అండర్రైటింగ్ విభాగం) ఐసీఐసీఐ లాంబార్డ్ జీఐసీ -
అమ్మకు బీమా బహుమతిగా ఇద్దాం!
అమ్మ అంటే... వెలకట్టలేని రెండక్ష రాలు. అమ్మకు బీమా పాలసీని బహుమతిగా ఇవ్వడం నిజంగా ఓ ప్రత్యేకతే.. మార్కెట్లో బీమాలెన్నో.. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ అమ్మ అవసరాలను ప్రాధాన్యంలోకి తీసుకోవాలి. వాటికి అనుగుణంగా పాలసీని ఎంచుకోవాలి. అవేంటో చూద్దాం... వ్యక్తిగత ప్రమాద బీమా: ఎవరైనా ప్రమాదానికి గురికావొచ్చు. కాబట్టి ఈ బీమా తీసుకోవడం మంచిది. ఏదైనా జరిగినప్పుడు కుటుంబ సభ్యులపై, సన్నిహితులపై ఆర్థికంగా ఆధారపడటం కొంత తగ్గుతుంది. ఆరోగ్య బీమా: ఆమె బాగుంటేనే.. మనం బాగున్నట్లు. ఎందుకంటే మన అవసరాలను తను చూసుకుంటుంది కాబట్టి. ఆమెకు ఎదైనా హెల్త్ ఎమర్జెన్సీ సంభవిస్తే ఆ పరిస్థితుల నుంచి గ ట్టెక్కడానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. అత్యవసర బీమా: మహిళలకు మాత్రమే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి చికిత్సకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. వీటికి సంబంధించి అత్యవసర బీమా పాలసీని తీసుకోవాలి. వాహన బీమా: ఒకవేళ అమ్మ ఉద్యోగం చేస్తుంటే.. తనకు వాహనం ఉంటే.. వాహన బీమా తీసుకోవాలి. ఇంటి బీమా: మహిళలు రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండి, ఆర్థికపరమైన అంశాల్లో స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. వారికి ఇంటి బీమాను కానుకగా ఇవ్వండి. ట్రావెల్ ఇన్సూరెన్స్: ప్రస్తుతం మహిళలు ఉద్యోగం/వ్యాపారంలో భాగంగా దేశ విదేశాలు చుట్టేస్తున్నారు. కొందరు ఉల్లాసం, కొత్తదనం కోసం టూర్లకు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా అమ్మ కూడా తరచూ విదేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటే.. ఆమెకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. అది వారికి కొత్త ప్రదేశాల్లో అనుకోని పరిస్థితులు సంభవిస్తే.. రక్షణ కల్పిస్తుంది. గృహిణైనా? ఉద్యోగిణైనా? బీమా తప్పనిసరి భారత్లో బీమా వ్యాప్తి తక్కువే. బీమా పరిశ్రమ నివేదికల ప్రకారం.. బీమా తీసుకున్న వారిలో మహిళల వాటా 20-30 శాతం మాత్రమే. గతంలో కుటుంబంలోని మహిళకు ఎలాంటి ఆర్థికపరమైన బాధ్యతలు ఉండవనే కారణంతో వారికి బీమా ఎందుకని అనుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు వారూ బాధ్యతలను మోస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ బీమా దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి మార్పు లేదు. ఇది మారాలి. వారికి కూడా బీమా తీసుకోవాలి. కనీసం ఇంట్లో అమ్మకైనా బీమా ఇప్పించాలి. ఆమె గృహిణా? ఉద్యోగిణా? అనేది ఇక్కడ అనవసరం. - పునీత్ సాహ్ని హెడ్- ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ -
‘టాప్ అప్’ కావాలా? సూపర్ టాప్ అప్ కావాలా?
ఫైనాన్షియల్ బేసిక్స్ రవికి 30 ఏళ్లు. ఆరోగ్య బీమా కవరేజీ రూ.2 లక్షల వరకు ఉంది. పాలసీ తీసుకొని కొన్నేళ్లు గడిచాక రవి ఒక విషయాన్ని గమనించాడు. రోజులతో పాటు వైద్య ఖర్చులూ పెరుగుతున్నాయని, భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తితే అప్పుడు తీసుకున్న ఇన్సూరెన్స్ సరిపోదనే అంచనాకు వచ్చాడు. కొత్తగా మరొక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాడు. వయసు ఎక్కువయ్యే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుందనే విషయం రవికి తెలుసు. అప్పుడు కొత్తగా పాలసీ తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాలి కదా...! అన్నది అతడి ఆలోచన. ఈ సమయంలో రవికి తన స్నేహితుడు శంకర్ తారసపడ్డాడు. రవి ఈ విషయాన్ని శంకర్కు చెప్పాడు. అప్పుడు శంకర్.. రవికి హెల్త్ పాలసీలకు టాప్ అప్, సూపర్ టాప్ అప్ చేయించుకోవాలని సలహా ఇచ్చాడు. ఎందుకంటే వీటి ద్వారా అదనపు కవరేజీ పొందొచ్చు. అవెలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం... రవికి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. అతను టాప్ అప్ పాలసీల ద్వారా మరో రూ.5 లక్షల వరకు బీమా తీసుకున్నాడు. రవి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ చేరాడు. ఒక ఏడాదిలో నాలుగుసార్లు చేరటంతో 1.8 లక్షలు ఖర్చయింది. ఆ మొత్తం అంతటినీ బీమా కంపెనీయే భరించింది. కానీ అదే ఏడాది ఐదోసారి కూడా రవి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు బిల్లు ఏకంగా రూ.3 లక్షలయింది. పాలసీలో కవరేజీ మొత్తం రూ.20 వేలే ఉన్నా... టాప్ అప్ రూ.5 లక్షల వరకు ఉండటంతో మిగిలిన రూ.2.8 లక్షలు కూడా బీమా కంపెనీయే భరించింది. కాకపోతే టాప్ అప్ను ఏడాదిలో ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసే వీలుంటుంది. అది కూడా ... మన మామూలు బీమా కవరేజీ మొత్తం అయిపోతున్న సందర్భంలో... దానికన్నా ఎక్కువ ఎంత అవసరమైతే అంత, మన టాప్ అప్ పరిధిలో క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. మరి సూపర్ టాప్ అప్ అంటే...! సూపర్ టాప్ అప్ అంటే... టాప్ అప్ కన్నా కొంచెం ఎక్కువన్న మాట. టాప్ అప్ను ఏడాదిలో ఒకసారే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సూపర్ టాప్ అప్ అలా కాదు. దాని కవరేజీ మొత్తం పరిధిలో... ఏడాదిలో ఎన్నిసార్లయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రవినే తీసుకుందాం. రవి ఆ ఏడాది ఐదోసారి ఆసుపత్రిలో చేరటంతో కవరేజీ మొత్తం అయిపోయింది. టాప్ అప్ గనక ఒకసారి రూ.2.8 లక్షలు చెల్లించారు. అదే రవి గనక సూపర్ టాప్ అప్ను రూ.5 లక్షలకు తీసుకుంటే... రూ.2.8 లక్షలు క్లెయిమ్ చేశాక కూడా ఇంకా కవరేజీ రూ.2.2 లక్షలుంటుంది. దాన్ని కూడా ఆ ఏడాది అవసరమైన పక్షంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. పూర్తిగా రూ.5 లక్షలూ క్లెయిమ్ చేసుకునేదాకా ఇది వర్తిస్తుంది. కాకపోతే టాప్ అప్, లేదా సూపర్ టాప్ అప్ విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఇవి బీమా కవరేజీకి అదనంగా పనిచేస్తాయి తప్ప ఇవే బీమా కవరేజీ కాదు. ఒక ఏడాదిలో లిమిట్ దాటిపోయిన పక్షంలో ఇవి అక్కరకు వస్తాయి. మన క్లెయిమ్ లిమిట్ పరిధిలోనే ఉంటే... వీటిద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. -
పదవీ విరమణ చేసినవారు ఆరోగ్య బీమా తీసుకోవచ్చా?
ఫైనాన్షియల్ బేసిక్స్.. ఆరోగ్య బీమా ఎవరికైనా తీసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల హెల్త్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అందులో 65 ఏళ్ల వయసు పైబడిన వారికి కూడా ప్రత్యేకమైన పాలసీలను అందిస్తున్నాయి బీమా కంపెనీలు. మన పదవీ విరమణ చేసిన తల్లిదండ్రులకు పాలసీ తీసుకోవడమంటే.. అది వారికి ఒక బహుమతిని ఇచ్చినట్లే. వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. అందుకే సీనియర్ సిటిజన్స్కు హెల్త్ పాలసీ తీసుకోవడం మంచిదే. వీరికి పాలసీ తీసుకునేటప్పుడు కో-పేమెంట్, సబ్ లిమిట్స్ వంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవద్దు. అలాగే వారికి సంబంధించిన అన్ని వివరాలను పాలసీ అప్లికేషన్ ఫామ్లో తెలియజేయండి. పాలసీ ఎంపిక సమయంలో ప్రీమియం, కవరేజ్, పాలసీ ప్రయోజనాలు, ప్రత్యేకతలు, వర్తింపు వంటి తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఎంపిక చేసుకున్న హెల్త్ పాలసీని ఇతర బీమా కంపెనీల పాలసీలతో పోల్చి చూసుకోండి. అలాగే తీసుకున్న పాలసీ గురించి అన్ని వివరాలను సమగ్రంగా తెలుసుకోండి. రిటైర్డ్ తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం వల్ల మీరు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. -
హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతుండాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్... ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మారుతున్న జీవనశైలి, పని వేళలు, కాలుష్యం తదితర అంశాల వల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అనారోగ్యం సంభవించినప్పుడు దానికయ్యే ఖర్చుల నుంచి రక్షణ పొందటానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాలసీలు మనకు ఆర్థికంగా బాసటగా నిలుస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటపుడు మన మదిలో మెదిలే తొలి ప్రశ్న.. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? దీనికి సమాధానం ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీని రూ.10 లక్షలకు తీసుకుంటే మంచిది. వార్షిక ఆదాయానికి సమాన మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. కెరీర్ ప్రారంభమైన తొలినాళ్లలో వ్యక్తిగత పాలసీ తీసుకోండి. అటుపై పెళ్లైన తర్వాత ఇద్దరికీ గానూ ఫ్లోటర్ పాలసీని తీసుకోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల బీమా కంపెనీలు పలు రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. మీ అవసరాలకు అనువైన ఒక పాలసీని ఎంపిక చేసుకోండి. పాలసీ ఎంపికలో బీమా కంపెనీ పనితీరు, సేవలు, పాలసీ వివరాలు, ప్రీమియం వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవడం మరువద్దు. -
చేనేత కార్మికులకు దక్కని ఆరోగ్య బీమా
♦ రాష్ట్రంలో రెండేళ్లుగా నిలిచిన ఆర్ఎస్బీవై అమలు ♦ ప్రీమియం చెల్లింపుపై స్పష్టత కరువు ♦ ప్రత్యామ్నాయంపై ఖరారు కాని విధివిధానాలు సాక్షి, హైదరాబాద్: చేతివృత్తులపై ఆధారపడిన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బీవై) అమలు రాష్ట్రంలో వేలాది మంది చేనేత కార్మికులకు రెండేళ్లుగా నిలిచిపోయింది. దీంతో వారంతా ఆరోగ్య బీమా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో చేనేత సహకార, సహకారేత రంగాల్లో సుమారు 1.10 లక్షల మంది చేనేత కార్మికులు ఉండగా 2008లో కార్మికశాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్ఎస్బీవై పథకం కింద సుమారు 15,700 మంది కార్మికులు ఆరోగ్య బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీమా ప్రీమియంలో 75 శాతం నుంచి 90 శాతం మేర కేంద్రం చెల్లించగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ వచ్చింది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు రూ. 15 వేల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా పొందే వీలుండేది. అయితే లబ్ధిదారుల నమోదులో ప్రైవేటు బీమా సంస్థ అవకతవకలకు పాల్పడి ందంటూ 2013 సెప్టెంబర్ నుంచి పథకం అమలును కేంద్రం నిలిపేసి ఈ బాధ్యతను కేంద్ర ఆరోగ్యశాఖకు అప్పగించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న వారందరికీ ఆర్ఎస్బీవై వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించడంతో చేనేత అధికారులు దీన్ని తమకు సంబంధంలేని వ్యవహారంగా భావించి పక్కకు తప్పుకున్నారు. దీనికితోడు చేనేత కార్మికులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం పైనా స్పష్టత కొరవడటంతో రాష్ట్రం నుంచి ఒక్క చేనేత కార్మికుడు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు చెల్లించే బీమా ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా చేనేత కార్మికుల కోసం ప్రత్యామ్నాయ ఆరోగ్య బీమా పథకాన్ని రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ విధివిధానాలు ఖరారు కాకపోవడంతో ప్రత్యామ్నాయ పథకం అమలుకు నోచుకోవడం లేదు. బీమా ప్రీమియం చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని చేనేత సహకార సంఘాలు, కార్మికుల నుంచి వినతులు అందుతున్నా స్పందన కనిపించడం లేదు. అయితే రాష్ట్ర చేనేత విభాగం అధికారులు మాత్రం విధివిధానాలను మార్చిలోగా రూపొందించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చేనేత కార్మికుల బీమా పథకాన్ని అమలు చేస్తామంటున్నారు. -
ఆరోగ్య బీమా తీసుకోవాలా?
ఫైనాన్షియల్ బేసిక్స్.. జీవితం క్లిష్టమైనది. ఇందులో సుఖం, బాధ, కష్టం, నష్టం, లాభం ఇలా ఎన్నో అంశాలుంటాయి. మీ కోసం, మీపై ఆధారపడి జీవనం సాగించే వారి కోసం ఆరోగ్య బీమా తప్పకుండా తీసుకోవాలి. ఇది జీవిత బీమా మాదిరిగానే మిమ్మల్ని నమ్ముకున్న వారికి కష్ట కాలంలో అండగా ఉంటుంది. సాధారణంగా అయితే జీవిత బీమా పాలసీ కన్నా ముందే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఎందుకంటే అస్వస్థత అనేది తరచుగా వస్తుంటుంది కనక. మారుతున్న పర్యావరణ పరిస్థితు లు,మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి తదితర అంశాల కారణంగా ఆనారోగ్యాలు తరచూ సంభవిస్తున్నాయి. మనం అస్వస్థతకు గురైనపుడు దాని ట్రీట్మెంట్కు ఒక్కొక్కసారి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమౌతాయి. అలాంటి సమయంలో ఆరోగ్య బీమా దన్నుగా నిలుస్తుంది. ఆర్థికంగా చేయూత అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా బీమా కంపెనీలున్నాయి. అవి పలు రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. బీమా కంపెనీ, దాని పనితీరు, కవరేజ్ మొత్తం, మన అవసరాలు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని ఒక మంచి పాలసీని ఎంచుకోండి. -
పన్ను భారం తగ్గించుకుందామా!
ఈ ఏడాది నుంచి కొత్త మినహాయింపులు ♦ ఇక ఎన్పీఎస్ ఇన్వెస్ట్మెంట్ విడిగా లెక్కింపు ♦ పెరిగిన ఆరోగ్య బీమా పరిమితులు ♦ పెరిగిన రవాణా భత్యం; ఆడపిల్లలకు కొత్త పథకం ♦ రూ.4.44 లక్షల వరకూ మినహాయింపు పొందే అవకాశం ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తోంది. చాలామందికి పన్నుపోటు తగులుతోంది. జీతాల్లో భారీ కోత పడుతోంది. కనీసం... ఇప్పుడైనా జాగ్రత్త పడకుంటే మిగిలిన రెండు నెలలూ మరింత భారీ కోతలు ఖాయం. అందుకే అందరూ పన్ను భారం నుంచి ఎలా తప్పించుకోవాలన్న లెక్కల్లో పడ్డారు. నిజానికి ఈ సంవత్సరం పన్ను భారం నుంచి తప్పించుకోవటానికి కొత్త సెక్షన్లు వచ్చాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే పన్ను భారం మరింతగా తగ్గించుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని మినహాయింపులను వినియోగించుకోవడం ద్వారా గరిష్టంగా రూ.4.44 లక్షల వరకూ పన్ను భారం తగ్గించుకోవచ్చన్నది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అదెలాగో... ఆ పథకాలేంటో... సెక్షన్లేంటో వివరించేదే ఈ కథనం... ప్రత్యేకంగా ఎన్పీఎస్... గతేడాది వరకూ జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని సెక్షన్ 80సీలో భాగంగానే పరిగణించేవారు. ఈ ఏడాది నుంచి మాత్రం ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ప్రత్యేకంగా చూపించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఐటీ చట్టంలో 80 సీసీడీ అనే ప్రత్యేక సెక్షన్ను ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.50,000 వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షలకు అదనం. దీని వల్ల 30 శాతం పన్ను పరిధిలో ఉండే వారికి అదనంగా రూ.15,000 వరకు పన్ను భారం తగ్గుతుంది. 20 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వారికి రూ.10,000, అదే 10 శాతం శ్లాబులో ఉన్న వారికైతే రూ. 5,000 పన్ను తగ్గుతుంది. మరింత ఆరోగ్య ధీమా... ఈ ఏడాది జరిగిన కీలక మార్పులో ముఖ్యమైన మరో అంశం సెక్షన్ 80డీ పరిమితులు పెంచడం. ఈ సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై లభించే పన్ను మినహాయింపు పరిధిని పెంచారు. 60 ఏళ్ళలోపు వయస్సు ఉన్నవారికి ఇప్పటి వరకు రూ.15,000 వరకు మాత్రమే మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ. 25,000కు పెంచారు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ. 30,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ముందస్తు వైద్య పరీక్షలకు చేసే వ్యయంపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ ఈ మొత్తం రూ.25,000 పరిధిలోకే వస్తుంది. భార్యభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులపై చేసే వైద్య పరీక్షలను ఇందుకోసం వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా తల్లిదండ్రులకు చెల్లించే వైద్య బీమా ప్రీమియంపై కూడా మినహాయింపులు పొందవచ్చు. తల్లిదండ్రులు 60 ఏళ్ళ లోపు వారైతే రూ.25,000, అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ.30,000 అదనంగా పొందవచ్చు. అంటే ఈ సెక్షన్ ద్వారా గరిష్టంగా రూ. 60,000 వరకూ ప్రయోజనం పొందవచ్చు. రెట్టింపైన రవాణా భత్యం... హోదాతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి జీతంలో రవాణా భత్యం ఉంటుంది. ప్రతి నెలా జీతంలో కన్వేయెన్స్ అలవెన్స్ కింద రూ.800 లభిస్తాయి. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కేంద్రం రూ.1,600కు పెంచింది. ప్రభుత్వం ఇలా చేయటం వల్ల ఏడాదికి అదనంగా రూ.9,600 వరకు పన్ను భారం తగ్గించుకోవచ్చు. సుకన్య సమృద్ధి... అమ్మాయిల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కిందటేడాది సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘సుకన్య సమృద్ధి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంపై అత్యధిక వడ్డీతో పాటు, పన్ను మినహాయింపులు లభించడం దీనిలోని ప్రధాన ఆకర్షణ. ఈ ఏడాది 9.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. అయితే 10 ఏళ్ళ లోపు అమ్మాయిల పేరు మీద మాత్రమే ఈ పథకాన్ని తీసుకోగలరు. అమ్మాయి వయస్సు 21 ఏళ్లు లేదా వివాహ తేది... ఏది ముందైతే అది మెచ్యూరిటీ తేదీగా వ్యవహరిస్తారు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతున్న ప్రస్తుత సమయంలో ఈ పథకంపై అధిక వడ్డీరేటు లభిస్తుండటం గమనార్హం. తొలిసారి షేర్లు కొంటున్నారా.. తొలిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం 80 సీసీజీ రూపంలో రాజీవ్గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం అందుబాటులో ఉంది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్లు చేసే ఇన్వెస్ట్మెంట్స్పై ఈ మినహాయింపు పొందవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు. ఇవన్నీ కాకుండా ఎప్పటిలాగా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభించే బీమా, ఐదేళ్లు బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), పీపీఎఫ్, హౌసింగ్ లోన్, ట్యూషన్ ఫీజులు తదితరాలు ఎలానూ ఉన్నాయి. వీటన్నింటినీ చక్కగా వినియోగించుకోవడం ద్వారా గరిష్టంగా పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. -
ఆరోగ్య బీమాలోకి టాటా ఏఐఏ లైఫ్ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగంలో ఉన్న టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆరోగ్య బీమా పాలసీలను తిరిగి ప్రవేశ పెట్టనుంది. ఐఆర్డీఏ నుంచి ఈ ఏడాదే అనుమతి లభించే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అనుమతి రాగానే పలు ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సౌమ్యజిత్ పట్నాయక్ తెలిపారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అరుణవ ఖాన్తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి నాటికి ఇతర విభాగాల్లో 7 కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తామన్నారు. ‘2014-15లో కొత్త పాలసీల ద్వారా రూ.312 కోట్ల వ్యాపారం నమోదు చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నాటికే ఇది రూ.226 కోట్లను దాటింది. ఆన్లైన్లో విక్రయమవుతున్న పాలసీల వాటా 6.25 శాతముంది’ అని వివరించారు. లైఫ్ ప్లానర్లతో.. నెట్వర్కింగ్, కమ్యూనికేషన్స్ నైపుణ్యం ఆర్థిక విషయాలపట్ల లోతైన అవగాహన కలిగిన ఏజెంట్లను కంపెనీ నియమిస్తోంది. వీరిని లైఫ్ ప్లానర్లుగా అభివర్ణిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కంపెనీకి 1,000కిపైగా లైఫ్ ప్లానర్లతోపాటు 33,600 మంది ఏజెంట్లున్నారు. లైఫ్ ప్లానర్ల సంఖ్యను మరింత పెంచుతున్నామని, నియామకాల్లో ప్రైవేటు బీమా కంపెనీల్లో టాప్-5లో నిలిచామని సౌమ్యజిత్ వెల్లడించారు. పాలసీదారుల అనుభవం ఆధారంగా పరిష్కారాలను అంది స్తున్నట్టు చెప్పారు. కాగా, పాలసీల గురించి తెలుసుకోవడానికి 92% మంది ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్లైన్లో పాలసీలు తీసుకునే వారి సంఖ్య 5-6%కే పరిమితమైంది. ఈ సంఖ్య ఇప్పుడు పెరుగుతోందని కంపెనీ చెబుతోంది. -
యజమాని ఇచ్చే బీమాతో సరా..!
శ్రీధర్ది ప్రైవేటు ఉద్యోగం. మంచి జీతం. కంపెనీ ఆరోగ్య బీమా ఇస్తోంది కదా అని ఎప్పుడూ సొంత ఆరోగ్య బీమా గురించి ఆలోచించలేదు. అయితే ఉన్నట్టుండి కంపెనీ అతన్ని తొలగించింది. ఈ వార్త పిడుగుపాటులా తాకటంతో మానసికంగా బాగా కుంగిపోయాడు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా... ఈ కుంగుబాటుతో ఆరోగ్యం దెబ్బతింది. ఆసుపత్రిలో చేరాడు. అక్కడ తలెత్తింది అసలు సమస్య. ఆసుపత్రిలో నాలుగైదు రోజులు ఉంచటం... పరీక్షలన్నీ చేయటం, ట్రీట్మెంట్... వీటన్నిటికీ రూ.2 లక్షల దాకా అయింది. అంతకు ముందైతే కంపెనీ హెల్త్ పాలసీ ఉండేది కనక ఎన్నడూ ఇబ్బంది అనిపించలేదు. కానీ ఉద్యోగం పోవటం... ఆదాయం లేకపోవటం... అదే సమయంలో ఆసుపత్రి పాలవటం అన్నీ కలిసి శ్రీధర్ను నానా ఇబ్బందులూ పెట్టాయి. బంధుమిత్రుల సాయంతో బయటపడ్డా... కంపెనీ ఇస్తున్నది కాకుండా సొంత ఆరోగ్య బీమా పాలసీ ఉండటం ఎంత అవసరమో అప్పుడు తెలిసొచ్చింది శ్రీధర్కు. నిజానికిపుడు చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ ఇస్తున్న ఆరోగ్య బీమా పాలసీతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏ అవసరం వచ్చినా ఈ బీమా సరిపోతుంది కదా! ఇంకెందుకు మరొకటి? అనేది వారి ఆలోచన. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటుంది. గడిచిన మూడేళ్లుగా చాలా సంస్థలు ఉద్యోగుల తల్లిదండ్రుల బీమా కవరేజీకి వచ్చేసరికి వారి నుంచి కూడా కొంత పేమెంట్ ఉండాలనే నిబంధన పెడుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న వైద్య ఖర్చులకు తగ్గట్టుగా ఇవి కవరేజీ పెంచటం లేదు. ఇటీవల ఓ బీమా కంపెనీ చేసిన సర్వేలో వెల్లడైందేంటంటే... 2008 నుంచి భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న మెడిక్లెయిమ్ ప్రీమియం పెరగటమే లేదు. అయితే తగ్గటం, లేకపోతే అదే స్థాయిలో ఉండటం జరుగుతోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన కంపెనీలు ఉద్యోగుల ప్రయోజనాలు, ఆరోగ్య పరిరక్షణపై చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. అక్కడి కంపెనీలు పెడుతున్న ఖర్చులో 10 శాతమే ఇక్కడి కంపెనీలు వెచ్చిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పెపైచ్చు 2008లో మాంద్యం పరిస్థితులు నెలకొన్న తరవాత నుంచి ఇవి ఆ ఖర్చులను కూడా కుదించటం మొదలుపెట్టాయి. బీమా ప్రీమియంలలో కోత పెట్టాయి. దీంతో 20 నుంచి 25 శాతం ఉద్యోగులు తమ మెడిక్లెయిమ్ పాలసీలకు అదనంగా టాప్ అప్ చేసుకుంటున్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా ఉండటం తప్పనిసరి * కంపెనీ పాలసీలో కవరేజీ మొత్తం అంతంతే * వ్యక్తిగత, గ్రూప్ టాప్-అప్లూ చేయించుకోవచ్చు * సొంత హెల్త్ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్, ప్రమాద బీమాతో ధీమా పెరుగుతున్న నియంత్రణలు... చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ బీమా కవరేజీలపై ఆంక్షలు పెడుతున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ తాజా నివేదిక ప్రకారం 76 శాతం కంపెనీలు కో-పేమెంట్ నిబంధనను పాటించటమే కాక ఆసుపత్రుల్లో గది అద్దెపై పరిమితి విధిస్తున్నాయి. సగటున చూస్తే ఇవి ఉద్యోగులకు అందిస్తున్న బీమా కవరేజీ మొత్తం లక్ష నుంచి లక్షన్నర దాటడం లేదు. ‘‘దురదృష్టవశాత్తూ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి వారం రోజుల పాటు ఉన్నారనుకోండి. మీ ఆసుపత్రి బిల్లు భారీగా పెరిగిపోయే అవకాశముంది. అలాంటి సందర్భాల్లో కంపెనీ ఇస్తున్న కవరేజీ సరిపోదు. అందుకని మీ వార్షిక ఆదాయానికి సమానమైన సొంత ఆరోగ్య బీమా కవరేజీ తప్పక ఉండి తీరాలి. దానికి క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, వ్యక్తిగత ప్రమాద బీమా జత చేయాలి’’ అనేది పాలసీ బజార్ సీఈఓ యాశిష్ దహియా మాట. నిజానికి కంపెనీ ఇస్తున్న కవరేజీ చాలకపోవటం అనేది ఒక్కటే కాదు. కంపెనీ ఆఫర్ చేస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ పరిమితిని దాటిపోయినా, లేక మీరు తరచు ఉద్యోగాలు మారుతున్నా కూడా... మీకు ప్రత్యేక ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఏడాదికి రూ.9 వేలలోనే అన్నీ... ఒకవేళ విడిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుందామనుకుంటే... ముఖ్యంగా చూడాల్సింది అప్పటికే ఉన్న వ్యాధుల కవరేజీకి వారు పేర్కొన్న వెయిటింగ్ పీరియడ్ ఎంత? మెటర్నిటీ ప్రయోజనాలున్నాయా? క్యాష్లెస్ ఫెసిలిటీ కల్పించే ఆసుపత్రులెన్ని? వంటివి. నిజానికి 30 ఏళ్ల వ్యక్తి గనక రూ.5 లక్షల బీమా కవరేజీ, రూ.10 లక్షల క్రిటికల్ ఇల్నెస్, రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా... వీటన్నిటికీ కలిసి ఏడాదికి రూ.9 వేలు ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎలాగంటే... రూ.5 లక్షల రెలిగేర్ కేర్ హెల్త్ కవర్కు ఏడాదికి రూ.5,162 అవుతుండగా, బజాజ్ అలయంజ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.3వేలు, ఐసీఐసీఐ లాంబార్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.1,221 ఖర్చవుతోంది. కాకపోతే వ్యక్తిగత బీమాకు కొన్ని పరిమితులుంటాయి. కంపెనీ ఇస్తున్న గ్రూప్ బీమా కవరేజీ అయితే అప్పటికే ఉన్న వ్యాధుల్ని, మెటర్నిటీ ఖర్చుల్ని కవర్ చేస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలైతే అప్పటికే ఉన్న వ్యాధులకు రెండు నుంచి నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అది కంపెనీని బట్టి మారుతుంది. కవరేజీని పెంచుకోవాలనుకుంటే టాప్ అప్ ప్లాన్నూ పరిశీలించొచ్చు. కొన్ని కంపెనీలు గ్రూప్ టాప్-అప్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటిని మీరు పనిచేస్తున్న కంపెనీ ఆఫర్ చేస్తున్న బీమా సంస్థ దగ్గరే కొనుగోలు చే యొచ్చు. ఇలాంటప్పుడు గ్రూప్ టాప్-అప్ అనేది కంపెనీ ఇస్తున్న పథకానికి జతగా ఉంటుందో లేదో చూడాలి. ఇక వ్యక్తిగత టాప్-అప్లనేవి కొంత ఖరీదే. వీటిని ఎంచుకునే ముందు వాటి షరతులనూ చూడాలి. మరికొన్ని కంపెనీలు నిర్దిష్ట మొత్తానికి సొంత ఆరోగ్య బీమా ఉంటే తప్ప టాప్ అప్ చేయలేమని, కవరేజీ మొత్తాన్ని ఏకకాలంలో ఉపయోగించుకున్న తరవాతే టాప్ అప్ వర్తిస్తుందని షరతులు పెడుతున్నాయి. కనుక చిన్న వయసులో ఉన్నపుడే వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకుంటే తక్కువ ధరకే రావటం తో పాటు మరిన్ని వ్యాధులు కవరయ్యే అవకాశం ఉంటుంది. -
రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా?
నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చా ? ఏజెంట్లు, బ్రోకరేజ్ చార్జీలు వంటి బాదరబందీలేమీ లేకుండా ఇలా నేరుగా ఇన్వెస్ట్ చేసే అవకాశముందా? వివరించండి? - మార్కండేయ, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్స్లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ డెరైక్ట్ ప్లాన్లను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి 2013, జనవరిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ డెరైక్ట్ ప్లాన్స్లో ఏజెంట్లు, దళారీల ప్రమేయం లేకుండా మీరు నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫలితంగా ఏజెంట్లకు చెల్లించే కమీషన్ ఆదా అవుతుంది. దీంతో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండి ఇన్వెస్టర్లకు ఎక్కువ రాబడులు వస్తాయి. అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐ ఫార్మా ఫండ్లో నెలకు రూ.10,000 చొప్పున ఏడాది పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను సొంతంగా ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రయోజనకరం? - మందాకిని, హైదరాబాద్ నెలకు నిర్ణీత మొత్తం-మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసినా, లేకుంటే సిప్ విధానంలో(ప్రతి నెలా ఒక నిర్ణీత తేదీన) ఇన్వెస్ట్ చేసినా.. ఏ విధంగా ఇన్వెస్ట్ చేసినా మీకు దక్కే ప్రయోజనాలు దాదాపు ఒక్కటే. మార్కెట్ స్థితిగతులను బట్టి నెలలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించేంత తీరిక, ఓపిక సాధారణ ఇన్వెస్టర్లకు ఉండవు. అలా కాకుండా మీకు ఆసక్తి ఉండి, నెల మొత్తంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే మొదటి విధానం మంచిదే. అయితే అది కొంచెం కష్టసాధ్యమైన విషయమే. ఈ బాదరబందీలేమీ లేకుండా సిప్ విధానాన్నీ ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏజెంట్ల కమీషన్ ఖర్చు ఉండదు. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో కారణంగా ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలుంటాయి. నెలకు రూ.5,000 చొప్పున ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫ్రాంక్లిన్ ట్యాక్స్షీల్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. అలాగే ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కూడా పన్ను మినహాయింపులు లభిస్తాయా? - శశి, హైదరాబాద్ ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ ఫండ్ అనేది టెక్నాలజీ (ఐటీ) స్కీమ్. ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభించవు. ఫ్రాంక్లిన్ ట్యాక్స్షీల్డ్ అనేది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్). ఇది ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కిందకు వస్తుంది. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను మినహాయింపులు పొందవచ్చు. అయితే ఈ తరహా ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లకు మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. నేను ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాను. నా వయ స్సు 35 సంవత్సరాలు. 32 సంవత్సరాల నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. మాకు రెండేళ్ల పాప ఉంది. నాకు, నా కుటుంబానికి రూ.5 లక్షల ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ను తీసుకుందామనుకుంటున్నాను. ఈ బీమా కవర్ సరిపోతుందా? నా అవసరాలకు తగిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను సూచించండి? - శరత్ చంద్ర, చిత్తూరు మీలాంటి యువ కుటుంబాలు లైఫ్టైమ్ రెన్యువల్ ఆప్షన్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. దీంట్లో సబ్-లిమిట్స్, కో పేమెంట్ క్లాజ్ ఉండకూడదు. ఇక మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే, అపోలో మ్యూనిక్ ఈజీ హెల్త్ పాలసీ, ఐసీఐసీఐ లాంబార్డ్ ఐహెల్త్.. పాలసీలను పరిశీలించవచ్చు. మీ కుటుంబంలో పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న చరిత్ర ఉంటే, క్రిటికల్ ఇల్నెస్ కవర్ తప్పకుండా తీసుకోవాలి. మీరు చెప్పిన రూ.5 లక్షల కవర్ ఇప్పటికి సరిపోతుంది. మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, వ్యాధులకు సంబంధించి మీ కుటుంబ చరిత్ర, మీ ఆదాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంత మొత్తానికి బీమా కవర్ కావాలో మీరే సొంతంగా నిర్ణయించుకోవాలి. బీమా కవర్ పెంచుకోవాలనుకున్నప్పుడల్లా, సూపర్ టాప్ అప్ ప్లాన్ను ఎంచుకోండి. అపోలో మ్యూనిక్ ఈజీ హెల్త్ పాలసీకి ఏడాది ప్రీమియం రూ.10,523, ఐసీఐసీఐ లాంబార్డ్ ఐహెల్త్ పాలసీకి ప్రీమియం రూ.11,719గా ఉన్నాయి. రెండేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే కొంత డిస్కౌంట్ను రెండు పాలసీలు ఆఫర్ చేస్తున్నాయి. -
నో ఫ్రూట్... నో డాక్టర్...!
హ్యూమర్ ప్లస్ ఈ మధ్య పత్రికల్లో ‘పండ్ల గూర్చి’ వచ్చిన వార్తలతో అదిరిపడ్డాడు భీమశంకరం. వెంటనే అన్ని పేపర్ కట్టింగులు పట్టుకుని బావగారైన బంగారం దగ్గరికి వెళ్లాడు. బలవంతాన బావచేత చదివించాడు. వెంటనే 10 లక్షల పాలసీకి ఆరోగ్య బీమా సంతకం పెట్టించాడు. పదిమంది మిత్రులకి ఫోన్ చేసి త్వరగా పాలసీలు చేయించండి అని పురమాయించాడు. పెళ్లాన్ని పిలిచి... ‘‘ఈ రోజు నుంచి పండ్లు, పండ్ల రసాలు బంద్.. నాక్కూడా అన్నం వండు... నాలిక్కి కారం తగిలి ఎన్నాళ్లయిందో’’ అని వాపోయాడు. భీమశంక రం కలిసిన వాళ్లందరూ పాలసీలు తీసుకుంటామన్నారు. ఇంటికి వెళ్లి భార్య చింతామణికి చెప్పాడు. మనకిక చింతలు లేవని. గురకపెట్టి పడుకున్నాడు. వీధి సందులో అప్పుడే ప్రాక్టీసు పెట్టిన కుర్ర డాక్టర్ డాంబిక్... క్లినిక్కి కొత్త హంగులు అమర్చాడు... పాత బోర్డులు మార్చేశాడు. ‘ఆపిల్స్ తిన్నారా... మమ్మల్ని సంప్రదించండి’, ‘పండ్లు కొంటే... ఫ్రిజ్ కరెంట్ వేస్ట్’, ‘పండ్లు తింటే... మీ ఆరోగ్యానికి టెస్ట్’.. ప్రాక్టీసు పుంజుకుంది. పక్కవీధిలో ఆయుర్వేదం డాక్టర్ ‘పది పండ్ల కన్నా పచ్చి గడ్డి నయం’ అంటూ ఏ పండు ద్వారా అనారోగ్యం ఏర్పడ్డా ఒక ఆకు పసరుతో నయం చేస్తానని ఛాలెంజి చేస్తున్నాడు. బడి పక్కన హోమియోపతి డాక్టర్ ఊరుకోలేదు. ఎంత పెద్ద పండు తిన్నా ఫరవాలేదు... చిన్న మాత్రతో రోగం పోగొడ్తానంటున్నాడు. మసీదు పక్కన యునానీ డాక్టర్ ఏవో కొత్త మందులు నూరడం మొదలు పెట్టాడు. ఊరంతా డాక్టర్లు మంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మందుల కంపెనీ వాళ్లు ఏ పండు తింటే ఏ జబ్బు వస్తుందో రీసెర్చ్ మొదలుపెట్టారు. సర్వేలు నిర్వహించారు... అరటి పండు తిని ఆరోగ్యం పోగొట్టుకున్నవారు 62 శాతం అని తేలింది. సంపన్న వర్గాలవారు ఆపిళ్లు, సపోటాలు తిని 89 శాతం ఆనారోగ్యం పాలయ్యారు. అన్నీ కొత్త జబ్బులు బయటపడ్డాయి. పండు పరిమాణానికి, జబ్బుకి తీవ్రతకి సంబంధం లేదన్నారు. మానసికంగానే కాకుండా అంగవైకల్యానికీ దారి తీస్తుందంటున్నారు. జబ్బులకి ఏ పేరు పెట్టాలో తెలియక పండు పేరు పెట్టాలని నిర్ణయించారు. సామాజిక స్పృహ గల కవులు, గాయకులు ఎన్నో పాటలు రాశారు... ‘పండ్లు తినకండోయ్ బాబు కళ్లు తెరవండోయ్’ అన్న పాట ప్రతి నోట నానుతోంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వెలిసాయ్, కౌన్సిలింగ్లు మొదలయ్యాయ్... ‘నోఫ్రూట్... నో డాక్టర్’ అని సందేశాలు మొదలు. ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దూకింది. ప్రతి పండు మీద... ‘పండ్లు తినడం శ్రేయస్కరం కాదు... ఆరోగ్యానికి హానికరం’ అని ఒక ట్యాగ్ ఉండాలి అని ఆదేశాలు జారీ చేసింది. హోటలు వాళ్లు ‘నో ఫ్రూట్ సలాడ్’ బోర్డ్ పెట్టారు. కొంతమంది ‘మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది’ అని చేతులు దులుపుకున్నారు.. కొన్ని కార్యాలయాల్లో ‘నో ఫ్రూట్స్ ప్లీజ్’ అని అంటే కొంతమంది ‘నో ఫ్రూట్ జోన్’ అని బోర్డులు తగిలించారు. మున్సిపాలిటీ వాళ్లు ‘పండ్ల తొక్కలు’ పారవేయటానికి కొత్తవి, ప్రత్యేకమైనవి ‘డస్ట్బిన్’ అమర్చారు. వీటి వలన వెలువడే వ్యర్థపదార్థాలు, విష వాయువులను నియంత్రించటానికి ఒక సాంకేతిక సంస్థని స్థాపించారు. ఇందులో డాక్టర్లు కూడా ఉన్నారు. మానవహక్కుల పరిరక్షణ సంఘం... సంపన్నులు పుణ్యం పేరుతో యాచకులకు పండ్లు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. పిల్లలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపకం సముచితం కాదని నొక్కి వక్కాణించారు. దేవాలయాల్లో అర్చకులు భక్తులకి గాని, దేవుడికి గాని పండ్లని కానుకగా సమర్పించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. పురోహితుల సంఘం ప్రజాహితం కోసం పండ్లకి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువుల కోసం అన్వేషణ చేస్తోంది. గుళ్లలో పండ్ల రసాలతో అభిషేకాన్ని నిర్వహించటం నిలిపివేశారు. శిశుసంఘాలు, మహిళా సంఘాలు ఆడవారిని పండ్లతో పోల్చటాన్ని తీవ్రంగా అభ్యంతరం వెళ్లబుచ్చారు. అలాగే గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించేటప్పుడు ‘పండంటి పిల్లల్ని కనమ్మ’ అనటం సముచితం కాదన్నారు. చంటిపిల్లల్ని దబ్బపండుతో, పనసపండుతో పోల్చటం వారిని అవమానించటమేనని బాలల హక్కుల సంఘం అభిప్రాయపడింది. శరీర సౌందర్యం పరిరక్షణ / సంరక్షణ విషయంలో పండ్లని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఘన రూపంగా గాని, ద్రవ రూపంగా గాని వాడరాదని నిపుణులు తెలియజేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పండ్లు పండించే భూములు మీద భూమి శిస్తుని పదిరెట్లు పెంచారు. లారీలు, ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు యజమానులు చార్జీలు రెట్టింపు చేశారు. రైల్వే సరకు రవాణా చార్జీలు రేట్లు పెంచారు. విమాన సర్వీసులు అదనంగా సుంకం చెల్లించమంటున్నారు, టోల్ గేటు రేట్లు రెండింతలు చేశారు. ఇటువంటి పండ్లు పండించే వారికి శిక్షగా ఆ పండ్లే వారిచేత తినిపించాలని న్యాయవాదుల సంఘం అభిప్రాయపడింది. ఇదంతా స్వయంగా చూసిన నారదులవారు వెంటనే విష్ణుమూర్తిని కలిసి వేడుకున్నారు. అంతా ఆలకించిన తర్వాత లోకకల్యాణం కోసం సహజంగా పండిన పండు వాడాలని అలా కాని పక్షంలో ఇక నుంచి నోముల, వ్రతాలు, శుభ అశుభ కార్యాల్లో, దానాల్లో, ధర్మాల్లో, గుళ్లల్లో, సత్కారాల్లో పండ్ల పందేరం మానవచ్చని చెప్పారు. ప్రత్యామ్నాయంగా... ఆకులతో/గడ్డితో సరిపడవచ్చని కూడా సెలవిచ్చారు. భీమశంకరానికి మెలకువ వచ్చింది. ఉదయం 6 గంటలు అయింది. ఇదంతా నిజమని భయపడ్డాడు భీమశంకరం. ఇంతలో భీమశంకరం ముద్దుల చెల్లెలు పండరీ ప్రత్యక్షం అయింది. ‘‘పండూ ఎప్పుడు వచ్చావమ్మా’’... ‘‘ఇప్పుడే వచ్చానన్నయ్యా...ఈ రోజు 16 పండ్ల నోము చేసెయ్యమన్నారు. రేపే అమెరికా ప్రయాణం... 16 రకాల పండ్లు రకానికి 16 చొప్పున తెచ్చాను. వేరే గుమ్మం ఎక్కక్కర్లేదు. మన ఇంట్లోనే నోము. నేను తప్ప మీ అందరు ఎంచక్కా తినవచ్చు’’ అని గలగల చెప్పి లోపలికి వెళ్లింది. భీమశంకరం నోట్లో ‘పచ్చి వెలక్కాయ’ నిజంగానే పడింది. - కే.సీహెచ్.ఏ.వీ.ఎస్.ఎన్. మూర్తి -
ఉచితంగా రూ.5 లక్షల బీమా
{yైవర్లు, జర్నలిస్టులు, హోంగార్డులకు సౌకర్యం: నాయిని ఈ నెల 22 నుంచే అందుబాటులోకి.. హైదరాబాద్: రూపాయి ఖర్చు లేకుండా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ప్రీమియం కల్పిస్తున్నట్లు హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. సామాజిక భద్రతలో భాగంగా డ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డులు తదితరులు మొత్తం దాదాపు 10 లక్షల మందికి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయం ఈ నెల 22 నుంచే అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక దినోత్సవం ‘మేడే’ రోజున సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ప్రీమియం లేకుండా ఉచితంగా ఆరోగ్య, ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల డబ్బు ఖర్చు లేకుండా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు రూ. 5 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. పథకం అమలుకు కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్శాఖ సెక్రటరీ, హోంగార్డ్స్ ఐజీ, సమాచార డెరైక్టర్తో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పథకానికి నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని నాయిని తెలిపారు. ఈ పథకంపై త్వరలోనే సామాజిక భద్రత పేరుతో జిల్లాల వారీగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిప్రీత్సింగ్, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, హోంగార్డ్స్ ఐటీ బాలనాగదేవి, సమాచార పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ సుభాష్ పాల్గొన్నారు. -
సార్వత్రిక ఆరోగ్య బీమాపథకం
ఆగస్ట్ 15న ప్రకటించనున్న ప్రధాని! ముంబై: కుటుంబ మంతటికీ ఆరోగ్య బీమా కల్పించే ఒక సార్వత్రిక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రకటించనున్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫు సబ్సీడీ ఏమీ ఉండకపోయినా, అతి తక్కువ ప్రీమియంతో ఈ బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపాదిత బీమా పథకం, అనువైన ప్రీమియం మొత్తం.. తదితర అంశాలపై చివరిదశ కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వ రంగ బీమా సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించే అవకాశముందన్నారు. జీవితబీమా రంగంలో లేని నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పలు ప్రైవేటు బీమా సంస్థలు ఈ పథకం రూపకల్పనతో ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నాయని సమాచారం. ఐదుగురికి మించని సభ్యులున్న అన్ని కుటుంబాలకు, ఒకే బీమా మొత్తంతో ఈ ఆరోగ్య బీమా పథకం అందుబాటులోకి రానుంది. ఒక కుటుంబానికి రూ. 50 వేల కవరేజ్తో, ఫ్లోటర్ విధానంలో ఇది అమల్లోకి రానుందని, కుటుంబంలో వయస్సులో పెద్దవాడైన లబ్ధిదారుడి వయస్సు 60 ఏళ్ల లోపుంటే బీమా కవరేజ్ రూ. లక్షగా ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు. పథకం రాగానే, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన రద్దు కానుందని సమాచారం. ఈ పథకం కింద ముందస్తు రుసుములు చెల్లించకుండా వైద్య సేవలు పొందే ‘క్యాష్లెస్’ సౌకర్యాన్ని అందిస్తున్నారు. -
ఆరోగ్య బీమా అందరికీ అవసరం
ఆరోగ్య పరిరక్షణలో సరైన పోషకాహారం, తగిన వ్యాయామాలది కీలక పాత్ర. అయితే జీవన లక్ష్యాలను చేరుకునే వేగంలో ఎక్కువ మంది వీటిని పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆయా అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకున్నా... కుటుంబంలోని సభ్యులు మొత్తం ఇదే జాగ్రత్తలు తీసుకోని పరిస్థితీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఆరోగ్యానికి సంబంధించి అనుకోని ఇబ్బందులూ తలెత్తుతుండే విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రతి చిన్న వ్యాధికీ చేయాల్సిన వ్యయం- జేబుకు ఎంత పెద్ద చిల్లు పెడుతోందో వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని ఆరోగ్య వ్యయ భారాల నుంచి రక్షించుకోడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఎంతో అవసరం. పలు రకాలు... ప్రాథమిక స్థాయి నుంచి అపరిమిత ప్రయోజనాలు అందించే స్థాయి వరకూ వివిధ ఆరోగ్య బీమా ప్రొడక్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలో చేరడానికి ముందు-తరువాత వ్యయాలు, పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధికి సంబంధించి తదుపరి కవర్కు వేచి ఉండాల్సిన కాలపరిమతి, పాలసీ కాలంలో ఎటువంటి క్లెయిమ్లూ చేయకపోతే, తదుపరి లభించే బోనస్లు (నో క్లెయిమ్ బోనస్) ఇలా పలు ప్రయోజనాలు ‘బేసిక్ హెల్త్ కవర్’ పాలసీల్లోనే అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటే కొంత అదనపు ప్రీమియం చెల్లింపుల ద్వారా ‘క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్’ను రైడర్గా ఎంచుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. రైడర్గా కాకుండా ‘క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్’ను ప్రత్యేకంగా కూడా తీసుకోవచ్చు. కేన్సర్, గుండెపోటు, కిడ్నీ వైఫల్యం, ఇతర ప్రధాన అవయవాలు పనిచేయకపోవడం వంటి తీవ్ర వ్యాధుల చికిత్సలకు వ్యయ భారం నుంచి సామాన్యుడికి ఆర్థిక రక్షణ, భరోసాను కల్పించేదే ఈ క్రిటికల్ ఇల్నెస్ ప్రణాళిక. నిర్దిష్ట వ్యాధి అవసరానికి తగిన ఆరోగ్య పాలసీలు (కస్టమైజ్డ్) అందుబాటులో ఉండవన్న విషయం ఇక్కడ గమనించాలి. నిర్దిష్ట జాబితాలో ఉన్న వ్యాధులకు ‘పాలసీ కవర్’నే మనం ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వ్యయాలను బీమా సంస్థలే భరించే పాలసీలు కొన్ని ఉంటే, వ్యయం మొత్తంలో కొంత మొత్తం పాలసీదారు, మరికొంత బీమా సంస్థ భరించే ప్రొడక్టులూ ఉంటాయి. కొన్ని పాలసీల ప్రీమియం అంశాల్లో పన్ను ప్రయోజనాలతో పాటు, వయస్సును బట్టి ప్రీమియం సౌలభ్యతలు సైతం లభిస్తాయి. ఎంపిక కీలకం తగిన ఆరోగ్య బీమా ప్రొడక్ట్ను ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం. కవరేజ్ ఎంత? తీసుకున్న కవరేజ్లో హాస్పిటల్ వ్యయాలకు లభించేది ఎంత? ఫీజులు, మందులకు లభించే ప్రయోజనం,ఆపరేషన్ కవరేజ్,నో క్లెయిమ్ బోనస్ అం శాలను ముందు పరిశీలించాలి. తక్కువ ప్రీమియం, అధిక బీమా కవరేజ్ ఉన్న పాలసీ ఎంచుకోవాలి. -
ఆరోగ్య బీమాకే హైదరాబాదీల ఓటు: సర్వే
హైదరాబాద్: ఆరోగ్య బీమాకు సంబంధించి పరిణితి చెందిన నాన్-మెట్రో నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఎదుగుతోంది. జీవిత బీమా కన్నా ఆరోగ్య బీమానే మరింత ముఖ్యమని అత్యధిక శాతం మంది హైదరాబాదీలు భావిస్తున్నారు. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన పల్స్ 2015 సర్వేలో 75 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఎదురయ్యే వైద్య వ్యయాలను తట్టుకునేందుకు హైదరాబాద్లో 96 శాతం మంది ఆరోగ్య బీమాపై ఆధారపడినట్లు సర్వేలో వెల్లడైంది. ఇక్కడ సగటున బీమా మొత్తం రూ. 8 లక్షల స్థాయిలో ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, తదితర నగరాల్లో 1,500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.