Andhra pradesh new capital
-
రాయలసీమకు వచ్చి అనే దమ్ముందా?
సాక్షి, వైఎస్సార్ కడప: మూడు రాజధానుల అంశంపై చంద్రబాబు 48 గంటలు డెడ్లైన్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ఆయన ప్రెస్మీట్లు కామెడీ షోలా తయారయ్యాయని, అలాంటి వాటిని ఎల్లో మీడియా హైలెట్ చేసి చూపిస్తున్నాయన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణించినప్పుడు జగన్మోహన్రెడ్డి రాజీనామా చేసి ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జగన్ మాదిరిగా చంద్రబాబు కూడా రాజీనామా చేసి ముందుకు రావాలని సవాలు చేశారు. (రాజధానులపై చంద్రబాబు డ్రామా) అమరావతి రైతుల క్షేమం కోసం శ్రీశైలం ప్రజల త్యాగం రాజధాని గురించి ఎన్నికల ముందు చెప్పలేదని బాబు అంటున్నారని కానీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. అయినా చంద్రబాబుకు రాయలసీమ వచ్చి మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చి హైకోర్టును వద్దని చెప్పగలుగుతారా? అని నిలదీశారు. బినామీలు కాపాడుకునేందుకు అమరావతి అంటూ డ్రామాలు ఆడుతున్నారని బాబును విమర్శించారు. ఇకనైనా రాయలసీమ టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రజలు బాగున్నారు అంటే అది శ్రీశైలం పరిసర ప్రాంతాల ప్రజల త్యాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమలోని సెంటిమెంట్ మీకు గుర్తుకు రాదా? అని ప్రశ్నించారు. బాబుకు మంచి చేయాలన్న ఆలోచనే రాదు ఇలానే చంద్రబాబు డ్రామాలు అడితే రాబోయే రోజుల్లో హైదరాబాద్కు వచ్చి మరీ ప్రజలు ఆయన ఇంటిని చుట్టముడతారని హెచ్చరించారు. బాబుకు సిగ్గు, శరం ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. ప్రజలు బాబును నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. కేవలం గ్రాఫిక్స్ తో రాజధాని నిర్మాణం చేసిన ఆయనకు మంచి చేయాలన్న ఆలోచన ఎప్పుడూ రాదని ఎద్దేవా చేశారు. ఇది "రాజన్న రాజ్యం - రైతు రాజ్యం" అని, ఏ రైతు కంట కన్నీరు రానివ్వమని భరోసా ఇచ్చారు. అమరావతి రైతుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని శ్రీకాంత్రెడ్డి మరోసారి గుర్తు చేశారు. (చంద్రబాబుకు మతి తప్పింది) -
ఇదే సీఎం జగన్ లక్ష్యం: అమర్నాథ్
సాక్షి, విజయవాడ: పాలనా వికేంద్రికరణ బిల్లుపై గవర్నర్ నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రాజధానుల బిల్లు అమోదాన్ని అందరం స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు. ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నది సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. సీఎం జగన్ ముందు చూపు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. (చదవండి: వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం) విశాఖపట్నంలో అన్ని రకాల వనరులున్నాయని, ఉన్నతమైన రాజధానిగా విశాఖ అవతరించ బోతుందన్నారు. దురాలోచనలతో చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అడ్డుతగులుతున్నారని, రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు ఆయన కోల్పోయారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు ఆలోచన చేస్తే.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. -
దీనిని మేమంతా స్వాగతిస్తున్నాం: మంత్రి
సాక్షి, అనంతపురం: పరిపాలన వికేంద్రీకరణకు గవర్నర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ చట్టం రద్దును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని, ఇందుకు మూడు రాజధానులు ఆయన లక్ష్యం అన్నారు. అదే విభజన గాయాలు మానాలంటే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ తథ్యమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి డ్రామాలు ఆడారని, అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని మంత్రి ధ్వజమెత్తారు. రైతుల కడుపు కొట్టి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. సీఎంజగన్ వల్లే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమోందని, రాయలసీమలో హైకోర్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. నిపుణుల నివేదిక మేరకే మూడు రాజధానుల నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..) పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దును గవర్నర్ ఆమోదించడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శుభ సూచకమని ఆనందం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికై కర్నూలును న్యాయ రాజధానిగా గుర్తించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. రాయలసీమ వాసుల తరుపున సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్సార్ కలలుకన్న రాయలసీమ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను పూర్తిచేసి తీరుతామన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అవినీతితో అమరావతిని నిర్మించాలన్న కలలు కల్లలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ: పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దుకు శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలపడాన్ని ఆమె స్వాగతిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్లో ఉండడం వల్ల ఎంతగానో నష్టపోయామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటులో ఉన్నాయని, మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతోనే మూడు రాజధానులను సీఎం జగన్ తీసుకొచ్చినట్ల ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని, ఏపీలో మూడు రాజధానులు ఎంతో అవసరమన్నారు. శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందకుండా చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన గవర్నర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చారిత్రక అవసరమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
మూడు రాజధానులను సందర్శిస్తా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగతిస్తూ గొప్ప పరిణామంగా కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఆ మూడు నగరాలు సంక్షేమ సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు నగరాలను సందర్శించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరాళ నృత్యం తగ్గిన తర్వాత తప్పకుండా వీటిని సందర్శించేందుకు ఏపీకి వస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూడు రాజధానుల బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) (వైజాగ్ని చాలా మిస్ అవుతున్నా..) -
ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్కు లేఖ రాయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు సోమవారం తన ట్విటర్ ఖాతాలో.. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైందని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్కు లేఖ రాశారని విమర్శించారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (వ్యవస్థలను నాశనం చేయడం మీకు కొత్త కాదుగా!) చదవండి: (ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు..) -
‘ఆయనకు వచ్చిన ముప్పేంటట’
సాక్షి, గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణకు బహుజన పరిరక్షణ సమితి మద్దతు తెలిపింది. ఈమేరకు బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దళిత, మహిళా, ప్రజాసంఘాలు రాజధాని ప్రాంతం మందడంలో సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. అభివృద్ధి వికంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు మేలు చేయాలని సీఎం వైఎస్ జగన్ యత్నిస్తున్నారని తెలిపారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ నందిగం సురేష్కు టీడీపీ నేతల నుంచి ముప్పు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో చంద్రబాబుకు వచ్చిన ముప్పేంటని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు పిచ్చి వేషాలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పేదలపై చంద్రబాబుకు ప్రేమ లేదని అన్నారు. -
‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’
-
‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకే అమరావతిపై తను ప్రకటన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ సైతం వేసవి రాజధాని ప్రకటించారని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ సీఎం ప్రకటనతో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని మరోసారి తేలిపోయిందన్నారు. సీఆర్డీఏ చట్టం ద్వారా రైతుల భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను మభ్యపెట్టవద్దని హితవు పలికారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని పనులను కేంద్ర ప్రభుత్వం చేయదని చెప్పారు. పీపీఏల రద్దు అంశంలో కూడా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉండాలని మాత్రమే గోయల్ సూచించారని తెలిపారు. ఒక చానల్ తనపై తప్పుడు వార్తలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ కట్టుకథలు అల్లితే సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అమరావతిపై జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తను మాట్లాడుతున్నట్టు చెప్పారు. -
‘ఆ ఖర్చుతో రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు’
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం గత అయిదేళ్ల పాలనలో జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయిదేళ్లలో వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందన్నారు.రూ. 90 వేల కోట్ల అప్పుతో ప్రారంభమైన రాష్ట్రం.. మూడు లక్షల కోట్ల అప్పుకు చేరుకుందన్నారు. దోచి పెట్టడానికే గత ప్రభుత్వంలో కేబినెట్ సమావేశాలు జరిగేవని, టీడీపీ హయాంలో రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని అన్నారు. సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకే వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారని, అధికారం చేపట్టిన రోజు నుంచే సీఎం జగన్ ప్రజల కోసం పనిచేయడం మొదలు పెట్టాడని ప్రశంసించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది ప్రజా సంక్షేమానికి టీడీపీ అడ్డుపడుతోందని, చంద్రబాబు ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అయినా ప్రవేశ పెట్టారా అని ప్రశ్నించారు. అవినీతితో రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులుతోనే అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడటం తగ్గించడం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం తీసుకొచ్చారన్నారు. రాజదానికి లక్ష కోట్లు పైనే ఖర్చు అవుతుందని సీఎం జగన్కు ముందే తెలిస్తే ఎన్నికలప్పుడే తాను అంత ఖర్చు చేయాలేనని చెప్పేవారని పేర్కొన్నారు. రాజధాని ఇక్కడ కట్టలేనని తెలిసే చంద్రబాబు ఇల్లు అమరావతిలో కట్టుకోలేదని, అమరావతితో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. అమరావతి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. వైజాగ్ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని, అందుకే అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణరెడ్డి తెలిపారు. రాజధాని మొత్తం అమరావతి నుంచి తొలగించడం లేదని, ఒక భాగాన్ని వైజాగ్ కు, మరొక భాగాన్ని రాయలసీమకు తీసుకుని వెళ్తున్నారని గుర్తు చేశారు. అమరావతి సౌకర్య వంతమైన నివాస యోగ్యం కాదని, అందుకే ఉద్యోగులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోలేదని అన్నారు. అమరావతికి అప్పు చేసి ఖర్చు చేసే ధనంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చని పేర్కొన్నారు. రాజధానిలో ఉన్న రెండు నియోజకవర్గాల ప్రజలు చంద్రబాబును నమ్మలేదని, అందుకే అక్కడ బాబు కుమారుడుని ఓడించారని అన్నారు. సీఎం జగన్ రాజదానిని తన ఊరు తీసుకుపోవడం లేదని, మూడు రాజధానులు వ్యతిరేకించిన వారే ఒక ఏడాది తరువాత స్వాగతిస్తారని అభిప్రాయపడ్డారు. రాజదానిపై చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలు వారిగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి మూడు రాజధానుల ఉపయోగాన్ని వివరించాలని సూచించారు. -
అందుకే బాబు డ్రామాలాడుతున్నారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రజలు నాయకులు మీద ఆధార పడకూడదనే గ్రామ సచివాలయం వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పేదలు అమరావతిలో ఒక గజం స్థలం కొనగలిగే అవకాశం ఉందా అని, రాజధానిలో ఉద్యోగులు కూడా ఇల్లు కట్టుకొనేందుకు ఇష్టపడలేదన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారుని, రాజధాని నూజివీడులో పెడుతున్నామని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాజధానికి ప్రభుత్వ స్థలం ఉండాలని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారన్నారు. అమరావతిలో ప్రభుత్వ స్థలం అయితే ఉద్యోగులు, పేదలకు ఇళ్ల స్థలాలు నామమాత్రపు ధరకు ఇవ్వొచ్చున్న ఉద్దేశంతో ఆయన అసెంబ్లీలో చెప్పారని ఆయన వెల్లడించారు. 'అందుకే వికేంద్రీకరణ దిశగా అడుగులు' ఇక చంద్రబాబు చేబుతున్నట్లు పూర్తిగా రాజదానిని తరలించడం లేదని, ఒక భాగాన్ని మాత్రమే వైజాగ్ తీసుకెళ్తున్నామని సజ్జల వివరించారు. రాజధాని ప్రజలే చంద్రబాబును నమ్మలేదని, అందుకే లోకేష్ను చిత్తుగా ఓడించారని విమర్శించారు. హైదరాబాద్తో పోటీ పడగలిగే రాజధానిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చూస్తున్నట్లు తెలిపారు. కాగా అమరావతిలో జరిగిన కుంభకోణంలో విచారణ జరుగుతుందని, రాజధాని ప్రాంత రైతులను సీఎం జగన్ ఆదుకుంటారన్నారన్నారు. అభివృద్ధి అంత హైదరాబాద్లో కేంద్రీకృతం కావడం వలనే రాష్ట్రం విడిపోయిందని, మళ్ళీ ఏర్పాటు వాద ఉద్యమాలు రాకూడదనే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాజధానిలో కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని, ఆయన మోసాన్ని ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వివరించాలన్నారు. కాగా అమరావతి నిర్మించాలంటే లక్షల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని, అప్పుల్లో ఉన్న మనం ఇప్పుడు లక్షల కోట్లు అప్పు తెచ్చి నిర్మించగలమా అని పేర్కొన్నారు. శివరామకృష్ణన్, శ్రీ కృష్ణ, జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు కూడా అభివృద్ధి వికేంద్రికరణ చేయాలని సూచించాయని తెలిపారు. అమరావతిలో దళిత ఎంపీ కళ్ళలో కారం కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. దళిత ఎంపీపై దాడి చేయడం ఇది రెండవసారని ఆయన పేర్కొన్నారు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నరకాసురుడు పాలన చేసాడు కాబట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఏద్దేవా చేశారు. ప్రజలు బుద్ది చెప్పినా ఇంకా చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదు రామకృష్ణ విమర్శించారు. -
చంద్రజ్యోతి బోగస్ వార్త రాసింది
-
ఏం బతుకులు మీవి..?: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ఎల్లోమీడియాలో వస్తోన్న వార్తలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 'విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు' అంటూ ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. కాగా మరో ట్వీట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్న వారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసే దాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేరని, పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమవుతున్న వారు తమ భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారంటూ' విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చదవండి: ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..? ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ 'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట' -
మరోసారి బట్టబయలైన పచ్చ మీడియా బండారం
-
మరోసారి బట్టబయలైన పచ్చ మీడియా బండారం
సాక్షి, అమరావతి : అధికార వికేంద్రీకరణపై పచ్చ మీడియా బండారం మరోసారి బట్టబయలైంది. నేవీ పేరును ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాన్ని.. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. మిలీనియం టవర్స్లో సచివాలయం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని నేవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పీఐబీ రక్షణ విభాగం పత్రికా ప్రకటన విడుదల చేసింది. దృష్టి మరల్చే యత్నం.. తప్పుడు కథనాల ప్రచారం కోసం ఎల్లో మీడియా నేవీని సైతం వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలను ప్రసారం చేసింది. అంతేకాకుండా మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయవద్దంటూ ఏపీ ప్రభుత్వానికి నేవీ లేఖ రాసినట్లు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేసింది. ఈఎస్ఐ కుంభకోణం, అమరావతి భూముల అక్రమాలపై సిట్ విచారణ నేపథ్యంలో.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా ఎత్తుగడ వేసింది. మిలీనియం టవర్స్కి ఐఎన్ఎస్ కళింగ ప్రాంతం దగ్గరగా ఉన్నందునే నేవీ అడ్డు చెప్పిందంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. ఎల్లో మీడియా తప్పుడు వార్తలను తూర్పు నావికాదళం తీవ్రంగా ఖండించింది. తప్పుడు కథనాలపై కేంద్ర రక్షణశాఖ దృష్టికి తీసుకెళ్తామని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
ప్రతిపక్షం విమర్శలు అర్థరహితం
-
అప్పుడే విశాఖ రాజధాని
అత్యధిక మంది తెలుగు మాట్లాడే జిల్లాలతో కూడిన ప్రత్యేక ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడాలనే భాషాపరమైన సెంటిమెంటును ఇరవయ్యవ శతాబ్ది రెండవ దశాబ్ది ఆరంభం నుండి వ్యాప్తిగావించడంతో బాటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవాలని తీవ్రంగా ఉడుంపట్టుబట్టిన వారిలో ‘ఉత్తర సర్కారు’ జిల్లాల నాయకులు ముఖ్యులు. వారి కోరిక, ఒత్తిడుల కారణంగా 1953 నాటి కేంద్రప్రభుత్వం అక్టోబర్ ఒకటవ తేదీ 1953న ‘ఆంధ్రరాష్ట్రం’ను ఏర్పరచింది. దీని కొనసాగింపుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలోని తెలుగు జిల్లాల ఎమ్మెల్యేలు (140 మంది) మూజువాణి ఓటుతో కర్నూలును రాజధానిగా (1937 శ్రీబాగ్ ప్రకారం) నిర్ణయించడం జరిగింది. గుంటూరులో హైకోర్టు పెట్టారు. ఆనాటికి ఆంధ్రరాష్ట్రంలో, ముఖ్యంగా నాలుగు మధ్య ఆంధ్ర జిల్లాల్లో, మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని పార్టీల నాయకుల్లో, మరింత ప్రధానంగా ఆ జిల్లాల కాంగ్రెస్ (43 మంది శాసనసభ్యులు), కమ్యూనిస్ట్ (20 మంది శాసనసభ్యులు) నాయకుల్లో ఒకవైపు విజయవాడ–గుంటూర్లను ఆంధ్రరాష్ట్ర రాజధానిగా ఏర్పరచుకోవాలనే ఆకాంక్ష, ఆలోచన; మరోవైపు ఉమ్మడి ఏపీని, దాని రాజధానిగా హైదరాబాద్ను ఏర్పరచుకోవాలనే ఆలోచన ఉండేది. కానీ, అప్పటి ‘హైదరాబాద్ స్టేట్’లోని తెలంగాణ వారిలో మాత్రం ఉమ్మడి ఏపీ ఏర్పాటు, దానికి రాజధానిగా హైదరాబాద్ ఉండడం వంటి ఆలోచనలు 1953 నాటికి ఉండేవి కాదు. అయినప్పటికీ, సర్కారు జిల్లాల నాయకులు, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు కర్నూలు నుండి రాజధానిని మార్చాలని ఆంధ్ర రాష్ట్రం, రాజధాని కర్నూలు పుట్టిన రెండు నెలలలోపే తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఆలస్యం చేస్తే ఎలాంటి మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయో అన్నట్లు నాటి కర్నూలులోని శాసనసభ పలు దఫాలుగా, ‘ఆంధ్రరాష్ట్ర రాజధాని విషయంగా’ చర్చలు జరిపి, నవంబర్ ముప్పయ్ 1953న కర్నూలు రాజధాని మార్పు గురించి తీర్మానం చేసింది. అందులో, ఏప్రిల్ ఒకటవ తేదీ 1956 వరకు మాత్రమే కర్నూలులో రాజధానిని ఉంచాలని, ఆ తరువాత విశాఖపట్టణాన్ని శాశ్వత రాజధాని చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 61 ఓట్లు, ప్రతికూలంగా 58 ఓట్లు రాగా, తటస్థులుగా 20 మంది (కమ్యూనిస్టులు) ఉన్నారు. ఉమ్మడి ఏపీ, దాని రాజధానిగా హైదరాబాదు ఏర్పాటు జరుగుతాయోలేదో తెలియకముందే మూడేళ్ల ముందే కర్నూలు రాజధానిని మార్చడంపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా, రాజధానిపై, 1953లో మద్రాసులో ఒకసారి, కర్నూలులో మరోసారి అసెంబ్లీ చర్చించడం, ఒకసారి కర్నూలును, మరోసారి విశాఖను రాజధానిగా నిర్ణయించడానికి కారణం పంతొమ్మిదవ శతాబ్దిలో గోదావరి, కృష్ణా నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యాక అక్కడి నాలుగు జిల్లాల్లో మెరుగైన ఆర్థిక, సాంఘిక మార్పులు జరగడం వలన ఆంధ్రరాష్ట్రం ఏర్పరచుకోవాలని కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు భావించడం, విజయవాడ, గుంటూర్లలో రాజధానిని ఏర్పరచుకొని ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించాలనే బలమైన కోరిక వారిలో ఉండడమే. కానీ విజయవాడ, గుంటూరులు రాజధానిగా ఎన్నుకోకపోవడంతో ఆ జిల్లాల వారు ఉమ్మడి ఏపీ ఏర్పాటుపై కేంద్రీకరించి, తమకు అనుకూలంగా ఉన్న హైదరాబాద్ను రాజధానిగా చేసుకోవడం జరిగింది. అంటే, 1937 నాటి శ్రీబాగ్ ప్రకారం పొందిన కర్నూలు రాజధాని, లేదా, ఒక ప్రభుత్వపాలనా విభాగాన్ని తిరిగి పొందాలని, నవంబర్ ముప్పయ్ 1953న అసెంబ్లీ తీర్మానం ప్రకారం, విశాఖ పొందిన శాశ్వత రాజధానిని తిరిగి పొందాలని, అదే నవంబర్ ముప్పయ్ 1953న వస్తుందనుకొన్న రాజధానిని తిరిగి విజయవాడ, గుంటూర్లకు రావాలని మూడు ప్రాంతీయుల్లోనూ ఆకాంక్ష ఉంది. ఈ ఆకాంక్షలన్నీ తీర్చడానికే నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమరావతిలో లెజిస్లేచర్ విభాగాన్ని, విశాఖలో ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని, కర్నూలులో జ్యుడీషియల్ విభాగాన్ని ఏర్పరచడానికి అసెంబ్లీలో నిర్ణయించడం జరిగింది. ఇలా చేస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా ఊతం ఇస్తాయని ఆయన భావించడం జరిగింది. డా‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్రశాఖ, ఎస్వీ యూనివర్సిటీ -
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు, లోకేష్ ఇచ్చే ప్యాకేజీలకు పవన్ లొంగిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నారని, పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనను ఆళ్ల తప్పుపట్టారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్కు ఉన్న పరిజ్ఞానం కూడా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: ‘ఆయన వేషం మార్చి నటుడయ్యారు..!’ గత ఐదేళ్లు పవన్ చంద్రబాబుతో లోపాయికారిగా స్నేహం చేసి, ఆయన ఇచ్చిన ప్యాకేజీలు తీసుకున్నారు. రైతులకు చంద్రబాబు మోసం చేసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించలేదు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా పవన్ చంద్రబాబును ప్రశ్నించలేదు. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. గత ఐదేళ్లు చంద్రబాబు ప్యాకేజీలకు లొంగి.. ఈ రోజు రాజధాని ప్రాంతానికి వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోకుండా వారిని రెచ్చగొట్టడం ఎంతవరకు వరకు సమంజసం. మేం రాజధాని ప్రాంత రైతులం. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి రిజర్వ్ జోన్లను తొలగించాలని కోరాం. సమస్య ఏంటో తెలుసుకోకుండా పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అసలు రాజధాని అమరావతి నుంచి తరలించడం లేదు. ఇక్కడే శాసన సభ ఉంటుంది. అధికార వికేంద్రీకరణ కావాలి. ఎగ్జిక్యూటీవ్ రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును చేయబోతున్నాం. చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. రాజధాని రైతులకు సీఎం న్యాయం చేస్తుంటే రైతులను రెచ్చగొట్టడం సరికాదు. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలో ఉంటుందని తెలిసి కూడా రైతులను రెచ్చగొట్టడం సరికాదు. చంద్రబాబు ఏం చెబితే.. అదే పవన్ మాట్లాడుతున్నారు. పవన్కు లోక పరిజ్ఞానం లేదు. ఇది తప్పు అయితే చంద్రబాబు, లోకేష్ ఇస్తున్న ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి..రైతులు, రైతు కూలీలు, పేదలు ఎంత మంది ఉన్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సీఎం వైఎస్ జగన్ అడగకుండానే రైతులకు కౌలు 15 ఏళ్లు పెంచారు. కూలీలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పరిహారం పెంచారు. సీఎం నిర్ణయానికి హర్షించాల్సింది పోయి చంద్రబాబు, లోకేష్లు చెప్పినట్లు పవన్ మాట్లాడటం సరికాదు. చదవండి: నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు సుమారు 4500 ఎకరాల భూములు బినామీల పేరుతో, తెల్ల రేషన్కార్డు దారులతో కొనుగోలు చేయించారు. ఇవాళ కేసులు కూడా నమోదు అయ్యాయి. వీటిపై పవన్ నోరు మెదపడం లేదు. దళితుల భూములను చంద్రబాబు కాజేస్తే..ఆ భూములు తిరిగి దళితులకు సీఎం వైఎస్ జగన్ ఇప్పించారు. ఈ విషయాలపై పవన్ మాట్లాడటం లేదు. చంద్రబాబు, లోకేష్ చెప్పిన మాటలు వళ్లెవేయడంలో పవన్ ఉన్నారు. చంద్రబాబు బినామీ కంపెనీలతో వేల కోట్లు డబ్బులు దోచేశాడు. దీనిపై పవన్ మాట్లాడటం లేదు. తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేసి దోచుకున్నా మాట్లాడటం లేదు. రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకపోయినా పవన్ ప్రశ్నించడం లేదు. ఇన్ని బొక్కలు పెట్టుకొని ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని ప్రశ్నిస్తానని పవన్ అంటున్నారు. ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలిపారు. పవన్ ఎందుకు ఈ విషయాలపై మాట్లాడటం లేదు. పవన్ రైతులను, జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారు. రాజధాని పర్యటనకు తన పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు పిలువలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చదవండి: రేణుదేశాయ్ ఇబ్బందులు అందరికీ తెలుసు -
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
-
రాజమండ్రిలో వికేంద్రీకరణకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష
-
ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మండలి కార్యాలయం తోసిపుచ్చింది. సెలెక్ట్ కమిటీని నియమించాలని చైర్మన్ ఎంఏ షరీఫ్ పంపిన ఫైలును లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య వెనక్కు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 154వ నిబంధన కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఆయన ఫైలుపై రాసి పంపినట్లు సమాచారం. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, నాగ జగదీష్, అశోక్బాబు లెజిస్లేచర్ కార్యదర్శిని కలిసి సెలెక్ట్ కమిటీకి నోటిఫికేషన్ను జారీ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. చైర్మన్ ఆదేశాలను పాటించాల్సిందేనని మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు కూడా కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఉంది కనుకే కమిటీ నియామకం సాధ్యం కాదని కార్యదర్శి వారికి వివరించినట్లు తెలిసింది. ఉమ్మారెడ్డి అభ్యంతరం సెలెక్ట్ కమిటీ నియామకానికి తన నిర్ణయానుసారం నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా చైర్మన్ షరీఫ్ లెజిస్లేచర్ కార్యదర్శికి ఆదేశాలివ్వడాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సెలెక్ట్ కమిటీ సభ్యులను వారి అనుమతి లేకుండానే షరీఫ్ ప్రకటించడం పట్ల కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉన్నాయని, వాటిని పాటించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను నియమించరాదని కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. అందులో ఆయన నిబంధనలను ఉటంకిస్తూ.. సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయంపై మండలిలో ఓటింగ్ తీసుకోలేదని, సభ్యులను నియమించేటప్పుడు వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, వారు అంగీకరిస్తేనే ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. సెలెక్ట్ కమిటీలో ఉండటానికి సంబంధిత సభ్యులు సమ్మతిని తెలపడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం ఇవ్వాలని తేల్చిచెప్పారు. ఇదే విధంగా అభ్యంతరం తెలుపుతూ మండలి సభా నాయకుడైన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా లేఖ రాశారు. మండలి తనకు అధికారం ఇచ్చింది కాబట్టి సెలెక్ట్ కమిటీ వేస్తానంటే కుదరదని, దానికి సాంకేతికంగా ఓటింగ్ జరిగి ఆమోద ముద్ర పడాలని పేర్కొన్నారు. కాగా.. సెలెక్ట్ కమిటీ, మరో కమిటీలో సభ్యులుగా ఉండటానికి నిరాకరిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వెన్నపూస గోపాల్రెడ్డి, మహ్మద్ ఇక్బాల్లు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కార్యదర్శి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఫైలును వెనక్కి పంపారని సమాచారం. మండలి చైర్మన్ నిర్ణయంతో వివాదం పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. (చదవండి: మూడు రాజధానులతోనే మేలు) -
‘వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’
సాక్షి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా విశాఖను ప్రతిఒక్కరు స్వాగతించాలని సీనియర్ జర్నలిస్టురమణమూర్తి ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. పరిపాలన రాజధాని ఏర్పాటును బలపరచడంతో పాటు త్వరితగతిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను ఏర్పాటు చేయాలని విశాఖ ఆంధ్రయూనివర్శిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు ప్రొఫెసర్లు డాక్టరు ప్రేమానందం, డాక్టర్ సరున్ రాజు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి. కాంతరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు రమణమూర్తి మాట్లాడుతూ.. పరిపాలన రాజధాని ఏర్పాటుతో విశాఖకు, ఉత్తరాంధ్రకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. కాగా అమరావతి రైతులు చేసిన త్యాగమేమిటో ప్రజలకి చెప్పాలన్నారు. భూములతో వ్యాపారం చేసి త్యాగాలు చేశామనడం సరికాదన్నారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి వేలాది మంది భూములిచ్చి త్యాగాలు చేశారని, ఉత్తరాంధ్రకు మేలు జరుగే పరిపాలన రాజధాని నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. విశాఖ రాజధానిగా మారితే ఉద్యోగ, ఉపాధి కల్పన పెరిగి నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆయన వివరించారు. ఇక ప్రొఫెసర్ ప్రేమానందం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేధావులుగా మనమంతా మద్దతు పలకాలన్నారు. అధికార వికేంధ్రీకరణ ద్వారనే రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఒక వర్గానికి మేలు చేయడం కోసమే అమరావతి పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ సరున్ రాజు మాట్లాడుతూ: విశాఖలో పరిపాలన రాజధానిని స్వాగతించాలన్నారు. విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకునేవాళ్లంతా చరిత్రహీనులగా మిగిలిపోతారన్నారు. వెనుకుబాటుకు గురైన ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ఒక వరం లాంటిదని, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని బలపరుస్తున్నామని ఆయన తెలిపారు. -
బాబు దగ్గర పవన్ కళ్యాణ్ గుమాస్తా..
సాక్షి, విజయవాడ: ఎన్నికల ముందు కర్నూలు రాజధాని కావాలని అడిగిన పవన్ కళ్యాణ్.. కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయా? అనడం అతని అజ్ఞానానికి నిదర్శనమని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందంలో కర్నూలులో హైకోర్టు ఉండాలని ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. శనివారం ఆయన విజయవాడ 44వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1 కోటి 60 లక్షల వ్యయంతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్.. బాబుతో లాలూచీ పడి బీజేపీలో చేరాడని, ఈయన బాబు మేలు కోసమే పనిచేసే వ్యక్తి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు దగ్గర పవన్ గుమస్తాగా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోట ఒకే మాట వస్తుంది.. మీ పాట్నర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని పవన్ను ప్రశ్నించారు. దుర్మార్గంగా దోచుకున్నారు ‘ఐదేళ్లలో బాబు దుర్మార్గంగా దోచుకున్నందునే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా పరిశ్రమలకు సబ్సిడీ కూడా ఇవ్వలేదు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. బాబు.. మా వర్గానికే, మా వాళ్లకే అభివృద్ధి ఫలాలు అందాలనేలా పాలన సాగించారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందాలని వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు తీసుకువచ్చారు. దీనిద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరవేస్తాం. గతంలో పెన్షన్లు 44 లక్షలు ఉంటే ఇప్పుడా సంఖ్య 54లక్షలకు చేరుకున్నాయి’ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఈ నెల 12న ఏపీ కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రాజధానులపై ముందుకు వెళ్లే కార్యచరణ ప్రణాళికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. -
బాబుది కుక్క తోక వంకర సామెత జీవితం..
సాక్షి, అమరావతి : చంద్రబాబు రాజకీయ వ్యభిచారిలా మాట్లాడుతున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. అమరావతిలో టీడీపీ నేతల బాగోతాలు బయట పడుతుంటే చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని విమర్శించారు. తాడేపల్లిలో శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ..చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన కోసం, తన కుటుంబం కోసం, ఎల్లో మీడియా కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసమే సుజనాచౌదరి సీఎం రమేశ్ను బీజేపీలోకి చంద్రబాబు పంపారని ఆరోపించారు. అన్ని ప్రాంతాల సమానంగా అభివృద్ధి చెందడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణను చేస్తున్నారని తెలిపారు. (‘కియా మోటార్స్ తరలింపు వార్తలు అవాస్తవం’) పక్కా ప్లాన్ ప్రకారం చంద్రబాబు,లోకేష్.. సీఎం జగన్పై విషం కక్కుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల బినామీల పేరుతో బాబు అమరావతిలో భూములు కొన్నారని, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి బైట పడలాని ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. కియా మోటర్స్ వెళ్లిపోతుందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు కియా ఎక్కడికి పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల మీద జరుగుతున్న ఐటీ దాడులు నుంచి దృష్టి మళ్లించేందుకు కియా వెళ్లిపోతుందని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబు నోటి వెంట ఒక్క మాట నిజం రాదని, బాబుది సిగ్గు లేని జన్మ అని మండిపడ్డారు. ప్రచార పిచ్చితోనే చంద్రబాబు చచ్చిపోతారని, కుక్కతోక వంకర సామేత జీవితమని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. (ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా..?) -
రాజధానికి 53 వేల ఎకరాల భూమి అవసరమా?
సాక్షి, అమరావతి : రాజధాని విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలోనూ మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించే కార్యక్రమాల్లో బీసీలందరూ పాల్గొనాలని పిలుపినిచ్చారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం జగన్ ఒక సముచిత, చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రశంసించారు. మూడు రాజధానులు అనగానే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని బడుగు బలహీన వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. (బాబుతో ప్రతాప్ కలిసి పనిచేశారు: జంగా) రాజధాని ఎక్కడికి పోవడం లేదని, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని తెలిపారు. ప్రజల్ని తికమక పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, రాజధానికి 53 వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రశ్నించారు. 53 వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు అమరావతిలో గ్రాఫిక్స్ చూపారని, అమరావతిని బ్రమరావతిగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు లెక్కల ప్రకారం అమరావతి నిర్మించాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నించారు. ఒకే చోట రాజధాని వల్ల ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి నడుస్తున్నారని, జరుగుతున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబుఅక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు ఆపి రాజధాని చేపట్టాలా అని, అలా చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని జంగా కృష్ణమూర్తి తెలిపారు. -
‘అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం’
-
రాజధానిపై చంద్రబాబు గందరగోళ ప్రకటనలు
-
‘ఇంకా ఏమేం ఉన్నాయో చెప్పండి విజనరీ’
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘ రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు మైండ్లో వైబ్రేషన్స్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వంపైనా రుసురుసలాడుతున్నాడు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఒకేసారి చెప్పేయండి విజనరీ!’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. (చదవండి : రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) కాగా, రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన విషయం తెలిసిందే. తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని ఎక్కడైనా నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
గణపవరంలో క్యాండిల్ ర్యాలీ
-
‘లోకేష్ బాబును జైలుకు పంపుతారా..?’
సాక్షి, గుంటూరు : చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు నమ్మితే యువత జీవితాలు నాశనమవుతాయని వైఎస్సార్సీపీ నేత, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లోనే బాబు మీటింగులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ‘ఒక్కరోజు జైలుకెళ్లినా పరవాలేదని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. తన కుమారుడు లోకేష్ బాబును జైలుకు పంపుమంటే పంపుతారా..? కమ్మ సామాజిక ప్రజాప్రతినిధిగా మన మేలు కోసం చెప్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మి జీవితాలు పాడుచేసుకోవద్దు’ అని శివకుమార్ పేర్కొన్నారు. -
‘లోకేష్ ఓడిపోయాక రెఫరెండం ఎందుకు..?’
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్ ఉందా..? అని ప్రశ్నించారు. రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసిందని, చంద్రబాబు అండ్ కో చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి : చంద్రబాబుది పోరాటం కాదు..ఆస్తుల కోసం ఆందోళన) ‘రాజధాని రైతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా ఆదుకుంటారు. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. రైతులకు సీఎం రెండు ఆఫ్షన్లు ఇచ్చారు. ఒకటి అభివృద్ధి చేయడం. రెండు వారి భూముల వారికి తిరిగి ఇవ్వడం. చంద్రబాబు తన వారికోసమే ఉద్యమం చేయిస్తున్నాడు. కొంత మంది పెయిడ్ లీడర్లను తయారుచేసి తిప్పుతున్నాడు. నీ పాలనలో ఒకసారైనా రిఫరెండం పెట్టావా చంద్రబాబు. అయినా, లోకేష్ ఓడిపోయాక రిఫరెండం ఎందుకు..? బాబుకు అవసరమైనప్పుడల్లా రిఫరెండం పెట్టాలా. ఆయన మాటలు విని రైతులు మోసపోవద్దు. ఇప్పటికైనా రాజధాని రైతులు దీక్ష విరమించాలి. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఎందుకు రాత్రికి రాత్రే అమరావతికి పరిగెత్తి వచ్చాడు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేయని తుగ్లక్ చంద్రబాబు. నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని పెట్టిన పెద్ద తుగ్లక్ ఆయన. మా విధానమే పరిపాలన వికేంద్రీకరణ. చంద్రబాబు చేసిన అవినీతికి తప్పకుండా జైలుకు వెళ్తారు. బీజేపీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పంపినా జైలుకు వెళ్లడం తప్పదు. ఆయన చచ్చిన పాము. టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ. టీడీపీకి సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఎందుకు రాజధానిలో పర్యటన చేస్తానంటున్నారు. పార్లమెంట్లో చెప్పిన తరువాత కూడా రాజకీయాలు చేస్తున్నారు’అని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు. (చదవండి : ప్రజాసేవే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.. బలం..) -
రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని: జీవీఎల్
-
బాబు తెలిసే రాద్ధాంతం చేశారు
సాక్షి, విశాఖపట్నం: స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అంశం తమ పరిధిలో ఉండదని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర పరిధి అంశమని తెలిసే చంద్రబాబు రాద్ధాంతం చేశారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో రాజధాని రైతులను బాబు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. (రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) ‘బుద్ధున్నవారు ఎవరైనా విశాఖలో రాజధానికి వస్తారా’ అన్న బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుద్ధి లేకేనా.. విశాఖలో బాబు సదస్సులు నిర్వహించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ల్యాండ్ పూలింగ్ పేదల ఇళ్ల కోసం చేపడుతున్నామని, ఇందులో అవినీతికి ఆస్కారమే లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి బాబు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. చదవండి: టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్.. ఒక్కొక్కరు ఎంత కొన్నారంటే.. -
కొందరు భ్రమలు కల్పిస్తున్నారు: జీవీఎల్
సాక్షి, అమరావతి: రాజకీయంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని 50 శాతం మంది ప్రజలు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని.. అలాంటి ప్రభుత్వ అధికారంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. అదే విధంగా.. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని.. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కొందరు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు.(రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించిన కేంద్రం) కాగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశంపై కేంద్రం మంగళవారం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని.. ఈ విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.(రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) -
గ్రాఫిక్స్ చూపించాలని అనుకోలేదు..
-
‘ఓ తండ్రిగా ఆలోచించి నిర్ణయం..’
సాక్షి, విజయవాడ : ‘ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తరాలపై పడుతుంది. ఒకవేళ నిర్ణయం తీసుకోకున్న ఆ ప్రభావం భవిష్యత్తు తరాలపై ఉంటుంది. రాజధానిగా చెప్తున్నా ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు.. రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించాను’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలోని గేట్వే హోటల్లో నిర్వహించిన ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు. తన స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని సదస్సుకు హాజరైన ఆహుతులను ప్రశ్నించారు. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం, రివర్స్ టెండరింగ్, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై లెక్కలతో సహా సీఎం వైఎస్ జగన్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్రిక్స్ దేశాలతో పోలిస్తే కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య మన దేశంలో చాలా తక్కువ. 77 శాతం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదని అన్నారు. ఇంగ్లిషు మీడియం అనేది ఇప్పడు కనీస అవసరం. ఇంటర్నెట్, కంప్యూటర్ భాషలన్నీ ఇంగ్లిష్లో ఉంటాయి. ఈ రోజు మనం ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే 20 ఏళ్లలో రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడు. ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం స్కూళ్లకు పంపగలమా?. పేదవాళ్లు మాత్రమే తెలుగు మీడియం స్కూళ్లలో ఎందుకు చదవాలి?. 98.5 శాతం ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువు చెప్తున్నాయి. పేద విద్యార్థులను ఎందుకు బలవంతంగా తెలుగు మీడియం చెప్పే పాఠశాలలకు పంపాలి. ఇంగ్లిష్ మీడియంలో చదవడం ద్వారా విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారు. మేం కేవలం ఇంగ్లిష్ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదు.. విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నాం. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతాం. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ను తప్పనిసరి చేస్తున్నాం. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని తెలుసు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకురావడంతోపాటు.. విద్యావ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు 25వేల ప్రభుత్వ పాఠశాలల ఫొటోలు తీసి.. వచ్చే మూడేళ్లల్లో వాటి రూపురేఖలను మార్చబోతున్నాం. స్కూల్ బిల్డింగ్లు, బాత్రూమ్లు, ఫర్నీచర్ సహా అన్నింటినీ మార్చబోతున్నాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల నాణ్యతను పెంచబోతున్నాం. అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాం. వంటలు చేసే ఆయాల జీతాల పెంచాం. అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది తల్లులకు ఒక్కొక్కరికి రూ. 15వేలు ఇచ్చాం. తల్లులు తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తే ఏడాది రూ. 15వేలు అందజేస్తాం. ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకోస్తున్నాం. డిగ్రీని నాలుగేళ్లపాటు, ఇంజనీరింగ్ను ఐదేళ్లపాటు చదవాల్సి ఉంటుంది. చివరి ఏడాది విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఉంటుంది. విద్యార్థులకు 100 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్నాం. ఏపీలో ప్రతి విద్యార్థికి విద్య రూపంలో ఎప్పటికీ తరగని ఆస్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేం చేపట్టిన సంస్కరణలకు మద్దతు తెలిపిన ది హిందూ పత్రికకు ధన్యవాదాలు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించా.. ప్రతీ ముఖ్యమంత్రికి అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. ఒక్క ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుంది. రాజధానిగా చెప్తున్నా ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు.. రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ రిపోర్టులే చెప్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించాను. ఒకవైపు అమరావతికి రూ. లక్షా 9వేల కోట్లు ఖర్చు చేయాలా?.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచన చేశాను. మరోవైపు విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదు. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతోంది.. విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. విశాఖలో సచివాలయం, హెచ్వోడీ, ముఖ్యమంత్రి కార్యాలయాలు ఉండనున్నాయి. ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టే.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశాం. ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. (చదవండి: రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) గ్రాఫిక్స్ చూపించాలని అనుకోలేదు.. రాష్ట్రంలోని ప్రజలను మభ్య పెట్టాలని, గ్రాఫిక్స్ చూపించాలని నేను అనుకోలేదు. నేను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలు మాత్రమే చెప్పా. జపాన్, సింగపూర్ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిచాం. గత పదేళ్లలో శ్రీశైలానికి చేరే కృష్ణా జలాలు.. 1200 టీఎంసీల నుంచి 600 టీఎంసీలకు పరిమితమయ్యాయి. మొత్తం కృష్ణానది ఆయకట్టుకు నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గోదావరిలో పుష్కలమైన జలాలున్నాయి. ఏడాదికి 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఒక్క అమరావతిలోనే డబ్బులు ఖర్చు చేయాలా?.. లేకపోతే ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలా?. (చదవండి: లెజిస్లేటివ్ రాజధాని అమరావతే) రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 2వేల కోట్లు ఆదా.. ఈ ఉగాదికి ఇల్లు లేని పేదవారికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా ప్రక్షాళన చేపట్టాం. ఒక టెండర్ ప్రాసెస్ కంటే ముందే న్యాయమూర్తి దగ్గరకు వెళ్తుంది. జ్యుడిషియల్ ప్రివ్యూ యాక్ట్ ద్వారా టెండర్లు పిలుస్తున్నాం. కాంట్రాక్ట్ సంబంధించి టెండర్లలో ఎలాంటి మార్పునైనా న్యాయమూర్తి సూచించవచ్చు. ఏడు రోజులపాటు టెండర్ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నాక.. న్యాయమూర్తి ఆ టెండర్లకు ఒకే చెప్తారు. ఆ తర్వాత అత్యంత తక్కువ కోట్ చేసిన ధరను ప్రకటిస్తారు. ఆ ధరకంటే కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా ఇంకా ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే వారికి ఇస్తాం. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చేశాం. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే రూ. 830 కోట్లు ఆదా చేశామ’ని తెలిపారు. -
‘ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు’
సాక్షి, అమరావతి : భవాని ఐల్యాండ్ను గత వారం ప్రారంభించామని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే చిన్న బోట్లకు అనుమతి ఇచ్చామని.. మిగిలిన బోట్లను కూడా తనిఖీ చేసి అనుమతి ఇస్తామని తెలిపారు. మొత్తం 9 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు. 20వ తేదికి కంట్రోల్ రూమ్లను పూర్తి చేస్తామని, కంట్రోల్ రూమ్ల పరిధిలోనే బోట్లు నడుపుతామని మంత్రి తెలిపారు. (బాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: అవంతి) అదే విధంగా రాజధాని అంశం తమ పరిధిలో ఉండదని కేంద్రం స్పష్టం చేసిందని మంత్రి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ‘బుద్ధి ఉన్నవాడు ఎవరైనా విశాఖపట్నం వద్దమనుకుంటారా’ అని చంద్రబాబు అనడం సిగ్గుచేటు అని మంత్రి అవంతి అన్నారు. చంద్రబాబు ఇక మీదట విశాఖలో అడుగు పెట్టడా అని ప్రశ్నించారు. విశాఖ ఏమైనా దండకరణ్యంలో ఉందా అని, విశాఖలో ఓట్లు, సీట్లు మాత్రం తమకు కావాలా అని బాబును నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అమరావతిలోని అసెంబ్లీలో చంద్రబాబు కనీసం బాత్రూంలు కూడా కట్టలేదని మండిపడ్డారు. -
రాజధానిపై స్పందించిన కంచ ఐలయ్య
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు. రాజధానిని విభజించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు నష్టం లేకుండా చూడాలని కోరారు. రాజధాని కోసం సేకరించిన వేల ఎకరాలు ఇప్పటికీ ముట్టుకోకుండా ఉన్నాయని, మరో 20 ఏళ్లు అయిన చంద్రబాబు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేడని విమర్శించారు. భూములు కావాలన్న వారికి భూములు ఇవ్వాలని, రైతులకు ఇస్తానన్న పరిహారం 15 ఏళ్ల పాటు రూ. 50 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు. అదే విధంగా మత ప్రతిపాదికన పౌరసత్వాన్ని ఇవ్వడం సరైన పద్దతి కాదని.. నిరసనలు తెలుపుతున్న ముస్లింల వేషధారణ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రధానమంత్రి వేసుకున్న డ్రెస్ ముస్లిం వేషధారణ కాదా అని కంచ ఐలయ్య ప్రశ్నించారు. -
ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం
-
లేని సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపడమేంటి?
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. లేని సెలెక్ట్ కమిటీకి తాము పేర్లు పంపడం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన విజయవాడలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థి యువజన జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటే సభ్యుల అభిప్రాయం తీసుకొని ఓటింగ్ పెట్టాలని.. అవేవి లేకుండా ప్రతిపక్ష పార్టీలు పేర్లు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. సభలో టీడీపీకి నలుగురు సభ్యులు ఎక్కువ ఉన్నారని ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం సరికాదన్నారు. శాసన మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తల వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేదంటే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను తాత్కాలిక అడ్డుకోగలరు కానీ శాశ్వతంగా అడ్డుకోలేరని సజ్జల అన్నారు. -
రాజధాని అంశంపై కేంద్రం తొలి స్పందన..
-
రాజధాని అంశంపై కేంద్రం తొలి స్పందన..
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో రాజధానుల తరలింపుపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని అంశంపై రాష్ట్రాలదే తుది నిర్ణయమని వెల్లడించింది. లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధాని ఏక్కడ పెట్టుకోవాలనే అధికారం రాష్ట్రానికే ఉంటుందని కేంద్రం తేల్చిచెప్పింది. అందులో తమ జోక్యం ఉండదని పేర్కొంది. కాగా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం రాజధాని అంశంపై జాతీయ మీడియా ఇష్టాగోష్టిలో కూడా కేంద్ర ఉన్నత వర్గాలు ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. శాసనమండలి, రాజధాని అంశాల్లో కేంద్ర జోక్యం చేసుకోదని తెలిపాయి. ఏపీలో ఐదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉందని గుర్తుచేశాయి. రాజకీయ అంశాల్లో కేంద్రం చేసేదేమీ ఉండదని పేర్కొన్నాయి. కంగుతిన్న టీడీపీ.. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అడ్డుతగిలేలా రాజధాని అంశంపై టీడీపీ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల పేరిట అమరావతి గ్రామాల్లో ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్.. లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ కేంద్రం మాత్రం రాజధానుల అంశంపై తమ జోక్యం ఉండబోదని వెల్లడించింది. తాము అనుకున్న దానికి విరుద్ధంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడటంతో టీడీపీ శ్రేణులు కంగుతిన్నాయి. -
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్న డిప్యూటీ కలెక్టర్స్
-
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
-
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
సాక్షి, చిత్తూరు : అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం అన్నారు. ఆదివారం ఆయన మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా నారావారిపల్లి గ్రామంలో నిర్వహించిన అధికార వికేంద్రీకరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజేయకల్లాం మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణ అనేదే సీఎం జగన్ ప్రభుత్వ సిద్ధాంతం అని, ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ అలోచిస్తే.. చంద్రబాబు, ఎల్లో మీడియా ఒకే చోట అభివృద్ధిని కోరుకుంటున్నాయని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కొంతమంది లబ్ధి కోసమే అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టిందని ఆరోపించారు. గతంలో హైదరాబాద్లో మాత్రమే పెద్ద పెద్ద కంపెనీలను పెట్టించారని, దాని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అలా చేయకుండా తమ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్లి సక్సెస్ సాధించాయని తెలిపారు. రాజధాని సెంటర్లో ఉండాలని కోరుకోవడం తప్పు అని అన్నారు. రాజధాని మధ్యలో ఉండాలని చంద్రబాబు అంటున్నారని, ఢిల్లీ నుంచి అమెరికా వరకు ఎక్కడా రాజధాని మధ్యలో లేదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడమే టీడీపీ సిద్ధాంతం అని విమర్శించారు. -
వ్యుహం ప్రకారమే ఈ దాడులన్ని
-
అమరావతిని బబు బంగారు బాతుగా భ్రమించటమే
-
‘బాబు విశాఖ ప్రజలపై విషం చిమ్ముతున్నారు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. జిల్లాలో మంత్రి అవంతి శ్రీనివాస్ నిర్వహించిన జీవీఎంసీ సమీక్షలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కురసాల కన్నబాబు, భాగ్యలక్ష్మీ, గొల్ల బాబూరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే ఆయన ప్రజలపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ది వల్ల ఇతర ప్రాంతాలకి నష్టమని చంద్రబాబు తీరువల్ల ప్రజలు నష్టపోయే పరిస్ధితి వచ్చిందని విమర్శిచారు. చంద్రబాబు తన స్ధాయి మరిచి విశాఖ, రాయలసీమపై కుట్రలు చేస్తున్నారని, పెద్దల సభలో టీడీపీ నుంచి ఎక్కవ మంది అవగాహన లేని వారే ఉన్నారు ఎద్దేవా చేశారు. కౌన్సుల్ రద్దు కాకుండా చంద్రబాబు బీజేపీ నేతలతో టచ్లో ఉండటం దారుణమన్నారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని, ఓట్లేసిన విశాఖ ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పోడుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలకు మద్దతిస్తున్న విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తే ప్రజలు తన్నేలా ఉన్నారని, విశాఖపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ: చంద్రబాబు విశాఖపై విషం చిమ్ముతున్నారన్నారు. ఉత్తరాంధ్రపై కుట్రలు పన్నుతున్న చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనీయమన్నారు. విశాఖ సుందరమైన నగరం...దేశంలోనే విశాఖకు 9 వ స్ధానం ఉందని పేర్కొన్నారు. విశాఖ ప్రజలు చేసిన అన్యాయమేంటని, మిమ్మల్ని గెలిపించడమే విశాఖ ప్రజలు చేసిన శాపమా అని ప్రశ్నించారు. కాగా బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అమిత్ షాను ఘోరాతి ఘోరంగా తిట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని .. రాజధాని భూములని రైతులకి తిరిగి ఇచ్చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలోనే ఉందని తెలిపారు. వికేంద్రీకరణను బీజేపీ వ్యతిరేకిస్తే వారి మేనిఫెస్టోను వారే వ్యతిరేకించినట్లే అన్నారు. ఇక మార్చి నాటికి విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందనుకుంటున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధికారులతో మంత్రి అవంతి సమీక్ష ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ: గతంలో విశాఖపై ప్రశంసలు కురిపించలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఇపుడు చంద్రబాబుకి విశాఖ ఎందుకు చేదుగా మారిందని, దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబు విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ ప్రజలు చంద్రబాబుకి నాలుగు సీట్లు ఇస్తే మీరు ప్రజలకేం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షనాయకుడు కాదు...ఒక వర్గానికి మాత్రమే నేత అన్నారు. విశాఖలో నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజలే చంద్రబాబు తీరును ఛీ కొడుతున్నారని, రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ: చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్దిని కుతంత్రాలతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి రాజకీయ సమాధి కట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆయన ఒక ప్రాంతానికే పరిమితమయ్యారన్నారు. చంద్రబాబును ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని, విశాఖ పరిపాలనా రాజధానిగా వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. వెన్నుపోటు రాజకీయాలు, కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు చంద్రబాబు నైజమని విమర్శించారు. ఆదరించిన ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, దమ్ముంటే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్లామని ఆయన సవాలు విసిరారు. ఇక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ: చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వికేంద్రీకరణ అమలు జరిగితే రాష్ట్రం సువర్ణయుగంగా మారుతుందన్నారు. వికేంద్రీకరణబిల్లు అమలు ద్వారా ఏపీ దేశంలోనే అగ్రాగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు నెలల సంక్షేమ పాల చూసి టీడీపీ నేతలు సైతం సీఎం జగన్కు జై కొడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తీరుమారకుంటే 23 నుంచి 3కి తగ్గిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. -
బాబు సీమలోకి వెళ్తే చీపుళ్లతో కొడతారు: జోగి రమేష్
-
బాబు సీమలోకి వెళ్తే చీపుళ్లతో కొడతారు: జోగి రమేష్
సాక్షి, కృష్ణా : రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. గూడురు మండలం నుంచి పెడన పట్టణం వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలంటే సాధ్యం కాదని, భావితరాల కోసం రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని సీఎం జగన్ మూడు రాజధానులు ఉండాలన్నారని, ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని జోగి రమేష్ మండిపడ్డారు. జోలె పట్టుకుని రాజకీయ బిచ్చగాడిగా మారాడని వ్యాఖ్యానించారు. పెడన నియోజకవర్గంలో రెండో పంటకు నీరు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది అని, సీఎం వైఎస్ జగన్ పాలనలో నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయని ప్రశంసించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాడు రెండో పంటకు నీరు వచ్చేవని, నేడు ముఖ్యమంత్రి జగన్ పాలనలో కూడా రెండో పంటకు నీరు వచ్చాయని అన్నారు. జూన్ నెలలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన, పనులు ప్రారంభం అవుతాయన్నారు. పెడన నియోజకవర్గం రైల్వే కూడలిగా మారబోతుందని, పరిశ్రమలు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోకి చంద్రబాబు వెళ్తే మహిళలు చీపుళ్ళతో కొడతారని విమర్శించారు. చంద్రబాబు 16 నియోజకవర్గాలకు, 29 గ్రామాలకే నాయకుడిగా పరిమిమయ్యారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావటం కాయమని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణలో భాగంగా మచిలీపట్నంను జిల్లాగా ప్రకటించనున్న సీఎం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. వికేంద్రీకరణతో పెడన పారిశ్రామిక వాడ కాబోతోందని, ముఖ్యమంత్రి ఏడు నెలల పాలనలో అమ్మఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా,వాహన మిత్ర వంటి పథకాలతో ప్రజలకు సంక్షేమ పాలన అందించారన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని అక్క చెల్లెమ్మలకు ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు ఇవ్వ నున్నామని, నియోజకవర్గంలో రూ. 60 కోట్లతో సీసీ రోడ్లపనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. -
అభివృద్ధి వికేంద్రీకరణ కలిసొచ్చిన అదృష్టం
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంటే ఆకాశహర్మ్యాలు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన పార్కులు, పెద్ద పెద్ద మాల్స్, సినిమా హాల్సే కాదు. పురోభివద్ధి కారిడార్లు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య కేంద్రాలు, విద్యావకాశ నిలయాలు, స్వచ్ఛమైన మంచినీరు, నిరంతర విద్యుత్, అందరికి ఆరోగ్యం, ఆధునిక ఇంటర్నెట్ కమ్యూనికేషన్లు, వ్యవసాయ పురోభివద్ధికి పరిశోధనలు, అంతర్జాతీయ వ్యాపారానికి ప్రణాళికలు, ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు....ఇలా ఎన్నో బరువులు, బాధ్యతలు. (వికేంద్రీకరణతో అన్ని వర్గాలకు న్యాయం) వీటన్నింటిని ఒకే నగరానికి పరిమితం చేయకుండా మూడు నగరాలకు విస్తరిస్తామనడం కొత్త సంప్రదాయం. అభివృద్ధి వికేంద్రీకరణకు అసలైన మార్గం. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెబుతున్న మాట. గీసుకున్న బాట. భారత దేశంలో నగరాలు అభివద్ధి చెందిన గతకాలపు చరిత్రను పరిశీలిస్తే కొత్త సంప్రదాయంలో ఉన్న శాస్త్రీయ దృక్పథం కూడా అర్థం అవుతుంది. (మూడు రాజధానులకు మద్దతుగా పోస్టుకార్డుల వెల్లువ) 17వ శతాబ్దం నుంచి భారత్ లో ముంబై, చెన్నై, కోల్కతా రేవు పట్టణాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అప్పటికే భారతీయులకు ఎంతో నైపుణ్యం ఉండడంతో విదేశాల నుంచి ముడి సరకులను తీసుకొచ్చి వాటి ఉత్పత్తులుగా మార్చి ఎగుమతి చేయడానికి ప్రధానంగా ఈ రేవు పట్టణాలే తోడ్పడ్డాయి. కనుక అక్కడ తొలుత మార్కెట్లు కూడా అభివృద్ధి చెందాయి. బ్రిటీష్ పాలకుల హయాంలో రేవుల వద్ద సరకుల దిగుమతి, ఎగుమతి కార్యకలాపాలు మరింత విస్తరించాయి. వాటికి దేశీయ మార్కెట్లు కూడా అవసరం వచ్చి దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశంలో పలు వ్యూహాత్మక నగరాలను అభివృద్ధి చేయాల్సి వచ్చింది. వాటికి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. బ్రిటీష్ పాలకులది కేంద్రీయ పాలన కనుక పలానా ప్రాంతమని తేడా లేకుండా ఏ ప్రాంతం ఏ వ్యాపారానికి వీలుందో, ఆ ప్రాంతంలోని పట్టణాలకు మౌలిక సౌకర్యాలు కల్పించడం అనివార్యమైంది. ఆ తర్వాత వ్యవసాయోత్పత్తులు, ఇతర మార్కెట్ల అవసరాల కోసం ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ఆగ్రా, రాజస్థాన్లో జైపూర్, ఉదయ్పూర్, పంజాబ్లో లూథియానా, అమృత్సర్, మధ్యప్రదేశ్లో భోపాల్, ఇండోర్ లాంటి నగరాలు అలా అభివృద్ధి చెందినవే. (ఇతర రాష్ట్రాలదీ సమగ్రాభివృద్ధి బాటే!) దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల ప్రాతిపదిక ప్రాంతాలు, నగరాల అభివృద్ది జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రధాన నగరాలైన, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, నిజాం పాలిత ప్రాంతంతో కలిశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ వచ్చింది. తెలంగాణాతో విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని నగరాలను, వాటి చుట్టూ ప్రాంతాలను మరింత వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. (మూడు రాజధానుల ఆలోచన అద్భుతం) అలాంటప్పుడు మూడు నగరాలకు రాజధాని కార్యకలాపాలను విస్తరించుకునే అవకాశం లభించడం నిజంగా ఓ అదృష్టమే. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగుతున్న నేటి పరిస్థితుల్లో ఓ రేవు పట్టణానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటప్పుడు రాష్ట్ర సెక్రటేరియట్ అక్కడ ఉండడం ఎంతైన శ్రేయస్కరం. ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితమైతే వైషమ్యాలకు, వేర్పాటు వాదాలకు దారితీస్తుందని అలా ఆవిర్భవించిన ఓ రాష్ట్రానికి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. (కంచీ యూనివర్శిటీలో డీలిట్, అమెరికాలో పీహెచ్డీ చేసిన సమీర్ శర్మ ఓ ఆంగ్ల వెబ్సైట్కు రాసిన పరిశోధనాత్మక వ్యాసానికి సంక్షిప్త స్వేచ్ఛానువాదం) -
‘టీడీపీ ఎమ్మెల్యేల నాటకాలను సహించం’
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సర్క్యూట్ హౌస్ నుంచి కాగడాల ర్యాలీ నిర్వహించారు. వికేంద్రీకరణపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను మహిళలు దగ్ధం చేశారు. నగరానికి చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెవెన్హిల్స్ జంక్షన్లోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మహిళలు ప్రయత్నించారు. వారికి పోలీసులు సర్దిచెప్పి పంపించారు. టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గణేశ్కుమార్ విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ఓట్లతో గెలిచి విశాఖపట్నానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేల నాటకాలను విశాఖ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. పదవులను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు తప్పా ఓట్లు వేసి గెలిపించిన తమకు న్యాయం చేయాలన్న ఆలోచన టీడీపీ ఎమ్మెల్యేలకు లేదని ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలైన ఉత్తరాంధ్ర ఇప్పటికి వెనుబడి ఉందన్నారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే తప్పకుండా విశాఖ పరిపాలనా రాజధాని కావాలని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు అడ్డుపడితే ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ కావాలి. విశాఖ రాజధాని కావాలి’ అని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. (చదవండి: కార్య నిర్వాహక రాజధానిగా విశాఖ భేష్) ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని కోరుతూ పద్మనాభం మండలంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులతో పాటు ఎడ్లబండి ఎక్కి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇనాం భూముల రైతులకు రైతు భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. (చదవండి: మూడు రాజధానుల ప్రక్రియ ఆగదు) -
‘త్వరలో టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు’
సాక్షి, తాడేపల్లి: రాయలసీమలో హైకోర్టు వద్దని అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్ క్రాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని పెద్ద ఎత్తున్న ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. హై బెంచ్ రాయలసీమలో పెడతామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని ప్రాంతాలు సమానమేనని, ప్రజల ఆకాంక్ష మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారని హఫీజ్ ఖాన్ తెలిపారు. రాయలసీమలో హైకోర్టు పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది అక్కడి ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ఇక 29 గ్రామాలకు నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు రాబోయే రోజుల్లో టీడీపీని బంగాళా ఖాతంలో కలుపుతారని ఆయన ఎద్దేవా చేశారు. -
విశాఖే బెస్ట్
-
తేల్చుకుందాం రండి..
సాక్షి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు అడ్డంపడుతున్నారని శ్రీకాకుళం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ను రాజధానిగా ఎందుకు అంగీకరించడం లేదో ఎంపీ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. వైజాగ్ రాజధాని కోసం వైఎస్సార్సీపీ కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు ఎదురు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సీఎం జగన్ ప్రజల నాయకుడని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఒక్క ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే ప్రాంతీయ విద్వేషాలు పెరిగే అవకాశముందన్నారు. అమరావతి రాజధాని కావాలంటున్న టీడీపీ నాయకులు హైదరాబాద్లో ఇళ్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు ఎప్పుడూ ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అమరావతి పేరుతో కోట్ల రూపాయలు కైంకర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలోనే పుట్టిన అచ్చెన్నాయుడు వైజాగ్ను రాజధానిగా వ్యతిరేకించడాన్ని దుయ్యబట్టారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రెండెకరాల స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి తలపై ఉన్న గాయాలే ఆయన రక్తచరిత్రకు సాక్ష్యాలని అన్నారు. ఎంతో మంది జీవితాలను ఆయన నాశనం చేశాడని, అచ్చెన్నాయుడి అక్రమాలకు సాక్ష్యాలున్నాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల రిగ్గింగ్తోనే రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే తనపై టీడీపీ నాయకులు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు చేతగాక తనపై అక్రమ కేసులు పెట్టారని, తాను ఏనాడు భయపడలేదన్నారు. (‘సీఎం జగన్ నిర్ణయం వల్లే మా ప్రాంతాల్లో వెలుగులు’) -
విశాఖనే బెస్ట్ ఆప్షన్ : జీఎన్ రావు
సాక్షి, హైదరాబాద్ : తమ కమిటీ నివేదికపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిన వార్తలను విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు ఖండించారు. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండాలని తమ నివేదికలో స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై తమ కమిటీ ఇచ్చిన నివేదికపై కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన తప్పుడు వార్తలపై జీఎన్ రావు స్పందించారు. బుధవారం హైదరాబాద్లోని లేక్వ్యూ గెస్ట్హౌస్లో జీఎన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. కొందరు జీఎన్ రావు రిపోర్టును తగలబెట్టడం బాధకరమని అన్నారు. తమ నివేదికపై తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టొద్దని తాము చెప్పలేదన్నారు. తమ కమిటీ సభ్యులను ప్రభావితం చేశారనేది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని అన్నారు. కమిటీలో 40 ఏళ్ల అనుభవం కలిగినవారు ఉన్నారని జీఎన్ రావు గుర్తుచేశారు. ప్రలోభాలకు లొంగే సాదాసీదా వ్యక్తులు కమిటీలో లేరని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా వారి వారి రంగాల్లో ఎంతో అనుభవం కలవారని చెప్పారు. మూడు, నాలుగు నెలలు కష్టపడి తాము నివేదికను తయారుచేస్తే.. దానిని తగలబెట్టడం సరికాదన్నారు. విశాఖపట్నంతోపాటు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధిచిన లాభనష్టాలను చర్చించామని వెల్లడించారు. విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో రిపోర్టులో స్పష్టంగా చెప్పామని అన్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం బెస్ట్ ఆప్షన్ అని తెలిపారు. మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలనే.. మూడు ప్రాంతాల్లో రాజధానులు సూచించినట్టు చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసం 4 స్థానిక కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. ఈ కమిషనరేట్లలో సీనియర్ అధికారాలను నియమించి.. వాటికి పూర్తి అధికారాలు ఇవ్వాలని సూచించినట్టు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు పెడితే.. నాలుగు జిరాక్స్ సెంటర్లు మాత్రమే వస్తాయని అనడం చాలా తప్పని అన్నారు. హైకోర్టుతో ట్రిబ్యునల్స్ కూడా ఏర్పడతాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారుల, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. భౌతికంగా, ఆన్లైన్ పద్ధతుల్లో అభిప్రాయాలు స్వీకరించామని.. ఆ తర్వాత డేటాను పూర్తిస్థాయిలో విశ్లేషించామని తెలిపారు. చదవండి : ఎల్లో మీడియాకు ఇప్పుడు అది భగవద్గీత..? -
విశాఖనే బెస్ట్ ఆప్షన్
-
ఎల్లో మీడియాకు ఇప్పుడు అది భగవద్గీత..?
సాక్షి, తాడేపల్లి : రాజధాని విషయంపై చంద్రబాబు నాయుడు తన ఎల్లో మీడియాతో దుష్ప్రచారం చేయిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎల్లో మీడియా అనుకున్నట్లు రాజధాని మార్పు ఆలస్యం కాదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోస్టన్, జీఎన్రావు కమిటీ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించాకే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీఎన్ రావు కమిటీని పనికిమాలిన కమిటీ అన్న చంద్రబాబు.. మళ్లీ ఇప్పుడు జీఎన్ రావు కమిటీ వైజాగ్లో ప్రకృతి వైపరిత్యాలు వస్తాయని చెప్పిందంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఎల్లో మీడియాతో ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను చెత్త బుట్టలో పడేయాలని చెప్పిన చంద్రబాబుకు, ఆయన ఎల్లోమీడియాకు ఇప్పుడు అది భగవద్గీతగా మారిందని విమర్శించారు. ఏ అంశంపై కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకుంటారని, అందుకే ఆయనను యూటర్న్ బాబు అంటారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ బిల్లును తీసుకువచ్చామని చెప్పారు. అన్ని కమిటీల నివేదికలను హైపవర్ కమిటీలో చర్చించాకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. శాసన మండలి రద్దుకు రాజధానికి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం మీద మాట్లాడడానికి ఏమి లేకపోవడంతోనే రాజధాని అంశంపై వివాదం చేస్తున్నారని ఆరోపించారు. -
బాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారు : కన్నబాబు
సాక్షి, కాకినాడ : కాపు మహిళల కోసం వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో వచ్చిన ఏడు నెలల్లోనే రైతు భరోసా, నాడు-నేడు, నేతన్న హస్తం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని చెప్పారు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని కన్నబాబు మండిపడ్డారు. శాసన మండలి రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటే బాబును ప్రజలు మరింత తిరస్కరిస్తారని చెప్పారు. అభివృద్దిని చంద్రబాబు ఎంత కాలం అడ్డుకుంటారో తాము చూస్తామని ఘాటుగా స్పందించారు. అమరావతిలో జరిగిన అక్రమాలు వెలికితీస్తుంటే బాబు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. బినామీలకు చెందిన ఆస్తులను కాపాడుకోవడానికే బాబు కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి బాబుకు అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించారు. -
అది తప్పకుండా అమలు అవుతుంది
-
మూడు రాజధానుల ఆలోచన అద్భుతం
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ఆలోచన అద్భుతంగా ఉందని అనంతపురం జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమలో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయడాన్ని వారు స్వాగతించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటువల్ల శ్రీభాగ్ ఒప్పందానికి న్యాయం జరిగిందని గుర్తు చేశారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థులు మాట్లాడుతూ.. ఏపీలో అధికార, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ వల్ల తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. సీఎం యాక్షన్ ప్లాన్ బాగుంది ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ యాక్షన్ ప్లాన్ బాగుందని ఎస్కే యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అభివృద్ధి ఒకేచోట ఉంటే ప్రాంతీయ అసమానతలు వస్తాయని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి లక్ష కోట్ల అవసరమా? అని ప్రశ్నించారు. ఏపీలో మెగా క్యాపిటల్ అవసరం లేదని, మనకు కావాల్సింది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కాదు.. గ్రౌండ్ ఫీల్డ్ క్యాపిటల్ కావాలని, ఇదే విషయాన్ని బోస్టన్ గ్రూప్ కూడా స్పష్టం చేసిందని తెలిపారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదులుకోవటం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమని అన్నారు. మేధావుల మద్దతు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న అధికార వికేంద్రీకరణ నిర్ణయానికి మేధావులు మద్దతు ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధి ప్రజల హక్కు అని వారు స్పష్టం చేస్తున్నారు. శాసనమండలి రద్దు.. ప్రతిపక్ష టీడీపీ స్వయంకృతాపరాధమేనని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర అభివృద్ధిపై తిరుపతిలో అవగాహన సదస్సు జరిగింది. ప్రజల అభిష్ఠానాన్ని అడ్డుకుంటూ.. మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను చంద్రబాబు అడ్డుకోవడం దారుణమని అన్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో పట్టిన చంద్రగ్రహణం వీడిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు మూడు రాజధానులు అవసరం గురించి తిరుపతి ఎస్వీయూలో అవగాహన సదస్సు జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రొపెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు బట్టారు. భారీ ర్యాలీ.. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. జేఏసీ నేత రాజా రెడ్డి నేతృత్వంలో వందలాదిమంది ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జేఏసీ నేతలు ఈ సందర్భంగా అన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయానికి తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. స్వాగతిస్తున్న ప్రవాసాంధ్రులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రవాసాంధ్రులు స్వాగతిస్తున్నారు. సౌతాఫ్రికాలో నివాసం ఉంటున్న తెలుగువారు సీఎం వైఎస్ జగన్ కు మద్దతు తెలుపుతూ అక్కడ ప్రదర్శన నిర్వహించారు. పాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్నారు. -
మూడు రాజధానులే ముద్దు
-
కదం తొక్కిన జనం
-
చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా
-
చంద్రబాబు అభివృది నిరోధకడు: ఆదాల
-
వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతిని రాజధాని చేశారు
-
యనమల కుట్రలు పైనున్న ఎన్టీఆర్కు తెలుసు..
సాక్షి, విశాఖపట్నం: శానసమండలిలో పరిణామాలను మేధావులు, ప్రజలు బ్లాక్ డే గా భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండలి ఛైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. శుక్రవారం విశాఖలో గుడివాడ అమర్నాథ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘తాను తప్పు చేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మనే ఒప్పుకున్నారు. ఆయన తీరును మేధావులు కూడా తప్పుబట్టారు. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా నిబంధనల ప్రకారం వెళ్లాలని ఛైర్మన్కు సూచించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చుని ఛైర్మన్ను కనుసైగలతో శాసించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మండలి ఛైర్మన్ వ్యవహరించారు. ఆయన నిర్ణయం వల్ల కొంత ఆలస్యం మాత్రమే జరుగుతుంది. ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాని ఖునీ చేసినందుకా ఆనందోత్సాహాలు? (వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు) మూడు గ్రామాలకే చంద్రబాబు హీరో ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలి. మండలి గురించి సోమవారం అసెంబ్లీలో చర్చిస్తాం. చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో.. 13 జిల్లాలకు విలన్. ఆయన పనికిరాని వారిని శాసనమండలికి తీసుకు వచ్చారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్ధా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్కు తెలుసు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు సభలో మైక్ ఇవ్వని మీరా రూల్స్ గురించి మాట్లాడేది? చంద్రబాబు చేస్తున్న పోరాటాలు తాత్కాలికమే. ఆయన కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు తాత దిగొచ్చినా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోలేరు. అయితే తన స్వార్థపూరిత రాజకీయాల కోసం మండలిని ఉపయోగించుకోవడం దారుణం. మండలిని ఆనాడు ఎన్టీఆర్ రద్దు ఎందుకు చేశారో అందరికీ తెలుసు. అయితే అర్ధవంతమైన సభగా పెద్దల సభ ఉండాలనే మంచి ఆలోచనలతో వైఎస్సార్ ఆనాడు శాసన మండలిని పునరుద్దించారు. (చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!) పవన్కి చంద్రబాబే ఆదర్శం వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితంలో పవన్ కల్యాణ్ ఒంటరిగా వెళ్లలేరు. ఆయనది లాంగ్ మార్చ్ కాదు... రాంగ్ మార్చ్. పవన్కు వ్యక్తిత్వం, స్థిరత్వం, సిద్ధాంతాలు లేవు. మూడు రాజధానులు ఉంటే ఎందుకు తప్పు? అయిదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్. రాజకీయ జీవితంలో...వ్యక్తిగత జీవితంలో పవన్కి పక్కన ఎవరో ఒకరుండాలి. పొత్తుల విషయంలో పవన్ కి చంద్రబాబే ఆదర్శం. గాజువాక ప్రజలు ఓడించారనే పవన్ కక్ష సాధిస్తున్నారు.’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (నిమిషాల వ్యవధిలో మాట మార్చిన పవన్) -
ఏం సాధించారని చంద్రబాబు సంబరాలు?
-
వికేంద్రీకరణ బిల్లు పై టీడీపీ రాజకీయం చేస్తోంది
-
ప్ర్రజాస్వామ్యానికి బ్లాక్డే
-
ఏపీలో భగ్గుమన్న నిరసన జ్వాలలు
‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. విశాఖ జిల్లా: విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం వినూత్న నిరసన చేపట్టింది. శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి ఆధ్వర్యంలో మహిళలు నల్ల చీరలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ’ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు అక్కరమాని విజయనిర్మల, కెకె రాజు, మళ్ల విజయప్రసాద్, రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గాంధీ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ టౌన్ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలిలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. తన స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబుకు హితవుపలికారు. శాసనమండలిలో చైర్మన్ వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ నాయకులు తప్పుబట్టారు. విశాఖ నార్త్లో: శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ నార్త్ కన్వీనర్ కేకే రాజు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్ నుంచి నల్ల వస్త్రాలు ధరించిన మహిళలు నిరసనలో ర్యాలీలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు అండ్ కో పై కేకే రాజు మండిపడ్డారు. ఎన్ఏడీ జంక్షన్లో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ ఎన్ఏడీ జంక్షన్లో విశాఖ వాసులు మానవహారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ విశాఖ వెస్ట్ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్ సంఘీభావం తెలిపారు. విశాఖ నార్త్ కన్వీనర్ కేకేరాజు మాట్లాడుతూ.. విశాఖ ప్రజల ఓట్లతో పరువు నిలబెట్టుకున్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర ద్రోహానికి పాల్పడ్డారన్నారు. విజయప్రసాద్ మాట్లాడుతూ.. శాసనమండలి చైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధం అని మండిపడ్డారు. పదవులు, బినామీ ఆస్తుల కోసం చంద్రబాబు ఎంతటి మోసానికైనా ఒడిగడతారన్నారు. పశ్చిమగోదావరిలో: శాసనమండలి టీడీపీ వైఖరికి నిరసనగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు విశాల్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులు,కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా: టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమ ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేశాడంటూ న్యాయవాదులు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ ఫరూక్ కార్యాలయం ముట్టడి మండలిలో టీడీపీ వైఖరికి నిరసనగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నేతలు ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును టీడీపీ వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకుని కర్నూలు జ్యూడిషియల్ క్యాపిటల్కు మద్దతు పలకాలని, లేని పక్షంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. జేఏసీ నేతలు.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు అనంతపురం జిల్లా: ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా గుత్తిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు. కల్యాణదుర్గంలో.. వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసనగా కల్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఆంధ్రుల ద్రోహి చంద్రబాబు అని, శాసనమండలి బిల్లులను అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుకు నిరసనగా తిరుపతి ఎస్వీయూలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. మండలి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. రియల్ హీరో వైఎస్ జగన్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన నేత ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం జగన్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు. గురువారం ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడానికే సీఎం జగన్ను కలిశానని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బుధవారం శాసన మండలిలో జరిగిన ఘటన దేశం మొత్తం పరిశీలించిందని, అలా జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బిల్లులు అడ్డుకున్నారని ఆరోపించారు. మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించారని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న శాసస మండలి ఉండాలా వద్దా అనే అంశంపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్ధేశంతో రూల్ 71ను టీడీపీ పెట్టిందని, అందుకే వ్యతిరేకంగా ఓటు వేశానని అన్నారు. కాగా, ఏపీ శాసన మండలిలో మంగళవారం టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71ను సునీత వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్రెడ్డి కూడా సొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. -
పెద్దల సభపై నమ్మకం పోయింది..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెద్దల సభపై నమ్మకం పోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శాసన మండలిలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణమన్నారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో శాసన మండళ్లు ఉన్నాయని.. ఏపీలో మండలి తీరు బట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా శాసన మండలిని రద్దు చేసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అధ్యక్షుడు కూడా శాసనమండలి కి వచ్చి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదన్నారు. శాసన మండలి చైర్మన్ దైవభక్తి, నిజాయితీ గల వ్యక్తి అని.. కానీ చంద్రబాబు ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ముఖ కవళికల్లో కనిపించిందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశం శాసన మండలిలో చర్చకు రాకుండా పక్కకు పెట్టడం అత్యంత నిబంధనలకు విరుద్ధం అని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలు ముందుగా సభ్యులకు తెలియజేయాలన్నారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం అని చెప్పడం కూడా రూల్స్కు విరుద్ధమేనన్నారు. చైర్మన్కు నేరుగా రూలింగ్ ఇచ్చే అధికారం లేదని.. కమిటీకి పంపించాలా లేదా అనే అంశాన్ని సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పారు. సభ్యులు ఓటింగ్ కోరితే సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపిన విషయం పై ఓటింగ్ కూడా నిర్వహించాల్సిన బాధ్యత చైర్మన్ కు వుందని వివరించారు. మండలి లో నిన్న జరిగిన తీరు అప్రజాస్వామికం అని వీరభద్రరావు పేర్కొన్నారు. (చదవండి: బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...) -
గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో తీసుకున్న ప్రతి కీలక నిర్ణయాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో శాసనమండలి జరుగుతోందని, ఈ పరిస్థితుల్లో మండలి ఉండాలా? లేదా? అనే చర్చ జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీడీఆర్ఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి నివేదించిన అంశంపై ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబునాయుడు మండలి గ్యాలరీలో కూర్చోవాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. ‘శాసనమండలి గ్యాలరీలో చంద్రబాబు ఉన్నారని తెలిసి.. నేను కూడా ఆసక్తిగా వెళ్లాను. నిబంధనల ప్రకారం మండలిలో బిల్లులపై ఓటింగ్ జరుగుతుందని భావించా. కానీ చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం ఆశ్చర్యంగా అనిపించింది. సెలెక్ట్ కమిటీకి పంపాలంటే సవరణలు ప్రవేశపెట్టాలి కానీ, వాటిని ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఓటింగ్ జరుగుతుందని భావించాం. కానీ, నిబంధనలకు విరుద్ధంగా చివర్లో చైర్మన్ విచాక్షణాధికారం అంటూ సెలెక్ట్ కమిటీకి పంపించారు. వికేంద్రీకరణ బిల్లు ఇప్పుడప్పుడే చట్టం కాకూడదనే కుట్రతోనే సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీకి నివేదించడం వల్ల రెండు, మూడు నెలల జాప్యం జరుగుతుంది. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఎంతకాలం ఆపగలరు’ అని అంబటి ప్రశ్నించారు. రైతులను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. శాసనసభ అమరావతిలో జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. అమరావతి రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. వ్యవస్థలను దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట అని, చంద్రబాబు ప్లాన్లో భాగంగా అభివృద్ధి నిరోధకంగా శాసనమండలి మారుతున్నప్పుడు దాని కొనసాగింపుపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. -
‘టీడీపీ నేతలు దళితుల భూములను లాక్కున్నారు’
సాక్షి, అమరావతి: దళితుల భూములను మభ్యపెట్టి, భయపెట్టి మరీ టీడీపీ నేతలు లాక్కున్నారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ దొంగల ముసుగులు తొలగుతున్నాయని తెలిపారు. టీడిపీకి చెందిన నేతలు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై సీఐడీ నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా దళిత మహిళ బుజ్జమ్మ ఫిర్యాదుతో మాజీ మంత్రుల భూ భాగోతం బయపడిందని ఆయన మండిపడ్డారు. బుజ్జమ్మ లాంటి బాధిత దళితులు రాజధాని ప్రాంతంలో చాలామంది ఉన్నారని అనిల్ కుమార్ తెలిపారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్: పత్తిపాటి, నారాయణపై కేసులు సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ చేసి.. ఇన్సైడర్ ట్రేడింగ్ కలుగులో ఉన్న టీడీపీ నేతల బండారాన్నీ బయటపెట్టాలి పేర్కొన్నారు. పేదల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన భూములను కాపాడుకునేందు పరిపాలన వికేంద్రీకరణను టీడీపీ అడ్డుకుంటుందని అనిల్ కుమార్ మండిపడ్డారు. టీడీపీ నేతలు మండలి చైర్మన్పై ఒత్తిడి చేసి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకొనేలా చేశారని అనిల్ కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ -
మండలి చైర్మన్కు ఆ విచక్షణాధికారం లేదు
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించే విషయంలో శాసనమండలి చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం మండలిలో జరిగిన ఈ వ్యవహారంపై బుగ్గన గురువారం అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో శాసనమండలికి పరిమితమైన ఆప్షన్స్ మాత్రమే ఉంటాయని, ఆ బిల్లును చర్చించి ఆమోదించడం, లేదా సవరణలతో మళ్లీ శాసనసభకు పంపించడం వంటి ఆప్షన్స్ ఉంటాయని, కానీ టీడీపీ కుట్రపూరితంగా రూల్ 71 అంశాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. నిజానికి రూల్ 71 నిబంధన కేవలం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే ఉందని, ఏపీ అసెంబ్లీలో కూడా అది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రభుత్వ పాలజీని చర్చించి మండలి తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కొన్ని సంవత్సరాల కిందట ఈ నిబంధనను మండలిలో చేర్చారని వివరించారు. నిజానికి శాసనప్రక్రియలో గవర్నమెంట్ బిజినెస్కు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని, ఈ మేరకు స్పష్టంగా నిబంధనలు ఉన్నా.. వాటిని ఉల్లంఘిస్తూ చైర్మన్ రూల్ 71కింద సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారని తెలిపారు. అలా రిఫర్ చేసే సమయంలో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తాము లేఖలు ఇచ్చినట్టు టీడీపీ చెప్పుకొచ్చిందని తెలిపారు. నిజానికి రూల్ 71 కింద బిల్లులను సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసే అధికారమే లేదని బుగ్గన తెలిపారు. సెలెక్ట్ కమిటీకి పంపే ప్రొవిజన్ లేకపోయినా, విచక్షణాధికారం కింద బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించినట్టు చైర్మన్ చెప్పారని, కానీ, ఇది చైర్మన్ విచక్షణాధికారం కిందకు రాదని, దీనికి సంబంధించి స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. మండలిలో టీడీపీ సభ్యుల ప్రవర్తన నవ్వులాటలాగా ఉందని, మండలిలో బలముంది కదా అని అన్ని చట్టాలను, నిబంధనలను, సంప్రదాయాలను టీడీపీ తనకు అనుకూలంగా ఇష్టానుసారంగా వాడుకుంటోందని దుయ్యబట్టారు. తీర్మానాలు, బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో ఆ సమయాన్ని మార్చడానికి చైర్మన్కు విచక్షణాధికారం ఉంటుందని, సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడంలో కాదని తెలిపారు. ప్రజల తరఫున ఎన్నికైన ప్రభుత్వం ప్రధాన బాధ్యత చట్టాలు రూపొందించడమని, శాసన వ్యవస్థ ప్రథమ బాధ్యత కూడా ఈ చట్టాలను ఆమోదించడమని, ఈ విషయంలో దిగువసభ అసెంబ్లీకే విశేష అధికారాలు ఉంటాయని భారత రాజ్యాంగం కూడా స్పష్టం చేస్తుందని, కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఏదో రూల్ తీసుకొచ్చి.. పరిపాలనను అడ్డుకునేందుకు, చట్టాల రూపకల్పన ప్రక్రియకు మోకాలడ్డేందుకు ప్రయత్నిస్తోందని బుగ్గన తప్పుబట్టారు. నిన్న సాయంత్రం మండలిలో జరిగింది చాలా బాధాకరమని, నాలుగు గంటలసేపు గ్యాలరీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూర్చొన్నారని, అసలు ఎప్పుడూ మండలికి రాని చంద్రబాబు వచ్చి.. అంతసేపు కూర్చోవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. చైర్మన్ ఎదుట కూర్చొని.. చైర్మన్ను ప్రభావితం చేసేవిధంగా చంద్రబాబు వ్యవహరించారని, ఈ విషయంలో తప్పు చేసినవారిదే కాకుండా తప్పు చేయించేలా ప్రభావితం చేసిన వారిది ఇంకా పెద్ద తప్పు అని మండిపడ్డారు. టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు మంత్రులు సభకు తాగొచ్చారంటూ బాధ్యతారహితంగా, దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇతర పార్టీల సభ్యులు సోము వీర్రాజు, మాధవ్తోపాటు పీడీఎఫ్, కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుడు కూడా చైర్మన్ చేసింది తప్పని నిర్ద్వంద్వంగా చెప్పారని గుర్తు చేశారు. మండలి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తిఇ తటస్థంగా వ్యవహరించాలని అన్నారు. -
‘చంద్రబాబు ఒక అరాచక శక్తి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు అనర్హుడని.. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అన్నారు. ఈ నెపంతో రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అశాంతిని పెంచాలనే కుట్రతో 40 రోజులుగా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తోన్న చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే.. వేల కోట్లు ఖర్చు పెట్టి శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాశ్వత హైకోర్టు, శాసనసభ, సచివాలయాలు లేవని.. తాత్కాలిక భవనాలతో వేల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వేల ఎకరాలను దోచేశారని ధ్వజమెత్తారు. 13 జిల్లాల అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తెచ్చారని.. టీడీపీ దీనిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి మాత్రమే కాదని..13 జిల్లాల అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే శాసనమండలిలో ఎమ్మెల్సీలు అరాచకం సృష్టించారని తెలిపారు. చంద్రబాబు, చైర్మన్లు కలిసి శాసనమండలి ఔన్నత్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు 29 గ్రామాలకు ప్రతిపక్ష నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకుని..చంద్రబాబు పైశాచిక ఆనందం.. నిన్నటి రోజు చరిత్రలో బ్లాక్డే గా మిగిలిపోతుందని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగాని గురునాథం అన్నారు. చంద్రబాబు మంది బలంతో చట్టాలను చుట్టంగా చేసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల బలం ఉందని పేర్కొన్నారు. 13 జిల్లాల అభివృద్ధిని అడ్డుకుని చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. 40 సంవత్సరాల అనుభవంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు,యనమల రామకృష్ణుడు చేసిన కుటిల రాజకీయాలు మండలి సాక్షిగా బహిర్గతమయ్యాయన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి.. రాయలసీమ వాసులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర నేత రాజ్కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు మండలిలో ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఐదు కోట్ల ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాయలసీమ రాజధాని కోసం తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని రాజ్కుమార్ స్పష్టం చేశారు. -
‘స్వార్థం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారు’
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. శాసన సభలో అత్యధిక మెజార్టీతో ఆమోదం పొందిన రెండు చారిత్రాత్మక బిల్లులను(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు) చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం మండలిలో అడ్డుకున్నారని ఆరోపించారు. (చదవండి : పవన్కు బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు!) తన వ్యూహంలో భాగంగానే రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేలా కుట్రపన్నారని ఆరోపించారు. చంద్రబాబు తన మనుగడ కోసం ఎంత నీచానికైనా తెగిస్తాడనడానికి బుధవారం మండలిలో జరిగిన పరిణామాలే నిదర్శమన్నారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
ప్రతిపక్షాల వైఖరి సరైంది కాదు
సాక్షి, విశాఖపట్నం: శాసన మండలి చైర్మన్ తన విచక్షణాధికారాలతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం శాసన మండలి చరిత్రలోనే ఇదే మొదటిసారని ఏయూ పొలిటికల్ సైన్స్ విశ్రాంతాచార్యులు ప్రొఫెసర్ కె.రవి అన్నారు. ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించడాన్ని ఆయన తప్పుపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ను ప్రభావితం చేసేలా వ్యవహరించడం తప్పని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధమని ప్రొఫెసర్ రవి పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తే అసలు వీరు ప్రజాస్వామ్య వాదులేనా, వీరికి ప్రజాస్వామ్యం మీద నమ్మకముందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రతిపక్షాల వైఖరి సరైంది కాదని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాలను ఆశ్రయించకుండా వికృత చేష్టలతో గొడవకు దిగి బిల్లును ఆపడం అప్రజాస్వామికమే అవుతుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదించకుండా తిరోగమనం చెందటం ప్రజలకు నిరాశాజనకమని పేర్కొన్నారు. చదవండి: ఇది తప్పే.. సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారు? -
దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరలేపింది
సాక్షి, అమరావతి: శాసనమండలిని అభివృద్ధి నిరోధకంగా మార్చాలని టీడీపీ యత్నిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం అని... ఆయన నిర్ణయాన్ని మేధావులంతా తప్పుబడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలని కోరారు. రాజ్యాంగ విలువలను టీడీపీ అపహాస్యం చేసిందన్నారు. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అవసరం లేదన్నారు. ఇది చంద్రబాబు ప్రభావం వల్లే జరిగిందన్నారు. చైర్మన్ను రూల్ ప్రకారం వ్యవహరించాలని కోరామని తెలిపారు. మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఆందోళన కలిగిస్తున్నాయని అంబటి పేర్కొన్నారు. చాలా రాష్ట్రంలో మండలి లేదని.. మన రాష్ట్రంలోనే ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి రెండు సభలు దోహదపడాలని.. లేదంటే ఏమైనా ప్రభుత్వం చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సవరణలు చేయాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ బిల్లులను టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. మండలిలో మెజార్టీ ఉంటే తిరిగి పంపొచ్చని.. అలా కాకుండా బిల్లును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి నిరోధక శక్తిగా టీడీపీ మారిందని.. ఇటువంటి సమయంలో శాసన మండలి అవసరమా అనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మండలిలో టీడీపీ తీరుపై ప్రజలంతా ఆలోచించాలన్నారు. సభలో దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరలేపిందన్నారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానని చెప్పే చంద్రబాబు గ్యాలరీలో ఎందుకు చైర్మన్ ఎదురుగా కూర్చున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు. పెద్దల సభను పిల్లల సభలాగా మార్చుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభావంతోనే మండలి చైర్మన్.. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపారన్నారు. బిల్లులను తాత్కాలికంగా మాత్రమే అడ్డుకోగలరని.. శాశ్వతంగా అడ్డుకోలేరన్నారు. తాము స్వాగతిస్తే టీడీపీ ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీలోకి క్యూ కడతారని.. కానీ అది తమ విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం.. రాజధాని విషయంలో జోక్యం చేసుకోదన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం పవన్కల్యాణ్, చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వారిపై విచారణ జరుగుతుందని.. ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. తప్పుచేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. (చదవండి: మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం)