Avanthi Srinivasa rao
-
బాబే భూబకాసురుడు
-
రాజకీయాల్లో ఉన్నంత వరకూ వైఎస్సార్ సీపీతోనే..
కొమ్మాది (భీమిలి): త్వరలో టీడీపీలోకి వెళ్లిపోతున్నానని, అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని పలువురు దు్రష్పచారం చేస్తున్నారని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్సార్సీపీతోనే ఉంటానని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మధురవాడలో జరిగిన ఆసరా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు మైండ్ గేమ్ ఆడుతూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షనేతలకు పుట్టగతులుండవని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
విశాఖకు రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి: అవంతి
-
వికేంద్రీకరణ కోసం రాజీనామాకు నేను సిద్ధం: కరణం ధర్మశ్రీ
-
స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈక్రమంలోనే విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్లో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణ వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే, ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది. టూ టౌన్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపింది. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. చదవండి: (Visakhapatnam: అవసరమైతే రాజీనామాకు సిద్ధం: అవంతి శ్రీనివాస్) -
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి: అవంతి శ్రీనివాస్
-
అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడా చెప్పలేదు: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ సమావేశమైంది. ప్రొఫెసర్ లజపతిరాయ్ అధ్యక్షతన విశాఖపట్నంలో శనివారం ఉత్తరాంధ్ర మేధావులు భేటీ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.., ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖకు రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జేఏసీ ఆవిర్భవించింది. రాజకీయేతర జేఏసీలో ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాల భాగస్వామ్యం ఉంటుందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి సహా కర్నూలు, విశాఖ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అవసరమైతే విశాఖ రాజధాని కోసం నా పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. చదవండి: (వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు) విశాఖకు మద్దతుగా భారీ ర్యాలీ అక్టోబర్ 15 న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో మండల, నియోజక వర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. -
3 రాజధానులే మా విధానం
మధురవాడ (భీమిలి): రాష్ట్రంలో మూడు రాజధానులే తమ ముఖ్యమంత్రి ఉద్దేశం, తమ ప్రభుత్వ విధానం అని విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆమె సోమవారం విశాఖ జిల్లా ఆనందపురం మండలం తంగుడుబిల్లిలో 519 ఎకరాల్లో 263 కోట్లతో నిర్మించనున్న 16,690 ఇళ్ల జగనన్న హౌసింగ్ కాలనీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో పరిపాలన, కర్నూలులో న్యాయ, అమరావతిలో శాసన రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడుకి రాష్ట్రం బాగుపడడం, మంచి జరగడం ఇష్టం ఉండదని, అందుకే అమరావతి పేరుతో పాదయాత్ర ప్లాన్ చేశారని విమర్శించారు. ఈ వయసులో చంద్రబాబు పాదయాత్ర చేయలేడని, లోకేశ్ చేసినా ఉపయోగంలేదని భావించి అమరావతి పేరుతో అక్కడి వారిని రెచ్చగొట్టి పాదయాత్రకు ప్లాన్ చేశారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జనం జగనన్న వెంటే ఉన్నారన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర వల్ల ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తినా చంద్రబాబే బాధ్యత వహించాలని చెప్పారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అటు సూర్యుడు ఇటు వచ్చినా విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని పేర్కొన్నారు. చంద్రబాబులాంటి వారు ఎన్ని కుట్రలు పన్నినా అడ్డుకోలేరన్నారు. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ఆగదని చెప్పారు. ప్రజలకు మేలు చేయడానికి కావాల్సింది పెద్ద వయసు కాదని, పెద్ద మనసని పేర్కొన్నారు. ఆ పెద్ద మనసు సీఎం జగన్మోహన్రెడ్డికి ఉందని ఆయన చెప్పారు. -
ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తా
తగరపువలస (విశాఖపట్నం): సీఎం వైఎస్ జగన్ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేసే ప్రశ్నేలేదన్నారు. చిట్టివలస బంతాట మైదానంలో సోమవారం జీవీఎంసీ భీమిలి జోన్కు చెందిన 363 మంది వలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర అవార్డుల కింద ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు అదనపు అర్హత మాత్రమేనని చెప్పారు. శక్తియుక్తులన్నీ ఉపయోగించి భీమిలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్వన్గా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో త్వరలో భీమిలిలో రూ.25 కోట్లతో ఫిష్ల్యాండింగ్ సెంటర్, సీఎస్ఆర్ నిధులతో ఆర్టీసీ కాంప్లెక్స్ హామీ నెరవేరిస్తే 95% ఎన్నికల హామీలు నెరవేర్చినట్టేనని చెప్పారు. విద్యుత్ సమస్యలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు పెద్ద వయసు, అనుభవం ఉన్నా జగన్లా పెద్ద మనసు లేదన్నారు. ఇన్నాళ్లు జగన్ కేబినెట్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నూరుశాతం మంచివారని చెప్పారు. టీడీపీ నేతలు వలంటీర్లను హేళన చేశారని గుర్తుచేశారు. వలంటీర్లే లేకుంటే కరోనా కాలంలో మరిన్ని ప్రాణాలు పోయేవని ఆయన పేర్కొన్నారు. -
పొలమే పర్యాటక స్థలం
సాక్షి, అమరావతి: వ్యవసాయం పర్యాటక సొబగులను అద్దుకోనుంది. సాగు క్షేత్రమే సందర్శనీయ స్థలంగా మారనుంది. వ్యవసాయాన్ని ప్రోత్స హించడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ వనరుగా అగ్రి టూరిజం అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ఆర్థిక వనరులను నగరాల నుంచి గ్రామాలకు పంపిణీ చేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల సందర్శకులు పొలం గట్లపై నడిచేలా.. పొలం దున్నేలా.. పంట కోస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరేలా వ్యవసాయ క్షేత్రాలు రూపుదిద్దుకున్నాయి. వ్యవసాయ విజ్ఞానాన్ని, వినోదాన్ని పర్యాటకులకు ఒకేచోట అందిస్తున్నాయి. ‘గెస్ట్–హోస్ట్’ ప్రాతిపదికన దేశంలో అగ్రి టూరిజం గెస్ట్–హోస్ట్ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఈ విధానంలో పొలం యజమానులే పర్యాటకులకు వ్యవసాయ క్షేత్రంలో భోజన వసతి కల్పిస్తారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే సందర్శకులు రైతుల దైనందిన కార్యకలాపాల్లో పాలుపంచుకోవచ్చు. స్వయంగా సాగు విధానాలు తెలుసుకోవచ్చు. పొలం గట్లపై భోజనం చేస్తూ ఆహ్లాదాన్ని పొందొచ్చు. తద్వారా పర్యాటకులు స్థానిక ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పండుగలు, ప్రకృతి పరిశీలన చేయడంతోపాటు చేపల వేట వంటి వ్యవసాయ ఆధారిత, అనుబంధ రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించొచ్చు. ప్రకృతి ఒడిలో ‘ఆదరణ’ అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపా పురం గ్రామంలో ‘ఆదరణ’ పేరుతో అగ్రి టూరిజం సెంటర్ నడుస్తోంది. అక్కడ పూర్తిగా ప్రకృతి వ్యవ సాయం చేస్తున్నారు. ఇక్కడే నేచురల్ ఫార్మింగ్కు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది. ప్రత్యేక ప్యాకేజీతో పర్యాటకులు, పాఠశాల విద్యార్థులకు సంపూర్ణ వ్యవసాయ విధానాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఎడ్లబండి నడపటం, మేకల పెంపకం, జీవామృతాల తయారీ, తిరగలి పిండి విసరడం, రోకలి దంచడం, వెన్న చిలకడం వంటి వ్యవసాయ, గ్రామీణ పనులతోపాటు గ్రామీణ క్రీడలతో ఆహ్లాదాన్ని పంచుతున్నారు. అగ్రి టూరిజాన్ని విస్తరిస్తాం.. రాష్ట్రంలో అగ్రి టూరిజాన్ని ప్రోత్సహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పాడేరు ప్రాంతాల్లో ఇలాంటి విధానమే ఉంది. త్వరలో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వ్యవసాయ పర్యాటకాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి సాగు అనుభూతి పట్టణాల్లోని ప్రజలు, ఉద్యోగులు వారాంతాల్లో వినోదాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని అగ్రి టూరిజం విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వీకెండ్ వ్యవసాయం చేయాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. – వరప్రసాద్రెడ్డి, చైర్మన్, ఏపీ టీడీసీ -
అన్ని వర్గాల వికాసానికి సీఎం జగన్ అండ
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అందించి అన్ని సామాజిక వర్గాల వికాసానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలుస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు సాహిత్యం, సంగీత, నృత్య, నాటక రంగాల అభ్యున్నతకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వివిధ అకాడమీల సభ్యుల ప్రమాణ స్వీకారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటక రంగాల్లో బహుముఖ పురోగతి, పద్య, ఆధునిక నాటక వికాసం, శిల్ప, చిత్రకళల అభివృద్ధి, జానపద కళారూపాల అభివృద్ధి, ఆధునికీకరణ, తెలుగు ప్రజల చారిత్రక పరిశోధన, ఆవిష్కరణ, టెక్నాలజీ, డిజిటల్ రంగాలకు సంబంధించిన ఆధునిక ఆవిష్కరణ లక్ష్యాలుగా ప్రభుత్వం ఏడు అకాడమీలను పునరుద్ధరించిందని వివరించారు. ఈ అకాడమీలకు ఇదివరకే చైర్మన్లను నియమించామని తెలిపారు. ఆయా అకాడమీలకు ప్రభుత్వం నామినేట్ చేసిన డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించడం ఆనందంగా ఉందన్నారు. నూతనంగా ఎన్నికైన వారంతా అకాడమీల కీర్తి, ప్రతిష్టలను పెంచేలా కృషిచే యాలని కోరారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను అభినందించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ పి.శ్రీలక్ష్మి, సంగీత, నృత్య అకాడమీ చైర్మన్ పి.శిరీష యాదవ్, నాటక అకాడమీ చైర్మన్ ఆర్.హరిత, దృశ్య కళల అకాడమీ చైర్మన్ కుడుపూడి సత్యశైలజ, జానపద కళల చైర్మన్ కె.నాగభూషణం, చరిత్ర అకాడమీ చైర్మన్ కె.నాగమల్లేశ్వరి, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ టి.ప్రభావతి, రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్మన్ వంగపండు ఉష, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, సీఈవో మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించకుంటే లీజులు రద్దు
సాక్షి, అమరావతి: పర్యాటక రంగం ఆదాయన్ని పెంచే లక్ష్యంతో అభివృద్ధి, విస్తరణ చర్యలు చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్తో దెబ్బతిన్న పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడినపడుతోందన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ.200 కోట్ల ఆదాయ ఆర్జన లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పర్యాటక సంస్థ ఆస్తులకు సంబంధించి రూ.31.08 కోట్ల లీజు బకాయిలు రావాల్సి ఉందన్నారు. సకాలంలో లీజు అద్దెను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. 13 ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రూ.35 కోట్లతో 18 చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లను ఆధునికీకరించనున్నట్టు వివరించారు. ఉగాది నాటికి పర్యాటక యాప్ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలు ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 13 రకాల క్రీడలతో సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్టు మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో టోర్నీ పూర్తవగా వచ్చే వారంలో మిగిలిన జిల్లాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన 1,497 మంది క్రీడాకారులకు దాదాపు రూ.8.55 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు అందజేశామన్నారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రతిపాదనల మేరకు రూ.7.50 కోట్లతో విశాఖపట్నం కొమ్మాదిలో ఈతకొలను, రూ.5.50 కోట్లతో కర్నూలు డీఏస్ఏ స్టేడియంలో సింథటిక్ టర్ఫ్ ఫుట్బాల్ మైదానం, రూ.7.50 కోట్లతో కడపలో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ (8 లేన్లు), రూ.7.50 కోట్లతో నెల్లూరు జిల్లా స్పోర్ట్సు విలేజ్ మొగలాయిపాలెంలో 400 మీటర్లు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ (8 లేన్లు) ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్రతిభా వంతుల కోసం ఆయా సంక్షేమ శాఖల సమన్వయంతో 8 క్రీడా పాఠశాల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. కొత్త జిల్లాలపై చంద్రబాబు వైఖరేంటి? అభివృద్ధి వికేంద్రీకరణ, సత్వర సేవలే లక్ష్యంగా జిల్లాల విభజన చేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. అనవసర విమర్శలు కాకుండా జిల్లాల విభజనపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జిల్లాలను విభజించినప్పుడు చంద్రబాబు ఇక్కడ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి ముత్తంశెట్టి సాంస్కృతిక శాఖలో కొత్తగా నియమితులైన వివిధ అకాడమీ చైర్మన్లతో తొలిసారిగా సమావేశమయ్యారు. రాఘు హరిత (నాటక అకాడమీ), సత్యశైలజ (దృశ్య కళల), నాగభూషణం (ఫోక్–క్రియేటివిటి), ప్రభావతి (సైన్స్ అండ్ టెక్నాలజీ), నాగమల్లేశ్వరి (హిస్టరీ), శిరీషా యాదవ్ (సంగీత, నృత్య), లక్ష్మి (సాహిత్యం)లను మంత్రి సన్మానించారు. -
త్వరలో టూరిజం యాప్
విశాఖ తూర్పు/భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల వివరాలతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం యాప్ను ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలను మంగళవారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ అనుమతితో విశాఖ నుంచి రాయలసీమ వరకు టూరిజం సర్క్యూట్కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అందమైన ప్రాంతాలు పురాతన, చారిత్రాత్మక ప్రాంతాలతోపాటు ఆలయాలు, సాహస క్రీడల పర్యాటకానికి అపార అవకాశాలున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా విశాఖ నుంచి గోదావరి, కృష్ణలంక, గండికోట మొదలైన ప్రాంతాలను సర్క్యూట్గా తీర్చిదిద్దితే పర్యాటకం గణనీయంగా అభివృద్ది చెందుతుందన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వరప్రసాదరెడ్డి, కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి భారతదేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఎల్ మల్రెడ్డి చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్లో మంగళవారం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా, యోగా నిపుణుడు కేవీఎస్కే మూర్తి 12 నిమిషాల్లో 12 సూర్య నమస్కారాలను 108 సార్లు ప్రదర్శించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు దక్కించుకున్నారు. అవార్డును ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జివీఎన్ఆర్ఎస్ఎస్ఎస్ వరప్రసాద్ ప్రదానం చేశారు. -
పర్యాటక ప్యాకేజీలతో ఆదాయం పరుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటిస్తున్న ప్యాకేజీల కారణంగా ఆ శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.24.05 కోట్లు ఆర్జించింది. ఇందులో తిరుపతి ప్యాకేజీల నుంచే అత్యధికంగా రూ.18 కోట్లు రావడం విశేషం. ఒక్క డిసెంబర్లోనే రూ.4 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ లోకల్టూర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. మరోవైపు కార్తీకమాసంలో శైవక్షేత్రాలు, శక్తిపీఠాల ప్యాకేజీలు కొంతమేరకు ఆదాయవృద్ధికి దోహదపడ్డాయి. ప్రస్తుతం పర్యాటక శాఖ 35 టూర్ ప్యాకేజీలను నడుపుతూ.. 30 సొంత బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబయి వంటి మెట్రో నగరాల నుంచి తిరుపతికి విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటకు బెంగళూరు, హైదరాబాద్ నుంచి పర్యాటకుల రాకను ప్రోత్సహిస్తున్నారు. కోవిడ్ ప్రారంభమైన తర్వాత పడిపోయిన పర్యాటకశాఖ ఆదాయం ప్యాకేజీలతో తిరిగి పుంజుకుంటుంది. తిరుపతికి ఇలా.. రవాణాతో పాటు వసతి, స్వామివారి దర్శనం కల్పిస్తుండడంతో తిరుపతి టూర్ ప్యాకేజీలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం కర్నూలు, ఒంగోలు, ప్రొద్దుటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు నుంచి తిరుపతికి పర్యాటక శాఖ బస్సులు నడుపుతోంది. మరోవైపు చెన్నై–వళ్లూరు–తిరుపతి, తిరుపతి–శ్రీశైలం, తిరుపతి–కాణిపాకం–స్వర్ణ దేవాలయం, అరుణాచలం తదితర లోకల్ ప్యాకేజీలను అందిస్తోంది. లోకల్ టూరిజం.. స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విశాఖపట్నం–లంబసింగి, విశాఖపట్నం–అరసవిల్లి దేవాలయం, రాజమండ్రి–మారేడుమిల్లి, కర్నూలు–శ్రీకాకుళం–నంద్యాల, శ్రీకాకుళంలో అరసవిల్లి–శ్రీకూర్మం–శాలిహుండం–కళింగపట్నంకు ఒక్కరోజులో చుట్టివచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే సర్క్యూట్ టూరిజంలో భాగంగా కొత్తగా అనంతపురం–కదిరి–వేమనగారి జన్మస్థలం ప్రాంతం–గండి ఆంజనేయస్వామి దేవాలయం, గండికోట, బెలూం గుహలు, తాడిపత్రి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో కలిపి రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది. ఈ ప్యాకేజీల ద్వారా పర్యాటక శాఖ సిబ్బంది జీతాలు, రవాణా ఖర్చులు అన్నీ పోనూ నికరంగా సుమారు రూ.6 కోట్లకు పైగా ఆదాయం లభించింది. పర్యాటకానికి కొత్త ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యూట్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా హైదరాబాద్, ముంబయి నుంచి విమాన ప్యాకేజీని ప్రవేశపెట్టాం. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఏపీ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి సొంత బస్సుల్లో సురక్షితంగా.. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పర్యాటక ప్యాకేజీలను నడుపుతున్నాం. కోవిడ్ కారణంగా రెండేళ్లలో ఎన్నడూ లేనంత వృద్ధి కేవలం ఆరు నెలల్లో సాధించాం. సొంత బస్సుల్లో సురక్షితంగా పర్యాటకులను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో ఎక్కువ ఆదరణ లభిస్తోంది. – ఎస్. సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ -
భోగి సంబరాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్
-
మూడు రాజధానులతోనే సమాన అభివృద్ధి
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. పాలకవర్గం ఏర్పడిన తరువాత మొదటిసారి ఆదివారం జిల్లా పరిషత్ సమావేశం చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. మూడు రాజధానులపై తీర్మానం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రతిపాదించగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. సభ్యులంతా ఆమోదించారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. అలాగే విశాఖ స్టీల్ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. తొలి సమావేశంలో ఏడు స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక నిర్వహించారు. మొదటి స్థాయి సంఘంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏడో స్థాయి సంఘంలో మంత్రి ముత్తంశెట్టి సభ్యులుగా ఎన్నికైనట్టు చైర్పర్సన్ సుభద్ర ప్రకటించారు. మాజీ సీఎం రోశయ్య, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్, విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సభ సంతాపం తెలిపింది. -
మంచి సౌకర్యాలతో మెరుగైన ఆదాయం
సాక్షి, అమరావతి: భద్రాచలం నుంచి పాపికొండలకు వచ్చే పర్యాటకులకు వీలుగా పోచవరంలో ఈ నెల 14 నుంచి బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. పర్యాటకులకు రాత్రి బస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 20వ తేదీలోగా పోలవరం నుంచి పాపికొండలకు కొత్త బోటింగ్ పాయింట్ను ప్రారంభించాలని, వారంలోగా నాగార్జునసాగర్లో బోట్ సర్వీసు నడపాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే హరిత రెస్టారెంట్ల్ల ఆదాయం మెరుగుపడుతోందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 69.57 కోట్లు వచ్చిందని తెలిపారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు పర్యాటకానికి మంచి సీజన్ అని, రెస్టారెంట్లలో పూర్తిస్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ, నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఆక్యుపెన్సీని పెంచాలని అధికారులను ఆదేశించారు. గండికోటలో రూ.4.50 కోట్లతో రోప్ వే, బొర్రా గుహల్లో రూ. 2.70 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, మారేడుమిల్లిలో రూ.1.15 కోట్లతో కాటేజీలు, అడ్వంచర్ స్పోర్ట్స్ పనులు వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. లంబసింగికి వచ్చే పర్యాటకుల కోసం తాత్కాలికంగా చేపట్టిన రెస్టారెంట్, టాయిలెట్స్ పనులు వారంలోగా పూర్తి చేస్తామన్నారు. పాండ్రంగిలో అల్లూరి మ్యూజియం, కృష్ణ్ణదేవిపేటలో ఆయన సమాధి అభివృద్ధి పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు, ఉత్తమ క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పూర్తయిందని, ఈ నెల 11, 12 తేదీల్లో విజయనగరంలో కొనసాగుతుందన్నారు. మార్చిలో రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహించి సీఎం చేతులమీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు. -
నైపుణ్య పోటీల్లో సత్తా చాటిన ఏపీ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ అవార్డులను సొంతం చేసుకుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో విశాఖలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ నైపుణ్య పోటీలు ఘనంగా ముగిశాయి. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ముగింపు వేడుకలు జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. మొబైల్ రోబోటిక్స్, ఐటీ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ కన్స్ట్రక్షన్ వంటి నైపుణ్య విభాగాల్లో రాష్ట్ర యువత పురస్కారాలు దక్కించుకుంది. 2018లో జరిగిన నైపుణ్య పోటీల్లో మన రాష్ట్రానికి 8 అవార్డులు దక్కగా, ఈసారి 20 అవార్డులు వచ్చాయి. అందులో 12 బంగారు, 8 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన వీరంతా జనవరి 6 నుంచి పదో తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటారు. జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు 2022 అక్టోబర్లో చైనాలో జరిగే ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణ) చల్లా మధుసూదనరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు మన రాష్ట్రంలోని యువతకు అందించాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. ఈ పోటీల్లో మొత్తం 51 టెక్నికల్ ట్రేడ్లో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన 124 మందిని నైపుణ్య పోటీల్లో విజేతలుగా జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. -
ఘంటసాల కుటుంబ సభ్యులకు అండగా ప్రభుత్వం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు సరస్వతీ పుత్రుడని, తన అమృత గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. ఘంటసాల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఘంటసాల శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీఎంఆర్డీఎ చిల్డ్రన్స్ ఎరీనాలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా శాఖ పోస్టల్ కవర్ విడుదల చేయగా.. మంత్రి ఆవిష్కరించారు. ఘంటసాలపై రచించిన రెండు పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, నెడ్క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర, రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్పర్సన్ వంగపండు ఉష తదితరులు పాల్గొన్నారు. -
పాపికొండల యాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్
-
పర్యాటకులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: పాపికొండలు బోటు విహార యాత్రను వచ్చే నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్లతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బోటు ఆపరేటర్లు తమ జీవనోపాధిపై మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధరను రూ.1,250 (రవాణా, భోజన వసతి)గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. భవిష్యత్లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ టూరిస్ట్ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. గత ఏడాది గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల పర్యాటక బోటింగ్ ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోటు ఆపరేటర్లు మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి కూడా పాపికొండలుకు బోట్లును నడపాలని కోరారు. -
పర్యాటక హబ్గా రాయలసీమ
తిరుపతి అర్బన్(చిత్తూరు జిల్లా): రాయలసీమను పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో హెలి టూరిజాన్ని వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతితో పాటు అవసరమైన ప్రధాన కేంద్రాల్లో స్టార్ హోటళ్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలున్న పట్టణాలకూ ఇదే పద్ధతిని అవలంభిస్తామని చెప్పారు. కరోనా కారణంగా తగ్గిన ఆదాయం.. ప్రస్తుతం పెరుగుతోందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారని, తిరుపతితో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ఆలయాలనూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యేకంగా 20కి పైగా టూరిజం బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను హబ్గా మార్చి, మెరుగైన వసతులు కల్పించి.. పర్యాటకులను ఆకర్షించేలా పలు సంస్కరణలు చేపట్టనున్నట్టు మంత్రి అవంతి వెల్లడించారు. -
పర్యాటక రంగానికి చేయూత
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చి.. రాష్ట్ర పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఫైవ్స్టార్ హోటళ్లు నిర్మించే క్రమంలో విశాఖ, తిరుపతి నగరాల్లో హోటళ్లను నిర్మించేందుకు ఓబరాయ్ హోటల్ ముందుకొచ్చినట్టు తెలిపారు. కరోనా వల్ల పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాద్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎంపీలు బి.సత్యవతి, మాధవి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, జి.బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా టూరిజం పాలసీ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి.. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు టూరిజంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని హరిత బరంపార్క్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన టూరిజం పాలసీ దేశంలోనే బెస్ట్ పాలసీ కానుందని తెలిపారు. వైజాగ్ బీచ్ కారిడార్తో పాటు ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లంబసింగి, అరకు ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. రుషికొండలో ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించామని, రికార్డ్ స్థాయిలో ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వైజాగ్, గండికోటల్లో అడ్వంచర్ బోట్స్ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. విజయవాడ హరిత బరంపార్క్కు బెస్ట్ రెవెన్యూ, బెస్ట్ ఫుడ్ ఫాల్, బెస్ట్ ఆపరేషన్స్కు గానూ ఏపీటీడీసీ అవార్డ్ను ప్రకటించింది. దీనిని బరంపార్క్ యూనిట్ మేనేజర్ శ్రీనివాస్కు రజత్ భార్గవ అందించారు. -
కోస్టల్ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం
కొండకోనల్ని చూసినా.. అందాల మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో హొయలొలుకుతున్న సాగర తీరంలో విహరిస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాల్లో అర్చన చేసినా... ఏ చోటకు వెళ్లినా భూతల స్వర్గమంటే ఇదేనేమో అన్న అనుభూతిని అందిస్తుంది విహార విశాల విశాఖ. ప్రపంచంలోని అందాలన్నీ ఓచోట చేరిస్తే బహుశా దానినే విశాఖ అంటారేమో. రాష్ట్రంలో ఏడాదికి కోటికి పైగా పర్యాటకులు వస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడి సహజసిద్ధమైన అందాలకు ఫిదా అవుతుంటారు. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖ అందాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, విశాఖపట్నం: భారత్లో అడుగుపెట్టే ప్రతి పది మంది విదేశీ పర్యాటకుల్లో ముగ్గురు విశాఖని సందర్శించేందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే అద్భుత పర్యాటక ప్రాంతాలు విశాఖ సొంతం. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాల్ని మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా టూరిజం ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్ అవ్వగా, మరికొన్ని పనులు ప్రారంభానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇంకొన్నింటికి డీపీఆర్లు తయారవుతున్నాయి. చదవండి: (ఏపీ రొయ్య.. మీసం మెలేసింది!) సర్క్యూట్లు పూర్తయితే.. సూపర్ రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్కి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉండగా.. మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్ జెట్టీ సర్క్యూట్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఈ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటంతో ఇటీవలే మంత్రి ముత్తంశెట్టి సంబంధిత అధికారులతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అనుమతులు కోరారు. అదే విధంగా బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండలను రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సర్క్యూట్లు సిద్ధమైతే.. పర్యాటకానికి మరిన్ని సొబగులు చేకూరనున్నాయి. 10 బీచ్ల అభివృద్ధితో కొత్త సోయగాలు విశాఖలోని బీచ్లంటే అందరికీ ఇష్టమే. ఆర్కే బీచ్కు రోజూ లక్షల మంది వస్తుంటారు. అందుకే కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 10 బీచ్లు అభివృద్ధి చేయనున్నారు. సాగర్నగర్, తిమ్మాపురం, మంగమూరిపేట, చేపలుప్పాడ, ఐఎన్ఎస్ కళింగ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నాగాయంపాలెం, అన్నవరం, కంచేరుపాలెం బీచ్లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఆయా బీచ్లలో పర్యాటకులకు అవసరమైన వాష్రూమ్లు, ఛేంజింగ్రూమ్స్, తాగునీటి సౌకర్యం, ఫుడ్ కోర్టులు, ఫస్ట్ఎయిడ్, సీసీటీవీ కంట్రోల్ రూమ్, సిట్టింగ్ బెంచీలు, సిట్ అవుట్ అంబ్రెల్లాలు, రిక్లైయినర్స్, చిల్డ్రన్పార్కులు, ఫిట్నెస్ ఎక్విప్మెంట్, జాగింగ్ ట్రాక్, పార్కింగ్ సౌకర్యం మొదలైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. వీటికి తోడుగా సేఫ్ స్విమ్మింగ్ జోన్లు అభివృద్ధి చెయ్యడంతో పాటు బీచ్ స్పోర్ట్స్, వాచ్ టవర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా రానున్నాయి. చదవండి: (అందరి చూపు ‘ఆంధ్రా’వైపే) రుషికొండలో పారాసెయిలింగ్ సరికొత్త సాహస క్రీడకు విశాఖనే వేదికగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్లను పరిశీలన చేసింది. రుషికొండలో పారాసెయిలింగ్ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. త్వరలోనే రుషికొండలో పర్యాటకులకు పారాసెయిలింగ్ చేసే అవకాశం కలగనుంది. లంబసింగిలో ఎకో టూరిజం అటవీ ప్రాంతాల్లో అద్భుతమైన పర్యాటక ప్రపంచాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రా ఊటీగా పిలిచే లంబసింగిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నారు. హైఎండ్ టూరిజం రిసార్టులు నిర్మించనున్నారు. పర్యాటకులకు మన్యంలో అధునాతన సౌకర్యాలు అందించేలా రిసార్టులు రూపుదిద్దుకోనున్నాయి. దీనికి సంబంధించిన డీపీఆర్ త్వరలోనే పూర్తికానుంది. రెస్టారెంట్గా ఎంవీ మా కార్గోషిప్ తెన్నేటిపార్కు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ కార్గో షిప్ ఫ్లోటింగ్ రెస్టారెంట్గా తీరంలో కనువిందు చేయనుంది. 30 గదులతో పాటు మల్టీకుజిన్ రెస్టారెంట్, బాంక్విట్ హాల్కూడా ఏర్పాటు చేస్తారు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10.50 కోట్లుగా నిర్ధారించింది. రూ.1021 కోట్లతో బీచ్ కారిడార్ కైలాసగిరి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 30 కిలోమీటర్ల పరిధిలో విభిన్న సమాహారాల కలబోతగా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. సుమారు 570 ఎకరాల విస్తీర్ణంలో రూ.1021 కోట్లతో బీచ్ కారిడార్ రూపుదిద్దుకోనుంది. సాగర తీరంలో.. సరికొత్త ప్రయాణం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాచబాట వేస్తున్న ప్రభుత్వం.. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 6 లైన్లు నిర్మించి భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి వెంబడి పర్యాటక శాఖ టూరిజం రిసార్టులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, అటవీ శాఖ భూముల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు, ఎకో క్యాంపులు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, అకామిడేషన్ బ్లాక్, గోల్ఫ్ కోర్సు నిర్మాణాలు జరగనున్నాయి. నూతన ప్రాజెక్టులు ►ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో పలుచోట్ల హోటళ్లు, రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నారు. అరకులో రిసార్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ►అరకులో 5 స్టార్ రిసార్ట్స్ అభివృద్ధికి అవసరమైన భూమిని ఐటీడీఏ నుంచి సేకరించనున్నారు. లంబసింగిలో రోప్ వేలు ఏర్పాటు చేయనున్నారు. ►పర్యాటక శాఖకు సంబంధించి జిల్లాలో మొత్తం 550 ఎకరాల భూములున్నాయి. ఈ స్థలాల్ని లీజుకి ఇచ్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు పర్యాటకాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ►సందర్శకుల సంఖ్య పెంచేందుకు వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక శాఖ ముందుకెళ్తోంది. ఇందులోభాగంగా అరకు, లంబసింగి తదితర ప్రాంతాలను అటవీశాఖతో కలిసి మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ►జాతీయ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా ప్రసాద్ పథకం, స్వదేశ్ దర్శన్ పథకం ద్వారా పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఈ ఏడాది ‘సమగ్ర వృద్ధి కోసం పర్యాటకం’ అనే అంశంపై పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. హోటళ్లను పర్యాటకశాఖ సారధ్యంలో అభివృద్ధి చేయడంతో పాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్లు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కొత్త టూరిజం ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం లభించనుంది. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. – ముత్తంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి -
ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి అవంతి
-
ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్: మంత్రి అవంతి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తితో పర్యాటక శాఖకు నష్టం వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 13 చోట్ల 5 స్టార్ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని చెప్పారు. ప్రసాదం పథకం కింద శ్రీశైలంలో అభివృద్ధి చేశాం.. సింహాచలంలో ఆ పథకం కింద రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని వివరించారు. పర్యాటన ప్రాంతాల వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని పేర్కొన్నారు. స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్యాకేజిలు రూపొందిస్తామని వెల్లడించారు. సీ ప్లేన్స్ కూడా తీసుకొచ్చి విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు గుర్తుచేశారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో మద్యం ప్రోత్సహించాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన ఇద్దరు పర్యాటక కాంటాక్ట్ ఉద్యోగుల కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీస్కున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. 36 పర్యాటక హోటళ్లలో నిర్వహణ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అందమైన సముద్రం... అడవులు ఉన్నాయని, ఎకో టూరిజం అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఒక యాప్ తీసుకురాబోతున్నామని.. దసరాకు టూరిజం యాప్ సిద్ధమవుతుందని మంత్రి తెలిపారు. లోకల్ టూరిస్ట్లకు నాలుగు జోన్లుగా చేస్తున్నామని, జోన్కొక మేనేజర్ ఉంటాడని చెప్పారు. -
విశాఖకు బాబు అనుకూలమా? వ్యతిరేకమా?
-
విశాఖకు చంద్రబాబు అనుకూలమా?.. కాదా?: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నానికి చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయని అన్నారు. హైదరాబాద్పై పెట్టుబడి పెట్టడం వల్ల విభజనతో ఇప్పుడు నష్టం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే విద్వేషాలు ఏర్పడవని వివరించారు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయని తెలిపారు. అత్యాశగా విశాఖపట్నం రాజధాని కోరలేదని, అన్ని అర్హతలు ఉన్నాయి కనుకనే విశాఖను రాజధాని నగరంగా ప్రకటించామని చెప్పారు. టీడీపీకి విశాఖపట్నంలో ఓట్లు, సీట్లు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అవసరం లేదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉప్పుడు పట్టించుకున్నారా అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేమి లేదన్నారు. టీడీపీ నేతలు చెప్పిన అబద్దాలే పదేపదే చెబుతున్నారని మంత్రి అవంతి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉందని అన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని గుర్తు చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. చదవండి: ‘టీడీపీ అండ్ కో పిచ్చి మాటలు మానుకోవాలి’ -
లోకేష్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: గుంటూరులో విద్యార్థిని రమ్య హత్యను పనిలేని టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. లోకేష్ బరువుతో పాటు విచక్షణ కోల్పోయారని ఎద్దేవా చేశారు. గ్రామస్థాయి నాయకులు కంటే లోకేష్ భాష అధ్వానంగా ఉందని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలకు లోకేష్ దిగడం సరికాదన్నారు. పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన లోకేష్ ఏదో విజయం సాధించినట్టు ప్రవర్తించడం అతని అవివేకమని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని ధ్వజమెత్తారు. విద్యార్థిని రమ్య హత్య బాధాకరమని, అపదలో ఉన్న యువతులు దిశ యాప్ వినియోగించుకోవాలని మంత్రి అవంతి సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో యువతులు, మహిళల హక్కులు భంగం కలిగిస్తే సీఎం వైఎస్ జగన్ ఉపేక్షించరని గుర్తుచేశారు. పోలీసులు సకాలంలో నిందితుడ్ని అరెస్ట్ చేశారని తెలిపారు. సీఎం జగన్ రమ్య తల్లిదండ్రులకు బాసటగా నిలిచే క్రమంలో ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. -
పీవీ సింధుకు విజయవాడలో గ్రాండ్ వెల్ కమ్
సాక్షి, విజయవాడ: పీవీ సింధుకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఇతర అధికారులు, క్రీడాకారులు సింధుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్ వెళ్లేముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపింది. ఒలింపిక్స్లో పతకం తేవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయి ఒలింపిక్స్లో పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సింధు నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిన్న వయసులోనే రెండు మెడల్స్ తీసుకురావటం దేశానికి గర్వకారణమని కొనియాడారు. యువతకి సింధు రోల్ మెడల్గా నిలుస్తుందన్నారు. సింధును ఆదర్శంగా తీసుకొని యువత భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఇక విశాఖలో అకాడమీ కోసం సింధుకి సీఎం జగన్ రెండు ఎకరాలు భూమి ఇచ్చారని గుర్తుచేశారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
రామోజీ హోటళ్లలో విదేశీ మద్యం అమ్మొచ్చా?
సాక్షి, విశాఖపట్నం: దశలవారీగా మద్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఉన్నచోట విదేశీ పర్యాటకుల కోసం మద్యం అందుబాటులో ఉంటుందని గురువారం మీడియా సమావేశంలో తాను చెప్పిన మాటల్ని ఓ వర్గం మీడియా వక్రీకరించి రాయడంపై మంత్రి ముత్తంశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టూరిజం ప్రమోషన్లో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడైతే రెస్టారెంట్లు ఉంటాయో అక్కడ విదేశీ మద్యం అందుబాటులో ఉంటుంది అని మాత్రమే తాను చెప్పగా.. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధానాన్ని కొత్తగా తెచ్చినట్లు, మద్యాన్ని తామే అందుబాటులో ఉంచుతున్నట్లు కథనాలు రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టూరిజంను ప్రమోట్ చేయడానికే మద్యంగానీ.. మద్యాన్ని ప్రమోట్ చేయడానికి టూరిజం కాదన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. ఆత్మ విమర్శ చేసుకోండి.. ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహిస్తున్న తార, సితార హోటళ్లు, విశాఖలోని డాల్ఫిన్ హోటల్లో టూరిస్టుల కోసం విదేశీ మద్యం అందుబాటులో ఉంటుందని, దాన్ని ఎలా తీసుకోవాలో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తాము మద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతుండటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరూరా బెల్టు షాపులను ఏర్పాటు చేసి చివరికి పార్టీ కార్యకర్తల ద్వారా మద్యం అమ్మడం, ఇంటింటికీ డోర్ డెలివరీ ఏర్పాట్లు చేయడం ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం... వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 43 వేల బెల్ట్ షాపులను మూసివేయడంతో పాటు మద్యం పర్మిట్ రూములను రద్దు చేసి మద్యం షాపులు, బార్ల సంఖ్యను తగ్గించామని చెప్పారు. మద్య నియంత్రణ కోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని పునరుద్ఘాటించారు. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడుతూ చంద్రబాబు, లోకేష్ ప్రజల్లో అపోహలు సృష్టించడం మంచిది కాదన్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మందు విక్రయించిన చంద్రబాబు మద్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉంటుందని ఎద్దేవా చేశారు. చివరకు దేవాలయాలు, పాఠశాలల పక్కన కూడా మద్యం విక్రయించిన ఘనుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. కరోనా కష్ట కాలంలోనూ రాష్ట్ర ప్రజలు ఏమయ్యారో పట్టించుకోకుండా హైదరాబాద్లో కూర్చుని జూమ్ మీటింగ్లు నిర్వహిస్తూ తనకు వత్తాసు పలికే మీడియాలో ప్రచురించుకుని ఆనందపడుతున్నారని విమర్శించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు ఇవ్వటాన్ని చిరంజీవి తదితర ప్రముఖులు సైతం అభినందిస్తుంటే అది కూడా రాజకీయం చేస్తారా? అంటూ మండిపడ్డారు. కేరళ జీడీపీలో 14 శాతం టూరిజం నుంచే వస్తోందని, వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగంతో పాటు టూరిజం పెంచాలన్నది తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. అంతేకానీ మద్యాన్ని ప్రోత్సహించాలన్నది తమ విధానం కాదని గుర్తెరగాలన్నారు. టూరిజం నుంచి వచ్చే ప్రతీ రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ఓ వర్గం మీడియా వక్రభాష్యాలు చెప్పటాన్ని ఇకనైనా మానుకోవాలని çసూచించారు. -
ప్రభుత్వ భూముల్లోనే పరిపాలన రాజధాని
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ప్రభుత్వ భూముల్లోనే రాజధాని నిర్మాణం ఉంటుందని, అమరావతి మాదిరిగా ప్రైవేట్ భూములు విశాఖ రాజధానికి అవసరం లేదని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని, ఆ పార్టీ నేతలు దోచుకున్న విలువైన భూములను తమ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే.. భూములు దోచుకుంటున్నారు, ఆక్రమించుకుంటున్నారు.. అని చంద్రబాబు, లోకేశ్ గొంతుచించుకోవడం విడ్డురంగా ఉందని చెప్పారు. రెండేళ్ల పాలనలో తాముగానీ, తమ ఎమ్మెల్యేలుగానీ ఒక్క సెంటు భూమి కబ్జా చేసినట్లు తండ్రీకొడుకులు నిరూపించగలిగితే ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. విశాఖ ప్రజలు ఓట్లు వేసినందునే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కిందని, అది విశాఖ ప్రజలు పెట్టిన భిక్ష అని చెప్పారు. అలాంటి విశాఖ ప్రాంత అభివృద్ధినే అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఆఫీసులను తనఖా పెడుతున్నారని, విశాఖను అమ్మేస్తున్నారని టీడీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వందల కోట్ల రూపాయల భూకబ్జాలకు పాల్పడిన పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్నారని, ఇప్పుడు ఆయన్ని పార్టీ నుంచి డిస్మిస్ చేస్తారా.. కొనసాగిస్తారా.. అనేది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా విశాఖ భూములను వుడా ద్వారా అమ్మి, ఆ డబ్బులు తీసుకెళ్లి అప్పటి రాజధాని హైదరాబాద్లో ఖర్చుపెట్టారని, అప్పుడు టీడీపీ నేతలు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. విశాఖలో ఎన్ఏడీ ప్లైఓవర్కు గతంలో శంకుస్థాపన మాత్రమే చేస్తే తాము ఈ రెండేళ్లలో పూర్తిచేశామని, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. మరో 4ఫ్లైఓవర్లకు డీపీఆర్లు సిద్ధం చేస్తున్నామన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎనిమిదిలైన్ల రహదారి, మెట్రోరైల్.. శంకుస్థాపనలకు సిద్ధమయ్యాయని వివరించారు. బెంగళూరు, చెన్నై, ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. బీజేపీ నాయకులకు నిజంగా విశాఖపై ప్రేమ ఉంటే రైల్వేజోన్, ప్రత్యేక హోదా, మెట్రోరైల్ వచ్చే విధంగా చూడాలని, ఈ విషయంపై అధిష్టానాన్ని ప్రశ్నించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్రాజ్, విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కె.కె.రాజు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
‘చరిత్రలోనే ఇళ్ల నిర్మాణం సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది’
-
‘చరిత్రలోనే ఇళ్ల నిర్మాణం సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది’
సాక్షి, విశాఖపట్నం: దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోతుందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోగా.. తిరిగి ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలు గుండెల్లో నిలిచిపోయే విధంగా నిర్మాణాలు చేస్తున్నారని కొనియాడారు. వెల్లంకి గ్రామములో ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలనీలే కాకుండా ఊర్ల నిర్మాణం చేస్తున్నారని.. రోడ్లు, డ్రైనేజీలు, ఇంటర్నెట్ సౌకర్యాలు చేస్తున్నారని తెలిపారు. పేదలు జీవితంలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం ఈరోజు నెరవేరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఒక్కో ఇళ్ళ రూపంలో 15 లక్షలు విలువ చేసే ఆస్తి ఇస్తున్నారని తెలిపారు. విశాఖలో రెండు లక్షల ఇళ్లు కోర్టు వాయిదాల కారణంగా వాయిదా పడుతోందని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 50,050 ఇళ్ళు నిర్మాణం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వినయ్చంద్ తెలిపారు. కోర్టు వివాదాలు కారణంగా నిలిచినా.. విశాఖ వాసుల ఇళ్ళు పూర్తి చేసి న్యాయం చేస్తామన్నారు. -
విశాఖ జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్షా సమావేశం
-
రోగులకు బెడ్ లేదనే సమాధానం రాదు: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్టణం: రోగులకు బెడ్ లేదు అనే సమాధానం లేకుండా వైద్యం అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లాల్లో 79 కోవిడ్ ఆసుపత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించార. సిబ్బంది కొరత ఉంటే వెంటనే నియమించుకునే అధికారం జిల్లా అధికారాలకు కల్పించినట్లు గుర్తుచేశారు. ఆక్సిజెన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా వైరస్పై గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘1,443 ఆరోగ్య శ్రీ బెడ్లు ఉండగా వీటిని పెంచే యోచనలో ఉన్నాం. హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ పీపీ కిట్, ఎన్-95 మాస్కులు అందిస్తున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు.. విమర్శలకు తావులేకుండా సమష్టిగా పనిచేయాలి. కేంద్రం నుంచి దశల వారీగా వ్యాక్సిన్ వస్తోంది. అందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. జిల్లాలో 46 వేల మంది ఇటీవల కోవిడ్తో చేరగా అందులో 26 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వ్యక్తులు కోలుకుంటున్నారు.’ అని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. చదవండి: కంగారొద్దు.. రెమిడిసివిర్ కొరత లేదు చదవండి: ‘కోవిషీల్డ్’ డోసులలో కీలక మార్పులు -
కరోనా నియంత్రణకు టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశాం: మంత్రి అవంతి
-
విశాఖలో షిప్ రెస్టారెంట్
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో షిప్ రెస్టారెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) వెల్లడించారు. విశాఖలోని రుషికొండ రిసార్ట్ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.92 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. విజయవాడ, తిరుపతిలో జలవిహార్ తరహాలో ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో పర్యాటక, క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి పథకాల అమలు తీరు తెన్నులపై మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియాలో భాగంగా స్టేట్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్లెన్స్ సెంటర్ కింద కడప జిల్లా పుట్లంపల్లిలోని వైఎస్సార్ స్పోర్ట్స్ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. క్రీడల్లో శిక్షణ, క్రీడా పరికరాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.3.18 కోట్లను ఇటీవల మంజూరు చేసిందన్నారు. పర్యాటక రంగానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఇందుకోసం పీపీపీ పద్ధతిలో రిసార్టులు, త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి పెట్టుబడులు ఆహ్వానిస్తోందని తెలిపారు. ఇందుకోసం బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వారానికోసారి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పాపికొండల్లో బోటు పర్యాటకాన్ని మరో వారం రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్తో పాటు భీమిలి, రుషికొండ, మంగమారిపేట బీచ్లను గోవా, మెరీనా బీచ్ల తరహాలో అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. శ్రీశైలం ఆలయంలో ప్రసాదమ్ పథకం కింద చేపట్టిన పనులను సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించామని, త్వరగా తేదీపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సింహాచలంలోనూ ఇదే పథకం కింద చేపట్టే పనులకు శంకుస్థాపన తేదీపై కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
ఎవరితోనూ లాలూచీ పడాల్సిన అవసరం మాకు లేదు
-
వారు మాతృమూర్తులతో సమానం..
సాక్షి, విశాఖ: పరిసారలను అనునిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నపారిశుధ్య కార్మికులపై మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్య నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. స్వచ్చభారత్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు వారు పేరుపేరునా ధన్యవాదాలుతెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా శుక్రవారం అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర చాలా కీలకమని ప్రశంసించారు. పారిశుధ్య కార్మికులు మాతృ మూర్తులతో సమానమని, వారి సేవలకు గుర్తుంపుగా అవార్డులు ప్రధానం చేయడం చాలా సంతోషకరమన్నారు. స్మార్ట్ సిటీ విశాఖను మరింత సుందర నగరంగా తీర్చి దిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ.. పారిశుద్యం అంటే కేవలం శానిటైజేషన్ మాత్రమే కాదని, పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచడమేని అభిప్రాయపడ్డారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి 25 మందికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీర్చిడిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని కోరారు. దేశంలో అత్యంత సుందర నగరాలలో విశాఖకు 9వ స్థానం లభించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. కాపులుప్పాడ బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్కి నిధులు విడుదల చేసి మరింత స్వచ్చత సాధిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆధారబాదరగా పనులు చేపట్టి మధ్యలో వదిలేసారని, తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. -
స్టీల్ప్లాంట్ జోలికొస్తే తెలుగుజాతి తడాఖా చూపిస్తాం
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ పరిరక్షణ పోరు మొదలైంది. కార్మికులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. స్టీల్ప్లాంట్ బీసీ గేట్ వద్ద సోమవారం ఉదయం నిర్వహించిన నిరసన సభకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బీవీ సత్యవతి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్రాజ్ పాల్గొని కార్మికులు, ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదే ఉద్యమ స్ఫూర్తితో కాపాడుకుంటామని కార్మిక నాయకులు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రైతు ఉద్యమాన్ని మించిన ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్కి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే కాకుండా.. విభజన హామీల్ని విస్మరించి.. వైజాగ్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమవడం గర్హనీయమన్నారు. ఉద్యమానికి వైఎస్సార్సీపీ నాయకత్వం వహిస్తుందని ముత్తంశెట్టి తెలిపారు. ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి మాట్లాడుతూ..స్టీల్ప్లాంట్ కోసం పార్లమెంట్లో ప్రస్తావించి.. అవసరమైతే సభలో ధర్నా చేస్తామన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పార్లమెంట్ని స్తంభింప జేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు కేకే రాజు, వైఎస్సార్ టీయూసీ నాయకుడు వై.మస్తానప్ప, ఐఎన్టీయూసీ నాయకుడు గంధం వెంకటరావుతో పాటు కార్మికులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
ఉక్కు సంకల్పంతో పోరాడతాం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి తలమానికం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఆదివారం విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలకు ఒక విధానం లేదని విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ప్రేమ ఉంటే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాయాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని వద్ద మాట్లాడాలన్నారు. కేంద్ర విధానాలు, విదేశీ డంపింగ్, సొంత గనులు లేకపోవడం తదితర కారణాలతో మూడేళ్ల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలను చవిచూస్తోందని తెలిపారు. 1.30 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.30 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే వైఎస్సార్ సీపీ నుంచి తొలి ఎంపీగా తాను రాజీనామా చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కె.కె రాజు, అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, పంచకర్ల రమేష్బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజుబాబు, ముఖ్యనాయకులు రవిరెడ్డి, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బుల్లెట్ ప్రూఫ్ లేకుంటే ఎంపీ సాయిరెడ్డికి ఏమయ్యేదో
విశాఖపట్టణం: ఏ మంచి కార్యక్రమం చేపట్టినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసనలకు పిలుపునివ్వడం అలవాటు అని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. రేషన్ రవాణా ట్రక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్న సమయంలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా నిరసనలకు పిలుపునిచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు నిరసనలకు పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. కళా వెంకట్రావు వ్యవహారంలో పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించారని తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు అని పేర్కొన్నారు. రాముడిని చూడటానికి బూట్లు వేసుకుని వెళ్లిన సంస్కారం చంద్రబాబుది అని చెప్పారు. విజయసాయిరెడ్డిపై హత్యాయత్నం జరిగిందని.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకపోతే విజయ సాయిరెడ్డి ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదని మంత్రి అవంతి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దాడిలో కారు అద్దాలు దెబ్బతిన్నాయని వివరించారు. విజయసాయి రెడ్డిపై దాడిని నిరోధించాల్సినది పోయి రెచ్చగొట్టారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడిపై రాళ్లు, కర్రలు విసరడం ఉన్మాదం కాదు కానీ.. ప్రోత్సహించిన వారిని అరెస్ట్ చేయడం ఉన్మాదమా...!? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రశాంతత దెబ్బతీయవద్దని కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం గ్రాఫ్ పెరగడాన్ని సహించలేకే తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
సోము వీర్రాజు.. కన్నాలా వ్యవహరించకు: అవంతి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులకు అభివృద్ధిపై శ్రద్ధ లేదు.. మతం గురించి మాట్లాడే సోము వీర్రాజు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడరు అంటూ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. బీజేపీలో రెండు వర్గాలు ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కాగా.. మరొకటి టీడీపీ బీజేపీ అంటూ ఆ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రముఖులు విశాఖలో సమావేశం కావడం సంతోషకరమైన విషయంగా భావించాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ప్రాజెక్టుల గురించి చర్చిస్తారని ఆశించాం. కానీ మూస ధోరణిలో మతం గురించి చర్చించారు. పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు రథయాత్ర చేస్తామన్నారు.. అది ఎందు కోసం చేస్తున్నారు. అంతర్వేది ఘటనపై ప్రజలు కోరిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. కానీ ఎందుకు ఇప్పటి వరకు విచారణ ప్రారంభించ లేదు’ అన్నారు ‘ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి.. ఒకరు ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బీజేపీ నాయకులు.. మరొకరు చంద్రబాబు నాయుడు పంపిన బీజేపీ నాయకులు. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ చంద్రబాబు అజెండా చదివి పదవి కోల్పోయారు. ఇప్పుడు బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల వలలలో మీరు పడొద్దు. రాముడు అందరి దేవుడు. ఆయనని రాజకీయ కోణంలో చూడటం సరికాదు. గతంలో అద్వానీ ప్రతి పక్షంలో రథయాత్ర చేస్తే అందరూ సహకరించారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉండగా రథయాత్ర ఎందుకోసం చేయాలి. మీరు పద్దేనిమిది నెలల్లో ఏపీ కోసం కేంద్రం నుంచి ఏం ప్రాజెక్టులు తీసుకువచ్చారో.. రథయాత్ర ప్రారంభించడానికి ముందు ఆలోచించండి. మేనిఫెస్టో అంశాలపై ఆత్మ విమర్శ చేసుకోండి’ అన్నారు. (చదవండి: మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!) ‘సీఎం జగన్ పాలనలో దేవాలయాల విషయంపై రాజీ పడే పరిస్థితి లేదు. నిందితులపై చర్యలు కఠినంగా వుంటాయి. చంద్రబాబు హయాంలో దాడులపై మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు అనవసర విమర్శలు చేస్తున్నారు. దేవాలయాల పునరుద్ధరణకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం మీరు గుర్తించరా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీ మాదిరిగా హిందూ ఆలయాల్లో పరిరక్షణ చర్యలు లేవన్న విషయం గమనించండి’ అని కోరారు. -
'టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది'
సాక్షి, విశాఖపట్నం: ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలి నియోజవర్గం తగరపువలసలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సరగడం చినఅప్పలనాయుడు, చింతకాయల సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుగుతుంది. ఒక పైసా అవినీతి లేకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు మంచి కార్యక్రమాలు చేయడు, చేసే వారికి అడ్డుపడతారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతంది. ప్రతిపేదవాడికి ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యం. చదవండి: ('టీడీపీ నేతలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు') ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారు. మతానికి రాజకీయ రంగు పులుముతున్న వ్యక్తి చంద్రబాబు. 40 దేవాలయాలను పడగొట్టిన వ్యక్తి చంద్రబాబు. దేవుళ్ల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది. రాబోయే రోజుల్లో టీడీపీ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు' అని మంత్రి అవంతి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఇళ్ల స్థలమే కాదు ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అవినీతికి తావులేకుండా ఇళ్లపట్టాల పంపిణీ జరుగుతుంది. టీడీపీ నేతలు పూర్తిగా అవినీతిలో కురుకుపోయారు. పేదవాడి సొంతింటి కలను సీఎం నెరవేరుస్తున్నారు. మహిళా పక్షపాతి సీఎం జగన్' అని విజయసాయిరెడ్డి అన్నారు. -
‘మంత్రులకు పవన్ క్షమాపణ చెప్పాలి’
సాక్షి, విశాఖపట్నం: మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు పవన్ జాగ్రత్తగా మాట్లాడాలి. మంత్రుల పట్ల సంస్కారం లేకుండా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆరు నెలలకు ఒకసారి పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వస్తున్నారు. రైతులపై పవన్ కల్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. నెల రోజుల వ్యవవదిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివర్ తుపాన్ పంట నష్ట పరిహారం అందించారు. టీడీపీ హయాంలో తుపాన్ పంట నష్ట పరిహారం రావాలంటే రెండేళ్లు పట్టేది’ అన్నారు. ‘చంద్రబాబు సొంత పుత్రుడు, దత్త పుత్రుడు ఇద్దరు రైతులపై కపట ప్రేమ కురిపిస్తున్నారు. సినిమా షూటింగ్ లేదు కాబట్టి పవన్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. లోకేష్ టైం పాస్కు వచ్చినట్లు రాష్ట్రానికి వస్తున్నారు. వకీల్ సబ్ సినిమా ప్రమోషన్ కోసం పవన్ రాష్ట్రానికి వచ్చినట్లు ఉంది’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. (చదవండి: ‘జూమ్లో చంద్రబాబు.. ట్విట్టర్లో లోకేష్’ ) సీఎం జగన్ పేదవాడి సొంతింటి కల నేరవేర్చారు: జోగి రమేష్ సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాగూడూరు మండలం తరకటూరులో 92 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జోగి రమేష్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చిన వ్వక్తి సీఎం జగన్. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్ని ఇళ్ల స్థలాల పట్టాలు పంచిపెట్టాడు. సినిమా డైలాగులు చెప్పడం కాదు వ్యవసాయం అంటే ఏంటో తెలియని లోకేష్ పంట నష్టపరిహారం గురించి మాట్లాడుతున్నాడు. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయి అన్నట్లుగా ఉంది లోకేష్, పవన్ల పర్యటన. నివర్ తుపాను వల్ల పంట నష్టపోయి 33 రోజులు అయ్యింది. పంట నష్టపోయిన ప్రతి రైతు ఎకౌంట్లో నష్ట పరిహారం నగదును సీఎం వైఎస్ జగన్ జమ చేస్తున్నారు. నిన్న పెడన నియోజకవర్గంలో ఒక పక్క సినిమా యాక్టర్ మరో పక్క పప్పు లోకేష్ పర్యటించి కామిడీ చేశారు’ అన్నారు. -
అవసరమైతే మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తాం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆర్కె బీచ్ నుంచి భోగాపురం వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆయన సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..ఫ్లై ఓవర్ బ్యూటిఫికేషన్ వర్క్స్ పూర్తి చేశాకే ప్రారంభిస్తామని, అవసరమైతే మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేశామని గుర్తుచేశారు. విశాఖలో మరిన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం, డీపీఆర్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రుషికొండ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఆస్తి పన్ను విషయంలో 15శాతానికి మించి పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 350గజాలు ఉన్నవారికి రూ. 50 మాత్రమే పెరుగుతుందని తెలిపారు. బ్యాంకులుపై చెత్త వేసిన ఘటనపై కమిటీ వేశామని, దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివారస్రావు మాట్లాడుతూ.. విశాఖలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, విశాఖ పరిపాలన రాజధాని, టూరిజం హబ్గా మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. -
థీమ్ పార్కులు.. టూరిజం క్లస్టర్లు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఉపాధికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. ఆ దిశగా కార్యాచరణ చేపట్టేందుకు కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఏపీ టూరిజం పాలసీ 2020–25ని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలోని సర్క్యూట్ హౌస్లో శనివారం ఆవిష్కరించారు. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు కరోనా కారణంగా దెబ్బతిన్న పర్యాటక ఆధారిత యూనిట్లకు ఊపిరి పోసేందుకు రీ స్టార్ట్ ప్యాకేజీతో ప్రభుత్వం ఆదుకోనుంది. పర్యాటక ప్రాంతాల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, రాజమండ్రి కేంద్రంగా ఉభయ గోదావరి, విజయవాడ–గుంటూరు కేంద్రంగా కోస్తా, తిరుపతి కేంద్రంగా రాయలసీమ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో అన్ని క్లస్టర్లలో పెట్టుబడిదారులతో సదస్సులు (ఇన్వెస్టర్స్ మీట్స్) నిర్వహించనున్నారు. ఎన్నో రాయితీలు.. మరెన్నో ప్రోత్సాహకాలు కొత్త టూరిజం ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేసే సంస్థలకు అందించే స్థలం విలువపై వసూలు చేసే 2 శాతం అద్దెకు బదులు 1 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రూ.కోటి పెట్టుబడి, ఏడాది ఆదాయం రూ.5 కోట్ల కంటే తక్కువ ఉన్న ప్రాజెక్టుల్ని మైక్రో ప్రాజెక్టులుగా, రూ.10 కోట్లలోపు పెట్టుబడి, రూ.50 కోట్లలోపు ఆదాయం ఉంటే స్మాల్ ప్రాజెక్టులుగా, రూ.75 కోట్లలోపు పెట్టుబడి, రూ.250 కోట్లలోపు ఆదాయం ఉంటే మీడియం ప్రాజెక్టులుగా, రూ.75 కోట్లకు పైగా పెట్టుబడి, రూ.400 కోట్ల వరకూ ఆదాయం ఉంటే లార్జ్ ప్రాజెక్టులుగా, రూ.400 కోట్లు పైబడి పెట్టుబడి ఉంటే మెగా ప్రాజెక్టులుగా పరిగణిస్తారు. ల్యాండ్ యూజ్ కన్వర్జెన్స్ చార్జీల్ని నూరు శాతం మాఫీ చేయనున్నారు. టూరిజం యూనిట్స్ కోసం స్థలాల్ని కొనుగోలు చేసినా, భూములు, షెడ్స్, బిల్డింగ్స్ మొదలైనవి లీజుకు తీసుకున్నా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీని 100 శాతం రీయింబర్స్మెంట్ చేస్తారు. కొత్తగా వచ్చే టూరిజం ప్రాజెక్టులకు ఐదేళ్లపాటు 100 శాతం స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) నుంచి మినహాయింపును రీయింబర్స్మెంట్ ద్వారా చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులకు ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్ను రూ.2 కే అందిస్తారు. మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ టూరిజం ప్రాజెక్టుల్లో హోటల్స్ కోసం 5 ఎకరాల వరకూ.. రిసార్టుల కోసం 10 ఎకరాల వరకూ.. ఎంఐసీఈ సెంటర్లకు 10 ఎకరాల వరకూ.. వే సైడ్ ఎమినిటీస్ కోసం 3 ఎకరాల వరకూ స్థలం కేటాయిస్తారు. 5 స్టార్, 7 స్టార్ హోటల్స్తో పాటు మెగా టూరిజం ప్రాజెక్టులు నిర్మించేందుకు ముందుకొస్తే అందుకు అవసరమైన స్థలాల్ని సమకూరుస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా థీమ్ పార్కులు నూతన విధానం కింద రాష్ట్రవ్యాప్తంగా థీమ్ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటవుతాయి. çహోటల్స్, రిసార్టులు, వాటర్ విల్లాస్, హెరిటేజ్ హోటల్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, థీమ్ పార్కులు, ఎంఈసీఈ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు, బొటానికల్ గార్డెన్లు, అర్బన్, రూరల్ హట్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, వే సైడ్ ఎమినిటీస్, స్పిరిచ్యువల్ వెల్నెస్ సెంటర్లు, మ్యూజియమ్స్, ఫార్మ్ స్టేలు, అగ్రి టూరిజం.. ఇలా విభిన్న ప్రాజెక్టులతో ఆయా సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించింది. బుద్ధిస్ట్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, రూరల్ టూరిజం, హెరిటేజ్ టూరిజంగా విభజించి ప్రాజెక్టుల్ని ఆహ్వానించనున్నారు. టూరిజం పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. పర్యాటకానికి పునరుజ్జీవం గత ప్రభుత్వం అమలు చేసిన టూరిజం పాలసీ.. పర్యాటక వర్గాలకు చేదు అనుభవాన్నిచ్చింది. అందుకే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. సీఎం జగన్ సూచనల మేరకు కొత్త పాలసీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాం. వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ప్రచారాలు, వివిధ సంస్థలతో భేటీలు నిర్వహిస్తాం. కేవలం ఆదాయంపైనే కాకుండా.. పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు సురక్షితంగా వాటిని సందర్శించేలా పక్కా నిబంధనలు అమలు చేస్తాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
చెట్లు నరకాలంటే అనుమతి తప్పనిసరి: అవంతి
సాక్షి, విశాఖపట్న: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీ) ఆధ్వర్యంలో మదురవాడ న్యాయ కళాశాల పనొరమ హిల్స్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, మంత్రి అవంతిశ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం జిల్లాలో సుమారు 25 కోట్ల మొక్కలు నాటాలని ఆదేశించారని తెలిపారు. వాహనాలు, జనాభా పెరుగుదలతో గ్రీన్ బెల్ట్ తగ్గుతోందని, మొక్కలు నాటి గ్రీన్ బెల్ట్ను 2021 నాటికి పెంచుతామని తెలిపారు. విశాఖ రాజధాని ప్రాంతం ఏర్పాటు అవడంతో పట్టణాభివృద్ధికి ఈ మొక్కలు నాటడం ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి చెట్లు నరకాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో సుమారు 1000 పార్కులో మొక్కలు నాటాలని, ఫెన్సింగ్ వేయాలని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరు వైపుల మొక్కలు నాటితే బడ్డీల పేరుతో ఆక్రమణలు జరగవని తెలిపారు. -
'టీడీపీ క్యాడర్ నిమ్మగడ్డనే ఎక్కువ నమ్ముతోంది'
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎన్నారై పార్టీగా తయారయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైదరాబాద్ ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం పూర్తి కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. పక్క రాష్ట్రాలతో కేసులు వేయించారు. పోలవరం భూసేకరణ పూర్తి కాకుండా అడ్డుపడ్డారు. పోలవరం దగ్గర 150 అడుగుల వైఎస్సార్ విగ్రహం పెడతామంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. 2018కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు ఏమయ్యాయి..?. 2021 డిసెంబర్కు పోలవరం పూర్తి చేస్తాము. టీడీపీ తొత్తుగా నిమ్మగడ్డ నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తుగా మారిపోయారు. టీడీపీ అధికార ప్రతినిదిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నిలు చంద్రబాబు పెట్టమంటే పెడుతున్నారు. వద్దంటే మానేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు నిమ్మగడ్డ తుంగలో తొక్కుతున్నారు. టీడీపీ నేతలతో స్టార్ హోటల్లో కూర్చొని మంతనాలు జరిపిన వ్యక్తి నిమ్మగడ్డ. కరోనా లేని సమయంలో వాయిదా వేశారు. కరోనా ఎక్కువుగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నిమ్మగడ్డ రమేష్ పట్టించుకోలేదు. టీడీపీ క్యాడర్ చంద్రబాబు కంటే నిమ్మగడ్డను ఎక్కుగా నమ్ముతున్నారు. నిమ్మగడ్డ పదవీ విరమణ తరువాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు అనే అనుమానం మాకు ఉంది. చంద్రబాబును దింపి టీడీపీ నేతలు నిమ్మగడ్డకు పగ్గాలు అప్పగిస్తారనే అనుమానం కలుగుతుంది. పేదలకు ఇళ్లు ఇస్తామంటే దేశ చరిత్రలో అడ్డుకున్న పార్టీ టీడీపీ మాత్రమే. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారు. ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్ సీఎం జగన్') విశాఖ ఎయిర్ పోర్ట్పై చర్చకు సిద్ధం విశాఖ ఎయిర్ పోర్ట్ ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ కాదు నేవి ఎయిర్ పోర్ట్. ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో నావీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన తరువాత బేగంపేట ఎయిర్ పోర్ట్ మూసేశారు. నాకు ఎలాంటి భూ లావాదేవీలాతో సంబంధం లేదు. నా పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తే నాకు లేదా పోలీసులు దృష్టికి తీసుకురండి. రాధాకృష్ణ, రామోజీరావు లాంటి వారు సమతుల్యం పాటించాలి. రాధాకృష్ణ ఛానెల్, పేపర్ నడపడానికి అనర్హుడు. విశాఖ ఎయిర్ పోర్ట్పై నాతో చర్చకు వస్తే అన్ని విషయాలు చర్చిస్తాను. జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ రామోజీరావు. జర్నలిజం ముసుగు వేసుకొని ఒక పార్టీకి రాధాకృష్ణ కొమ్ము కాస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన లేఖలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభమైతే విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేవేయలని ఉంది. విశాఖ ఎయిర్ పోర్ట్పై రామోజీరావు, రాధాకృష్ణ తో చర్చించాలా. రెండు ఎయిర్ పోర్ట్ల మధ్య ఎంత దూరం ఉండాలో తెలియదా.. అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: అవంతి పరిశ్రమల ప్రోత్సాహం అభివృద్ధి సమస్యలపై రేపు జిల్లా సమావేశం జరుగుతుంది. అభివృద్ధికి వైఎస్సార్సీపీ వ్యతిరేకమన్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని విధాలుగా పరిశ్రమల అభివృద్ధికి మేము సిద్ధంగా ఉన్నాము. విశాఖ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. శుక్రవారం జరిగే సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ రీ స్టార్ట్ పేరుతో ఈ కార్యక్రమం రూపొందించారు అని మంత్రి అవంతి పేర్కొన్నారు. (తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్) నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి ఏమైంది..?: కన్నబాబు చంద్రబాబుకు యనమల కో పైలెట్ లాంటివారని జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు అన్నారు. 'యనమల స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్లా కాకుండా రమేష్ కమిషన్లా నిమ్మగడ్డ పనిచేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. చంద్రబాబు ఏం చెపితే నిమ్మగడ్డ అదే చేస్తున్నారు. ఎన్నికలు అంటే వైఎస్సార్సీపీకి భయం లేదు. ఎన్నికలకు మేము భయపడలేదు, ప్రజల ఆరోగ్యం బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం ఏముంది. చంద్రబాబు హయాంలో జరగాల్సిన ఎన్నికలను ఎందుకు నిమ్మగడ్డ నిర్వహించలేదు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి ఏమైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ('బాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలే') -
‘ఆర్కే బీచ్ను మరింత అభివృద్ధి చేస్తున్నాం’
-
ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ అఖిలపక్ష సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు..?. రాష్టంలో రోజుకు రెండు, మూడు కేసులు ఉన్నప్పుడు కరోనా షాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు రోజుకు రెండు మూడు వేల కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం తగదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. కేంద్ర ప్రభుత్వమే కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది' అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై విస్మయం) -
దేశంలోనే తొలి లైట్మెట్రో..విశాఖలో
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా విశాఖలో లైట్మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదివారం మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు డీపీఆర్, కారిడార్లలో మార్పులు చేర్పులపై అధికారులు మంత్రులకు వీడియో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మెట్రో ప్రాజెక్టు పీపీపీ విధానంలోనా, ప్రభుత్వమే నేరుగా చేపడుతుందా అనే విషయంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నవంబర్ రెండోవారంలో లైట్మెట్రో, డిసెంబర్ రెండోవారంలో మోడరన్ ట్రామ్ కారిడార్కు సంబంధించిన డీపీఆర్లను యూఎంటీసీ కన్సల్టెంట్ సంస్థ ఇవ్వనుందని చెప్పారు. ముందుగా చేపట్టే లైట్మెట్రో ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ నవంబర్లో ప్రారంభమై మార్చి నాటికి పూర్తవుతుందన్నారు. నాలుగు కారిడార్లలో 75.31 కిలోమీటర్ల మేర 52 స్టేషన్లు ఏర్పాటు చేసేలా మొదటి విడత ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని చెప్పారు. విభజన చట్టంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు అంశం ఉన్న నేపథ్యంలో నిధుల గురించి కేంద్రాన్ని అడుగుతామని తెలిపారు. కేంద్ర సహకారం అందినా, అందకపోయినా.. మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటిదశలో స్టీల్ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్రాజ్, మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్చంద్, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో రైల్ కార్యాలయం ప్రారంభం
-
స్టీల్ప్లాంట్ నుంచి భోగాపురం వరకూ మెట్రో రైలు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం అయ్యాయి. నగరంలో ఎల్ఐసీ భవన్ మూడో అంతస్తులో రీజనల్ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ఆదివారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్ రాజ్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. అధికారులు.. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ను మంత్రులకు వివరించారు. (పోలవరానికి నిధులు రాబట్టండి) కాగా విశాఖలో 79,91 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్, 60.29 కిలోమీటర్ల మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచే ఈ ప్రాజెక్ట్ను అధికారులు పరిశీలించేందుకు సన్నద్ధం అవుతున్నారు. వచ్చే రెండు నెలల్లో మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధం కానున్నాయి. డీపీఆర్లపై కన్సల్టెంట్లతో చర్చలు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్ధేవంతో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. స్టీల్ప్లాంట్ నుంచి భోగాపురం వరకూ మెట్రో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘మొదట గాజువాక నుంచి కొమ్మాది వరకూ మెట్రో అనుకున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న అవసరాల దృష్ట్యా మెట్రో దూరాన్ని పెంచమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మెట్రో రైలు స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ దూరం పెంచి డీపీఆర్ తయారు చేస్తున్నాం. యూఎంటీసీ (Umtc) సంస్థకు మెట్రో డీపీఆర్ తయారు చేయమని చెప్పాం. నవంబర్ మొదటి వారంలో డీపీఆర్ ఇస్తామని చెప్పారు. దసరా కావడంతో మెట్రో రైల్ కార్యాలయం ప్రారంభించాం. డీపీఆర్ తయారు చేశాక ముఖ్యమంత్రి ఆమోదంతో టెండర్లు పిలుస్తాం. విశాఖ మెట్రోకు కేంద్ర సహాయ సహకారాలు అవసరం. విశాఖను దేశంలో గొప్ప నగరంగా అభివృద్ధి చేయాలని చూస్తునాం’ అని అన్నారు. విశాఖ చరిత్రలో మర్చిపోలేని రోజు .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి ఆలోచన, విజన్తో విశాఖకు మెట్రో కేటాయించారు. విశాఖకు మెట్రో రైల్ వస్తే ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోతాయి. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసింది. ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ట్రాఫిక్ పెరిగే కొద్దీ కోచ్ లు పెంచుకోవచ్చు.. మెట్రో రైల్ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. లైట్ మెట్రోతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ట్రాఫిక్ పెరిగే కొద్దే కోచ్లు పెంచుకోవచ్చని, లైట్ మెట్రోకు కిలోమీటర్కు 200 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందని తెలిపారు. -
ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం
సాక్షి, విశాఖపట్నం: భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గీతం యూనివర్సిటీ, టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎటువంటి కక్షలు లేవన్నారు. విద్యాసంస్థలు ఉన్నవారు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నా ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకూడదని టీడీపీకి చెందిన మాజీ మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమకూ విద్యాసంస్థలు ఉన్నాయని.. అంతమాత్రాన తాము ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నామా అని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, తెల్లవారుజామున వచ్చి కూల్చివేశారని గీతం యాజమాన్యానికి చెందిన వ్యక్తులు, టీడీపీ నేతలు మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. గీతం యాజమాన్యానికి సంబంధించిన సర్వేయర్లు, ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు ఉమ్మడిగా, పూర్తిగా సర్వే చేసి గీతం కాలేజీ కాంపౌండ్ వాల్ పరిధిలో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు నోటిఫై చేశారన్నారు. గీతం ఆధీనంలో మరో 18 ఎకరాలు కాంపౌండ్కు ఆనుకుని ఉందని, మొత్తం 40 ఎకరాల భూమి ఆక్రమించారని వివరించారు. 5 నెలల క్రితమే వారి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అవకాశముందనే విషయం వారికి తెలుసన్నారు. దీనిపై గీతం యాజమాన్యానికి పూర్తి సమాచారం ఉందన్నారు. నోటీసులు కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆక్రమించిన స్థలాన్ని తమకు కేటాయించాలని 2014లో గీతం యాజమాన్యం అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని, చంద్రబాబుకు భరత్పై, గీతం సంస్థలపై ప్రేమ ఉంటే గడచిన ఐదేళ్లలోనే రెగ్యులరైజ్ చేయాలి కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడమే తప్పు. తప్పును సరిదిద్దుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనడం, ముందస్తు నోటీసు ఇవ్వలేదు అనడం సరికాదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారెవరైనా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి అప్పగించాలి’ అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకే.. ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు కె.కోటపాడు: విశాఖలో గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్టు ఆర్డీవో నివేదికలోనే వెల్లడైందని.. అందుకే ప్రభుత్వ యంత్రాంగం ఆక్రమణల తొలగింపునకు పూనుకుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు చెప్పారు. కె.కోటపాడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇటీవల విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు తొలగించినప్పుడు.. తొలుత అధికారులను ఆక్షేపించిన హరి మరుసటి రోజున తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు విలేకరుల సమావేశంలో పేర్కొన్న విషయాన్ని బూడి ప్రస్తావించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను రెవెన్యూ చట్టానికి లోబడి తొలగిస్తున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ వచ్చాకే ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పదవీ కాలం ముగిసే సమయం సమీపిస్తోందనే ‘స్థానిక’ ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. కరోనా కాలంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం అంత మంచిది కాదని, వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళతామని చెప్పారు. కరోనా ప్రభావం లేనప్పుడు చంద్రబాబు మాటలు విని స్థానిక ఎన్నికలను కావాలనే ఆపి.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు మేలు చేయడం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఎన్నికల కమిషనర్కు మంత్రి హితవు పలికారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్రాజ్ పాల్గొన్నారు. -
శాంతించిన తమ్మిలేరు, ఏలేరు
సాక్షి, ఏలూరు/అమలాపురం : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన జిల్లాలు తేరుకుంటున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గురువారం వాతావరణం పొడిగానే ఉంది. అయినా పల్లపు ప్రాంతాల్లోకి చేరిన నీరు బయటకు పోకపోవడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కృష్ణానదికి వరద పోటెత్తుతుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెంలో బుధవారం ఎర్రకాలువలో పడి రైతు రాటాల త్రిమూర్తులు (38) మృతిచెందగా గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలోని వాగులో గురువారం 88 త్యాళ్లూరు గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి పిల్లి హేమంత్ (12) కొట్టుకుపోయాడు. చదవండి: నేడు విజయవాడలో రెండు ఫ్లైఓవర్లు ప్రారంభం పశ్చిమ గోదావరి జిల్లాలో తమ్మిలేరు శాంతించినా ఎర్రకాల్వ మాత్రం ఇంకా పోటెత్తుతూనే ఉంది. పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తమ్మిలేరుకు వరద తగ్గింది. ఆంధ్రాకాల్వ నుంచి మాత్రమే తమ్మిలేరుకు వరద వస్తోంది. ఎర్రకాల్వ నీరు నిడదవోలుతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పంటపొలాల్లోకి చేరింది. ఈ కాలువ నీరు కలవడంతో తణుకు రూరల్ మండలం దువ్వ వయ్యేరు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి క్షేత్రంలోకి ఎర్రకాల్వ ముంచెత్తింది. యనమదుర్రు డ్రైన్ ఉప్పొంగడంతో భీమవరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. చదవండి: దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు ప.గో జిల్లా తాళ్లపాలెంలో ముంపును పరిశీలిస్తున్న మంత్రి వనిత, ఎమ్మెల్యే శ్రీనివాస్ వరద ముంపునకు గురైన గ్రామాలకు తాగునీరు, నిత్యావసర సరుకులు తీసుకెళుతున్న పడవ గురువారం దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరువాగులో కొట్టుకుపోయింది. దీన్లో ప్రయాణిస్తున్న మత్స్యశాఖ ఏడీ, ఎఫ్డివో, గ్రామస్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిడదవోలులో ముంపు ప్రాంతాలను రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, నిడదవోలు ఎమ్మెల్యే జీఎస్ నాయుడు పరిశీలించారు. బాధితులకు మంత్రి కన్నబాబు పరామర్శ తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పొంగి పొలాలను, పలు ప్రాంతాలను ముంచెత్తిన ఏలేరు నెమ్మదించింది. రిజర్వాయర్లో 86.23 మీటర్లున్న నీటిమట్టం 86.13 మీటర్లకు తగ్గింది. బుధవారం రాత్రి వరకు 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు గురువారం ఉదయం నుంచి 14 వేల క్యూసెక్కులకు తగ్గించారు. పిఠాపురం– గొల్లప్రోలు మధ్య 216వ నంబరు హైవే మీద నీరు ప్రవహిస్తోంది. కాకినాడ రూరల్ మండలంలో 40 కాలనీలు ముంపులో ఉన్నాయి. ఎఫ్సీఐ కాలనీ, జనచైతన్య కాలనీలో మంత్రి కన్నబాబు మోకాలు లోతు నీటిలో పర్యటించి బాధితులను పరామర్శించారు. బాధితులకు సహాయ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం సీతమ్మధార (విశాఖ ఉత్తర): విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గణపతినగర్లో భారీవర్షాలకు గత ఆదివారం గోడకూలి మరణించిన గర్భిణి రామలక్ష్మి, ఆమె కుమారుడు జ్ఞానేశ్వరావు కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించింది. మృతురాలి తల్లి నెల్లి పార్వతికి ప్రభుత్వం తరఫున రూ.8 లక్షల చెక్కును పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ గురువారం అందజేశారు. పుర్రె సురేష్యాదవ్, పీవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు చెక్కు అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి, మళ్ల విజయప్రసాద్ -
తిరుపతి శిల్పారామానికి రూ.10 కోట్లు
సాక్షి, అమరావతి: తిరుపతిలోని శిల్పారామాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేయడంతోపాటు.. శ్రీకాకుళంలో కొత్తగా శిల్పారామం ఏర్పాటుకు తొలిదశలో రూ.3 కోట్లు కేటాయించినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇక రాష్ట్రంలోని శిల్పారామాల్లోకి మంగళవారం నుంచి సందర్శకులను అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. కానీ, ఫిల్మ్స్ ప్రదర్శనలు, వినోద క్రీడలకు అనుమతి లేదని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి శిల్పారామం మాస్టర్ప్లాన్లో భాగంగా పార్కును రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నంలో శిల్పారామం అభివృద్ధికి రూ.10.92 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని ఆయన తెలిపారు. వాటికి నిధులు కేటాయిస్తూ ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. -
'విశాఖ చరిత్రలో ఆ కుటుంబానికి ఓ పేజీ'
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్కు రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నాయకులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. డాక్టర్స్ కాలనీలో ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయాన్నిసందర్శించి పార్టీలకతీతంగా నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ద్రోణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వైజాగ్ అభివృద్ధికి పరితపించే వాడు: కోన రఘుపతి, డిప్యూటీ స్పీకర్ ‘నాకు ద్రోణంరాజు శ్రీనివాస్ మంచి స్నేహితుడు. వైజాగ్ అభివృద్ధిలో కీలక భాగస్వామి అయ్యారు. వైజాగ్ అభివృద్ధి కోసమే శ్రీనివాస్ పరితపించే వాడు. ద్రోణంరాజు మరణం విశాఖపట్నానికి తీరని లోటు. ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించేవారు. భగవంతుడు చాలా త్వరగా ద్రోణంరాజు శ్రీనివాస్ను తీసుకెళ్లిపోయారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. తన మామ గారు చనిపోవడంతో ద్రోణంరాజు అంత్యక్రియలకు రాలేకపోతున్నానని సీఎం జగన్ తెలిపార’ని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే') అత్యంత విషాద కరమైన రోజు: అవంతి ‘ఈ రోజు అత్యంత విషాద కరమైన రోజు. ద్రోణంరాజు శ్రీనివాస్ నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధించింది. పేదల కోసం ఆయన ఎంతో శ్రమించారు. ద్రోణంరాజు విలువలతో కూడిన రాజకీయాలు చేశార’ని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ అభివృద్ధిలో వారిది కీలక పాత్ర: వాసుపల్లి గణేష్ ‘ద్రోణం రాజు మరణాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు సత్యనారాయణ ఆయన కుమారుడు శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. విశాఖ చరిత్రలో ఒక పేజీ వాళ్ళ కుటుంబానికి ఉంటుంద’ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ అన్నారు. (ద్రోణంరాజు శ్రీనివాస్కు నివాళులు) ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్: పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ‘గిరిజన ప్రాంత ప్రజలతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్లు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్’ అని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మంచితనానికి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. -
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నీతులా?
మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నీతులు చెబుతున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అదీప్రాజ్ ధ్వజమెత్తారు. శనివారం విశాఖపట్నం ప్రభుత్వ సర్క్యూట్ హౌస్లో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జీవీఎంసీ పరిధిలో 450 అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ► పార్క్ స్థలాన్ని ఆక్రమించి సబ్బం హరి కట్టిన గోడను తొలగిస్తే విశాఖకు ఎంతో అన్యాయం, ఘోరం జరిగినట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ► ఆక్రమణలు కూల్చడానికి వెళ్లిన జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు, సీఎం, ఎంపీ విజయసాయిరెడ్డిని సబ్బం నోటికి వచ్చినట్టు తిట్టడం ఎంతవరకు సమంజసం? ► మాజీ మేయర్గా పనిచేసిన సబ్బంకు ప్రభుత్వం స్థలం ఆక్రమించకూడదని తెలియదా? ఆయన చేసిన తప్పిదాలను సమర్థిస్తూ చంద్రబాబు, లోకేష్ మాట్లాడడం దారుణం. ► టీవీ చర్చల్లో శ్రీరంగ నీతులు చెప్పే సబ్బం ఇప్పటికైనా తన తప్పు ఒప్పుకోవాలి. భవిష్యత్తులో సీఎంను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. సబ్బం ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకోవాలి. ► ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, పార్టీ నేతలు కె.కె.రాజు, కోలా గురువులు పాల్గొన్నారు. -
సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం
-
సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బం హరిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో ఆయన వీధి రౌడీలా మాట్లాడారని మండిపడ్డారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సిబ్బందిపై సబ్బం హరి దుర్భాషలాడారని అన్నారు. ఆక్రమణలు కూల్చివేస్తే కక్షసాధింపు అనడం సరికాదని మంత్రి అవంతి హితవు పలికారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మీరు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా? సామాన్యులపై చర్యలు తీసుకోవాలా? పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చింది. జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చే ఆక్రమణలు తొలగించారు’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: ‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’) సబ్బం హరి తీరుపై ఎమ్మెల్యే అదీప్రాజు విమర్శలు గుప్పించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయని అన్నారు. సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాకు తెలిపారు. రికార్డులు తారుమారు చేసి సబ్బం హరి పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. గతంలో ఆయన ఆక్రమణలపై టీడీపీ-వామపక్షాలు ధర్నాలు చేశాయని గుర్తు చేశారు. అధికారులు నోటీసులు ఇచ్చినా సబ్బం హరి పట్టించుకోలేదని కరణం ధర్మశ్రీ వెల్లడించారు. గతంలో ఆయన భూకబ్జాపై అయ్యన్నపాత్రుడు పోరాటం కూడా చేశారని, జిల్లా పరిషత్ సమావేశంలో సబ్బం హరి భూకబ్జాను అయ్యన్న నిలదీశారని తెలిపారు. ఇప్పుడు సబ్బం హరికి మద్దతుగా అయ్యన్న మాట్లాడటం సిగ్గుచేటని కరణం ధర్మశ్రీ విమర్శించారు. (చదవండి: కబ్జా స్థలంలో టాయిలెట్ నిర్మించిన సబ్బం హరి) -
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
-
చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు..
సాక్షి, విశాఖపట్నం: పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం రోజున సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'చంద్రబాబు తన రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఆయన కుల రాజకీయాలను ప్రజలు నమ్మలేదు. దీంతో చంద్రబాబుకు వేరే దారిలేక ఇప్పుడు మతంతో రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు డిక్లరేషన్ను వివాదం చేస్తున్నారు. దేవాలయాలపై దాడులు మతమార్పిడి కోసమని చంద్రబాబు అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. దేవాలయాలపై దాడులు చేసి వారిని వదిలి పెట్టేది లేదు' అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
చంద్రబాబు మమ్మల్ని రెచ్చగొట్టారు: పంచకర్ల
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మనుషులే అభివృద్ధి చెందాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరులతో కలిసి పంచకర్ల రమేష్బాబు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్బాబు మాట్లాడుతూ.. ఐదు నెలల క్రితమే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశా. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని చంద్రబాబు రెచ్చగొట్టారు. మా ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండలేక పార్టీని వీడాం. అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించాం. సీఎం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఇంకా చాలా మంది టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలోకి వచ్చే పరిస్థితి ఉంది. లోకేష్ నాయకుడిగా పనికిరాడని టీడీపీ నేతలంతా చెప్పాం. దొడ్డిదారిన లోకేష్ను మంత్రిగా చేసి పెత్తనం చెలాయించేలా చేశారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు మంచి రోజులు వచ్చాయి’అని పేర్కొన్నారు. (చదవండి: 'ఆగస్టు 28.. చంద్రన్న రక్తపాత దినోత్సవం') బాబు ఊహల్లోంచి బయటకి రావాలి: అవంతి ‘చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఉత్తరాంధ్రే. విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిసిపోతుంది. చంద్రబాబు ఇప్పటికైనా ఊహల్లోంచి బయటకు రావాలి. బాబు అధికారంలో ఉండగా విశాఖలో ప్రైవేట్ గెస్ట్ హౌస్లకే రూ.23 కోట్లు చెల్లించారు. 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్హౌస్ కట్టేందుకు చంద్రబాబు అడ్డుపడుతున్నారు. రాజధాని బిల్డింగ్లకు మాత్రం 30వేల ఎకరాలు సేకరించారు’అని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజా వ్యతిరేకి. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలు కోరుకున్నదే నెరవేరుతుంది. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుంది. రఘురామరాజు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. రఘురామరాజుపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేశాం. రఘురామరాజుపై చర్యలు తీసుకుంటారనే విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు. (చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల) -
ప్రభుత్వ అతిథి గృహాలతో ప్రజాధనం ఆదా
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రభుత్వ అతిథి గృహాల నిర్మాణంతో ప్రజాధనం ఆదా అవుతుందని, ఆ ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ► ప్రధాన నగరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేకపోవటంతో హోటల్స్లో విడిది చేయాల్సి వస్తుంది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుంది. ► గత ప్రభుత్వం విశాఖలో ప్రొటోకాల్ కోసం రూ.కోట్ల ఖర్చు చేసింది. చంద్రబాబు, లోకేశ్లు ప్రభుత్వ గెస్ట్హౌస్లో కాకుండా హోటల్స్లో ఉండి రూ. 23 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు. ► తమ ప్రభుత్వంలో అలా జరగకుండా విశాఖ, తిరుపతి, విజయవాడ, కాకినాడల్లో ప్రభుత్వ గెస్ట్హౌస్లను నిర్మించి ప్రజాధనాన్ని ఆదా చేయబోతున్నాం. చంద్రబాబు, మాజీ మంత్రి గంటా కలసి తొట్లకొండ వద్ద ఫిల్మ్ క్లబ్ కట్టడానికి అడుగులు వేశారు. ఇప్పుడు వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారు. ► ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మించే స్థలానికి తొట్లకొండ, బావి కొండ ప్రాంతాలకు కిలోమీటర్ దూరం ఉంది. 126 ఎకరాలను బౌద్ధ స్థూపాల కోసం కేటాయించాం. అక్కడ మెడిటేషన్కి సంబంధించిన నిర్మాణాలు తప్ప మరే ఇతర నిర్మాణాలు చేపట్టబోం. మేమంతా సీఎం జగన్ ఫొటో పెట్టుకునే గెలిచాం. రఘు రామకృష్టరాజును చూసి ప్రజలు ఓట్లు వేయలేదు. సమావేశంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
తొట్లకొండకు ముప్పు: ఖండించిన అవంతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న స్టేట్ గెస్ట్ హౌస్కు, తొట్లకొండకు ఎటువంటి సంబంధం లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నిర్మాణం వల్ల తొట్లకొండకి ఎటువంటి ముప్పు లేదని, చంద్రబాబుతో పాటు కొన్ని పచ్చమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఖండిస్తున్నామన్నారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖపట్నంలో మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ధనం వృధాగా ఖర్చు కాకూడదనే ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తిరుపతి, విశాఖ, విజయవాడలలో గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖపై అడుగడుగునా విషం చిమ్ముతున్న చంద్రబాబు.. ఆయన హయాంలో ఒక్క గెస్ట్ హౌస్ అయినా కట్టారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రొటోకాల్ పేరుతో రూ. 23 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇకపై కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా..) చంద్రబాబుకు దళితుల గురించి మాడ్లాడే అర్హతే లేదని మంత్రి అవంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కనిపించరని ఎద్దేవా చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనకు అమరావతిపై ప్రేమ ఉంటే గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి, గానీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకూడదా? అని నిలదీశారు. గాజువాక ప్రజల ఓట్లు వేయించుకుని విశాఖకి పరిపాలనా రాజధానిని పవన్ కళ్యాణ్ ఎలా వ్యతిరేకిస్తారన్నారు. ఇక తొట్లకొండ ఎక్కడుందో తెలియకుండా ఎలా మాట్లాడతారని రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర గురించి మాడ్లాడేటపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఆయనకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాజుకు పలుకుబడుంటే నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ కోసం ప్రయత్నించాలని సూచించారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దని రఘురామకృష్ణంరాజుకు అవంతి హితవు పలికారు. (చంద్రబాబుకు సామినేని సవాల్..) -
పర్యాటకానికి చిరునామాగా మారాలి
-
టూరిజంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందించడమే లక్ష్యం
-
ఆయన పాటలోనే సామాజిక చైతన్యం ఉంది
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వంగపండు ప్రసాదరావు సాంస్కృతిక రంగానికి ఓ ఆణిముత్యం. అలాంటి ఆణిముత్యం భౌతికంగా దూరం కావడం బాధాకరం. వంగపండు పాటలోనే సామాజిక చైతన్యం ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. గుంటూరు: ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. వంగపండు మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడు వంగపండు. ఆయన విజయనగరం జిల్లా వాసి కావడం తెలుగువారికి గర్వకారణమన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో వంగపండు ప్రజల్లో చైతన్యం నింపారని, దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటలతో వినిపించిన గొప్ప కళాకారుడని తెలిపారు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ఉర్రూతలూగించి.. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఒక మేరుశిఖరంగా వంగపండు నిలిచిపోతారని లక్ష్మణరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర గళం వంగపండు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. వందలాది జానపద గేయాలతో అయన ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారని వంగపండు కుటుంబ సభ్యులకు లక్ష్మణరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది: నారాయణమూర్తి) -
ఇకపై కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని స్టేట్ కోవిడ్ ఆస్పత్రి విమ్స్ను మంత్రి అవంతి శ్రీనివాసరావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విమ్స్లో లోపాలపై బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించారు. తన భర్త చనిపోయినా సమాచారం ఇవ్వలేదంటూ ఓ మహిళ ఆరోపించగా విమ్స్లో వైద్య సిబ్బంది కొరత ఉందని అన్నారు. దాంతోనే సమాచారం లోపం తలెత్తిందని చెప్పారు. దీనిపై విచారణ కమిటీ వేశామని తెలిపారు. ఇప్పటివరకు కోవిడ్ బాధితుల ఫోన్ నెంబర్లు మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారని, బాధితుడు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబాలకు సమాచారం అందడంలేదని తెలిపారు. ఇకపై కోవిడ్తో ఆస్పత్రిలో చేరిన వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యుల పోన్ నెంబర్లు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. విమ్స్లో సమాచారం లోపం తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. (చదవండి: వినయ విధేయ తహసీల్దార్) ఇప్పుటివరకు విమ్స్లో 180 మంది కరోనాతో చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం 595 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 300 పైగా డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 80 మంది మాత్రమే ఉన్నారని, వారు కుడా ఓ వారం పనిచేసి మరో వారం హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారని తెలిపారు. కొంతమంది వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారని మంత్రి గుర్తు చేశారు. వైద్య సిబ్బంది పని చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కోవిడ్ సమయంలో పని చేయడానికి వైద్యులు, నర్సులు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. విమ్స్ ఆస్పత్రి, వైద్యులపై తప్పుడు ప్రచారం తగదని హితవు పలికారు. మీడియా కూడా తప్పుడు వార్తలకి ప్రాధాన్యం ఇవ్వకూడదని కోరారు. దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కరోనా పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. (తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : విమ్స్ డైరెక్టర్) -
మానవతా థృక్పథంతో ముందుకు రావాలి
సాక్షి, విశాఖపట్నం: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ కొన్ని తీర్మానాలను చేసినట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రోజుకు మూడు వేల మందికి కోవిడ్ టెస్ట్లు చేస్తున్నారు. వీటి సంఖ్య ఐదు వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. హోమ్ ఐసొలేషన్ ద్వారా వైద్యం అందించాలని భావిస్తున్నాము. ఐసీఎంఆర్ అనుమతితో మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలకు అనుమతి ఇస్తాము. అత్యవసర వైద్యం అందించడానికి సిబ్బందిని నియమిస్తున్నాము. మానవతా థృక్పథంతో ఉన్న వైద్యసిబ్బంది కోవిడ్ సేవలు అందించడానికి ముందుకు రావాలి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వైద్యవిభాగంలో లోపాలు ఉన్నాయి. వాటిన్నిటినీ సరిదిద్దుకుంటూ ప్రజలకు కోవిడ్పై అవగాహన కల్పిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది) ఆక్సిజన్ కొరత లేదు: కలెక్టర్ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ.. 400మంది ఇప్పటికే ఐసోలేషన్లో ఉన్నారు. రానున్నకాలంలో మరింత మంది హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ను మెడికల్ ఆక్సిజన్గా మారుస్తున్నాము. జిల్లాలో అదనంగా మొత్తం 22 ఆస్సత్రులు కోవిడ్ ఆస్పత్రులుగా గుర్తించాం. ఇప్పటికే 4వేల బెడ్స్ ఉన్నాయి. వీటిని 7వేల వరకు పెంచనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. (విశాఖకు తప్పిన మరో ప్రమాదం) -
వైఎస్ జగన్ భిక్షతోనే మీరు ఎంపీ అయ్యారు..
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును హెచ్చరించారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మీరు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భిక్షతో లోక్సభలో అడుగుపెట్టారనే విషయం గుర్తుంచుకోవాలి. జగన్ చరిష్మాతో మాత్రమే మీరు నాగబాబుపై గెలుపొందారు. మీకు భిక్ష పెట్టిన సీఎంపై విమర్శలు చేయడం తగదు. వైఎస్సార్సీపీ జెండాపై గెలిచిన మీరు టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. మీరు నర్సాపురం వరకు పరిమితం కండి. అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు. విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామ కృష్ణంరాజు ఎవరు..? ఇలా వద్దని మాట్లాడినందుకే చంద్రబాబు నాయుడ్ని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాకుండా ప్రజలు అడ్డుకున్నారని తెలుసుకోండి. ఢిల్లీలో నాలుగు పార్టీల నాయకులు మీకు తెలుసుండొచ్చు. అలా అని అదేపనిగా పార్టీని విమర్శించడం తగదు. మీ పంథా మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరు. పార్టీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయండి. రఘరామకృష్ణంరాజుకి నోటి దురుసుతనం ఎక్కువ. ఆ దురుసుతనంతోనే అనుకున లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. (అభివృద్ధికి టీడీపీ అవరోధం: అవంతి) నలందా కిషోర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ మరణాన్ని కూడా చంద్రబాబు, లోకేష్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిషోర్ టీడీపీ అభిమాని. ఆయన మరణానికి మేము కూడా సంతాపం తెలియజేస్తున్నాము. కరోనా ఎవరికైనా వస్తుంది. పార్టీలతో సంబంధం లేదు. నలందా కిషోర్ను పోలీసులు కర్నూలు తీసుకువెళ్లడంతో మరణించారని చంద్రబాబు, లోకేష్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నలందా కిషోర్పై అభిమానం ఉంటే అచ్చన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ ఇప్పుడు కిషోర్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు మీకు నలందా కిషోర్ ఎవరో తెలుసా ? నలందా కిషోర్ మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబుతో కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్ళారు. అలా చంద్రబాబు దగ్గరకు వెళ్లిన అయిదుగురిలో ముగ్గురికి కరోనా వచ్చింది. ఆ కరోనాతోనే నలందా కిషోర్ మృతి చెందారు. అలా ఆయన మృతికి చంద్రబాబు నాయుడే కారణమంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఏపీలో విస్తృత కరోనా పరీక్షలు: విజయసాయి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో విస్తృత పరీక్షలు నిర్వహించడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువ కరోనా పరీక్షలు చేయడం ద్వారా విస్తృత వ్యాప్తిని నిరోధించవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో కరోనా మరణ మృదంగం లాంటి దుష్ప్రచారం చేయడం తగదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీలోనే జరుగుతున్నాయని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 12 లక్షల కోవిడ్ పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. -
అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం
-
‘వైఎస్సార్ జయంతి రోజు మర్చిపోలేని అనుభూతి’
సాక్షి, విశాఖపట్నం : దశాబ్ద కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో సహకార చక్కెర కర్మాగారం రైతులు ఇబ్బందులు పడ్డారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రిగా తన బాధ్యత నెరవేర్చారని ప్రశంసించారు. కాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని వైఎస్సార్ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల రూపాయల పాత బకాయిలను కూడా సీఎం జగన్ విడుదల చేశారు. ('మాది ఎన్నటికి రైతుల పక్షపాతి ప్రభుత్వమే') మంత్రి అవంతి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రైతు పక్షపాతిగా మరోసారి చరిత్రలో నిలిచిపోయారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన జయంతి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చారని అవంతి శ్రీనివాస్ కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనాలు దగ్గర నుంచి పంట ఉత్పత్తి కొనుగోలు వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుండటం హర్షనీయమన్నారు.(‘ఆయన పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది’) ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 5 వేల మందికి పైగా రైతులకు 10 కోట్ల రూపాయలు, తాండవకు చెందిన 4 వేల మంది రైతులకు సంబంధించి 9 కోట్ల రూపాయల బకాయిలు విడుదలయ్యాని తెలిపారు. రెండు చక్కెర కర్మాగారాలు బకాయిల చెల్లింపుకు నిధులు విడుదల చేయడం మాములు విషయం కాదని, బకాయిల చెల్లింపు తో మళ్ళీ చెరకు సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (అందుబాటులోకి 21 సంజీవని బస్సులు) టీడీపీ హయాంలో సహకార చక్కెర కర్మాగారాలు నడవలేని స్థితిలో ఉండేవని యలమంచలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు విమర్శించారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బకాయిలను సెటిల్ చేయడం రైతులు ఊహించుకోలేదన్నారు. కాగా తాండవ, ఏటికొప్పాక రైతులకు ఈ రోజు ఎంతో పవిత్రమైన, అదృష్టమైన రోజు అని పాయకరావుపేట ఎమ్యెల్యే గొల్ల బాబురావు అన్నారు. -
‘ఆయన పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది’
సాక్షి, విశాఖపట్నం: జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన గుప్తుల కాలాన్ని మరిపించింది. వైఎస్సార్ హయాంలో రైతుల సంక్షేమానికి బాటలు పడ్డాయి. 22 లక్షల హెక్టార్ల కు సాగు నీరు అందించి భూములను సస్యశ్యామలం చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అంటే వ్యవసాయం పండగ అని నిరూపించిన ఘనుడు రాజశేఖరరెడ్డి. 32 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. 26 లక్షల ఎకరాల్లో అటవీ భూములపై ఆదివాసీలకు హక్కు కల్పించిన ఘన చరిత్ర వైఎస్సార్ది. 108, 104 వాహనాలు సమకూర్చి ప్రజలను ఆదుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని వైఎస్సార్ ద్వారానే సాధ్యమైంది. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరెడ్డి పాలనా కాలం స్వర్ణయుగమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని చెప్పారు. ఆయన చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ ప్రజలను ఆదుకుంటున్నాయని తెలిపారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నం రెడ్డి అదిఫ్ రాజ్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఏ రెహమాన్, కుంభా రవిబాబు, విశాఖ ఉత్తరం కన్వీనర్ కె.రాజు, పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు పాల్గొన్నారు. -
వెంకటాపురంలో వైఎస్ఆర్ క్లినిక్ను ప్రారంభించిన మంత్రి అవంతి
-
గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం
-
'వైఎస్సార్ క్లినిక్'ను ప్రారంభించిన అవంతి
సాక్షి, విశాఖపట్నం: ప్రమాదకర కంపెనీల విషయంలో రాజీ పడేదే లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ప్రమాదరక పరిశ్రమలు నివాస ప్రాంతం నుంచి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మంగళవారం ఆయన వెంకటాపురంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి వెంకటాపురం కేంద్రంగా వైఎస్సార్ క్లినిక్ ద్వారా 24 గంటల వైద్య సేవలు అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐదు గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు మంజూరు చేశారు. (ఏపీ టూరిజంలో అవినీతిపై విచారణ) త్వరలోనే ఎల్జీ పాలిమర్స్పై చర్యలు మంత్రి మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం అందుతుందని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. త్వరలో స్థలం గుర్తించి వైఎస్సార్ క్లినిక్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, జేసీ అరుణ్ బాబు, జిల్లా వైద్యాధికారి తిరుపతిరావు, వైఎస్సార్సీపి సీనియర్ నాయకులు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) -
దళారీ వ్యవస్థ నుంచి ఉద్యోగులను సీఎం జగన్ కాపాడారు
-
‘ఇక పేదవాళ్ల ఆరోగ్యానికి ఢోకా లేదు’
-
దేశమంతా ఏపీ వైపు చూసేలా..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య విప్లవం తీసుకొచ్చారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆయన గురువారం జిల్లాకు కేటాయించిన 61 108,104 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతీ పేదవానికి కార్పోరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తున్నాయని తెలిపారు. (టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి) కరోనా కష్ట కాలంలో రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా వెయ్యికిపైగా 108, 104 వాహనాలు ప్రారంభించడం అభినందనీయమని అవంతి అన్నారు. ఇక పేదవాడి ఆరోగ్యానికి డోకా లేదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ఈ వాహనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నాడు వైఎస్సార్ ప్రవేశపట్టిన పధకాలకి నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పునర్జీవం పోశారని కొనియాడారు. (ప్రజారోగ్య రథయాత్ర) ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ నిరుపేదలకి ఉపయోగపడేలా వెయ్యికి పైగా అంబులెన్స్ వాహనాలు ప్రారంభించడం అభినందనీయం అన్నారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా విప్లవాత్మకమైన పధకాలతో సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తాను కూడా పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఒక వైద్యురాలిగా సీఎం వైఎస్ జగన్ పధకాలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. 104 వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఇంటి వద్దకే డాక్టర్లు, వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.(దేశంలోనే కొత్త రికార్డు: సీఎం జగన్) పాడేరు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. 108,104 వాహనాల ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజారోగ్యంపై ఆయన ఎంతశ్రద్ధ కనబరుస్తున్నారో అర్ధమవుతోందని తెలిపారు. గిరిజనులకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 అంబులెన్స్ వాహనాలు ఉపయోగపడతాయని చెప్పారు. గిరిజనులకి వైద్య విద్య అందించేందుకు సీఎం వైఎస్ జగన్ పాడేరులో మెడికల్ కళాశాలని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ వల్ల వైద్య, విద్యా రంగాల్లో సమూల మార్పులు రాబోతున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో 108,104 వాహనాలు షెడ్లో ఉన్నాయని తెలిపారు. బాబు తన పాలనలో ఒక్కరోజు కూడా వాటి గురించి పట్డించుకోకుండా ఇపుడు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 2023లో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని విమర్సించారు. ఇంత పెద్ద స్ధాయిలో 108,104 వాహనాలు ప్రారంభించడంపై ముఖ్యమంత్రిని అభినందించాలన్నారు. ప్రజా సంక్షేమానికి అంకితమైన ముఖ్యమంత్రి కాబట్టే తన పాలనతో తొలి ఏడాదిలోనే దేశంలోనే నాలుగో స్ధానంలో నిలిచారని కొనియాడారు. నాడు వైఎస్సార్ వైద్య, విద్యా రంగాలకి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఆయన కీర్తి దేశ విదేశాల్లో మారుమోగిందని తెలిపారు. ఆయన తనయుడిగా తండ్రిని మించిన స్ధాయిలో పేదల సంక్షేమానికి కృషిచేస్తున్నారని ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, భాగ్య లక్ష్మి, జేసీ అరుణ్ బాబు, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, వైద్య ఆరోగ్యా శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
‘పార్టీని గెలిపించడంలో ఆయన కృషి ఎనలేనిది’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎంతో కృషి చేశారని పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాసరావు కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటూ రాష్డ్రాభివృద్దిలో, సంక్షేమ పాలనలో కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు బుధవారం సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి .ఈ సందర్బంగా కేక్ కట్ చేసి మంత్రి అవంతి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ఎనలేని కృషి చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని.. రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాలు కోసం పోరాడుతున్నారని అన్నారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన నేత విజయసాయిరెడ్డి అని కొనియాడారు. (ఏపీ సర్కారుపై సర్దేశాయ్ ప్రశంసల జల్లు) కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారన్నారు. పెద్దవయస్సులోనూ విజయసాయిరెడ్డి విస్తృతంగా పర్యటిస్తుంటే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కరోనా కు భయపడి ఇంట్లో ఉంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, వంశీకృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లా విజయప్రసాద్, తైనాల విజయకుమార్, కెకె రాజు, గరికిన గౌరి తదితరులు పాల్గొన్నారు. (ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం) అదే విధంగా.. ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్స్ విభాగం అధ్యక్షుడు కాంతారావు ఆద్వర్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారీ కేక్ కట్టింగ్ చేశారు. చింతపల్లిలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జల్లు సుధాకర్ ఆధ్వర్యంలో అభిమానులు కేక్ కట్ చేశారు. -
సాయినార్ ఫార్మా కంపెనీని పరిశీలించిన మంత్రి అవంతి
-
పవన్పై మంత్రి అవంతి ఆగ్రహం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ట్రాప్లో పడి పవన్ కల్యాణ్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాపు సోదరుల్ని చంద్రబాబు నిలువునా ముంచింది నిజం కాదా, ఆనాడు పవన్ గొంతెందుకు లేవలేదని ఆయన ప్రశ్నించారు. అవంతి మీడియాతో ఆదివారం మాట్లాడుతూ.. కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసింది నిజం కాదా? అప్పుడు పవన్ కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా. టీడీపీ హయాంలో కాపు సోదరులు, యువకులపై అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొట్టేయించారు. కాపు సోదరులు పవన్ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏడాదికి రూ.1000 కోట్ల చొప్పున 5 వేల కోట్లు ఇస్తామని కేవలం రూ.1800 కోట్లు మాత్రమే ఇచ్చారు. కాపుల్ని మోసం చేశారు. దానిపై పవన్ గొంతెందుకు వినిపించలేదు. ఏడాది కాలంలోనే కాపుల అభ్యున్నతికి రూ. 4 వేల కోట్లకు పైగా సీఎం జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అదంతా పవన్ కళ్లకు కనిపించడం లేదా. వంగవీటి రంగాని హత్య చేయించిన పార్టీతో పవన్ చేతులు కలిపాడు. రంగా హత్యానంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కాపు కులానికి అండగా నిలిచారు. కాపుల్ని మోసం చేశారు కాబట్టే ఆనాడు, ఇప్పుడు టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు’ అని మంత్రి అవంతి పేర్కొన్నారు. (చదవండి: నమ్మించి వీడియోలు తీసి.. లైంగిక వేధింపులు) -
టూరిజం కంట్రోల్ రూమ్లు ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా నదీతీర ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. శుక్రవారం రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూరిజం కంట్రోల్ రూమ్లను ప్రారంభించారు. నదీతీర ప్రాంతాలైన శింగనపల్లి ( పశ్చిమ గోదావరి), గండి పోచమ్మ (తూర్పు గోదావరి), పేరంటాలపల్లి( పశ్చిమ గోదావరి), పోచవరం( పశ్చిమ గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), రుషికొండ ( విశాఖపట్నం), నాగార్జునసాగర్( గుంటూరు), శ్రీశైలం( కర్నూలు), బెర్మ్ పార్క్ (విజయవాడ)లలో టూరిజమ్ రూమ్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కంట్రోల్ రూమ్స్ వద్దనున్న కలెక్టర్లను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. చదవండి: రూ.1,210 కోట్లతో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు ఈ సందర్భంగా విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ పీసీ మాట్లాడుతూ.. రుషికొండ వద్ద పర్యాటకుల బోటింగ్లపై నిరంత పర్యవేక్షణకి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. కంట్రోల్ రూమ్లో టికెట్ కౌంటర్, కంప్యూటీకరణ ద్వారా ఆపరేషన్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వైర్ లెస్, ప్రమాదాల నివారణ, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. నదిలోకి వెళ్లే ప్రతి బోటు యొక్క ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్ ద్వారా నియంత్రించబడతాయి. ఇకనుంచి పర్యాటకులకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. రుషికొండ కంట్రోల్ రూమ్లో వివిధ శాఖలకి చెందిన ఆరుగురు అధికారులని నియమించాం' అని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. చదవండి: కనీస ధరతో పొగాకు కొనుగోళ్లు -
'సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల అభిమాని'
సాక్షి, విశాఖపట్నం: మెడికల్ కళాశాల స్థలాలను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని.. మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలతో కలిసి పరిశీలించారు. పర్యటనలో భాగంగా త్వరలో నిర్వహించే మెడికల్ కాలేజీ నమూనాలను పరిశీలించిన మంత్రి ఆళ్ల నాని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రుల బృందం పాడేరులో వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి 35 ఎకరాలు మెడికల్ కాలేజీ కోసం కేటాయించాం. పాడేరు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులకు ఆగస్టులో టెండర్లు పిలుస్తాం. పాడేరు మెడికల్ కాలేజీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని పనులు అత్యంత త్వరితగతిన పూర్తి చేసి మెడికల్ తరగతులు ప్రారంభం అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.చదవండి: ఈ నెల 11న ఏపీ కేబినెట్ సమావేశం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభిమాని. అదనంగా గిరిజనుల పక్షపాతి. గిరిజనుల ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా సీఎం శ్రద్ధ వహిస్తున్నారు. త్వరలో ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మాణంతో గిరిజనుల జీవితాలు మారనున్నాయని' అవంతి శ్రీనివాస్ తెలిపారు. కాగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో తొలిసారిగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఏడాది నిర్ణయించారు. అందులో భాగంగానే పాడేరు, అనకాపల్లి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే.. పాడేరులో మెడికల్ కాలేజీ కోసం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కనున్న 35 ఎకరాల భూమిని గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు స్వాధీనం చేశారు. ఈ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్ఎస్వై కింద రూ.195 కోట్లను తన వాటాగా మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనకాపల్లి మెడికల్ కాలేజీ కోసం అనకాపల్లి మండలం గొలగాం, కోడూరు, పిసినికాడ గ్రామాల్లో ఖాళీ స్థలాలను ప్రాథమికంగా గుర్తించారు. చదవండి: పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..! -
చంద్రబాబు పంథాలో టీడీపీ ఎమ్మెల్యేలు
-
‘10 నుంచి 5 గంటల వరకు విధులు నిర్వర్తించుకోవచ్చు’
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 82 నమోదైనట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వారిలో 56 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ సమక్షంలో బుధవారం కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసులు పెరిగితే పరిస్థితిని ఎదుర్కోవడానికి హస్పిటల్లో బెడ్లు సిద్దంగా ఉన్నాయన్నారు. జిల్లాలో 59 లక్షలు, సిటీలో 29 మాస్కులు పంపిణీ చేశామన్నారు. 70 క్వారంటైన్ సెంటర్లో ఇప్పటి వరకు 3231 మంది చేరగా ప్రస్తుతం 490 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రుల్లో మొత్తం 29 మంది ఐసోలేషన్లో ఉన్నారన్నారు. 31 కంటైన్మెంట్ జోన్లు తొలి దశంలోఉండగా తాజాగా 25 మాత్రమే ఉన్నాయన్నారు. (‘దర్శనాలు లేకపోయినా రూ.1.98 కోట్ల ఆదాయం’) అనకాపల్లి, భీమిలి, మధురవాడ ప్రాంతాలు గ్రీన్ జోన్లుగా మారాయని మంత్రి పేర్కొన్నారు. వార్డు వాలంటీర్ల ద్వారా నాలుగు విడుతలుగా సర్వే నిర్వహించామని, కంటైన్మెంట్జోన్లో నిబంధనలు అమలు జరుగుతాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ విధులు నిర్వర్తించుకోవచ్చని తెలిపారు. కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, త్వరిత గతిన వ్యాధి నుంచి బయటపడే వైద్యం ఉందన్నారు. వలస కార్మికులు ఉండాలంటే సిటీలో షెల్టర్లు ఉన్నాయని, వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లాలంటే బస్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. లాక్డౌన్తో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (స్వాధార్ గృహం వాచ్మెన్ అరెస్టు: తానేటి వనిత) -
గ్యాస్ లీక్.. ఆ వదంతులు నమ్మొద్దు
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్లో రెండోసారి గ్యాస్ లీక్ అయినట్టు వచ్చిన వార్తలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొట్టిపారేశారు. ఆ వదంతులు అన్ని అవాస్తవమని చెప్పారు. ఈ మేరకు ఏపీ పోలీసు ట్విటర్ ఖాతాలో ఓ మెసేజ్ పోస్ట్చేశారు. పరిశ్రమలో మెయింటెనెన్స్ టీమ్ మరమ్మతులు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే కొంత ఆవిరిని బయటకు పంపించారని.. అక్కడ రెండో సారి ఎటువంటి గ్యాస్ లీక్ జరగలేదని స్పష్టం చేశారు. (చదవండి : విశాఖ ఎల్జీ పాలిమర్స్లో భారీ ప్రమాదం) మరోవైపు ఎల్జీ పాలిమర్స్లో రెండోసారి గ్యాస్ లీక్ అయిందని వదంతులను నమ్మవద్దని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను సందర్శించిన అనంతరం మంత్రి అవంతి మీడియాతో మాట్లాడారు.. కంపెనీలో గ్యాస్ లీక్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. ఆర్ఆర్ వెంకటాపు, బీసీ కాలనీల్లోని ప్రజలు సమీప శిబిరాల్లో క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో మినహాయిస్తే విశాఖలోని ఇతర ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కాగా, గురువారం తెల్లవారుజామున ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు లోనయ్యారు.(చదవండి : గ్యాస్ లీక్ ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి..) -
ఆయనకు క్వారంటైన్ అంటే ఎందుకు భయం?
సాక్షి, విశాఖపట్నం : జనం పేరిట చందాలు వసూలు చేసే ఖర్మ వైఎస్సార్సీపీకి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో హైదరాబాద్లో ఉండి వైఎస్సార్సీపీ నేతలపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కష్టాల్లో ఉన్న వేళ పలువురు దాతలు సీఎం సహాయ నిధికి, కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ పేరిట చెక్కులు ఇస్తుంటే.. ఆ విషయాన్ని కూడా తెలుసుకోకుండా టీడీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. (చదవండి : ఆ ఘటన అమానవీయం : సీఎం జగన్) 63 ఏళ్ల వయసులో ఎంపీ విజయసాయిరెడ్డి రక్తదానం చేస్తే.. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండి దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కష్ట సమయంలో హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలకు ఏమి ఇచ్చిందని నిలదీశారు. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ఏపీకి రావచ్చు కదా.. క్వారంటయిన్ అంటే భయమెందుకు అని ప్రశ్నించారు. షెల్టర్ హోమ్లో సదుపాయాలు పరిశీలిస్తే క్వారంటైన్ సెంటర్కి వెళ్లామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పడం దారుణం అన్నారు. -
మత్స్యకారులను ఆదుకుంటాం
-
విశాఖ: కంటోన్మెంట్ జోన్లో పర్యటించిన మంత్రులు
-
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించి సహకరించాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు కోరారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఏర్పాటుచేసిన నిత్యావసర సరుకులను పారిశుద్ధ్య కార్మికులకు మంత్రులు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. 'లాక్డౌన్ నిబంధనలను ప్రజలంతా తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రజల సహకారంతోనే త్వరితగతిన కరోనాను నియంత్రించ వచ్చని' ఆయన పేర్కొన్నారు. జిల్లా మంత్రి అవంతి మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఆందోళనతో ఉంటే ఇలాంటి సమయంలో చంద్రబాబు రాజకీయాలు చేయడం తగదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు దేశం నాయకులు కరోనా నియంత్రణకు సహకరించినా మేం స్వాగతిస్తామని' మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అడ్డాల రామరాజు, నడింపల్లి రామరాజు, ఎర్ర వరం బాబు, ఆదిరెడ్డి మురళి దాసరి రాజు పాల్గొన్నారు. చదవండి: ఆయన ఎక్కించే ఎల్లో వైరస్ ఎంత డేంజరంటే! భీశెట్టి దంపతుల మృత్యుంజయ హోమం అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి దంపతులు వారి స్వగృహంలో రాష్ట్ర ప్రజలు కరోనా బారిన పడకుండా సుభిక్షంగా ఉండాలంటూ మహాగణపతి మృత్యుంజయ హోమం నిర్వహించారు. -
నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
-
‘వాయిదా పడ్డా వైఎస్సార్సీపీదే విజయం’
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థలకు నిధులు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సంస్థల నిధులను పోరాడి సాధించుకుందామని చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. అవంతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా 5,800 కోట్ల నిధులిప్పిస్తామని బీజేపీ చెప్పాలని అవంతి సవాల్ విసిరారు. ఆరు వారాలు కాదు.. ఆరు నెలల పాటు ఎన్నికలు వాయిదా పడ్డా వైఎస్సార్సీపీదే విజయమన్నారు. ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ సీఎస్కి రాసిన లేఖ టీడీపీ నాయకులు రాసినట్టుందని ఆయన మండిపడ్డారు. ఎవరిని అడిగి ఎన్నికలు వాయిదా వేశారు అని అన్నారు. ('కరోనాను ఆయనే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు') ఎన్నికల కమీషనర్.. ఇంకా చంద్రబాబే సీఎం అనుకుంటున్నారామో అని అవంతి ఎద్దేవా చేశారు. సీఎంగా వైఎస్ జగన్ను ప్రజలు ఎన్నుకున్నారని ఆయన గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజలకి నష్టం కలిగించే కార్యక్రమం చేయడం వల్ల రాజ్యాంగబద్ద పదవులపై ప్రజలకి నమ్మకం పోతుందన్నారు. ఆరు నెలలు వాయిదా వేశామని చెబుతూనే అధికారులను బదిలీ చేయాలని ఎలా చెబుతారని ఆయన మండపడ్డారు. విజయవాడ బొండా ఉమాకి మాచర్లలో పనేంటని అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. పోలీసులకి చెప్పకుండా మాచర్ల ఎందుకు వెళ్లారని ఆయన ఆగ్రహించారు. పోలీసులు వాళ్ల విధులు వాళ్లు నిర్వహిస్తే మీకు చెడ్డవాళ్లు.. మీ మాట వింటే మంచివాళ్లా అని ఆయన మండిపడ్డారు. కుట్ర రాజకీయాలతో చంద్రబాబు అడుగడుగునా రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నారని అవంతి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలనన్నారు. బీజేపీ, పవన్ కళ్యాణ్లు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని అవంతి డిమాండ్ చేశారు. వీఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యూహంలో ఎన్నికల కమీషన్ చిక్కుకుందని మండిపడ్డారు. ఎన్నికల వాయిదా ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటిదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పధకాల అమలు చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఈ కుట్రలకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఉగాది నాడు పేదలకి ఇళ్ల పట్టాలివ్వాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాలను కుట్రలతో అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల వాయిదాని ఖండిస్తున్నామని.. ఎన్నికల కమీషన్ పునరాలోచించాలన్నారు. -
సీఎం పేరు మీద క్రీడలు జరగడం ఇదే తొలిసారి
-
రాజధానిలో భూకుంభకోణంపై సిట్ వేశాం
-
చంద్రబాబూ.. రెఫరెండంకు సిద్ధమా?
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానుల విషయంలో ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు లేదని చంద్రబాబు అనడం సరికాదని..దమ్ముంటే రెఫరెండంకి సిద్ధమా అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. విశాఖలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి..ఉప ఎన్నికలకు పోదాం...అందులో ఒక్క ఎమ్మెల్యే గెలిచినా విశాఖలో పరిపా లన రాజధానిని ఏర్పాటు చేయమన్నారు. మద్దిలపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో విశాఖలో భూకుంభకోణాలకు పాల్పడిన సహచర మంత్రిపై సిట్కు ఫిర్యాదు చేసిన విషయం అయ్యన్నపాత్రుడు మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం తాము చేస్తున్నది భూ కుంభకోణాలు కాదని...ప్రభుత్వ భూములను తీసుకుని పేద ప్రజలకు ఉగాది నాటికి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. మా పార్టీ విధానం పరిపాలన వికేంద్రీకరణ అన్నారు. అమరావతి రాజధాని అని చంద్రబాబు అంటాడు.. విశాఖ లో కొంతమంది టీడీపీ నేతలు విభేదిస్తారు..ఆ పారీ్టలో చాలా గందరగోళ పరిస్థితి ఉందని అర్థ మవుతోంది. టీడీపీకి ఒక స్టాండ్ అంటూ ఏముండదని మరోమారు స్పష్టమైందన్నారు.తమ ప్రభుత్వం సిట్ వేసిందని..మరొ కొన్ని రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తుందన్నారు. తప్పుచేసిన వారెవరైనా జైళ్లు ఊచలు లెక్కపెట్టాల్సిందేనన్నారు. టీడీపీలో చంద్రబాబుని మించి అపరమేధావిగా పేరుగాంచిన యనమల రామకృష్ణుడు తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తాడని మండిపడ్డారు. ఇటీవల ఓ చంద్రబాబు అనుకూల పత్రిక సూపర్ సీఎంలని తప్పుడురాతలు రాశారని, తమ పార్టీలో ఒకరే సీఎం ..అది వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని....ఆయనే మాకు సూపర్ సీఎం అని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. విశాఖని పరిపాలన రాజధానిగా చేసిన మరుక్షణం నుంచి హైదరాబాద్కు దీటుగా విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తే..కొన్ని సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతాయని టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం నమ్మేస్థితిలో ప్రజ లు లేరని కియో మోటార్స్ వ్యవహారంలో మరోమారు స్పష్టమైందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విశాఖలో ఒక్క గజం భూమైనా కబ్జా జరిగిందని నిరూపిస్తే చంద్రబా బు చెప్పిదానికి తామంతా సిద్ధమని పేర్కొ న్నారు. పూటకో మాట..నిమషానికొక వేషం వేస్తున్న చంద్రబాబు తీరుపై ఆ పారీ్టలో ఉన్న ఎమ్మెల్యేలే విసుక్కుంటున్నారని పేర్కొన్నారు. అమరావతి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ నవరత్నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో అర్హులైన వారికెవరైనా రాకపోతే తక్షణమే వచ్చే విధంగా కృషిచేయాలని కార్యకర్తలకు, వార్డు అధ్యక్షులకు పిలుపునిచ్చారు. ప్రతి వార్డు అధ్యక్షుడు, కార్యకర్త, నగర అనుబంధసంఘాల అధ్యక్షులు ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా..లేదా అనే విషయం తెలుసుకోవాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు. మన బలం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనని, ఎప్పటికప్పుడు వలంటీర్లతో ప్రజలకు అందేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి మాట్లాడుతూ ఉగాది నాటికి 25 లక్షల మంది పేదప్రజలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయనున్నామన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్ నాయకుడు కొయ్యప్రసాద్రెడ్డి, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కరరావు, అక్కరమాని వెంకట్రావ్, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ పరూఖీ, అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, కృష్ణంరాజు, మొల్లి అప్పారావు, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, సతీ‹Ùవర్మ, పీలా వెంకటలక్ష్మీ, పీలా ఉమారాణి, పి.ఎస్.ఎన్ రాజు, బర్కత్ అలీ, షరీఫ్, బోని శివరామకృష్ణ, ఆల్ఫాకృష్ణ, బి.కాంతారావు, ఏ.రాజుబాబు, తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు
-
వికేంద్రీకరణకు జై
-
‘ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా’..
సాక్షి, అమరావతి : ‘ స్వామీ వివేకానందే నా నిజమైన హీరో. భారత దేశం ఉన్నంత కాలం వివేకానందుడి పేరు గుర్తుండిపోతుంద’ ని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం యూత్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. దేశం బాగుంటే మనం అందరం బాగుంటామని అన్నారు. యువత కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని చెప్పారు. నాలుగు లక్షల యువతకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనన్నారు. లంచం అనే మాట లేకుండా పాలన చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. సరైన సదుపాయాలు లేక ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు, ఉత్తరాంధ్ర అంటే కమెడియన్లుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి ఉండకూడదనే సీఎం జగన్ తపన అని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్దే సీఎం జగన్ ఉద్ధేశ్యమని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. -
అదే ఏపీ సీఎం జగన్ ఆశయం
సాక్షి, కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ క్రీడావేదికలో నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. క్రీడలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత నిస్తున్నారని తెలిపారు. శనివారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్రంలోనే తొలిసారిగా జరుగుతున్న కార్ మోటార్ రేసింగ్ పోటీలను మంత్రి అవంతి శ్రీనివాస్, ఛాంపియన్స్ క్లబ్ అధ్యక్షురాలు హేమామాలిని, ఐ.ఎన్.ఎసి అధ్యక్షుడు సుభకర్లు ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 100 మంది కార్ రేసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న కార్ రేస్ని మొదటిసారిగా విజయవాడలో నిర్వహించామని తెలిపారు. తిరుపతి, విశాఖల్లో కూడా కార్ రేస్ పోటీలు జరిపిస్తామన్నారు. ఇలాంటి ఈవెంట్లు పెట్టేందుకు ఎవరు ముందుకు వచ్చినా వెన్నుతట్టి ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆరునెలల్లో రెండు కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. విజయవాడ, విశాఖ, తిరుపతిల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఒక రాజధాని వద్దు.. 3 రాజధానులు ముద్దు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కార్యరూపం దాల్చాలంటూ నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధ్వర్యంలో మానవహారాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని.. రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. విశాఖపట్నం: అధికార, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయొద్దని ప్రజలు కోరారు. అలాగే ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న కుట్రలపై మండిపడ్డారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించాలని కోరుతూ గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, పశ్చిమ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, బెహరా భాస్కరరావు, శ్రీధర్ అప్పలనాయుడు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, మహిళ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జి.మాడుగుల: మూడు రాజధానులతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు అన్నారు. జి.మాడుగులలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అభినందనీయమన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి కంటే సొంత అభివృద్ధే ముఖ్యమని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదన్నారు. అనకాపల్లి: విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించాలని కోరుతూ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు దిలీప్కుమార్, డాక్టర్ విష్ణుమూర్తి, మందపాటి జానకిరామ రాజు, గొర్లి సూరిబాబు, జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం: అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేల సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ దాకా భారీ ప్రదర్శన నిర్వహించారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీలను ఆమోదించాలని నినాదాలు చేశారు. ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు ఉద్యమిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి మంత్రి శంకర్ నారాయణ సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఇక్భాల్, వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరా, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి: ఒక రాజధాని వద్దు.. 3 రాజధానులు ముద్దు అంటూ రాజమండ్రి ఎంపీ భరత్ ఆధ్వర్యంలో కోటగుమ్మం జంక్షన్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమలాపురం: మూడు రాజధానులు ముద్దు..ఒకే రాజధాని వద్దు అంటూ అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ భారీ ర్యాలీ ప్రారంభించారు. పట్టణంలోని మూడు కూడళ్ల నుంచి వేల మంది గడియారపు స్తంభం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి మూడు రాజధానులు అవసరమంటూ నినాదాలు చేశారు. కర్నూలు: ఆలూరులో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా విద్యార్థులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హాఫీజ్ఖాన్, వైఎస్సార్సీపీ నేత బివై రామయ్య పాల్గొన్నారు. పశ్చిమగోదావరి: సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్రాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబుకు నిరసన సెగ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజల నిరసన సెగ తగిలింది. తాడేపల్లిగూడెంలో బాదంపూడి జంక్షన్ వద్ద బస్సు యాత్రగా వెళ్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్ బాబు’ నినాదాలతో తాడేపల్లిగూడెం ప్రజలు నిరసన తెలిపారు. -
ఆర్టీసీ బస్సులో మంత్రి అవంతి
-
3 ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టమా?లేదా?
-
‘చంద్రబాబు తీరు ఆచరిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతి’
సాక్షి, విశాఖపట్నం : అమరాతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి అన్యాయం చేయరని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ భరోసానిచ్చారు. అమరావతి నుంచి అసెంబ్లీని మారుస్తానని సీఎం జగన్ చెప్పలేదని అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రైతుల పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. మీడియాపై బాబు దాడులకు తెగబడుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరు ఆచరిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతి పాలవ్వడం ఖాయమన్నారు. అమరావతి ఒక్కటే అభివృద్థి చేస్తే సరిపోతుందా.. ఇతర ప్రాంతాల అభివృద్ధి చెందకూడదా అని చంద్రబాబును ప్రశ్నించారు. విశాలంగా ఆలోచించండి అని హితవు పలికారు. విశాఖలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే అమరావతిలో పెట్టాలని చంద్రబాబు చెప్పడంతో పెట్టుబడులు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. చంద్రబాబు మూడు ప్రాంతాల అభివృద్ధికి అనుకూలమా.. కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
విశాఖతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అవంతి
-
ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా సీఎం నిర్ణయం..
సాక్షి,విశాఖపట్నం : రాజధాని విషయంలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధిపై ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం దీనిపై స్పందించిన మంత్రి.. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్త చేశారు. మూడు రాజధానుల నిర్ణయంపై అన్ని ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అవంతి తెలిపారు. రాజధాని అంశాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపించేవారు నిరూపించాలని మంత్రి సవాలు చేశారు. మద్యం రేట్లు పెంచితే టీడీపీ నాయకులకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రమంతా అభివృద్ధి జరగడం ఆగదని చెప్పారు. -
ప్రాంతాల మధ్య బాబు విభేదాలు సృష్టిస్తున్నారు
-
ఎజెండాలేని టీడీపీకి అదే గతి పడుతుంది: మంత్రి అవంతి
సాక్షి, విజయవాడ : రాజధాని రైతులు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకనకదుర్గ అమ్మవారిని శుక్రవారం మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంత రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. భూముల ఇచ్చిన రైతులకు ముఖ్యమంత్రి అండగా ఉంటారని తెలిపారు. మూడు ప్రాంతాలు అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారని, దీనిలో భాగంగానే రాజధానులు వికేంద్రీకరణ చేపడుతున్నారన్నారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతం వల్ల తెలంగాణలో నష్టపోయినా ఇంకా మేల్కొలేదని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని ఏర్పాటు విషయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలతో చంద్రబాబు కనీసం చర్చించలేదని, తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో ప్రజల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ప్రజల నాడి తెలుసుకున్న మనిషి అని.. చంద్రబాబులాగా రాత్రి ఒక మాట పగలు ఒక మాట మాట్లాడటం ముఖ్యమంత్రికి చేతకాదని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు లోటు లేకుండా ఒక తండ్రి లాగా సమన్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మేడ్ ఇన్ పబ్లిక్ అని ప్రశంసించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి సీఎం జగన్ అని ప్రస్తావించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణా విషయంలో రెండుకళ్ల సిద్ధాంతం అవలంభించిన చంద్రబాబు.. ఇప్పుడు 3 ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకించడం హాస్యాస్పదమన్నారు. రాజధాని అని చెప్పి 5 సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి చేశారని.. తాత్కాలిక భవనాలు తప్ప ఏమీ లేదని మండిపడ్డారు.ఎజెండా లేని టీడీపీకి తెలంగాణాలో పట్టిన గతే ఆంధ్రాలో కూడా పట్టబోతుందని వ్యాఖ్యానించారు. -
విశాఖ ఉత్సవ్లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్
-
విమర్శలు ఆపి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి
-
అందుకే సస్పెండ్ చేయించుకున్నారు: అవంతి
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు తీసుకువచ్చారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. సచివాలయ మీడియా సమావేశంలో బుధవారం మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన బిల్లులను చూసి సహించలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాకౌట్ చేశారని విమర్శించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కావాలనే సస్పెండ్ చేయించుకున్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆధారాలతో సహా బయటపడటంతో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడలేక సస్పెండ్ చేయించుకున్నారని పేర్కొన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం లేదని చెప్పారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టాలనుకోవడం సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం అని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబడిందని, చంద్రబాబు బినామీలు కొన్న భూముల ధరలు పడిపోతాయని బాధపడుతున్నాడని అన్నారు. అప్పట్లో చంద్రబాబు భూములు బలవంతంగా లాక్కుంటున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన చేశాడని, ఇప్పుడు చంద్రబాబు తాన అంటే పవన్ తందాన అంటున్నాడని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఇక గంటా శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు అవకాశవాదులని, పదవి కోసం తమ పార్టీలోకి రావాలనుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు అబద్దాలు చెప్పకపోతే బ్రతకలేడని, గంటా శ్రీనివాసరావు అధికారం లేకపోతే బ్రతకలేడని విమర్శించారు. చంద్రబాబు ఒకసారి కులాన్ని.. మరోసారి ప్రాంతాన్ని రాజకీయాల కోసం ఉపయోగిస్తారని మండిపడ్డారు. సీఎం జగన్ ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు.. అలాగే అనుకూలం కూడా కాదని మంత్రి పేర్కొన్నారు. -
రాజమండ్రిలో టూరిజం ఇన్వెస్టర్స్ సమావేశం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో పర్యాటక శాఖ అధ్వర్యంలో టూరిజం ఇన్వెస్టర్స్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీ సోమువీర్రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో 45శాతం దేశాలు టూరిజం మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. అలాగే టూరిజానికి అవకాశం ఉన్న పలు ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి భద్రతకు ప్రాధాన్యం కల్పించాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ క్రమంలో పర్యాటక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. సీతానగరం మండలంలో ఉన్న రామవరపు ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అన్నారు. అలాగే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద రోప్వే ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందరని, దీంత టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. స్టార్హోటల్లో మద్యం ధరలు అధికంగా ఉన్నందువల్ల టూరిజంపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్రేయపురం పరిధిలో ఉన్న పిచ్చుకలను 10కోట్లతో రిసార్ట్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవచ్చనునని తెలిపారు. -
విశాఖ ఉత్సవ్ బ్రోచర్లను విడుదల చేసిన మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: దేశానికి ముంబై ఎంత ముఖ్యమో.. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం అంత ముఖ్య నగరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విశాఖపట్నంలో ఆయన, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు డిసెంబర్ 28, 29 తేదీలలో జరగనున్న‘విశాఖ ఉత్సవ్’ బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖ నగరానికి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అంతర్జాతీయంగా విశాఖ బ్రాండ్ ఇమేజ్ పేరిగేలా విశాఖ ఉత్సవాలను నిర్వహించబోతున్నామని తెలిపారు. టూరిజం ప్రమోషన్లలో భాగంగా ఈ ‘విశాఖ ఉత్సవ్’ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి రోజుకు లక్షల మంది పర్యాటకులు రానున్నట్లు అంచనాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖ ఉత్సవాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహరెడ్డిలు ముఖ్య అతిథులుగా హజరుకానున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఉత్సవాలలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందించే విధంగా ‘విశాఖ ఉత్సవ్’ను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా జనవరిలో కాకినాడ బీచ్ ఫెస్టివల్ను, నెల్లూరులో కైట్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ వినయ్చంద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, యువి రమణమూర్తి రాజు, పోలీసు కమిషనర్ ఆర్కె మీనా తదితరుల పాల్గొన్నారు. -
'ఇంగ్లీష్ విద్యపై మతపరమైన విమర్శలా'
సాక్షి, అమరావతి : ఇంగ్లీష్ మీడియం విద్యపై మతపరమైన విమర్శలు చేయడం దారుణమని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న ఇంగ్లీష్ మాధ్యమానికి, క్రిస్టియన్ మతానికి ఏం సంబంధం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన, నిమ్న వర్గాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం తప్పా అని ప్రశ్నించారు. వంగవీటి రంగా హత్యతో కుల రాజకీయాలు చేసిన టీడీపీ ఇప్పుడు మతానికి సంబంధించి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పర్యాటక శాఖ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 300 బోట్లున్నాయని, ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం డివిజన్లలో తనిఖీలు నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 21న 9 కంట్రోల్ రూమ్లకు సీఎం శంఖుస్థాపన చేస్తారని, వచ్చే మూడు నెలల్లో కంట్రోల్ రూమ్లు నిర్మిస్తామని వెల్లడించారు. ప్రతి కంట్రోల్ రూంకు ఐదుగురు అధికారులు ఉంటారని తెలిపారు. బోటు నడిపేవారు ఎవరయినా అన్ని నిబంధనలను పాటిస్తామని లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి హామీ ఇస్తేనే బోట్లు తిప్పడానికి అవకాశం ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసం సారంగులకు పరీక్షలు పెట్టి, బోటుకు ఫిట్నెస్ నిర్వహించాకే అనుమతిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 15 నాటికి అన్ని సిద్ధం చేసి బోటు ఆపరేషన్ ప్రారంభిస్తామని, ప్రతి బోటు ఆపరేటర్ కొత్తగా లైసెన్సుకి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సీనియర్ సారంగులైనా పరీక్ష రాయాల్సిందేనని, అయితే పరీక్షకు సంబంధించి ముందుగా18 రోజులు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత పరీక్ష పెడతామని వివరించారు. -
ఇసుకపై దీక్ష చేసే అర్హత చంద్రబాబుకి ఎక్కడిది
-
అంతర్జాతీయ కార్గోకు ఏపీ రాచబాట
అంతర్జాతీయంగా కార్గో రవాణాకు విశాఖ పోర్టు మార్గం సుగమం చేసుకుంది. థాయ్లాండ్లోని రాణోంగ్ పోర్టు ప్రతినిధులతో వ్యూహాత్మకంగా కుదుర్చుకున్న మారిటైమ్ ఒప్పందంతో ఇది సాధ్యమైంది. విశాఖలో గురువారం ప్రారంభమైన బిమ్స్టెక్ సదస్సు దీనికి వేదికగా నిలిచింది. బంగాళాఖాత తీరంలోని ఏడు దేశాలకు చెందిన ప్రధాన పోర్టుల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్షుక్ మాండవియా ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఈ సదస్సులో బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య కార్గో రవాణా, ఎగుమతులు, దిగుమతులు, పెట్టుబడి అవకాశాలు, పర్యాటకాభివృద్ధి, భద్రత తదితర అంశాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంపై తొలిరోజు కార్యక్రమంలో వక్తలు ప్రసంగించారు. జలరవాణాతోపాటు పలు రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలంగా ఉంటుందని సదస్సులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం తీర దేశాల ప్రతిష్టాత్మక పోర్టుల సదస్సుకి విశాఖ నగరం వేదికగా నిలిచింది. బహుళ రంగాలు, సాంకేతిక, ఆర్థిక రంగాల సమన్వయ సదస్సు (బిమ్స్టెక్) నగరంలో గురువారం ప్రారంభమైంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంకతో పాటు భారత్ దేశాలకు చెందిన ప్రభుత్వాలు, పోర్టు ట్రస్టులకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. పోర్టుల చరిత్రలో ప్రపంచ దేశాల పోర్టులతో కలిసి మొదటిసారి ఈ తరహా సమావేశం నిర్వహించారు. 1997లో బిమ్స్టెక్ ఆవిర్భవించిన తర్వాత విశాఖ పోర్టు ట్రస్టు మొదటిసారిగా ఈ సదస్సుకి ఆతిథ్యమిచ్చింది. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్షుక్ మాండ్వియా సదస్సుని ప్రారంభించారు. ఏడు దేశాలకు చెందిన వివిధ మేజర్ పోర్టులు, ప్రైవేటు పోర్టుల ప్రతినిధులు కూడా సదస్సుకి హాజరై పోర్టు రంగంలో ఆయా ప్రాంతాల్లో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు, అందిపుచ్చుకుంటున్న అధునాతన సాంకేతికత మొదలైన అంశాలపై చర్చించారు. ఎగుమతి, దిగుమతులు, ఉత్పత్తి పెంపు, రవాణా మార్గాల అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు, స్వేచ్ఛా వాణిజ్యం, పర్యాటక అభివృద్ధి, పోర్టుల్లో భద్రత మొదలైన అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. కీలక ఉపన్యాసాలు చేసిన అధికారులు పోర్టుల రంగంలో వస్తున్న మార్పులపై ప్రసంగించారు. సదస్సుకు హాజరైన దేశ విదేశీ ప్రతినిధులు విశాఖ పోర్టు వ్యూహాత్మక ఒప్పందం పోర్టు నుంచి అంతర్జాతీయ స్థాయి ఎగుమతి దిగుమతుల్లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు కీలకమైన వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. బిమ్స్టెక్ సదస్సులో భాగంగా థాయ్లాండ్ పోర్ట్ అథారిటీతో విశాఖ పోర్టు ట్రస్టుతో పాటు కోల్కతా, చెన్నై పోర్టులు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. థాయ్లాండ్లోని రాణోంగ్ పోర్టు నుంచి మేరీటైమ్ వాణిజ్యానికి పరస్పర సహకారం అందించుకునేలా ఈ ఒప్పందం జరిగింది. దీంతో అంతర్జాతీయ రవాణాకు కీలక మార్గం నుంచి అనుమతులు పొందేందుకు మార్గం సుగమమైంది. కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం పోర్టుల అభివృద్ధి కోసం చర్యలు ప్రారంభమయ్యాయి. పోర్టు రైల్ కార్పొరేషన్, క్రూయిజ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. సాగరమాల ద్వారా పరస్పర సహకారానికి ఊతం లభిస్తుంది. ఇప్పటి వరకూ రూ.48 లక్షల కోట్లు సాగరమాలకు పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా కోటి ఉద్యోగాలు కల్పించడమే పోర్టుల ప్రధాన లక్ష్యం. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చెయ్యనున్నారు. ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు జలరవాణాతో పాటు రోడ్డు, రైలు మార్గం అవసరమైతే.. ఆ ఒప్పందంలోనే ఉండేలా చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పోర్టులన్నీ ఒకే వేదికపైకి వచ్చినప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆయిల్ స్పిల్లింగ్ హ్యాండ్లింగ్ చేయడం, విపత్తుల్లో సహకారం అందించడంలో కోస్ట్గార్డ్ సహకారం అందిపుచ్చుకుంటున్నాం. క్రూయిజ్ షిప్పింగ్ అందుబాటులోకి రావాలి. ఇప్పటికే ఆబుదాబీ వంటి 8 దేశాలతో ఒప్పందాల దిశగా అడుగులు పడుతున్నాయి. – సంజయ్భాటియా, ముంబై పోర్టు ట్రస్ట్ చైర్మన్ సదస్సుకు హాజరైన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు 7 దేశాల ప్రతినిధులు రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం భాసిల్లుతోంది. రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం. 3 అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు మేజర్ పోర్టులు ఏపీలో ఉన్నాయి. పర్యాటకంగా, పారిశ్రామికంగా విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. విశాఖపట్నం పోర్టు ట్రస్టు, గంగవరం పోర్టు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏ దేశం ఇక్కడ పెట్టుబడులు పెట్టినా సాదరంగా స్వాగతిస్తాం. సులభతర వాణిజ్యం అభివృద్ధి చెందాలి. – రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ గార్మెంట్స్ ఎగుమతుల్లో ప్రపంచంలో రెండో స్థానం 106 పోర్టులతో బంగ్లాదేశ్ ఎగుమతి, దిగుమతుల్లో భాగస్వామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్–100 పోర్టుల్లో చిట్టగాంగ్ పోర్టు 64వ స్థానంలో నిలిచింది. భారత్ నుంచి 12 శాతం దిగుమతులు సాగుతున్నాయి. కార్గోలో బంగ్లాదేశ్ రెండంకెల వృద్ధి సాధించింది. రెడీమేడ్ గార్మెంట్స్ ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 2018 నాటికి 34 బిలియన్ డాలర్ల గార్మెంట్స్ ఎగుమతులు జరగగా.. 2021 నాటికి 50 బిలియన్ డాలర్ల లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన పైరా పోర్టు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం. – రియర్ అడ్మిరల్ మొజమెల్ హాక్, బంగ్లా పోర్టుట్రస్ట్ ఛైర్మన్ నేపాల్ కార్గోకు విశాఖ పోర్టు గేట్వే ఎగుమతి, దిగుమతులపై తమ దేశం కేవలం భారత్, చైనా పైనే ఆధారపడి ఉంది. భారత్ నుంచి ప్రస్తుతం బిర్గంజ్కు మాత్రమే రైలు మార్గం ఉంది. కొత్తగా భారత్ నుంచి బిరాట్ నగర్కు సుదీర్ఘ రైలు మార్గం ప్రతిపాదనలున్నాయి. నేపాల్ కార్గోకు ముఖ్యంగా విశాఖపట్నం పోర్టుతో పాటు కోల్కతా, హల్దియా పోర్టులు గేట్వేలుగా ఉన్నాయి. భారత్తో నాలుగు రోడ్ బేస్డ్ డ్రైపోర్టు మార్గాల్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నాం. భారత్తో వాణిజ్య ఒప్పందాలు మరింత మెరుగు పరచుకుంటున్నాం. – మహేష్ ఆచార్య, నేపాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ అతి తక్కువ ఖర్చుతో రవాణా వ్యవస్థ మయన్మార్ పోర్టు ట్రస్టు క్రమంగా అభివృద్ధి చెందుతోంది. కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి చేస్తున్నాం. లక్ష నుంచి లక్షన్నర యూనిట్ల సామగ్రిని హ్యాండిల్ చేసేలా రూపుదిద్దుకుంటోంది. దీని ద్వారా మయన్మార్ వాణిజ్యం మరింత అభివృద్ధి చెందనుంది. లోకాస్ట్ రవాణా వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఎగుమతి దిగుమతుల్లో ముందుకెళ్లేందుకు ప్రాంతీయ దేశాలతో పరస్పర సహకార ఒప్పందాలు చేసేందుకు సిద్ధమవుతున్నాం. భారత్తో కేవలం పోర్టు రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సత్సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. – యూనీ యాంగ్, మయన్మార్ పోర్ట్ ట్రస్ట్ ఎండీ తీరం లేని రాష్ట్రాలకూ పోర్టుల కేటాయింపు విశాఖలో ఉన్న మేరీటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సెంటర్ని రూ. వెయ్యి కోట్లుతో దశలవారీగా అభివృద్ధి చేస్తున్నాం. ఇది బంగాళాఖాతం తీరదేశాలకు కీలకం కానుంది. విశాఖ వంటి అందాల నగరంలో అద్భుతమైన సదస్సు నిర్వహించడం ఆశావహం. బిమ్స్టెక్ సదస్సు విజయవంతం అవ్వడం చూస్తుంటే.. ఈ రంగం భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారనుందనడంలో అతిశయోక్తి లేదు. సముద్రమార్గం, వాణిజ్య రంగాల్లో కీలక అభివృద్ధి కోసం ఆయా దేశాలు ఏకమవ్వాలి. ఇప్పటికే ఇండియా బంగ్లాదేశ్ కార్గో రవాణాపై పరస్పర సహకారాన్ని అందించుకుంటున్నాయి. షిప్పింగ్ సెక్టార్ ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. పోర్టులున్నాయి, పోర్టు టెక్నీషియన్లున్నారు. కానీ.. అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నాం. నౌకల డిజైన్, మోడల్ టెస్టింగ్ సౌకర్యాలు లేవు. దాన్ని అధిగవిుంచేందుకు మోడల్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం. సాగరమాల ప్రాజెక్టుల ద్వారా పోర్టుల అనుసంధానం చేస్తున్నాం. ప్రస్తుతం 76 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. పోర్టు, రోడ్డు, రైల్ కనెక్టివిటీతో పాటు కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్పైనా దృష్టి సారించాం. ప్రస్తుతం దేశంలో ఉన్న 200 పోర్టుల్లో 74 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మిగిలన పోర్టుల్నీ అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తోంది. తీర ప్రాంతం లేని రాష్ట్రాల ఎగుమతి దిగుమతులకు ఈ పోర్టులు అప్పగించి వాటిలోనూ కార్యకలాపాలు ముమ్మరం చేసేందుకు కృషి చేస్తాం. – కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ -
అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం : అవంతి
సాక్షి, విశాఖపట్టణం : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో భీమిలి, విశాఖ, అరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది పర్యాటకం ద్వారా రూ. 50 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. విశాఖతో పాటు పలు పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. మరోవైపు టీడీపీ హయాంలో అటవీ శాఖ భూములు కూడా కబ్జా చేశారని విమర్శించారు. భూకుంభకోణాలపై ఎవ్వరినీ ఉపేక్షించలేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు పంపిణీ చేయడానికి రూ. 30 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశామని తెలిపారు. గురువారం గురజాడ కళాక్షేత్రంలో 50 వేల మందికి రూ. పదివేల చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు. -
‘ప్రతి జిల్లాలో యువత నైపుణ్యంపై శిక్షణా కార్యక్రమాలు’
సాక్షి, అమరావతి: ప్రతి జిల్లాలో యువత నైపుణ్యంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. యువతలో దేశభక్తి, సంస్కృతిని పెంపొందించే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మంగళవారం యువజన సర్వీసుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రంగాల్లో యువతకు పెద్ద పీట వేస్తున్నారని, దీనికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దిలో యువత భాగం కావాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు . యువత నైపుణ్యం పెంపుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసంపై యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వరల్డ్ హార్ట్ డే, నేషనల్ సైన్స్, గాంధీ జయంతి వంటి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. స్త్రీల పట్ల గౌరవం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. మత్తు, మద్యం వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై కూడా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. సంస్కృతి, సాంప్రదాయలను గుర్తించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు. -
పవన్ ‘అఙ్ఞాతవాసి’ కాదు అఙ్ఞానవాసి...
సాక్షి, తాడేపల్లి : అన్నను అడ్డుపెట్టుకుని ఎదిగినవాడిని కాదని.. తాను స్వయంకృషితో ఎదిగిన వ్యక్తిని అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సినిమా వాళ్లంటే తమకు గౌరవం ఉందని.. అయితే పవన్ భాష మాత్రం మరీ దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. లాంగ్ మార్చ్ పేరిట విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన సభలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాపు యువతను పక్కదోవ పట్టించేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాటి మీటింగ్ తర్వాత పవన్ అమాయకత్వం, అపరిపక్వత పూర్తిగా బయటపడ్డాయని అన్నారు. పవన్ అఙ్ఞాతవాసి కాదు అఙ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదివినంత మాత్రాన రాజకీయ నాయకులు కాలేరని పవన్కు చురకలు అంటించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... ‘చంద్రబాబు ట్రాప్లో పడి చాలా ఇప్పటికే చాలా మంది నష్టపోయారు... ఆయనకు ఇప్పుడు మీరు దొరికారు. కమ్యూనిస్టులు, బీజేపీలు ఎలా ఆవిర్భవించాయో.... వాటి సిద్ధాంతాలేమిటో తెలుసా....? టీడీపీ లాంటి అవకాశవాద పార్టీలతో పని చేస్తున్న పవన్.... సిద్ధాంత పరంగా వైరుధ్యం కలిగిన పార్టీలను ఎలా కలుపుకొందామనుకున్నారు....? టీడీపీతో మీరు కలిసిపోతే మాకు అభ్యంతరం లేదు. కానీ చీకటి ఒప్పందం దేనికి? పవన్ ఇంకా సినిమా భ్రమలోనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరైనా ఇసుక రవాణాలో వుంటే నిరూపించండి. గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఇసుక తీయడం కష్టతరంగా మారుతుందన్న విషయం తెలుసా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా....? మీరు మాకు రెండు వారాలు టైం ఇచ్చేందేంటి...? వరద తగ్గితే ఇసుక పంపిణీని పునరుద్ధరిస్తాం’ అని పవన్ తీరును ఎండగట్టారు. లాంగ్ మార్చ్ పేరు చెప్పి 2 కిలోమీటర్లు కూడా నడవలేని పవన్.... రాజకీయాల్లో ఎలా రాణిస్తారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక సీఎం జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ... ‘ దేశంలో కేసులు లేని నాయకులు ఎవరు? కక్షపూరిత రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం కొత్తేమీ కాదు. విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత పవన్కు లేదు. బొత్స, కన్నబాబుల గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం అన్యాయం. కాపుల్లో మీరు తప్ప ఇంక ఎవరూ ఎదగకూడదా...?ఎందుకు మీకా అక్కసు...? భవన నిర్మాణ కార్మికుల కోసం తపన పడుతున్న పవన్.... ఒక సినిమా ఉచితంగా చేసి ఆ డబ్బు వాళ్ళకివ్వొచ్చు కదా...? పవన్ కల్యాణ్ ఇప్పటికే పార్టీ పెట్టి పరువు తీసుకున్నాడు. ఇంకా దిగజారిపోవద్దు. ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదు’ అని హెచ్చరించారు. -
అన్నను అడ్డుపెట్టుకుని ఎదగలేదు: అవంతి
-
ఐదు నెలలు కాకుండానే విపక్షాలు విషం కక్కుతున్నాయి
-
ఐదు నెలల్లో 80 శాతం మేనిఫెస్టో అమలు
-
బాబు పాలన పుత్రుడి కోసం.. జగన్ పాలన జనం కోసం..
సాక్షి, విశాఖపట్నం(భీమిలి): గత ప్రభుత్వంలో చంద్రబాబు పుత్రరత్న పాలన అందిస్తే.. మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నవరత్నాల పాలన అందిస్తున్నారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చమత్కరించారు. చిట్టివలస బంతాట మైదానంలో మంగళవారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి కింద రూ.73.46 కోట్ల రుణాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పదేళ్ల పోరాటం తరువాత వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టిందన్న విషయం గుర్తు చేశారు. అధికారం చేపట్టిన ఐదు మాసాల్లోనే మేనిఫెస్టోలో పేర్కొన్న 80 శాతం అంశాలను అమలు చేసినట్టు చెప్పారు. తొలి బడ్జెట్ సమావేశంలోనే చరిత్రను మలుపుతిప్పే 20 మంచి బిల్లులను ప్రవేశపెట్టి చట్టాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు మంచి చేసే విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ముందంజలో ఉందన్నారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులలో 50 శాతం వారికి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. గ్రామ, నగర సచివాలయాల్లో 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. రైతుభరోసా పథకం కింద చెప్పిన దానికంటే ఏడాదికి రూ.13,500 వంతున చేసి అయిదేళ్లలో రూ.67,500 ఇవ్వడానికి సిద్ధమయ్యామన్నారు. అనేక ప్రజోపయోగమైన పథకాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదించాలన్నారు. కృష్ణా, గోదావరి జలాల నుంచి రాష్ట్ర వాటాను పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్రంలో నీటి అవసరాలకు వినియోగించుకుంటూ పథకాలు రూపొందించుకునేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్య కార్పొరేట్ చేతుల్లోనే ఉండిపోయిందని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పెంచుతామని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోనున్నారన్నారు. దశల వారీగా మద్యం నిషేధంలో భాగంగా గత ప్రభుత్వ హయంలో ఉన్న 43 వేల బెల్టుషాపులను ఇప్పటికే రద్దు చేయగా, 4200 మద్యం దుకాణాలను 3500కు తగ్గించామన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఐదేళ్లలో 25 లక్షల మందికి ఇళ్లు, ఇంటి స్థలాలు ప్రభుత్వం ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుందన్నారు. హాజరైన మూడు మండలాల డ్వాక్రా మహిళలు మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ పార్లమెంట్లో 24 మంది ప్రతినిధులతో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ చతురత కారణంగానే జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను పార్టీ గెలుచుకుందన్నారు. పదేళ్లు కష్టపడి ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.జగన్ గురించి సినీనటుడు పవన్కు ఏమి తెలుసని ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో బంధువర్గానికి, అనుచరులకు భూములు దోచి పెట్టడంతోనే అయిదేళ్లు గడిపేశారన్నారు. వరదల కారణంగా ఇసుక సరఫరా చేయలేకపోతున్నామన్న కారణం తెలుసుకోకుండా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ లాంగ్మార్చ్ నిర్వహించడంలో అర్థం లేదన్నారు. పవన్ జనసేనను టీడీపీలో కలిపేయాలన్నారు. నవంబరు 21 నుంచి మత్స్యకారులకు వేట విరామం రూ.4 వేల నుంచి రూ.10 వేలు, డీజిల్ సబ్సిడీ రూ.6 నుంచి 9కి పెంచిన దానిని అమలు చేస్తామన్నారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించేలా సీఎం వైఎస్ జగన్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. భూమిలేని పేదలకు భూములు ఇవ్వడానికి ల్యాండ్ బ్యాంకు భీమిలిలోనే ఉందన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ లోకేష్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరం కావడంతో ఉక్రోషంతో చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంపీ విజయసాయిరెడ్డి కంకణం కట్టుకుని విశాఖను దత్తత తీసుకున్నారన్నారు. అవకాశం ఉంటే విశాఖను రాజధాని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్, తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శులు దాట్ల పెదబాబు, సుంకర గిరిబాబు, విశాఖ పార్లమెంట్ అనుబంధ సంఘాల నాయకులు జాన్ వెస్లీ, కొయ్య ప్రసాదరెడ్డి, పక్కి దివాకర్, రవిరెడ్డి, బోని శివరామకృష్ణ, వెంపాడ శ్రీనివాసరెడ్డి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండల పార్టీ అధ్యక్షులు చెల్లూరి పైడప్పడు, బంక సత్యం, మజ్జి వెంకటరావు, కంటుబోతు రాంబాబు, జీవీఎంసీ 4, 5, 6 వార్డుల అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, లొడగల రామ్మోహనరావు, మాజీ ఎంపీపీ కోరాడ వెంకటరావు, డీఎల్డీఏ అధ్యక్షుడు గాడు వెంకటప్పడు, జిల్లా అధికార ప్రతినిధులు ఎస్.కరుణాకరరెడ్డి, యలమంచిలి సూర్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ అక్కరమాని రామునాయుడు, డైరెక్టర్ అక్కరమాని మంగరాజు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగుపల్లి ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు జీరు వెంకటరెడ్డి, అల్లిపల్లి నరసింగరావు, అనుబంధ సంఘాల అధ్యక్షులు జీరు సుజాత, బింగి కిరణ్, వాసుపల్లి కొండబాబు, పందిరి విజయ్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాలన ఏపీ ముఖచిత్రాన్ని మార్చబోతోంది
-
విశాఖ మూడు ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు
-
మహిళల అండతోనే అధికారంలోకి: తానేటి వనిత
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని కేజీహెచ్లో 42 లక్షల వ్యయంతో నిర్మించిన సఖి వన్ స్టాప్ సెంటర్ను మంత్రులు తానేటి వనిత, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అభాగ్య, బాధిత మహిళలకు ఆసరాగా, అండగా ఉండేందుకు సఖి వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సెంటర్ల ద్వారా బాధిత మహిళలకు అయిదు రకాల సేవలను అందిస్తామని పేర్కొన్నారు. వేధింపులకు గురయ్యే మహిళలు 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నాలుగు నెలల పాలనలోనే మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని అన్నారు. మహిళలకి అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్దేనని ప్రశంసించారు. కేబినెట్లో కీలకమైన శాఖలు మహిళలకు అప్పగించిన రాష్ట్రం ఏపీనేని తెలిపారు. మహిళల్లో ఉన్న 53 శాతం ఎనీమియాను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల అండతోనే తాము అధికారంలోకి వచ్చామని ప్రస్తావించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమది మహిళా సంక్షేమ ప్రభుత్వమని, వైఎస్సార్సీపీ 151 స్థానాలు గెలుచుకోవడంతో మహిళా ఓటర్ల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. లైంగిక, యాసిడ్ బాధిత మహిళలకు అండగా ఈ సఖి వన్ స్టాప్ సెంటర్లు ఉపయోగపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, వీఎంఆర్టీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం’
సాక్షి, విజయవాడ: తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఓడినా బొప్పన భవకుమార్ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తీరుస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్లో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మొదట వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి.. అనంతరం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో నిధుల కేటాయింపులే లేవని మంత్రి ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉందని.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని ప్రశంసించారు. విజయవాడలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తామని, టీడీపీలా తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన సీఎం జగన్మోహన్రెడ్డికి నియోజకవర్గ ఇంచార్జి బొప్పన భవకుమార్ ధన్యవాదాలు తెలిపారు. -
టెక్నాలజీని వాడుకోండి: అవంతి
సాక్షి, విశాఖపట్నం : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పోలీసు యూనిఫాంకు ఒక గౌరవం ఉందని, యూనిఫాంకు ఇచ్చే గౌరవాన్ని చూసే చాలామంది యువత పోలీసు ఉద్యోగాల్లో చేరుతున్నారని తెలిపారు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తూ.. అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగుల సంక్షేమాన్ని ఆలోచించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వీక్లీ ఆఫ్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని మంత్రి అవంతి శ్రీనివాస్ గుర్తు చేశారు. రాష్టంలో తీవ్రవాదం, నక్సలిజం రెండింటినీ పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారని, గంజాయి స్మగ్లింగ్ను రూరల్ పోలీసులు నియంత్రణలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అదే విధంగా విశాఖకు సైబర్ నేరాలు సవాళ్లుగా మారాయని.. అనేకమంది చిన్నారులు ఆన్లైన్ గేమ్ల ద్వారా డబ్బులు నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వీటిని పోలీసులు నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, దీనికి టెక్నాలజీని వాడుకోవాలని మంత్రి సూచించారు. -
మీరు చేస్తే నీతి.. వేరే వాళ్లు చేస్తే అవినీతా..?
-
‘ప్రతి జిల్లాలో సీఎం కప్ నిర్వహిస్తాం’
సాక్షి, విశాఖ : రాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ను క్రీడల, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లాలోని స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. జిల్లాలోని అగనంపూడిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఒత్తిడిని అధిగమించడానికి క్రీడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి జిల్లాలో అన్ని క్రీడల్లో సీఎం కప్ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించామని అన్నారు, అన్ని సదుపాయాలతో ప్రతి జిల్లాలో స్పర్ట్స్కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు జరగడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జపాన్ దేశపు ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
టూరిజం ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష
అమరావతి : ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, యూత్ ఎఫైర్స్ శాఖలపై శుక్రవారం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాల్లో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్స్టార్ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజంతో పాటు చారిత్రక ప్రాంతాల అభివృద్ధి, అన్ని జిల్లాల్లో క్రీడా సదుపాయాల ఏర్పాటుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారని, అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణమని అన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అభివృద్ధిచేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసిన తనకు వివరాలు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆతిథ్యరంగంలో, పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేలా ఇక్కడ ఉత్తమ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై సహజంగానే అంతర్జాతీయస్థాయిలో మంచి ప్రచారం లభిస్తుందన్నారు. అభివృద్ధి చేయాల్సిన పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేయడంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. ఇదే సమయంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించారు. పూర్తిస్థాయి వివరాలతో తనకు మళ్లీ సమాచారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అక్కడ నదికి అడ్డంగా గ్లాస్తో ఒక వంతెన కూడా నిర్మించే ఆలోచన చేస్తున్నామని, పలు పర్యాటక ప్రాంతాల్లో రోప్వేలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు వివరించారు. తనకు సమర్పించే నివేదికలో ఈ ప్రతిపాదనలు అన్నింటినీ చేర్చాలని సీఎం సూచించారు. పోలవరం, పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యాంలతో పాటు, విశాఖ జిల్లాలో అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విశాఖలో మరో మ్యూజియం ఏర్పాటుకు రక్షణ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సమావేశంలో వెల్లడించారు. ఏపీటీడీసీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో హోటళ్లను, రిసార్టులను నిర్వహిస్తోందని, అయితే చాలా రోజులగా నిర్వహణ కోసం కనీస నిధులు కూడా ఇవ్వకపోవడంతో సమస్యలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వీటి మరమ్మత్తులు చేపట్టి, నిర్వహణ మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. హస్తకళలు అంతరించిపోకుండా చర్యలు తీసుకోండి ష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న హస్తకళలు అంతరించిపోకుండా వాటిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేసుల తయారీ, కళంకారీ తదితర అరుదైన హస్తకళలు చేస్తున్న కుటుంబాలవారికి సహాయం చేసేలా మార్గదర్శకాలు తయారుచేయాలన్నారు. లేకపోతే ఆ కళలు బతకవని, వాటిని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అలాగే రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, వాటిని సరిగ్గా నిర్వహించడానికి ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరిలో మరలా బోట్లను తిప్పడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. నదీతీరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుపై ఈ సందర్భంగా సీఎం ఆరాతీశారు. నిర్దిష్టమైన నిర్వహణా పద్ధతులు, కంట్రోల్ రూమ్స్ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు సరైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఏర్పాటైన కమిటీ నివేదిక రాగానే సిఫార్సులపై చర్చిద్దామని సీఎం చెప్పారు. శిల్పారామాల్లో ప్రస్తుత పరిస్థితిపైనా సీఎం సమీక్ష చేశారు. ప్రస్తుతం ఉన్న శిల్పారామాల అభివృద్ధి, వాటిలో గ్రీనరీని పెంచడంపై సీఎం అధికారులకు సూచించారు. శిల్పారామాల నిర్వహణకు ఇబ్బందిలేకుండా నూతన విధానాన్ని తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కల్చరల్ అకాడమీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. కనీసం ఐదెకరాల స్థలంలో ఈ అకాడమీలను నిర్మించాలని, రెండేళ్లలోగా వీటిని పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్ అకాడమీలు వేదిక కావాలన్నారు. మన కళలను, సంస్కృతిని నిలుపుకోవడానికి, వాటి ప్రాముఖ్యత పెంచడానికి ఈ అకాడమీలు ఉపయోగపతాయని సీఎం అన్నారు. సంగీత, నృత్యకళాశాలలో బోధిస్తున్న పార్ట్టైం, ఫుల్టైం వారికి జీతాలు పెంచాలని కూడా సీఎం ఆదేశించారు. జిల్లాకో క్రీడా సముదాయం రాష్ట్రంలో క్రీడలు, సదుపాయాలపైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్షించారు. ప్రతి స్కూళ్లో క్రీడల కోసం మైదానం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లకు ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి..? ఎన్నింటికి సమాకూర్చాలన్న దానిపై నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. అలాగే ఉన్న ఆటస్థలాల అభివృద్దిపై కూడా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అలాగే ఫిజికల్ ట్రైనర్లు ఉన్నారా? లేదా? అనేదానిపై కూడా పరిశీలనచేసి, నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణం విశాఖపట్నం, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణంపై సమావేశంలో చర్చ జరిగింది. అంతర్జాతీయ సదుపాయాలతో స్టేడియంల నిర్మాణానికి సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతిజిల్లాలో కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలని వీటికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి జిల్లాలో కూడా క్రీడా సముదాయాల కారణంగా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ఏవిధంగా ప్రోత్సహించాలి, వారికి ఎలా అండగా నిలబడాలన్నదానిపై కూడా ప్రతిపానదలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. గడచిన ఐదేళ్లలో జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన గతంలో ఎప్పుడూ చేయలేదని, ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాలశాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్తో పాటు ఆ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జూపార్క్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం -మంత్రి
విశాఖపట్నం : విశాఖ ఇందిరా గాంధీ జూపార్క్ లో 65వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పాల్గొన్నారు. రూ. 70 లక్షల నిధులతో అభివృద్ది చేయనున్న ఏనుగుల సంరక్షణ కేంద్రానికి వీరు శంఖుస్థాపన చేశారు. మంగుళూరు నుంచి తీసుకొచ్చిన రెండు కొత్త పులులను జూలో సందర్శకులు చూడడానికి అవకాశం కల్పించారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ జూ పార్క్ సిటీకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి విశాఖకు వచ్చే పర్యాటకులు జూ పార్క్ని సందర్శించేలా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు, రాబోయే రోజుల్లో సీఎంతో మాట్లాడి జూపార్క్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో భాగంగా విశాఖలో కోటి మొక్కలు నాటే ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే విశాఖ జూ కి ఓ ప్రత్యేకత ఉంది. 625 ఎకరాలలో సహజ సిద్దంగా ఏర్పడిన జూ ఇది. హుదూద్ తుఫాన్ తర్వాత విశాఖ జూని తరలించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ మన ప్రభుత్వంలో విశాఖ జూని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎఫ్ రాహుల్పాండే, ఇంచార్జి కలెక్టర్ శివశంకర్, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, కేకే రాజు, జూ క్యూరేటర్ యశోద బాయి తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్గా మారిన మంత్రి అవంతి
సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శుక్రవారం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆటో హ్యాండిల్ పట్టి.. కాసేపు డ్రైవర్గా మారిపోయారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఆటో డ్రైవర్లతో మమేమకం అయ్యారు. ఆటో డ్రైవర్ షర్టు వేసుకుని ఆటో నడిపారు. కాగా విశాఖ బీచ్రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి గురజాడ కళాక్షేత్రం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. లబ్ధిదారులకు పదివేల రూపాయల చొప్పున చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ...‘తొలిసారిగా ఆటో నడిపే అవకాశం మీ ద్వారా కలిగింది. ఏ ఉద్యోగం లేని వ్యక్తులకు తొలి ఉద్యోగం ఇచ్చేది ఆటో మాత్రమే. రవాణా సదుపాయాలు లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేది ఆటో డ్రైవర్లే. ఆటో డ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసి వారి కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. మీలో నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటో డ్రైవర్లకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తాం. ఇది పేదల ప్రభుత్వం... పేదల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం. ప్రభుత్వంపై చేసే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. సీఎం వైఎస్ జగన్ ప్రజలను ప్రేమించే వ్యక్తి...వేధించే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది. విశాఖ జిల్లాలోనే ఆటో డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఏటా రూ.25 కోట్లు అందించాం’ అని అన్నారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ వాహన మిత్ర పథకం తీసుకువచ్చారు. మీ అందరి కష్టాలను నేరుగా పాదయాత్రలో చూసిన వ్యక్తి సీఎం జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనది. ప్రజలందరి సంక్షేమమే మా ప్రభుత్వ థ్యేయం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పూర్థి స్థాయిలో అమలు చేయబోతున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, పిట్ల ఉమా శంకర్ గణేష్, భాగ్యలక్ష్మి, అదీప్ రాజ్, జివిఎంసి కమిషనర్ సృజన , విఎం ఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, అక్కరమాని విజయ నిర్మల, కొయ్యా ప్రసాద్ రెడ్డి , డిటిసి రాజా రత్నం తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రజా సంకల్పయాత్రలో 2000 కిలోమీటర్ల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 2018 మే 14న ఆటో, కారు, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన చోటే ..ఇవాళ వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలూరులో ప్రారంభించారు. -
భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ
భీమునిపట్నం: భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి ఆ పార్టీ వెన్నంటి ఉన్న నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అవినీతి లేని స్వచ్ఛ పాలన అందిస్తున్నందునే అందరూ పార్టీలోకి వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా చెబుతున్న ఈ నియోజకవర్గం ఇకపై వైఎస్సార్సీపీకి కంచుకోట అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీలో చేరిన వారిలో భీమిలి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటప్పడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బంటుపల్లి మణిశంకర్నాయుడుతోపాటు ఆనందపురం మండల టీడీపీ అధ్యక్షుడు బీఆర్బీ నాయుడు, ఆనందపురం టీడీపీ మాజీ అధ్యక్షుడు కాకర రమణ, భీమిలి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గుడాల ఎల్లయ్య, భీమిలి మండల తెలుగు యువత అధ్యక్షుడు తాతినాయుడుతోపాటు ఆనందపురం, భీమిలి మండలాలకు చెందిన పలువురు మాజీ సర్పంచ్లు, ముఖ్య నాయకులు ఉన్నారు. -
గ్రామస్వరాజ్యం దిశగా తొలి అడుగు - మంత్రి బొత్స
విశాఖపట్నం : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం చేపట్టినట్టు మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. గాంధీజయంతి రోజున గ్రామసచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యానికి తొలి అడుగువేశామన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలతో ముందుకు సాగుతూ.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని పల్లెల్లోకి తీసుకువెళ్లే బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు. మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహాత్ముని ఆశయాలు అమలు కోసం 1, 27,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎక్కడా ఇంత పారదర్శకమైన ఉద్యోగ నియామకాలు జరిగిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని పల్లెల్లోకి తీసుకువెళ్లే బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉంది. గత ప్రభ్యత్వంలో కొంతమంది మంత్రులు, ఎమ్యెల్యేలు ఉద్యోగాలు కల్పిస్తామని రూ.10 లక్షలు వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేశారు. అలాంటి మీరు నేడు సచివాలయాలకు ఎంపికయిన ఉద్యోగులను, వాలంటీర్లను అవహేళన చేస్తూ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమో ఆత్మవిమర్శ చేసుకోవాలని చంద్రబాబుకు చురకలంటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమరనాథ్, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలరావు, సీఎండీఏ కమిషనర్ విజయ్కుమార్, నార్త్ కన్వీనర్ కేకే రాజు పాల్గొన్నారు. -
దేశంలోనే భారీ రిక్రూట్మెంట్: అవంతి
సాక్షి, విశాఖపట్నం: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం చేపట్టిందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి అవంతి శ్రీనివాస్ నియామక పత్రాలను అందజేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, విఎంఆర్డిఏ చైర్మన్ ద్రోణందాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగాలు సాధించిన వాళ్లు గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పంతో పని చేయాలని సూచించారు. దేశంలోనే అత్యంత భారీ రిక్రూట్మెంట్ చేపట్టిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. -
ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : అవంతి
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, ఉద్యోగులకిచ్చిన హామీలను సైతం నెరవేర్చారని తెలిపారు. విశాఖలో జరిగిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశానికి మంత్రి అవంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కార్రావు, విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రరావు, ఎస్వీ రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం ఉద్యోగులను పీడించేది కాదన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే సీఎం వైఎస్ జగన్ ధ్యేయమని చెప్పారు. అధికారంలోని వచ్చిన మూడు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చారని గుర్తుచేశారు. వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనని అన్నారు. -
ఇనాం భూ సమస్య పరిష్కరిస్తా:మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: యారాడ సముద్ర తీరంలో రూ.2 కోట్ల వ్యయంతో ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ రెస్టారెంట్ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం యారాడ గ్రామంలో జీవీఎంసీ నిర్మించిన రెండు కమ్యూనిటీ భవనాలను మంత్రి అవంతి,ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ ఇనాం భూ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.యారాడని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. -
చంద్రబాబు స్విమ్మరా? డ్రైవరా..?
సాక్షి, ఢిల్లీ: ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు అందుకోవడం సంతోషకరంగా ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 28 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని తెలిపారు. ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని.. పర్యాటకం అభివృద్ధి, ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. గుజరాత్ తర్వాత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతమన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి వెల్లడించారు. మారుమూల ప్రాంతాలకు సైతం పర్యాటక రంగాన్ని తీసుకెళ్లి, స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో టూరిజం సదస్సుని నిర్వహిస్తామని చెప్పారు. మౌలిక వసతులు, రవాణా, పర్యాటకుల భద్రత, స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించామన్నారు. విదేశీ పర్యాటకులు సంఖ్యను పెంచేందుకు వైజాగ్ విమానాశ్రయంలో వీసా ఆన్ అరైవల్కి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పర్యాటకుల భద్రత ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సీఎం జగన్ ఐదుగురి సభ్యులతో కమిటీ వేశారన్నారు. కమిటీ ఇచ్చే సిఫార్సులను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఒడ్డున కూర్చొని ఎన్నైనా మాట్లాడొచ్చు.. పాపికొండల వద్ద గోదావరిలో మునిగిపోయిన బోట్ను వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటలు కష్టపడుతున్నారని మంత్రి అవంతి తెలిపారు. ‘చంద్రబాబు ఉంటే గంటలో తీస్తారు.. రెండు గంటల్లో తీసేవారని అంటున్నారని.. చంద్రబాబు ఏమన్నా స్విమ్మరా? డ్రైవరా రెండు గంటల్లో వెలికి తీయడానికి’ అని ఎద్దేవా చేశారు. ఒడ్డున కూర్చొని ఎన్నైనా మాట్లాడవచ్చని.. బోట్ని వెలికితీసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. ఎంత ఖర్చయినా బోటును వెలికితీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. బోటు మునక ఘటన దురదృష్టకరమని.. దీనిపై రాజకీయాలు చేయడం దారుణన్నారు. బోటు టీడీపీ మద్దతుదారుడిదని, బోటుకు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్కు అవార్డుల పంట
సాక్షి, ఢిల్లీ: జాతీయ స్థాయిలో పర్యాటక రంగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పండింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధికి గానూ, ఈ ఏడాదికి ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవార్డు దక్కించుకుంది. ఇక బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్గా విశాఖపట్నం అవార్డును కైవసం చేసుకుంది. అలాగే ఉత్తమ కాఫీటేబుల్ బుక్ కేటగిరీలోనూ ఏపీ ప్రథమ స్థానాన్ని అందుకుంది. తెలంగాణ పర్యాటక శాఖకు ఈ ఏడాది రెండు అవార్డులు దక్కాయి. సాంకేతికతను అత్యుత్తమంగా, వినూత్నంగా వినియోగించుకొనే రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం పర్యాటక శాఖ రూపొందించిన 'ఐ ఎక్స్ప్లోర్ తెలంగాణ' అనే మొబైల్ యాప్కు ఈ అవార్డు దక్కింది. బెస్ట్ మెడికల్ టూరిజం విభాగంలో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ అవార్డులను అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2017-18 సంవత్సరానికి సంబంధించి జాతీయ టూరిజం అవార్డులను ప్రకటించారు. అడ్వెంచర్ టూరిజం కేటగిరీలో గోవా, మధ్యప్రదేశ్ అవార్డులను పొందాయి. సినిమా ప్రమోషన్లకు ఉత్తమ స్నేహ పూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఎంపికైంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గతంలో పర్యాటక రంగానికి ఆదరణ తక్కువని, ప్రస్తుతం భారత్లో పర్యాటకులకు రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతున్నామన్నారు. -
మద్య నిషేధంతో సిండికేట్లకు చెక్: మంత్రి
సాక్షి, విశాఖపట్నం: దశలవారీగా మద్య నిషేధం ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో మద్యపాన నిషేధం విఫలమయిందని.. ప్రభుత్వమే స్వయంగా దుకాణాలు నిర్వహించడానికి ముందుకొచ్చిందని.. దీంతో సిండికేట్లకు చెక్ పెట్టగలిగామన్నారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. సూపర్ వైజర్లకు 17,500 జీతం ఇస్తున్నామని పేర్కొన్నారు. బీటెక్ చదివిన వారికి కూడా ఇంత జీతం రావడం లేదని..ఉద్యోగం పొందిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని తెలిపారు. -
బోటు ప్రమాదాలపై మంత్రి అవంతి సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదాల నివారణపై ఉత్తరాంధ్ర అధికారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో నేవీ, పర్యాటక శాఖ, పోలీసు, ఫిషరీస్, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. మూడు జిల్లాల్లో అధికారిక.. అనధికారికంగా కొనసాగుతున్న బోట్ల వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు అనుమతులు పొందిన బోట్ల సామర్ధ్యాన్ని పరీక్షించాలన్నారు. నదులు, జలపాతాలు వద్ద ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. బోటు వినియోగంపై త్వరలో కొత్త పాలసీ తీసుకువస్తున్నామని మంత్రి అవంతి తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రమాదకర నదీ, సముద్ర తీరాలను గుర్తించి.. జలపాతాల వద్ద ఈతగాళ్ల నియామిస్తామని చెప్పారు. -
ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం ప్రాంతాన్ని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మీ, వైఎస్సార్సీపీ నేత ఉదయ భాస్కర్ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి స్థాయిలో చేపట్టామని మంత్రి అవంతి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బందాలు గల్లంతైన వారికోసం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని వెల్లడించారు. అనుమతుల్లేని బోట్లపై చర్యలు తీసుకుంటామని అవంతి స్పష్టం చేశారు. హైవేపై పెట్రోలింగ్ జరిగినట్లే గోదావరిలో బోట్ పెట్రోలింగ్ జరగాలని అభిప్రాయపడ్డారు. (చదవండి : కచ్చులూరుకు సీఎం జగన్) (చదవండి : అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే) -
పవన్పై మంత్రి అవంతి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ : జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్పై పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడవద్దని హితవు పలికారు. మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘పవన్ మీరంటే గౌరవం ఉంది. దయచేసి దాన్ని పోగొట్టుకోవద్దు. మీరు టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవి వినిపించారు. మీరు నవరత్నాలకు అనుకూలమో, వ్యతిరేకమో ముందు స్పష్టం చేయాలి. అమరావతి, పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పాం. మీరు దానికి అనుకూలమా, వ్యతిరేకమో చెప్పాలి. అయిదేళ్లలో మద్యపాన నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేస్తాం. గతంలో మీరు మంగళగిరిలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ను ఏమని విమర్శించారో మరిచిపోయారా?. గతంలో ఎన్నడూ లేనివిధంగా దళితులు, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం వైఫల్యమా?. మూడు నెలల్లోనే మేము ఇచ్చిన నాలుగు లక్షల ఉద్యోగాలకు మీరు వ్యతిరేకమా?. కొత్తగా పెట్టబోయే పరిశ్రమలలో 75 శాతం స్థానికులకు ఇవ్వాలని మా నిర్ణయంపై మీ జనసేన అనుకులమా, వ్యతిరేకమా?. టీడీపీ ట్రాప్లో పడొద్దు. మీకు ఓటేసిన గాజువాక ప్రజలని ఎన్నికల తర్వాత వచ్చి ఒక్కసారి అయినా కలిశారా?. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. వందకోట్లకు పైబడిన ప్రతి కాంట్రాక్ట్ జ్యుడిషియరీ పర్యవేక్షణ ఉండాలన్న మా ప్రతిపాదనకు మీరు అనుకులమా, వ్యతిరేకమా?. మూస ధోరణి రాజకీయ నాయకులులాగా మీరు మాట్లాడితే మీకే విలువ తగ్గుతుంది.’ అని హితవు పలికారు. పవన్కి పిచ్చి పీక్స్కు చేరినట్టుంది.. పవన్ కల్యాణ్పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. పవన్ పిచ్చి పీక్ స్టేజ్కు చేరిందంటూ మండిపడ్డారు. వైసీపీ వంద రోజుల పాలన చూస్తుంటే పారదర్శకత, దార్శనికత లోపించినట్లు కనిపిస్తోందని పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శనివారం మంత్రి వెలంపల్లి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ చంద్రబాబు మాటలు పవన్ కల్యాన్ నోట్లో నుంచి వస్తున్నాయి. జననేతగా ఎదుగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడం ఆకాశంపై ఉమ్మేయటమే అవుతుంది. టీడీపీతో లోపాయికారీ ఒప్పందం గుర్తించిన జనం పవన్ని రెండుచోట్ల ఓడించారు. ఎన్నికల్లో జనం తిరస్కరించినా బుద్ధి రాలేదు. వందరోజుల్లో ఎనభై శాతం పథకాలు అమలు చేయడం తప్పా?. వెనుకబడిన వర్గాలని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు యాభైశాతం రిజర్వేషన్ కల్పించడం తప్పా?. ఉగాదికి ఇరవై అయిదు లక్షల మంది పేదలకు గూడు కల్పించాలనుకోవడం సీఎం జగన్ చేసిన తప్పా?. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’ అంటూ సూచించారు. చదవండి: ‘రియల్ హీరోను చూసి..సినీ హీరో ఓర్వలేకపోతున్నారు’