BC Corporation
-
పార్లమెంట్లో ఓబీసీ బిల్లు ఆమోదించాలి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వెంటనే ఆమోదించాలని బీసీ కులాలకు చెందిన ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్తో పాటు శాసనసభల్లో వెనుకబడిన తరగతులకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. బేగంపేట హరితప్లాజాలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం బీసీకులాలకు చెందిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ కమిషన్ సభ్యులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చట్టసభల్లో ఓబీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ 2024లో సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే బీజేపీ బిల్లు ఆమోదించిందని, ఈ బిల్లులో బీసీ మహిళల సబ్కోటా తేల్చలేదని ఆరోపించారు. 50శాతం ఉన్న బీసీలకు మహిళల కోటాలో 50శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ అగ్రకుల ఆధిపత్య అహంకారం ప్రదర్శిస్తున్నారని, ఆయన్ను బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా ప్రజలు పరిగణించడం లేదన్నారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంతోపాటు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ బీసీ ప్రధానితో బీసీల తలరాత మారుతుందని భావించామని, కానీ అలా జరగలేదని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ మాట్లాడుతూ బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, క్రిమిలేయర్ గైడ్లైన్స్ ప్రకారం ఆదాయ పరిమితి పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా చూస్తుందన్నారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఆంజనేయగౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పిట్టల రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీరు నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టు ఉందని వారు మండిపడ్డారు. 33 జిల్లాల్లో బీసీ చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ కుర్మాచలం, రవీందర్ సింగ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, నాయకులు తాడూరి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్ యాదవ్, జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
AP: బీసీ కార్పొరేషన్ల పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల పదవీ కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలకు 56 సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆ కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది. దీంతో వాటిలో 55 బీసీ కార్పొరేషన్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచి్చంది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆయా కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు పదవిలో కొనసాగుతారని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పాల ఏకరి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టి.మురళీధర్ ఆ తర్వాత జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికవడంతో ప్రస్తుతానికి ఆ కార్పొరేషన్ పదవీకాలాన్ని కొనసాగించలేదు. సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించిన నేపథ్యంలో బీసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పశి్చమగోదావరి జిల్లా తణుకులో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న ఆధ్వర్యంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు. ఏలూరు జిల్లా గణపవరంలో రాష్ట్ర సూర్య బలిజ కార్పొరేషన్ చైర్మన్ శెట్టి అనంతలక్ష్మి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబును సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో శ్రీశయన, పొందర–కూరాకుల కార్పొరేషన్ చైర్పర్సన్లు చీపురు రాణి, రాజాపు హైమావతి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు. బీసీలకు పెద్దపీట: ఏపీ బీసీ సంఘం సీఎం వైఎస్ జగన్ బీసీలకు అన్నింటా పెద్దపీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మారేష్ అన్నారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వాటిని, వాటి పదవీ కాలాన్నీ తిరిగి యథాతథంగా కొనసాగిస్తూ శనివారం ప్రభుత్వం జీవో జారీ చేయడంపై యావత్తు బీసీ లోకం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. -
సామాజిక న్యాయానికి పెద్దపీట
దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలతో కొట్టు మిట్టాడుతోంది. అంబేడ్కర్ చెప్పినట్టు ఈ అంతరాలను తొలగించకపోతే ప్రజ లలో అసంతృప్తి రగిలి ఉద్య మాలు వస్తాయి. ప్రస్తుతం నడుస్తున్నది సంధికాలంగా భావించవచ్చు. అన్ని కులాలకు... ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను, అభివృద్ధి ఫలాలను అందించాలన్న ఆలోచన గల దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాతి, కుల, మత భేదాలతో మనుగడ కోల్పోతున్న విలువల భవితను గుర్తించి, సమానత్వానికి దారులు వేసిన ధైర్యశాలి. సమాజంలో ఉన్నత వర్గాలు పొందుతున్న హక్కులన్నింటినీ... అలాగే అభివృద్ధి పథకాలను పేద ప్రజలందరికీ అందేలా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి. సాహు మహరాజ్ వలె ఏపీ సీఎం జగన్ బలహీన వర్గాల ప్రజలకు సంపద, అధికారం, బడ్జెట్ కేటాయిస్తున్న తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అత్యున్నత పదవుల్లో అణగారిన, బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం దేశానికే ఆదర్శం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీల కోటా నుంచి 8 మంది మంత్రులకు మించలేదు. ఇప్పుడు అంతకు రెట్టింపుకు పైగా మంత్రులు, ఉప ముఖ్య మంత్రులూ బహుజనులే జగన్ మంత్రి వర్గంలో ఉండటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. మన కాలపు సాహు మహరాజ్ ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎందుకంటే గతంలో సాహు మహరాజ్ వల్లనే అప్పటి అణగారిన సమాజం రిజర్వేషన్లు పొందిందని చరిత్ర చెబుతున్నది. ఆయన సాయంతోనే డా. అంబేడ్కర్ చదువుకొని భారత దేశానికి రాజ్యాంగ రూప కర్తగా మారారని గతం గుర్తు చేస్తున్నది. అలాగే ఒక బీసీ ఉద్యమకారుడు నిస్వార్థంగా 47 ఏళ్లుగా పేద కులాల విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికై పోరాడుతున్న ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపి జగన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. వైసీపీ మూడు సంవత్సరాల క్రితం రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టింది. దీనికి మద్దతుగా 14 రాజ కీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్లో పడిపోయింది. అయితే తన పరిధి మేరకు జగన్ బహుజనులకు అధి కారంలో వాటా కల్పించడానికి నిజాయితీగా చర్యలు తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలనూ, కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటానూ బీసీలకు ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేటాయించని విధంగా ఆంధ్రప్రదేశ్ బీసీల అభివృద్ధికి 30 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రా లకు రూ.1,460 కోట్లు కేటాయిస్తే జగన్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ. 30 వేల కోట్లు కేటాయించడం మామూలు విషయం కాదు. అలాగే బీసీ కులాలు అభివృద్ధి చెందడానికి బీసీ సబ్ ప్లాన్’ ఏర్పాటు చేయ డాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దళిత, బహుజనులు రాజ్యాధికారంవైపు అడు గులు వేయాలనీ, అందుకోసం వారంతా సమైక్యంగా ఉండాలని అంబేడ్కర్ అన్నారు. కానీ, ఇక్కడ సీఎం జగన్, దళిత... బీసీ వర్గాలు ఎలాంటి పోరాటాలు చేయకుండానే అధికారంలో వాటా కల్పించారు. వారి సాధికారత కోసం పాటుపడుతున్నారు. ఇంతకంటే అంబేడ్కర్కు అర్పించే ఘన నివాళి ఏముంటుంది? - మన్నారం నాగరాజు తెలంగాణ లోక్సత్తా పార్టీ అధ్యక్షులు -
'సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
సాక్షి, గుంటూరు: బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ కార్పొరేషన్లో చేర్చడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణులను బీసీలలో చేరుస్తున్నారంటూ వస్తున్న పుకార్లు ఎవరూ నమ్మెద్దు. బీసీ కార్పొరేషన్ ద్వారానే గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశ్యంతో అయితే కార్పొరేషన్ను ఏర్పాటు చేశారో ఆ విధంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ పనిచేస్తుంది. పథకాల నిర్వహణ మాత్రమే బీసీ కార్పొరేషన్ పర్యవేక్షణ చేస్తుంది. బ్రాహ్మణ కార్పొరేషన్పై రాజకీయ పరంగా విమర్శలు చేయడం తగదు. నవరత్నాల ద్వారా పేద బ్రాహ్మణులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నవరత్నాల్లో లేని పథకాలను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందిస్తాం. అవగాహన లేని వారే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు కొనసాగుతోంది. సీఎం చెప్పిన తర్వాత కచ్చితంగా అమలవుతాయి. జనగణన వలన కొంత జాప్యం అవుతుంది. వచ్చే సాధారణ బడ్జెట్లోపే జిల్లాల ఏర్పాటు ఉండొచ్చు' అని మంత్రి తెలిపారు. -
బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలి: సజ్జల
తాడేపల్లి: బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లతో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్ సంకల్పం అని అన్నారు. నూతన బీసీ నాయకత్వం కోసమే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు కులాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ బలమైన నాయకులుగా ఎదగాలని ఆయన కోరారు. ఇక మంత్రి వేణు మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఈనెల 30న బీసీ కార్పొరేషన్ కార్యాలయాలను ప్రారంభిస్తామని మంత్రి వేణు అన్నారు. మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ బీసీలకు గౌరవం కల్పించారు. బీసీకి చెందిన నన్ను డిప్యూటీ సీఎం చేయడమే నిదర్శనం’’ అని అన్నారు. చదవండి: చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్తోనే.. విషం కక్కడమే ఎల్లోమీడియా ఎజెండా: సజ్జల -
ఏపీ: సరికొత్త రాజకీయ చరిత్ర
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం సీతారామపురం సౌత్ గ్రామంలోకి వెళ్లి పెండ్ర వీరన్న ఉండేది ఎక్కడా? అని ఎవరైనా అడితే శివారున పూరిల్లు (తాటాకు గుడిసె) చూపిస్తారు. ఇందేంటి కార్పొరేషన్ చైర్మన్ తాటాకు ఇంట్లో అని ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. అదే విషయాన్ని ఆయన్ను ప్రశ్నిస్తే.. ఇది వైఎస్ జగనన్న తీసుకొచ్చిన సామాజికవ విప్లవం అని గర్వంగా చెబుతున్నాడు. అత్యంత వెనుకబడిన వర్గాలైన సంచార జాతులకు చెందిన మందుల (బీసీ–ఎ) కులంలో పుట్టిన తాను పూరి పాకలో నివాసం ఉంటూ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమైన జీవనం గడిపేవాడు వీరన్న. పదో తరగతి మాత్రమే చదవినప్పటికీ సామాజిక చైతన్యం అలవర్చుకుని తమ జాతి మెరుగైన జీవనం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. దుర్భరమైన జీవనం గడిపే మందుల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే పోరాటానికి నాయకత్వం వహించేలా 2011 డిసెంబర్ 12న మందుల కులస్తుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తమ లాంటి వారి బతుకుల్లో వెలుగు నింపుతారనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కలిసి తమ జాతి సమస్యలను వివరించానని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ తనను అత్యంత వెనుకబడిన వర్గాల (సంచార జాతులు)కు కార్పొరేషన్ చైర్మన్ చేశారని గర్వంగా చెప్పారు. పూరి గడిసెలో జీవనం సాగిస్తూ అట్టడుగు వర్గాల కష్టాలను స్వయంగా చూసిన తాను అయితేనే అత్యంత వెనుకబడిన వర్గాలకు అండదండగా ఉంటాననే నమ్మకంతో వైఎస్ జగన్ ఈ పదవి ఇచ్చారని, తనకే కాదు.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన అనేక మందిని గుర్తించి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించి సామాజిక విప్లవానికి నాంది పలికారని పెండ్ర వీరన్న గర్వంగా చెబుతున్నారు. సామాజిక చైతన్య వీచికలుగా బీసీ కార్పొరేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త చరిత్రను సృష్టిస్తూ రాష్ట్రంలో 139 బీసీ కులాలకు గతేడాది అక్టోబర్లో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా కులాల పేర్లు చాలా మందికి తెలియదు. చాలా కులాలకు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి గుర్తింపే లేదు. అటువంటిది వాటికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు. దాదాపు 56 కార్పొరేషన్ ఛైర్మన్లు, 672 డైరెక్టర్ పదవుల్లో 50 శాతం మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పడం విశేషం. చదవండి: ట్విట్టర్ ట్రెండింగ్లో సీఎం జగన్ రెండేళ్ల పాలన సేవలన్నీ అక్కడే... ఊరికో ఆలయం -
ఎన్నడూ లేని విధంగా బీసీల సంక్షేమం
సాక్షి, అమరావతి/మంగళగిరి: బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి సరికొత్త నాయకత్వానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో శుక్రవారం బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులను వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి వేదికపైకి ఆహ్వానించగా ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు సభకు అధ్యక్షత వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు, డైరెక్టర్లకు తిరుపతిలో ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. బీసీలకు ఆత్మస్థైర్యం కలిగించిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బీసీల కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ జగన్ ఏడాదిన్నర కాలంలోనే రూ.67 వేల కోట్లు అందించారన్నారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఎంపీలు.. పిల్లి సుభాష్ చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు.. కొలుసు పార్థసారథి, జోగి రమేశ్, మధుసూదన్ యాదవ్, కాపు రామచంద్రారెడ్డి, అదీప్రాజ్, విడదల రజని, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ శేషుబాబు, రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు పూలే ఏ సమాజాన్ని అయితే ఆశించారో.. అదే సమాజ స్థాపన దిశలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తోడు చేసుకుని సీఎం ముందుకు సాగుతున్నారని చెప్పారు. -
‘బీసీల అభివృద్ధికి పాటుపడే నాయకుడు సీఎం జగన్’
సాక్షి, గుంటూరు: బీసీ కులాల అభివృద్దికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల బీసీ కులాల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని నర్సారావు పేటలో సోమవారం నిర్వహించిన ఈ ర్యాలీలో ఎంపీలె మోపిదేవి వెంటకరమణ, శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ యేసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి మాట్లాడుతూ... బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. బీసీ కులాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారన్నారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల అభ్యున్నతికి అభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీసీలకు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్గా నిలిపారన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని పేర్కొన్నారు. ఆయన క్యాబినెట్లో బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బీసీలకు గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఏడాదిన్నర కాలంలో 34 వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు పెట్టిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా నిజమైన సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంకురార్పణ చేశారని తమిళనాడుకు చెందిన పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే) వ్యవస్థాపక నేత ఎస్ రామదాస్ ప్రశంసించారు. 56 కార్పొరేషన్లలో 29 కార్పొరేషన్లకు మహిళలను చైర్మన్లుగా నియమించడంతో పాటు, 50% డైరెక్టర్ పదవులను మహిళలకు కేటాయించడం అభినందనీయమని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్కు ‘ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సంరక్షకుడు’ అనే బిరుదును తాను ప్రదానం చేస్తున్నానని రామదాస్ తెలిపారు. ఈ మేరకు సీఎంకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. ‘మీరు తీసుకుంటున్న చర్యలు బీసీ వర్గాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. సామాజికాభివృద్ధి సాధించే దిశగా సామాజిక న్యాయాన్ని నిలబెట్టేందుకు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ప్రగతిశీల ఆలోచనల పేరుతో సమాజంలో నకిలీ రాజకీయ మర్యాదల సంస్కృతి, వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొందరు కులాన్ని ఒక తిరోగమన సంకేతంగా చూస్తున్నారు. కానీ మీరు.. కులాన్ని సామాజిక న్యాయ సాధనకు పునాదిగా చూస్తున్నారు. కులాభివృద్ధిని రాష్ట్రాభివృద్ధికి ఒక సూచికగా మీరు పరిగణిస్తున్నారు. నిజమైన విప్లవం అంటే ఇదే. ఈ చర్య ద్వారా ఆంధ్రప్రదేశ్లో ‘సామాజిక న్యాయ సంరక్షకుడు’ స్థాయికి మీరు ఎదిగారు. ఈ సందర్భంగా మీకు (సీఎం వైఎస్ జగన్కు) ‘ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సంరక్షకుడు’ అనే బిరుదును ప్రదానం చేస్తున్నందుకు ఎంతగానో గర్విస్తున్నాను.. ఆనందిస్తున్నాను.’ అని రామదాస్ తన లేఖలో పేర్కొన్నారు. పేదరికం నుంచి బీసీ వర్గాలకు విముక్తి... ‘ఉన్నతమైన ఆలోచనలు రాజును ఉన్నతుడిగా చేస్తాయి’ అనే తమిళ రచయిత్రి అవ్వయార్ కవితను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆమె ఆశయాలను ఆచరణలో పెడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. 30 వేల జనాభా గల కులాల వారికి సైతం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం.. అంత తక్కువ సంఖ్యలో ఉన్నవారి అవసరాలను కూడా గుర్తించి పరిష్కరించడం కోసమేనన్నది స్పష్టమవుతోంది. ఐదేళ్లలో ఈ కార్పొరేషన్లకు రూ.75,000 కోట్లు ప్రభుత్వం నుంచి అందడం అంటే ఇది కేవలం వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు మాత్రమే కాదు, వారి ఆర్థిక వికాసం కోసం తీసుకుంటున్న చర్యలని చెప్పాలి. అంతేకాదు 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు కూడా మీరు ఇస్తున్న రూ.18,750ల సాయం వారిని ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చేస్తాయి. అలాగే 2024 నాటికి ఏపీని మద్య రహిత రాష్ట్రంగా చేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు చేపట్టిన ఇలాంటి చర్యల వల్ల మరి కొన్నేళ్లలో రాష్ట్రంలోని బీసీ వర్గాలు పేదరికం నుంచి, రుణాల ఊబి నుంచి బయట పడతాయని మేం విశ్వసిస్తున్నాం. వివిధ కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు మీ ముందు చూపునకు నిదర్శనంగా భావిస్తున్నాం..’ అని రామదాస్ తెలిపారు. -
56 బీసీ కార్పొరేషన్లకు 672 మంది డైరెక్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం 672 మంది డైరెక్టర్లను నియమించింది. వీరిలో 339 మంది మహిళలు, 333 మంది పురుషులు ఉన్నారు. ఆయా కార్పొరేషన్ల డైరెక్టర్ల జాబితాను సోమవారం బీసీ సంక్షేమశాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్పొరేషన్కు ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లు ఉంటారన్నారు. 56 కార్పొరేషన్లకుగాను చైర్మన్లు, డైరెక్టర్లతో కలిపి 728 మంది బీసీలకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఇంతమంది బీసీలకు అధికారమిచ్చిన దాఖలాల్లేవన్నారు. సామాజిక స్థితిగతులు, ఇతర అంశాలను బేరీజు వేస్తూ ఈ పదవులకు ఎంపిక చేశారని, మహిళలకు పెద్దపీట వేశారన్నారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందడుగు వేసేందుకు సర్కారు అవకాశం కల్పించిందన్నారు. వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. బీసీ కులాల కార్పొరేషన్స్ డైరెక్టర్స్ పేర్లు రజక కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/ పు 1 వైఎస్సార్ కడప కడప చిలమకూరు జ్యోతి భర్త: నారాయణ స్త్రీ 2 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు రూరల్ అర్టివరపు మల్లీశ్వరి భర్త: యానాదయ్య స్త్రీ 3 కర్నూలు ఆళ్లగడ్డ చాకలి వెంకటలక్ష్మి స్త్రీ 4 విజయనగరం కురుపాం గోరిశెట్టి జనార్థన్ తండ్రి: బలరాం పు 5 శ్రీకాకుళం పాలకొండ సరోజనమ్మ భర్త: కుప్పిలి లక్ష్మణరావు స్త్రీ 6 ప్రకాశం ఒంగోలు మారెళ్ళ శ్రీదేవి భర్త: శ్రీనివాసరావు స్త్రీ 7 ప్రకాశం ఒంగోలు పుటికలపుడి మల్లికార్జునరావు పు 8 చిత్తూరు తిరుపతి రవి ముస్తూరు (బొమ్మగుం) పు 9 పశ్చిమ గోదావరి భీమవరం రావూరి గోగురాజు పు 10 తూర్పు గోదావరి పి గన్నవరం బొర్రపలేపు సత్యనారాయణ పు 11 గుంటూరు రేపల్లె బేతపూడి వెంకటమహాలక్ష్మి భర్త: కోటేశ్వరావు స్త్రీ 12 విశాఖపట్నం గాజువాక వెలగపాటి యువశ్రీ స్త్రీ వాల్మీకి/బోయ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 వైఎస్సార్ కడప పులివెందు లొమడ నారాయణస్వామి భార్య: నారాయణప్ప పు 2 ప్రకాశం మార్కాపురం నల్లబోతుల కొండయ్య పు 3 చిత్తూరు పీలేరు నలంకి నరసింహులు పు 4 చిత్తూరు కుప్పం నాగభూషణమ్మ స్త్రీ 5 గుంటూరు సత్తెనపల్లి ఎద్దుదోడి కోటేశ్వరమ్మ స్త్రీ 6 అనంతపుం కళ్యాణదుర్గం కె పాలక్షి పు 7 అనంతపురం ఉరవకొండ టి రామాంజనేయులు పు 8 అనంతపురం తాడిపర్తి పసలూరు నాగరాజు పు 9 అనంతపురం మడకశిర (ఎస్సీ) రామకృష్ణప్ప తండ్రి: పాతలింగప్ప పు 10 కర్నూలు డోన్ ఎద్దుల మురళీకృష్ణ పు 11 కర్నూలు కోడుమూరు శ్రావనినాయుడు స్త్రీ 12 కర్నూలు పత్తికొండ గుంటా దేవి స్త్రీ యాదవ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 కర్నూలు ఆళ్లగడ్డ బత్తుల నాగేశ్వరరావు పు 2 విజయనగరం గజపతినగరం కోడెల ఈశ్వరమ్మ భర్త: ముత్యాలనాయుడు పు 3 శ్రీకాకుళం పలాస ఆనందాల శేషగిరి పు 4 ప్రకాశం దర్శి నిమ్మకాయల రాజయ్య పు 5 కృష్ణా తిరువూరు (ఎస్సీ) కె విజయలక్ష్మి భర్త: నాగేశ్వరావు స్త్రీ 6 చిత్తూరు శ్రీకాళహస్తి ఈరిబోయిన లోకేష్యావ్ పు 7 తూర్పుగోదావరి రంపచోడవరం ఆవుల మాధవీరాణి స్త్రీ 8 గుంటూరు మాచర్ల కమనబోయిన కోటయ్య తండ్రి : అక్కులు పు 9 అనంతపురం మడకశిర (ఎస్సీ) జి రాధమ్మ భర్త: జిఎం రాజన్న (లేటు) స్త్రీ 10 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కొవ్వూరు గొల్లపల్లి విజయకుమార్ తండ్రి: రమణయ్య పు 11 విశాఖపట్నం విశాఖపట్నం ఈస్ట్ డాక్టర్ గుంటబోయిన లక్ష్మీసాయి రవికుమార్ తండ్రి: జి రామకృష్ణ పు 12 పశ్చిమగోదావరి పోలవరం పాశం రామకృష్ణ పు తూర్పు కాపు కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 కృష్ణా విజయవాడ ఈస్ట్ ఎజ్జెడ తేజేశ్ పు 2 తూర్పు గోదావరి రాజమండ్రి బురిడి పద్మావతి భర్త: బురిడి త్రిమూర్తులు స్త్రీ 3 విశాఖపట్నం మాడుగుల గొల్లవిల్లి ప్రభావతి భర్త: జి సంజీవరావు స్త్రీ 4 విశాఖపట్నం విశాఖపట్నం ఈస్ట్ మహదేవ్ ఆనందరావు తండ్రి : సాంబమూర్తి పు 5 విజయనగరం పార్వతీపురం మజ్జి నాగమణి భర్త: సన్యాసిరావు స్త్రీ 6 విజయనగరం విజయనగరం పిల్లా వినాయకమ్మ భర్త: వివి పిడి తస్యవిజయ్కుమార్ స్త్రీ 7 విజయనగరం చీపురుపల్లి బేవర ఉమాకుమారి భర్త: బి రాజారత్నం నాయుడు స్త్రీ 8 శ్రీకాకుళం నర్సన్నపేట లుకలపు రంజిత్కుమార్ తండ్రి : కృష్ణన్నాయుడు పు 9 శ్రీకాకుళం ఆముదాల వలస కిల్లన సూర్యారావు తండ్రి: ఎర్రయ్య పు 10 శ్రీకాకుళం ఇచ్చాపురం వరిసి భారతి భర్త : వరిసి హరిప్రసాద్ స్త్రీ 11 పశ్చిమగోదావరి భీమవరం ముల్లి వీరరాఘవమ్మ భర్త : నరసింహమూర్తి స్త్రీ 12 పశ్చిమగోదావరి ఉండి జగ్గురోతు విజయ్కుమార్ పు మత్స్యకార కార్పొరేషన్ (ఓడ బలిజ, నెయ్యిల, జాలరి) నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విజయనగరం నెల్లిమర్ల మైలపల్లి నరసింహులు తండ్రి : అరిబు పు 2 విజయనగరం పాలకొండ పి పార్వతి భర్త: పి మురళీకృష్ణ స్త్రీ 3 శ్రీకాకుళం శ్రీకాకుళం ఎం మహాలక్ష్మి భర్త: సాయిబాబు స్త్రీ 4 శ్రీకాకుళం పాతపట్నం బెనయ విజయలక్ష్మి భర్త: బెనయ వెంకటరమణ స్త్రీ 5 శ్రీకాకుళం ఇచ్చాపురం ఎం రాజారావు పు 6 కృష్ణా అవనిగడ్డ కె జ్యోతి భర్త: కె నాగరాజు స్త్రీ 7 పశ్చిమగోదావరి నర్సాపురం మైల వీర్రాజు పు 8 తూర్పుగోదావరి పిఠాపురం తోటకూర మేరమ్మ భర్త: బాబవ్ స్త్రీ 9 తూర్పగోదావరి పి గన్నవరం చింతా కుమారి భర్త : చింతా రామకృష్ణ స్త్రీ 10 విశాఖపట్నం పాయకరావుపేట చోడిపిల్లి శ్రీనివాస్ తండ్రి: గంగారావు పు 11 విశాఖపట్నం వైజాగ్ ఈస్ట్ పేర్ల విజయచందర్ తండ్రి : దానయ్య పు 12 గుంటూరు బాపట్ల కన్న మాముళ్లయ్య తండ్రి: నాగభూషణం పు షేక్/షెయిక్ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 వైఎస్సార్ కడప కమలాపుం షేక్ గఫార్బాషా తండ్రి : వల్లీసాహెబ్ పు 2 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సూళ్లూరుపేట (ఎస్సీ) ఎస్కే రఫీ పు 3 కర్నూలు పాణ్యం బంధుభాయ్ అబ్దుల్ ఖయ్యర్ పు 4 కర్నూలు శ్రీశైలం షేక్ అంజద్అలీ పు 5 విశాఖపట్నం నర్నీపట్నం మహమ్మద్ సబీరబేగం స్త్రీ 6 ప్రకాశం దర్శి డాక్టర్ ఎస్ఎం బాషా పు 7 కృష్ణా నందిగామ షనాజ్ బేగం స్త్రీ 8 పశ్చిమ గోదావరి చింతలపూడి షేక్ అక్బర్ అహ్మద్ పు 9 తూర్పగోదావరి మండపేట షేక్ అలీఖాన్బాబా పు 10 గుంటూరు పెదకూరపాడు షేక్ మస్తాన్ తండ్రి: గలీబ్ సాహెబ్ పు 11 అనంతపురం పెనుగొండ టి ఫక్రుద్దీన్ సాబ్ పు 12 చిత్తూరు పుంగనూరు సలీమ్ పు ముస్లిమ్ సంచార కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 వైఎస్సార్ కడప కడప షెయిక్ కరీముల్లా తండ్రి : షెయిక్ ఎ అబ్దుల్ రహమాన్ పు 2 విశాఖపట్నం నర్సీపట్నం షెయిక్ బహీరున్నీసా భర్త: మహమ్మద్ అస్రఫ్ స్త్రీ 3 ప్రకాశం చీరాల సయ్యద్ ఆయూబ్ పు 4 కృష్ణా గుడివాడ సయ్యద్ ఎస్కే పు 5 చిత్తూరు పూతలపట్టు డి ఖబీర్ పు 6 పశ్చిమ గోదావరి ఏలూరు షేక్ రిజ్వాన్ పు 7 తూర్పుగోదావరి రాజమండి రూరల్ షహకీలా బేగం స్త్రీ 8 గుంటూరు చిలకలూరిపేట ఇస్మాయిల్ గుంటూరు పు 9 గుంటూరు చిలకలూరిపేట షేక్ దరియావాలి తండ్రి: మహబూబ్ సాహెబ్ పు 10 గుంటూరు గుంటూరు ఈస్ట్ షేక్ మెహబూబ్ తండ్రి: బురాన్ పు 11 కర్నూలు కర్నూలు ఎస్ఏ షరీఫ్ తండ్రి: ఎస్ఏ సలామ్ పు 12 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు గూడూరు ఎస్కే అల్లా బాషా తండ్రి: ఖాదర్బాషా పు సగర/ఉప్పర కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం అనంతపురం అర్బన్ ఎం అన్నపూర్ణ స్త్రీ 2 అనంతపురం పెనుకొండ ఎం నరసింహప్ప పు 3 వైఎస్సార్ కడప ప్రొద్దుటూరు ఉప్పార మురళీధర్ తండ్రి: ఉప్పార వెంకటేశ్వర్లు పు 4 విశాఖపట్నం గాజువాక గుర్రం రాజేష్కుమార్ తండ్రి: గుర్రం గోవింద్ (లేటు) పు 5 ప్రకాశం యర్రగొండపాలెం పోలెబోయిన రామారావు పు 6 కృష్ణా పెనమలూరు ఎన్ శ్రీనివాసరావు తండ్రి : వెంకటేశ్వరావు పు 7 గుంటూరు ప్రత్తిపాడు మందడి నారాయణమ్మ భర్త: శోభన్బాబు 8 కర్నూలు ఎమ్మిగనూరు యుకె సుహాసిని స్త్రీ 9 కర్నూలు పత్తికొండ యు భజరప్ప స్త్రీ 10 పశ్చిమ గోదావరి తాడేపల్లి గూడెం కర్నాటి సాయికుమారి భర్త: కర్నాటి కన్నయ్య స్త్రీ 11 పశ్చిమ గోదావరి దెందులూరు పంచగల చిన్న బుజ్జి భర్త : పంచగల నరసింహారావు స్త్రీ 12 తూర్పుగోదావరి ప్రత్తిపాడు జల్తారపు అప్పాయమ్మ స్త్రీ నాయీబ్రాహ్మిణ్ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం అనంతపురం అర్బన్ ఎం శ్రీనివాసులు పు 2 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కావలి కలవకూరు దానమ్మ స్త్రీ 3 కర్నూలు నంద్యాల నారాయణస్వామి ప్రకాశ్ తండ్రి: నారాయణస్వామి పు 4 చిత్తూరు తిరుపతి తొండమళ్ళ పుల్లయ్య పు 5 విజయనగరం సాలూరు చిప్పాడ రామారావు తండ్రి: నరసింహులు పు 6 శ్రీకాకుళం రాజాం ముంగండి రమణమ్మ భర్త: సూర్యనారాయణ స్త్రీ 7 ప్రకాశం ఒంగోలు ధరణికోట లక్ష్మీనారాయణ భర్త: శోభన్బాబు పు 8 కృష్ణా గన్నవరం మల్కాపురం కనకారావు పు 9 పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం పట్నాల గౌరి భర్త: పట్నాల గణపతి స్త్రీ 10 తూర్పు గోదావరి కాకినాడ రూరల్ అల్లూరి మాణిక్యబ్రమరాంబ భర్త: ఎఎస్ఎన్ మూర్తి స్త్రీ 11 గుంటూరు పొన్నూరు ఉప్పుమావులూరి నాగలక్ష్మి భర్త : శివరామకృష్ణ స్త్రీ 12 విశాఖపట్నం బీమిలి వెంపటపు నూకరాజు తండ్రి: రాము పు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం కదిరి పి చంద్రశేఖర ఆచారి పు 2 వైఎస్సార్ కడప మైదుకూరు గొడ్లవీటి సుబ్రమణ్యం తండ్రి: నాగసుబ్బయ్య పు 3 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు రూరల్ తిరువలూరు దీవిజ స్త్రీ 4 విశాఖపట్నం అనకాపల్లి కోటిపల్లి శ్రీదేవి భర్త: కె జేజిబాబు స్త్రీ 5 విజయనగరం నెల్లిమర్ల జనత్రివేణి వెంకట వరప్రసాద్ తండ్రి: లక్ష్మణరావు పు 6 శ్రీకాకుళం పాలకొండ బురద లక్ష్మీకాంతం భర్త: లక్ష్మీనారాయణ స్త్రీ 7 ప్రకాశం ఒంగోలు గోనుగుంట రజని స్త్రీ 8 చిత్తూరు తిరుపతి ఎం భారతి స్త్రీ 9 పశ్చిమ గోదావరి ఏలూరు లక్కోజు రాజగోపాలచారి పు 10 తూర్పు గోదావరి రామచంద్రాపురం దార్ల సూర్య ప్రభావతి భర్త: శ్రీనివాస్ స్త్రీ 11 గుంటూరు గురజాల కుందుర్తి లక్ష్మీకుమారి భర్త : గురవాచారి స్త్రీ 12 కర్నూలు ఆళ్లగడ్డ గూబగుండం వరలక్ష్మి స్త్రీ వడ్డెర కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం పుట్టపర్తి డి ఉమాదేవి భర్త: వెంకటరాజు స్త్రీ 2 అనంతపురం కదిరి తిరుపతి భాగ్యమ్మ స్త్రీ 3 వైఎస్సార్ కడప తిరుపతి తిరుపతి ఆంజనేయులు తండ్రి: వెంకటరమణ పు 4 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సూళ్లూరుపేట (ఎస్సీ) మల్లి సుమతి భర్త: శ్రీనివాసులు స్త్రీ 5 కర్నూలు నందికొటుకూరు వడ్డె రామసుబ్బయ్య పు 6 ప్రకాశం దర్శి మల్లె విమల స్త్రీ 7 ప్రకాశం అద్దంకి పల్లపు రాముడు పు 8 కృష్ణా విజయవాడ వెస్ట్ డేరంగుల వెంకటరమణారావు తండ్రి: సైదులు పు 9 తూర్పు గోదావరి రాజమండ్రి రూరల్ దండగల మరిదయ్య పు 10 గుంటూరు సత్తెనపల్లి బత్తుల రామస్వామి తండ్రి: చిన్న గురవయ్య పు 11 చిత్తూరు చిత్తూరు పి పద్మప్రియ మామ: జి మురుగయ్య స్త్రీ 12 చిత్తూరు శ్రీకాళహస్తి చంద్రగిరి ఉదయ వరలక్ష్మి స్త్రీ గౌడ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కావలి నాయుడు రామ్ప్రసాద్ పు 2 విజయనగరం విజయనగరం ఎరకల భవానీ భర్త: శ్రీధర్ స్త్రీ 3 విశాఖపట్నం విశాఖపట్నం ఈస్ట్ డాక్టర్ భమరశెట్టి భరత లక్ష్మి భర్త: బీటీ రావు స్త్రీ 4 తూర్పు గోదావరి కొత్తపేట మారంగ గంగాధర్ పు 5 గుంటూరు రేపల్లె కామినేని కోటేశ్వరరావు తండ్రి: నాగయ్య పు 6 శ్రీకాకుళం ఇచ్చాపురం ఉజ్వల గౌడ తండ్రి: బోలోబో గౌడ పు 7 ప్రకాశం గిద్దలూరు కంచర్ల కోటయ్య గౌడ్ పు 8 చిత్తూరు చంద్రగిరి ఎం హేమలత భర్త: మురుగయ్య 9 పశ్చిమ గోదావరి గోపాలపురం మట్టా లక్ష్మి స్త్రీ 10 పశ్చిమ గోదావరి భీమవరం కమన నాగేశ్వరరావు పు 11 పశ్చిమ గోదావరి ఉండి మేక పార్వతీదేవి స్త్రీ 12 కృష్ణా పెనమలూరు చాముండేశ్వరి స్త్రీ కుమ్మరి/శాలివాహన కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం ఉరవకొండ కె రోహిణి భర్త: కె రామ్మోహన్ స్త్రీ 2 వైఎస్సార్ కడప రాజంపేట పొలి నరసమ్మ భర్త: జయ కోటేశ్వరావు స్త్రీ 3 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు గూడూరు (ఎస్సీ) మన్నెంపల్లి నాగేశ్వరరావు పు 4 కర్నూలు నందికొటుకూరు సుగురి రవణమ్మ స్త్రీ 5 విశాఖపట్నం నర్సీపట్నం దేవరపు అర్జున వెంకటరావు తండ్రి: రమణ పు 6 విజయనగరం పాడేరు వంతల పూర్ణమ్మ భర్త: హరిబాబు స్త్రీ 7 శ్రీకాకుళం ఆముదాల వలస కాదుర్ల వీరాస్వామి తండ్రి : రాములు పు 8 ప్రకాశం సంతనూతలపాడు పేరాల చెన్నకేశవరావు పు 9 కృష్ణా మైలవరం ఆర్ మాణిక్యమ్మ భర్త: బాబూరావు స్త్రీ 10 చిత్తూరు తిరుపతి బందరుపల్లి జమున స్త్రీ 11 పశ్చిమ గోదావరి నిడదవోలు పసలపూడి భద్రయ్య పు 12 తూర్పు గోదావరి జగ్గంపేట బిలకుర్తి నాగమణి స్త్రీ కొప్పుల వెలమ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 శ్రీకాకుళం పాలకొండ వసిరెడ్డి అనురాధ భర్త : పార్థ సారధి స్త్రీ 2 కృష్ణా నూజివీడు ఎస్ చంద్ర సత్యకళ భర్త: వెంకట రమణమూర్తి స్త్రీ 3 తూర్ప గోదావరి మండపేట సోమిరెడ్డి వెంకటేశ్వరస్వామి పు 4 విశాఖపట్నం అనకాపల్లి గొర్లె అప్పలనాయుడు తండ్రి: ఆపన్న పు 5 విశాఖపట్నం చోడవరం తమరణ వెంకటరమణ తండ్రి: కొండ పు 6 విశాఖపట్నం పాడేరు గడి నాగమణి భర్త: గడి సత్యనారాయణ స్త్రీ 7 విశాఖపట్నం యలమంచిలి నడిపింటి వెంకట రామలక్ష్మి భర్త: నడిపింటి పైడిరాజు స్త్రీ 8 విశాఖపట్నం మాడుగుల వరదపురెడ్డి సింహాచలం నాయుడు తండ్రి: వి చిన్నంనాయుడు పు 9 విజయనగరం గజపతి నగరం కడుబండి సుధారాణి భర్త: రమేష్నాయుడు స్త్రీ 10 విజయనగరం సాలూరు రెడ్డి గౌరి భర్త: అప్పలనాయుడు స్త్రీ 11 పశ్చిమ గోదావరి ఉంగుటూరు మరదాని హిమబింధు స్త్రీ 12 పశ్చిమ గోదావరి తాడేపల్లి గూడెం గొర్రెల శ్రీనివాసరావు పు కురుబ/కురుమ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 వైఎస్సార్ కడప రాయచోటి పడిగెల వెంకటరమణ తండ్రి : పి వెంకటేష్ పు 2 అనంతపురం ఉరవకొండ పడిగెల వెంకటరమణ పు 3 అనంతపురం మడకశిర (ఎస్సీ) వి బిదురమ్మ భర్త: చంద్రప్ప స్త్రీ 4 అనంతపురం పుట్టపర్తి కె మాదవప్ప తండ్రి: రంగప్ప పు 5 అనంతపురం రాప్తాడు కురుబ పార్వతమ్మ స్త్రీ 6 అనంతపురం రాప్తాడు దండు రామాంజనేయులు పు 7 కర్నూలు ఆలూరు కేపీ భజరప్ప పు 8 కర్నూలు డోను కొంగిసి నాగరత్నమ్మ భర్త: వెంకోబరావు స్త్రీ 9 కర్నూలు పత్తికొండ కె సుకన్య స్త్రీ 10 చిత్తూరు పూతలపట్టు కె అమర్నాద్ పు 11 చిత్తూరు మదనపల్లి జి రామానుజులు పు 12 చిత్తూరు పీలేరు కొప్పల నరసింహులు పు వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 వైఎస్సార్ కడప రైల్వే కోడూరు మోసాటి బుజ్జమ్మ స్త్రీ 2 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సర్వేపల్లి నెల్లూరు శివప్రసాద్ పు 3 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు కొవ్వూరు బుచ్చంగారి తిరుపతయ్య తండ్రి : రామయ్య పు 4 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు గూడూరు (ఎస్సీ) కోడి అను భర్త : మునెయ్య స్త్రీ 5 కృష్ణా విజయవాడ వెస్ట్ సైకం దుర్గాకుమారి భర్త: సైకం సాయిబాబు స్త్రీ 6 కృష్ణా విజయవాడ ఈస్ట్ ఒడుగు గోపీనాథ్వర్మ పు 7 చిత్తూరు పూతలపట్టు మలరకూడి భర్త: వి బాలాజీ స్త్రీ 8 చిత్తూరు చంద్రగిరి జి లక్ష్మీదేవి భర్త: శివశంకరరాజా స్త్రీ 9 చిత్తూరు శ్రీకాళహస్తి సీహెచ్ భరత్కుమార్రెడ్డి పు 10 గుంటూరు రేపల్లె చెన్ను లక్ష్మణరావు పు 11 ప్రకాశం ఒంగోలు వంగరి సుమతి స్త్రీ 12 పశ్చిమ గోదావరి నర్సాపురం బి పూర్ణచంద్రరావు పు కళింగ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విజయనగరం ఎచ్చెర్ల కేవీవీ సత్యనారాయణ తండ్రి : నరసింహఅప్పాడు పు 2 విశాఖపట్నం విశాఖపట్నం పైడి శ్రీనివాసరావు పు 3 విశాఖపట్నం విశాఖపట్నం సౌత్ సనపాల రవీంద్రభరత్ తండ్రి : నరసింహ అప్పాడు పు 4 విశాఖపట్నం గాజువాక బలిదె పద్మావతి స్త్రీ 5 శ్రీకాకుళం టెక్కలి సమాప్తిరావు హేమచంద్రరాజు పు 6 శ్రీకాకుళం శ్రీకాకుళం కణితి కొండమ్మ భర్త : కృష్ణారావు స్త్రీ 7 శ్రీకాకుళం పలాస దువ్వాడ జయశ్రీ భర్త: శ్రీకాంత్ స్త్రీ 8 శ్రీకాకుళం టెక్కలి ప్రియ ఝన్సీ భర్త: కృష్ణారావు స్త్రీ 9 శ్రీకాకుళం రాజాం గరుగుబల్లి స్వామినాయుడు పు 10 పశ్చిమ గోదావరి కొవ్వూరు పొన్నాడ సింహాద్రి పు 11 పశ్చిమ గోదావరి ఉంగుటూరు మూల కళ్యాని భర్త : నాగ వెంకట సురేష్ స్త్రీ 12 పశ్చిమ గోదావరి తాడేపల్లి గూడెం సంపతిరావు కృష్ణారావు పు గవర కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విజయనగరం విజయనగరం ఆదారి రుక్మిని భర్త : అప్పలరాజు స్త్రీ 2 తూర్పు గోదావరి జగ్గపేట ముల్లేటి సర్వతి స్త్రీ 3 తూర్పు గోదావరి రాజానగరం సూరిశెట్టి సుబ్బలక్ష్మి భర్త : సూరిశెట్టి భద్రం స్త్రీ 4 పశ్చిమ గోదావరి పాలకొల్లు బొడ్డేటి సూర్యనారాయణ పు 5 విశాఖపట్నం పాయకరావుపేట కొణతల ఉమాదేవి భర్త: కొణతల శ్రీనివాసరావు స్త్రీ 6 విశాఖపట్నం విశాక వెస్ట్ కొణతల వెంకటనరసింహారావు తండ్రి : కొణతల నూకరాజు (లేటు) పు 7 విశాఖపట్నం గాజువాక మరిశెట్టి గంగాభాయి స్త్రీ 8 విశాఖపట్నం మాడుగుల దండి జగన్నాదరావు తండ్రి : దండి పూర్ణ పు 9 విశాఖపట్నం అనకాపల్లి ఎస్వీవీ సత్యనారాయణ (బాబి) తండ్రి: అప్పారావు పు 10 విశాఖపట్నం అనకాపల్లి బొడ్డేడ శివసత్యనారాయణ తండ్రి : సన్యాసి నాయుడు పు 11 విశాఖపట్నం విశాఖ ఈస్ట్ పీలా జొషీల భర్త : కనకరాజు స్త్రీ 12 కృష్ణా విజయవాడ దడి అప్పారావు పు పద్మశాలి కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం ధర్మవరం జింక లక్ష్మీదేవి భర్త : జింక కంబగిరి స్త్రీ 2 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వెంకటగిరి నక్కా వెంకటేశ్వరరావు పు 3 కర్నూలు ఆదోని గోరంట్ల ధర్మన్న పు 4 విశాఖపట్నం భీమిలి తమ్మిన రామలక్ష్మణరావు తండ్రి: రాము పు 5 శ్రీకాకుళం రాజాం బొల్లా లలితకుమారి స్త్రీ 6 ప్రకాశం చీరాల గోలి కుమారి స్త్రీ 7 కృష్ణా అవనిగడ్డ ఐ అర్చన స్త్రీ 8 చిత్తూరు తంబళ్లపల్లి సురేంద్రనా«ద్ పు 9 గుంటూరు మంగళగిరి పారేపల్లి విజయలక్ష్మి భర్త: రామకృష్ణ స్త్రీ 10 విజయనగరం సృంగవరపు కోట దొడ్డి రాంబాబు పు 11 పశ్చిమ గోదావరి తనుకు ఆకుల కళ్యాణి స్త్రీ భర్త : ఆకుల కిరణ్ స్త్రీ 12 తూర్పు గోదావరి పిఠాపురం జోగు సూర్యచంద్రరావు పు గాండ్ల/తెలికుల కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం సింగనమల (ఎస్సీ) సి లక్ష్మీనరసయ్య పు 2 వైఎస్సార్ కడప మైదుకూరు వీరపు గాయత్రీదేవి భర్త: ఉమాపతి స్త్రీ 3 విశాఖపట్నం మాడుగుల కొమ్మనపల్లి భాస్కర్రావు తండ్రి: కొమ్మనపల్లి దాములు పు 4 విశాఖపట్నం చోడవరం చిత్రాడ జగదీష్ పు 5 విశాఖపట్నం గాజువాక చిత్రాడ కనక సూర్య పద్మావతి భర్త : వెంకటరమణ స్త్రీ 6 విజయనగరం పార్వతీపురం చెవిటి వెంకటరమణారావు పు 7 శ్రీకాకుళం ఎచ్చెర్ల ఎడవల్లి ఈశ్వరరావు పు 8 చిత్తూరు జిడి నెల్లూరు ఎం పురుషోత్తం పు 9 చిత్తూరు సత్యవేడు బి గిరిజ భర్త: రవికుమార్ స్త్రీ 10 చిత్తూరు పలమనేరు ఆర్ అరుణకుమారి స్త్రీ 11 పశ్చిమ గోదావరి పోలవరం సర్వ శ్రీదేవి భర్త : సర్వ శ్రీహరి స్త్రీ 12 తూర్పు గోదావరి జగ్గంపేట ఉయ్యూరి వరప్రసాద్ పు ముదిరాజ్/ముత్రాసి కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 వైఎస్సార్ కడప రాజంపేట భువనబోయిన లక్ష్మయ్య తండ్రి : పెంచలయ్య పు 2 వైఎస్సార్ కడప రైల్వే కోడూరు గుండ్లూరు ఈశ్వరయ్య పు 3 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు రూరల్ కనకట్ల నరసింహ పు 4 ప్రకాశం కందుకూరు మూసంగి వెంకటస్వామి పు 5 ప్రకాశం కనిరిగి కుప్పనబోయిన పద్మావతి స్త్రీ 6 కృష్ణా మచిలీపట్నం పి నాగేంద్రం పు 7 కృష్ణా విజయవాడ సెంట్రల్ పిల్లి కృష్ణవేణి భర్త: వెంకటేశ్వరరావు స్త్రీ 8 పశ్చిమ గోదావరి చింతలపూడి చుప్పుల శ్రీనివాసరావు పు 9 గుంటూరు చిలకలూరిపేట కొండెబోయిన అనూష భర్త: నాగార్జున స్త్రీ 10 గుంటూరు నర్సరావుపేట మద్దిలేటి స్వామి ఎలుగు తండ్రి: గురవయ్య పు 11 చిత్తూరు జిడి నెల్లూరు ఎస్ మాధవరామ్ పు 12 చిత్తూరు పసత్యవేడు టి ధనుంజయులు పు నగరలు కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విశాఖపట్నం భీమిలి కురిటి సాయి వెంకట లోహిత్ తండ్రి: వేంకటేశ్వర రావు పు 2 విశాఖపట్నం గాజువాక గుజ్జరి లలిత భర్త: సన్యాసి రావు స్త్రీ 3 విశాఖపట్నం విశాఖపట్నం పడమర బోగవల్లి అచ్చుతాంబ భర్త:కరుణాకర్ స్త్రీ 4 విశాఖపట్నం విశాఖపట్నం తూర్పు బోయన మీనాక్షి భర్త: మల్లేశ్వర రావు స్త్రీ 5 విశాఖపట్నం విశాఖపట్నం తూర్పు వండ్రసి శ్యామల స్త్రీ 6 విశాఖపట్నం గాజువాక నాగోతి పార్వతి స్త్రీ 7 విశాఖపట్నం భీమిలి కొరికన మోహన రావు పు 8 విజయనగరం విజయనగరం ఉషారాణి సుకవసి భర్త: ఎస్బి నాయకులు స్త్రీ 9 విజయనగరం బొబ్బిలి ఎడు రమణమ్మ భర్త: చిన్నము నాయుడు స్త్రీ 10 శ్రీకాకులం ఏచర్ల పిల్ల ఆనంద రావు తండ్రి:సీతారామ పాత్రుడు పు 11 కృష్ణా విజయవాడ పడమర సేరం వెంకట రావు పు 12 కృష్ణా విజయవాడ పడమర మజ్జి శ్రీదేవి శ్రీనివాస్ స్త్రీ శెట్టి బలిజ కార్పొరేషన్ 1 విజయనగరం పార్వతిపురం సనపటి తిరుపతి తండ్రి: దలయ్య పు 2 పశ్చిమ గోదావరి ఆచంట మామిడిశెట్టి కృష్ణవేణి స్త్రీ 3 పశ్చిమ గోదావరి నరసాపురం కోల్ల లక్ష్మి స్త్రీ 4 తూర్పు గోదావరి కాకినాడ రూరల్ అనసూరి ప్రభాకర్ తండ్రి: ఏ సుబ్బరావు పు 5 తూర్పు గోదావరి కొత్తపేట బొక్క వెంకట లక్ష్మి స్త్రీ 6 తూర్పు గోదావరి రామచంద్ర పురం గుట్టుల బులి రాజు పు 7 తూర్పు గోదావరి కాకినాడ సిటీ పసుపులేటి వెంకట లక్ష్మి స్త్రీ 8 తూర్పు గోదావరి అమలాపురం డొంగ నాగ సునీత స్త్రీ 9 విశాఖపట్నం విశాఖపట్నం (ఉత్తరం) రాయుడు శ్రీనివాస రావు తండ్రి: సూర్య నారాయణ పు 10 విశాఖపట్నం ఎలమంచిలి వడిసెల శ్రీనివాస రావు పు 11 శ్రీకాకులం గాజువాక సంపంజీ పార్వతి స్త్రీ 12 శ్రీకాకులం నర్సిపట్నం బొందల రాజు తండ్రి: అప్పరావు పు పాల–ఏకరీ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం సింగనమల(ఎస్సి) టి. పరందామా పు 2 అనంతపురం పుట్టపర్తి భర్త: కమలాకర్ నాయుడు ఎం.కుల్లాయమ్మ స్త్రీ 3 అనంతపురం ధర్మవరం తండ్రి: శ్రీరాములు ఎకిల చలపతి పు 4 అనంతపురం కదిరి ఏ. దశరథ రామ నాయుడు పు 5 చిత్తూరు తిరుపతి కల్లూరి రెడ్డప్ప పు 6 చిత్తూరు మదనపల్లి జే. కిరణ్మయి స్త్రీ 7 చిత్తూరు చంద్రగిరి ఎం. రఘుపతి పు 8 చిత్తూరు పున్నగనూరు కొండపల్లి రమణ పు 9 వైఎస్ఆర్ కడప పులివెందుల ఎన్. నిర్మలా భర్త: మనోహర్ నాయుడు స్త్రీ 10 వైఎస్ఆర్ కడప రాయచోటి నరే.శ్రీలక్ష్మి భర్త: ఉమామహేశ్వరి నాయుడు స్త్రీ 11 వైఎస్ఆర్ కడప రాజంపేట కొటిక అరుణ కుమారి స్త్రీ 12 వైఎస్ఆర్ కడప పులివెందుల పాతపాలెం సబాపతి నాయుడు తండ్రి: చిన్నమనాయుడు పు కళింగ కోమటి/కళింగ వైశ్య కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 శ్రీకాకులం రాజాం మొనిగి ప్రమీల కుమారి భర్త : మొనిగి ఆదినారాయణ స్త్రీ 2 శ్రీకాకులం శ్రీకాకులం పొట్నూరు సై ప్రసాద్ పు 3 శ్రీకాకులం టెక్కలి తంకల పావని రాణి తండ్రి: రాఘవ రావు స్త్రీ 4 శ్రీకాకులం పలాస కొట్నీ లక్ష్మి భర్త:మధుసూదన్ రావు స్త్రీ 5 విశాఖపట్నం విశాఖా ఉత్తరం సకల బక్తుల ప్రసాద్ రావు తండ్రి: వెంకట రమణ పు 6 విశాఖపట్నం విశాఖా ఉత్తరం పొట్నూరి మాధవి భర్త: మధుసూదన్ రావు స్త్రీ 7 విశాఖపట్నం అరకు వారణాసి మనికేశ్వర్ రావు కొడుకు: వారణాసి తేజ పు 8 విజయనగరం బొబ్బిలి కింతలి గీత లక్ష్మి భర్త: శ్రీనివాస రావు స్త్రీ 9 విజయనగరం పార్వతిపురం లడే మెహర్ ప్రసాద్ పు 10 విజయనగరం కురుపం కొత్తకోట వెంకట సురేశ్ కుమార్ పు 11 విజయనగరం విజయనగరం భోగి కుసుమ కుమారి భర్త: దేవరశెట్టి శ్రీరామ మూర్తి స్త్రీ 12 ఎస్పిఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు సిటీ మెలగనూరు రాజశేఖర్ పు రెడ్డిక కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విశాఖపట్నం గాజువాక సీరపు అప్పలరెడ్డి తండ్రి : సత్తెయ్య పు 2 విశాఖపట్నం విశాఖ ఈస్ట్ బోర సుభాషిణి భర్త: ఎర్నికుమార్రెడ్డి స్త్రీ 3 కృష్ణా పామర్రు కె రాంబాబు పు 4 పశ్చిమ గోదావరి చింతలపూడి కొయ రమ భర్త: లీలాధర్రెడ్డి స్త్రీ 5 పశ్చిమ గోదావరి రాజమండ్రి అర్బన్ ఉప్పాడ కోటారెడ్డి పు 6 విజయనగరం నెల్లిమర్ల గాబు భాగ్యలక్ష్మి స్త్రీ 7 విజయనగరం విజయనగరం రౌతు భాస్కర్రావు తండ్రి : అప్పలరెడ్డి (లేటు) పు 8 విజయనగరం విజయనగరం పిట్టా పావని తండ్రి: పిట్టా కోదండరెడ్డి స్త్రీ 9 శ్రీకాకుళం ఎచ్చెర్ల చిల్లా కృష్ణవేణి భర్త: వెంకటరెడ్డి స్త్రీ 10 శ్రీకాకుళం శ్రీకాకుళం సుగ్గు లక్ష్మినరసింహాదేవి భర్త: మధురెడ్డి స్త్రీ 11 శ్రీకాకుళం పాతపట్నం కె భానుప్రకాశ్రెడ్డి పు 12 శ్రీకాకుళం టెక్కలి సుగ్గు రాజకుమారి భర్త: సుగ్గు శ్రీనివాసరెడ్డి స్త్రీ జంగం కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం రాయదుర్గం జంగం పుష్పావతి భర్త: జంగం సురేష్ స్త్రీ 2 వైఎస్సార్ కడప కడప పానుగంటి కృష్ణ తండ్రి : పానుగంటి పెంచలయ్య పు 3 వైఎస్సార్ కడప మైదుకూరు నిడనకం లక్ష్మి భర్త: జమ్మయ్య స్త్రీ 4 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు గూడూరు తుపిలి కోటయ్య తండ్రి: సుబ్బరామయ్య పు 5 కర్నూలు ఆలూరు కెఎం అక్కమదేవి స్త్రీ 6 కర్నూలు నందికొట్కూరు జంగం రేవతి స్త్రీ 7 శ్రీకాకుళం నర్సన్నపేట వసనబి దుర్గామల్లేశ్వరసామి పు 8 పశ్చిమ గోదావరి దెందులూరు కడమచ్చి వెంకాయమ్మ భర్త : చినరంగారావు స్త్రీ 9 తూర్పు గోదావరి మండపేట మేగడ శ్రీనివాసరావు పు 10 గుంటూరు నర్సరావుపేట తోట నారాయణమ్మ భర్త: పెద్దవీరయ్య స్త్రీ 11 గుంటూరు నర్సరావుపేట మట్టం సునీల్కుమార్ పు 12 విశాఖపట్నం చోడవరం అప్పికొండ సోమేశ్వరరావు (లింగబాబు) తండ్రి: కొండలరావు పు దేవాంగ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 వైఎస్సార్ కడప ప్రొద్దుటూరు గోడెన నాగలక్ష్మి భర్త: రాగనరసింహారావు స్త్రీ 2 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సర్వేపల్లి కోనం చినబ్రహ్మయ్య పు 3 కృష్ణా పెడన మెట్ల శైలశ్రీ భర్త: దుర్గానాగేశ్వరావు స్త్రీ 4 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్ దొంతంశెట్టి చినవీరభద్రయ్య పు 5 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్ కుండపల్లి మల్లేశ్వరి భర్త: కె పట్టియ్య స్త్రీ 6 తూర్పు గోదావరి అమలాపురం పిచ్చిక శాంతి భర్త: పీఎల్ఎన్ ప్రభాకర్ స్త్రీ 7 పశ్చిమ గోదావరి నర్సాపురం మావూరి సత్యనారాయణ పు 8 విజయనగరం విజయనగరం ఉప్పు శాంతాకుమారి భర్త : ఉప్పు ప్రకాశరావు స్త్రీ 9 శ్రీకాకుళం పాతపట్నం మంచు చంద్రయ్య పు 10 శ్రీకాకుళం టెక్కలి మొర్రి దీప్తి స్త్రీ 11 విశాఖపట్నం పాయకరావుపేట అల్లాడ శివకుమార్ తండ్రి: రామచంద్రరావు పు 12 అనంతపురం ధర్మవరం కొత్త సరోజ భర్త: కొత్త శ్రీరాములు స్త్రీ తొగట/తొగట వీరక్షత్రియ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 ప్రకాశం కనిగిరి సిగ ఆదిలక్ష్మి స్త్రీ 2 చిత్తూరు మదనపల్లి శీలం రమణమ్మ భర్త: రమేష్బాబు స్త్రీ 3 చిత్తూరు చంద్రగిరి ఆర్ మమత స్త్రీ 4 గుంటూరు తాడికొండ జోసెఫ్ పొలిశెట్టి తండ్రి: షోరీలు పు 5 అనంతపురం హిందూపురం ఉక్కశిల నాగజ్యోతి భర్త: రామకృష్ణారెడ్డి స్త్రీ 6 అనంతపురం గుంతకల్లు కె జ్యోతి స్త్రీ 7 అనంతపురం రాప్తాడు పూజారి ప్రభావతి భర్త: పూజారి రామ్మోహన్ స్త్రీ 8 వైఎస్సార్ కడప కమలాపురం ఉలసల విజయలక్ష్మి తండ్రి : మడక వెంకటరమణ స్త్రీ 9 వైఎస్సార్ కడప జమ్మలమడుగు గుడ్డేటి పుష్పలత భర్త: నాగేంద్ర స్త్రీ 10 వైఎస్సార్ కడప ప్రొద్దుటూరు చౌడం రవిచంద్ర పు 11 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఆత్మకూరు ముప్పూరి ఆదిలక్ష్మి భర్త: రమణయ్య స్త్రీ 12 కర్నూలు పాణ్యం పొలిశెట్టి శ్రీతులసి స్త్రీ కుర్ని/కరికాల భక్తులు కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం ఉరవకొండ గణప శ్రీమంజుల భర్త: గణప కోదండరామ్ స్త్రీ 2 అనంతపురం గుంతకల్లు సూత్రాయె రఘునాధకుమారదత్తు పు 3 వైఎస్సార్ కడప రైల్వే కోడూరు శ్రావణి యనమల భర్త: శ్రీరామ్ప్రసాద్ యనమల స్త్రీ 4 కర్నూలు కర్నూలు హన్కాటి భవానీ స్త్రీ 5 కర్నూలు బనగానపల్లి మేటికాల శ్యామలాదేవి స్త్రీ 6 కర్నూలు ఆదోని జుజారే రాజేశ్వరిభాయి స్త్రీ 7 కర్నూలు కోడుమూరు సీవీ కృష్ణవేణి స్త్రీ 8 చిత్తూరు శ్రీకాళహస్తి ఎం వాణి స్త్రీ 9 పశ్చిమ గోదావరి అచంట అండె నాగబసవన్న పు 10 పశ్చిమ గోదావరి నిడదవోలు కరెళ్ళ వెంకటసూర్యమంగాదేవి స్త్రీ 11 తూర్పు గోదావరి కనపర్తి పలటి అమ్మాజీ స్త్రీ 12 తూర్పుగోదావరి అమలాపురం ఆనంద్ సురపల్లి పు అత్యంత వెనుకబడిన కులాల కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం ధర్మవరం గుజ్జు రామాంజనేయులు తండ్రి: జి పెద్ద అప్పయ్య పు 2 అనంతపురం కదిరి టి గౌరీదేవి స్త్రీ 3 అనంతపురం ఉరవకొండ జోగి వెంకటేష్ తండ్రి: జోగి పెద్ద అంజినప్ప పు 4 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు రూరల్ అన్నపరెడ్డి శ్రీదేవి భర్త ఎ శేఖర్ స్త్రీ 5 ప్రకాశం కందుకూరు చిన్నకత్తుల వెంకటే శ్వర్లు పు 6 చిత్తూరు మదనపల్లి భోన్స్లే సురేష్రావు పు 7 చిత్తూరు పుంగనూరు తుంగా మంజునాథ్ పు 8 వైఎస్సార్ కడప మైదుకూరు గడ్డం భాగ్యలక్ష్మి భర్త :నైనేని రమేష్ స్త్రీ 9 కర్నూలు ఆదోని దొంగ్రే సలీమ్ పు 10 గుంటూరు వినుకొండ టి పేరంట్లమ్మ భర్త: తిరుమల ప్రభాకర్ స్త్రీ 11 ప్రకాశం కొండేపి పుట్టా వెంకట్రావు పు 12 పశ్చిమ గోదావరి దెందులూరు ప్రసాదపు వెంకటేశ్వరావు పు పోలినాటి వెలమ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విశాఖపట్నం గాజువాక వెలమల ఆదినారాయణ పు 2 విజయనగరం పార్వతీపురం బోరా శ్రీనివాసరావు తండ్రి బోరా మల్లేశ్వరరావు పు 3 శ్రీకాకుళం నర్సన్నపేట పట్టా జయశ్రీ భర్త: నారాయణరావు స్త్రీ 4 పశ్చిమ గోదావరి ఉండి తంగి పుష్కరరావు పు 5 తూర్పు గోదావరి కాకినాడ వి మల్లేశ్వరరావు తండ్రి: రమణమూర్తి పు 6 శ్రీకాకుళం ఎచ్చెర్ల నక్కా కృష్ణమూర్తి పు 7 శ్రీకాకుళం రాజాం కింజరాపు పద్మావతి భర్త : సురేష్ స్త్రీ 8 శ్రీకాకుళం టెక్కలి దుంగ సిమ్మన్న తండ్రి దుంగ (లేటు) పు 9 శ్రీకాకుళం ఇచ్చాపురం గోరిబిద్ది పూజిత భర్త: హరీష్ స్త్రీ 10 శ్రీకాకుళం పాతపట్నం గంగు పద్మావతి భర్త: వాసుదేవరావు స్త్రీ 11 శ్రీకాకుళం శ్రీకాకుళం గంగు శారద భర్త: భాస్కర్రావు స్త్రీ 12 శ్రీకాకుళం టెక్కలి పంగా దాస్ తండ్రి : భాస్కర్రావు పు వడ్డీలు కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 ప్రకాశం కొండేపి యనమాల మాధవి స్త్రీ 2 చిత్తూరు జిడి నెల్లూరు ఎ మనోహర్ పు 3 చిత్తూరు కుప్పం పెద్దన్న పు 4 చిత్తూరు పూతలపట్టు జె మొగిలీశ్వర్ పు 5 తూర్పు గోదావరి రాజా నగరం జి సుజాత భర్త: జి దామోదరరావు పు 6 పశ్చిమ గోదావరి ఉంగుటూరు భలే నాగలక్ష్మి స్త్రీ 7 పశ్చిమ గోదావరి దెందులూరు మండల కొండలరావు పు 8 పశ్చిమ గోదావరి దెందులూరు ఎం కరుణకుమారి స్త్రీ 9 పశ్చిమ గోదావరి దెందులూరు భలే జయలక్ష్మి స్త్రీ 10 పశ్చిమ గోదావరి దెందులూరు ముంగర కరుణ కుమారి స్త్రీ 11 పశ్చిమ గోదావరి దెందులూరు గంటసాల ప్రభాకర్రావు పు 12 వైఎస్సార్ కడప రాయచోటి వల్లెపు కవిత భర్త : వల్లెపు నగేష్ స్త్రీ భట్రాజ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం పుట్టపర్తి ఎస్ మధుసూదన్రాజు తండ్రి: ఇందుకూరి రాజు పు 2 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఉదయగిరి అల్లూరి రాజు పు 3 విశాఖపట్నం విశాఖ నార్త్ నిడుమోలి రవికుమార్ తండ్రి : నిడుమోలి జనన్నాదరాజు పు 4 కృష్ణా మైలవరం పి పద్మావతి స్త్రీ 5 పశ్చిమ గోదావరి పోలవరం చింతా శ్రీదేవి స్త్రీ 6 తూర్పు గోదావరి కనపర్తి షన్ముగ నాగ వీర రాఘవ చిట్టి ఆనందరాజు పు 7 గుంటూరు గుంటూరు వెస్ట్ కూరపాటి రామరాజు పు 8 గుంటూరు తెనాలి రాళ్లబండి సుష్మ భర్త: కృష్ణకిశోర్రాజు స్త్రీ 9 కర్నూలు పాణ్యం పి అనంతలక్ష్మి స్త్రీ 10 ప్రకాశం అద్దంకి చక్రవారం జ్యోతి స్త్రీ 11 వైఎస్సార్ కడప రాజంపేట పి రామ్మోహన్రాజు పు 12 వైఎస్సార్ కడప రాజంపేట పి రామ్మోహన్రాజు తండ్రి : పి రామరాజు పు కృష్ణ బలిజ/పూసల కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 వైఎస్సార్ కడప కడప పి విజయకుమారి భర్త: పి మనోజ్కుమార్ స్త్రీ 2 వైఎస్సార్ కడప ప్రొద్దుటూరు తుపాకుల వెంకటరమణ తండ్రి: టి పెద్దసుబ్బారాయుడు పు 3 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సూళ్లూరుపేట (ఎస్సీ) తుపాకుల ప్రసాద్ పు 4 కృష్ణా జగ్గయ్యపేట సీహెచ్ కుమారి స్త్రీ 5 కృష్ణ నందిగామ వీసం దుర్గారావు పు 6 పశ్చిమ గోదావరి పోలవరం వీసం రఘురామ్ పు 7 తూర్పు గోదావరి కొత్తపేట నలుబోలు సత్యనారాయణ పు 8 గుంటూరు తెనాలి కావేటి నిర్మల భర్త: ఈశ్వరరావు స్త్రీ 9 గుంటూరు రేపల్లె అన్నం నరసింహారావు పు 10 ప్రకాశం అద్దంకి అన్నం పూర్ణసాయి స్త్రీ 11 ప్రకాశం కందుకూరు పాశం కుమారి స్త్రీ స్త్రీ 12 ప్రకాశం ఒంగోలు తిలక శ్రీనివాసరావు పు మేదర కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విశాఖపట్నం విశాఖ సౌత్ రొట్టా మోహన్బాబు తండ్రి: రొట్టా రమణ పు 2 శ్రీకాకుళం పాలకొండ గండి దుర్గమ్మ భర్త: గండి శ్రీనివాసరావు స్త్రీ 3 పశ్చిమ గోదావరి తనుకు కాపెల్లి వెంకటేశ్వరరావు పు 4 తూర్పు గోదావరి ప్రతిపాడు పిల్లి పార్వతి స్త్రీ 5 కర్నూలు శ్రీశైలం తంగుటూరి గౌరీదేవి స్త్రీ 6 గుంటూరు తాడికొండ డి ధనలక్ష్మి భర్త: నాగేశ్వరరావు స్త్రీ 7 గుంటూరు తెనాలి వీర రామారావు పు 8 అనంతపురం పెనుగొండ ఎం రమాదేవి భర్త: శంకరప్ప స్త్రీ 9 అనంతపురం ధర్మవరం తమ్మినేని మేదరి రాఘవేంద్ర తండ్రి: టీఎం ముత్యాలప్ప పు 10 ప్రకాశం పర్చూరు శిరిగిరి పద్మ స్త్రీ 11 వైఎస్సార్ కడప కడప ఆర్ల వెంకటమ్మ స్త్రీ 12 చిత్తూరు మదనపల్లి టి సుజాత భర్త: సుబ్రమణ్యం స్త్రీ అరెకటిక/కటిక కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 వైఎస్ఆర్ కడప ప్రొద్దుటూర్ ధరంకరి ఉమామహేశ్వరి భర్త: రమణ స్త్రీ 2 ప్రకాశం మార్కాపురం సెవ్వని వెంకమ్మ స్త్రీ 3 కృష్ణా - ఎస్. నరేశ్ పు 4 తూర్పు గోదావరి రంపచోడవరం ఆరవ రామ రావు పు 5 గుంటూర్ మంగళగిరి కోవెలకరు శివరాంబాబాజీ తండ్రి: నాగోజీ పు 6 అనంతపురం అనంతపూర్ అర్బన్ కే. దీపికాభాయ్ స్త్రీ 7 అనంతపురం రాయదుర్గం కే. లక్ష్మీదేవి భర్త: కే. పధ్వీ రాజ్ స్త్రీ 8 అనంతపురం అనంతపూర్ అర్బన్ కే. లక్ష్మీభాయ్ భర్త: నాగేంద్ర రావు స్త్రీ 9 కర్నూల్ ఆదోని ఎల్కే మస్తాన్ పు 10 కర్నూల్ మంత్రాలయం కటిక తెహసీన్ తేజ్ స్త్రీ 11 కర్నూల్ కర్నూల్ కటికె గౌతమ్ పు 12 కర్నూల్ పాణ్యం ఘోడెకరి విధ్యాసాగర్ పు పెరిక కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విజయనగరం పార్వతిపురం నరహరశెట్టి స్రినివస రావు తండ్రి: సూర్యనారాయణ(లేటు) పు 2 ప్రకాశం ఎస్.ఎన్. పాడు పిట్టల శ్రీదేవి స్త్రీ 3 కష్ణ మచిలీపట్నం ఎన్. గాయత్రి దేవి భర్త: ప్రసాద్ రావు స్త్రీ 4 కష్ణ నూజివీడు ఏ. పార్వతి స్త్రీ 5 పశ్చిమ గోదావరి పోలవరం యెర్ర వాణి స్త్రీ 6 తూర్పు గోదావరి రాజానగరం మేకల నందిని భర్త: ఈశ్వర రావు స్త్రీ 7 తూర్పు గోదావరి జగ్గంపేట సింగం సూర్య కుమారి స్త్రీ 8 గుంటూరు ప్రత్తిపాడు బెరి సూర్య వరలక్ష్మి స్త్రీ 9 గుంటూరు మంగళగిరి కటిక మల్లేశ్వరి భర్త: మల్లికార్జున రావు స్త్రీ 10 గుంటూరు వినుకొండ బట్టి గురవయ్య పు 11 చిత్తూరు చంద్రగిరి బాల శేంఖర్ పు 12 విశాఖపట్నం విశాఖపట్నం ఉత్తరం దిద్ది త్రివేణి భర్త: రమేశ్ కుమార్ స్త్రీ కుంచిటి వక్కలింగ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం మడకసిర(ఎస్సి) జి. రాజేశ్వరి భర్త: డి. శెంకర్ రెడ్డి స్త్రీ 2 అనంతపురం మడకసిర(ఎస్సి) డాక్టర్ డి. దేవరాజ్ తండ్రి: రంగన్న పు 3 అనంతపురం మడకసిర(ఎస్సి) ఈ. నాగరాజు గౌడ్ తండ్రి: రంగే గౌడ్(లేటు) పు 4 అనంతపురం మడకసిర(ఎస్సి) ఎస్హెచ్.ఎరక్యతప్ప తండ్రి: డిఎస్ వీరప్ప పు 5 అనంతపురం మడకసిర(ఎస్సి) ఎస్. నాగన్న తండ్రి: హనుమంతరాయప్ప పు 6 అనంతపురం మడకసిర(ఎస్సి) ఆర్. గఘన భర్త: తంవీర్ గౌడ్ స్త్రీ 7 అనంతపురం మడకసిర(ఎస్సి) బి. నీరవతి భర్త: భూపన్న స్త్రీ 8 అనంతపురం మడకసిర(ఎస్సి) ఆర్ఎన్ అనిత భర్త: వేణు ప్రకాష్ స్త్రీ 9 అనంతపురం మడకసిర(ఎస్సి) కే. అన్నపూర్ణమ్మ భర్త: కే. శివకుమార్ స్త్రీ 10 అనంతపురం మడకసిర(ఎస్సి) బిఆర్ నాగలక్ష్మమ్మ భర్త: చిక్కన్న స్త్రీ 11 అనంతపురం మడకసిర(ఎస్సి) సుజాత భర్త: పరమేశ్వరప్ప స్త్రీ 12 చిత్తూరు కుప్పం విశాలాక్షి స్త్రీ సూర్య బలిజ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 పశ్చిమ గోదావరి ఏలూరు బి రాధయ్య నాయుడు పు 2 గుంటూరు గుంటూరు వెస్ట్ డాక్టర్ చదలవాడ రవీంద్రనాథ్ తండ్రి: జగన్నాదం పు 3 గుంటూరు గుంటూరు ఈస్ట్ చదలవాడ వేణుబాబు తండ్రి: రైతుబాబు పు 4 గుంటూరు నర్సరావుపేట శిద్దాబత్తుని నాగత్రివేణి భర్త జనకిరామయ్య స్త్రీ 5 గుంటూరు మాచర్ల పల్లా అంజిబాబు తండ్రి : పల్లా ఆంజనేయులు పు 6 ప్రకాశం పర్చూరు శిద్దాబత్తుని ఇంద్రజ స్త్రీ 7 ప్రకాశం ఒంగోలు దాసరి కరుణాకర్ పు 8 తూర్పు గోదావరి పి గన్నవరం మద్దల వరలక్ష్మి స్త్రీ 9 తూర్పు గోదావరి రాజోలు కోటిపల్లి ఎస్తేరురాణి భర్త: నాగేశ్వరరావు పు 10 తూర్పు గోదావరి ముమ్మిడివరం కలె రాజాబాబు పు 11 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్ కలే రాజేశ్వరరావు పు 12 విశాఖపట్నం విశాఖ ఈస్ట్ మద్దుల ఛాయాదేవి భర్త: వీరభద్రరావు స్త్రీ ముదలియార్ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సూళ్లూరు పేట కరీంభాయ్ చెంచు సుబ్రమణ్యం పు 2 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సూళ్లూరు పేట మంగనెల్లూర్ వీరరాఘవన్ పు 3 చిత్తూరు చిత్తూరు జ్నాన జగదీష్ పు 4 చిత్తూరు జిడి నెల్లూరు పి సుగుణమ్మ స్త్రీ 5 చిత్తూరు మదనపల్లి బీఆర్ సెల్వి స్త్రీ 6 చిత్తూరు జీడీ నెల్లూరు ఎస్ గుణశేఖర్ పు 7 చిత్తూరు శ్రీకాళహస్తి ఎల్ శాంతి స్త్రీ 8 చిత్తూరు నగరి ఈవీ బాలకృష్ణ పు 9 చిత్తూరు సత్యవేడు జి కల్పన స్త్రీ 10 చిత్తూరు చిత్తూరు బి కోటేశ్వరరావు పు 11 చిత్తూరు పుంగనూరు ఎస్ మురుగప్పు ముదలి పు 12 చిత్తూరు చిత్తూరు ఎన్ చిత్ర స్త్రీ చెత్తాడ శ్రీవైష్ణవ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 కర్నూలు పాణ్యం పూజారి వెంకట శైనత్ భర్త: పూజారి సత్యనారాయణ పు 2 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్ అక్షపాత్ర వేణుమాధవి స్త్రీ 3 విశాఖపట్నం గాజువాక పరాంకుశం ప్రమీళ భర్త : నరసింహమూర్తి పు 4 విశాఖపట్నం పెందుర్తి మంగవల్లి వెంకట తాయారు భర్త: ఎం వెంకట వరాహ రామానుజయ్య స్త్రీ 5 విశాఖపట్నం అనకాపల్లి తొండ గీతాంజలి భర్త : వెంకట నారాయణమూర్తి స్త్రీ 6 విశాఖపట్నం విశాఖపట్నం దాస్యం వామనాచారి తండ్రి : రామానుజయ పు 7 శ్రీకాకుళం - దాస్యం లక్ష్మి భర్త :నారాయస్వామి స్త్రీ 8 శ్రీకాకుళం ఇచ్చాపురం కేశవపట్నం రామీజీ పు 9 కృష్ణా గుడివాడ టి సీతారావమ్మ భర్త : వెంకటరమణ కుమార్ స్త్రీ 10 చిత్తూరు తంబళ్ళపల్లి ఎం సింగరయ్య పు 11 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు సిటీ పురణం లోకేష్ పు 12 గుంటూరు గుంటూరు ఈస్ట్ వి మధుసూదన్రావు పు శిష్టకరణం కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విజయనగరం బొబ్బిలి పక్కి రామకృష్ణ పు 2 విజయనగరం గజపతి నగరం గట్టిపల్లి శారద భర్త : జగన్నాదరావు స్త్రీ 3 శ్రీకాకుళం నర్సన్నపేట సదాశివుని కృష్ణ పు 4 శ్రీకాకుళం రాజాం ఉరిటి అప్పారావు పు 5 శ్రీకాకుళం ఆముదాల వలస జగదీశ్వరి భర్త : కృష్ణమూర్తి స్త్రీ 6 శ్రీకాకుళం టెక్కలి డబ్బరు అలేఖ్య భర్త: అమర్నా«ద్ స్త్రీ 7 శ్రీకాకుళం ఎచ్చెర్ల వడ్రంగి అరుణకుమారి భర్త : కృష్ణదాస్ స్త్రీ 8 విశాఖపట్నం బీమిలి కంఠిమహంతి చంద్రమౌళి పు 9 విశాఖపట్నం యలమంచిలి ఖస్ప రవికుమార్ తండ్రి :అప్పల నరసింహం పు 10 విశాఖపట్నం విశాఖ ఈస్ట్ పొత్తుమహంతి నాగమణి స్త్రీ 11 విశాఖపట్నం విశాఖ వెస్ట్ ఓటపల్లి రాధ స్త్రీ 12 తూర్పు గోదావరి కాకినాడ దండుమహొంతి లక్ష్మణరావు పు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం కళ్యాణదుర్గం పి శివప్రసాద్ పు 2 అనంతపురం రాయదుర్గం ఎల్ పుష్పవతి భర్త : లోకేష్ స్త్రీ 3 అనంతపురం రాయదుర్గం ఆకుల లింగేశ్వరి స్త్రీ 4 అనంతపురం రాయదుర్గం ముద్దప్ప గోవిందరాజులు పు 5 అనంతపురం ఉరవకొండ దండె సులోచన స్త్రీ 6 అనంతపురం గుంతకల్ పాటిల్ యుగంధర్రెడ్డి పు 7 కర్నూలు ఆదోని డి మంజుల స్త్రీ 8 కర్నూలు ఆలూరు మంజుల స్త్రీ 9 కర్నూలు మంత్రాలయం ఎన్ సుమంగళ స్త్రీ 10 కర్నూలు కోడుమూరు ఆకుల నాగమణి స్త్రీ 11 కర్నూలు పాణ్యం నల్లబోలు గోపాలరెడ్డి పు 12 చిత్తూరు పుంగనూరు డి శోభ స్త్రీ కురకుల/పొందర కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం ధర్మవరం కురకుల లక్ష్మి భర్త: నాగరాజు స్త్రీ 2 విజయనగరం బొబ్బిలి కొత్తమామిడి పార్వతి భర్త: కొత్తమామిడి స్త్రీ 3 విజయనగరం సాలూరు కోట పెద రాములు తండ్రి: కోట సారయ్య పు 4 విజయనగరం పార్వతిపురం పతిని తిరుపతి రావు తండ్రి: భీమయ్య పు 5 విజయనగరం పార్వతిపురం కర్రీ రమణమ్మ భర్త: కర్రీ కూర్మరావు స్త్రీ 6 శ్రీకాకులం ఇచ్చాపురం పి. సంతోషి స్త్రీ 7 శ్రీకాకులం పాలకొండ తుముల లక్ష్మణ రావు తండ్రి: సత్యం(లేటు) పు 8 శ్రీకాకులం రాజాం కర్రీ సుగుణ భర్త: నారాయణ రావు స్త్రీ 9 శ్రీకాకులం ఎట్చర్ల గంగాధర్ సింహాచలం పు 10 శ్రీకాకులం టెక్కలి పొండర దేవి స్త్రీ 11 శ్రీకాకులం నరసన్నపేట అదికారాల సాంబ మూర్తి తండ్రి: కూర్మయ్య పు 12 విశాఖపట్నం విశాఖపట్నం కోట ఆనంద్ ప్రసాద్ తండ్రి: ఇగ్నటియస్ పు అయ్యారక కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 విశాఖపట్నం విశాఖ నార్త్ పాండవ భారతి స్త్రీ 2 విశాఖపట్నం విశాఖ ఈస్ట్ కంత్రెడ్డి రమన్నపాత్రుడు పు 3 విశాఖపట్నం నర్సీపట్నం కర్రి కనకమహాలక్ష్మి స్త్రీ 4 విశాఖపట్నం నర్సీపట్నం కర్రి రమణబాబు పు 5 విశాఖపట్నం గాజువాక దన్నిన ఈశ్వర వెంకట అప్పారావు పు 6 విజయనగరం శృంగవరపు కోట కర్రి శ్రీనివాసరావు పు 7 విజయనగరం శృంగవరపు కోట పి శివపార్వతి స్త్రీ 8 విజయనగరం శృంగవరపు కోట లెంకా లక్ష్మి స్త్రీ 9 విజయనగరం కురుపాం గవర విజయ చంద్రశేఖర్రావు పు 10 విశాఖపట్నం పెందుర్తి గనిశెట్టి కనకారావు పు 11 తూర్పు గోదావరి రాజానగరం ఆవల సతీష్ పు 12 తూర్పు గోదావరి రాజమండ్రి అర్బన్ లంకా అనంత నాగ ప్రసాద్ పు బొందిలి కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 ఎస్పిఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు సిటి జేపి కస్తూరి పు 2 ఎస్పిఎస్ఆర్ నెల్లూరు కావాలి నాగమనిభాయ్ స్త్రీ 3 ఎస్పిఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు రూరల్ రాణిగ్రామ్ కోటే సింగ్ పు 4 ఎస్పిఎస్ఆర్ నెల్లూరు నెల్లూరు రూరల్ ఇండ్లూరి మహేశ్వరి భాయ్ భర్త: మహేష్ సింగ్ స్త్రీ 5 వైఎస్ఆర్ కడప ప్రొద్దుటూర్ రాజపుత్ర రజని భర్త: గోవింద్ సింగ్ స్త్రీ 6 గుంటూరు గుంటూరు పడమర బొందిలి నాగ బాల త్రిపుర సుందరి భాయ్ స్త్రీ 7 గుంటూరు గుంటూరు పడమర రాథోడ్ ఝాన్సీ లక్ష్మి భాయ్ భర్త: సుజన్ సింగ్ స్త్రీ 8 గుంటూర్ వినుకొండ రాజపుత్ర బాలాజి సింగ్ తండ్రి: నగ్మాల్ సింగ్ పు 9 తూర్పు గోదావరి పెద్దాపురం తోట సత్తిబాబు పు 10 కృష్ణా మచిలీపట్నం బి. సథ్యనరయన సింగ్ పు 11 కృష్ణా విజయవాడ సెంట్రల్ శైలజభాయ్ భర్త: యశ్వంత్ కష్ణా సింగ్ స్త్రీ 12 చిత్తూరు శ్రీ కాళహస్తి జి. సునీత భాయ్ భర్త: ఈశ్వర్ సింగ్ స్త్రీ అతిరాస కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 పశ్చిమ గోదావరి గోపాలపురం బుర్రి మంగతాయారు స్త్రీ 2 పశ్చిమ గోదావరి పోలవరం తేలె శ్రీనివాసరావు పు 3 పశ్చిమ గోదావరి పోలవరం శుక్లబోయిన గంగారావు పు 4 పశ్చిమ గోదావరి పోలవరం దుళ్ళి అచ్చియమ్మ స్త్రీ 5 పశ్చిమ గోదావరి గోపాలపురం తేలె వెంకటేశ్వరరావు పు 6 పశ్చిమ గోదావరి గోపాలపురం కొండకోట సత్యవతి స్త్రీ 7 పశ్చిమ గోదావరి గోపాలపురం చల్లా భవానీ స్త్రీ 8 పశ్చిమ గోదావరి కొవ్వూరు సంసాని రమేష్ పు 9 తూర్పు గోదావరి రంపచోడవరం దికొండ లక్ష్మీప్రసాద్ గంగాథర్రావు పు 10 తూర్పు గోదావరి రాజానగరం జక్కు లక్ష్మి స్త్రీ 11 తూర్పు గోదావరి జగ్గంపేట గంటా పద్మావతి స్త్రీ 12 గుంటూరు గురజాల ఎనుముల రాజ్యలక్ష్మి స్త్రీ నూర్బాషా/దూదేకుల కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం గుంతకల్లు పింజారీ వన్నూర్ వలి పు 2 అనంతపురం రాప్తాడు దూదేకుల అలిపీరా పు 3 విశాఖపట్నం విశాఖ వెస్ట్ షేక్ నాగూ నిషాబేగం (మున్నీ) స్త్రీ 4 విజయనగరం ఎస్ కోట షేక్ మదీనా స్త్రీ 5 ప్రకాశం అద్దంకి గుమ్మనపాటి ఖాదర్వలి పు 6 ప్రకాశం ఒంగోలు షేక్ షోఫియా స్త్రీ 7 చిత్తూరు చంద్రగిరి పి చోటీమాబీ స్త్రీ 8 వైఎస్సార్ కడప మైదుకూరు నొస్సాం పెద్ద దస్తగిరి పు 9 కర్నూలు బనగానపల్లి దూదేకుల మూర్తిజాబి స్త్రీ 10 తూర్పు గోదావరి పి గన్నవరం షేక్ మస్తాన్ సాహెబ్ పు 11 తూర్పు గోదావరి రంపచోడవరం షేక్ లాలూ పు 12 గుంటూరు గుంటూరు వెస్ట్ షేక్ జానీ పు దాసరి కార్పొరేషన్ నెం జిల్లా నియోజకవర్గం పేరు స్త్రీ/పు 1 అనంతపురం గుంతకల్లు కె అరుణమ్మ స్త్రీ 2 వైఎస్సార్ కడప రాజంపేట గోవిందు రాజేశ్వరి స్త్రీ 3 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సర్వేపల్లి ఇమిడిశెట్టి స్వాతి స్త్రీ 4 విశాఖపట్నం భీమిలి కల్లా గౌరి స్త్రీ 5 ప్రకాశం యర్రగొండపాలెం నిడిగంటి జయప్రకాష్ పు 6 చిత్తూరు పుంగనూరు తన్నీరు లక్ష్మమ్మ స్త్రీ 7 చిత్తూరు జీడీ నెల్లూరు టి సుమతి స్త్రీ 8 చిత్తూరు జీడీ నెల్లూరు జి గోవిందమ్మ స్త్రీ 9 విజయనగరం బొబ్బిలి రాముద్రిష్ట స్త్రీ 10 తూర్పు గోదావరి రాజానగరం పెద్దపాటి రమేష్బాబు పు 11 తూర్పు గోదావరి పిఠాపురం కుంచర్ల సత్యనారాయణ పు 12 గుంటూరు గుంటూరు వెస్ట్ కంకనాల జ్యోతి స్త్రీ యాత కార్పొరేషన్ డైరెక్టర్లు నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్ 1 శ్రీకాకుళం పాలకొండ చోడి సావత్రి మహిళ 2 శ్రీకాకుళం అరకు పోలవరపు అప్పారావు పురుషుడు 3 విశాఖపట్నం మాడుగుల సిమ్మ అప్పమ్మ పురుషుడు 4 విశాఖపట్నం గాజువాక అండిబోయిన లక్ష్మి మహిళ 5 విశాఖపట్నం భీమిలి బడితబోయిన రాములప్పడు పురుషుడు 6 విశాఖపట్నం విశాఖ సౌత్ బత్తిన పుష్పలత మహిళ 7 విశాఖపట్నం అనకాపల్లి నోట్ల శంకరరావు పురుషుడు 8 విజయనగరం గజపతినగరం కొలుసు రూపవతి మహిళ 9 విజయనగరం నెల్లిమర్ల చెల్లిబోయిన నరసింహారావు పురుషుడు 10 విజయనగరం శృంగవరపుకోట సిమ్మ నాగమణి మహిళ 11 విజయనగరం విజయనగరం గంపా అప్పలరాజు పురుషుడు 12 విజయనగరం బొబ్బిలి చుక్కా విష్ణు వందన మహిళ శ్రీశైన కార్పొరేషన్ డైరెక్టర్స్ నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్ 1 తూర్పుగోదావరి రాజమండ్రి రూరల్ లోడ నారాయణమ్మ మహిళ 2 పశ్చిమగోదావరి ఏలూరు కొప్పది సత్యనారాయణ పురుషుడు 3 పశ్చిమగోదావరి ఏలూరు కొప్పుల రంగబాబు పురుషుడు 4 విశాఖపట్నం బీమిలి పందిరి నారాయణమ్మ మహిళ 5 విజయనగరం విజయనగరం గుజ్జల నారాయణరావు పురుషుడు 6 శ్రీకాకుళం ఆముదాలవలస పొలాకి నాగభూషణరావు పురుషుడు 7 శ్రీకాకుళం ఎచ్చెర్ల కళ్లేపల్లి తిరుపతిరావు పురుషుడు 8 శ్రీకాకుళం శ్రీకాకుళం దెవడ మోహనరావు పురుషుడు 9 శ్రీకాకుళం పాలకొండ డి.లలితకుమారి మహిళ 10 శ్రీకాకుళం నరసన్నపేట బొద్దంకి మహాలక్ష్మి మహిళ 11 శ్రీకాకుళం ఇచ్చంపేట మంగి ధనలక్ష్మి మహిళ 12 శ్రీకాకుళం ఆముదాలవలస పెద్ద రాజు మహిళ ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్స్ నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్ 1 వైఎస్సార్ కడప రాజంపేట దాసరి చిదానందగౌడ్ పురుషుడు 2 వెఎస్సార్ కడప కమలాపురం నందిమండలం క్రిష్ణయ్య పురుషుడు 3 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సర్వేపల్లి మాన్యం శివ కుసుమాంబ మహిళ 4 నెల్లూరు గూడూరు(ఎస్సీ) నాశిన అనిత మహిళ 5 కర్నూలు డోన్ తమటం ఈడిగ కేశవయ్యగౌడ్ పురుషుడు 6 కర్నూలు కర్నూలు గౌరీ డి దేదుల కల్పన మహిళ 7 అనంతపురం అనంతపురం అర్బన్ బి.శ్యామల మహిళ 8 అనంతపురం తాడిపత్రి ఈడిగ నల్లమ్మ మహిళ 9 అనంతపురం కదిరి జక్కల వినిత లక్ష్మి మహిళ 10 ప్రకాశం మర్కాపురం జూపల్లి ఏడుకొండలు పురుషుడు 11 చిత్తూరు పూతలపట్టు చెంగల్ రాయన్(ఎల్లప్ప) పురుషుడు 12 గుంటూరు వేమూరు పడమటి శ్రీనివాసరావు పురుషుడు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్ 1 ఎస్పీఆర్ నెల్లూరు నెల్లూరు సిటీ వెలూరు రఘురాం పురుషుడు 2 ప్రకాశం పర్చూరు కొల్లాటి ఏడుకొండలు పురుషుడు 3 కృష్ణా పెడన తిరుమాని శ్రీనివాసరావు పురుషుడు 4 శ్రీకాకుళం పలాస జుట్టు నీలకంఠం పురుషుడు 5 పశ్చిమగోదావరి ఆచంట సంగాని దుర్గ మహిళ 6 గుంటూరు బాపట్ల కొక్కిరిగడ్డ చెంచయ్య పురుషుడు 7 గుంటూరు పెదకూరపాడు ఎన్.శివయ్య పురుషుడు 8 గుంటూరు వేమూరు సెరు శ్రీనివాసరావు పురుషుడు 9 తూర్పుగోదావరి ముమ్మిడివరం కాటం కొయలక్ష్మి మహిళ 10 తూర్పుగోదావరి రాజోలు బొమ్మిడి నాలక్ష్మి మహిళ 11 తూర్పుగోదావరి అమలాపురం కర్రి వెంకటరామరాజు పురుషుడు 12 విశాఖపట్నం గాజువాక ఉద్ద జయలక్ష్మి మహిళ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్స్ నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్ 1 కర్నూలు కర్నూలు ఎం.శ్యామలకుమారి మహిళ 2 కర్నూలు నంద్యాల గిరిబోయిన చంద్రశేఖర్ పురుషుడు 3 చిత్తురు నగరి పి.రేణుక మహిళ 4 పశ్చిమగోదావరి పోలవరం తాతపూడి గుబ్బలి మహిళ 5 పశ్చిమగోదావరి తణుకు వాతాడ ఉమాశంకర్ మహిళ 6 గుంటూరు బాపట్ల మరం నాగరాజకుమారి మహిళ 7 అనంతపురం పుట్టపర్తి పీఎస్ తిప్పాంబ మహిళ 8 అనంతపురం హిందూపూర్ లక్ష్మీనారయణ పురుషుడు 9 అనంతపురం రాప్తాడు కెదారబోయిన రామణ పురుషుడు 10 వైఎస్సార్కడప కడప టీపీ వెంకట సుబ్బమ్మ మహిళ 11 వైఎస్సార్కడప రాయచోటి జి.ప్రమీలదేవి మహిళ 12 కృష్ణా మైలవరం లంకె దేవకుమారి మహిళ నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్స్ నెం జిల్లా నియోజకవర్గం పేరు జెండర్ 1 విశాఖపట్నం విశాఖ ఈస్ట్ బుగత లిఖిత మహిళ 2 విశాఖపట్నం విశాఖ నార్త్ హరి అనురాధ మహిళ 3 విశాఖపట్నం విశాఖ సౌత్ కనకాల ఈశ్వరరావు పురుషుడు 4 విజయనగరం విజయనగరం అవనపు ఈశ్వరరావు పురుషుడు 5 విజయనగరం సాలూరు జరజపు నీలిమ మహిళ 6 విజయనగరం నెల్లిమర్ల మద్దలా వాసు పురుషుడు 7 విజయనగరం చీపురుపల్లి రాళ్లపూడి గణపతి పురుషుడు 8 శ్రీకాకుళం శ్రీకాకుళం ఆశాదీపిక మహిళ 9 శ్రీకాకుళం పాలకొండ శివప్రసాదరావు పురుషుడు 10 శ్రీకాకుళం ఆముదాలవలస గంగిరెడ్ల ఉమాదేవి మహిళ 11 కృష్ణా విజయవాడ ఈస్ట్ వై.సుజాత మహిళ 12 కృష్ణా విజయవాడ సెంట్రల్ కెళ్ల ఆదినారాయణ పురుషుడు మొత్తం 56 బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల వివరాల కోసం ఆయా కార్పొరేషన్ల పేర్లపై క్లిక్ చేయండి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ల జాబితా 01. రజక కార్పొరేషన్ డైరెక్టర్లు 29. తొగట వీర కార్పొరేషన్ డైరెక్టర్లు 02. వాల్మికి కార్పొరేషన్ డైరెక్టర్లు 30. కుర్ణి కారికలాభక్తులు కార్పొరేషన్ డైరెక్టర్లు 03. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్లు 31. ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు 04. తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్లు 32. వడ్డెలు కార్పొరేషన్ డైరెక్టర్లు 05. మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్లు 33. పోలినాటి వెలమలు కార్పొరేషన్ డైరెక్టర్లు 06. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్లు 34 భట్రాజ్ కార్పొరేషన్ డైరెక్టర్లు 07. ముస్లిం సంచార కార్పొరేషన్ డైరెక్టర్లు 35. కృష్ణ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు 08. సగర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్లు 36. మేదర కార్పొరేషన్ డైరెక్టర్లు 09. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు 37. అరె కటిక కార్పొరేషన్ డైరెక్టర్లు 10. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు 38. పెరికె కార్పొరేషన్ డైరెక్టర్లు 11. వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లు 39. కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్లు 12. గౌడ కార్పొరేషన్ డైరెక్టర్లు 40. సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు 13. కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్లు 41. ముదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్లు 14. కొప్పుల_వెలమ కార్పొరేషన్ డైరెక్టర్లు 42. చాత్తాద శ్రీవైష్ణవ కులం కార్పొరేషన్ డైరెక్టర్లు 15. కురుబ కురుమ కార్పొరేషన్ డైరెక్టర్లు 43. శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్లు 16. వన్య కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు 44. వీరశైవ కార్పొరేషన్ డైరెక్టర్లు 17. కళింగ కార్పొరేషన్ డైరెక్టర్లు 45. కూరాకుల కార్పొరేషన్ డైరెక్టర్లు 18. గవర కార్పొరేషన్ డైరెక్టర్లు 46. బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్లు 19. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లు 47. అయ్యారక కార్పొరేషన్ డైరెక్టర్లు 20. గాండ్ల తెలికుల కార్పొరేషన్ డైరెక్టర్లు 48. అతిరస కార్పొరేషన్ డైరెక్టర్లు 21. ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్లు 49. నూర్ బాషా కార్పొరేషన్ డైరెక్టర్లు 22. నాగరాలు కార్పొరేషన్ డైరెక్టర్లు 50. దాసరి కార్పొరేషన్ డైరెక్టర్లు 23. శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు 51. యత కార్పొరేషన్ డైరెక్టర్లు 24. పాల ఏకిరి కార్పొరేషన్ డైరెక్టర్లు 52. శ్రీ శయన కార్పొరేషన్ డైరెక్టర్లు 25. కళింగ కోమటి కార్పొరేషన్ డైరెక్టర్లు 53. ఈడిగా కార్పొరేషన్ డైరెక్టర్లు 26. రెడ్డికా కార్పొరేషన్ డైరెక్టర్లు 54. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు 27. జంగం కార్పొరేషన్ డైరెక్టర్లు 55. బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు 28. దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్లు 56. నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్లు -
బీసీల పండుగ జరుపుకోవాలి
సాక్షి, అమరావతి: దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లను ఒకేసారి ఏర్పాటు చేయడాన్ని పురస్కరించుకుని మంగళవారం (ఈనెల 20వ తేదీ) వరకు రాష్ట్రంలోని బీసీలంతా ఉత్సవాలు జరుపుకోవాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా బీసీల పండుగకు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంకురార్పణ చేశారని పేర్కొంది. ఆదివారం పార్టీ జారీచేసిన ఒక సర్క్యులర్లో 56 కార్పొరేషన్ల ఏర్పాటు, అందులోనూ సగంమంది మహిళా నేతలకు అవకాశం కల్పించడం ఒక విప్లవాత్మకమైన చర్య అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. వట్టి మాటలే కాదు చేతల్లో కూడా.. ‘బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముకలాంటి వర్గాలు’ అని ముఖ్యమంత్రి సాహసోపేతంగా చేసి చూపించారని పేర్కొన్నారు. ఇది నిజమైన బీసీల ప్రభుత్వమని వెల్లడించే రీతిలో 139 కులాలకు ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. ఇప్పటికే బీసీ సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ప్రభుత్వం కేవలం 16 నెలల్లోనే పలు పథకాల ద్వారా 2,71,37,253 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.33,500 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 56 కార్పొరేషన్లను ప్రకటించడాన్ని పురస్కరించుకుని ఈనెల 20 వరకు పర్వదినాలుగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను అనుసరించి ప్రకటన వెలువడినప్పటి నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలు జరపాలని కోరారు. కోవిడ్ నిబంధనల మేరకు అందరూ భాగస్వాములయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. -
బీసీ కార్పొరేషన్ పాలక మండళ్ల ప్రకటన
-
56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..
సాక్షి, తాడేపల్లి : బీసీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడింది. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్కు చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కాగా, చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. (బీసీ కార్పొరేషన్లతో 728 మందికి పదవులు) ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లు 1. రజక: రంగన్న (అనంతపురం) 2. కురుబ : కోటి సూర్యప్రకాశ్ బాబు (అనంతపురం) 3. తొగట : గడ్డం సునీత (అనంతపురం) 4. కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం) 5. వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు) 6. పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు) 7. ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు) 8. ఈడిగ : కె.శాంతి (చిత్తూరు) 9. గాండ్ల : భవానీ ప్రియ (తూ.గో) 10. పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూ.గో) 11. అగ్నికుల క్షత్రియ: బందన హరి (తూ.గో) 12. అయ్యారక: రాజేశ్వరం (తూ.గో) 13. షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు) 14. వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు) 15. కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు) 16. కృష్ణ బలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు) 17. యాదవ: హరీష్కుమార్ (కడప) 18. నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప) 19. పద్మశాలీ: విజయలక్ష్మి (కడప) 20.నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్బి (కడప) 21. సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప) 22. విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా) 23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా) 24. వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా) 25. భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా) 26. వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు) 27. కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు) 28. వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు) 30. బెస్త : తెలుగు సుధారాణి (కర్నూలు) 31. ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు) 31. జంగం: ప్రసన్న (నెల్లూరు) 32. బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు) 33. ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు) 34. చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్కుమార్ (ప్రకాశం) 35. ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం) 36. దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం) 37. మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం) 38. కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం) 39. కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం) 40. రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం) 41. పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం) 42. కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం) 43. శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం) 44. మత్స్యకార : కోలా గురువులు (విశాఖ) 45. గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ) 46.నగరాల: పిల్లా సుజాత (విశాఖ) 47. యాత: పి.సుజాత (విశాఖ) 48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ) 49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం) 50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం) 51. శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం) 52 .దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం) 53. సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో) 54. శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో) 55. అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (ప.గో) 56. అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్ రావు (ప.గో) ఈ కార్పొరేషన్లకు గానూ 56 మంది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 672 మంది పదవులు చేపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదవులు దక్కని కులాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటి ద్వారా న్యాయం చేకూర్చింది. ► కులాల ప్రాతిపదికన ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కులాల జనాభా 500 కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 30 వేలకు తగ్గకుండా జనాభా ఉంటే బాగుంటుందని భావించి.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ► ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సహాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్ ఎండీకి ఇవ్వనుంది. ► జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం బీసీ కార్పొరేషన్లకుంది. ఎవరి ష్యూరిటీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ష్యూరిటీతో బీసీలకు ఈ సంస్థ రుణాలిస్తుంది. -
ఏపీలో కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. అలాగే ఈ నెల 18న బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం చేపట్టనుంది. చదవండి: దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వెనుకబడిన కులాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వేగంగా లబ్దిదారులకు అందేలా ఈ కార్పొరేషన్లు సహకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ 56 కార్పోరేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేసింది. జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్లోనూ 13 మంది డైరెక్టర్లను నియమిస్తామని పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్ల పరిధిలో మిగతా ఉపకులాలకూ ప్రాతినిధ్యం వస్తుందని స్పష్టం చేసింది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ 2.71 కోట్ల మందికి లబ్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీలకు రూ. 33,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఇంత భారీగా బీసీల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేదు. బీసీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో సగం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. -
బీసీ కార్పొరేషన్లతో 728 మందికి పదవులు
సాక్షి, అమరావతి: బీసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల ద్వారా 728 మంది బీసీలకు నామినేటెడ్ పదవులు దక్కనున్నాయి. ఈనెల 8న పదవులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించనున్నారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 52 కార్పొరేషన్లు ఏర్పాటు కాగా.. మరో నాలుగు కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్కు చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. ► 56 కార్పొరేషన్లకు గానూ 56 మంది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 672 మంది పదవులు అందుకోనున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదవులు దక్కని కులాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటి ద్వారా న్యాయం చేయబోతోంది. ► కులాల ప్రాతిపదికన ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కులాల జనాభా 500 కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 30 వేలకు తగ్గకుండా జనాభా ఉంటే బాగుంటుందని భావించి.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ► ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సహాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్ ఎండీకి ఇవ్వనుంది. ► జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం బీసీ కార్పొరేషన్లకుంది. ఎవరి ష్యూరిటీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ష్యూరిటీతో బీసీలకు ఈ సంస్థ రుణాలిస్తుంది. -
బీసీ కార్పొరేషన్లకు నేడు పదవుల ప్రకటన
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం బుధవారం చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ప్రకటించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీ మేరకు బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కార్పొరేషన్ల పదవులను ఖరారు చేసే బాధ్యతను పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలకు అప్పగించారు. వారు పలు దఫాలుగా కసరత్తు చేసి పేర్లను ఖరారు చేశారు. సాధ్యమైనన్ని బీసీ కులాలకు పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు సమాచారం. బీసీల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం ఏర్పాటైన 56 కార్పొరేషన్లలో చైర్మన్ పదవులు 29 మహిళలకు, 27 పురుషులకు దక్కే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. ► వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ కులాలకు కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. ► డైరెక్టర్ పదవుల్లో 50 శాతం మహిళలను నామినేట్ చేయనున్నారు. ► ప్రతి జిల్లాకు కనీసం 4 కార్పొరేషన్లకు తగ్గకుండా పదవులు కేటాయించారు. కొన్ని జిల్లాలకు 5, 6 పదవులను ఇవ్వబోతున్నట్లు తెలిసింది. -
తిలా పాపం.. తలా పిడికెడు!
ఒంగోలు: బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదరణ కార్యక్రమం కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగమైన కేసులో ఎట్టకేలకు పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇంకో మహిళ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కాకపోవడంతో ఆమెను అరెస్టు చేయలేదు. 2019 అక్టోబర్ 21న కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలోకి వెళ్తే.. నాగముని బీసీ కార్పొరేషన్ ఈడీగా బా«ధ్యతలు చేపట్టి రోజులు గడుస్తున్నా సిబ్బంది మాత్రం క్యాష్ బుక్ అందజేయడం లేదు. దీంతో ఆయన గట్టిగా ప్రశ్నించడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెక్కులు అయితే డ్రా చేశారని, వాటికి సంబంధించిన బిల్లులు అందజేయలేదని సెలవిచ్చారు. పెద్ద మొత్తంలో నిధులు డ్రా చేయాలంటే తప్పనిసరిగా ప్రొసీడింగ్స్ ఉండాలని, వాటిని చూపించాలని కోరారు. వాటిని కూడా చూపక పోవడంతో ఆయన కలెక్టర్, బీసీ కార్పొరేషన్ ఎండీ రామారావుకు ఫిర్యాదు చేశారు. నిధులు దుర్వినియోగమై ఉండొచ్చని భావించి ప్రధాన కార్యాలయంలో పనిచేసే జి.భీమశంకరరావును విచారణ చేయాలని ఈడీ కోరారు. దీంతో ఆయన జిల్లాకు చేరుకుని మొత్తం విచారించి రూ.50.10 లక్షలకు సంబంధించి ఎటువంటి లెక్కలు లేవని తేల్చారు. అదే నివేదికను ఆయన బీసీ కార్పొరేషన్ ఎండీకి అందజేశారు. కలెక్టర్కు ఆ నివేదికను పంపి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎండీ రామారావు నివేదిక ప్రకారం అప్పటి బీసీ కార్పొరేషన్ ఈడీగా ఉన్న నాగేశ్వరరావు పేరున రూ.9 లక్షలు, ఏఈవో అంబటి శ్రీనివాసరావు పేరున రూ.8.05 లక్షలు, డీబీ సీడబ్ల్యూవో పీవీ ఆంజనేయులు పేరున రూ.45 వేలు, జూనియర్ అసిస్టెంట్ (ఔట్ సోర్సింగ్) ఏడుకొండలు పేరున రూ.11,48,500, కాపు కార్పోరేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్) వి.రాజేష్ పేరున రూ.8.90 లక్షలు, మరో డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్) బీవై కమలేశ్వరరావు పేరున రూ.10,02,500లు, దోర్నాల మండలం యడవల్లికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ అలుగులు లక్ష్మయ్య పేరున రూ.1,24,500, అద్దంకికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసరావు పేరున రూ.95 వేలు చొప్పున చెక్కులు డ్రా అయ్యాయి. వీటికి సంబంధించిన బిల్లులు, ఓచర్లు అందజేయక పోవడంతో నిధులు దుర్వినియోగమైనట్లు భావించి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వీరితో పాటు అప్పట్లో మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తేళ్ల జాహ్నవి, గౌతమి, షేక్ జిలానీలపై కేసు నమోదు చేశారు. అరెస్టు ఇలా.. వీరంతా సోమవారం జాయింట్ కలెక్టర్ వద్దకు వచ్చారు. ఆయనతో మాట్లాడి కార్యాలయం నుంచి బయటకు రాగానే గతంలో కేసు నమోదైనందున తమ విచారణకు సహకరించాలని తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్ వారిని కోరారు. అనంతరం వారిని తాలూకా పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం అప్పటి ఈడీ అరపికట్ల నాగేశ్వరరావు, ఏఈవో అంబటి శ్రీనివాసరావు, పీట్ల వెంకట ఆంజనేయులు, ఏటి ఏడుకొండలు, బత్తినేని యోగిరుత్ కమలేశ్వరరావు, దోర్నాల మండలానికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ అలుగుల లక్ష్మయ్య, అద్దంకికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసరావు, ఒంగోలుకు చెందిన తేళ్ల జాహ్నవి, షేక్ జిలానీలను అరెస్టు చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడు రాజేష్ ఆచూకీ లభించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. అతని స్వస్థలం విజయనగరంగా చెబుతున్నారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. పదో నిందితురాలిగా పేర్కొన్న మరో ఉద్యోగిని గౌతమిపై ప్రాథమికంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రమేయం ఉన్నట్లు రూఢీ కాకపోవడంతో ఆమెను అరెస్టు చేయలేదని సీఐ లక్ష్మణ్ తెలిపారు. -
3 కేటగిరీలుగా బీసీ కార్పొరేషన్లు!
సాక్షి, అమరావతి: బీసీల్లో ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వారి సంక్షేమానికి భరోసా కల్పించాలని వైఎస్సార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులు, మంత్రులు ప్రతిపాదించారు. బీసీలకు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటులో జాప్యం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన అనంతరం వారంతా శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. బీసీల్లో జనాభాను అనుసరించి మూడు కేటగిరీలుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పది వేల జనాభాకు కార్పొరేషన్! బీసీల్లో సుమారు పది వేల జనాభా ఉన్న కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అంతకంటే తక్కువ జనాభా ఉన్న బీసీ కులాలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి కార్పొరేషన్ నియమిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఈ కార్పొరేషన్ల ద్వారా విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘బీసీల్లో 2,000 లోపు జనాభా ఉన్న కులాలు 81 వరకు ఉన్నాయి. జనాభా 500కి మించని బీసీ కులాలు కూడా ఉన్నందున మరీ తక్కువ జనాభా ఉన్న వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో అనుకున్న ప్రయోజనం నెరవేరదు. కార్పొరేషన్ ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉంది’ అని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. పది వేల లోపు జనాభా ఉన్న సంచార జాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాలకు సరైన ప్రాతినిథ్యం కల్పించి సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూతనివ్వటం కూడా చర్చకు వచ్చింది. బీసీ వర్గాలకు గృహ æనిర్మాణం, పెన్షన్లు, రేషన్ కార్డులతోపాటు కుల వృత్తులు చేపట్టేందుకు వీలుగా ఆర్థిక వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. బీసీలకు నామినేటెడ్ పనులు, పదవుల్లో సగం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసిన విషయం తెలిసిందే. త్వరలో విస్తృత సమావేశం బీసీల్లో అన్ని వర్గాల వారితో త్వరలోనే విస్తృత సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. బీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన ఇతర చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, అనిల్కుమార్, ధర్మాన కృష్ణదాస్, శంకర నారాయణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం హామీ మేరకు కార్యాచరణ మొదలైంది: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ ప్రారంభమైందని తెలిపారు. బీసీల సంక్షేమానికి సీఎం కట్టుబడి ఉన్నారని చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం 136 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయని, సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. బీసీ కార్పొరేషన్లకు సంబంధించి త్వరలోనే మరోసారి విస్తృత సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రతిపాదనలు ఇవీ - బీసీల్లో 10,000 – 1,00,000 జనాభా ఉన్న కులాలను ఒక కేటగిరీగా పరిగణించాలి. - లక్ష నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న బీసీ వర్గాలను రెండో కేటగిరీగా గుర్తించాలి. - 10 లక్షలు, ఆపైన జనాభా ఉన్న బీసీ వర్గాలను మూడో కేటగిరీగా విభజించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. -
సబ్సిడీ రుణాలకు 20 లక్షలకు పైగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాల కోసం ఈ ఏడాది మొత్తం 20,67,509 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన గడువు ఈనెల 10వ తేదీ ఆదివారంతో ముగిసింది. మొత్తం 1,94,582 మందికి రుణాలివ్వాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సర్కారుకు 20లక్షలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ మొత్తం దరఖాస్తులు ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టం (ఓబీఎంఎంఎస్) ద్వారా 20 కార్పొరేషన్లకు దరఖాస్తులు అందాయి. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఎంబీసీ, క్రిస్టియన్ మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగుల కార్పొరేషన్తో పాటు మరికొన్ని ఉన్నాయి. ప్రధానంగా బీసీ కార్పొరేషన్కు 6,93,914 దరఖాస్తులు, ఎస్సీ కార్పొరేషన్కు 3,07,473, కాపు కార్పొరేషన్కు 2,08,007, మైనార్టీ కార్పొరేషన్కు 2,56,922 దరఖాస్తులు వచ్చాయి. కాగా, మండల స్థాయిలో ఎంపీడీఓలతో ప్రభుత్వం నియమించిన కమిటీలు.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మునిసిపల్ కమిషనర్లతో నియమించిన కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.3,405.79 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలివ్వనుంది. ఇందులో సబ్సిడీ కింద రూ.1,678.50 కోట్లు ఇవ్వనుంది. -
గుంటూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, గుంటూరు : మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాం బాబు (72) అనారోగ్యంతో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన బీసీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అలాగే 1985, 1994లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా జయరాం బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా జయరాం బాబు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. చదలవాడకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
టీడీపీ నేత దా‘రుణం’
సాక్షి, సంతబొమ్మాళి: అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు అవినీతిలో తమ నైజాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శించి అందినంత దోచుకున్నారు. అధికారం తమ చేతుల్లో ఉంది... అడిగేవారెవరన్నట్టు బరితెగించి స్వాహా చేశారు. ఆనాటి అన్యాయాలు ఇప్పటికీ ప్రజలను పీడించుకు తింటున్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త, జన్మభూమి కమిటీ సభ్యుడైన ఓ టీడీపీ నేత మరొకరి పేరిట బీసీ కార్పొరేషన్ రుణాన్ని తీసుకొని అనుభవించిన వైనం బయట పడింది. వివరాల్లోకి వెళితే... సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన గిన్ని కోటేష్ అనే నిరుద్యోగి ఈ నెల 12న బీసీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేయడానికి మీ–సేవా కేంద్రానికి వెళ్లాడు. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రయత్నించగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయలు మంజూరైనట్లు చూపడంతో అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని తన తండ్రి నూకరాజుకు చెప్పగా... ‘నీవు విదేశాల్లో ఉన్న సమయంలో టీడీపీ నేతకు చెందిన బంధువు ఒకరు వచ్చి నీ కుమారుడి పేరున బీసీ కార్పొరేషన్ రుణం మంజూరు చేయిస్తానని 7 వేల రూపాయల నగదు, ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకున్నారని, ఇంత వరకు రుణానికి సంబంధించిన నగదు ఇవ్వలేద’ని తండ్రి నూకరాజు చెప్పారు. దీంతో కోటేష్ సదరు టీడీపీ నేతను బీసీ కార్పొరేషన్ రుణం కోసం అడుగగా.. కొంత సమయం కావాలని చెప్పి వాయిదాలు వేయడంతో బాధితుడు విసుగుచెందాడు. దీంతో నేరుగా కోటబొమ్మాళి కో ఆపరేటివ్ బ్యాంకుకు వెళ్లి బ్యాంకు మేనేజర్తో జరిగిన విషయాన్ని కోటేష్ వివరించాడు. దానికి సంబంధించిన ఫైలు తెప్పించి పరిశీలించగా, 2018 డిసెంబర్ 4న బీసీ కార్పొరేషన్ రుణం కింద లక్ష రూపాయల రుణంలో 50 వేల రూపాయల సబ్సిడీ ఉందని.. రుణం ఖాతా నంబరు 010453680000970 అని తెలిపా రు. ‘ఫైలు, చెక్కు పై నీ సంతకాలు ఉన్నాయ’ని బ్యాంకు మేనేజర్ చెప్పగా ఆ సమయంలో తాను సౌతాఫ్రికాలో (విదేశం) పని చేస్తున్నానని, తన సంతకాలు ఫోర్జరీ చేసి రుణం మొత్తం కాజేశారని కోటేష్ సమాధా నం ఇచ్చాడు. బ్యాంకు రుణం పుస్తకాలు సైతం తన వద్ద లేవని ఎవరి వద్ద ఉన్నాయో అంతు చిక్కడం లేదని బదులిచ్చాడు. ఇదిలా ఉంటే ఈ విషయం బయటకు చెబితే మరోలా ఉంటుందని సదరు టీడీపీ నేత బెదిరించడం కొసమెరుపు. ‘సాక్షి’ ఆనాడే చెప్పింది... సంతబొమ్మాళి మండలంలో బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ‘సాక్షి’ పత్రికలో గతంలో కథనాలు వచ్చాయి. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండడంతో అధికారులు సైతం నోరుమెదపలేని పరిస్థితి చోటు చేసుకుంది. సదరు టీడీపీ నేత బీసీ కార్పొరేషన్ రుణాలను భారీగా దోచుకున్నారని సొంత పార్టీ నేతలే అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో అడ్డుకట్ట వేయకపోవడంతో అవినీతికి అంతు లేకుండా పోయింది. బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో ఉన్నతాధికారులు విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయట పడతాయని స్థానికులు అంటున్నారు. విదేశాల్లో ఉంటే రుణం ఎలా ఇచ్చారు? నేను సౌతాఫ్రికాలో 2018 ఆగస్టు నుంచి 2019 ఫిబ్రవరి 2 వరకు ఆరు నెలల పాటు పనిచేశాను. ఆ సమయంలో బ్యాంకు అధికారులు రుణం ఏ విధంగా మంజూరు చేసి ఇచ్చారో వారే సమాధానం చెప్పాలి. ఫైలు, చెక్కులపై నా సంతకాలు ఫోర్జరీ చేసి దోచుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. –గిన్ని కోటేష్, బాధితుడు, నౌపడ, సంతబొమ్మాళి మండలం బాధ్యులపై చర్యలు తప్పవు ఈ విషయం నా దృష్టికి ఇంతవరకు రాలేదు. సోమవారం డీసీసీబీ బ్యాంకుకు సిబ్బందిని పంపి వివరాలు సేకరించి విచారణ చేపడతాం. తప్పని తేలితే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవు. –రాజారావు, బీసీ కార్పొరేషన్ ఈడీ, శ్రీకాకుళం -
బీసీ కార్పొరేషన్లో భారీ కుంభకోణం
సాక్షి, ఒంగోలు టూటౌన్: జిల్లాలోని బీసీ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు బరితెగించారు. ఏకంగా రూ.50 లక్షలకు పైగా ఆదరణ పథకం సొమ్మును అప్పనంగా కాజేశారు. కార్యాలయ అధికారులు, ఉద్యోగులు అందరూ కుమ్మక్కై భారీ కుంభకోణానికి తెరలేపారు. ఈ అవినీతికి గతంలో బీసీ కార్పొరేషన్ ఈడీగా పనిచేసిన ఎ.నాగేశ్వరరావు సూత్రధారిగా పనిచేశారు. జిల్లా బీసీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను సూచాయగా సమాచారం తెలుసుకున్న ఆ శాఖ ఉన్నతాధికారులు కార్పొరేషన్ (విజయవాడ) హెడ్ ఆఫీసు నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ జి.బీమా శంకరరావుని గత నెల 31న విచారణకు పంపారు. విచారణలో ఆదరణ సొమ్మను బొక్కేశారని తేలింది. అనంతరం ఈ నివేదికను జిల్లా కలెక్టర్కు అందించారు. దీంతో సొమ్ము స్వాహా చేసేందుకు తోడ్పడిన ఉద్యోగులందరినీ తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తొలగించిన వారిలో ఆరుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వై. ఏడుకొండలు (జూనియర్ అసిస్టెంట్), వి.రాజేష్ (డేటా ఎంట్రీ ఆపరేటర్), బి.వై. కమలేశ్వరరావు (డేటా ఎంట్రీ ఆపరేటర్), సీనియర్ అసిస్టెంట్లు అయిన టి.జాహ్నవి, బి.గౌతమి, ఆఫీసు సబార్టినేట్ అయిన ఎస్కె జిలానీ ఉన్నారు. వీరంతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావడం గమనార్హం. వీరితో పాటు కార్యాలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈవో) ఎ.శ్రీనివాసరావుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సొమ్ము స్వాహాకు కీలక సూత్రదారి అయిన ఈడీ నాగేశ్వరరావు రెండు నెలల క్రితం బదిలీపై కృష్ణా జిల్లా మచిలీపట్నం బీసీ కార్పొరేషన్కు ఈడీగా వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గత టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఆదరణ–2 పథకంను ప్రవేశపెట్టింది. ఈ ఆదరణ పథకంలో బీసీలకు వివిధ పనిముట్లను రాయితీ కింద అందించేందుకు చర్యలు చేపట్టింది. వృత్తిని బట్టి ఇస్త్రీ పెట్టెలు, సన్నాయి, మేళం, నాయీబ్రాహ్మణులకు కుర్చీలు, మత్స్యకారులకు పడవలు, ఇంకా చేతి పనిముట్లు అందిస్తున్నారు. బీసీల ఓట్ల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలను ఆదరణ పథకం కింద విడుదల చేశారు. అయితే యూనిట్కు సంబంధించిన లబ్ధిదారుని వాటా ధనం రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారులు తమ వాటా ధనం సొమ్మును డీడీ రూపంలో బీసీ కార్పొరేషన్కు చెల్లించారు. దీనికి సంబంధించిన బీసీ కార్పొరేషన్ ఈడీ ఖాతా ఒంగోలు సిండికేట్ బ్యాంకులో ఉంది. ఈ సొమ్మును ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంది. సొమ్ము స్వాహాకు పథకం ఇలా.. బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వరరావు ఒక్కడే డైరెక్ట్గా నగదు డ్రా చేయకుండా కార్యాలయంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పావుగా వాడుకున్నాడు. మొత్తం 50 లక్షలకు పైగా నిధులను దొడ్డిదారిన మింగేసేందుకు వ్యూహం పన్నాడు. ఇందుకు కార్యాలయ ఏఈవో ఎ.శ్రీనివాసరావు పేరు మీద రూ.8.05,000, జూనియర్ అసిస్టెంట్ వై.ఏడుకొండలు పేరు మీద రూ.12,23,500, వి.రాజేష్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) పేరు మీద రూ.8,40,000, బి.వై.కమలేశ్వరరావు (డేటా ఎంట్రీ ఆపరేటర్) పేరు మీద రూ.5,50,000, మరో ఇద్దరు ఇతరుల పేరుమీద రూ.1,24,500, ఇంకొక వ్యక్తి పేరుమీద రూ.95,000, డీబీసీడబ్లు్యవో కార్యాలయానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ పి.వి.ఆంజనేయులు పేరు మీద రూ.45,000, తన (ఈడీ)పేరు మీద 10,87, 500 లక్షల వరకు చెక్కుల రూపంలో బ్యాంకు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో తేల్చారు. మొత్తం రూ.50,10,500 లక్షలను ఈడీ నాగేశ్వరరావు డ్రా చేశారు. డ్రా చేసిన నగదును కొంత ఆయా ఉద్యోగులకు ఇచ్చి మిగతా సొమ్ము ఈడీ నాగేశ్వరరావే స్వాహా చేసినట్లు విచారణ అధికారులు తేల్చారు. వీరితో పాటు కార్యాలయంలో కీలక సూత్రధారులుగా వ్యవహరించిన మహిళా సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరితో పాటు కార్యాలయ సబార్టినేట్ కూడా ఉన్నారు. వీరందరూ ఈడీ నాగేశ్వరరావు అవినీతి అక్రమాలకు సహకరించారన్న అభియోగం విచారణలో తేలింది. దీంతో మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ బీసీ కార్పొరేషన్ ఎండీ ఎం. రామారావు ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ కేసులకు చర్యలు.. బీసీ కార్పొరేషన్లో భారీ కుంభకోణంలో భాగస్వాములైన రెగ్యులర్ ఉద్యోగి కార్యాలయ ఏఈవో శ్రీనివాసరావుని సస్పెండ్ చేశారు. ఇతనితోపాటు తొలగించిన ఆరుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఇందులో భాగస్వాములైన మరో ఇద్దరు బయట వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని ప్రస్తుత ఈడీ కె.నాగముని తెలిపారు. ఈడీ నాగేశ్వరరావుపై చర్యలకు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదరణ సొమ్ము స్వాహాపై పూర్తి స్థాయి విచారణ కోసం జేసీ షాన్మోహన్ను నియమిస్తూ కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే కుంభకోణం... బీసీ కార్పొరేషన్లోజరిగిన కుంభకోణం ఈ ఏడాది జనవరి నుంచి ఆదరణ పథకం కింద లబ్ధిదారులు చెల్లించిన సొమ్మే కావడం గమనార్హం. గత ఈడీ నాగేశ్వరరావు ఇదే జిల్లాలో ఆరున్నరేళ్లుగా పని చేస్తున్నారు. ఆరు నెలలకే రూ.50 లక్షలకు పైగా దోచేస్తే.. గత ఆరేళ్లుగా ఎంత పెద్ద అవినీతికి తెరలేపి ఉంటాడోనని సందేహం ఉంది. ఇదిలా ఉంటే కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని తొలగించడంతో బీసీ కార్యాలయం వెలవెలబోతోంది. కేవలం ఇద్దరు ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు అవుతున్నారు. -
కార్పొరేషన్ రుణాలు కొందరికే !
ఆశల పల్లకి ఎక్కించడం ఆపై నేలపై పడేయడం... మళ్లీ ఎన్నికల సమయంలో ఏదో చేస్తామంటూ మభ్యపెట్టడం.. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు. అర్హులైన పేదలందరికీ వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. అది నమ్మిన పేదలు రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఆపై అధికారులు, పార్టీ నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ప్రత్యేక కార్పొరేషన్లంటూ ఊదరగొడుతున్న చంద్రబాబుపై.. కార్పొరేషన్ల పేరుతో ఓట్లు దండుకోవాలనుకున్న అధికార పార్టీపై రుణం కోసం దరఖాస్తు చేసి నిరాశపడిన ప్రజానీకం భగ్గుమంటోంది. సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): వివిధ కులాల పేరుతో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు కాగితాలకే పరిమితమవుతున్నాయి. కార్పొరేషన్ల కింద అర్హులందరికీ రుణాలిస్తామని చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. 2018 జూన్లో రుణాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎందుకు రుణాలు పంపిణీ కాలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించే సమయంలో కార్పొరేషన్ వద్ద లక్ష్యానికి మించిన నిధులు సిద్ధంగా ఉండాలి. కానీ దరఖాస్తులను పెద్ద ఎత్తున ఆహ్వానించి, తరువాత పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. రుణానికి ఎంపికైనట్లు తెలుసుకున్న వారు ఎంపీడీఓ కార్యాలయాల వద్దకు వెళ్లి అడిగితే రుణం విడుదల కాలేదంటూ అధికారుల నుంచి వస్తున్న సమాధానం విని విస్మయం చెందుతున్నారు. దరఖాస్తుదారుల్లో 3 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, మోస్ట్బ్యాక్ వర్డ్ క్లాస్ (ఎంబీసీ), బీసీ, కాపు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, చివరకు ఈబీసీలకు సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరకొర రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. కార్పొరేషన్ పేరు దరఖాస్తుదారుల సంఖ్య రుణం పొందిన వారి సంఖ్య ఎస్సీ 31264 1687 ఎస్టీ 4827 171 కాపు 10555 617 ఎంబిసి 579 0 బిసి 26008 2 క్రిస్టియన్ మైనార్టీ 136 11 మైనార్టీ 6445 64 విభిన్న ప్రతిభావంతులు 478 0 ఈబీసీ 7085 0 మొత్తం 87377 2552 రుణ పంపిణీలోను కోతలే తొలుత ఒక్కో లబ్ధిదారునికి గరిష్టంగా రూ.2 లక్షలు అందేది. కానీ ఈ ఏడాది కేవలం లక్షకు మాత్రమే పరిమితమైంది. రుణాల సంఖ్య సరే ఎందుకు రుణంలో కోత విధిస్తున్నారో అని అధికారులను అడిగితే సమాధానం ఉండదు. లబ్ధిదారుల సంఖ్యను పెంచుతున్నారా అంటే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రధానంగా బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు వాటికి సంబంధించిన నిధులు దారి మళ్లించి పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి పెంపు, సామాజిక పెన్షన్ పెంపు వంటి వాటికి కేటాయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 26 వేల మంది బీసీలు దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అది కూడా లక్ష రూపాయల చొప్పున మాత్రమే. ఒకరిది చీమకుర్తి మండలం కాగా , రెండో వ్యక్తిది దోర్నాల మండలం. 11 మంది క్రిస్టియన్ మైనార్టీలకు, 64 మంది ముస్లిం మైనార్టీలకు మాత్రమే జిల్లా వ్యాప్తంగా ఇచ్చారు. పలు కార్పొరేషన్లలో మంజూరే లేదు మోస్ట్బ్యాక్వర్డ్ క్లాస్గా పిలువబడుతున్న ఎంబీసీలు 579 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా రుణాలు మంజూరు కాలేదు. కలెక్టర్ అంగీకరించి కార్పొరేషన్కు జాబితా పంపినా నేటికీ ఒక్కరికి కూడా రుణం విడుదల కాలేదు. అల్పాదాయ వర్గాల కార్పొరేషన్కు సంబంధించి కూడా 7 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నా ఒక్కరికి కూడా రుణం విడుదల కాకపోవడం గమనార్హం. ఇలా కార్పొరేషన్లకు సంబంధించిన రుణాల మంజూరులో ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరణ మాత్రం శూన్యంగా కనిపిస్తుందని జిల్లా వ్యాప్తంగా 9 కార్పొరేషన్లకు సంబంధించి 87,377 మంది దరఖాస్తు చేసుకుంటే అరకొర లబ్ధి పొందిన వారి సంఖ్య 2552 మాత్రమే. అంటే ఆశపడి దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 2.9 శాతం అంటే ప్రతి వందమందిలో ముగ్గురికి కూడా తృప్తి కలగలేదని స్పష్టమవుతోంది. దరఖాస్తు ఖర్చులు అధికం... రుణాలు వస్తాయని ఆశతో దరఖాస్తు చేసుకునే వారు అధికమయ్యారు. ఒక్కో దరఖాస్తు చేయడానికి సామాన్య ప్రజలు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దాని కోసం ప్రతి ఒక్కరికి షుమారు రూ.500 పైనే ఖర్చవుతుంది. అంటే సుమారు రూ.4 కోట్లు దరఖాస్తుల ద్వారా ఖర్చు చేశారు. ఇలా దరఖాస్తులు చేయడంతో పాటు పనులు మానుకుని ఇంటర్వ్యూలకు హాజరై, నాయకులు, అధికారుల చుట్టూ తిరగాలి. మండల కార్యాలయానికి గ్రామాల నుంచి రావాలి. ఇలా ఎన్ని ఖర్చులు పెట్టినా అరకొర రుణాలు మాత్రమే అందాయి. జన్మభూమి కమిటీల పెత్తనంతోనే.. ఇచ్చిన ఈ అరకొర రుణాల్లో కూడా జన్మభూమి కమిటీల వారు పెత్తనం చెలాయిస్తారు. వారి సంతకాల కోçసం దరఖాస్తుదారులు కాళ్లరిగేలా తిరగాలి. వారు సంతకం పెడితేనే దరఖాస్తులు స్వీకరిస్తారు. వారికి మళ్లీ లంచాలు ఇస్తేనే సంతకాలు పెడతారు. ఇలా జరిగిన తరువాత ఎంపిక చేసే సమయంలో మళ్లీ లోన్ కమిటీ ఉంటుంది. వారిని ప్రçసన్నం చేసుకోవాలి. తరువాత మళ్లీ ప్రజాప్రతినిధులు జాబితా ఇవ్వాలి. ఇంత చేసినా కూడా కనీసం 3 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. దరఖాస్తుదారుల ఆగ్రహం.. అర్హులైన వారికి రుణాలు ఇవ్వకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన వారికి మాత్రమే అరకొర రుణాలు అందజేశారు. సామాన్య ప్రజలు అయితే ఒక్కరు కూడా రుణం పొందలేదు. ఇచ్చిందే కొద్ది.. అవి కూడా కేవలం తెలుగు తమ్ముళ్ల కే ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెపుతామని సామాన్య ప్రజలు అంటున్నారు. -
చెక్కులు... చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ రాయితీ పథకాలకు వరుస అవరోధాలు ఎదురవుతున్నాయి. నాలుగేళ్లు బీసీ కార్పొరేషన్కు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రాయితీ పథకాలను నిలిపివేశారు. అయితే 2018–19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులిచ్చింది. దీంతో క్షేత్రస్థాయి నుంచి స్వయం ఉపాధిలో ఆసక్తి ఉన్న బీసీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, తొలివిడతగా మొదటి కేటగిరీ లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 41వేల మంది లబ్ధిదారులను గుర్తించిన బీసీ కార్పొరేషన్ ఒక్కో లబ్ధిదారుకు గరిష్టంగా రూ.50 వేల చొప్పున రాయితీని నేరుగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు దాదాపు 19 వేల మందికి అధికారులు చెక్కులను పంపిణీ చేశారు. మిగతా 22 వేలమంది లబ్ధిదారులకు రూ.106 కోట్లకు సంబంధించి చెక్కులు పంపిణీ చేస్తున్న సమయంలోనే అసెంబ్లీ రద్దు కావడం, ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో డిసెంబర్ వరకు చెక్కుల పంపిణీ అటకెక్కింది. తిరిగి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చెక్కుల పంపిణీకి ప్రభుత్వ అనుమతి తీసుకున్న బీసీ కార్పొరేషన్... లబ్ధిదారుల పేరిట కొత్తగా చెక్కులను తయారు చేసి జిల్లాలకు పంపింది. ఇంతలో జనవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా మరోమారు చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసిన తర్వాత లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు బీసీ కార్పొరేషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో చెక్కుల పంపిణీకి ప్రభుత్వ అనుమతి కోరింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంలో జాప్యం కావడంతో ఏకంగా పార్లమెంటు ఎన్నికల నగారా మోగింది. దీంతో స్వయం ఉపాధి పథకానికి పూర్తిగా బ్రేక్ పడినట్లైంది. మే నెలాఖరు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అప్పటివరకూ చెక్కులు పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. మరో పది రోజుల్లో వార్షిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఈ ఏడాది విడుదల చేసిన నిధులను గడువులోగా ఖర్చు చేయకుంటే అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమకానున్నాయి. లక్ష్యసాధన పూర్తి చేయాలంటే తిరిగి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. -
శిక్షణ... ఉపాధి కల్పన...!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగుల అభ్యున్నతికి వెనుకబడిన తరగతులు ఆర్థిక సహకార సంస్థ(బీసీ కార్పొరేషన్) కొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. శిక్షణ, ఉపాధి కల్పనకు కార్యాచరణ సిద్ధపరుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఈ తరహా శిక్షణ, ఉపాధి కార్యక్రమాల అమలుతో మంచి ఫలితా లు సాధిస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2019–20 వార్షిక సంవత్సరంలో కనిష్టంగా 10వేల మందికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. బీసీల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపును సైతం క్రమంగా పెంచుతోంది. గత రెండేళ్లుగా ఎంబీసీ కార్పొరేషన్కు ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున కేటాయించింది. రూ.50 వేల మొత్తంలో ఏర్పాటు చేసే అన్ని స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసిన బీసీ కార్పొరేషన్ ఆ మేరకు లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చింది. 2018–19 సంవత్సరంలో దాదాపు రూ.300 కోట్లకుగాను చెక్కులు ఇచ్చారు. అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. కోడ్ ముగిసిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్లు చెబుతు న్నారు. ఉపాధి కల్పన వైపు దృష్టి సారించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగం గా 2019–20 సంవత్సరంలో రూ.220 కోట్లతో ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కులవృత్తుల్లో మెళకువల కోసం.. గతేడాది నాయీబ్రాహ్మణ ఫెడరేషన్, కుమ్మరి శాలివాహన ఫెడరేషన్ల ద్వారా వారి కులవృత్తుల్లో యువతకు మెళకువలు నేర్పి మినీ బ్యూటీపార్లర్ల, మట్టి విగ్రహాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేశారు. శిక్షణ పొందిన మెజార్టీ యువతకు ఉపాధి దక్క డంతో కార్పొరేషన్ అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకుని ఆ మేరకు శిక్షణ చేప ట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనాన్ని ఇస్తారు. అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఆతిథ్య రంగం, హోటల్ నిర్వహణ, నిర్మాణ రంగాలను శిక్షణకు ఎంచుకున్నారు. -
‘నవరత్నలు చూసి ఓర్వలేకపోతున్నారు’
సాక్షి, కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్లుగా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు బీ.వై రామయ్య విమర్శించారు. బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. సోమవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మరోసారి బీసీలకు మోసం చేసేందుకే జయహో బీసీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ బీసీలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 20న జిల్లాలో పెద్ద ర్యాలీని నిర్వహించి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం : కోమటి రెడ్డి
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. న్యాయవాది కంచనపల్లి జవహర్లాల్ ఆధ్వర్యంలో వార్డెన్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవుల వెంకట్నర్సయ్యతోపాటు మాజీ కౌన్సిలర్ బోయినపల్లి గిరికుమార్ బుధవారం కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ మున్నూరు కాపులను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వెంకట్నర్సయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరుకాపుల అభివృద్ధిని విస్మరించిందని, సరైన రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని ఆరోపించారు. దీంతో తము సంఘం మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని గెలిపించేందుకు మున్నూరు కాపులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు సుధాకర్, రఘువీర్, శ్రీకాంత్, మేకల వెంకన్న, నేతి ఉమామహేశ్వర్, తోకల శ్రీనివాస్, సత్యనారాయణ, సిరిగిరి వెంకట్రెడ్డి, ఠాగూర్, వేణుగోపాల్రెడ్డి, శ్రీకాంత్, కవిత పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
బీసీ రుణాలకు బ్రేక్
ఆదిలాబాద్రూరల్: స్వయం ఉపాధి పథకంలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే రుణాలకు మోక్షం కలగడం లేదు. రుణాల పంపిణీ ప్రారంభం అయినట్లే అయి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయింది. కార్పొరేషన్ రుణాల పంపిణీకి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సబ్సిడీ రుణాలను అందించేందుకు ఎన్నికల కమిషన్ నిరాకరించింది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు 2వేలకుపైగా వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ప్రభుత్వం 472 మందికి మాత్రమే అందజేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 15,800 మంది స్వయం ఉపాధి రుణాల కోసం వివిధ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. అందని ద్రాక్షే.. బీసీ కార్పొరేషన్ రుణాలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు తీసుకుందామని ఆశించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నరేళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు రెండు సార్లు మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. మొదటగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అందులో కొందరికి మాత్రమే రూ.లక్ష రుణాలు అందజేసింది. వీటికి సంబంధించిన సబ్సిడీని 2018 మార్చిలో విడుదల చేసింది. జిల్లాలో సుమారు 472 మందికి రూ.80 వేల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అనంతరం 2016–17 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. తదుపరి 2017–18లో దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల లబ్ధిదారులు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరడంతో ఆ తర్వాత ఏప్రిల్ 21 వరకు గడువు పొడిగించి దరఖాస్తులను స్వీకరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 2,70,321 మంది బీసీ జనాభా ఉండగా కార్పొరేషన్, ఫెడరేషన్ ద్వారా 15,800 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మందిని అర్హులుగా గుర్తించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులను స్వీకరించకపోవడంతో నిరుద్యోగ బీసీ లబ్ధిదారులు ఆందోళన చెందారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి 13వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని అర్హులుగా ఎంపీడీవోలు గుర్తించారు. 750 మందికి పంపిణీ.. జిల్లాలో కార్పొరేషన్ ద్వారా 15,800 లబ్ధిదారులు వివిధ రుణాలకు ఫెడరేషన్, కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇందులో 13వేల మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో రూ.లక్ష లోపు యూనిట్లను కేటగిరి–1, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు యూనిట్లను కేటగిరి–2, రూ.2లక్షలకుపై యూనిట్లను కేటగిరి–3గా నిర్ణయించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో లబ్ధిదారులను గుర్తించేలోపు ఆగస్టు 15న రూ.50వేల యూనిట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆగస్టు 15న 100 మందికి రూ.50 వేల వంద శాతం సబ్సిడీపై చెక్కులను పంపిణీ చేశారు. రూ.లక్ష యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి వారిని 50 యూనిట్లలోనికి మార్చి జిల్లా వ్యాప్తంగా 750 మందికి చెక్కులను పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఇంతలోనే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. సబ్సిడీ రుణాల పంపిణీ నిలిచిపోయింది. మళ్లీ ఎప్పుడు రుణాలు అందిస్తారో తెలియక లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్తో నిలిపి వేశాం.. జిల్లాలో వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం 15,800 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13వేల మంది అర్హులుగా గుర్తించి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లబ్ధిదారుల జాబితాను పంపించారు. ఇందులో ఆసక్తి గల వారికి రూ.50వేలు వంద శాతం సబ్సిడీపై 750 మందికి అందజేశాం. మిగతా వారికి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిలిపి వేశాం. – ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి, ఆదిలాబాద్ -
వినూత్న ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/చీరాల: విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించి ఉన్నతస్థాయికి చేరుకుని ఆంధ్రప్రదేశ్ను వినూత్న ఆవిష్కరణల కేంద్రంగా ఆవిష్కరింపజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా పామూరు మండలం దూబగుంట వద్ద ఆయన అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని చదివితే సాధించలేనిది లేదన్నారు. ఆర్థికలోటు ఉన్నా విద్యా రంగానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీతో పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అయిదు ట్రిపుల్ ఐటీలు నడుస్తున్నాయన్నారు. నాదెళ్ల సత్య, రాజారెడ్డిలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. చేనేతల అభివృద్ధికి ప్రాధాన్యం ..: చేనేతల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జరిగిన చేనేత దినోత్సవ సభలో మాట్లాడారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా పందిళ్లపల్లిలో మగ్గాలు, చేనేత వస్త్రాల డిజైన్లు, రంగులు, రసాయనాల అద్దకం, అల్లు, రాట్నం పరిశీలించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో భాగంగా యువతీ, యువకులతో నిరుద్యోగ భృతి ప్రకటనపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. చేనేత కార్మికులు, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సీఎం సందర్శించారు. -
బీసీ రుణాల్లో వసూళ్ల పర్వం
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత బీసీ కార్పొరేషన్ రాయితీ రుణాల పంపిణీకి చర్యలు చేపట్టడం కొందరు దళారీలకు వరంలా కలిసొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది లబ్ధిదారులకు రూ.1,500 కోట్ల మేర రాయితీ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రకటించడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. బీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్లకు కలిపి 5.75 లక్షల మంది ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించారు. వాటిని పరిశీలించి అర్హులను గుర్తించాలని బీసీ సంక్షేమ శాఖ సూచనలు చేయడంతో దళారీల కొత్త దందాకు తెరలేచింది. రాయితీ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను గ్రామాల వారీగా విభజించడంతో, గ్రామ స్థాయిలో సభలు నిర్వహించి దరఖాస్తుదారుల ప్రాథమిక జాబితాలు తయా రు చేస్తున్నారు. ఈక్రమంలో వారి పత్రాలను పరిశీలిస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. రాయితీ రుణం ఇప్పిస్తామని చెబుతూ అందినకాడికి దండుకుంటున్నారు. అక్రమార్కులకు ప్రజాప్రతినిధులు సైతం అండగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లపై తాజాగా బీసీ కార్పొరేషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా యి. రంగారెడ్డి, నల్లగొండ, మేడ్చల్ జిల్లాలకు చెందిన పలువురు ఇటీవల సంక్షేమాధికా రులకు ఫిర్యాదు చేయడంతో వసూళ్ల పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఆరా తీస్తున్నారు. లక్ష్యాలు నిర్దేశించకముందే... బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల నుంచి రాయితీ రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించినా.. వాటిని ఇప్పుడే ఆమోదించే పరిస్థితి లేదు. ఎందుకంటే 2018–19 వార్షిక ప్రణాళికకు ఇంకా ఆమోదం లభించలేదు. బీసీ కార్పొరేషన్ రూపొందించిన ప్రణాళికలో ఏమేరకు ఆమో దం వస్తుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు దరఖాస్తుల స్వీకరణతోనే సరిపెట్టారు. ప్రణాళిక ఆమోదం తర్వాత నిర్దేశించిన లక్ష్యాన్ని జిల్లాల వారీగా విభజిస్తారు. మం డలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా విభజించిన తర్వాత లబ్ధిదారుల సంఖ్యను ఖరారు చేస్తారు. వార్షిక ప్రణాళికకు ఇప్పటికిప్పుడు ఆమోదం వచ్చినా.. విభజన ప్రక్రియకు మరో నెల సమయం పడుతుంది. ఇంత తతంగం ఉండగా... గ్రామాల్లో అర్హులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పుకోవడంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అర్హుల ఎంపికలో వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండగా, కొన్ని చోట్ల ఏకపక్షంగా జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన తర్వాత గ్రామ సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు రాయితీ రుణాలకు పేర్లను ప్రతిపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపి క ఏకపక్షంగా సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు సర్పంచులు, చైర్మన్లు తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో పన్నెండు మంది సర్పంచులపై జిల్లా సంక్షేమాధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం, అదేవిధంగా కరీంనగర్, మహబూబ్నగర్లోనూ దరఖాస్తుల పరిశీలన ఏకపక్షంగా సాగిందం టూ ఆర్జీదారులు అధికారులకు మొరపెట్టు కుంటున్నారు. కొన్నిచోట్ల సమాచారం ఇవ్వకుండానే గ్రామసభలు ముగించేశారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించిన తర్వాత మరోమారు పరిశీలన చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. -
‘లక్ష’ణంగా రాయితీ రుణం
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు బీసీ కార్పొరేషన్ వడివడిగా చర్యలు తీసుకుంటోంది. నిధుల విడుదలలో జాప్యంతో మూడేళ్లుగా రాయితీ పథకాలను అటకెక్కించిన ఆ శాఖ.. తాజాగా 2018–19 సంవత్సరంలో ఏకంగా లక్ష యూనిట్ల మంజూరుకు ఉపక్రమించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి యూనిట్ల ఏర్పాటును వేగిరం చేయనుంది. 2018–19 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్తో పాటు 11 బీసీ ఫెడరేషన్లకు 5.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపు ఉన్న స్వయం ఉపాధి యూనిట్లు 1.45 లక్షలు ఉన్నాయి. తొలివిడతలో భాగంగా చిన్న యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన బీసీ కార్పొరేషన్ ఈ మేరకు దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. నవంబర్లోగా రాయితీ విడుదల.. బీసీ కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ప్రాధాన్యత క్రమంలో రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలివిడత రూ.లక్ష లోపు ఉన్న యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తారు. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల లోపు ఉన్న యూనిట్లకు రెండో విడత, రూ.10 లక్షల లోపు ఉన్న యూనిట్లకు మూడో విడతలో లబ్ధిదారులను ఎంపిక చేసి రాయితీ ఇవ్వనుంది. ప్రస్తుతం తొలివిడత కింద లక్ష మందికి రాయితీ రుణాలు ఇవ్వాలని భావిస్తోంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేస్తోంది. తొలివిడత లక్ష మందికి రాయితీ ఇచ్చేందుకు రూ.750 కోట్లు అవసరం. 2018–19 వార్షిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్కు రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఫెడరేషన్లకు కేటాయించిన నిధులతో పాటు ఎంబీసీ కార్పొరేషన్కు కేటాయించిన నిధులను వినియోగించుకోనుంది. ప్రస్తుతం లక్ష మందికి రాయితీ ఇవ్వనున్నప్పటికీ.. ఇందులో ఆయా సామాజిక వర్గాల వారీగా ఫెడరేషన్లకు దరఖాస్తులను బదలాయించాలని, దీంతో బీసీ కార్పొరేషన్పై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా నవంబర్ నెలాఖరు నాటికి నిర్దేశించిన లక్ష మందికి రాయితీ రుణాలిచ్చి యూనిట్ల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆరు రంగుల్లో మట్టి గణపతి
సాక్షి, హైదరాబాద్: హస్తకళకు రాష్ట్ర సర్కారు చేయూతనిస్తోంది. కనుమరుగవుతున్న కళను పరిరక్షించే క్రమంలో బీసీ కార్పొరేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలు తయారుచేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను కుమ్మరి కళాకారులకు అప్పగించబోతోంది. ఈమేరకు వెనుకబడిన కులాల ఆర్థిక సహకార సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది. రాబోయే వినాయక చవితి పండగకోసం పర్యావరణహిత గణపతి విగ్రహాలు తయారు చేయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల విగ్రహాలు తయారుచేసి విక్రయించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కళాకారులకు శిక్షణనిచ్చి వారికి అవసరమైన వనరులను సమకూర్చనుంది. మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఐదుగురు కుమ్మరి కళాకారులను బీసీ కార్పొరేషన్ ఎంపిక చేసింది. వీరికి వచ్చేవారంలో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు గుజరాత్ మాటీకామ్ సంస్థ నుంచి నిపుణులను ఆహ్వానించింది. శిక్షణ తర్వాత మాస్టర్ ట్రెయినర్లు జిల్లా కేంద్రాల్లో మరింత మంది కళాకారులకు శిక్షణ ఇస్తారు. అదేవిధంగా మాస్టర్ ట్రెయినర్లు వ్యక్తిగతంగా జిల్లా, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వినాయక తయారీ యూనిట్లు కూడా నెలకొల్పుతారు. వీరికి బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.25వేల రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. మాస్టర్ ట్రెయినర్ల నుంచి శిక్షణ తీసుకున్న మిగతా కళాకారులు కూడా వారి సొంత గ్రామాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి శిక్షణ ఇచ్చిన అనంతరం ఒక్కో కళాకారుడు వెయ్యి విగ్రహాలు తయారు చేయాల్సి ఉంటుంది. అలా తయారైన విగ్రహాలను బీసీ కార్పొరేషన్ ఔట్లెట్ల ద్వారా విక్రయించుకోవచ్చు. మూడు సైజుల్లో.. ఆరు రంగుల్లో... బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందబోయే వినాయక విగ్రహాలు 3 రకాల సైజుల్లో లభ్యమవుతాయి. ఇందులో అరఫీటు, ఫీటు, ఫీటున్నర సైజుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. గతంలో మట్టి విగ్రహాలంటే ఒకే తరహాలో మట్టి రంగుతో కనిపించేవి. తాజాగా తయారు చేసే విగ్రహాలు మాత్రం ఆరు రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. సహజసిద్ధమైన రంగులే వినియోగిస్తారు. జీహెచ్ఎంసీతో బీసీ కార్పొరేషన్ అవగాహన రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల విగ్రహాలు తయారు చేస్తుండగా, అందులో దాదాపు ఐదు లక్షల విగ్రహాలు గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే విక్రయించనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీతో బీసీ కార్పొరేషన్ అవగాహన కుదుర్చుకోనుంది. ఇప్పటికే కమిషనర్తో ఆ శాఖ అధికారులు చర్చలు జరిపారు. విగ్రహాల విక్రయ బాధ్యతలను బీసీ కార్పొరేషన్, కుమ్మరి, శాలివాహన ఫెడరేషన్ సంయుక్తంగా తీసుకుంది. విగ్రహాల ధరలను కుమ్మరి, శాలివాహన ఫెడరేషన్ నిర్ణయిస్తుందని బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
టార్గెట్ ఇవ్వాల్సిందే..!
నల్లగొండ : బీసీ కార్పొరేషన్ పథకాలపై అనిశ్చితి నెలకొంది. స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడంపై అధికారులు అయోమయంలో పడ్డారు. నిర్దేశించిన లక్ష్యం లేకుండా పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేయడం అంత సులువు కాదని ఎంపీడీఓలు తేల్చి చెబుతున్నారు. పథకాల మార్గదర్శకాల్లో మార్పు చేయాలని, లేదంటే క్షేత్రస్థాయిలో రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే ముందుగా అర్హులైన వారితో జాబితా తయారు చేయాలని కార్పొరేషన్ విధివిధానాలు రూపొందించింది. పేద, నిరుపేద కుటుంబాలు, వితంతువులు, వికలాంగులు, సంచార జాతుల వారికి ప్రాధాన్యత కల్పించా లని, మొత్తం స్కీంల్లో 33 శాతం మహిళలకు, 3 శాతం వికలాంగులకు ఇవ్వాలని చెప్పారు. ఈ రకంగా మండలం, పట్టణాల్లో అర్హులైన వారితో జాబితా తయారు చేయాలంటే రాజకీయంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. అదీగాక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్పొరేషన్ పథకాలపై దృష్టి సారించడం కూడా అంత çసులువుకాదనే విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుబంధు కార్యక్రమం, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు క్షణం తీరికలేకుండా గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇప్పటికిప్పుడు గ్రామసభలు నిర్వహించి అర్హులను గుర్తిం చడం కష్టమైన పనేని ఎంపీడీఓలు అంటున్నారు. పనిఒత్తిడితో సతమతం.... రైతుబంధు కార్యక్రమం ఈ నెల 17 వరకు కొనసాగింది. మరో వైపు పంచాయతీ ఓటర్ల జాబితాపై ఎంపీడీఓలు, అధికారులు తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చింది. ఓటర్ల జాబితా పూర్తికాక ముందే పోలింగ్ కేంద్రాల పని మొదలైంది. కొత్తగా పంచాయతీలు ఏర్పాటైన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇది కొనసాగుతుండగానే రైతుబంధు కార్యక్రమంలో మిగిలిన భాగాన్ని పూర్తి చేసేందుకు వచ్చే నెల 25 వరకు గడువు పొడిగించారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి పనిభారం పెరగడంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు రైతుబంధు పథకం ముడిపడి ఉండటంతో మరేతర పని పెట్టుకోకుండా చెక్కులు, పాస్పుస్తకాలు పంపిణీ వందశాతం పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ రెండు కార్యక్రమాలు పూర్తయ్యాకే కార్పొరేషన్ పథకాలపై దృష్టి సారిస్తామని ఎంపీడీఓలు చెబుతున్నారు. లక్ష్యం నిర్దేశిస్తేనే గ్రామసభలు... లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే మండలం, పట్టణం వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని, అలా కాకుండా గ్రామసభలు నిర్వహించడం వీలుకాదని అధికారులు అంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34,284 దరఖాస్తులు వచ్చాయి. వీటిన్నింటిని వడపోసి, అర్హులైన వారితో జాబితా తయారు చేయడం తలకుమించిన భారమని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని, మండలం, పట్టణాల్లో ఒక్కో స్కీంకు ఎంత మందిని ఎంపిక చేయాలనే దానిపైన నిర్దేశించిన లక్ష్యాన్ని ముందుకు ఖరారు చేస్తే లబ్ధిదారుల ఎంపిక సులువుగా ఉంటుందనే విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి లిఖితపూర్వక లేఖ రాశారు. ముగిసిపోతున్న గడువు.... కార్పొరేషన్ షెడ్యూల్ ప్రకారం లక్ష రూపాయల పథకాలకు లబ్ధిదారులను ఈ నెల 15 తేదీలోగా ఎంపిక చేయాల్సి ఉంది. అదేవిధంగా రెండు లక్షల పథకాలకు 25వ తేదీ, రెండు లక్షలు దాటిన పథకాల లబ్ధిదారులను జూన్ 5 తేదీలోగా ఎంపిక చేసి ఆ జాబితాను జిల్లా అధికారులకు పంపాల్సి ఉంది. ఇదంతా జరగాలంటే గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలి. కానీ ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఈ ప్రక్రియ మొదలు కాలేదు. -
కరుణ కరువు
తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన ఈయన పేరు మర్రాపు శంకరరావు. బైక్ మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్న ఈయన షాప్ను మరింత అభివృద్ధి చేసుకునేందుకు రుణం కోసం బీసీ కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. బీసీ కార్పొరేషన్ ఓబీఎంఎంఎస్ ద్వారా 2016–17, 17–18 ఆర్థిక సంవత్సరాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరై అందులో ఎంపికయ్యాడు. అన్ని అర్హతలూ ఉన్న ఈయన రెండేళ్లుగా మండల పరిషత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రుణం మాత్రం మంజూరు కాలేదు. కారణం ఏమిటాని ఆరా తీస్తే జన్మభూమి కమిటీ సభ్యులు ఈయన పేరును తొలగించారట. బతుకుతెరువు కోసం కనీసం ప్రైవేటు ఉద్యోగానికి కూడా నోచుకోని వెనుకబడిన తరగతుల వారిని ఆదుకునేందుకు బీసీ కార్పొరేషన్ నెలకొల్పారు. కానీ దీని ద్వారా ఉపాధి కనుచూపుమేరలో కానరావడం లేదు. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాలి... లేదా సంఘ నాయకుల రూపంలో ఉన్న దళారులను ప్రసన్నం చేసుకోవాలి... వీటికి డబ్బు ఉండాలి. పోనీ అన్నీ చేసినా బ్యాంకర్లకు ఇష్టం లేకపోతే అంతే! వెనుకబడిన తరగతుల్లో నిరుపేదల సమస్యకు పరిష్కారం కానరావట్లేదు. బొబ్బిలి : ఏటా కోట్టాలది రూపాయ ల బడ్జెట్ కేటాయించడం అందులో 25 శాతం కూడా రుణాలు ఇవ్వకపోవడంతో బీసీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కానరావట్లేదు. ఓ వైపు జన్మభూమి కమిటీల పెత్తనం... మరోవైపు బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా గడచిన మూడేళ్లలో తిరస్కరిస్తున్న వాటి సంఖ్యే ఎక్కువ. ఆర్థిక ఆసరా లేని కుటుంబాలు ఏటా బీసీ కార్పొరేషన్కు వేలల్లో దరఖాస్తులు చేసుకుంటున్నాయి. కానీ రాజకీయ పలుకుబడి, జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇస్తే తప్ప సబ్సిడీ రుణాలు అవ్వడం లేదు. డబ్బులు ఇవ్వలేని బీదాబిక్కీ దరఖాస్తు చేసుకునేందుకు వ్యయ ప్రయాసలే మిగులుతున్నాయి. దరఖాస్తులు వేలల్లోనే... జిల్లా వ్యాప్తంగా ఏటా 14 నుంచి 20వేల వరకూ బీసీ సబ్సిడీ రుణాలకోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. 2014–15లో 14020 మంది 2015–16లో 16340 మంది, 16–17లో 16100 దరఖాస్తు చేసుకోగా కేవలం 10 శాతం కూడా లబ్ధిపొందిన వారు లేరు. చేసేది లేక ఆయా కుటుంబాలు తిరిగి వడ్డీ వ్యాపారుల పైనే ఆధారపడాల్సి వస్తోంది. రుణాలు ఇవ్వాలంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కమిటీల ఆమోదం ఉండాలి. ఆ తరువాత బ్యాంకుల చుట్టూ తిరగాలి. అక్కడి నుంచి జిల్లా స్థాయి కమిటీ ఆ తరువాత బీసీ కార్పొరేషన్ ఎండీ ఇలా.. ఎన్నో ఇబ్బందులు దాటిన తరువాత సబ్సిడీ మంజూరయితే దానిని ఇచ్చేందుకు బ్యాంకర్ల వద్ద తిప్పలు తప్పట్లేదు. వచ్చిన సబ్సిడీని డిపాజిట్గా వేసేసి బ్యాంకులు వ్యాపారం చేసుకుంటున్నాయి. రూ. లక్షరుణం, రూ. లక్ష సబ్సిడీ కాగా రూ. రెండు లక్షలు లబ్ధిదారుడికి బ్యాంకులు ఇవ్వాలి. ఈ మొత్తం వాయిదాల రూ³ంలో తీరిపోయిన వెంటనే అంతకు ముందు డిపాజిట్ చేసిన రూ. లక్ష సబ్సిడీని లబ్ధిదారుడికి ఇవ్వాలి. కానీ రూ. రెండు లక్షల యూనిట్ మంజూరవగానే బ్యాంకర్లు లక్ష డిపాజిట్ చేసేసి కేవలం రూ. 30వేల నుంచి రూ. 50వేలే రుణం ఇస్తున్నారు. అవి తీరాక మిగతా డబ్బులు ఇస్తామంటున్నారు. కొత్త దరఖాస్తులకు రెడీ జిల్లాలో రుణాల మంజూరు అవుతున్నా గ్రౌండింగ్ కావడం లేదు. అంటే లబ్ధిదారుడికి కాగితాల మీదే మంజూరు చూపిస్తున్నారు తప్ప ఒక్క పైసా అయినా సబ్సిడీ ఇవ్వట్లేదు. మూడేళ్లుగా రుణాల మంజూరు ప్రక్రియ జరుగుతున్నా చేతికి డబ్బు అందే వారు లేరు. కానీ ఈ ఏడాది మళ్లీ 2018–19 ఆర్థిక సంవత్సరానికి మళ్లీ రుణాలు వచ్చాయనీ, దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 2,313 దరఖాస్తులు రావడం గమనార్హం. గ్రౌండింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నాం మూడేళ్లుగా మంజూరైన రుణాలను గ్రౌండింగ్ చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. త్వరలోనే అందరికీ రుణాలు గ్రౌండయ్యేలా చేసి యూసీలు తీసుకుంటాం. దీనిపై బ్యాంకర్లకు సమాచారం ఇచ్చాం. – ఆర్.వి.నాగరాణి, ఈడీ, బీసీ కార్పొరేషన్, విజయనగరం -
ఇక మీ ఇష్టమే..!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో బీసీ సంక్షేమ శాఖ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. యూనిట్ల స్థాపనకు బ్యాంకు రుణం తప్పనిసరి కాదని, ఆ నిర్ణయం లబ్ధిదారుకే వదిలేస్తున్నామని వెల్లడించిది. మొత్తం వ్యయాన్ని లబ్ధిదారు వ్యక్తిగతంగా భరిస్తే సబ్సిడీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల్లో వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు 2018ృ19 వార్షిక సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణకు బీసీ కార్పొరేషన్తోపాటు 11 బీసీ ఫెడరేషన్లు ఉపక్రమించాయి. ఆర్థిక సహకార సంస్థ (ఫైనాన్స్ కార్పొరేషన్) ఇచ్చే రాయితీలు ఇప్పటివరకు బ్యాంకులిచ్చే రుణాలతో ముడిపడి ఉండేవి. యూనిట్ ప్రారంభించాలనుకున్న లబ్ధిదారు ముందుగా కార్పొరేషన్కు రాయితీ కోసం దరఖాస్తు చేసుకునేవారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చాక రాయితీ డబ్బులు పోను మిగిలిన మొత్తానికి సమీప బ్యాంకులో రుణం పొందేందుకు అర్జీ పెట్టుకునేవారు. అక్కడ రుణం దొరికితేనే రాయితీ ఫలాలు అందేవి.. లేదంటే అంతే సంగతి. ఏళ్ల నాటి ఈ నిబంధనలకు సంక్షేమ శాఖ స్వస్తి పలికింది. రూ. లక్షకు రూ.80 వేల రాయితీ స్వయం ఉపాధి యూనిట్లపై బ్యాంకు రుణం పొందడం ఆషామాషీ కాదు. బ్యాంకు నిబంధనలు పాటిస్తేనే రుణం మంజూరవుతుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉన్నా బ్యాంకర్ల సహకారం లేకుంటే రుణ మంజూరు గగనమే. దీంతో రుణాలందక లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేయలేకపోతున్నారని కార్పొరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సొమ్ము మొత్తం లబ్ధిదారుడే భరిస్తే రాయితీ విడుదల చేసేందుకు సంక్షేమ శాఖ వెసులుబాటునిస్తోంది. రూ.లక్షతో ఏర్పాటు చేసే యూనిట్కు సర్కారు రూ.80 వేల రాయితీ ఇవ్వనున్నారు. రూ.2 లక్షలుంటే రూ.1.40 లక్షలు, రూ.5 లక్షలకు పైబడి ఉంటే 50 శాతం రాయితీ ఇస్తారు. రూ.1,400 కోట్లు..! మూడేళ్లుగా రాయితీలివ్వని బీసీ సంక్షేమ శాఖ.. ఈసారి భారీ ప్రణాళికతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఇందుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఆ శాఖ.. ఈ నెల 21 వరకు గడువు విధించింది. అలాగే పెండిగ్లో ఉన్న దరఖాస్తులను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు ఈ సారి బడ్జెట్లో రూ.1,400 కోట్లు కేటాయించిన నేపథ్యంలో లక్ష మందికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేసే వీలుంది. 2018ృ19 వార్షిక సంవత్సరం ప్రణాళికను బీసీ కార్పొరేషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే దరఖాస్తులు పరిశీలన మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
హక్కుల సాధనకు ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్రంలో బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా దక్కే వరకు బీసీలంతా ఒక్కటై ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వాల మెడలు వంచి రావాల్సిన వాటాను సాధించుకోవాలన్నారు. శుక్రవారం ‘కేంద్ర–రాష్ట్ర బడ్జెట్లలో బీసీల వాటా’అనే అంశంపై జరిగిన సమావేశంలో 80 బీసీ కుల సంఘాలు, 20 బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న బీసీ కార్పొరేషన్కు నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులాలను జాగృతం చేసేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో 50 ఎకరాల్లో బీసీ భవన్.. బీసీల జాబితాలో ఉన్న అన్ని కులాలకు 10 ఎకరాల భూమి, రూ.10 కోట్ల కేటాయింపు. మహాత్మ జ్యోతిభాపూలే పేరుతో హైదరాబాద్లో 50 ఎకరాల్లో బీసీ భవన్ ఏర్పాటు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం కోటా. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయింపులు. బీసీ కులాల ఫెడరేషన్లకు పాలక మండళ్ల నియామకం. కులవృత్తుల వారికి ఫెడరేషన్ల ఏర్పాటు. ఎంబీసీ కార్పొరేషన్కు కేటాయించిన వేయి కోట్లు తక్షణ విడుదల. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంపు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని బీసీల రాజకీయ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలు తీర్మానాలు చేశారు. -
రుణం..బహుదూరం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో వివిధ కార్పొరేషనల్ ద్వారా రుణాలు పొందేందుకు నిరుద్యోగ యువతీ, యువకులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిరుద్యోగులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా... ఆచరణలో మాత్రం వాస్తవ దూరంగా ఉంటోంది. వివిధ సంక్షేమ శాఖల పరిధిలో అభ్యర్థులు అందజేసిన దరఖాస్తులు మూలుగు తుండడమే దీనిని నిదర్శనమని చెప్పాలి. రెండేళ్ల క్రితం 12 యూనిట్లు బీసీ సంక్షేమ శాఖలో వివిధ కులాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కుల సంఘాలు, సమాఖ్యలకు 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేవలం 18 యూనిట్లు మంజూరు చేసింది. ఇందులోనూ 12 యూనిట్లకే ప్రభుత్వం నిధులు విడుదల చేసిం ది. గతంలో జిల్లాలో ఎస్టీ కార్పొరేషన్ జిల్లాలో లేని కారణంగా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రుణం అందించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాల కోసం ప్రస్తుతం ఎస్టీ కార్పొరేషన్లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా మండల స్థాయిలో దరఖాస్తులు సేకరణ పూర్తిగా మందగించింది. ఇలా వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఏళ్లుగా రుణాలు అందకపోవడం, పలు శాఖల్లో చాలా కాలంగా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశమే కల్పించకపోవడం కారణంగా జిల్లాలో చాలా మంది నిరుద్యోగులు కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో 36 మంది జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులు చేసుకున్న వారికి నేటికీ పూర్తి స్థాయిలో రుణాలు అందలేదు. ఇలా చాలా మంది మిగిలిపోగా కొన్ని దరఖాస్తులను 2016–17లోకి మార్పు చేశా>రు. రెండేళ్లకు కలిసి మొత్తం 7,570 దరఖాస్తులు ఉండగా.. ప్రభుత్వం పరిశీలించి అర్హులైన 991 రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. కానీ 525 మందికే మంజూరు ఇచ్చారు. ఇలా అన్ని అనుమతులు ఉన్నా బ్యాంకుల నుండి పూర్తి స్థాయిలో రుణాన్ని పొందిన వారు కేవలం 36 మందే. ఇక 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 584 మందికి రుణాలు అందించాలన్న ల్యోం కాగా.. 164 దరఖాస్తులకు అనుమతి లభించగా.. ఇంకా పూర్తి కావాల్సినవి 457 ఉన్నాయి. దీంతో దరఖాస్తుదారులు ఎప్పుడెప్పుడా అంటూ కార్యాలయం వచ్చి ఆరా తీస్తున్నారు. రుణమే లేని బీసీ కార్పొరేషన్ జిల్లాలో ఎక్కువ శాతం నిరుద్యోగులు బీసీ రుణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా రుణాలు మాత్రం మంజూరు చేయడం లేదు. గత రెండేళ్లుగా ఈ శాఖ పరిధిలో రుణాల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. అంతకు ముందు 2015–16 ఆర్థిక సంవత్సరంలో వివిధ కులసంఘాలు, సమాఖ్యలకు కలిసి మొత్తం 18 యూనిట్లకే ప్రభుత్వం అనుమతి ఇచ్చి.. 12 యూనిట్లకు రుణాలు మంజూరు చేశారు. అంటే మూడేళ్ల క్రితం నాటి దరఖాస్తులే ఇంకా ఆరు మిగిలిపోయాయి. ఇక 779 మందికి వ్యక్తిగత రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా.. 698 మంజూరయ్యాయి. అయితే, ఇందులోనూ ఎందరు ప్రత్యక్షంగా బ్యాంకుల ద్వారా రుణాలు పొందారన్న విషయంలో స్పష్టత లేదు. గతంలో గుడుంబా తయారీ, అమ్మకాలు వదిలిన 258 మందికి రూ.2.50 కోట్ల రుణసహాయాన్ని అందజేశారు. ఇవే కాకుండా 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి ఒక్కరికీ రుణం ఇవ్వకపోగా.. కనీసం దరఖాస్తులకు అÐ కాశం కూడా కల్పించకపోవడం గమనార్హం. ఎస్టీ కార్పొరేషన్లో ప్రారంభం ఎస్టీ కార్పొరేషన్లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే రుణాలు త్వరగానే మంజూరు చేసే అవకా>శం ఉంది. అయితే వివిధ కార్యాలయాల్లో లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల మదింపు, జిల్లా కార్యాలయానికి వాటిని పంపించడంలో జాప్యం జరుగుతోంది. 2017–18లో 584 యూనిట్లకు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా.. 164 దరఖాస్తులను అనుమతించారు. అంటే ఇంకా 457 దరఖాస్తులు పరిశీలన స్థాయిలోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ధరఖాస్తులను పరిశీలిం చడం, అర్హులైన వారి ఎంపికకు సంబంధించి వివరాలు, హార్డ్కాపీలను జిల్లా కార్యాలయానికి పంపించడంలో మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే ఈ జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇబ్బందులు నిరుద్యోగులు జిల్లాలోని నిరుద్యోగులకు ఏళ్ల తరబడి రుణాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుండడంతో ఎందరో ఎదురుచూపుల్లో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిగత, సమాఖ్యలు, సహకార సంఘాలు, కులవృత్తి సంఘాలకు సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడంతో చాలా మంది యువకులు వీటిపై ఆశలు పెట్టుకున్నా ప్రభుత్వ జాప్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. ఎంపిక చేసిన వారందరికీ రుణాలు దరఖాస్తు చేసుకున్న అందరికీ రుణాలు మంజూరు చేస్తాం. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ సంబంధం లేకుండా ఎంపిక చేసిన అందరికీ సబ్సిడీ వచ్చిన వెంటనే అందజేసే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం తప్పక రుణాలు అందజేస్తాం. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి చాలా వరకు మంజూరయ్యాయి. కొందరికి మాత్రం పలు సమస్యల కారణంగా రుణాలు రాలేదు.. – విజయ్కుమార్, ఎస్సీ సంక్షేమ,అభివృద్ది శాఖ అధికారి -
రగిలిన చిచ్చు
కాకినాడ రూరల్: కాపులను బీసీల్లో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చంద్రబాబు సర్కారు నిర్ణయంతో చిచ్చు రగిలింది. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడిన బీసీలు ఉద్యమ పథంలో కదం తొక్కారు. కాపు రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బీసీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త్తతకు దారి తీసింది. వందలాదిగా కలెక్టరేట్కు తరలివచ్చిన బీసీలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. టైర్లు తగులబెట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని కాజులూరు మండలం కోలంకకు చెందిన యువకుడు మేడిశెట్టి ఇజ్రాయిల్ ఆత్మహత్యా యత్నం చేశాడు. అక్కడే ఉన్న బీసీ నాయకులు స్పందించి నీరు పోయడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కలెక్టరేట్వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తోందంటూ పలువురు బీసీలు మండిపడ్డారు. జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ ఏం చెప్పిందో తేల్చకుండా కాపులకు అశాస్త్రీయంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం తగదన్నారు. కేవలం కమిషన్ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాపులకు, బీసీలకు మధ్య గొడవలు సృష్టించడానికే చంద్రబాబు ప్రభుత్వం ఈ బిల్లు తేవడానికి ప్రయత్నించినట్టుందంటూ మండిపడ్డారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో కలుపుతూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి.. ఆందోళనలో పాల్గొన్న పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు రాష్ట్రంలోని బీసీ నాయకులంతా సమావేశమై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలగజేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని వ్యతిరేకిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావనో, మంత్రి పదవులు రావనో అనుకునేవారికి ఎమ్మెల్యే అవకుండానే బీసీలంతా బుద్ధి చెబుతారన్నారు. కాపుల ఓట్లతోనే ఎమ్మెల్యేలుగా గెలుస్తామని అనుకుంటే ఏవిధంగా చేయాలో బీసీలందరూ నిర్ణయిస్తారని అన్నారు. చంద్రబాబు ప్రకటిస్తే అయిపోయేది కాదని, దీనిని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సహితం ఖాతరు చేయనివారికి సరైన గుణపాఠం చెబుతామని మల్లాడి స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి సహకరించిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు, బీసీ ఆందోళనకు సహకరించని ప్రజాప్రతినిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చడానికి తాను పూర్తిగా వ్యతిరేకినని అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. దేశంలో ఎవరు ఉన్నత పదవుల్లో ఉన్నా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందేనని గుర్తు చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో వెనుకబాటుతనం ఉన్నవారు మాత్రమే రిజర్వేషన్లకు అనుకూలమని రాజ్యాంగం చెబుతోందని వివరించారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు రాజ్యాంగానికి లోబడే ఉన్నాయన్నారు. ఈ ఆందోళనలో రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, మాకినీడి భాస్కర్, పంపన రామకృష్ణ, కడలి ఈశ్వరి, గుబ్బల వెంకటేశ్వరరావు, కుండల సాయికుమార్, ఎ.శ్రీనివాసరావు, వాసంశెట్టి త్రిమూర్తులు, గరికిన అప్పన్న తదితరులు కూడా పాల్గొన్నారు. -
కాపులకు రిజర్వేషన్లపై బీసీల కన్నెర్ర
అమలాపురం టౌన్: కాపులను బీసీల్లో చేర్చుతూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై అమలాపురంలో బీసీలు కన్నెర చేశారు. రోడ్డెక్కి నిరసన తెలిపారు. బీసీల రిజర్వేషన్లను హరించేందుకు కుట్ర పన్నిన ముఖ్యమంత్రి చంద్రబాబు శవ యాత్ర నిర్వహించారు. చంద్రబాబు దిష్టి బొమ్మ దహనం చేశారు. బీసీలను సామాజికంగా అణిచి వేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిం దని రాష్ట్ర బీసీ నాయకులు ధ్వజమెత్తారు. తొలుత సూర్యనగర్లోని బీసీ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహం ఆవరణలో కోనసీమ బీసీ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్ర బీసీ సంఘాల కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంజునాథ కమిషన్ అధ్యక్షుడైన మంజునాథ్ లేకుండా కొంతమంది సభ్యులతో ఆదరాబాదరగా కేబినెట్ టేబుల్ నోట్ కింద అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం ఓ పథకం ప్రకారం చేశారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా గ్రామ గ్రామాన బీసీలు ధర్నాలు, రాస్తారోకోలతో తమ ఆవేదన, ఆగ్రహాన్ని తెలపాలని సమావేశం పిలుపునిచ్చింది. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి, గడియారం స్తంభం సెంటరుకు చేరుకుని, దిష్టిబొమ్మను దహనం చేశారు. వివిధ బీసీ కులాలు, సంఘాల నాయకులు మట్టపర్తి మురళీకృష్ణ, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి బాబు, మట్టపర్తి నాగేంద్ర, వాసంశెట్టి సత్యం, పేట వెంకటేశ్వరరావు, కుడుపూడి త్రినాథ్, తాళాబత్తుల లక్ష్మణరావు, ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కాళే వెంకటేశ్వరరావు, కుడుపూడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి సుభాష్, ఐవీ సత్యనారాయణ, కుంజే సుబ్బరాజు, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు ధర్నా, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి రాజోలు: కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్న సమయంలో కనీసం మాట్లాడలేని బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఆ పార్టీ నుంచి బయటకు రావాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తాటిపాకలోని రాజోలు తాలూకా శెట్టిబలిజ సంఘ భవనం ఎదుట 216 జాతీయ రహదారిపై శనివారం బీసీ సంఘ నాయకులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటన్నారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అసెంబ్లీలో కాపు మహిళలు జీడిపప్పు వలుస్తూ కష్టాలు పడిపోతున్నారని మాట్లాడారని, బీసీ కులాల్లో ఉన్న మహిళలు కల్లు అమ్మడం, బట్టలు ఉతకడం, కూలి పనులకు వెళ్లడం కనిపించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే సూర్యారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘ నాయకులు గుబ్బల బాబ్జి, చెల్లుబోయిన రాంబాబు, గుబ్బల శ్రీను, కంబాల చంద్రరావు, గుబ్బల నరేంద్రకుమార్, యనమదల సీతారామరాజు, మట్టపర్తి రెడ్డి, మామిడిశెట్టి మనోహర్, చెల్లుబోయిన శ్రీను, బొమ్మిడి వెంకటేష్, గుబ్బల రమేష్, చింతా రామకృష్ణ, గెద్దాడ రాంబాబు, వెలుగొట్ల శ్రీను, మొల్లేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కార్పొరేషన్కు నిధులివ్వండి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్కు బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించ డం లేదని ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా బీసీ కార్పొరేషన్తో పాటు ఫెడరేషన్లకు నిధుల కేటాయింపు నిలిచిపో యిందన్నారు. బీసీ కార్పొరేషన్కు ఈ వార్షిక సంవత్సరంలో రూ.2 వేల కోట్లు, ఫెడరేషన్లకు కూడా ప్రత్యేక నిధులు కేటా యించి విడుదల చేయాలన్నారు. ఈ నిధులు విడుదలయితేనే స్వయం ఉపాధి పథకాలు ముందుకు సాగుతాయని ఆయన ఆదివారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. గతేడాది వరకు రూ.1,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. నిధులు విడుదల కాలేదన్నారు. కార్పొ రేషన్లు, ఫెడరేషన్ల ఖాతాల్లోని మిగులు నిధులను సైతం ప్రభుత్వం ఇతర కార్యక్ర మాలకు వినియోగించిందన్నారు. ఫలితం గా సంస్థలు నిర్వీర్యమయ్యే దుస్థితికి వచ్చాయన్నారు. -
చచ్చిపోతా... అనుమతివ్వండి
గ్రీవెన్స్సెల్లో తెలంగాణ ఉద్యమకారుడి విజ్ఞప్తి వరంగల్ రూరల్: తెలంగాణ పోరాటంలో పాల్గొన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని లేని పక్షంలో ‘మెర్సీ కిల్లింగ్’ పద్ధతిలో చనిపోయేందుకు అనుమతించాలని వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లికి చెందిన ఆకుల సాంబరావు కోరారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్సెల్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం సాంబరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పదిహేనేళ్ల పాటు పాల్గొన్న తాను మానసిక క్షోభకు గురికావడంతో పాటు వివిధ వ్యాధుల బారిన పడ్డానని పేర్కొన్నారు. ఇకనైనా సీఎం సహాయ నిధి నుంచి చికిత్స కోసం ఆర్థిక సాయం అందజేయడంతో పాటు ఉపాధి నిమిత్తం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని కోరారు. లేనిపక్షంలో మెర్సీ కిల్లింగ్ పద్ధతిలో చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ఎంబీసీ కార్పొరేషన్ ఫైలుపై సీఎం సంతకం
సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) అభ్యున్నతికి రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆమోదం తెలిపారు. కార్పొరేషన్ ఫైలుపై శుక్రవారం సంతకం చేశారు. సంబంధిత ఉత్తర్వులు శనివారం వెలువడనున్నాయి. బీసీ కార్పొరేషన్ను కొనసాగిస్తూనే.. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంబీసీడీసీ) ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బడ్జెట్లోనే నిధులు కేటాయించి, కార్పొరేషన్ ద్వారా ఎంబీసీల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈనెల 20న జనహితలో ఎంబీసీ వర్గాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఫైలు సిద్ధమైంది. కాగా, ఎంబీసీ ప్రతినిధులతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం ముందుగానే ప్రకటించారు. దీంతో నామినేటేడ్ పదవుల భర్తీలో భాగంగా ఈ పదవులూ పార్టీ శ్రేణులను ఊరిస్తున్నాయి. -
బీసీ కార్పొరేషన్ ఈడీగా పెంతోజీరావు
విజయవాడ(చిలకలపూడి) : బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జి.పెంతోజీరావును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంతోజీరావు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఈడీ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న పుష్పలతను బదిలీ చేశారు. -
రుణ లబ్ధిదారుల జాబితా
► పూర్తయిన ఎస్సీ రుణాలు ► కొలిక్కిరాని బీసీ రుణాల జాబితా ► 1:4తో బ్యాంకర్లకు బీసీ జాబితా అందజేత కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ రుణలబ్ధిదారుల జాబితాను ప్రకటించారు. బీసీ రుణాల కోసం తీవ్ర పోటీ ఉండడంతో 1:4 ప్రాతిపదికన బ్యాంకులకు లిస్టును అందించారు. జనవరి 20, 21 తేదీల్లో నగరపాలక సంస్థలో లబ్ధిదారుల ఎంపికకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకర్లతో ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలు పూర్తరుు 40 రోజుల తర్వాత లబ్ధిదారుల జాబితాను ప్రకటించారు. 608 యూనిట్లకు 764 దరఖాస్తులు రాగా.. బీసీ రుణాలకు 106 యూనిట్లకు 1184 దరఖాస్తులు వచ్చాయి. పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో ఎంపిక ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. 1:4 జాబితాను తయారు చేసి ప్రదర్శనకు పెట్టడంతో గందరగోళం నెలకొంది. తుది నిర్ణయంపై సందిగ్ధం ఏర్పడింది. బ్యాంకు కాన్సెంట్లతో సంబంధం లేదని చెప్పిన అధికారులు మార్కులు పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. నగరంలోని అన్ని బ్యాంకులకు రుణాల మంజూరు లక్ష్యం నిర్ణరుుంచగా.. 11 బ్యాంకుల పరిధిలో ఒక్క దరఖాస్తు రాలేదు. ఆయా బ్యాంకుల టార్గెట్లను ఎలా భర్తీ చేయాలనేది ప్రశ్నగానే మిగిలింది. లబ్ధిదారుల్లో కార్పొరేటర్లు రుణాల ఎంపికలో రాజకీయ జోక్యం జోరుగా నడిచినట్లు తెలుస్తోంది. జాప్యానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని తేటతెల్లమైంది. ఎస్సీ రుణాల లబ్ధిదారుల జాబితాలో ఇద్దరు కార్పొరేటర్లు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఐదో డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ రూ.8 లక్షలు, ఏడో డివిజన్ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్ సతీమణి మాజీ కార్పొరేటర్ లింగంపల్లి సుజాత రూ.10 లక్షల రుణానికి ఎంపికయ్యారు. -
సీఎం సభలంటే హడల్
ప్రజలను తరలించాలని టీడీపీ నేతల హుకుం తడిసి మోపెడవుతున్న ఖర్చులు నగదు విడుదల చేయని ప్రభుత్వం అధికార పార్టీ తీరుతో నలిగిపోతున్న అధికారులు సీఎం సభలంటే ప్రభుత్వ అధికారులు హడలిపోతున్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో జరిగే సభలకు ప్రజలను తరలించాలని అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేస్తుండడం..ఇందుకు సంబంధించిన ఖర్చులను ప్రభుత్వం విడుదల చేయకపోతుండడంతో అధికారులు నలిగిపోతున్నారు. సొంత ఖర్చులతో జనాలను తరలించలేక సతమతమవుతున్నారు. నెల్లూరు(సెంట్రల్): ప్రభుత్వ తీరుతో జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులు నలిగిపోతున్నారు. ఇతర జిల్లాల్లో జరిగే బీసీ కార్పొరేషన్ కార్యక్రమాలకు జిల్లా నుంచి జనాలను తరలించాలని అధికార పార్టీ నేతలు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నగదు విడుదల చేయడం లేదు. సొంత ఖర్చులతో తరలించాల్సి రావడంతో అధికారులు హడలిపోతున్నారు. రూ.1.50 లక్షలకు పైసా ఇవ్వలేదు ఈ నెల 11న విజయవాడలో సీఎం చంద్రబాబు బీసీ రుణమేళా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నుంచి సుమారు 120 నుంచి 150 మందికి తగ్గకుండా జనాలను తీసుకురావాలని సంబంధిత అధికారులను పురమాయించారు. అప్పట్లో అధికారులు సొంత నగదు పెట్టుకుని మూడు బస్సులు, ఇతర వాహనాల్లో తీసుకుని పోయారు. ఇందుకు గానూ రూ.1.50లక్ష ఖర్చు అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఇంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని సమాచారం. 150 మందికి తగ్గకూడదు తాజాగా గుంటూరు సమీపంలో గురువారం జరగనున్న బీసీ రుణమేళాకు సంబంధించి జిల్లా నుంచి 150 మందికి తగ్గకుండా జనాభాను తీసుకురావాలని బీసీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు మొత్తం మూడు బస్సులు, ఇతర వాహనాల్లో జనాలను తరలించారు. ఒక్కో మనిషికి రానుపోను చార్జీలు, భోజనం, ఇతర ఖర్చులు కలిపి కనీసం రూ.1 వెయ్యి అవుతుంది. ఈ లెక్కన 150 మందికి సుమారుగా రూ.1.50 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రెండు సభలకు గానూ అధికారులకు సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు అయింది. అయితే ప్రభుత్వం రెండింటికి కలిపి రూ.60 వేలు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిసారి జిల్లా నుంచి జనాభాను తీసుకురావాలని చెబుతుండడంతో సొంత నగదు పెట్టలేక అధికారులు సతమతవుతున్నారు. అంతేగాకుండా బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమ శాఖ అధికారులను మూడు రోజుల ముందు నుంచే విజయవాడలో ఉండమని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో పని పెండింగ్లో పడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. నిట్టూర్చుతున్న లబ్ధిదారులు ఇతర జిల్లాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లేందుకు బీసీ కార్పొరేషన్ లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. జిల్లాలో అయితే వస్తాం.. మీరు ఇచ్చే రుణాల కోసం ప్రతిసారి ఇతర జిల్లాలకు రాలేమని పలువురు బీసీ కార్పొరేషన్ రుణ లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. విజయవాడ, గుంటూరులో సమావేశాలు ఏర్పాటు చేసే సమయంలో చుట్టుపక్కల వారిని తీసుకురావాలే తప్ప జిల్లా నుంచి జనాభాను తరలించుకుపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం సభలకు జనాభా రాలేదని తమను తరలించాలని చూడడం ఎంతవరక సబబని వాపోతున్నారు. -
బీసీ రుణాలకు ‘లాక్’
అప్లోడ్ కాని 3 వేల మంది దరఖాస్తులు 2015-16 ఆర్థిక సంవత్సరంలో నెరవేరని లక్ష్యం బ్యాంకర్లు సహకరించినా ఫలితం శూన్యం కర్నూలు(అర్బన్):జిల్లాలోని బీసీ వర్గాలకు చెందిన రుణాలకు ‘లాక్ ’ పడింది. దీంతో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం నెరవేరని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 5,940 మందికి రూ.16 కోట్ల మేర రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని 5209 మందికి, మున్సిపల్ ప్రాంతాల్లోని 731 మందికి రుణాలు అందించాల్సి ఉంది. అయితే లబ్ధిదారుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని తాజాగా రూ.5.80 కోట్లకు సవరించారు. సవరించిన లక్ష్యం మేరకు రూ.5.80 కోట్లను 1694 మందికి మాత్రమే సర్దుబాటు చేయనున్నారు. ఈ మేరకు వీరికి మాత్రమే రుణ మంజూరు ఉత్తర్వులను అందించనున్నారు. దాదాపు 3 వేలకు పైగా లబ్ధిదారులకు రుణాలు మంజూరైనా, సబ్సిడీ కోసం వారి బ్యాంకు ఖాతా నెంబర్లను అప్లోడ్ చేసేందుకు వీలు లేని పరిస్థితి నెలకొనింది. హైదరాబాద్ ఉన్నతాధికారి కార్యాలయంలో అప్లోడ్ చేసేందుకు ఫ్రీజింగ్ విధించిన కారణంగా బ్యాంకు ఖాతా నంబర్లు అప్లోడ్ కావడం లేదు. మూడు వేల మంది దరఖాస్తులు అప్లోడ్ కాకపోవడం, లక్ష్యానికి సంబంధించి 1246 దరఖాస్తులు మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. బ్యాంకర్లు సహకరించినా .... ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఈ మేరకు బ్యాంకర్లు కూడా తమ సహకారాన్ని అందించి రుణాలు అందించేందుకు అర్హులైన వారికి అంగీకార పత్రాలను కూడా అందించారు. అయినా ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిన కారణంగా సబ్సిడీ రుణాలు అందని పరిస్థితి నెలకొనింది. ఫ్రీజింగ్ తొలగించకుంటే ... ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా మందికి రుణాలు విడుదల కావు. -
‘బీసీ’ పథకాల గ్రౌండింగ్ 15 రోజుల్లో చేయాలి
- మంత్రి జోగురామన్న ఆదేశం సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్, 11 ఫెడరేషన్ల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలలో అన్ని గ్రామాల లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న ఆదేశించారు. ప్రస్తుత ఏడాదికి సంబంధించి (2015-16) స్వయం ఉపాధి పథకాల గ్రౌండింగ్ను 15 రోజుల్లో పూర్తిచేసి, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని అన్నారు. ధోబీఘాట్ల నిర్మాణాల్లో జాప్యం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి చాంబర్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ శాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్, కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు, పది జిల్లాల ఈడీలు పాల్గొన్నారు. వచ్చే ఏడాది (2016-17) రాష్ట్రవ్యాప్తంగా 50 వేలమందికి సబ్సిడీతో కూడిన రుణాల మంజూరుకు కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది బీసీలకు స్వయం ఉపాధిని కల్పించేందుకు ఆర్థికసాయంతో పాటు వృత్తినైపుణ్యం పెంచేందుకు ప్రత్యేకదృష్టిని సారించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధిలో భాగంగా సెవెన్సీటర్ ఆటోలను ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, చేతివృత్తుల వారికి ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మేదర, కుమ్మర వంటి వివిధ చేతివృత్తులవారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. -
బీసీ రుణాల్లో భారికోత
స్వయం ఉపాధి బాట పడదామనుకున్న యువత చేతులకు ప్రభుత్వం సంకెళ్లు వేస్తుంది. ఉన్నత చదువులు చదివినా... ఉద్యోగం రాని పురుషులు, మహిళలు స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపినా సర్కార్ వారి ఆశలపై నీళ్లు జల్లుతుంది. బీసీల సంక్షేమానికి హామీ ఇస్తూనే... వారిని సంక్షోభంలోకి నెడుతోంది. వెనుకబడిన తరగతుల యువతకు ఇచ్చే రుణాల్లో కోత విధించింది. బీసీ రుణాలను ఏటా తగ్గిస్తోంది. గతంలో ప్రకటించిన రుణాలు కూడా ఇప్పటికీ మంజూరు చేయలేదు. మళ్లీ జాబితాలు పంపించాలి బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయనున్న యూనిట్లకు మరలా జాబితాలు సమర్పించాలని మండల పరిషత్ అభివృద్ధి, పురపాలక సంఘం అధికారులను కోరాం. గతంలో పంపిన జాబితాను సరిచేసి అందజేయాలని చెప్పాం.- శ్రీహరిరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం బీసీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ఇచ్చే రుణాల్లో భారీ కోత విధించింది. చాలా తక్కువ యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితాను మళ్లీ తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించింది. వివరాలు ఇలావున్నాయి. జిల్లాలో 38 మండలాల్లోని బీసీలకు సంబంధించి 2014-15 సంవత్సరంలో 5547 యూనిట్లను ల క్ష్యంగా నిర్దేశించింది. ఇందుకుగాను రూ. 1517.60 లక్షలను కేటాయిస్తున్నట్టు పేర్కొంది. జిల్లాలోని 18,89,535 బీసీ జనాభా నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశిస్తూ అర్హతలను ప్రకటించింది. దీని ప్రకారం బీసీ కో-ఆపరేటివ్ సర్వీస్ లిమిటెడ్ అధికారులకు ఎంపీడీవోల ద్వారా అర్హుల జాబితా అందింది. జన్మభూమి కమిటీల ఆమోదంతో పంపించాలని ప్రభుత్వం చెప్పడంతో ఆ మేరకే అర్హుల దరఖాస్తులను అందించారు. దరఖాస్తులు చేసుకున్న వారంతా త్వరలో రుణాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 70 శాతం మేర కోత పెట్టింది. జిల్లాకు గతంలో కేటాయించిన 5547 యూనిట్లకు గాను 1616 యూనిట్లు మాత్రమే మంజూరు చేయాలని ఆదేశించింది. ఇందుకు రూ. 442 లక్షలు మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. ఇంత భారీ కోత విధించడంతో అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి నివేదించగా వీరిలో 70 శాతం మందిని ఎలా తొలగించాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. కొత్త జాబితాను ఫిబ్రవరి 10లోగా నివేదించాలని సర్కార్ చెప్పడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు. జాబితా నుంచి తొలగించేవారికి ఏం చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే రుణాలు మంజూరునకు ఆమోదం తెలపాలంటే లబ్ధిదారులు కొంత ముట్టజెప్పాలని కొందరు జన్మభూమి కమిటీ సభ్యులు వసూళ్లు సాగించారు. ఇటువంటివారంతా ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీరుపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, రుణాల్లో భారీ కోత వల్ల బీసీల నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల వద్ద చెబుతున్నా వారు సైతం చేతులెత్తేస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు ప్రకటనలు చేస్తూ లోలోన వారికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుండటంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
రుణాలకు రూ.1200 కోట్లు కేటాయించాలి- కృష్ణయ్య
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాల మంజూరు చేసేందుకు బడ్జెట్లో అదనంగా రూ.1200 కోట్లు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు. ఈ ఏడాది బీసీ కార్పొరేషన్ రుణాలకోసం 1.31.376 దరఖాస్తులు వచ్చాయని, అయితే ప్రభుత్వం కేటాయించిన రూ.125 కోట్ల బడ్జెట్తో కేవలం 14 వేలమందికే రుణాలు మంజూరు చేసేందుకు అంగీకరించారన్నారు. ఈ రుణాల మంజూరు కోసం లబ్దిదారుల మధ్య తీవ్రమైన పోటీ ఉందన్నారు. గురువారం సీఎంకు ఆయన ఒక లేఖ రాస్తూ మిగిలిపోయిన 1.17 లక్షల మందికి అదనంగా రుణాలు మంజూరు చేయడానికి రూ.1200 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందన్నారు. బీసీ కార్పొరేషన్కు 2016-17 బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. 2014-15లో, అంతకుముందు బ్యాచ్లో దరఖాస్తు చేసుకున్నవారికి, మొత్తం రుణాల మంజూరుకు రూ.400 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. -
‘స్వయం ఉపాధి’కి దరఖాస్తుల వెల్లువ
సాక్షి. హైదరాబాద్: స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుండగా, ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు కలుపుకుని 1.30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నాటికి బీసీ కార్పొరేషన్కు 1,03,000 దరఖాస్తులు, 10 బీసీ ఫెడరేషన్లకు 17 వేలు, ఎస్సీ కార్పొరేషన్కు 10,600, ఎస్టీ కార్పొరేషన్కు 6 వేల వరకు దరఖాస్తులు అందాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ద్వారా 2015-16లో పథకాలకు రూ.లక్షకు 80 శాతం రాయితీ(సబ్సిడీ)తో, రూ.2 లక్షలకు 70 శాతం రాయితీ, రూ.10 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ(5 లక్షలకు మించ కుండా)తో రుణాలు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళికలను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రూ.లక్ష వరకు గరిష్ట రుణానికి 60 శాతం వరకు సబ్సిడీని ఇస్తుండగా, ప్రస్తుతం గరిష్ట రుణ సౌకర్యాన్ని రూ.10 లక్షల వరకు పెంచడం (60 శాతం సబ్సిడీ రూ.5 లక్షలు దాటకుండా)తో ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. బీసీ కార్పొరేషన్ 2015-16 లో 17 వేల మందికి, బీసీ ఫెడరేషన్ల ద్వారా దాదాపు 15 వేలమంది వరకు లబ్ధి చేకూరే అవకాశముంది. రూ.5-10 లక్షల మధ్య రుణం కోసం దాదాపు 40 వేల దరఖాస్తులురాగా వాటిలో 400 లోపే రుణాలు అందే అవకాశాలున్నాయి. రూ.లక్ష వరకు రుణాలకు 20 వేలకుపైగా, రూ.2 లక్షల రుణాలకు 40 వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యనిచ్చే రుణాలకు వచ్చే దరఖాస్తుల్లో అన్ని అర్హతలను పరిశీలించి, రుణానికి అర్హత పొందిన లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేయాలనే అభిప్రాయంతో బీసీ సంక్షేమ శాఖ ఉంది. కల్లుగీత ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇతరత్రా మరో నెలరోజుల ఆలస్యం కానుండగా, వారికి ఆ మేరకు సమయాన్ని ఇచ్చి కొత్త ఫెడరేషన్ కింద లబ్ధి చేకూర్చాలని బీసీ శాఖ నిర్ణయించింది. దళారులను నమ్మి మోసపోవద్దు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో దళారులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని బీసీ కార్పొరేషన్, 11 ఫెడరేషన్ల ఎం.డి.మల్లయ్యభట్టు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా రుణాలిప్పిస్తామని, డబ్బులు అడిగితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘బీసీ’ సబ్సిడీ 80%
- కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల మార్గదర్శకాల జారీ - రూ.లక్ష లోపు 80శాతం, రూ.1-2లక్షల వరకు 70శాతం - రూ.2-10లక్షల వరకు 60 శాతం సబ్సిడీ సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల్లో సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. రూ.లక్షలోపు రుణాలకు 80శాతం, రూ.లక్ష-2లక్షల వరకు 70శాతం, రూ.2-10 లక్షల వరకు 60శాతం (రూ.5లక్షలకు మించకుండా) సబ్సిడీ అందజేయనుంది. యూనిట్ కాస్ట్ పరిమితిని కూడా గతంలో ఉన్న రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పెంచింది. ఇక బీసీ ఫెడరేషన్లకు ఆర్థిక సహాయాన్నీ భారీగా పెంచింది. సొసైటీల్లో ఒక్కో సభ్యుడికి రూ.లక్ష వరకు సబ్సిడీ, మరో రూ.లక్ష బ్యాంకు రుణంగా అందజేయనున్నారు. అంటే 15 మంది సభ్యులున్న సొసైటీకి రూ.30 లక్షల వరకు అందుతుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. విడివిడిగా కార్యాచరణ.. 2015-16కు సంబంధించి స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలను పట్టణ ప్రాంతా ల్లో రాజీవ్ అభ్యుదయ యోజనగా, గ్రామీణ ప్రాంతాల్లో మార్జిన్ మనీ స్కీం పేరు మీద అమలుచేస్తారు. రూ.లక్షలోపు రుణానికి 80 శాతం, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణంపై 70 శాతం, రూ.2లక్షల నుంచి రూ.10 లక్షలలోపు రుణంపై 60 శాతం (రూ. 5లక్షలకు మించకుండా) సబ్సిడీ అందజేస్తారు. దీంతోపాటు మిగతా సొమ్మును బ్యాంకు నుంచి రుణంగా అందజేస్తారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 2014-15 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యూనిట్కాస్ట్ రూ.లక్షకు మించకుండా 50 శాతం సబ్సిడీతో మాత్రమే రుణాలిచ్చారు. తాజాగా యూనిట్ కాస్ట్ను, సబ్సిడీని భారీగా పెంచారు. ఇక ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేం దుకు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షన్నరకు... పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రూ. 2లక్షలకు పెంచనున్నారు. ఇందుకు సంబంధించి విడిగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. 11 బీసీ ఫెడరేషన్లకు.. బీసీశాఖ పరిధిలోని 11 బీసీ ఫెడరేషన్లకు 2015-16కుగాను సవరించిన కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. 2014-15 వరకు ఒక్కో సభ్యుడికి రూ.25 వేల చొప్పున 15 మంది ఉన్న సొసైటీకి గరిష్టంగా రూ.3.75 లక్షలు రుణం ఇచ్చేవారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక్కో సభ్యుడికి రూ.లక్ష సబ్సిడీ (50శాతం), రూ.లక్ష బ్యాంకు రుణం (50శాతం)గా ఇవ్వనున్నారు. మొత్తంగా 15 మంది సభ్యులున్న సొసైటీకి రూ. 30 లక్షలు (రూ.15 లక్షలు సబ్సిడీ, రూ.15 లక్షలు బ్యాంకు రుణం) అందిస్తారు. ఈ లెక్కన ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు అందజేస్తారు. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలపై కసరత్తు చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల బృందం నాలుగు నెలల కిందే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అన్ని వర్గాలకూ ఒకే రాయితీ విధానాన్ని అనుసరించాలని సూచించింది. అయితే తొలుత బీసీ శాఖకు సంబంధించి విధానాన్ని ప్రకటించారు. ఎస్సీ కార్పొరేషన్కు నూతన విధానం గతంలోనే సీఎం ఆమోదం పొందింది. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇక మిగతా కార్పొరేషన్లకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. -
బీసీలకు రూ.190 కోట్ల రుణాలు
కర్నూలు(అర్బన్) : రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 70వేల మంది బీసీలకు రూ.190 కోట్ల రుణాలను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాలు’ బీసీ కార్పొరేషన్ ఎండీ కె.మల్లికార్జున అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో 23వేల మంది బీసీ లబ్ధిదారులకు రూ.126 కోట్లను రుణాలుగా అందించామన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష వరకు లబ్ధిదారులకు సబ్సిడీని పెంచామన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలను అందించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు చేపడతారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ ఆచరణలో వున్న విధంగానే బీసీ కాలనీల్లో మౌలిక వసతులను కల్పించేందుకు, బీసీ కులాలకు ఆర్థిక చేయూతనందించేందుకు రూ.6,640 కోట్లతో బీసీ సబ్ప్లాన్ను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో బ్యాంకు కోచింగ్ స్థాయి నుంచి గ్రూప్స్కు కూడా నిరుద్యోగ యువతకు శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నందున బ్యాంకులకు డ్వాక్రా సంఘాలపై పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను బీసీ వర్గాల సంక్షేమానికి విడుదల చేస్తున్నా, బ్యాంకులు సహకరించకపోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగిన చేనేత కళాకారుల ముఖాముఖి కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యేలు బీసీ జనార్ధన్రెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ డెరైక్టర్ కృష్ణమోహన్, గొర్రెల సహకార సంఘం చైర్మన్ వై.నాగేశ్వరరావు.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కమిటీ సభ్యుడు ఆకెపోగు ప్రభాకర్, టీడీపీ డోన్ ఇన్చార్జి కేఈ ప్రతాప్, బీసీ కార్పొరేషన్ ఈడీ పీవీ రమణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.సంజీవరాజు పాల్గొన్నారు. పాత ఇస్త్రీ పెట్టెలు, ఆటోలు చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాల్లో భాగంగా జిల్లాకు వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర కళ్లకు అధికారులు గంతలు కట్టారు. సునయన ఆడిటోరియం పక్కన ఏర్పాటు చేసిన యూనిట్ల స్టాల్స్లో గత రెండు, మూడు సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న పాత ఇస్త్రీ పెట్టెలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇప్పించడం గమనార్హం. స్టాల్లో రెండు కొత్త ఇస్త్రీ పెట్టెలు పెట్టి, మిగిలిన ఐదు పాత ఇస్త్రీ పెట్టెలను ఉంచడం పట్ల పలువురు విస్తుపోయారు. అలాగే పాత ఆటోలను కూడా మంత్రి రవీంద్రకు చూపించడం విడ్డూరం. కాగా గతంలో మంజూరైన యూనిట్లనే ఇప్పుడు ప్రదర్శనకు ఉంచామని అధికారులు చెప్పడం కొసమెరుపు. -
‘కార్పొరేషన్’ రుణం.. ‘కొందరికే’ పరిమితం
రుణ గ్రహీతల్లో రాజకీయ నాయకులు, పైరవీకారులే అధికం నకిలీ సర్టిఫికెట్లతో పొందినవారు మరికొందరు అర్హులకు మొండిచేయి బాన్సువాడ టౌన్ : ధన, రాజకీయ బలమున్న వారికే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. నిరుద్యోగులకు, నిరుపేదలకు అందాల్సిన సబ్సిడి రుణాలను రాజకీయ నాయకులు, పైరవీకారులకు దక్కుతున్నాయి. కొందరైతే ఏకంగా నకిలీ సర్టిఫికెట్లతో సబ్సిడీ రుణాలు పొందుతున్నారు. ఇటీవల బాన్సువాడలో మంజూరైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలే నిదర్శనం. రుణం కోసం ఎస్సీ కార్పొరేషన్కు దరఖాస్తు చేసిన 30 మందిలో 15 మందికి మాత్రమే మంజూ రైంది. ఎస్టీ కార్పొరేషన్కు 90 మంది దరఖాస్తు చేయగా 65 మందికి, బీసీ కార్పోరేషన్కు 80 మంది దరఖాస్తు చేయగా 16 మందికి, మైనార్టీ కార్పొరేషన్కు 96 మంది దరఖాస్తు చేయగా 73 మందికి మాత్రమే సబ్సిడీ రుణాలు మంజూరయ్యాయి. సంబంధిత కార్పొరేషన్ అధికారులను ‘మచ్చిక’ చేసుకున్న వారికి, పైరవీ చేసుకున్న వారికి మాత్రమే రుణాలు అందాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. కొందరు నకిలి సర్టిఫికెట్లతో సబ్సిడీ రుణాలు పొందారన్న ఆరోపణలు కూడా వినవస్తున్నారుు. అన్ని అర్హతలున్నప్పటికీ రుణ మంజూరు జాబితాలో తమ పేరు లేకపోవడం, రాజకీయ నాయకులు.. పైరవీకారుల పేర్లు ఎక్కువగా ఉండడంపై మిగతా దరఖాస్తుదారులు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క లబ్ధిదారుడు/రాలు ఒక్కసారి సబ్సిడీ రుణం పొందినట్టయితే.. మరో ఐదేళ్ల వరకు పొందకూడదు. కానీ బాన్సువాడలో ప్రతి ఏటా సబ్సిడీ రుణాలు పొందుతున్న వారు అనేకమంది ఉన్నారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఐదేళ్లుగా తిరుగుతున్నా... సబ్సిడీ రుణం కోసం ఐదేళ్లుగా మండల పరిషత్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా. ఈసారైనా రుణం మంజూరవుతుందనే ఆశతో ఉన్నా. రుణం ఇస్తే ఏదైనా పనిచేసుకుని కుటుంబాన్ని పోషించాలనుకున్నా. నాయకులకు, ఆర్థిక బలం ఉన్నవారికే రుణాలు మంజూరయ్యూరుు. మాలాంటి గరీబోళ్లకు ఎవరూ న్యాయం చేస్తారు. - పోల్కం రాజు ‘నకిలీ’లపై నివేదిస్తాం నకిలి సర్టిఫికెట్లతో రుణాలు తీసుకున్నట్టరుుతే ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం. వారికి మంజూరైన రుణాన్ని రద్దు చేస్తాం. దరఖాస్తుదారుల జాబితాను అధికారులకు పంపించాం. అక్కడి నుంచే తక్కువ మందికి రుణాలు మంజూరయ్యాయి. - విజయభాస్కర్, ఎంపీడీఓ -
బీసీ కార్పొరేషన్లో బరితెగింపు!
విజయనగరం కంటోన్మెంట్: బీసీ కార్పొరేషన్లో కొంత సిబ్బంది బరితెగించారు. రుణాలను మంజూరు చేస్తూ కలెక్టర్ ఇచ్చిన తుది ఆదేశాలనే ఏకంగా మార్చేశారు. ఒక్కొక్క యూనిట్కు ఉన్న రుణ విలువను పెంచేసి కొత్తగా ఈ ప్రొసీడింగ్స్ను తయారు చేసి, బ్యాంకర్లకు పంపించేశారని సమాచారం. రూ.60 వేల యూనిట్ విలువను రూ. రెండు లక్షల వరకూ పెంచేశారు. ఇలా దాదాపు 40 యూనిట్లను పెంచేశారని సమాచారం. ఈ విషయం హైదరాబాద్లోని బీసీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి తెలిసినట్టు భోగట్టా! దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.51.60 కోట్ల విలువైన 9,393 యూనిట్లకు నిధులు మంజూరయ్యాయి. ఈ యూనిట్లకు సంబంధించి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే వాటిని కలెక్టర్ నేతృత్వంలోని మండల, జిల్లా కమిటీలు ఆమోదించిన తరువాత బీసీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయం ద్వారా ఓబీఎంఎంఎస్ పద్ధతిలో సబ్సిడీ విడుదలవుతుంది. ఈ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా 18,659 మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తరువాత రిజిస్టర్ చేసుకునే సర్వర్ను క్లోజ్ చేసేశారు. అనంతరం ఎంపిక జరిగింది. అయితే జన్మభూమి కమిటీల రాజకీయం కారణంగా 9,393 యూనిట్లకూ 4,426 యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. వీటిని కలెక్టర్ ఆమోదించి సిద్ధం చేశారు. ఇక్కడే అసలు కిరికిరి జరిగింది. కొందరు దరఖాస్తు చేసుకున్న రుణాలకు సంబంధించి బ్యాంకర్లు విల్లింగ్ ఇచ్చి తరువాత నిరాకరించడంతో వారు మరో బ్యాంకర్ వద్దకు వెళ్లి విల్లింగ్ తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి విల్లింగ్ మార్చాల్సి ఉందని, అందువల్ల సర్వర్ను కొద్ది సేపు ఓపెన్ చేసి ఉంచాలని సీజీజీ ఇన్చార్జిని, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్వీ నాగరాణి కోరారు. దీంతో సీజీజీ ఇన్చార్జి ఈ సర్వర్ను ఓపెన్ చేసి, తరువాత క్లోజ్ చేశారు. అయితే మరోసారి సర్వర్ను మార్చాలని బీసీ కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది కోరడంతో సీజీజీ ఇన్చార్జ్ మళ్లీ ఓపెన్ చేశారని, ఈ సమయంలోనే అవకతవకలు చోటుచేసుకున్నాయి తెలుస్తోంది. బ్యాంకుల పేర్లతో పాటు కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన యూనిట్ల రుణ విలువను పెంచేశారని సమాచారం. ఇది ఎవరు చేశారన్నది కార్యాలయంలో ఎవరికీ తెలియకపోవడం విడ్డూరం. ఉదాహరణకు పాచిపెంటకు చెందిన బి. సత్యనారాయణ అనే నిరుద్యోగికి కేటాయించిన యూనిట్ విలువ రూ.60వేలు ఉంటే దానిని రూ.2లక్షలుగా మార్చారు. దీనికి సంబంధించి పాత తేదీతోనే ప్రొసీడింగ్స్ ప్రింట్ తీసి ఈడీ టేబుల్పై పెట్టారని తెలిసింది. ఇలా దాదాపు 40 వరకూ మార్పు చేసినట్టు తెలిసింది. కొంతమంది లబ్ధిదారులు సిబ్బందికి డబ్బులిచ్చి ఈ విధంగా యూనిట్లు పెంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దిద్దుబాటు జరిగి, యూనిట్ల రుణ పరిమితిని పెంచిన ఫైళ్లు బీసీ కార్పొరేషన్ ఈడీ వద్ద ఉన్నట్టు తెలిసింది. దీనిపై ఈడీ నాగరాణిని వివరణ కోరగా దీనికి సంబంధించి ఇంకా సబ్సిడీ రుణాలు విడుదల కాలేదని, రుణ పరిమితి పెంచినట్టు తన దృష్టికి వచ్చిందని అంగీకరించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు వివరించనున్నామన్నారు. -
బీసీ రుణాలకు బ్యాంకర్ల తిరకాసు
నిబంధనల పేరిట కొర్రీలు రుణం మంజూరైనా అందని డీడీ ఫెడరేషన్లకు 25 దరఖాస్తులే నేటితో ముగియనున్న గడువు బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరీలో బ్యాంకర్ల నిబంధనలు లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారుు. చాలా చోట్ల బ్యాంకర్లు వ్యక్తిగత, ఫెడరేషన్ రుణాలకు సంబంధించిన కాన్సెంట్ , డీడీలు ఇవ్వడానికి నిబంధనల సాకుతో కొర్రీలు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వ్యక్తిగత రుణాలతో పాటు వివిధ కుల ఫెడరేషన్లకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసింది. వీటికి బ్యాంక్ కాన్సెంట్ తప్పనిసరి కావడంతో దరఖాస్తుదారులు కేటాయించిన బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నారు. కరీంనగర్ సిటీ : బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దొంతరవేని శ్రీనివాస్ డెయిరీ యూనిట్ కోసం బీసీ కార్పొరేషన్లో రూ.60వేల రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంక్ కాన్సెంట్తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను అందచేశాడు. రుణం మంజూరైనట్లు కలెక్టర్ పేరిట ఆర్సీ నెం.377/2014-15, తేదీ : 29/12/2014తో ప్రొసీడింగ్ జారీ అయింది. మూడు నెలల క్రితం శ్రీనివాస్కు సంబంధించిన నాన్ ఆపరేటింగ్ ఖాతాలో ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీని జమ చేసింది. దీనికి సంబంధిత బ్యాంక్ మేనేజర్ మోకాలొడ్డారు. హర్యానా గేదెనే కొనుగోలు చేయాలని, అక్కడికి వెళ్లి కొటేషన్ తెస్తేనే డీడీ ఇస్తానని షరతు విధించాడు. హర్యానాకు చెందిన ఒక్కో గేదె విలువనే సుమారుగా రూ.65 వేలు ఉంటుంది. అక్కడికి వెళ్లి గేదెను కొనుగోలు చేసి తీసుకురావడానికి మరో రూ.50 వేలు ఖర్చవుతుంది. అంటే రూ.60 వేల యూనిట్కు రూ.1.15 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని శ్రీనివాస్ మేనేజర్ను కలిసి విన్నవిస్తే నిబంధనలు అలానే ఉన్నాయని, హర్యానా గేదె అరుుతేనే డబ్బులిస్తామని తెగేసి చెప్పారు. తాను స్థానికంగా కొనుగోలు చేస్తే రెండు గేదెలు వస్తాయని, రూ.60 వేల తో హర్యానాకు వెళ్లి గేదెను ఎలా కొనుగోలు చేయాలో తెలియక శ్రీనివాస్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు. ఫెడరేషన్లకు దరఖాస్తులేవీ.. బ్యాంకర్ల కఠిన వైఖరి కారణంగా వెనుకబడిన తరగతుల సమాఖ్య (ఫెడరేషన్) రుణాలకు దరఖాస్తులు రావడం లేదు. ఈ నెల 15వరకు దరఖాస్తుకు గడువున్నా, సోమవారం వరకు 25 దరఖాస్తులే వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 498 యూనిట్లు మంజూరు కాగా, చాలా ఫెడరేషన్లకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. రజక, నాయూబ్రాహ్మణ, వడ్డెర, సగర(ఉప్పర), వాల్మీకి బోయ, కృష్ణబలిజ/పూసల, భట్రాజ, కుమ్మరి/శాలివాహన, మేదర, విశ్వబ్రాహ్మణ సహకార సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదిహేను మంది సభ్యులతో గ్రూపు ఏర్పడితే ఆ గ్రూపునకు రూ.7.50 లక్షల రుణం అందచేస్తారు. ఇందులో 50 శాతం సబ్సిడీ అంటే రూ.3.75 లక్షల అందచేస్తారు. ఈ లెక్కన ఒక్కో సభ్యునికి రూ.25 వేలు రుణం, రూ.25 వేలు సబ్సిడీ వస్తుంది. 2014-15 సంవత్సరానికి రజక సమాఖ్యకు 128 యూనిట్లు, నాయూబ్రాహ్మణులకు 188, వడ్డెరలకు 15, భట్రాజులకు 32, మేదరులకు 35, వాల్మీకిబోయలకు 30, కుమ్మరి శాలివాహనులకు 10, కృష్ణబలిజ/పూసలకు 25, విశ్వబ్రాహ్మణులకు 25, సగర/ఉప్పరలకు 10 మొత్తం 498 యూనిట్లు జిల్లాకు మంజూరయ్యాయి. వీటికోసం ప్రభుత్వం రూ.18.67 కోట్లు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని ప్రధాన బ్యాంక్లకు ఈ యూనిట్ల లక్ష్యం విధించారు. అయితే చాలా చోట్ల బ్యాంకర్లు కాన్సెంట్ ఇవ్వకపోవడంతోనే కనీస దరఖాస్తులు కూడా రావడం లేదని అధికారులు చెబుతున్నారు. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో ఆశించిన స్థారుులో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు బ్యాంక్ అధికారులతో చర్చించి, ఆర్థిక వెనుకబాటును తొలగించేందుకు ప్రభుత్వం అందచేస్తున్న రుణాలు పొందేలా చూడాలని లబ్దిదారులు వేడుకుంటున్నారు. మైనారిటీ రుణాలకు నేడే గడువు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారంతో గడువు ముగుస్తుందని ఈడీ ఎంఏ.హమీద్ తెలిపారు. బ్యాంక్ కాన్సెంట్ పొందిన దరఖాస్తులను సంబంధిత మున్సిపాలిటీ, నగరపంచాయతీ కమిషనర్లు, ఎంపీడీఓల లాగిన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0878-2233150 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
పైరవీ జెయ్యాలె.. పైసలియ్యాలె..!
- బీసీ రుణాలకు లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు కరీంనగర్ రాంనగర్కు చెందిన శ్రీధర్ అనే నిరుద్యోగి బీసీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆశపడ్డాడు. దరఖాస్తుతో పాటు బ్యాంక్ కాన్సెంట్ అవసరం కావడంతో యూనిట్లు కేటాయించిన బ్యాంకుల చుట్టూ తిరిగాడు. బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన రాజును ఓ బ్రోకర్ పలకరించాడు. రూ.7వేలు ఇస్తే బ్యాంక్ కాన్సెంట్ ఇప్పిస్తానని బేరం పెట్టాడు. చివరకు రూ.5వేలు తీసుకొని కోర్టు సమీపంలోని ఓ బ్యాంక్ నుంచి కాన్సెంట్ ఇప్పించాడు. పెద్దపల్లి డివిజన్లోని ఓ మండలంలో పి.రాజు అనే యువకుడు రూ.2లక్షల రుణానికి దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంక్ కాన్సెంట్తో సంబంధిత ఎంపీడీఓ కార్యాలయానికి వెళితే అప్పటికే రూ.2లక్షల యూనిట్కు ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువును ఎంపిక చేశారని, నీవు దరఖాస్తు చేయడం వృథా అని సదరు సిబ్బంది చల్లగా సెలవిచ్చారు. - రూ.5వేలిస్తే బ్యాంక్ కాన్సెంట్ - రూ.2లక్షల యూనిట్కు డిమాండ్ - గడువు పూర్తికాకముందే ఎంపిక - ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం కరీంనగర్ సిటీ: జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఎంపిక జరుగుతున్న తీరుకు మచ్చుతునకలివీ. జిల్లావ్యాప్తంగా ఇంచుమించు ఇలాంటి ఉదంతాలే చోటు చేసుకుంటున్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు ప్రభుత్వం అందచేస్తున్న రుణాలు జిల్లాలో పైరవీలకు రాచబాటగా మారాయి. బ్యాంక్ కాన్సెంట్ కావాలన్నా... రుణం పొందాలన్నా... చివరకు రూ.లక్ష సబ్సిడీతో రూ.2లక్షల రుణం తీసుకోవాలన్నా బ్రోకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడువుకు ముందే ఎంపిక.. బీసీ రుణాల కోసం దరఖాస్తుకు ఈ నెల 15 వరకు ప్రభుత్వం గడువు పొడగించింది. కానీ ఆశ్చర్యకరంగా చాలా మున్సిపాలిటీల్లో, మండలాల్లో లబ్దిదారులను ఎంపిక చేశారు. ముఖ్యంగా రూ.2లక్షల యూనిట్లకు సంబంధించిన ఎంపికను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. సాధారణంగా పూర్తి అర్హత ప్రమాణాలతో తగిన సర్టిఫికెట్లు, బ్యాంక్ కాన్సెంట్తో సదరు నిరుద్యోగి మున్సిపాలిటీ, మండల కార్యాలయూల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను సిబ్బంది ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆ తరువాత బ్యాంకర్లు, అధికారులు కలిసి ఒకేరోజు దరఖాస్తుదారులతో సమావేశం ఏర్పాటు చేసి లబ్దిదారులను ఎంపిక చేయాలి. అలా ఎంపిక చేసిన జాబితాను బీసీ కార్పొరేషన్ కార్యాలయానికి పంపించాలి. కలెక్టర్ ఆమోదం పొందిన తరువాత లబ్దిదారులకు రుణం మంజూరవుతుంది. బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ జమవుతుంది. ఇది రుణాల ఎంపిక ప్రక్రియ. కానీ కొన్ని మున్సిపాలిటీల్లో కనీసం బ్యాంకర్లను పిలవకుండానే లబ్దిదారుల ఎంపికను పూర్తి చేశారు. మరికొన్ని మున్సిపాలిటీల్లో డబ్బులిస్తేనే రూ.2లక్షల యూనిట్ను అప్లోడ్ చేస్తామని, లేదంటే రూ.60 వేల యూనిట్గా మారుస్తామని అంటున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల రూ.2లక్షల యూనిట్ల సంఖ్యకు సమానంగా తమకు దగ్గరి వ్యక్తుల నుంచి దరఖాస్తులు వస్తే, మిగిలిన రూ.2లక్షల యూనిట్ దరఖాస్తులను రూ.లక్ష, రూ.60వేల యూనిట్లుగా మారుస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కనుసన్నల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రజాప్రతినిధులకే సొంతం చాలా రోజుల తరువాత బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు కావడంతో సహజంగానే పోటీ అధికమైంది. ప్రధానంగా రూ.2లక్షల రుణంలో రూ.లక్ష సబ్సిడీ ఉండడంతో ఈ యూనిట్లకు తీవ్రస్థాయిలో డిమాండ్ ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా రూ.2లక్షల యూనిట్లు 178 మంజూరయ్యాయి. అత్యధికంగా రామగుండం కార్పొరేషన్కు 14, కరీంనగర్ కార్పొరేషన్కు ఎనిమిది రూ.2లక్షల యూనిట్లు కేటాయించారు. ఇతర యూనిట్లను పెద్దగా పట్టించుకోని ప్ర జాప్రతినిధులు రూ.2లక్షల యూనిట్లను మిగతా వారికి దక్కనీయడం లేదు. మున్సిపల్, మండలాల్లో ఎక్కడైనా స్థానిక ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరులకే ఈ యూనిట్లు కేటారుుంచేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్ని చోట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది బంధుగణానికి ఈ యూనిట్లు అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నారు. 5922 యూనిట్లు జిల్లాకు బీసీ కార్పొరేషన్ ద్వారా మొత్తం 5,922 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిపై సబ్సిడీని 50 శాతంగా (రూ.లక్ష దాటకుండా) నిర్ణయించారు. యూనిట్ ఆధారంగా రూ.20వే లు, రూ.25వేలు, రూ.30 వేలు, రూ.50వేలు, రూ.లక్ష సబ్సిడీని చెల్లిస్తారు. మొత్తం యూనిట్లకు రూ.116.26 కోట్ల సబ్సి డీ లబ్దిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎన్నాళ్లీ ‘వెనుకబాటు’?
విజయనగరం కంటోన్మెంట్: బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరవుతాయని, ఉద్యోగం దొరక్కపోయినా ఏదో చిన్న ఉపాధి చూసుకుని జీవితంలో స్థిర పడదామని ఆశ పడుతున్న నిరుద్యోగుల ఆశలు ఏ ఏడాదికాఏడాది అడుగంటుతూనే ఉన్నాయి. రుణాలు మంజూరవుతాయని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారుతోంది. రుణాల మంజూరుకు నిధులు రాక పోవడం ఒక కారణమైతే, దీనికి సంబంధించిన దరఖాస్తులను మండలాల నుంచి పంపించకపోవడం మరో శాపంగా పరిణమించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, ఫెడరేషన్లు, నిరుద్యోగుల స్వయం సమృద్ధికి కేటాయించిన రుణాలు విడుదల కావడం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 9393 యూనిట్లు మంజూరయ్యాయి. ఈ యూనిట్లకు సుమారు రూ.25.70కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాటు బ్యాంకు లింకేజీగా మరో రూ.25.70కోట్లు కేటాయించారు. ఈ మొత్తం రూ.50కోట్లతో బీసీ స్వయం సంఘాలు, వ్యక్తిగత రుణాలతో ఉపాధి మార్గాలకు అవకాశముంటుందని భావించారు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్న చందాన అటు నిధులు విడుదల కాక ముందే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంటే..మరో పక్క మండలాల్లోని జన్మభూమి కమిటీలు తమ వారికి దరఖాస్తులు ఇవ్వలేదని అట్టేపెట్టుకున్నాయి. దీనికి సంబంధించి జనవరి 18 గడువు తేదీగా నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకూ కేవలం 1200 దరఖాస్తులు మాత్రమే కొన్ని మండలాలనుంచి వచ్చాయి. 9393 యూనిట్లకు సుమారు 20వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరంతా జన్మభూమి క మిటీ తమకు అనుమతులు ఇస్తుందనిఎదురు చూస్తున్నారు. కానీ కమిటీ అనుమతులు ఇవ్వకుండా మండలాల్లోనే దరఖాస్తులను అట్టిపెట్టుకుంది. మార్చి నెల ముగుస్తుండడంతో వీటికి సంబంధించి కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేటాయించిన నిధులకు సంబంధించి యూనిట్లను మంజూరు చేస్తే గనుక నిధులు ఎప్పుడు విడుదలైనా యూనిట్లు ఏర్పాటు చేసుకునే వెసులు బాటు ఉంది. కానీ ఈ విషయాన్ని మాత్రం జన్మభూమి కమిటీలు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా పలు సంఘాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోక పోవడంతో దరఖాస్తు దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రూ.3కోట్లు పెండింగ్ జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు గత ఏడాది మంజూరైన రూ.6.53 కోట్ల నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. ఈ నిధులకు సంబంధించి 900 మందికి రుణాలు మంజూరయ్యాయి. గత ఏడాది రుణాలు మంజూరయి గ్రౌండింగ్ అయ్యే సమయంలో ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.అప్పటినుంచి ఈ నిధులకు మోక్షం కలగలేదు. డబ్బులు, కాలం ఖర్చు చేసి అభ్యర్థులు పెట్టుకున్న దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. అయితే ఈ నిధులకు సంబంధించి గతంలో మంజూరు జరిగిపోవడంతో వీటికి సంబంధించిన నిధులు మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశముందని అంటున్నారు. -
ఇదేం దారుణం?
విజయనగరం కంటోన్మెంట్: ఉద్యోగం దొరకడం కష్టమవుతోంది. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేకపోతున్నాం. కనీసం బీసీ కార్పొరేషన్ రుణమైనా అందితే చిన్న వ్యాపారమైనా పెట్టుకుని బతుకుబండి లాగించొచ్చు. అని ఆశపడుతున్న నిరుద్యోగులకు రుణాల కోసం ఎదురు చూపులే మిగులుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీ పొంది నిరుద్యోగ సమస్యను రూపుమాపుకుందామనీ, సొంత కాళ్లపై నిలబడదామని యోచిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దీనికి కార ణం తెలుగు తమ్ముళ్ల రాజకీయమేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ముఖ్యంగా లబ్ధిదారులకు మంజూరైన రుణాలను అందించడంలో మున్సిపాలిటీలు, మండలాల్లో జన్మభూమి కమిటీలకు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువవతున్నాయి. జిల్లాలో పదివేల మంది నిరుద్యోగులు రుణ సబ్సిడీ పొందొచ్చని ఆశపడితే ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలు రాజకీయంగా కొన్ని యూనిట్లకు మాత్రమే అనుమతులు ఇచ్చాయి. జిల్లాలోని మూడు మండలాలకు చెందిన కమిటీలు మాత్రమే లబ్ధిదారుల వివరాలు ఇచ్చాయి. నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీతో పాటు మిగతా మండలాల నుంచి ఒక్క దర ఖాస్తుకు కూడా కమిటీలు ఆమోద ముద్ర వేయలేదు. దీంతో జిల్లాలోని నిరుద్యోగులు, చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మా కెందుకీ రాజకీయ రుణాల పితలాటకమంటూ ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది డిసెంబర్లో 9393 మంది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం యూనిట్లు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ ద్వారా బీసీ కార్పొరేషన్ ప్రకటించింది. దీనికి గడువు తేదీగా జనవరి 5ను నిర్ణయించారు. అనంతరం లబ్ధిదారులకు ఆన్లైన్ దరఖాస్తుల విషయంలో సాంకేతిక పొరపాట్లు రావడంతో మరో దఫా గడువు పెంచారు. చివరికి ఫిబ్రవరి నెలలోగా ఆన్లైన్ దరఖాస్తులు రావాలని గడువు విధించారు. అయితే జిల్లాలో 18 లక్షల మంది ఉన్న బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేసిన నాయకులు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ రుణ సబ్సిడీలను తమ కార్యకర్తలకు ఇచ్చుకునేందుకు పన్నాగం పన్నుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు దాటిపోయినప్పటికీ రుణాల దరఖాస్తులను ఇవ్వడంలో ఇప్పటికీ ముందుకు రాకపోవడం విచారకరం. ఎమ్మెల్యే స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకూ తమ పార్టీ చోటా నాయకులు, కార్యకర్తలకు ఇచ్చేందుకు భిన్నమైన వాటాలు వేసుకున్నారన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే నాలుగు మున్సిపాలిటీల నుంచీ ఇంకా ఒక్క దరఖాస్తు కూడా బీసీ కార్పొరేషన్కు చేరలేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కారణంగా వెనక్కి పోయిన బీసీ కార్పొరేషన్ రుణాలు, ఈ ఏడాది కూడా జిల్లాకు కేటాయించిన దాదాపు రూ. 100 కోట్లు బడ్జెట్ కారణంగా వెనక్కి మళ్లిపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు. మున్సిపాలిటీలు,మండలాల్లో మా వాళ్లకు రుణాలు ఇవ్వాలంటే మా వాళ్లకు ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతుండడంతో జన్మభూమి కమిటీలు ఈ జాబితాలను ఆమోదించకుండా వదిలేశాయి. బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు జిల్లాలో బీసీల అభివృద్ధి పట్ల ఎవరికీ చిత్తశుద్ధి లేదు. గతేడాది కూడా ఓ సారి ఎన్నికల కారణంగా నిలిచిపోయిన రుణాలు ఈ సారి రాజకీయంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొం ది. కుల సమాఖ్యలకు ఇంకా వెబ్సైట్ కూడా ఇప్పటివరకూ ప్రారంభించకపోవడం దారుణం. వెంటనే బీసీ రుణాల దరఖాస్తు దారులకు రుణమంజూరు పత్రాలు ఇచ్చి యూనిట్లు గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. పొట్నూరు భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ బీసీ సంక్షేమ సంఘం, విజయనగరం. ఆమోదించిన దరఖాస్తులు రావాల్సి ఉంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, పలు మండలాల్లో ఆన్లైన్ దరఖాస్తులను మంజూరు చేస్తూ కమిటీలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని మూడు మండలాల నుంచి మాత్రమే పూర్తిగా పంపించారు. మిగతావి కూడా ఆయా మండలాల నుంచి పంపిస్తే కలెక్టర్ అప్రూవల్కు పంపిస్తాం. ఆర్ నాగరాణి, ఈడీ బీసీ కార్పొరేషన్ -
దళారులు బాబోయ్..!
బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇప్పిస్తామంటూ దళారులు సహకార సంఘాల సభ్యులను మాయ చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా రుణాలు పొందే అవకాశం ఉన్నా..ఇది తెలియని అమాయకులు వారి బుట్టలో పడుతూనే ఉన్నారు. ఈ ఏడాది రుణాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటనే చేయలేదు. అయినా బ్రోకర్లు ఈ ఏడాది లోన్లతోపాటు గతేడాది రుణాలూ ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. ఎవరికీ ఒక్క పైసా ఇవ్వాల్సిన పనిలేదని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నా కొందరు దళారుల మాయమాటలను నమ్ముతూనే ఉన్నారు. ఖమ్మం సంక్షేమ విభాగం : వెనుకబడిన తరగతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. బీసీల్లో వివిధ రకాల కులవృత్తులు, ఇతర పనులు చేసుకునేవారికి చేయూతనిచ్చేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 50 శాతం రాయితీతో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తోంది. దీనిలో భాగంగా రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, వాల్మీకిబోయ, సాగర ఉప్పర, బట్రాజు, కృష్ణబలిజ పూసల, విశ్వబ్రాహ్మణ, మేదర, శాలివాహనకుమ్మరి అనే 10 రకాల కులాల వారు సంఘాలుగా ఏర్పడితే రుణాలు అందజేస్తారు. ఆయా కులాలకు చెందిన 11 నుంచి 15 మంది సహకార సంఘంగా ఏర్పడాలి. తరువాత ఆ సంఘం నమోదు కోసం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సదరు సహకార సంఘం మొత్తానికి కలిపి రూ.50 చెల్లించాలి. సంఘం సభ్యులందరికీ కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు మాత్రం కచ్చితంగా ఉండాలి. వీటితో పాటు బై లా వివరాలు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం బీసీ సంక్షేమశాఖ అధికారి విచారణ నిర్వహించి నమోదు చేస్తారు. అక్కడ నమోదు అయిన సంఘం బీసీ కార్పొరేషన్లో గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు రూ.195 (డి.డి.చార్జీలతో కలిపి)రుసుం చెల్లించాలి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి సంఘానికి గుర్తింపు పత్రం వస్తుంది. సంఘం రుణానికి అర్హత సాధిస్తుంది. అనంతరం సహకార సంఘం వారు బ్యాంక్ నుంచి కాన్సెంట్ తెచ్చుకుంటే బీసీ కార్పొరేషన్ రుణం ఇస్తుంది. జిల్లాలో ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఏపీజీవీబీ, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవచ్చు. 50 శాతం రాయితీతో రుణాలు సంఘంలోని ఒక్కో సభ్యునికి రూ.50వేల చొప్పున 15 మంది సభ్యులు ఉన్న సంఘానికి గరిష్ఠంగా రూ.7.50 లక్షలు రుణంగా ఇస్తారు. ఇందులో ప్రభుత్వం నుంచి 50 శాతం రాయితీ వస్తుంది. ఒక్కో సభ్యునికి రూ.25వేలు రాయితీ ఉంటుంది. మిగతా సగం బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. రుణం మంజూరైన సంఘాలు కులవృత్తి లేదా ఇతర చిన్నతరహా వ్యాపారాలు చేసుకోవచ్చు. బీసీ సంక్షేమశాఖలో ఒక్కో సహకార సంఘం నమోదుకు రూ.50, బీసీ కార్పొరేషన్ గర్తింపు కోసం రూ.195 మాత్రమే చెల్లించాల్సి ఉన్నా కొందరు దళారులు సంఘాల సభ్యుల నుంచి భారీగా దండుకుంటున్నారు. దీనివల్ల అనేకమంది సభ్యులు ఆర్థికంగా నష్టపోవడమేకాకుండా కొంతమంది సంఘాలుగా ఏర్పడేందుకే విముఖత చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాలకు సంబంధించి 197 సహకార యూనిట్లు మంజూరు కాగా చివరకు 8 సంఘాలు మాత్రమే రుణాలకు అర్హత సాధించాయి. రాయితీ పేరుతో మరో రకం మోసం 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత, సహకార యూనిట్లు 951 మంజూరయ్యాయి. వాటికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాలేదు. బ్యాంక్ రుణాలూ రాక ఒక్క యూనిట్ కూడా గ్రౌండ్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అన్ని జిల్లాలకు సంబంధించి ఒకేసారి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో రాయితీ జమ అవుతుంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. విషయం తెలియని లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న దళారులు గత ఏడాది సబ్సిడీతో పాటు, ప్రస్తుత సంవత్సర రుణాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు గుంజుతున్నట్లు పలువురు చెబుతున్నారు. -
ఆకేసి...లాగేసి !
విజయనగరం కంటోన్మెంట్ :బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు కాకపోవడంతో దరఖాస్తుచేసుకున్న వారు ఇబ్బందులకు గురవుతున్నారు. రుణం వస్తుంది కదా అని వ్యయప్రయాసలకోర్చి దరఖాస్తు చేసుకున్న వారు రుణాల కోసం కళ్లుకాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా గత ఏడాది 4,941 యూనిట్లకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. వీరికి రూ.19.94 కోట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో 1,154 యూనిట్లకు రూ.3.5 కోట్ల రుణం ఆన్లైన్ ద్వారా మంజూరయింది. దీని కోసం ఒకటి సబ్సిడీకి, మరొకటి రుణానికి వినియోగించేలా ప్రతి లబ్ధిదారుడూ రెండేసి బ్యాంక్ ఖాతాలు తెరిచారు. కానీ ఆ సొమ్ము ఇంతవరకూ లబ్ధిదారులకుఅందలేదు. 50 శాతం సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కాగా, ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తేనే, రుణాలు అందజేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. దీంతో బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసి ఖాతాల్లో వేసి ఉంచారు. ప్రభుత్వం మాత్రం సబ్సిడీని విడుదల చేయకపోవడంతో మంజూరైన రుణ మొత్తం బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. ఇది గత ఏడాది పరిస్థితి. ఈ ఏడాది కూడా పరిస్థితి అలాగే ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక ఖరారైంది. ఇందుకోసం లక్ష్యాలు కూడా నిర్దేశించారు. కానీ ఇప్పటివరకూ ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు. గతంలో బ్యాంకర్లు రుణాలిచ్చినా సబ్సిడీ విడుదల చేయని ప్రభుత్వ యంత్రాంగం, ఇప్పుడు వార్షిక రుణప్రణాళిక విడుదల చేసి ఉత్తర్వులు నిలిపివేసింది. దీంతో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం లబ్ధిదారులు ఎదరుచూడవలసి వస్తోంది. ఈ ఏడాదికి మార్జిన్ మనీ కింద 8,588 యూనిట్లు, రాజీవ్ అభ్యుదయ యోజన కింద 805, ఆర్థిక సహాయం కింద 510 యూనిట్లు కేటాయిస్తూ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలన్న ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఏం చేయాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లాకు మొత్తం 9,903 యూనిట్లు మంజూరయ్యాయి. రూ. 89.90 కోట్లను రుణంగా అందజేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో మార్జిన్ మనీ కింద రూ.47.17 కోట్లు, మున్సిపాలిటీల్లో రాజీవ్ అభ్యుదయ కింద 805 యూనిట్లకు రూ.4.42 కోట్లు, ఆర్ధిక సహాయం కింద 510 యూనిట్లకు రూ.38.30 కోట్లు కేటాయించారు. అయితే రుణ ప్రణాళిక విడుదలై రోజులు గడుస్తున్నప్పటికీ ఏఏ యూనిట్లకు ఎవరు అర్హులు? ఏఏ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి? విద్య,వయోపరిమితి ఎంత? అన్న విషయాలపై ఇంకా ప్రకటన ఇవ్వకుండా, కేవలం రుణ ప్రణాళికను మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం అభ్యర్థులను ఆశల పల్లకి ఎక్కించింది. గత ఏడాది కూడా ఇలాగే చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రుణ ప్రణాళిక విడుదల చేసి, నిబంధనలు విడుదల చేయకుండా నిలిపివేసిందని బీసీ సంఘాలు, వివిధ వ ర్గాలకు చెందిన నిరుద్యోగులు, ఉపాధిని ఆశిస్తున్న వారు విమర్శిస్తున్నారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు నిధులను కుమ్మరిస్తోంది. జిల్లాలో గత ఏడాది నిలిచిపోయిన రుణాలను కూడా తిరిగి మంజూరు చేసి, కొత్తగా రుణ ప్రణాళికతో పాటు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దీంతో జిల్లాలో ఈ ఏడాది రూ.11.93 కోట్లతో 1221 యూనిట్లకు రుణాలు ఇవ్వడానికి నిర్ణయించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే 5,588 మందికి పైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి డిసెంబర్ 4,5 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎస్సీ కార్పొరేషన్కు నిధులు ఇస్తుండడంతో ఈ కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలు లబ్దిపొందే అవకాశం ఉండగా, రాష్ట్రప్రభుత్వం మాత్రం బీసీ కార్పొరేషన్కు నిధులు ఇవ్వడం లేదు. రుణ ప్రణాళిక అమలుకు మార్గదర్శకాలు రాలేదు: 2014-15 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక ఖరారయింది. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదు. మొత్తం 9,903 యూనిట్లకు రూ.89.90 కోట్ల రుణాలను ఇవ్వడానికి ప్రణాళికను విడుదల చేశారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే , ప్రకటన చేస్తాం. - నాగరాణి, ఈడీ, బీసీ కార్పొరేషన్, విజయనగరం. -
లోన్ల పేరుతో మహిళలకు టోపీ
మదనపల్లెక్రైం: మోసపోయే వాళ్లున్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. లోను పేరుతో ఓ ఘరానా మోసగాడు అమాయక మహిళలను బురిడీ కొట్టిం చాడు. రూ.లక్షల్లో వసూలు చేసుకుని పారిపోయాడు. తీరా మోసపోయామని తెలుసుకుని అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి బుధవారం పోలీసులకు అప్పగిం చారు. బాధితుల కథనం మేరకు.. రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ యర్రప్పల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు పీ.ఆంజప్ప(35) వ్యవసాయం చేసుకుని జీవించేవాడు. అమాయక మహిళలను బుట్టలో వేసుకుంటే సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించాడు. సాయంత్రం సమయంలో మదనపల్లెలోని అప్పారావుతోట, దేవళంవీధి, ఈశ్వరమ్మ కాలనీలో ద్విచక్ర వాహనంలో వెళ్లి మహిళలను పోగుచేసి రోజువారీ వ్యాపారాలు చేసుకునే వారికి కలెక్టర్ కార్యాలయం నుంచి 50 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల చొ ప్పున లోన్లు మంజూరు చేయిస్తానని చె ప్పేవాడు. మొదట ఎవరూ నమ్మలేదు. ఒక మహిళ మాత్రం నమ్మి కొంత డబ్బు అతని చేతిలో పెట్టింది. మరుసటి రోజు వచ్చి లోను మంజూరైందంటూ బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఓ నకిలీ కాగితాన్ని చూపాడు. ఆశపడ్డ మహిళలు ఒక్కొక్కరుగా అతనికి డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు. రత్నమ్మ కుటుంబం లో ముగ్గురికి రూ.12 లక్షలు లోను ఇప్పిస్తానని చెప్పడంతో రూ.1.30 లక్షలు ఇ చ్చారు. కృష్ణవేణి రూ.63 వేలు, లలితమ్మ రూ.28వేలు, భారతి రూ.5వేలు, అమ్మాజాన్ రూ.10వేలు, పద్మావతి రూ.10 వేలు, నారమ్మ రూ.60వేలు చొప్పున మోసగాడికి ఇచ్చారు. మరి కొంతమంది మహిళలు కూడా డబ్బు కట్టారు. రూ.13 లక్షల లోను మంజూ రైందని విత్ డ్రాయిల్ ఫారంలో రాసి నారమ్మకు ఇచ్చాడు. అమాయకురాలైన ఆమె బ్యాంకు వెళితే తిప్పి పంపారు. ఇలా చాలామందికి విత్డ్రాయిల్ ఫామ్స్లో డబ్బు రాసిచ్చి తీసుకొమ్మని మోసగించాడు. ఇతని వెనుక మరెవరో ఉన్నట్లు మహిళలు చెబుతున్నారు. డబ్బు కోసం వచ్చినపుడు ఎవరితోనే ఫోన్లో మాట్లాడించేవాడని తెలిపారు. ఏడాదిగా దాక్కున్న ఆంజప్పను బుధవారం బాధితులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. -
బీసీ కార్పొరేషన్కు రూ.20వేల కోట్లు కేటాయించాలి
రాష్ట్రంలో 55శాతం ఉన్న బీసీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ను ముట్టడించారు. బీసీ కార్పొరేషన్కు రూ.20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. రాంనగర్ :రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్కు రూ. 20 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. బడ్జెట్లో బీసీలకు రూ. 2,022 కోట్లు మాత్రమే కేటాయించినందుకు నిరసనగా మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 55 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 2 శాతం మా త్రమే నిధులు కేటాయించిందని తెలిపారు. అన్ని రంగాలలో వెనుకబడిన బీసీల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీ సంక్షేమ శాఖకు మంత్రిని నియమించి, ఆ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భ ర్తీ చేయాలన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కేటాయింపులో వివక్ష చూపడం శోచనీయమన్నారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీసీనేతలను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జేసీ ప్రీతిమీనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కంది సూర్యనారాయణ, బోళ్ల కరుణాకర్, గండి చెర్వు వెంకన్నగౌడ్, కాసోజు విశ్వనాథం, వైద్యం వెంకటేశ్వర్లు, దుడుకు లక్ష్మీనారాయణ, జనగాం అంజ య్యగౌడ్, జువాజి ఇంద్రయ్య, వెంకటేశ్వర్లు, అయితగోని జనార్దన్, చొల్లేటి రమేష్, చిక్కుళ్ల రాములు, అరవింద్, మైనం నారాయణ, లింగయ్య, శ్యాంసుం దర్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల రుణాలు మింగేసిన నాయకుడు
- 22 మంది సభ్యులతో సంతకాలు చేయించుకుని రూ.13.20 లక్షల రుణం బొక్కేసిన వైనం - ఆంధ్రాబ్యాంకు బ్రాంచి మేనేజర్ పాత్రపైనా అనుమానం కంచుస్తంభంపాలెం (యలమంచిలి) : కంచుస్తంభంపాలెం పంచాయతీ వాకలగరువుకు చెందిన మత్స్యకారులకు వారి సంఘం నాయకుడే రూ.13.20 లక్షల రుణానికి టోకరా వేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇవి.. గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు ఏడాది కిందట సంఘంగా ఏర్పడి ఆంధ్రాబ్యాంకు భీమలాపురం శాఖలో ఖాతా తెరిచారు. అనంతరం బీసీ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్కరికి రూ.60 వేలు చప్పున రూ.13.20 లక్షల రుణం మంజూరైంది. సంఘం నాయకుడు ఓలేటి రామదాసు సభ్యులకు రుణం మజూరైన విషయం చెప్పలేదు. వారికి బ్యాంకుకు తీసుకెళ్లి మనకు త్వరలో రుణం వస్తుంది, సంతకాలు పెట్టాలని చెప్పడంతో వారంతా సంతకాలు చేశారు. వస్తుందని ఎదురు చూడసాగారు. రెండు రోజుల క్రితం బ్యాంకు అధికారులు వచ్చి రుణ వాయిదాలు చెల్లించడం లేదేమిటని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వారంతా రామదాసును నిలదీయగా రుణం తీసుకున్నామని చెప్పాలని, డబ్బు తాను కడతానని చెప్పగా సభ్యులు అంగీకరించలేదు. ఆ రుణం తాము తీసుకున్నామని చెపితే బ్యాంకు అధికారులు తమను కట్టమంటారని, అయినా మాకు మంజూరైన రుణాన్ని తీసుకోవడం ఏమిటని రామదాసును నిలదీశారు. తాము చాలాసార్లు బ్యాంకుకు వెళ్లి రుణం మంజూరైందా అని అడిగితే అప్పతి బ్రాంచి మేనేజర్ మంజూరు కాలేదని చెప్పేవాడని బాధితులు వాపోయూరు. ఆ మేనేజర్ గత నెలలో బదలీ కొత్త మేనేజర్ రావడంతో విషయం బయటపడిందని బాధితులు ఓలేటి శ్రీను, కొప్పనాతి చినపెద్దిరాజు తెలిపారు. మత్స్యకారుల సంఘం జిల్లా నాయకుడు అండ్రాజు చల్లారావు సోమవారం ఉదయం ఫోన్చేసి ‘మీరు గొడవ చేయకండి, నేను వల్లూరు వచ్చి సమావేశం పెడతాను, బ్యాంకు అధికారులకు మాత్రం లోన్ తీసుకున్నామని చెప్పండి’ అన్నాడని బాధితులు తెలిపారు. దీంతో ఈ విషయంలో అతని పాత్ర కూడా ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తామంతా రెక్కాడితే కాని డొక్కాడని నిరు పేదలమని, తమను మోసం చేసిన వారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు. తమకు లోను ఇవ్వకపోయినా ఫర్వాలేదుకాని, తెలియకుండా చేసిన సంతకాలను ఎరగా చూపి బాకీ తీర్చమంటే ఆత్మహత్యలే శరణ్యమని గగ్గోలు పెడుతున్నారు. -
వచ్చే ఎన్నికల్లో బీసీలకే మేయర్ పీఠం
సిటీబ్యూరో, న్యూస్లైన్: హైదరాబాద్ నగర 25వ మేయర్గా బీసీ అభ్యర్థి రానున్నారు. వచ్చే నవంబర్-డిసెంబర్లో జరుగనున్న ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీసీ అభ్యర్థి అధిష్టించనున్నారు. ఆయా కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పదవిని బీసీ- జనరల్కు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో బీసీలను ఈ పదవి వరించనుండటంతో ప్రస్తుత బీసీ కార్పొరేటర్లలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. డెబ్బై లక్షలకు పైగా జనాభా ఉన్న గ్రేటర్కు మేయర్గా వ్యవహరించే అవకాశం రానున్నందున.. బీసీ వర్గాలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మేయర్ను నేరుగా ప్రజలే ఎన్నుకునేవారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైనప్పటి నుంచి పరోక్ష పద్ధతిలో (గెలిచిన కార్పొరేటర్లనుంచి) ఎన్నుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఆవిర్భావం అయ్యాక తొలిసారిగా ఓసీ- జనరల్కు అవకాశం లభించింది. కాంగ్రెస్- ఎంఐఎం కూటమి ఒప్పందం మేరకు ఇద్దరికి అవకాశం లభించింది. కాంగ్రెస్ నుంచి బండ కార్తీకరెడ్డి తొలి రెండేళ్లు మేయర్గా పనిచేయగా.. ఆమె తర్వాత మాజిద్ 24వ మేయర్గా పదవిలో కొనసాగుతున్నారు. -
సబ్సిడీకి సంకెళ్లు
కలెక్టరేట్, న్యూస్లైన్: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనలో ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రుణ మంజూరు లో 50 శాతం వరకు సబ్సిడీ పెంచుతున్నట్లు పేర్కొన్నా.. లబ్ధిదారులు పరిమితమయ్యేలాజీఓ 101 జారీ చేసింది. ఎంతో కాలంగా సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులైన నిరుద్యోగులు కొత్త జీఓతో అర్హత కోల్పోతున్నారు. పుణ్యకాలం గడిచినా వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు సారీ సెంటర్, బ్యాంగిల్ స్టోర్, కి రాణ మర్చంట్, ఫొటోస్టూడియో, జిరాక్స్ సెంటర్, గొర్రెల పంపకం త దితర యూనిట్లకు బ్యాంకులు రుణా లు మంజూరు చేస్తే ఆయా కార్పొరేషన్లు సబ్సిడీ ఇస్తున్న విష యం తెలిసిందే. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీ కార్పొరేషన్ ద్వారా 2,675 మందికి రుణాలు మంజూరు చెయ్యాలని లక్ష్యాన్ని నిర్ణయించారు. కాగా 1,554 మంది బ్యాంకు పత్రాలతోపాటు అన్ని ధ్రువీకరణలను బీసీ కార్పొరేషన్లో అందించారు. డిసెంబర్ చివరి వరకు లక్ష్య సాధనలో సగం మందికి రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి రుణాల కోసం బీసీలు పెద్ద ఎ త్తున దరఖాస్తులు చేసుకోగా 1,554 మందినే అర్హులుగా గుర్తించారు. ఊరించి.. ఉడికించి వీరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయకముందే ప్ర భుత్వం డిసెంబర్ 31న జీఓ నెం 101 విడుదల చే సింది. ఈ జీఓ ప్రకారం బీసీలు, వికలాంగులకు 50 శా తం, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం వరకు సబ్సిడీ పెరిగిం ది. గతంలో 30 శాతం మా త్రమే సబ్సిడీ ఇచ్చేవారు. అయితే కొత్త జోఓతో పాటు ప్రభుత్వం కొ ర్రీలు అధికంగానే పెట్టింది. ఇంతకు ముందు ఏ వర్గానికి చెందిన నిరుద్యోగులైనా వయోపరిమితి లేకపోయింది. ఇప్ప డు బీసీలు, వికలాంగులకు 21 నుంచి 40 సంవత్సరా ల వరకు వయోపరిమితి విధించింది. ఎస్సీ, ఎస్టీలకు 21 నుంచి 45 ఏళ్ల వరకు వయోపరిమితి విధించింది. నిరుద్యోగి ఉన్నత చదువులు చదువుకుని ఉండాలి. దరఖాస్తుదారులు రుణం పొందే యూనిట్లకు సంబంధించి శిక్షణ పొంది ఉండాలి. దర ఖాస్తుదారుడు, అత ని కుటుంబ సభ్యులు గానీ గతంలో లబ్ధిపొంది ఉండకూడదు, ఒకే కుటుంబం నుంచి ఒకే వ్యక్తికి రుణ మం జూరు ఉంటుందన్న నిబంధనలు చాలా మంది నిరుద్యోగులను అనర్హులుగా తేల్చేస్తున్నాయి. కొంత మం ది అభ్యర్థులకు 40ఏళ్లు దాటిపోయారు. మరికొంత మంది కుటుంబాలలో ఇదివరకే రుణం పొందిన వారు ఉన్నారు. నిరక్షరాస్యులు తీవ్ర నిరాశకు లోనవుతున్నా రు. ఎప్పుడో మంజూరు చేయాల్సిన సబ్సిడీకి ఏడాది చివరలో కొర్రీలు పెట్టడం అసంతృప్తికి గురి చేస్తోంది. -
సంక్షేమంలో వెనుకబాటు!
వారంతా ఆర్థికంగా... సామాజికంగా వెనుకబడిన వారు. చేయూతనందిస్తే తమకాళ్లపై తాము నిలబడి, మరికొందరికి ఉపాధి కల్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ కొద్దిపాటి సాయం కూడా వారికి కరువుతోంది. పథకాలను అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దరఖాస్తు దారులను యాచకులను చూసినట్టు చూస్తున్నారే తప్పా పథకాల మంజూరు తమ బాధ్యత అని ఇటు అధికారులు, అటు ప్రభుత్వం భావించడం లేదు. దీంతో పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు బీసీలు వాటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఎప్పుడు యూనిట్లు మంజూరవుతాయో, తాము ఎప్పుడు ఉపాధి పొందుతామో తెలియక వారు అస్థలు పడుతున్నారు. బీసీ కార్పొరేషన్ అధికారులు గత ఏడాది దరఖాస్తులనే ఇంకా క్లియర్ చేయలేదంటే, ఈ ఏడాది పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పే సర్కారు ఆచరణలో మాత్రం నాలుగడుగులు వెనక్కే ఉంటోంది. ఈ వర్గాల అభ్యున్నతి కోసం కోట్ల కొద్దీ నిధులు గుమ్మరిస్తున్నామని చెబుతున్నా అదంతా ప్రకటనలు, కాగితాలకే పరిమితమవుతోంది. జిల్లాలోని బీసీ కార్పొరేషన్ పనితీరును గమనిస్తే ఈ విషయంసులువుగా అవగతమవుతోంది. జిల్లాలో అధిక శాతం మంది బీసీలే ఉన్నారు. దీనికితోడు జిల్లాలో పరిశ్రమలూ తక్కువే. దీంతో పెద్ద ఎత్తున యువత హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలసపోవడం సర్వసాధారణమవుతోంది. దీంతో వారిని ఉద్ధరించేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలను అందజేయాలన్నది సర్కారు ఆశయం. అయితే పథకాలు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. 2012-13 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 1,843 మందికి స్వయం ఉపాధి కోసం పలు యూనిట్లను అందజేయాలని సర్కారు లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కొక్క యూనిట్ ధర రూ.60 వేలుగా నిర్ణయించారు. ఇందులో సగ భాగం బ్యాంకు రుణం ఇవ్వనుండగా మిగతా సగాన్ని సర్కారు సబ్సిడీగా ఇస్తుంది. ఈ మొత్తంతో సదరు లబ్ధిదారుడు మైక్సెట్, కిరాణం, జెకాక్స్ దుకాణం, చిన్నపాటి ఫొటో స్టూడి యో వంటి వ్యాపారాలు చేసుకుని స్వయంఉపాధి పొందవచ్చు. అయితే గత ఏడాది ఇందులో కేవలం 1,111 మందికి మాత్ర మే యూనిట్లు మంజూరు చేశా రు. మిగతా 732 మందికి ఇంతవరకూ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. దీంతో వీరంతా సర్కారు సాయం కోసం ఎదురు చూసి నిరాశకు లోనవుతున్నా రు. పోనీ ఈ ఏడాదైనా పరిస్థితి చక్కదిద్దుతారా? అంటే అదీ అనుమానంగానే ఉంది. 2013-14సంవత్సరంలో ఎన్నికల దృష్ట్యా సర్కారు యూ నిట్ల సంఖ్యను గణనీయంగా 3,795కు పెంచింది. పట్టణ ప్రాం తాల్లో రాజీవ్ అభ్యుదయ్ యోజన కింద మరో 540 యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే ఈఏడాదికి సం బంధించి ఆయా యూనిట్లకు ఎంత సబ్సిడీ ఇవ్వాలన్న దానిపై సర్కారు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో జిల్లా అధికారులు ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేకపోయారు. వాస్తవానికి ఈ యూ నిట్లను ఆగస్టు 15, జనవరి 26, నవంబర్1 వంటి ప్రత్యేక రోజు ల్లో సర్కారు పంపిణీ చేస్తుంది. ఆయా లక్ష్యాలను ఆ ఆర్థిక సంవత్సరం (మార్చి 31)లోపు పూర్తి చేయాలి. అయితే ఈ ఏడాది ఇప్పటివరకూ యూనిట్లను మంజూరు చేయకపోవడంతో బీసీలకు ఆ ఫలాలు అందకుండా పోయాయి. లబ్ధిదారుల ఎంపిక దాదాపు పూర్తయిన నేపథ్యంలో దరఖాస్తుదారులు బీసీ కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుండడంతో ఇప్పటికిప్పుడు ఇన్ని యూనిట్లను మంజూరు చేయడమూ సాధ్యం కాదని అధికారులే చెబుతున్నారు. ఏడాదిగా ఇన్చార్జి పాలనే... ఇదిలా ఉండగా దాదాపు 11 నెలలుగా బీసీ కార్పొరేషన్కు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ) లేరు. దీంతో ఈ విభాగాన్ని అటవీ సెటిల్మెంట్ అధికారి శోభ.. ఇన్చార్జి హోదాలో పర్యవేక్షిస్తున్నారు. గతంలో దుర్గారాజశేఖర్ కార్పొరేషన్ ఈడీగా పని చేశారు. అయితే ఆయన్ను అప్పటి కలెక్టర్ వీరబ్రహ్మయ్య.. సర్కారుకు సరెండర్ చేయడంతో అప్పట్నుంచీ ఈ పోస్టును శోభ చూస్తున్నారు. ఈమెకు ఇది అదనపు బాధ్యత కావడంతో ఆమె పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితి ఎదురవుతోంది. గత ఏడాది దరఖాస్తులను క్లియర్ చేస్తున్నాం... గత ఏడాది పూర్తిస్థాయిలో యూనిట్లు మంజూరు చేయలేకపోయాం. వీటిని ఇప్పుడు క్లియర్ చేయాలని భావిస్తున్నాం. సర్కారు నుంచి సబ్సిడీ విషయమై ఓ స్పష్టత వస్తే యూనిట్ల మంజూరు ప్రక్రియ వేగవంతం చేస్తాం. - శోభ, ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ -
దళారులు దయతలిస్తేనే.. లోన్లు మంజూరు
ఖమ్మం ఖిల్లా, న్యూస్లైన్: ‘హలో...అన్నా నాకు బీసీ కార్పొరేషన్లో లోను కావాలి.. ఇప్పించగలవా?’ ‘అలాగా...ఎంత కావాలి....పేరు... ఏ యూనిట్కు రుణం కావాలో వివరాలు షాపు వద్ద ఇవ్వు. రెండు రోజులు తరువాత కనపడు. లక్షకు పన్నెండు వేలు ఖర్చవుద్ది.. సరేనా!’ఇదీ సంక్షేమ కార్యాలయంలో దళారుల దందా. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లో యూనిట్ మంజూరు కావాలంటే లబ్ధిదారులు కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు. దళారులను ఆశ్రయిస్తే చాలు.. అన్నీ వారే చూసుకుంటారు. కానీ మంజూరైన రుణం నుంచి లక్షకు రూ.పన్నెండు వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో అధికారులకు సైతం వాటాలుంటాయని దళారులు చెబుతూ దందాను సాగిస్తుండడంతో ఇచ్చుకోలేని లబ్ధిదారులు పనులు కాక లబోదిబోమంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రతి ఏటా ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తుంటుంది. ఒక్కో యూనిట్కు రూ.60 వేల నుంచి లక్ష రూపాయల వరకు అందించే రుణాలను వివిధ వృత్తుల వారు కూడా తీసుకుని లబ్ధిపొందుతుంటారు. అయితే, లబ్ధిదారుడు ఒక యూనిట్ నెలకొల్పడానికి రూ. ల క్ష రూపాయల రుణం కోసం బీసీ కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకుంటే పదివేల రూపాయలు కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. బ్యాంకు రుణంగా రూ.60వేలను అందిస్తుంది. రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద ప్రభుత్వం రూ.30వేలు సబ్సీడీని ఇస్తుంది. ఇలా మంజూరయిన యూనిట్ను లబ్ధిదారులు సక్రమంగా నడుపుకుని బ్యాంకు రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ప్రభుత్వం కార్పొరేషన్లకు రుణాలివ్వాలని లక్ష్యాలు నిర్దేశిస్తుంది. కానీ అధికారులు దళారులకు తలొగ్గి మార్చి చివరి వరకు వాస్తవ లబ్ధిదారులకు రుణాలు అందించరనే ఆరోపణ ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 2,500 మందికి రుణం అందించాలనే లక్ష్యాన్ని అధికారుల ముందుంచింది. అయితే ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ చివరి వరకు నాలుగు వేల దరఖాస్తులు అందినా ఏ ఒక్కరికి కూడా రుణమంజూరుకు సహకరించకపోవడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. గతేడాది 872 యూనిట్లను మంజూరు చేయాలన్న లక్ష్యం ఉండగా మొదట్లో రుణంకోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఏడాది చివరి వరకు ముప్పుతిప్పలు పెట్టి, వివిధ రకాల కొర్రీలు పెడుతూ కార్యాలయాల చూట్టూ తిప్పించుకున్నారు. చివరకు లక్ష్యాన్ని చాలావరకు దళారుల సహకారంతో పూరించి, వాస్తవ లబ్ధిదారులకు మొండిచెయ్యి చూపించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పుడు నేరుగా దరఖాస్తు చేసుకుంటే లాభం లేదని భావించిన పలువురు లబ్ధిదారులు తప్పనిపరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు. అంతా వారిదే రాజ్యం... బీసీ, ఎస్సీ కార్పొరేషన్లో దళారుల రాజ్యమే కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి వెళ్లే లబ్ధిదారులకు చుక్కలు చూపించే అధికారులు దళారులు తీసుకొచ్చిన దరఖాస్తులను సునాయసంగా ఎంపిక చేస్తున్నారు. దీంతో చేసేదిలేక వాస్తవ లబ్ధిదారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. పేరు, ఊరు, యూనిట్ వివరాలు చెబితే చాలు కార్పొరేషన్ లోను మంజూరు నుంచి బ్యాంకు అకౌంట్ వరకు అన్నీ వారే చూసుకుంటారు. ఈ తతంగానికి లబ్ధిదారుల నుంచి లక్షకు పన్నెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఇందులో అధికారులకు కూడా వాటాలున్నాయని దళారులే చెబుతున్నారని, నెల నెలా వేలాది రూపాయలు వేతనాలుగా తీసుకునే అధికారులు లబ్ధిదారులను ఏడిపించడం న్యాయం కాదని ఓ బాధితుడు ‘న్యూస్లైన్’ ఎదుట వాపోయాడు. అంతేకాక కార్పొరేషన్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఇదే అదునుగా భావించిన దళారులు నకిలీ, బినామీ పేర్లతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కాజేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమదందా నుంచి కాపాడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ ఆంజనేయశర్మ ఏమంటున్నారంటే... ఈ ఏడాది బీసీ కార్పొరేషన్కు 2,500 లబ్ధిదారుల లక్ష్యంగా ఉంది. ఒక్కొక్కరికి సబ్సిడీ కింద రూ.30వేలు అందిస్తాం. మండలాల వారీగా యూనిట్లను కేటాయిస్తాం. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదు. ఎక్కడైనా అవినీతి జరుగుతుందని తెలిస్తే చర్యలు తీసుకుంటాం.లబ్ధిదారులు నేరుగా కార్యాలయానికి మాత్రమే రావాలి. దళారులను ఆశ్రయించొద్దు. నేనున్నంత కాలం కార్పొరేషన్లో అవినీతి జరకుండా చూసుకుంటా.