-
పార్లమెంట్లో ఓబీసీ బిల్లు ఆమోదించాలి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వెంటనే ఆమోదించాలని బీసీ కులాలకు చెందిన ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్తో పాటు శాసనసభల్లో వెనుకబడిన తరగతులకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. బేగంపేట హరితప్లాజాలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం బీసీకులాలకు చెందిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ కమిషన్ సభ్యులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చట్టసభల్లో ఓబీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ 2024లో సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే బీజేపీ బిల్లు ఆమోదించిందని, ఈ బిల్లులో బీసీ మహిళల సబ్కోటా తేల్చలేదని ఆరోపించారు. 50శాతం ఉన్న బీసీలకు మహిళల కోటాలో 50శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ అగ్రకుల ఆధిపత్య అహంకారం ప్రదర్శిస్తున్నారని, ఆయన్ను బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా ప్రజలు పరిగణించడం లేదన్నారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంతోపాటు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ బీసీ ప్రధానితో బీసీల తలరాత మారుతుందని భావించామని, కానీ అలా జరగలేదని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ మాట్లాడుతూ బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, క్రిమిలేయర్ గైడ్లైన్స్ ప్రకారం ఆదాయ పరిమితి పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా చూస్తుందన్నారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఆంజనేయగౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పిట్టల రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీరు నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టు ఉందని వారు మండిపడ్డారు. 33 జిల్లాల్లో బీసీ చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ కుర్మాచలం, రవీందర్ సింగ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, నాయకులు తాడూరి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్ యాదవ్, జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
AP: బీసీ కార్పొరేషన్ల పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల పదవీ కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలకు 56 సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆ కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది. దీంతో వాటిలో 55 బీసీ కార్పొరేషన్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచి్చంది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆయా కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు పదవిలో కొనసాగుతారని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పాల ఏకరి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టి.మురళీధర్ ఆ తర్వాత జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికవడంతో ప్రస్తుతానికి ఆ కార్పొరేషన్ పదవీకాలాన్ని కొనసాగించలేదు. సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించిన నేపథ్యంలో బీసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పశి్చమగోదావరి జిల్లా తణుకులో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న ఆధ్వర్యంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు. ఏలూరు జిల్లా గణపవరంలో రాష్ట్ర సూర్య బలిజ కార్పొరేషన్ చైర్మన్ శెట్టి అనంతలక్ష్మి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబును సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో శ్రీశయన, పొందర–కూరాకుల కార్పొరేషన్ చైర్పర్సన్లు చీపురు రాణి, రాజాపు హైమావతి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు. బీసీలకు పెద్దపీట: ఏపీ బీసీ సంఘం సీఎం వైఎస్ జగన్ బీసీలకు అన్నింటా పెద్దపీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మారేష్ అన్నారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వాటిని, వాటి పదవీ కాలాన్నీ తిరిగి యథాతథంగా కొనసాగిస్తూ శనివారం ప్రభుత్వం జీవో జారీ చేయడంపై యావత్తు బీసీ లోకం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. -
సామాజిక న్యాయానికి పెద్దపీట
దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలతో కొట్టు మిట్టాడుతోంది. అంబేడ్కర్ చెప్పినట్టు ఈ అంతరాలను తొలగించకపోతే ప్రజ లలో అసంతృప్తి రగిలి ఉద్య మాలు వస్తాయి. ప్రస్తుతం నడుస్తున్నది సంధికాలంగా భావించవచ్చు. అన్ని కులాలకు... ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను, అభివృద్ధి ఫలాలను అందించాలన్న ఆలోచన గల దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాతి, కుల, మత భేదాలతో మనుగడ కోల్పోతున్న విలువల భవితను గుర్తించి, సమానత్వానికి దారులు వేసిన ధైర్యశాలి. సమాజంలో ఉన్నత వర్గాలు పొందుతున్న హక్కులన్నింటినీ... అలాగే అభివృద్ధి పథకాలను పేద ప్రజలందరికీ అందేలా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి. సాహు మహరాజ్ వలె ఏపీ సీఎం జగన్ బలహీన వర్గాల ప్రజలకు సంపద, అధికారం, బడ్జెట్ కేటాయిస్తున్న తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అత్యున్నత పదవుల్లో అణగారిన, బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం దేశానికే ఆదర్శం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీల కోటా నుంచి 8 మంది మంత్రులకు మించలేదు. ఇప్పుడు అంతకు రెట్టింపుకు పైగా మంత్రులు, ఉప ముఖ్య మంత్రులూ బహుజనులే జగన్ మంత్రి వర్గంలో ఉండటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. మన కాలపు సాహు మహరాజ్ ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎందుకంటే గతంలో సాహు మహరాజ్ వల్లనే అప్పటి అణగారిన సమాజం రిజర్వేషన్లు పొందిందని చరిత్ర చెబుతున్నది. ఆయన సాయంతోనే డా. అంబేడ్కర్ చదువుకొని భారత దేశానికి రాజ్యాంగ రూప కర్తగా మారారని గతం గుర్తు చేస్తున్నది. అలాగే ఒక బీసీ ఉద్యమకారుడు నిస్వార్థంగా 47 ఏళ్లుగా పేద కులాల విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికై పోరాడుతున్న ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపి జగన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. వైసీపీ మూడు సంవత్సరాల క్రితం రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టింది. దీనికి మద్దతుగా 14 రాజ కీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్లో పడిపోయింది. అయితే తన పరిధి మేరకు జగన్ బహుజనులకు అధి కారంలో వాటా కల్పించడానికి నిజాయితీగా చర్యలు తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలనూ, కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటానూ బీసీలకు ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేటాయించని విధంగా ఆంధ్రప్రదేశ్ బీసీల అభివృద్ధికి 30 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రా లకు రూ.1,460 కోట్లు కేటాయిస్తే జగన్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ. 30 వేల కోట్లు కేటాయించడం మామూలు విషయం కాదు. అలాగే బీసీ కులాలు అభివృద్ధి చెందడానికి బీసీ సబ్ ప్లాన్’ ఏర్పాటు చేయ డాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దళిత, బహుజనులు రాజ్యాధికారంవైపు అడు గులు వేయాలనీ, అందుకోసం వారంతా సమైక్యంగా ఉండాలని అంబేడ్కర్ అన్నారు. కానీ, ఇక్కడ సీఎం జగన్, దళిత... బీసీ వర్గాలు ఎలాంటి పోరాటాలు చేయకుండానే అధికారంలో వాటా కల్పించారు. వారి సాధికారత కోసం పాటుపడుతున్నారు. ఇంతకంటే అంబేడ్కర్కు అర్పించే ఘన నివాళి ఏముంటుంది? - మన్నారం నాగరాజు తెలంగాణ లోక్సత్తా పార్టీ అధ్యక్షులు -
'సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
సాక్షి, గుంటూరు: బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ కార్పొరేషన్లో చేర్చడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణులను బీసీలలో చేరుస్తున్నారంటూ వస్తున్న పుకార్లు ఎవరూ నమ్మెద్దు. బీసీ కార్పొరేషన్ ద్వారానే గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశ్యంతో అయితే కార్పొరేషన్ను ఏర్పాటు చేశారో ఆ విధంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ పనిచేస్తుంది. పథకాల నిర్వహణ మాత్రమే బీసీ కార్పొరేషన్ పర్యవేక్షణ చేస్తుంది. బ్రాహ్మణ కార్పొరేషన్పై రాజకీయ పరంగా విమర్శలు చేయడం తగదు. నవరత్నాల ద్వారా పేద బ్రాహ్మణులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నవరత్నాల్లో లేని పథకాలను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందిస్తాం. అవగాహన లేని వారే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు కొనసాగుతోంది. సీఎం చెప్పిన తర్వాత కచ్చితంగా అమలవుతాయి. జనగణన వలన కొంత జాప్యం అవుతుంది. వచ్చే సాధారణ బడ్జెట్లోపే జిల్లాల ఏర్పాటు ఉండొచ్చు' అని మంత్రి తెలిపారు. -
బీసీలు బలమైన నాయకులుగా ఎదగాలి: సజ్జల
తాడేపల్లి: బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లతో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్ సంకల్పం అని అన్నారు. నూతన బీసీ నాయకత్వం కోసమే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు కులాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ బలమైన నాయకులుగా ఎదగాలని ఆయన కోరారు. ఇక మంత్రి వేణు మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఈనెల 30న బీసీ కార్పొరేషన్ కార్యాలయాలను ప్రారంభిస్తామని మంత్రి వేణు అన్నారు. మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ బీసీలకు గౌరవం కల్పించారు. బీసీకి చెందిన నన్ను డిప్యూటీ సీఎం చేయడమే నిదర్శనం’’ అని అన్నారు. చదవండి: చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్తోనే.. విషం కక్కడమే ఎల్లోమీడియా ఎజెండా: సజ్జల
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
బీజేపీనా? సమాజ్వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
Shaleena Nathani: డిఫరెంట్ స్టార్స్తో పనిచేయడమంటే.. చాలా ఇంట్రెస్టింగ్!
టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement