bonus
-
మెటాలో ఇంత అన్యాయమా?
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల మాతృ సంస్థ మెటా (Meta).. వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించింది. తమ టాప్ ఎగ్జిక్యూటివ్లకు వారి బేసిక్ పేలో 200 శాతం వరకు బోనస్లు (Bonus) ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ పనితీరు పేరుతో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించిన (Lay Off)వారం రోజుల్లోనే ఈ నిర్ణయం రావడంతో కంపెనీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టాప్ ఎగ్జిక్యూటివ్లకు బోనస్ల చెల్లింపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 13న మెటా డైరెక్టర్ల బోర్డు కమిటీ ఆమోదించింది. పోటీ కంపెనీలలో ఇలాంటి పాత్రలతో పోలిస్తే తమ ఎగ్జిక్యూటివ్ పరిహారం 15 శాతం మేర తక్కువగా ఉందన్న కారణంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బోనస్ ప్రకటన సీఈవో మార్క్ జుకర్బర్గ్కు వర్తించదని కంపెనీ ఫైలింగ్లో పేర్కొంది.అల్ప స్థాయి ఉద్యోగులను తొలగించి బాస్లకు బోనస్లు ప్రకటించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఉద్యోగులను తొలగిస్తూనే ఎగ్జిక్యూటివ్లకు భారీగా బోనస్లను అందించడం అన్యాయమని విమర్శకులు వాదిస్తున్నారు. కంపెనీలోని ఆదాయ అసమానతల సమస్యలను ఇది ఎత్తి చూపుతుందని పేర్కొంటున్నారు.ఇది చదివారా? ‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది’ఈ నిర్ణయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) సమర్థించుకున్నారు. బోనస్లు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి కంపెనీ నిరంతర వృద్ధి, విజయాన్ని నిర్ధారించడానికి అవసరమైన ప్రోత్సాహకం అని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు, కార్మిక హక్కుల వాదులు ఇటీవలి తొలగింపుల నేపథ్యంలో బోనస్లకు ఇదా సమయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఎగ్జిక్యూటివ్ బోనస్లను 200 శాతానికి పెంచాలనే నిర్ణయం మునుపటి 75 శాతం నుండి గణనీయమైన పెరుగుదల. పెరుగుతున్న పోటీ, ఆర్థిక సవాళ్ల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, లాభదాయకతను మెరుగుపరచడానికి ఈ చర్య విస్తృత వ్యూహంలో భాగమని కంపెనీ చెబుతోంది. -
ఒక్కో ఉద్యోగికి రూ.4 లక్షల బోనస్..
ఉద్యోగుల శ్రమను దోపిడీ చేసి ఆదాయాలను పెంచుకునే కంపెనీలనే చూస్తుంటాం. కానీ మంచి లాభాలు వచ్చినప్పుడు దాన్ని ఉద్యోగులకు పంచే యాజమాన్యాలు కూడా కొన్ని ఉంటాయి. పారిస్కు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ హెర్మేస్ (Hermes) గత సంవత్సరం అసాధారణమైన లాభాలు సాధించింది. పరిశ్రమలోనూ దాని స్థానం మెరుగైంది. దీంతో ఉద్యోగులకు బోనస్ (bonus) ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. 2025 ప్రారంభంలో తమ సంస్థలో పనిచేసే ఒక్కో ఉద్యోగికి రూ. 4 లక్షలు (4,500 యూరోలు) బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది.ఈ ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ ఏకీకృత ఆదాయం 2024 లో 15.2 బిలియన్ యూరోలను తాకింది. 2023 తో పోలిస్తే స్థిరమైన మారకపు రేట్లలో 15 శాతం, ప్రస్తుత మారకపు రేట్ల వద్ద 13 శాతం పెరుగుదల. హెర్మేస్ దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం, లోతుగా పాతుకుపోయిన వారసత్వ కళలు కంపెనీని ఇంత దూరం నడిపించాయి. ఈ లగ్జరీ లెజెండ్ ప్రపంచవ్యాప్తంగా తన పంపిణీ నెట్వర్క్ను బలోపేతం చేసుకుంటూ నమ్మకమైన కస్టమర్ బేస్ సంపాదించుకుంటూ అంతర్జాతీయంగా తన బ్రాండ్ను విస్తరించింది.వ్యాపారం పెరుగుతుండటంతో ఈ ఫ్యాషన్ బ్రాండ్ స్థిరమైన అభివృద్ధితోపాటు శ్రామిక శక్తిని బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టింది. హెర్మేస్ గ్రూప్ 2024 సంవత్సరంలో ఫ్రాన్స్లో 1,300 మందితో సహా మొత్తం 2,300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. దీంతో దాని మొత్తం శ్రామిక శక్తి 25,000 మందికి చేరుకుంది. ఫ్యాషన్ యునైటెడ్ నివేదిక ప్రకారం.. సామాజిక నిబద్ధత విధానంలో భాగంగా గ్రూప్ ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి రూ.4 లక్షలు (4,500 యూరోలు) చొప్పున బోనస్ను ఆర్థికేడాది ప్రారంభంలోనే కంపెనీ చెల్లించనుంది.ఇది చదివారా? బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. దాదాపు 2 నెలలు అన్లిమిటెడ్జపాన్ మినహా హెర్మేస్ ఈ సంవత్సరంలో 7 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. ఒక్క నాల్గవ త్రైమాసికంలోనే 9 శాతం పెరిగింది. బీజింగ్, షెన్జెన్లలో అనేక స్టోర్లు తెరిచినట్లు ఫ్యాషన్ యునైటెడ్ నివేదించింది. ఫ్రాన్స్ కాకుండానే యూరప్లో గరిష్ట వృద్ధి కనిపించింది. స్థానిక డిమాండ్, ఈ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో 19 శాతం వృద్ధి కనిపించింది. లిల్లే, నేపుల్స్లో కొత్త బోటిక్లను ప్రారంభించడం ఫ్యాషన్ బ్రాండ్ వృద్ధికి, విస్తరణకు తోడ్పడింది. -
ఐటీ కంపెనీ బంపరాఫర్: ఉద్యోగులకు రూ.14.5 కోట్ల బోనస్
దేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు భారీ లాభాలను పొందినప్పటికీ.. ఉద్యోగులను తొలగించడం, జీతాలు పెంచకపోవడం వంటివి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఏకంగా రూ.14.5 కోట్ల బోనస్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కోయంబత్తూరుకు చెందిన 'కోవై.కో' అనే కంపెనీ.. సంస్థలో మూడేళ్ళుగా పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులకు 'టుగెదర్ వి గ్రో' చొరవ కింద రూ.14.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ బోనస్ను డిసెంబర్ 31, 2022 నాటికి కంపెనీలో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి పంపిణీ చేయనున్నట్లు సమాచారం.మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు వారి వార్షిక జీతంలో 50% బోనస్ పొందుతారు. ఇది వారి కృషి, అంకితభావానికి నిదర్శనం. ఇప్పటికే మొదటి దశలో 80 మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికే వారి జనవరి జీత చెల్లింపులలో భాగంగా బోనస్లను అందుకున్నారు.కంపెనీ వృద్ధికి, విజయానికి సహాయపడే ఉద్యోగులకు.. సంస్థ పొందిన లాభాలలో వాటా ఇవ్వడం నా కల. అందుకే ఉద్యోగులకు బోనస్లు ఇస్తున్నట్లు కోవై.కో వ్యవస్థాపకుడు.. సీఈఓ శరవణ కుమార్ అన్నారు. 2023లో కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది. బెంగళూరుకు చెందిన ఫ్లోయిక్ను కొనుగోలు చేసిన తరువాత సంస్థ వేగంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్.. ఎన్ని కొట్లో తెలుసా?ఉద్యోగులకు షేర్ రూపంలో ఇవ్వడం కంటే.. నగదు రూపంలో డబ్బు ఇవ్వడం వల్ల వారి ప్రయోజనాలను ఉపయోగపడుతుంది. బ్యాంక్ లోన్స్ చెల్లించడానికి లేదా ఇతర అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బోనస్ను నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు శరవణ కుమార్ పేర్కొన్నారు. కంపెనీ తాము ఊహించినదానికంటే ఎక్కువ బోనస్ ఇచ్చినందులు ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!
ఏడాదికోసారి తమ ఉద్యోగులకు బోనస్లు, పారితోషికాలు ఇవ్వడం చాలా సర్వసాధారణం. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అద్భుతమైన బోనస్లు అందిస్తాయి. మరి కొన్ని కంపెనీలు అసాధారణమైన బహుమతులు, కానుకలు అందించిన సందర్భాలూ ఉన్నాయి. ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయేలా భారీ కానుకలిచ్చిన సూరత్ డైమండ్ కంపెనీ గురించి విన్నాం. అలా తమ కంపెనీ విజయంలో భాగస్వామ్యులైన ఉద్యోగులను గుర్తిస్తాయి. గౌరవిస్తాయి. అయితే చైనాకు చెందిన ఒక క్రేన్ కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా.. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచింది. తమ కంపెనీ ఉద్యోగులకు వార్షిక బోనస్ను వైరైటీగా ప్రకటించింది. ఉద్యోగులందరికీ 70 కోట్లు రూపాయలను బోనస్గా ఆఫర్ చేసింది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసిన కంపెనీ, ఏ ఉద్యోగికి ఎంత మొత్తం లభిస్తుందో నిర్ణయించడానికి ఒక పోటీ పెట్టింది. తాను ప్రకటించిన బోనస్ మనీ రూ.70 కోట్లు ఒక టేబుల్పై పర్చింది. దీంట్లో ఉద్యోగులు 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత తీసుకోవచ్చని తెలిపింది. 60 నుంచి 70 మీటర్ల టేబుల్ పై ఈ మొత్తాన్ని ఉంచి, ఉద్యోగులను 30 బృందాలుగా విభజించింది. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే రావాల్సి ఉంటుంది. వీరిద్దరూ 15 నిమిషాల్లో ఎంత సొమ్ము లెక్కపెడతారో అంత మొత్తం ఆ టీంకు దక్కుతుందని ప్రకటించింది. దీంతో పోటీ మొదలైంది. చకచకా డబ్బులు లెక్కపెడుతూ ఉద్యోగులు నానా హైరానా పడ్డారు. అన్నట్టు ఏదైనా తప్పుగా లెక్కిస్తే... ఆ నగదును బోనస్ నుండి తీసివేస్తారు కూడా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023 జనవరిలోనూ ఇదే విధంగా హెనన్ మైన్ క్రేన్ సంస్థ వార్షిక టీం లంచ్లో తమ ఉద్యోగులకు రూ.70 కోట్లను ఇచ్చిదట. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg)ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ ద్వారా చైనీస్ సోషల్ మీడియా సైట్లు డౌయిన్ ,వీబోలో షేర్ చేసింది. అలాగే ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అయింది. వీడియోపై నెటిజన్లు విభిన్నమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, మరికొందరు తమ కంపెనీలో పరిస్థితిని తలుచుకొని జోక్లువేశారు. “నా కంపెనీ కూడా ఇంతే.. కానీ డబ్బులు కాదు సుమా.. టన్నుల కొద్దీ పనిభారాన్ని ఇస్తుంది.” మరొకరు, ‘‘ ఇలాంటి పేపర్ పని నాకు కావాలి... కానీ కంపెనీ ప్లాన్ మరోలా ఉంది” అని ఇంకొకరు కామెంట్ చేశారు. “ఈ సర్కస్ బదులుగా కార్మికుల ఖాతాల్లో నేరుగా డబ్బుజమ చేయవచ్చుగా అది చాలా అవమానరమైనది. గ్రేట్ వాల్ వెనుకున్న చైనా ప్రపంచమే వేరు’’ అంటూ ఇంకొకరు నిట్టూర్చారు.చదవండి: Maha Kumbh Mela 2025: కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు... -
రైతు ఖాతాల్లోకి రూ. 530 కోట్ల సన్నాల బోనస్
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో సన్నాలు పండించిన రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన సత్ఫలితాన్నే ఇస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సన్నధాన్యం పంట గణనీయంగా పెరిగింది. రైతులు తమ తిండి అవసరాల కోసం మిగిల్చుకున్న సన్న ధాన్యం పోను... కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 18.07 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) సన్నాలను విక్రయించారు. సన్నాలు విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.530 కోట్లను బోనస్ రూపంలో జమచేసింది.మరో రూ.373 కోట్లను కొద్దిరోజుల్లోనే జమ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఇప్పటివరకు 3,24,338 మంది రైతులు సన్నాలను విక్రయించినట్లు పౌరసరఫరా శాఖ వర్గాలు తెలిపాయి. ఈ రైతులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.2,320తోపాటు రూ.500 బోనస్ కలిపి 2,820 ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రబీ (యాసంగి)లో సన్నాల సాగు పెంచేందుకు రైతులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వచ్చే సంక్రాంతి వరకు ఖరీఫ్ సీజన్ కొనుగోళ్లు ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు మరో 2 ఎల్ఎంటీల సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉంది. 46 ఎల్ఎంటీల సేకరణ: రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 7,624 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 46,02,099 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇందులో సన్న రకం 18.07 ఎల్ఎంటీ కాగా, దొడ్డు రకం 27.95 ఎల్ఎంటీ. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోగా, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు సాగుతున్నాయి.సంక్రాంతి వరకు మరో 10 ఎల్ఎంటీల వరకు ధాన్యాన్ని సేకరించే అవకాశం ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. బోనస్తో సంబంధం లేకుండా... ఇప్పటివరకు కొనుగోలు చేసిన 46.02 ఎల్ఎంటీ ధాన్యానికి రూ.10,675.15 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.9,890.46 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఇంకా రూ.784.69 కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరాల్సి ఉంది. అధిక ధరకు విక్రయించిన రైతులు రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా కోటీ 50 లక్షల మెట్రిక్ టన్ను ల మేర ధాన్యం దిగుబడి అయినట్లు ప్రభుత్వం చెపుతోంది. 91 ఎల్ఎంటీలు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసింది. నాణ్యమైన రకాలకు చెందిన బియ్యాన్ని ఇప్పుడే క్వింటాలుకు రూ. 6వేల వరకు విక్రయిస్తున్నారు. ధాన్యం విక్రయాల్లో ఇప్పటివరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నుంచి 4,90,906 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు.తరువాత స్థానంలో కామారెడ్డి జిల్లాలో 4,36,979 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. ఈ రెండు జిల్లాల్లోనే (ఉమ్మడి నిజామాబాద్) ఏకంగా 9.27 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యంలో 20 శాతానికి పైగా ఇక్కడి నుంచే కావడం విశేషం. తరువాత స్థానాల్లో ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అత్యల్పంగా కేవలం 1951 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే విక్రయించి ఆదిలాబాద్ ఆఖరి స్థానంలో నిలిచింది.ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఇలా...సన్నరకం ధాన్యం: 18.07 ఎల్ఎంటీ దొడ్డు రకం: 27.95 ఎల్ఎంటీ సన్నధాన్యం విక్రయించిన రైతులు: 3,24,338 దొడ్డు రకం విక్రయించిన రైతులు: 5,39,494 మొత్తం ధాన్యం విలువ: రూ. 10,675.15 కోట్లు రైతులకు చెల్లించిన మొత్తం: రూ. 9,890.46 కోట్లు సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్: రూ. 903.63 కోట్లు చెల్లించిన మొత్తం: రూ. 529.99 కోట్లు -
8 నెలల్లోనే ప్రమోషన్.. రూ.80 లక్షల బోనస్
గూగుల్ కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి.. తన ప్రమోషన్ గురించి, 30 శాతం పెంపు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి థ్రెడ్లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'జెర్రీ లీ' అనే వ్యక్తి 2018లో గూగుల్లో చేరాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే సీనియర్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్గా ఎదిగారు. తన పోస్ట్లో..తన సహచరులు ఎక్కువగా తనను బాధ్యతగా భావించారని వెల్లడించాడు.గూగుల్లో నా మొదటి రెండు నెలలు? నిజాయితీగా, అవి విచిత్రంగా సాగాయని వివరించాడు.పనిని సులభంగా తీసుకో అని చెప్పడం, ఉచిత భోజనం తినమని చెప్పడం, క్యాంపస్ చూడమని చెప్పడం చేసేవారు. ఎందుకంటే నేను కంపెనీలో ఉన్న ఇతరుల కంటే చిన్నవాడిని. ఆరు ఏళ్లు దాటిన వారితో కూడిన బృందంలో వారు నన్ను మొదటి కొన్ని నెలలపాటు నెగిటివ్గా చూశారని భావించినట్లు పేర్కొన్నాడు.రెండు నెలలు గడిచినా ఏమీ చేయకపోవడంతో విసుగు వచ్చిందని, ఎలాగైనా తన విలువ పెంచుకోవాలని భావించానని చెప్పాడు. నేను ప్రాజెక్ట్ల కోసం అడగడం మొదలుపెట్టాను. చివరగా నా మేనేజర్లలో ఒకరు, మీరు ఈ మార్కెట్ ల్యాండ్స్కేప్ విశ్లేషణను ఎందుకు చూడకూడదు? అని చెప్పారు. నేను దానిని గమనించాను.ఇదీ చదవండి: అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారంఆ తరువాత ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆరుగురు ఇంజనీర్లు, మరో ఐదుగురు విశ్లేషకులు, కార్యకలాపాలు, చట్టపరమైన విభాగాలకు చెందిన ఇతర ఉద్యోగులతో కలిసి ఒక ప్రాజెక్ట్ను నడిపిస్తున్నట్లు నన్ను గుర్తించారు. దీంతో కంపెనీలో చేరిన ఎనిమిది నెలల తరువాత 80 లక్షల బోనస్ అందుకోవడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ కూడా పొందినట్లు పేర్కొన్నాడు. -
గుడ్న్యూస్ చెప్పిన టెక్ దిగ్గజం: ఉద్యోగులకు 85 శాతం బోనస్
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎట్టకేలకు ఉద్యోగులకు పర్ఫామెన్స్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హులైన వారికి 85 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఈమెయిల్స్ కూడా ఉద్యోగులకు పంపించింది. కాబట్టి నవంబర్ జీతంతో పాటు ఈ బోనస్ కూడా పొందనున్నారు. కంపెనీ తీసుకున్న నిర్ణయం.. డెలివరీ, సేల్స్ వర్టికల్లో జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ మెరుగైన లాభాలను పొందింది. ఈ నేపథ్యంలో సంస్థ తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. బోనస్ అనేది కేటగిరి వారీగా చెల్లించే అవకాశం ఉంది. అయితే ఏ కేటగిరి ఉద్యోగులకు ఎంత శాతం బోనస్ ఇస్తుందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..సెప్టెంబరుతో ముగిసిన Q2FY25లో.. ఇన్ఫోసిస్ వరుసగా రెండవ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 4.7 శాతం పెరిగి రూ.6,506 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో రాబడి 5.1 శాతం పెరిగి రూ. 40,986 కోట్లకు చేరుకుంది. మొత్తం మీద ఈ ఆర్ధిక సంవత్సరంలో టెక్ దిగ్గజం మంచి వృద్ధిని నమోదు చేస్తోందని స్పష్టమవుతోంది. -
బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ(సీపీఎస్ఈ)లకు మూలధన పునర్వ్యవస్థీకరణపై సవరించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ జారీ చేసింది. దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) విడుదల చేసిన విధానాల ప్రకారం ఇకపై సీపీఎస్ఈలు తమ నికర లాభాల్లో కనీసం 30 శాతం లేదా నెట్వర్త్లో 4 శాతాన్ని(ఏది అధికమైతే దాన్ని) వార్షిక డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. ఎన్బీఎఫ్సీ తదితర ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈలు తప్పనిసరిగా నికర లాభాల్లో కనీసం 30 శాతాన్ని డివిడెండుగా చెల్లించాలి. ఇంతకుముందు 2016లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమైతే నికర లాభాల్లో 30 శాతం లేదా నెట్వర్త్లో 5 శాతాన్ని(ఏది ఎక్కువైతే అది) డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. అయితే అప్పట్లో ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. బైబ్యాక్ ఇలా..గత ఆరు నెలల్లో పుస్తక విలువ(బీవీ) కంటే షేరు మార్కెట్ విలువ తక్కువగా ఉన్న సీపీఎస్ఈ.. ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయవలసి ఉంటుంది. అయితే ఇందుకు కనీసం రూ.3,000 కోట్ల నెట్వర్త్, రూ.1,500 కోట్లకంటే అధికంగా నగదు, బ్యాంక్ నిల్వలు కలిగి ఉండాలి. కంపెనీ రిజర్వులు, మిగులు నిధులు చెల్లించిన ఈక్విటీ మూలధనానికి సమానంగా లేదా 20 రెట్లు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేయవలసి ఉంటుంది. గత ఆరు నెలల్లో షేరు ముఖ విలువకంటే మార్కెట్ ధర 150 రెట్లు అధికంగా పలుకుతున్న లిస్టెడ్ సీపీఎస్ఈ.. షేర్ల విభజనను చేపట్టవలసి ఉంటుంది. ఈ బాటలో షేర్ల విభజన మధ్య కనీసం మూడేళ్ల వ్యవధిని పాటించవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు సీపీఎస్ఈల అనుబంధ(51 శాతానికిపైగా వాటా కలిగిన) సంస్థలకు సైతం వర్తించనున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..వీటికి మినహాయింపుదీపమ్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా రంగ కంపెనీలకు వర్తించబోవు. అంతేకాకుండా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం లాభాలను పంచిపెట్టడాన్ని నిషేధించిన సంస్థలకు సైతం మార్గదర్శకాలు అమలుకావని దీపమ్ స్పష్టం చేసింది. సవరించిన తాజా మార్గదర్శకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) నుంచి అమలవుతాయని తెలియజేసింది. సీపీఎస్ఈలు మధ్యంతర డివిడెండ్ల చెల్లింపులను ప్రతీ త్రైమాసికానికీ లేదా ఏడాదిలో రెండుసార్లు చేపట్టేందుకు వీలుంటుంది. అన్ని లిస్టెడ్ సీపీఎస్ఈలు.. వార్షిక అంచనా డివిడెండ్లో కనీసం 90 శాతం ఒకే దశలో లేదా దశలవారీగా చెల్లించవచ్చు. అయితే గడిచిన ఏడాదికి తుది డివిడెండ్ను ఏటా సెప్టెంబర్లో నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) ముగిసిన వెంటనే చెల్లించవలసి ఉంటుంది. అన్లిస్టెడ్ సంస్థలు గతేడాది ఆడిటెడ్ ఆర్థిక ఫలితాల ఆధారంగా ఏడాదిలో ఒకసారి తుది డివిడెండుగా చెల్లించాలి. -
నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!
దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంతమంది ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి పని చేసే విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొందరు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులను తగ్గించింది.‘మనీకంట్రోల్’ నివేదిక ప్రకారం.. జూనియర్ ఉద్యోగులు ఇప్పటికీ వారి పూర్తి త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్ను అందుకున్నారు. అయితే కొంతమంది సీనియర్ ఉద్యోగులకు మాత్రం బోనస్లో 20-40 శాతం కోత విధించింది ఐటీ దిగ్గజం. కొంతమందికైతే బోనస్ అస్సలు లభించలేదు.“2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూనియర్ గ్రేడ్లకు 100% క్యూవీఏ (త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్) చెల్లించాము. ఇతర అన్ని గ్రేడ్లకు క్యూవీఏ వారి యూనిట్ వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుంది” అని టీసీఎస్ ప్రతినిధి చెప్పినట్లుగా మీడియా నివేదికలో పేర్కొన్నారు.టీసీఎస్ కార్యాలయ హాజరు, ఆయా వ్యాపార యూనిట్ల పనితీరు రెండింటి ఆధారంగా బోనస్లను నిర్ణయిస్తుంది. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. హాజరు విధానాలను స్థిరంగా పాటించకపోవడం క్రమశిక్షణా చర్యకు దారితీస్తుందని టీసీఎస్ గతంలోనే స్పష్టం చేసింది.కార్యాలయ హాజరు కీలకంఉద్యోగుల కార్యాలయ హాజరును కీలక అంశంగా చేరుస్తూ సవరించిన వేరియబుల్ పే విధానాన్ని టీసీఎస్ గత ఏప్రిల్లో ప్రవేశపెట్టింది. కొత్త విధానం ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని నిర్దేశిస్తూ నాలుగు హాజరు స్లాబ్లను ఏర్పాటు చేసింది. కొత్త విధానం ప్రకారం.. 60 శాతం కంటే తక్కువ సమయం కార్యాలయాల పనిచేసే ఉద్యోగులకు త్రైమాసికానికి ఎటువంటి వేరియబుల్ వేతనం లభించదు.ఇదీ చదవండి: ఇంటెల్ ఉద్యోగులకు గుడ్న్యూస్..60-75 శాతం మధ్య కార్యాలయ హాజరు ఉన్నవారు వేరియబుల్ వేతనంలో 50 శాతం అందుకుంటారు. అయితే 75-85 శాతం కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగులు వేరియబుల్ పేలో 75 శాతానికి అర్హులు. 85 శాతం కంటే ఎక్కువ ఆఫీస్కు వచ్చి పనిచేసినవారు మాత్రమే త్రైమాసికానికి పూర్తి వేరియబుల్ చెల్లింపును అందుకుంటారు. -
బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కులేదు: కేటీఆర్
-
ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్న్యూస్
దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడేళ్ల తర్వాత తన మదుపర్లకు శుభవార్త చెప్పింది. ఈ దీపావళి పండగ నేపథ్యంలో ధన్తేరాస్కు ముందు అక్టోబర్ 28న బోనస్ షేర్ల రికార్డు తేదీని ప్రకటించింది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఎలాంటి బోనస్ షేర్లను ప్రకటించకపోవడంతో మదుపర్లు కొంత నిరాశతో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇటీవల భారీగా పడిపోయింది. కేవలం ఈ కంపెనీ అనే కాదు, మార్కెట్ సూచీలు భారీగా నష్టాల బాటపట్టాయి. అక్టోబర్ 25తో ముగిసిన ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2,655.45గా ఉంది. తాజాగా కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. అంటే డీమ్యాట్లో ఒక షేర్ ఉంటే అదనంగా మరో షేర్ జమ అవుతుంది. అందుకు అనుగుణంగా షేర్ ధర కూడా సమానంగా డివైడ్ అవుతుంది. ఫలితంగా ధర తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ బోనస్కు అక్టోబర్ 28ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ తేదీలోపు డీమ్యాట్ ఖాతాలో కంపెనీ షేర్లు ఉంటే ఈ బోనస్కు అర్హులుగా పరిగణిస్తారు.ఇదీ చదవండి: గ్రామీణ బ్రాడ్బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ(అధిక రెవెన్యూ సంపాదిస్తూ అంతర్జాతీయంగా సర్వీసులు అందించే కంపెనీలకు ఇచ్చే గుర్తింపు). ఇది ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా వంటి విభిన్న రంగాల్లో సేవలిందిస్తోంది. 2023-24లో రూ.80 వేలకోట్ల ఆదాయం సంపాదించింది. 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.17,55,986 కోట్లుగా ఉంది. -
అవినీతి మానేసి హామీలపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు హితవు పలికారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు.ఈ మేరకు సీఎం రేవంత్కు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు. గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.రైతు భరోసా సంగతి తేల్చండి: వానాకాలం సీజన్ పూర్తయినా ప్రభు త్వం రైతు భరోసా సంగతి తేల్చడం లేదని కేటీఆర్ లేఖలో మండిపడ్డారు. రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామనే హామీని విస్మరించిందని, నేటికీ రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని దుయ్యబట్టారు. రైతులకు బాకీ పడిన రైతు భరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించినా 20 లక్షల మంది రైతులకు నేటికీ మాఫీ వర్తించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా రైతులకు మేలు జరగట్లేదని.. రేవంత్ చేతకానితనం అన్నదాతలకు శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
కేంద్రం శుభవార్త: ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్
దసరా, దీపావళి వచ్చిందంటే.. ఉద్యోగుల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా కంపెనీలు బోనస్, ఇంక్రిమెంట్స్ వంటివి అందిస్తాయి. మరికొన్ని ప్రైవేట్ సంస్థలైతే ఖరీదైన కార్లు, బైకులను శాతం గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రైల్వే ఉద్యోగులకు రూ. 2,029 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 11,72,140 మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అర్హత కలిగిన ఉద్యోగులందరికీ.. రూ. 7000 కనీస వేతనం కింద 78 రోజులకు బోనస్ అందించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..రైల్వే శాఖలో ట్రాక్ మెయింటెనెర్స్, స్టేషన్ మాస్టర్స్, టెక్నీషియన్స్, సూపర్ వైజర్స్, పాయింట్స్ మెన్, గార్డ్స్, లోకో పైలెట్స్, మినిస్టీరియల్ స్టాప్, గ్రూప్-సీ విభాగాలకు చెందిన ఉద్యోగులు బోనస్ పొందనున్నారు. 58,642 ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతుందని, రిక్రూట్మెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విని వైష్ణవ్ అన్నారు.रेलवे इम्प्लॉईज़ के लिए 2 हजार 29 करोड़ रुपये का प्रोडक्टिविटी लिंक्ड बोनस माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में कैबिनेट में अप्रूव हुआ है-माननीय रेल मंत्री @ashwinivaishnaw जी#ShramevJayate pic.twitter.com/15bHeQufpZ— Ministry of Railways (@RailMinIndia) October 3, 2024 -
ఇంక్రిమెంట్లు, బోనస్ల పవర్ తెలుసా..?
ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో సంపాదన పెరిగినప్పుడు విలాసాలకు, అనవసర ఖర్చులకు డబ్బు వృథా చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి వంటి పండగలకు చాలా కంపెనీలు బోనస్ను ప్రకటిస్తుంటాయి. ఈ డబ్బును పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ రూపంలో అదనంగా సమకూరే డబ్బును దీర్ఘకాల రాబడులిచ్చే ఈక్విటీ మార్కెట్లోకి మళ్లించాలి. ఇప్పటికే నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఇది మరింత డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మదుపునకు అదనంగా జోడించే ఐదుశాతం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీ నెల జీతం యాభైవేల రూపాయలు అనుకుందాం. ప్రతినెలా రూ.10 వేలు మ్యుచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణనలోకి తీసుకుందాం. మన ఇన్వెస్ట్మెంట్స్పై 12 శాతం వార్షిక రాబడి ఉంటుందనే అంచనాకు వద్దాం. అప్పటి దాకా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక మదుపును ఏటా ఐదు శాతం పెంచుకోవడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. రోజువారీ ఖర్చుల విషయంలో రాజీ పడాల్సిన అవసరమూ రాదు. కానీ, ముప్పై ఏళ్ల తర్వాత.. రూ.3.7 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.5.2 కోట్లు అందుకుంటారు. అంటే, ఏటా ఐదుశాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 కోట్లు ఎక్కువగా సమకూరుతాయి.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని హెచ్చరిక! -
సింగరేణి కార్మికులకు రూ.796 కోట్ల బోనస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ప్రభు త్వం దసరా బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో మూడోవంతు సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు దసరా కానుకగా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రూ.796 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నామని, దీని ప్రకారం సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులందరికీ సగటున రూ.1.90 లక్షల బోనస్ వస్తుందని, వీరితో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు కూడా తొలిసారి బోనస్ కింద రూ.5 వేలు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు సచివాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రు లు, సింగరేణి అధికారులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు బోనస్ వివరాలను ప్రకటించారు. ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు: ముఖ్యమంత్రి రేవంత్ సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా పంచడం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనే సింగరేణి యాజమాన్యం, మంత్రివర్గంతో కలిసి బోనస్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడ్డ సింగరేణి గని కార్మికులు ఉద్యమాన్ని పతాక స్థాయికి కెళ్లారు. వారి పోరాట పటిమ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించింది. అలాంటి సంస్థ వ్యాపార లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని నిర్ణయించాం. సింగరేణి యాజమాన్యంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదన మేరకు బోనస్ ప్రకటిస్తున్నాం’అని రేవంత్ వెల్లడించారు. సింగరేణితో తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో సంస్థ కార్మికుల శ్రమశక్తి కారణంగా ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. సింగరేణి కార్మికులు సాధించిన లాభాలను కార్మికులకు పంచడం సంతోషంగా ఉందన్నారు. పన్నులన్నీ మినహాయించుకున్న తర్వాత ఈ ఏడాది సింగరేణికి రూ.4,701 కోట్ల లాభం వచి్చందని, అందులో పెట్టుబడి కింద రూ.2,289 కోట్లు పోను మిగిలిన రూ.2,412 కోట్లలో 33 శాతం అంటే రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు బోనస్ కింద ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ ప్రకటన ద్వారా సగటున ప్రతి ఉద్యోగికి రూ.1.90లక్షల బోనస్ లభిస్తుందని, గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.20 వేలు అధికమని చెప్పారు. సింగరేణిలో పనిచేస్తున్న 41,837 మంది శాశ్వత ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన 25 వేల మంది పనిచేస్తున్నారని, చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్టు సిబ్బందికి కూడా బోనస్ ఇస్తున్నామని చెప్పారు. విస్తరణ కార్యాచరణ కూడా... సింగరేణి కార్మికులకు బోనస్తోపాటు సంస్థ విస్తరణ కార్యాచరణ కూడా చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలోని 100 మెగావాట్ల సోలార్ పవర్ప్లాంట్ విస్తరణ చేపడతామని, 500 మెగావాట్ల పంప్ స్టోరేజీ (రామగుండం ఏరియా) ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని, జైపూర్లో 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ జెన్కోతో కలిసి మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ప్రారంభిస్తామని, ఒడిశాలోని నైనీ బ్లాక్పైన అంగూల్ జిల్లాలో 2,400 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు.వీకే, గోలేటీ, నైనీ ఓపెన్కాస్ట్ల విస్తరణ చేపడతామని తెలిపారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం నూతన రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏరియా ఆస్పత్రుల ఆధునీకరణతోపాటు హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. -
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్
సాక్షి,హైదరాబాద్:సింగరేణి సంస్థలో పనిచేసే ఒక్కో కార్మికునికి లక్షా 90 వేల రూపాయల దసరా బోనస్ను ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి రేవంత్రెడ్డి శుక్రవారం(సెప్టెంబర్20) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇస్తున్న బోనస్ గతేడాది ఇచ్చిన బోనస్ కంటే రూ.20 వేలు అధికం అని భట్టివిక్రమార్క తెలిపారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈసారి వారికి కూడా బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి.. కొత్త రేషన్కార్డులకు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు -
పెరుగుతున్న సంస్థల విలువ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్ చెల్లింపులు, బోనస్ ఇష్యూలు, బైబ్యాక్లకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు సమీక్షించనుంది. ప్రభుత్వరంగ సంస్థలు ఇటీవల కాలంలో భారీగా లాభాలు సంపాదిస్తున్నాయి. దాంతో కేంద్ర ఆర్థికశాఖ ఆయా సంస్థల వద్ద పోగవుతున్న లాభాల నిర్వహణకు నియమాల్లో మార్పులు తీసుకొస్తుంది.గతంలో కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను మెరుగ్గా నిర్వహించేందుకు 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థల బ్యాలన్స్ షీట్లు భారీగా పెరిగాయి. దాంతోపాటు కంపెనీల మార్కెట్ విలువ సైతం గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో మూలధన పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాల సమీక్షపై ఆర్థిక శాఖ దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు. సవరించిన మార్గదర్శకాలు ఈ నెలలోనే విడుదల అవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఏటా వాటి పన్ను చెల్లింపుల అనంతరం సమకూరే లాభాల్లో 30 శాతం లేదా తమ నెట్వర్త్ (నికర విలువ)లో 5 శాతాన్ని డివిడెండ్ కింద చెల్లించాలి. నికర విలువ కనీసం రూ.2,000 కోట్లు, నగదు/ బ్యాంక్ బ్యాలన్స్ రూ.1,000 కోట్లు ఉన్న కంపెనీలు బైబ్యాక్ చేపట్టాల్సి ఉంటుంది. సంస్థల మూలధనం కంటే మిగులు నిల్వలు 10 రెట్లు చేరితే బోనస్ షేర్లను జారీ చేయాలి. షేరు ముఖ విలువ కంటే మార్కెట్ ధర లేదా పుస్తక విలువ 50 రెట్లు చేరితే స్టాక్ విభజన చేపట్టాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: స్థిరాస్తి అమ్మి ఇల్లు కొంటున్నారా..?మార్కెట్ విలువలో గణనీయమైన వృద్ధికేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్లు, బీమా సంస్థల మార్కెట్ విలువ గత మూడేళ్లలో రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.58 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. భారీగా నగదు నిల్వలు కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు డివిడెండ్లు చెల్లించాల్సి ఉంటుందని.. దీంతో ఈ స్టాక్స్ పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని అధికారి పేర్కొన్నారు. -
టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’
ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని సంస్థ సీఈఓ సలీల్ఫరేఖ్ స్పష్టం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జనరేటివ్ఏఐ వల్ల టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నప్పటికీ ఇకపై తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోమని తేల్చి చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థలో జనరేటివ్ఏఐతో సహా వివిధ టెక్నాలజీలను ఏకీకృతం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తొలగించే బదులు సాంకేతిక పురోగతి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు జనరేటివ్ ఏఐలో నియామకాలు కొనసాగిస్తాం. ఇతర కంపెనీల్లాగా ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన లేదు. సమీప భవిష్యత్తులో జనరేటివ్ఏఐ విభాగానికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అప్పటివరకు కంపెనీలో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు తయారవుతారు. దాంతో ప్రపంచంలోని మరిన్ని పెద్ద సంస్థలకు సేవలందిస్తాం’ అన్నారు.ఇన్ఫోసిస్ ఇటీవల ఉద్యోగుల పనితీరుపై బోనస్ ప్రకటించింది. బ్యాండ్ సిక్స్, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు జనవరి-మార్చి త్రైమాసిక పనితీరుపై బోనస్ను అందుకున్నారు. అయితే, బోనస్ రూపంలో ఇచ్చిన సగటు చెల్లింపులు మునుపటి త్రైమాసికంలోని 73 శాతంతో పోలిస్తే 60 శాతానికి పడిపోయాయి.టెక్ కంపెనీలు ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భవిష్యత్తు అంచనాలపై ఆశించిన వ్యాఖ్యలు చేయలేదు. వచ్చే ఒకటి-రెండు త్రైమాసికాల్లోనూ కంపెనీలకు పెద్దగా లాభాలు రావని తేల్చిచెప్పాయి. కొన్ని నివేదికల ప్రకారం..ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే టెక్ ఉద్యోగాల్లో కోత తప్పదని తెలిసింది. కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీల్లో తిరిగి కొలువులు పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ మాత్రం ఇకపై ఉద్యోగులను తొలగించమని ప్రకటించడం నిరుద్యోగ టెకీలకు కొంత ఊరట కలిగించే అంశమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపు, రూ.1.8 లక్షల బోనస్ కూడా
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఇటీవల పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేసి వివాదాస్పదంగా మారింది. ఎక్కువ సంఖ్య విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చెక్కబడింది. సంస్థ తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలు పెంచడమే కాకుండా బోనస్ కూడా ప్రకటించింది.2024 మే 23న పైలెట్ల జీతాలు రూ. 15000 పెంచారు. దీంతో పాటు బోనస్ రూ.1.8 లక్షల వరకు ఇస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. ఫస్ట్ ఆఫీసర్ నుంచి సీనియర్ కమాండర్ వరకు నెల జీతాలను రూ. 5000 నుంచి రూ. 15000 వరకు పెంచినట్లు వెల్లడించారు. అయితే జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతాల పెంపు లేదు. అయితే వీరికి బోనస్ కింద రూ. 42000 నుంచి రూ. 1.8 లక్షల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం.ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ రూ. 60000 బోనస్ అందుకోగా, కమాండర్, సీనియర్ కమాండర్లు వరుసగా 1.32 లక్షలు & 1.80 లక్షల బోనస్లను పొందనున్నారు. అంతే కాకుండా గ్రౌండ్ అండ్ సిమ్యులేటర్ శిక్షణలో జరిగిన ఆలస్యానికి పరిహారం కూడా అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. సాలరీ హైక్, బోనస్ వంటివి జూన్ నెల జీతంతో కలిపి ఇచ్చే అవకాశం ఉంది. -
రైతులకు రేవంత్ మోసం.. ప్రతిపక్షాలు ఫైర్
-
రేవంత్ హామీ నెరవేర్చినట్లా? యూటర్న్తో మోసం చేసినట్లా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయిన మంత్రివర్గం సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లేనా! ఒక రకంగా చూస్తే వాగ్దానం అమలు చేసినట్లే అవుతుంది. ఇంకో రకంగా చూస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావించినప్పుడు అందులో ఉన్న పాయింట్ ఏమిటంటే వరి ధాన్యం పండించే రైతులకు ఏడాదికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు అలాగే చేశారు కదా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీలను అమలు చేయడంలో ముందుకు వెళ్లినట్లే కదా అని భావించవచ్చు. ఇక్కడే కిటుకు ఉంది. మంత్రివర్గం ఈ హామీ అమలులో ఒక షరతుపెట్టింది. సన్నరకం వడ్లు పండించే రైతులకే ఈ బోనస్ ఇస్తామని తెలిపింది. గ్యారంటీలలో ఇలాంటి షరతు పెట్టలేదు కదా అని ఎవరైనా అడగవచ్చు. అలా అని అన్ని రకాల వడ్లకు ముఖ్యంగా దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రత్యేకంగా చెప్పలేదు కదా అని వాదించవచ్చు. కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలలో రైతు పండించే పంట ప్రతి గింజను కొనుగోలు చేసి బోనస్ కూడా ఇస్తామని చెప్పేవారు. అందువల్ల ఈ షరతు పెడతారని ఎవరూ అనుకోరు. ఇలా కండిషన్ పెట్టడం రైతులను మోసం చేసినట్లే కదా అని ఎవరైనా విమర్శిస్తే కూడా అంగీకరించవలసిందే. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణలో పండించే వడ్లలో సన్నరకం వాటా కేవలం ముప్పై శాతమేనని ఒక అంచనా. మిగిలినదంతా దొడ్డు రకం వడ్లేనని చెబుతున్నారు. అప్పుడు మిగతా రైతులకు బోనస్ దక్కదు. దీనిపై రైతు వర్గాలలో వ్యతిరేకత వస్తుంది. మార్కెట్ లో సన్నరకం ధాన్యానికి మంచి గిరాకి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఐదు వందల నుంచి ఏడువందల రూపాయలు అధికంగా మార్కెట్ లో లబిస్తుంది. అందువల్ల మార్కెట్ లో విక్రయించుకునే సన్నవడ్ల రైతులకు బోనస్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి రెండు సీజన్ లలో కలిపి కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది.మొత్తం ధాన్యానికి బోనస్ ఇవ్వవలసి వస్తే ప్రభుత్వానికి సుమారు ఆరువేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది. సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై రెండువేల కోట్ల భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నా,వాస్తవానికి అంత కూడా ఉండదన్నది విపక్షాల అభిప్రాయం. ఇది రైతులను మోసం చేయడమేనని వారు అంటున్నారు. సన్నవడ్లలో కూడా ఏ రకానికి బోనస్ ఇచ్చేది తర్వాత అధికారులు ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. అంటే ఇందులో కూడా లిటిగేషన్ ఉందన్న మాట. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉండడం లేదని, ఏదో రకంగా మభ్య పెట్టి ఓట్లుపొందడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సన్నరకం వడ్లను ప్రోత్సహించడానికి తొలుత ఆ వడ్లకు బోనస్ ఇస్తున్నామని, తదుపరి దొడ్డురకం వడ్లకు కూడా ఇస్తామమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కె చెప్పారు. ఆయన తెలివిగానే ఈ ప్రకటన చేసినా, ఆ మేరకు క్యాబినెట్ లో తీర్మానం చేయలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. తెలంగాణలోకాని, కర్నాటకలోని గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి.ఒకటి,రెండు అంశాలను అమలు చేసి గ్యారంటీలను చెప్పినట్లే చేస్తున్నాం కదా అని డబాయిస్తున్నారు. రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. నిజానికి రైతులు ఎవరూ తమ ఉత్పత్తులకు బోనస్ ఇవ్వాలని అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించడానికి ఇలాంటి పలు వాగ్దానాలు చేసింది. వాటిలో రైతు భరోసా కింద పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామని, రైతు కూలీలకు పన్నెండువేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసాను గత ప్రభుత్వం అమలు చేసిన పదివేలు చొప్పునే చేయగలిగారు. దానికి కొంత టైమ్ తీసుకున్నా మొత్తం మీద ఆ మేర అయినా చేశారు. ఇది ప్రామిస్ ను నెరవేర్చినట్లేనా అంటే మళ్లీ అదే రకంగా రెండు రకాల వాదనలు వస్తాయి.రైతుల రుణాలు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామన్న మరో హామీ కూడా ఉంది. ఎన్నికల ప్రచారం సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రైతులు ఎవరైనా బ్యాంకులలో అప్పులు చేయకపోతే వెళ్లి తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పుడు అది శక్తికి మించిన పని కావడంతో కిందా మీద పడాల్సి వస్తోంది. దాంతో పలు వాయిదాలు వేస్తున్నారు. ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ అంటున్నారు. ఇందుకోసం సుమారు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా కాగా,పాతికవేల కోట్లు సరిపోవచ్చని కొందరి అంచనా. ఇప్పుడు బోనస్ లో ఎలా మెలిక పెట్టారో, రుణమాఫీలో కూడా కొన్ని షరతులు పెట్టి భారం తగ్గించుకునే ప్రయత్నం జరగవచ్చు. ప్రభుత్వం అన్నాక కొన్ని నిబంధనలు పాటించక తప్పదు. వాటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయాలి. ఎన్నికల సమయంలో నేతలు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చేస్తున్నారు.కొండకు వెంట్రుక కట్టినట్లు వ్యవహరించి అధికారం సాధించిన తర్వాత మాత్రం గుడ్లు తేలేయవలసి వస్తోంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం చిన్న,పెద్ద,ధనిక రైతులందరికి రైతు బంధు అమలు చేసింది.ఆ రోజుల్లో పలు విమర్శలు కూడా వచ్చాయి. పంటలు పండని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని అనేవారు. కొందరు బెంజ్ కార్లలో వెళ్లి రైతు బంధు డబ్బు తీసుకున్నారు. కౌలు రైతులకు ఆ స్కీమ్ అమలు చేయలేమని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంగానే చెప్పారు.కాంగ్రెస్ వారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని అన్నారు.కాని ఆ దిశగా ముందుకు వెళ్లలేదు.ఇక రుణమాఫీ అమలు ఎలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయగలుగుతామని రేవంత్ తదితరులు ఆయా సందర్భాలలో చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అదికారంలోకి రాలేకపోతే ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది. రిజర్వు బ్యాంక్ ను అప్రోచ్ అయి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని ఆలోచిస్తున్నారు. ఎక్సైజ్,రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు గతంలో కొన్ని ప్రభుత్వాలు చేయకపోలేదు. రిజర్వుబ్యాంక్ అందుకు అంత సుముఖత చూపలేదు. ఉదాహరణకు ఎపిలో 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయాలని తలపెట్టి ,రైతుసాధికార సంస్థను నెలకొల్పినా, ఆచరణలో హామీని నిలబెట్టుకోలేకపోయింది. 89 వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అంతా కలిపి పదిహేను వేల కోట్లు చేసి చేతులెత్తేశారు. అందులో కూడా రైతులు నానా పాట్లు పడవలసి వచ్చింది.ఎన్నో షరతులు పెట్టేసరికి వారికి విసుగు వచ్చింది.తత్పలితంగా రైతులంతా టిడిపి ప్రభుత్వం తమను మోసం చేసిందని భావించి 2019 ఎన్నికలలో ఓడించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తపడే యత్నం చేస్తోంది. అయినా తొలి అడుగులోనే తడబడాల్సి వస్తోంది.ప్రభుత్వం వద్ద ఆర్దిక వనరులు పుష్కలంగా ఉంటే దేనినైనా చేయవచ్చు. అలా నిధులు లేవని తెలిసినా, శక్తికి మించిన పని అని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేసి ఇప్పుడు దిక్కులు చూడవలసి వస్తోంది. కాంగ్రెస్ మాత్రమే ఇలా చేస్తోందని కాదు.ఆయా రాష్ట్రాలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఒడిషా లో బీజేపీ ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల చొప్పున ఓచర్ ఇస్తామని వాగ్దానం చేసిందట. ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరున ఉంటున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలలో మరికొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్తితి ఉంది.వృద్దులకు ఇచ్చేపెన్షన్ ను నాలుగువేల రూపాయలు చేస్తామని ప్రకటించినా, ఆచరణ ఆరంభం కాలేదు. నిరుద్యోగ బృతి పరిస్థితి అంతే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అసలు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తామని అనడంపై విపక్షాలు మండిపడ్డాయి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అది ఎప్పటికి అమలు అవుతుందో చెప్పలేరు. దానికి కూడా ఏవేవో కండిషన్లు పెట్టి అయిపోయిందని చెబుతారో ఏమో చూడాలి.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీము అమలు చేశామని చెప్పారు కాని అది ఎంతమందికి వస్తుందో తెలియదు. మహిళలకు ఉచిత బస్ హామీని మాత్రం పూర్తిగానే అమలు చేస్తున్నట్లు లెక్క.ఆలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు. వీటివల్ల ప్రభుత్వంపై తక్షణ భారం ఉండదు.అయినా ఆర్టిసి భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరో వైపు ప్రభుత్వం ఇప్పటికే సుమారు పదహారువేల కోట్ల అప్పు చేసిందని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6500 కోట్ల బకాయిలు ఉన్నాయని కాలేజీలవారు, ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆస్పత్రులవారు చెబుతున్నారు.ఈ నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వానికి ఈ గ్యారంటీలు,వాటితో నిమిత్తం లేకుండా ఆయా డిక్లరేషన్ లలో చేసిన ఇతర హామీలు పెద్ద గుది బండలే అవుతాయని చెప్పకతప్పదు.ఒకరకంగా ఇది రేవంత్ ప్రభుత్వానికి సవాలు వంటిది. కొసమెరుపుగా ఒకటి చెప్పుకోవాలి. ఏపీ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసే ఈనాడు,తదితర ఎల్లో మీడియా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసింది. సన్నవడ్లకు బోనస్ వల్ల రెండువేల కోట్ల భారం అని ఈనాడు రాసిందే తప్ప, కాంగ్రెస్ వాగ్దాన భంగం చేసిందని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. చూశారుగా..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈనాడు మీడియా ఎలా జాకీలు పెడుతోందో..బాకాలు ఊదుతోందో!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు -
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియకుండా ఇప్పటికీ చాలామంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తరుణంలో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎనిమిది నెలల బోనస్ అందిస్తామని పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్లైన్స్ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. ఏడాది పొడవునా విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగిన కారణంగా ఈ సంస్థ గొప్ప లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ తమ సరిహద్దుల మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో ఎయిర్లైన్స్ లాభాలను గడించింది.ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్లైన్స్.. 'స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్' పొందింది. ఈ అవార్డును ఈ ఎయిర్లైన్స్ గతంలో ఐదు సార్లు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల చరిత్ర కలిగిం సింగపూర్ ఎయిర్లైన్స్ ఆరు సార్లు ఈ అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. -
వరికి రూ. 500 బోనస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, కమిషనర్ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితోపాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్నాటక ప్రజలు సన్నబియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తు న్న రేషన్రైస్ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. -
పోలీసులపై ‘సంగం’ దౌర్జన్యం
చేబ్రోలు: తమకు బకాయి ఉన్న బోనస్ డబ్బులను చెల్లించాలని కోరిన ఏలూరు జిల్లా పాడి రైతులపై దాడి చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై సంగం డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాలు పోసిన రైతులకు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సుమారు రూ.50లక్షల బోనస్ డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారంటూ సంగం డెయిరీ సిబ్బందిని నిలదీసిన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం, వేములపల్లి గ్రామాలకు చెందిన పాడి రైతులపై చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులు దాడి చేసిన విషయం విదితమే. డెయిరీ సిబ్బంది, ధూళిపాళ్ల అనుచరులు సుమారు వందమంది విచక్షణారహితంగా కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడంతో 15మంది రైతులకు కాళ్లు, చేతులు విరగడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. మూడు కార్లు ధ్వంసం కావడంతో రూ.ఐదు లక్షల మేర నష్టం జరిగింది. అప్పట్లో బాధిత రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రతోపాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే కేసులోని కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితులు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ సీఐ ఎం.రాంబాబు, చేబ్రోలు ఎస్ఐ కె.ఆనంద్, పొన్నూరు ఎస్ఐ బార్గవ్, పోలీసు సిబ్బంది శుక్రవారం డెయిరీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. వీరి రాకను ముందే పసిగట్టిన డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకున్నారు. మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్, డీఈ వెంకటేశ్వరరావు తదితరులు పోలీసులు అనుమతి లేకుండా సంగం డెయిరీలోకి ప్రవేశించడానికి వీలులేదని తెలిపారు. ఏలూరు రైతులపై దాడి కేసులో నిందితులు డెయిరీలో ఉన్నారని.. వారి కోసం వచ్చినట్లు సీఐ, ఎస్ఐలు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. సెర్చ్ వారెంట్, రెవెన్యూ అనుమతి కావాలని చెప్పడంతో ఇరువురు వీఆర్వోలు ఉన్నారని చూపినప్పటికీ లోపలికి రావడానికి వీల్లేదని పట్టుబట్టారు. సంగం డెయిరీ సిబ్బందితోపాటు, నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు, పొన్నూరు, పెదకాకాని మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ ఆ ఉద్యోగులకు బోనస్!
భారతీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసిక పనితీరు ఆధారంగా బోనస్ చెల్లించ నుంది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది. ఈ ఇమెయిల్ ప్రకారం, అర్హులైన ఉద్యోగులకు మాత్రమే 80 శాతం వెరియబుల్ పే చెల్లిస్తుంది. జూలై-సెప్టెంబర్ కాలానికి పనితీరు బోనస్కు కొంతమంది ఉద్యోగులు అర్హులు కారని ప్రకటించడం ఉద్యోగుల్లో నిరాశ నింపింది. ఈ నెలలో గటున 80 శాతం చెల్లింపుతో అందజేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి క్యూ2కి సంబంధించి 6వ (PL6-మేనేజర్) స్థాయి, అంతకంటే తక్కువ బ్యాండ్లో ఉన్న ఉద్యోగులు సగటున 80 శాతం వేరియబుల్ పేగా అందుకుంటారు. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, నిర్వహించిన పాత్ర ఆధారంగా ఈ బోనస్ ఉంటుందని తెలిపింది. బోసన్ ఎంత అనేది యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని పేర్కొంది. కాగా గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభంఏడాది ప్రాతిపదికన 3.2 శాతం స్వల్పంగా పెరిగి రూ. 6,212 కోట్లకు చేరుకుంది ఆదాయం కూడా 7 శాతం వృద్ధితో రూ. 38,994 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ, కంపెనీ తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను FY24కి 1 శాతం-2.5 శాతానికి సవరించింది. -
సింగరేణి కార్మికులకు దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను ఈ నెల 16వ తేదీన చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయలలో 32 శాతం లాభాల బోనస్ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ. ఒక లక్ష 53 వేల రూపాయల వరకు లాభాల బోనస్ అందనుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతం లో కన్న ఎక్కువ శాతాన్ని లాభాల వాటా ప్రకటించిన సీఎం కేసీఆర్కు సింగరేణి ఉద్యోగుల తరఫున ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపుపై డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ బలరామ్ గురువారం సర్క్యులర్ను జారీ చేశారు. చదవండి: ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ -
సింగరేణిలో ‘బోనస్’ బొనాంజా
సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు లాభాల పంట పండింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అర్జించిన రూ.2222 కోట్ల లాభాల్లో ఏకంగా 32 శాతం..అంటే రూ.711 కోట్లు సంస్థ ఉద్యోగులకు బోనస్గా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది లాభాల వాటాలో 30 శాతం బోనస్గా చెల్లించగా, ఈసారి రెండు శాతం పెంచారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగ్రావు మంగళవారం రాష్ట్ర ఇంధనశాఖకు లేఖ రాశారు. దీంతో సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.60లక్షల నుంచి రూ1.70లక్షల వరకు లాభాల్లో వాటాగా చెల్లించే అవకాశముందని సంస్థ వర్గాలు అంచనా వేశాయి. ఏటా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం వచ్చే దసరా పండుగకు ముందే బోనస్ చెల్లిస్తారు. 11వ వేతన సవరణ సంఘం బకాయిల కింద ఈ నెలలో సింగరేణి సంస్థ ఉద్యోగులకు రూ.1450 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. దీపావళి బోనస్ చెల్లింపులపై సైతం త్వరలో సంస్థ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోనుంది. సింగరేణి సంస్థ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో లాభాల బోనస్ చెల్లించనుండడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సింగరేణి లాభాల్లో వాటాను కార్మికులకు బోనస్గా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. 1998లో తొలిసారిగా లాభాల్లో పది శాతాన్ని కార్మికులకు అందించారు. ఎన్నికల ఎఫెక్ట్ రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. 42 వేల మంది కార్మికులు/ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి వచ్చే నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేప థ్యంలోనే ఎరియర్స్, బోనస్ చెల్లింపులు చకచకా సాగుతున్నాయనే భావన కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి రైతుకు విత్తు నుంచి విక్రయం వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేలా కృషి చేస్తోంది. ఏ సీజన్కు ఆ సీజన్ ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ద్వారా అందిస్తోంది. దీంతో రైతులపై రవాణా చార్జీల భారం తప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కామన్ వెరైటీ, గ్రేడ్–ఏ రకాల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తూ బాసటగా నిలుస్తోంది. ఇలా ప్రతి దశలోనూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంటే వాస్తవాలకు ముసుగేసి ‘ఈనాడు’ తనదైన శైలిలో విషం చిమ్ముతోంది. ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తావించకుండా, ఇతర రాష్ట్రాల్లో బోనస్ అంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా ‘వరి రైతుకు మిగిలేదేంటి?’ శీర్షికన ఓ కథనాన్ని వండివార్చింది. ఇందులో నిజానిజాల్లోకి వెళితే.. ఆరోపణ: 2022–23లో 9 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. వాస్తవం: రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం ఖరీఫ్లో 38.8 లక్షల ఎకరాలు, రబీలో 19.92 లక్షల ఎకరాలు.. అంటే మొత్తం విస్తీర్ణం 58.72 లక్షల ఎకరాలు. కాగా 55.52 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అంటే వ్యత్యాసం 3.20 లక్షల ఎకరాలు. రబీలో బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో 1.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజల సాగు విస్తీర్ణం పెరిగింది. మరో 35 వేల ఎకరాల్లో మత్స్య సాగు విస్తరించింది. మిగిలిన భూమిని ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. వాస్తవం ఇలా ఉంటే ఏకంగా 9 లక్షల ఎకరాలు తగ్గిపోయిందంటూ ‘ఈనాడు’ వక్రభాష్యం చెప్పింది. ఆరోపణ: క్వింటా రూ.3,126 ప్రతిపాదిస్తే ఎందుకు తగ్గించారు? వాస్తవం: పెట్టుబడి ఖర్చుల ఆధారంగా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పంటల వారీగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని ప్రతిపాదిస్తాయి. ఇలా మన రాష్ట్రంలో ఖరీఫ్లో ఎకరాకు రూ.32 వేలు, రబీలో రూ.41 వేలు ఖర్చవుతుందన్న అంచనాతో క్వింటా రూ.3,126గా ఎంఎస్పీ నిర్ణయించాలని కేంద్రానికి నివేదిక పంపింది. ఇదే రీతిలో పంటల వారీగా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో రీతిలో వచ్చే ప్రతిపాదనలన్నీ క్రోడీకరించుకొని పంట కాలానికయ్యే సాగు ఖర్చును సరాసరి లెక్కించి పంటల వారీగా అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన మద్దతు ధరను కేంద్రం ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అదే రీతిలో 2023–24 సీజన్కు సాధారణ రకానికి క్వింటాకు రూ.2,183, గ్రేడ్–ఏ రకానికి రూ.2,203గా కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధి ప్రతిపాదనలు పంపించడం వరకే. నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనన్న విషయం రామోజీకి తెలియనట్లుంది కాబోలు. ఆరోపణ: బోనస్ ఇవ్వాలన్న ఆలోచనే మరిచారు వాస్తవం: కేరళ, తమిళనాడు, జార్ఖండ్ వరికి బోనస్ ఇస్తున్నాయంటూ ‘ఈనాడు’ కొత్త వాదన తీసుకొ చ్చింది. మరి బోనస్ ఇస్తున్నా ఆయా రాష్ట్రాల్లో వరి సాగు ఎందుకు పెరగడం లేదు? ఏపీలో 24 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంటే కేరళలో 1.98 లక్షల హెక్టార్లు, జార్ఖండ్లో 13.57 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 19 లక్షల హెక్టార్లలో మాత్రమే వరిసాగవుతోంది. ఇక దిగుబడిని పరిశీలిస్తే ఏపీలో ఎకరాకు 23.24 క్వింటాళ్ల్ల దిగుబడి (2022–23) వస్తుంటే, తమిళనాడులో 17, జార్ఖండ్లో 9, కేరళలో 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎంతగా ప్రోత్సహిస్తున్నా, వరిసాగు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు అక్కడి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే కేరళ.. ఏటా మన గోదావరి జిల్లాల్లో సాగయ్యే బోండాల కోసం క్యూ కడుతుంటే, తమిళనాడు.. రాయలసీమ జిల్లాల్లో సాగయ్యే ఫైన్ వెరైటీ, జార్ఖండ్.. ఉత్తరాంధ్రలో సాగయ్యే ఫైన్ వెరైటీ ధాన్యం కొనుగోలుకు ఎగబడుతున్నాయి. సాధారణంగా డిమాండ్ కంటే తక్కువ ఉత్పత్తి ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతోనే బోనస్ ప్రకటిస్తుంటారు. మన రాష్ట్రంలో డిమాండ్కు మించి ఉత్పత్తి జరుగుతోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క సీజన్లో కూడా ఒక్క రూపాయి బోనస్ ప్రకటించిన పాపాన పోలేదు. అయినా ఇదేంటని రామోజీ అప్పట్లో ఏనాడైనా ప్రశ్నించారా? ఆరోపణ: మిల్లర్లకు ఎదురు సొమ్ము ఇవ్వాల్సి వస్తోంది వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లు, దళారీల కనుసన్నల్లోనే ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకే ధాన్యం సేకరణ జరిగేది. ఏనాడూ ఏ ఒక్క రైతుకు కూడా ఎమ్మెస్పీ దక్కిన దాఖలాలు లేవు. కానీ నేడు దళారీలు, మిల్లర్ల ప్రమేయం కూడా లేకుండా ప్రతి గింజను కనీస మద్దతు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం ఆర్బీకేలన్నింటిని ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా గుర్తించింది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యంలో మంచి రకాలను ఎంపిక చేసి అదనపు ఖర్చుల కింద క్వింటాకు రూ.110 వెచ్చించి నాణ్యమైన బియ్యంగా మార్చి కార్డుదారులకు ఇంటి వద్దే అందిస్తోంది. ఇవేమీ ‘ఈనాడు’కు కనిపించడం లేదు. ఆరోపణ: వరి రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు వాస్తవం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 17,94,279 మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. బాబు హయాంలో తక్కువ మంది రైతుల వద్ద నుంచి ఎక్కువ మొత్తం ధాన్యం సేకరించేవారు. ఉదాహరణకు 2014–15లో 1.18 లక్షల మంది రైతుల నుంచి రూ.5,583 కోట్ల విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నూటికి 90 శాతం సన్న, చిన్నకారు రైతులున్న ఈ రాష్ట్రంలో ఈ స్థాయిలో ధాన్యం అమ్మారంటే వార్ని ఏమంటారో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఏకంగా 32,76,354 మంది రైతుల నుంచి రూ.58,739 కోట్ల విలువైన 3,10,56,117 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంతో పోలిస్తే ధాన్యం అమ్ముకున్న రైతుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఆరోపణ: అమ్మాలంటే అగచాట్లు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని బస్తా (75 కిలోలు)కు మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.500 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరాకు తక్కువలో తక్కువ 30–33 బస్తాల దిగుబడి వేసుకున్నా రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. అంతేకాకుండా దళారులు, వ్యాపారులు తేమ శాతం పేరిట ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. కానీ ప్రస్తుతం జిల్లాకో మొబైల్ మిల్లును పంపి రైతుల ఎదుటే శాంపిల్స్ పరీక్షించి మరీ కొనుగోలు చేశారు. ముక్క విరుగుడు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి మరీ కొన్నారు. గత ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను తేమ, నూక శాతాలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. బోనస్కు మించి జీఎల్టీ రైతు ప్రయోజనార్థం రైతు భరోసా కేంద్రాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించింది. అంతటితో ఆగకుండా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలు చేసేందుకు అదనపు ఖర్చులు భరించింది. మునుపెన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, హమాలి.. రవాణా చార్జీలు మద్దతు ధరతో పాటు కలిపి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచి ఖరీదు రూ.70. ఈ లెక్కన ఒక టన్ను ధాన్యం నిల్వ చేసేందుకు గోనె సంచుల కోసం రూ.1,750 ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. హమాలి ఖర్చు టన్నుకు రూ.220, రవాణాకు రూ.468 (25 కి.మీ పరిధిలో) చొప్పున.. మొత్తంగా టన్నుకు రూ.2,523 చొప్పున ప్రభుత్వం జీఎల్టీ (గన్నీ బాగులు, లేబర్, ట్రాన్స్పోర్ట్) రూపంలో ఖర్చు చేస్తోంది. ఈ మొత్తం ధాన్యం కొనుగోలు సొమ్ముతో కలిపి రైతు ఖాతాల్లో జమ చేస్తోంది. చదవండి: Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’ ఇది ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే బోనస్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. పైగా పక్క రాష్ట్రాల్లో పరిమితికి లోబడే కొనుగోలు చేస్తారు. మన రాష్ట్రంలో మాత్రం ఆర్బీకే వద్దకు వచ్చిన ప్రతి రైతు నుంచి ఈ–క్రాప్ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేస్తుండటం బహిరంగ రహస్యం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోని ఈనాడు ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద చల్లడమే లక్ష్యంగా అర్ధసత్య కథనాలు ఎవరి కోసం రాస్తోంది? -
దిగిపోతున్న ఈ సీఈవో అందుకున్న పరిహారం రూ. 22 కోట్లు!
త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) వ్యాపార దిగ్గజం హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) సీఈవో, ఎండీ భారీ పరిహారాన్ని అందుకున్నారు. వచ్చే నెలలో దిగిపోతున్న సంజీవ్ మెహతా 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 22 కోట్లకు పైగా పరిహారాన్ని అందుకున్నారు. ఇందులో రూ. 6.3 కోట్ల బోనస్కూడా ఉంది. బోనస్ దాదాపు 50 శాతం పెరగడంతో సరాసరిగా మొత్తం పరిహారం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే భారీగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం అంతర్గత వ్యాల్యూమ్ వృద్ధిని సాధించిన హెచ్యూఎల్ 16 శాతం వృద్ధితో రూ. 58,154 కోట్ల టర్నోవర్ సాధించింది. దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన సంజీవ్ మెహతా పదవీకాలంలో జూన్ నెలలో ముగియనుంది. ఇన్పుట్ కాస్ట్ ద్రవ్యోల్బణం కారణంగా తలెత్తిన కఠినమైన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని కంపెనీ పోర్ట్ఫోలియో అత్యధిక మార్కెట్ వాటా పొందేలా చేసిన ఘనత సంజీవ్ మెహతాకు దక్కుతుంది. జూన్ 27న పదవి నుంచి దిగిపోతున్న సంజీవ్ మెహతా కొత్త సీఈవో రోహిత్ జావాకు బాధ్యతలు అప్పగించనున్నారు. సింగపూర్ పౌరుడైన రోహిత్ జావా కూడా రూ. 21 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటారు. ఇందులో రూ. 7 కోట్ల టార్గెట్ బోనస్కూడా ఉంటుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
మెగా బోనస్: 8 నెలల జీతం, ఎయిర్లెన్స్ ఉద్యోగుల సంబరాలు
సాక్షి, ముంబై: సింగపూర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు అద్భుతమైన వార్త. తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది కంపెనీ. రికార్డు స్థాయిలో రూ.13,000 కోట్ల వార్షిక లాభాన్ని ఆర్జించిన తర్వాత, ఎయిర్లైన్ దాని సిబ్బందికి ఎనిమిది నెలల జీతంతో సమానమైన బోనస్ను అందించనుంది. మెగా బోనస్ కోవిడ్ మహమ్మారి సమయంలో విశిష్ట సేవలందించిన, అర్హత కలిగిన ఉద్యోగులు 6.65 నెలల వేతనానికి సమానమైన లాభాల-భాగస్వామ్య ప్రోత్సాహకాన్ని, గరిష్టంగా 1.5 నెలల ఆదాయాన్ని ఎక్స్-గ్రేషియా బోనస్గా అందిస్తున్నామని ఎయిర్లైన్ ప్రతినిధి తెలిపారు. అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు అదనపు ఎక్స్గ్రేషియా ఇన్సెంటివ్ ఉండదని చెప్పారు.(గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) స్టాఫ్ యూనియన్లతో ఒప్పందం ప్రకారం తమ దీర్ఘకాలిక వార్షిక లాభాల-భాగస్వామ్య బోనస్ ఫార్ములాపై ఆధారపడి ఉంటుంని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. సింగపూర్ ఎయిర్లైన్స్ మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 1.62 బిలియన్ డాలర్లు (రూ.13వేల కోట్లు) నికర లాభాన్ని ప్రకటించింది. (Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) అన్ని క్యాబిన్ తరగతుల్లో ఫార్వర్డ్ సేల్స్ చైనా, జపాన్ , దక్షిణ కొరియాలకు రిజర్వేషన్లు బలంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. సింగపూర్ ఎయిర్లైన్స్ , బడ్జెట్ ధరల అనుబంధ సంస్థ స్కూట్లో ఒకే ఏడాదిలో ఆరు రెట్లు ఎక్కువ మంది ప్రయాణీకులు ప్రయాణించారు (26.5 మిలియన్లు). (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) మార్చిలో 79శాతంతో ప్రీ-కోవిడ్ స్థాయిలకు చేరుకుంది, సింగపూర్ ఎయిర్లైన్స్ షేర్లు గురువారం 1.2శాతం పెరిగాయి సింగపూర్ ఎయిర్ ఏప్రిల్లో 1.75 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించినట్లు సోమవారం నివేదించింది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 53శాతం పెరిగింది. ఇలాంటిమరెన్నో అద్భుతమైన వార్తలు, విశేషాల కోసం చదవండి :సాక్షి, బిజినెస్ -
బజాజ్ అలియెంజ్ నుంచి బోనస్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ బజాజ్ అలియెంజ్ గత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) గాను పాలసీదారులకు రూ. 1,201 కోట్ల విలువైన బోనస్ ప్రకటించింది. వెరసి అర్హతగల పార్టిసిపేటింగ్ పాలసీదారులకు వరుసగా 22వ ఏడాదిలోనూ బోనస్ చెల్లింపులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా బోనస్లో రెగ్యులర్ రివర్షనరీ బోనస్ రూ. 872 కోట్లు, టెర్మినల్, క్యాష్ బోనస్ రూ. 329 కోట్లు కలసి ఉన్నట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది (2021 - 22) రూ. 11.62 లక్షలకుపైగా పాలసీదారులకు రూ. 1,070 కోట్ల బోనస్ చెల్లించింది. -
బోనస్పై జుకర్బర్గ్ను నిలదీసిన ఉద్యోగులు
ఓ వైపు లేఆఫ్స్ పేరుతో వేలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ మెటా మరోవైపు అందులో పనిచేస్తున్న టాప్ ఎగ్జిక్యూటివ్లకు రూ.కోట్ల కొద్దీ బోనస్లు ప్రకటించింది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు కంపెనీ సీఈవో మార్క్జుకర్బర్గ్నే నేరుగా నిలదీశారు. మెటా ఇప్పటి వరకు 21,000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. తొలి రౌండ్ తొలగింపులను 2022 నవంబర్లో ప్రకటించగా, రెండో రౌండ్ లేఆఫ్లను గత నెలలోనే ప్రకటించింది. మొదటి రౌండ్లో 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, రెండో రౌండ్లో 10 వేల మందికి పింక్ స్లిప్ ఇచ్చారు. మరోవైపు కొంతమంది టాప్ ఎగ్జిక్యూటివ్లకు కంపెనీ భారీ బోనస్లను ఇచ్చింది. కంపెనీలో లేఆఫ్స్ పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు పెద్ద మొత్తంలో బోనస్లను అందించడంపై చాలా మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వాళ్ల పని నచ్చింది.. అందుకే బోనస్లిచ్చాం’ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం.. మార్క్ జుకర్బర్గ్ రెండు రోజుల క్రితం వర్చువల్ క్యూఅండ్ఏ (Q&A) సెషన్లో ఉద్యోగులతో మాట్లాడారు. అదే సెషన్లో కొంతమంది ఉద్యోగులు.. ఓ వైపు వేలకొద్దీ తొలగింపులు జరుగుతున్నప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్లు ఇవ్వడం వెనుక కారణాన్ని చెప్పాలని జుకర్బర్గ్ను అడిగారు. జుకర్బర్గ్ దీనికి స్పందిస్తూ వారికి అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని, వారి పనితీరు పట్ల తాము సంతోషంగా ఉన్నందునే బోనస్లు ఇచ్చినట్లు బదులిచ్చారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! ‘ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేస్తున్న ప్రతిభావంతులైన చాలా మంది ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీశారు. ఇలాంటి పరిస్థితిలో మెటా సంస్థలో ఉద్యోగులు ఎందుకు ఉండాలి’ మరో ఉద్యోగి ప్రశ్నించారు. మెటా స్థాయిలో సామాజిక అనుభవాలను మరే ఇతర సంస్థ అందించదని, బిలియన్ల కొద్దీ ప్రజలను చేరుకోవాలనుకుంటే, భారీ ప్రభావాన్ని చూపాలనుకుంటే ఇదే గొప్ప సంస్థ అని జుకర్బర్గ్ సమాధానమిచ్చారు. టాప్ ఎగ్జిక్యూటివ్లకు ఇచ్చిన బోనస్లు ఇలా.. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన మెటా ఎస్ఈసీ ఫైలింగ్లో టాప్ ఎగ్జిక్యూటివ్లకు ఇచ్చిన బోనస్లు గురించి వెల్లడైంది. ఫైలింగ్ ప్రకారం.. సీఎఫ్వో సుసాన్లీ 5,75,613 డాలర్ల (రూ. 4.71 కోట్లు) , సీపీఓ క్రిస్టోపర్ కాక్స్ 9,40,214 డాలర్లు (రూ. 7.70 కోట్లు) బోనస్గా పొందారు. అలాగే సీవోవో జేవియర్ ఒలివాన్ 7,86,552 డాలర్లు (రూ. 6.44 కోట్లు), సీటీవో ఆండ్రూ బోస్వర్త్ 7,14,588 డాలర్లు (రూ. 5.85 కోట్లు) బోనస్ అందుకున్నారు. ఇక చఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ (సీఎస్వో) డేవిడ్ వెన్నర్ 712,284 డాలర్లు (రూ. 5.83 కోట్లు), మాజీ సీవోవో షెరిల్ శాండ్బర్గ్ 2,98,385 డాలర్లు (రూ. 2.44 కోట్లు) బోనస్ పొందారు. ఇదీ చదవండి: కారణం లేకుండానే.. బ్రియాన్ హంఫ్రీస్ను తొలగించిన కాగ్నిజెంట్! -
పాడి రైతులకు బోనస్ పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్ పంపిణీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా కర్నూలు మిల్క్ యూనియన్ (విజయడైరీ) పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. రూ.7.20 కోట్ల బోనస్ చెక్ను కర్నూలు మిల్క్ యూనియన్ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి సీఎంకు అందజేశారు. పాడిరైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల తమ సహకార సమితి రెండేళ్లలో రూ.27 కోట్లు లాభాలు గడించిందని ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు మిల్క్ యూనియన్ సమగ్ర పనితీరును వివరించారు. రానున్న రోజుల్లో డైరీని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళతామని ఛైర్మన్, ఎండీ, డైరెక్టర్లు సీఎం జగన్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు మిల్క్ యూనియన్ (విజయడైరీ) ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి, ఎండీ పరమేశ్వర్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రాజేష్, సొసైటీ డెరెక్టర్లు జి.విజయసింహారెడ్డి, యు.రమణ, మహిళా పాడి రైతు ఎన్. సరళమ్మ పాల్గొన్నారు. చదవండి: (పవన్, చంద్రబాబు కలయికపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కామెంట్స్) -
దీపావళికి గిఫ్ట్స్, బోనస్లు వచ్చాయా? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
సాక్షి,ముంబై: దీపావళి పర్వదినం సందర్భంగా ఎవరినుంచైనా గిఫ్ట్స్ తీసుకున్నారా? లేదంటే మీరు పని చేస్తున్న కంపెనీ నుంచి బోనస్ స్వీకరించారా? అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బహుమతులు వాటి స్వభావాన్ని బట్టి ఈ పన్ను వివిధ వర్గాలుగా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో పండుగ బహుమతులు, బోనస్పై ఎంత ట్యాక్స్ చెల్లించాలో ఒక సారి చూద్దాం. పండుగ సీజన్ వచ్చిందంటే గిఫ్ట్స్, సాలరీ బోనస్ ఇవన్నీ సర్వ సాధారణం. ఉద్యోగులందుకునే బోనస్ను కూడా వేతనంగా భావించే ఆదాయ పన్ను శాఖ వాటిపై పన్ను విధిస్తుంది. వేతనాల ఆధారంగా చెల్లించే బోనస్కు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, కొన్ని బహుమతుల విలువను బట్టి , ఎవరి నుండి స్వీకరించారో బట్టి వాటిపై పన్ను విధించే అవకాశం ఉంది. ఈ బహుమతి మినహాయించిన కేటగిరీ కిందకు రాకపోతే, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేసేటప్పుడు దానిని కచ్చితంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది. శ్లాబ్ రేటును బట్టి సంబంధిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా వార్షిక వేతనంతో బోనస్ కూడా కలిపి మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించాలి. ► ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో స్వీకరించే బహుమతుల మొత్తం విలువ రూ. 50,000 కంటే ఎక్కువగా ఉంటే, అది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం పన్ను వడ్డింపు ఉంటుంది. ► ఈ బహుమతులు నగదు లేదా రకమైన రూపంలో ఉండవచ్చు. అయితే, దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఇచ్చే బహుమతులకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అంటే సోదరుడు, సోదరి, తల్లిదండ్రులు జీవిత భాగస్వామి ఇచ్చే బహుమతులపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ► భూమి లేదా భవనం రూపంలో బహుమతులు వచ్చినట్లయితే, వాటిని స్థిరమైన ఆస్తిగా పరిగణిస్తారు. ఒకవేళ ఈ ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ 50వేల రూపాయలు దాటితే బహుమతిపై పన్ను విధించబడుతుంది. ► అదే సమయంలో గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్, ఆభరణాలు, పెయింటింగ్లు, డ్రాయింగ్లు, షేర్లు/సెక్యూరిటీలు వంటి బహుమతులు, ఇతర వాటితో పాటుగా, చరాస్తుల మార్కెట్ విలువ రూ. 50వేల కంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాల్సిందే. -
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. లాభాల బోనస్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. దీంతో అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్కు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పరిస్థితుల్ని అధిగమించి.. దేశంలో గత రెండేళ్లుగా నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి 2021-22 లో రికార్డు స్థాయిలో 26,607 కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధించింది సింగరేణి. మొత్తం టర్నోవర్ పై పన్నులు విధించడానికి ముందుకు 1,722 కోట్ల రూపాయల లాభాలను ఆర్థించినట్లు సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా సాధించిన టర్నోవర్ పై నికర లాభాలు రూ.1,227 కోట్లుగా (పన్నులు చెల్లించిన తర్వాత) ఉన్నట్లు తెలిపారు. అలాగే గత ఏడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 3,596 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీన లాభాల వాటా చెల్లింపు సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటాను దసరా కానుకగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కార్మికులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సీ అండ్ ఎండీ. ఈ ఏడాది లాభాల వాటాగా కార్మికులు రూ.368 కోట్లను అందుకోనున్నారని వివరించారు. దాదాపు 44 వేల మంది ఉద్యోగులకు లాభాల వాటాను అక్టోబర్ 1వ తేదీన (శనివారం) చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. 70 మిలియన్ టన్నుల లక్ష్యంతో.. 2021-22 లో సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 655 లక్షల టన్నుల రవాణా చేసిందన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 88.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేసినట్లు వివరించారు. అలాగే ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి ప్రతీ ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని, తద్వారా రికార్డు స్థాయి టర్నోవర్, లాభాలు సాధించవచ్చని తద్వారా మరిన్ని ఎక్కువ లాభాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. -
పొరపాటున అడిషనల్ బోనస్: ఉద్యోగుల కుటుంబాల్లో చిచ్చు
న్యూఢిల్లీ: జపాన్ కార్ మేకర్ హోండా తప్పులో కాలేసింది. ఓహియో-ఆధారిత మేరీస్విల్లే ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్లో అనుకోకుండా అదనపు మొత్తంలో చెల్లించింది. ఆలస్యంగా పొరపాటు గ్రహించిన సంస్థ అదనంగా చెల్లించిన సొమ్మను ఇచ్చేయాలంటూ తన ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తాజా పరిణామంతో అవాక్కయిన ఉద్యోగులు చేతికొచ్చిన సొమ్ములు ఎలా ఇవ్వాలో తెలియక తికమకలో పడిపోయారు. మరోవైపు ఉద్యోగులు డబ్బులువాపస్ ఇస్తారా లేదా, లేదంటే భవిష్యత్తు బోనస్లో కట్ చేసుకోవాలో తేల్చుకోలేక హోండా అధికారులు తలలు పట్టుకున్నారు. (SpiceJet Salary Hikes: సంచలనం,పైలట్లకు 20 శాతం జీతం పెంపు!) సెప్టెంబరు 22 వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల నుండి తీసుకోవాలా, భవిష్యత్ బోనస్లో మినహాయించుకోవాలా లేదా ముందుగా చెల్లిస్తారా మీరే తేల్చుకోమని ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని హోండా ప్రతినిధి కూడా ధృవీకరించింది. అయితే సున్నితమైన ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఉద్యోగులు డబ్బును తిరిగి చెల్లించకపోతే హోండా చట్టపరమైన మార్గంలో వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహాలు దీనిపై ఉద్యోగుల కుటుంబాల్లో అగ్రహాలువ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని అందరూ మేనేజ్ చేయలేరంటూ ఒక హోండా ఉద్యోగి భార్య వాపోయారు. తన భర్తకు వచ్చిన బోనస్లో 8 శాతం తిరిగి ఇవ్వాలంటే.. వందల డాలర్లు ఆమెపేర్కొన్నారు. అది మాకు కారు చెల్లింపు. అది మా తనఖాలో సగం, రెండు, మూడు వారాల విలువైన కిరాణా.. ఈ డబ్బు చాలా విలువైంది..చెల్లించాలంటే కష్టం మరొకరు వ్యాఖ్యానించారు. -
స్టార్బక్స్ సీఈవో లక్ష్మణ్ నరసింహన్ జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: గ్లోబల్ కాఫీ చైన్ స్టార్బక్స్ కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీనిపై ఆనంద్ మహీంద్రా లాంటి పలువురు వ్యాపార దిగ్గజాలు భారతీయ బిజినెస్ లీడర్స్ సురక్షితమైన, ప్రతిభావంతమైన వారుగా పాపులర్ అతున్నారని వ్యాఖ్యానించారు. ఇది చదవండి : Laxman Narasimhan:స్టార్బక్స్ సీఈవో ఇన్స్పైరింగ్ జర్నీ..ఫిదా అవ్వాల్సిందే! 2023 ఏప్రిల్ నుంచి సీఈవోగా పూర్తి బాధ్యతలను స్వీకరించనున్న లక్ష్మణ్ నరసింహన్ వార్షిక మూల వేతనంగా 1.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10 కోట్లు) తీసుకుంటారని రెగ్యులేటరీ ఫైలింగ్లో స్టార్బక్స్ పేర్కొంది. అలాగే సుమారు 12 కోట్ల రూపాయల బోనస్తో పాటు 9.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 73 కోట్లు) విలువైన ఈక్విటీ గ్రాంట్ను కూడా అందుకుంటారు. 2023 ఆర్థిక సంవత్సరం నుండి, 13.6 మిలియన్ డాలర్లకు (రూ. 107 కోట్లకు పైగా) సమానమైన వార్షిక ఈక్విటీ అవార్డును పొందనున్నారు. కాఫీతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చివేసిన సాటిలేని మేటి కంపెనీ ఎదిగిన స్టార్బక్స్లో చేరడం సంతోసంగా ఉందని నరసింహన్ ప్రకటించారు. నిబద్ధతతో సేవలందిస్తూ ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకునే బ్రాండ్ స్టార్బక్స్ అని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న, మారుతున్న, డిమాండ్స్ తీర్చడానికి మరింత బలమైన భవిష్యత్తు పెట్టుబడులు పెడుతున్న కీలక సమయంలో దిగ్గజ కంపెనీ స్టార్బక్స్లో చేరడం గౌరవంగా భావిస్తానన్నారు. -
బంపరాఫర్.. బరువు తగ్గితే సగం నెల జీతం బోనస్!
స్టార్టప్ నుంచి యూనికార్న్ కంపెనీగా ఎదిగిన జెరోదా ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. వరల్డ్ హెల్త్డేని పురస్కరించుకుని ఉద్యోగల మధ్య ఆసక్తికర పోటీకి ఆ కంపెనీ సీఈవో నితిన్ కామత్ తెర తీశారు. గతంలో ఫిట్గా ఉన్న ఉద్యోగులకు రూ. 10 లక్షలు బోనస్ అందించాడు నితిన్ కామత్. జెరోదా కంపెనీ ఫౌండర్ కమ్ సీఈవో నితిన్ కామత్ ఆది నుంచి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. తాజాగా ఆ కంపెనీ ఉద్యోగుల మధ్య విచిత్రమైన పోటీ పెట్టారు. ఏ ఉద్యోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 కంటే తక్కువగా ఉంటుందో వాళ్లకి సగం నెల జీతం బోనస్గా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం తమ కంపెనీ ఉద్యోగుల సగటు బీఎంఐ 25.3గా ఉందని, దీన్ని 24 కిందకు తీసుకువస్తే ఉద్యోలందరికీ అర నెల జీతం బోనస్గా ఇస్తానంటూ కొత్త రకం కాంపిటీషన్ ప్రారంభించారు. ఆర్యోగంగా ఉంటే మిగిలిన అన్ని సాధించవచ్చు. అయితే ఫిట్గా ఉండేందుకు వర్కట్లు ప్రారంభించడమే కష్టమైన పని. అందుకే ఆరోగ్యం, ఫిట్నెస్కి సంబంధించి బీఎంఐ అనేది అంత శ్రేష్టమైన కొలమానం కాకపోయినప్పటికీ.. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది తేలికైన విధానం. ఈ కారణం చేతనే బీఎంఐ పోటీ పెడుతున్నట్టు నితిన్ కామత్ వివరణ ఇచ్చారు. అంతకాదు రోజు పది వేల అడుగుల నడకతో మీ పోటీని ప్రారంభించండంటూ ఉద్యోగులకు సూచించాడు. నితిన్ కామత్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం పట్ల ఉద్యోగులు శ్రద్ధ తీసుకునేలా మోటివేట్ చేయడం మంచి నిర్ణయమని కొందరు సానుకూలంగా స్పందించారు. మరికొందరు ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుందని.. ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల చివరికి మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు We are running a fun health program at @zerodhaonline. Anyone on our team with BMI -
‘బోనస్లు తిరిగి ఇచ్చేయండి’.. ఉద్యోగులకు కంపెనీ షాక్!
దేశంలోనే నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీని ఏడాది మధ్యలో వీడుతున్న ఉద్యోగులను.. బోనస్ కింద చెల్లించిందంతా తిరిగి ఇచ్చేయమంటూ వేధిస్తోందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటన ఇచ్చుకుంటున్నప్పటికీ.. అది ఉద్యోగులకు పూర్తి ఊరట ఇచ్చేదిగా లేదని తెలుస్తోంది!. తాజాగా భారత ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెసీఎల్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజైన్లు చేసి కంపెనీని వీడుతున్న ఉద్యోగులను ‘పర్ఫార్మెన్స్ బోనస్’ ఇచ్చిందంతా.. తిరిగి చెల్లించాకే బయటకు వెళ్లాలని కోరుతోంది. ఈ మేరకు హెచ్ఆర్ పాలసీలోని రూల్ను చూపించడంతో ఉద్యోగులు ఖంగుతింటున్నారు. ఈ విషయంపై ఐటీ ఎంప్లాయిస్ యూనియన్లను ఉద్యోగులు ఆశ్రయించినట్లు సమాచారం. లేబర్ మినిస్టర్ భూపేందర్ యాదవ్కి, హెచ్సీఎల్ చైర్పర్సన్కి సైతం లేఖలు రాశారు పుణే ఐటీ యూనియన్ ప్రతినిధి హర్మీత్ సలూజ. డబ్బులు తిరిగి చెల్లించని ఉద్యోగుల ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇవ్వకుండా కంపెనీ వేధిస్తోందని సలూజ ఆ లేఖలో ప్రస్తావించారు. హెచ్సీఎల్ ప్రకటన అయితే హెచ్సీఎల్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఉద్యోగులకు తెలియకుండా తామేం చేయట్లేదని పేర్కొంది. మంత్లీ బేసిస్ మీద చెల్లించే అడ్వాన్స్ విషయంలో హెచ్ఆర్ పాలసీ ప్రకారం.. అదీ ఉద్యోగులు సంతకాలు చేసిన కాలమ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేసింది. నవంబర్ 2021న ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం.. సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చ్ 31, 2022 మధ్య కంపెనీని వీడే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ల నుంచి.. ఎంప్లాయి పర్ఫార్మెన్స్ బోనస్ (EFB) రికవరీ చేస్తామని తెలిపింది. ఇక వివాదాస్పదం కావడంతో ఆఘమేఘాల మీద ఆ పాలసీని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. వెనక్కి తగ్గలేదు! వివాదాస్పద ఈ పాలసీ విషయంలో హెచ్సీఎల్ ఒక స్పష్టమైన ప్రకటనంటూ ఇవ్వకపోవడం గమనార్హం. దశాబ్దానికి పైగా జూనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు జీతం కాకుండా.. అడ్వాన్స్గా చెల్లింపులు అందుకుంటున్నారు. అలాగే ఇకపై కంపెనీ మా ఉద్యోగుల కోసం ముందస్తు వేరియబుల్ చెల్లింపును కొనసాగిస్తుంది. అంతేకాదు డిసెంబర్ 22, 2021 నుంచి రికవరీలను కూడా మాఫీ చేసిందని హెచ్సీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఇక్కడే గందరగోళం నెలకొంది. ఈఎఫ్బీ రికవరీ పాలసీని మాత్రమే హెచ్సీఎల్ వెనక్కి తీసుకుందని.. ఏపీఎంబీ (Advance Monthly Performance Bonus) విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సలూజ చెప్తున్నారు. ఈఎఫ్బీ అనేది ఉద్యోగులందరికీ వర్తించే బోనస్ కాగా.. ఏఎంపీబీ మాత్రం ప్రత్యేకించి ప్రాజెక్టుల కోసం పని చేసే ఉద్యోగులందరికీ జారీ చేస్తున్న బోనస్. సో.. రిజైన్ చేసిన ఉద్యోగులు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న మాట!. -
జంప్ కాకుండా ఒక్కొక్కరికి రూ.కోటిన్నర బోనస్!
మెటావర్స్ సాంకేతికత సంగతి ఏమో గానీ.. దాని కోసం ఉద్యోగుల నియామకాలు ఇప్పటి నుంచే ఊపందుకున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి. మెటా కంపెనీ(ఫేస్బుక్) ఈమధ్యే భారీ వేతనాలను ఎరగా వేసి 100 మంది ఇంజినీర్లను యాపిల్ నుంచి నియమించుకున్న సంగతి తెలిసిందే. కౌంటర్గా యాపిల్ కూడా దాదాపు అదే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ రెండు కంపెనీలు పోటాపోటీ ఆఫర్లతో ఉద్యోగుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీ స్టాక్ బోనస్లతో ఉద్యోగులను ఎటూ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంజినీర్లు, సాఫ్ట్వేర్-ఆపరేషన్స్ గ్రూప్కు చెందిన ఉద్యోగులకు 50వేల డాలర్ల నుంచి లక్షా 80వేల డాలర్లు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది(మన కరెన్సీలో 37 లక్షల రూపాయల నుంచి దాదాపు కోటిన్నర రూపాయల దాకా). ఈ రివార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. స్టాక్ బోనస్ ఫస్ట్ టైం బ్లూమరాంగ్ నివేదిక ప్రకారం.. యాపిల్ బోనస్లు ఇవ్వడం కొత్తేం కాదు. కానీ, ఈ తరహా స్టాక్ బోనస్లు.. అదీ ఈ రేంజ్లో ఆఫర్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. పర్ఫార్మెన్స్ల ఆధారంగా వీటిని అందజేయనున్నట్లు తెలిపింది. యాపిల్ విపరీతమైన లాభాల్లో ఉన్న విషయం తెలిసిందే. షేర్లు కిందటి ఏడాదిలో 36 శాతం పెరుగుదలను రీచ్ కావడంతో పాటు మార్కెట్క్యాప్ను 3 ట్రిలియన్ డాలర్ల మార్క్ను అందుకుంది కూడా. మెటా పెంపు మంత్రం మరోవైపు మెటా కంపెనీ ఉద్యోగులను చేజారిపోనివ్వకుండా జీతాలు పెంచుతోంది. ముఖ్యంగా ఏఐ బేస్డ్ అగుమెంటెడ్ రియాలిటీ ‘మెటావర్స్’ ప్రకటన తర్వాత ఈ పెంపు భారీగా ఉంటోంది. యాపిల్లో వలసలు.. ఓవైపు మెటా నుంచి భారీ ఆఫర్ల కారణంగా యాపిల్లో ఉద్యోగులు ఆగడం లేదు. పైగా ఇతర టెక్ దిగ్గజాలతో పోలిస్తే.. యాపిల్ తన ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. వర్క్ఫ్రమ్ హోం విషయంలోనూ సడలింపులు తక్కువగా ఇస్తోంది. దీంతో అసంతృప్తికి గురవుతున్న ఉద్యోగులు.. కంపెనీని వీడుతున్నారు. ఈ తరుణంలో భారీ స్టాక్ ప్యాకేజీలు వాళ్లను వెళ్లకుండా అడ్డుకుంటాయేమో చూడాలి. చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..! -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ‘ఆఫీస్ రిటర్న్’ నిరవధిక వాయిదా
After Google Now Apple Delays Return To Office Deadline Indefinitely: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ ఆందోళన కొనసాగుతోంది. కరోనా వైరస్లో శరవేగంగా విస్తరిస్తున్న వేరియెంట్ కావడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగుల భద్రత దృష్ట్యా మరికొంత కాలం వర్క్ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటున్నాయి కంపెనీలు. గూగుల్ ఇదివరకే ఆఫీస్ రిటర్న్ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేయగా.. ఇప్పుడు మరో టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ అదే బాటలో పయనించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఫిబ్రవరి 1, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ప్రకటించిన యాపిల్.. ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ప్రతీ ఉద్యోగికి 1,000 డాలర్ల(76 వేల రూ. పైనే) వర్క్ఫ్రమ్ హోం బోనస్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది కూడా. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గుడ్న్యూస్..! కేంద్రం కీలక నిర్ణయం..! దీంతో మరికొన్ని కంపెనీలు ఈ జాబితాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూగుల్ కూడా ఇలాగే వర్క్ఫ్రమ్ హోం కొనసాగిస్తూ.. ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి కంపెనీలు ఈ ఏడాది జూన్ నుంచే వర్క్ఫ్రమ్కు ఎండ్కార్డ్ వేయాలనుకున్నాయి. కానీ, డెల్టా ఫ్లస్ వేరియెంట్, ఆ వెంటనే ఒమిక్రాన్ వేరియెంట్లు వచ్చి పడ్డాయి. అయినప్పపటికీ వ్యాక్సినేషన్ కారణంగా ఏది ఏమైనా ఈ జనవరి నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ఒమిక్రాన్ ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో పాకేసింది. గాలిలో శరవేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ ప్రమాదకరమైందనే సంకేతాలిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల ఆరోగ్యం పట్ల రిస్క్ తీసుకునే ఉద్దేశంతో కంపెనీలు లేనట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు భారత్లోనూ వ్యాక్సినేషన్తో సంబంధం లేకుండా ఉద్యోగుల్ని మరికొంత కాలం వర్క్ఫ్రమ్ హోంలోనే కొనసాగించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పిస్తుండగా.. మరికొన్ని 45 ఏళ్లలోపు వాళ్లను మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చాలావరకు మాత్రం 2022లోనూ వర్క్ఫ్రమ్ హోం విధాన కొనసాగింపుకే మొగ్గు చూపిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి కూడా. వర్క్ ఫ్రమ్ హోంపై ఐటీ కంపెనీల సంచలన నిర్ణయం..! -
ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్
Google Announces Staff Bonus to Global Employees: ఆల్ఫాబెట్ కంపెనీకి చెందిన గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. కిందటి వారమే ‘ఆఫీస్ రిటర్న్’ పాలసీని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ఊరట ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు అదనపు స్టాఫ్ బోనస్ ప్రకటించింది. కరోనా టైంలో సంస్థ కోసం పని చేస్తున్న తమ ఉద్యోగులందరికీ అండగా నిలిచేందుకు ముందుకొచ్చినట్లు బుధవారం గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆఫీసులలో పని చేసే ఉద్యోగులతో పాటు ఎక్స్టెండ్ వర్క్ఫోర్స్, ఇంటర్న్స్కి కూడా వన్ టైం క్యాష్ బోనస్గా 1,600 డాలర్లు(మన కరెన్సీలో లక్షా 20 వేల దాకా) అందించనున్నట్లు పేర్కొంది. వర్క్ఫ్రమ్ హోం అలవెన్స్, వెల్బీయింగ్(సంక్షేమ) బోనస్తో పాటు ఈ అదనపు బోనస్ అందించనున్నారు. ఇక ఇందుకోసం ఎంత బడ్జెట్ కేటాయించారనే విషయాన్ని గూగుల్ ప్రతినిధి వెల్లడించలేదు. ఈ ఏడాది మార్చిలో గూగుల్ చేపట్టిన అంతర్గత సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కిందటి ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఉద్యోగులకు అందుతున్న బెనిఫిట్స్ బాగోలేవని ఫీడ్బ్యాక్ ఇచ్చారు . దీంతో కంపెనీ హుటాహుటిన వెల్బీయింగ్ బోనస్ కింద 500 డాలర్లు(మన కరెన్సీలో 37వేల రూపాయలకు పైనే) అందించింది. ఇక జనవరి 10, 2022 నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని ఆదేశించిన గూగుల్.. ఒమిక్రాన్ వేరియెంట్ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడంతో పాటు వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలను సైతం నిలుపుదల చేసింది. చదవండి: గూగుల్లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా? -
ఐకియా క్యా కియా!.. సిబ్బందికి రూ.954 కోట్ల నజరానా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐకియా బ్రాండ్ పేరుతో ఫర్నీచర్ రంగంలో ఉన్న నెదర్లాండ్స్కు చెందిన ఇంగ్కా గ్రూప్ ఔదార్యం చాటుకుంది. కోవిడ్–19 మహమ్మారి కాలంలోనూ శ్రమటోడ్చిన ఉద్యోగులకు రూ.954 కోట్ల నజరానా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకియా రిటైల్, ఇంగ్కా సెంటర్స్, ఇంగ్కా ఇన్వెస్ట్మెంట్స్ సిబ్బందికి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందించనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 32 దేశాల్లో గ్రూప్నకు 1,70,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఐకియా సంస్థ ఇండియాలో తమ తొలి స్టోర్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు విస్తరించింది. తాజాగా ఐకియా సంస్థ సిటీ స్టోర్ల పేరుతో మెట్రో నగరాల్లో అనేక అవుట్లెట్లను తెరిచే పనిలో ఉంది. -
కేంద్ర ఉద్యోగులకు బోనస్
న్యూఢిల్లీ: 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు తాత్కాలిక బోనస్ను మంజూరుచేసింది. కేంద్ర పారా మిలటరీ బలగాలు, సాయుధ బలగాలకూ ఈ బోనస్ను మంజూరుచేసినట్లు కేంద్ర ఖర్చుల వ్యవహారాల విభాగం పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉన్నవారు, 2020–21 కాలంలో మధ్యలో ఎలాంటి విరామంలేని ఆరునెలల కనిష్ట సర్వీస్కాలం ఉన్నవారు ఈ బోనస్ పొందేందుకు అర్హులు. ఉత్పత్తి ఆధారిత బోనస్ పథకాలతో లబ్దిపొందని గ్రూప్–బి నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గ్రూప్–సీ ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనస్ను ఇవ్వనున్నారు. ఈ బోనస్ను లెక్కించేటపుడు గరిష్టంగా రూ.7,000 వేతనాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. 30 రోజుల వేతనాన్ని బోనస్గా చెల్లిస్తారు. చదవండి: టీకా రెండో డోస్పై దృష్టి పెట్టండి -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా గ్రూప్ సీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు 'బి'లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది దీపావళి పండగ సీజన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి 30 రోజుల వేతనాలకు సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(అడ్-హాక్ బోనస్)ను గ్రూప్ 'సీ'లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు 'బి'లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరు ఎలాంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీం కింద కవర్ కారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ తాత్కాలిక బోనస్ సెంట్రల్ పారా మిలటరీ దళాలు, సాయుధ దళాలలో అర్హులైన ఉద్యోగులకు కూడా లభిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది. ఇతర బోనస్ లేదా ఎక్స్ గ్రేషియా దీని కింద కవర్ చేయబడదు" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ(డిఓఈ) ఈ రోజు(అక్టోబర్ 18) ఆఫీస్ మెమోరాండంలో తెలిపింది. 31-3-2021 నాటికి సర్వీసులో ఉండి 2020-21 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సేవ చేసిన ఉద్యోగులు మాత్రమే అడ్ హాక్ బోనస్ చెల్లింపుకు అర్హులు. (చదవండి: దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!) -
సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..!
క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి పునరావృత లావాదేవీలను ఆమోదించేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త ప్రామాణీకరణ వ్యవస్థను అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సరికొత్త ప్రణాళికతో ఆపిల్ ముందుకొచ్చింది. ఆపిల్ ఐడి బ్యాలెన్స్( Apple ID Balance) ఉపయోగించి చెల్లింపులను ప్రోత్సహించమని టెక్ దిగ్గజం పలు డెవలపర్లను కోరినట్లు తెలిసింది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ చరిత్రను మార్చిన టెస్లా యూజర్లు తమ ఆపిల్ ఐడీకి నిధులను జోడిస్తే 20 శాతం బోనస్ని ఆపిల్ అందిస్తోంది. ఈ విషయాన్ని 9To5Mac ట్విటర్లో వెల్లడించింది. కాగా ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆపిల్ ఐడి బ్యాలెన్స్కు కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా 15 వేల వరకు డబ్బులను యాడ్ చేసుకోవచ్చును. ఉదాహరణకు, ఒక ఆపిల్ యూజర్ Apple ID కి రూ .2,000 జోడిస్తే, వారు బోనస్గా రూ. 400 పొందుతారు. ఒక వేళ రూ. 10,000 అయితే, యూజర్ Apple ID లో అదనంగా రూ .2,000 పొందుతారు. ఆపిల్ ఇన్-యాప్ కొనుగోలు వ్యవస్థతో సమస్యలను నివారించడానికి 20 శాతం బోనస్ని యూజర్లకు అందిస్తోంది. ఆపిల్ ఐడీ బ్యాలెన్స్ను వాడి ఇతర పేమెంట్స్ చేసే ఆప్షన్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: ఐఫోన్13 ఎంట్రీతో షావోమీకు భారీ షాక్...! -
ఆయిల్ఫెడ్ ఉద్యోగులకు బోనస్ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్ఫెడ్లో దసరా సందర్భంగా ప్రతీ ఏడాది ఇచ్చే బోనస్ను రద్దుచేశారని ఉద్యోగులు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్లకుపైగా ఆనవాయితీగా వస్తున్న బోనస్ను ఒక ఉన్నతాధికారి నిర్వాకంతో ఎత్తివేశారని ఆరోపిస్తున్నారు. కొత్తగా లక్షలాది ఎకరాల పామాయిల్ విస్తరణలో పాలుపంచుకుంటున్నామని అయినా తమను నిరాశపరిచేలా బోనస్ ఎత్తివేయడం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎండీ, చైర్మన్లతోనూ తాము చర్చించామని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, బోర్డు సమావేశంలో బోనస్ ఇవ్వాల్సిన అవసరమేంటన్న అభిప్రాయం తలెత్తిందని, ఇతర సంస్థల్లో లేనిది ఎందుకు ఇస్తున్నారన్న చర్చ జరిగిందన్నారు. దీంతో బోనస్ విషయాన్ని పెండింగ్లో పెట్టారని వివరించారు. దీనిపై వ్యవసాయ శాఖ కార్యదర్శి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. అయినా ఈ వ్యవహారం ఇంకా పెండింగ్లోనే ఉందన్నారు. తాము బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని, లాభాల్లో ఉన్నందున ఉద్యోగులకు బోనస్ ఇవ్వాల్సిన అవసరముందని రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. -
టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు
టాటా గ్రూప్ కు చెందిన టాటా స్టీల్ కంపెనీ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. టాటా స్టీల్ అన్నీ యూనిట్లలో 2020-2021 సంవత్సరానికి అర్హత కలిగిన ఉద్యోగులకు వార్షిక బోనస్ కింద ₹270.28 కోట్లను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థలలో ఒకటిగా టాటా స్టీల్ ప్రసిద్ది చెందింది. 2020-2021 వార్షిక బోనస్ చెల్లింపు కోసం టాటా స్టీల్, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య ఒక మెమోరాండం ఆఫ్ సెటిల్ మెంట్ పై సంతకాలు జరిగినట్లు ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) టివి నరేంద్రన్(సీఈఓ & ఎండి), అట్రేయి సన్యాల్, వైస్ ప్రెసిడెంట్(హెచ్ఆర్ఎం), ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజ్ మెంట్ తరఫున సంతకం చేయగా టాటా వర్కర్స్ యూనియన్ తరుపున అధ్యక్షుడు సంజీవ్ కుమార్ చౌదరి, టాటా వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రెసిడెంట్ శైలేష్ కుమార్ సింగ్, టాటా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ సింగ్ ఇతర ఆఫీస్ బేరర్లు సంతకం చేశారు. అలాగే, స్టీల్ కంపెనీ & ఇండియన్ నేషనల్ మెటల్ వర్కర్స్ ఫెడరేషన్(ఐఎన్ ఎండబ్ల్యుఎఫ్), రాష్ట్రీయ కాలరీ మజ్దూర్ సంఘ్(ఆర్ సీఎంఎస్) మధ్య కూడా ఒక మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ పై సంతకాలు జరిగాయి. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో టాటా స్టీల్ సంస్థకు ప్రపంచ స్థాయి కర్మాగారం ఉంది. 2021 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో భారతదేశపు ప్రముఖ స్టీల్ మేకర్ ఏకీకృత నికర లాభం ₹9,768 కోట్లు. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) -
ఈ ఏడాది వేతనాలు పెరగనున్నాయ్
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీల్లో ఉద్యోగులకు ఈ ఏడాది సగటు వేతన పెంపు 7.3 శాతం ఉండొచ్చని డెలాయిట్ నివేదిక తెలిపింది. అంచనాలను మించి ఆర్థిక పునరుద్ధరణ, వ్యాపారాలు తిరిగి పుంజుకోవడం, వినియోగదార్ల విశ్వాసం ఇందుకు కారణమని వివరించింది. ఏడు రంగాలు, 25 ఉప రంగాలకు చెందిన 400 సంస్థలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. 2020లో సగటు వేతన పెంపు 4.4 శాతముంటే, 2019లో ఇది 8.6 శాతముందని వెల్లడించింది. జీతాలు పెంచే యోచనలో ఉన్నట్టు సర్వేలో పాలుపంచుకున్న 92 శాతం కంపెనీలు తెలిపాయి. గతేడాది 60 శాతం కంపెనీలే వేతన పెంపునకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. 2021లో రెండంకెల స్థాయిలో జీతాలు పెంపునకు 20 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నాయి. గతేడాది ఇంక్రిమెంట్ ఇవ్వలేకపోయిన కొన్ని కంపెనీలు ఈ ఏడాది అధికంగా వేతనాలను పెంచడం లేదా బోనస్ అందించాలని యోచిస్తున్నాయి. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగ కంపెనీలు అధిక ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. -
సన్నాలపై తర్జనభర్జన..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యంపై క్వింటాల్కు రూ. 150 చొప్పున బోనస్ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల అది సాధ్యమయ్యేలా లేదని రాష్ట్ర మంత్రివర్గం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలకాంశాలపై చర్చించిన కేబినెట్ అందులో భాగంగా సన్నాలకు బోనస్ చెల్లింపు సాధ్యాసాధ్యా లను పరిశీలించింది. అయితే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కుదుర్చుకున్న ఎంవో యూలో ఉన్న నిబంధనలు బోనస్ చెల్లింపునకు అడ్డంకిగా ఉన్నాయని కేబినెట్ అభిప్రాయపడింది. కనీస మద్దతు ధరకన్నా రాష్ట్రాలు ఒక్క రూపాయి అదనంగా చెల్లించినా రాష్ట్రాలు సేకరించిన ధాన్యాన్ని సెంట్రల్ పూల్ కింద స్వీకరించబోమని కేంద్రం ఎంవోయూలో పొందుపరిచిన నిబం ధనలు ప్రతికూలంగా మారాయని ఈ భేటీలో పాల్గొన్న మంత్రులు పేర్కొన్నట్లు తెలియవచ్చింది. ఆర్డినెన్స్తో సాదాబైనామాల పరిష్కారం... సాదాబైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పించేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరపడం, మెరూన్ రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి వీలు కల్పిస్తూ ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టం తేవాలని నిర్ణయించింది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గం ఈ నిర్ణయాలు తీసుకుంది. రద్దైన పాత రెవెన్యూ చట్టం నిబంధనల మేరకు సాదాబైనామాలకు క్రమబద్ధీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై మంతివర్గం చర్చించింది. సాదాబైనామాలకు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా క్రమబద్ధీకరించేందుకు కొత్త రెవెన్యూ చట్టంలో పాత ఆర్ఓఆర్ చట్టంలోని నిబంధనలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త చట్టం కింద సాదా బైనామాలను వన్టైమ్ సెటిల్మెంట్ కింద పరిష్కరించేందుకు ఆర్డినెన్స్ తేవాలనే ప్రతిపాదనను కేబినెట్ చర్చించి ఆమోదించింది. కేబినెట్ ప్రతిపాదించిన ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదానికి పంపుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అసెంబ్లీ ఆరో విడత సమావేశాలు ప్రొరోగ్ అయితేనే ఆర్డినెన్స్ ఆమోదం పొందే అవకాశం ఉండటంతో వెంటనే ప్రొరోగ్ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త రెవెన్యూ చట్టం కింద సాదా బైనామాల క్రమబద్దీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పేదలకు సంబంధించిన నల్లా, విద్యుత్, ఆస్తి పన్ను బకాయిల మాఫీ అంశాన్ని కూడా కేబినెట్ చర్చించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేబినెట్ సమావేశానికి సంబంధించిన వివరాలేవీ వెల్లడించవద్దని మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. క్యాబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటించలేదు. -
సన్నాలపై మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఏడాది భారీగా దిగుబడి వస్తున్న సన్నరకం ధాన్యానికి బోనస్ లేదా అదనపు ప్రోత్సాహకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బోనస్ లేదా ప్రోత్సాహకాలతో తమకు సంబంధం ఉండదని, అదనపు భారాన్ని పూర్తిగా రాష్ట్రాలే భరించాలని కేంద్రం స్పష్టం చేయడంతో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. అదనంగా రూ. 100 లేదా రూ. 200 ప్రకటిస్తే ఎంత భారం పడుతుందన్న దానిపై వ్యవసాయ, పౌర సరఫ రాలు, ఆర్థిక శాఖలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనిపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధిక ధర కోసం డిమాండ్.. తెలంగాణలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా 34.45 లక్షల ఎకరాల్లో సన్నాలను పండిం చారు. ఈ లెక్కన 50 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్న ధాన్యం సేకరిం చాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం గ్రేడ్–1 ధాన్యానికి రూ. 1,888, కామన్ రకానికి రూ. 1,868 మేర చెల్లిస్తున్నారు. సన్నాలకు ప్రత్యేక ధర ఏదీ నిర్ణయించకున్నా కామన్ రకం ధరలతోనే కొనుగోలు చేస్తున్నారు. నిజానికి గతేడాది బీపీటీ, జైశ్రీరాం, జయశ్రీ, చింటూ, శ్రీరామ్గోల్డ్, 1008, జీలకర్ర సోనా వంటి ధాన్యం రకాలకు రైతుల వద్దకే వెళ్లి నేరుగా కొన్న సమయాల్లోనూ క్వింటాల్కు రూ. 2,200కన్నా తక్కువకు అమ్ముడుపోలేదు. అదే మిల్లర్ల వద్దకే తీసుకొని అమ్ముకుంటే రైతులకు రూ. 2,500 వరకు ధర పలికింది. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మిల్లర్లు సన్న రకాలకు రూ. 1,700 నుంచి రూ. 1,800 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. దీంతో కనిష్టంగా రూ. 500 వరకు రైతులు ధర కోల్పోతున్నారు. ముఖ్యంగా సన్నరకం అధికంగా సాగు చేసిన నల్లగొండ, కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల రైతులు ప్రస్తుతం మార్కెట్లోని ధరల తీరుతో భారీగా నష్టపోతున్నారు. అయితే ప్రభుత్వం 17 శాతం వరకే తేమ శాతాన్ని నిర్ణయించగా, 30 శాతం వరకు తేమ ఉన్నా తాము కొనుగోలు చేస్తున్నామని మిల్లర్లు అంటున్నారు. దొడ్డు రకానికంటే సన్నరకం ధాన్యం పంటకు చీడపీడల బాధ, పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది. దొడ్డు ధాన్యంతో పోలిస్తే సన్నాలకు దిగుబడి కూడా తక్కువే. దొడ్డు రకం అయితే ఎకరానికి 40–45 బస్తాలు పండుతాయి. అదే సన్నాలయితే ఎకరాకు 25–30 బస్తాలకు మించి పండదు. అయినప్పటికీ రైతులు సన్నాలకు అధిక ధర వస్తుందని ఈ పంట సాగు చేస్తున్నా దొడ్డురకం ధాన్యంతో సమానమైన ధరే లభిస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాలకు అధిక ధర ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోంది. -
పండుగ బొనాంజా : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్
-
సింగరేణి కార్మికులకు శుభవార్త
సాక్షి, రామగుండం: బొగ్గు గని కార్మికుల పీఎల్ఆర్ బోనస్ ఖరారైంది. రాంచీలో గురువారం జరిగిన జేబీసీసీఐ స్టాండర్డయిజేషన్ కమిటీ సమావేశంలో ఫెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు(పీఎఆర్) బోనస్పై నిర్ణయం తీసుకున్నారు. కోలిండియా యాజమాన్యాలతోపాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇరువర్గాల చర్చల అనంతరం రూ.68, 500గా నిర్ణయించారు. గతేడాది రూ.64,700 చెల్లించగా, ఈ ఏడాది మరో 3,800 పెంచారు. సమావేశంలో కోలిండియాలో ఆయా సంస్థల నుంచి ఎన్సీఎల్ సీఎండీ పీకే.సిన్హా, సీఐఎల్ డైరెక్టర్ ఆర్పీ.శ్రీవాత్సవ, సంజీవ్సోని, ఎస్ఈసీఎల్ నుంచి డైరెక్టర్ ఆర్ఎస్ జా, డబ్ల్యూసీఎల్ నుంచి డైరెక్టర్ సంజయ్కుమార్, ఈసీఎల్, సీసీఎల్ నుంచి వినయ్రాజన్, ఎంసీఎల్ నుంచి కేశవరావు, ఎన్సీఎల్ నుంచి బీమ్లేంద్కుమార్, సీఎంపీడీఐఎల్ నుంచి డైరెక్టర్ గోమస్తా, బీసీసీఎల్ నుంచి డైరెక్టర్ పీవీకేఆర్ఎం.రావు, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్, సీఐఎల్ కన్వీనర్ ఏకే.చౌదరి పాల్గొన్నారు. జాతీయ కార్మిక సంఘాలు బీఎంఎస్ బీకే.రాయ్, నరేంద్రకేఆర్.సింగ్, హెచ్ఎంఎస్ తరఫున నాథులాపాండే, రామేంద్రకుమార్, ఏఐటీయూసీ నుంచి రామేంద్రకుమార్, సీఐటీయూ నుంచి రమణానంద్ పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి జరిగిన సమావేశంలో మొదట సమ్మె ప్రతిపాదన ఉన్న సమయంలో బోనస్పై చర్చించలేమని సీఐఎల్ యాజమాన్యం పేర్కొనడంతో కొంతసేపు ప్రతిష్టంభన ఏర్పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో బొగ్గు సంస్థలు నష్టాల్లో ఉన్నాయని బోనస్ చెల్లించలేమని యాజమాన్యం పేర్కొంది. జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకించి బోనస్ చెల్లించాలని పట్టుబట్టాయి. ఈ క్రమంలో జాతీయ కార్మిక సంఘాలు రూ.75 వేలు డిమాండ్ చేయగా, చివరికి రూ. 68,500 చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. చదవండి: మరో రెండు రోజులు భారీ వర్షాలు -
ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్ లేనట్టే!
సాక్షి, హైదరాబాద్ : కరోనాతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు సరిగా చెల్లించడం లేదు. అయితే దసరా పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈసారి కరోనా పరిస్థితుల వల్ల ఉద్యోగులకు బోనస్ చెల్లించే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ స్టాప్ అండ్ ఫెడరేషన్ దసరా పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ఆర్టీసీ కార్మికులకు బోనస్ను చెల్లించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసింది. 'ప్రతి దసరా పండుగకు ఆర్టీసీ కార్మికులకు ఆనవాయితీగా ఇస్తున్నా పండుగ అడ్వాన్స్ ఇచ్చి ఆర్టీసీ కార్మికులను సంతోషంగా పండుగ జరుపుకునే వీలు కల్పించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హిందువులకు దసరా, క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్ పండగల వేల అడ్వాన్స్ పండగ నెల జీతాలతో కలిపి అడ్వాన్స్ చెల్లించేవారు. ఈసారి పండుగ అడ్వాన్స్ ఇవ్వకపోవడం సరైంది కాదు. ఒక్కో కార్మికుడికి ఇచ్చే 4500 రూపాయలను పది నెలల కాలంలో తిరిగి యాజమాన్యం కార్మికుల జీతం నుంచి రికవరీ చేస్తుంది. ఇందుకోసం ట్రెజరీ నుంచి రూ. 25 కోట్ల ఖర్చు మాత్రమే అవుతుంది. ఈసారి జీతంతో పాటు అడ్వాన్సు ఎందుకు చెల్లించలేదో సమాచారం ఇవ్వలేదు. కనీసం సద్దుల బతుకమ్మ పండగ రోజు కైనా కార్మికులకు అడ్వాన్స్ చెల్లించేలా చూడాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నట్లుగా' పేర్కొన్నారు. -
మీ ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్లు భద్రం
ముంబై: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్యపురి తమ ఉద్యోగులకు ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్ల విషయంలో కొండంత భరోసాను ఇచ్చారు. అవన్నీ భద్రమని, ఆందోళనలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రేరిత అంశాలు ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆదిత్యపురి 1.15 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులకు ఇటీవల 10 నిముషాల వీడియో సందేశం పంపా రు. ‘‘మీకు ఉద్యోగ భద్రతేకాదు. ప్రమోషన్లు, ఇంక్రిమెం ట్లు, బోనస్లూ అన్నీ భద్రం’ అని ఆయన సందేశంలో పేర్కొన్నారు. తన వారసుడు శశిధర్ జగదీశన్సహా మేనేజ్మెంట్ తరఫున తాను ఈ హామీ ఇస్తున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాల సుదీర్ఘ బాధ్యతల నుంచి ఈ నెలాఖరున పదవీవిరమణ చేస్తున్న పురి, బ్యాంకు పండుగల ఆఫర్ ప్రకటనను (సెకండ్ ఎడిషన్) పురస్కరించుకుని చేసిన తాజా సందేశంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ కోవిడ్–19 ప్రతికూల ప్రభావాల సమయాల్లోనూ బ్యాంక్ చక్కటి పనితీరును ప్రదర్శిస్తోంది. తగిన మూలధన నిల్వలను నిర్వహిస్తోంది. తాను మంజూరు చేసిన రుణాల విషయంలో ఎటువంటి ఒత్తిడినీ ఎదుర్కొనడంలేదు. ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో చక్కటి ఫలితాలను నమోదుచేసుకుంది. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగుతుంది. ⇔ రుణాల పంపిణీ, వసూళ్లు వంటి అంశాలతో పాటు పలు విభాగాల్లో బ్యాంక్ సాంకేతికత వినియోగం ఎంతో ముందుంది. ⇔ ఉద్యోగులుగా మీరు చేయాల్సింది ఒకటే. ‘టీమ్ వర్క్’ చేయండి. పనిలో దార్శినికతను ప్రదర్శించండి. పోటీ తత్వంలో ఇది కీలకమైన అంశం. ఈ విషయంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయండి. ⇔ కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాల విషయంలో ఓటమిని బ్యాంక్ ఎప్పుడూ అంగీకరించలేదు. రెండు త్రైమాసికాల నుంచీ మంచి ఫలితాలను బ్యాంక్ నమోదుచేసుకుంటున్న విషయం ఇక్కడ ప్రస్తావనాంశం. ⇔ బ్యాంక్ ప్రకటించిన పండుగల సీజన్ ఆఫర్లను మార్కెట్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి సోషల్ మీడియాను ఉద్యోగులు వినియోగించుకోవాలి. ⇔ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు కరోనా–19 పూర్వపు స్థితికి క్రమంగా చేరుకుంటున్నాయి. అతి త్వరలోనే సాధారణ స్థాయికి చేరుకుంటాయి. ⇔ కరోనా వైరస్ మన అందరి జీవితాల్లోనూ అవరోధాలు కల్పించింది. ఈ వైరస్తోనే కొన్నాళ్లు జీవించాల్సి ఉంటుంది. కాకపోతే వాతావరణాన్ని, ఈ పరిస్థితిని భద్రం గా మార్చుకోవడం అన్నది మీపైనే ఉంటుంది. కష్టాల్లోనూ ఆశావాదంవైపు నడవాలి. అవకాశాలు వెతుక్కోవాలి. వైరస్ ఏదో ఒక రోజు వెళ్లిపోతుంది. ఆందోళన అక్కర్లేదు. ప్రత్యేక ఆఫర్లకు చక్కటి స్పందన... పండుగల సీజన్ను పురస్కరించుకుని ప్రకటించిన ‘ఫెస్టివ్ ట్రీట్స్’ గురించి హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేమెంట్ బిజినెస్ కంట్రీ హెడ్ పరాగ్రావు వివరిస్తూ, ఈ ప్లాట్ఫామ్ నుంచి బ్యాంకుకు సంబంధించిన అన్ని రకాల ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లను పొందొచ్చని తెలిపారు. రుణాల నుంచి క్రెడిట్ కార్డుల వరకు, ప్రముఖ విక్రేతలకు సంబంధించి 1,000 రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించారు. ఎంతో అద్భుతమైన డిమాండ్ కనిపిస్తోందంటూ.. ఫెస్టివ్ ట్రీట్స్ ప్లాట్ఫామ్పై 30–35 శాతం తగ్గింపులను ఇస్తున్నట్టు చెప్పారు. మొబైల్స్, కన్జ్యూమర్ డ్యురబుల్స్, వస్త్రాలు, జ్యుయలరీ, డైనింగ్ విభాగాల్లో గత 2–3 నెలల్లో కస్టమర్ల ఆసక్తి పెరిగిందని, పండుగల సీజన్లోనూ ఇది కొనసాగుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
నో క్లెయిమ్ బోనస్.. విలువైన బహుమానం
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో రకాల ప్రయోజనాలతో వస్తుంటాయి. పాలసీదారులు పాలసీ తీసుకున్న తర్వాత కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించినట్టయితే.. ప్రత్యేక రాయితీలతో ప్రోత్సహించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రీమియంలో తగ్గింపులు, ఔట్ పెషెంట్గా తీసుకునే చికిత్సల సమయంలో వినియోగానికి వీలైన రివార్డు పాయింట్లు ఇందులో భాగమే. బీమా కంపెనీలు అందించే ఆఫర్లలో.. ముఖ్యంగా నో క్లెయిమ్ బోనస్ను అమూల్యమైనదనే చెప్పుకోవాలి. నో క్లెయిమ్ అంటే.. ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్లు చేయకపోవడం. దీనివల్ల బీమా కంపెనీలకు కొంత ఆదా అవుతుంది. దాంతో నో క్లెయిమ్ బోనస్ రూపంలో కొంత ప్రయోజనాన్ని తిరిగి పాలసీదారులకు అందిస్తుంటాయి. ఎక్కువ సంస్థలు బీమా మొత్తాన్ని నిర్ణీత శాతం మేర పెంచుతుంటే.. కొన్ని మాత్రం ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. బీమా కవరేజీని బోనస్ గా ఇచ్చినా ఇందుకు అదనపు ప్రీమియం వసూలు చేయవు. కనుక ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవస్థ తప్పుతుంది. బీమా రక్షణ మొత్తం పెరుగుతుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ)ను దాదాపు అన్ని బీమా సంస్థలు అందిస్తున్నాయి. వివిధ బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ప్రయోజనం విషయంలో వైరుధ్యాలను తెలియజేసే కథనమే ఇది. ఎలా పనిచేస్తుంది..? అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ పాలసీలు (ఆస్పత్రిలో చేరడం వల్ల అయిన వైద్య ఖర్చులు చెల్లించేవి) నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ఫీచర్తో వస్తున్నాయి. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్గార్డ్ (గోల్డ్ ప్లాన్)లో క్లెయిమ్లు లేని ప్రతీ సంవత్సరం తర్వాత బీమా మొత్తం 10 శాతం పెరుగుతుంది. అంటే రూ.5 లక్షల కవరేజీకి పాలసీ తీసుకుని క్లెయిమ్ చేసుకోకపోతే రెన్యువల్ అనంతరం 10 శాతం పెరిగి కవరేజీ రూ.5.50 లక్షలకు చేరుతుంది. ఇలా బేస్ సమ్ ఇన్సూర్డ్ (ఎస్ఐ)కు గరిష్టంగా నూరు శాతం వరకు కవరేజీని ఎన్సీబీ కింద అందుకోవచ్చు. రూ.5 లక్షలను బేసిక్ సమ్ ఇన్సూర్డ్గా ఎంచుకున్నారనుకుంటే.. వరుసగా పదేళ్లపాటు ఎటువంటి క్లెయిమ్ చేసుకోని సందర్భాల్లో కవరేజీ రూ.5 లక్షల మేర పెరిగి రూ.10లక్షలు అవుతుంది. అయితే, ఇలా ఎన్సీబీ రూపంలో బీమా కవరేజీ పెరగడం అన్నది అన్ని బీమా సంస్థల్లోనూ ఒకే మాదిరిగా ఉండదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్కు చెందిన ‘యాక్టివ్ అష్యూర్డ్ పాలసీ’లో ఎన్సీబీ కింద గరిష్టంగా 50 శాతం వరకే బీమా పెరుగుతుంది. అదే మణిపాల్ సిగ్నా ప్రో హెల్త్ పాలసీలో బేసిక్ ఎస్ఐకు గరిష్టంగా 200 శాతం వరకు అదనపు బీమా కవరేజీని నో క్లెయిమ్ బోనస్ కింద అందుకోవచ్చు. ఎటువంటి క్లెయిమ్ చేసుకోకుండా, సకాలంలో ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేసుకున్న వారికి ఎన్సీబీ కింద సమ్ ఇన్సూర్డ్ పెంపును బీమా సంస్థలు హామీ పూర్వకంగా అందిస్తున్నాయి. క్లెయిమ్ చేసుకుంటే.. ఒకవేళ పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బోనస్గా పెరిగిన సమ్ ఇన్సూర్డ్ నిర్ణీ త శాతం మేర తగ్గిపోతుందని గుర్తించాలి. క్లెయిమ్ చేసుకున్నా కానీ, అప్పటి వరకు బోనస్గా పొందిన బీమా కవరేజీని తగ్గించని పాలసీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివ్ అష్యూర్ పాలసీలో క్లెయిమ్ చేసుకుంటే.. తదుపరి పాలసీ సంవత్సరంలో ఎన్సీబీ 10% మేర తగ్గిపోతుంది. అంటే బేస్ సమ్ ఇన్సూర్డ్ రూ.10 లక్షలు తీసుకున్నారనుకుంటే.. అప్పటి వరకు ఎన్సీబీ రూపంలో ఏటా 10% చొప్పున రూ.3లక్షల కవరేజీ అదనంగా లభించి ఉంటే.. తర్వాతి సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బేసిక్ కవరేజీ రూ.10లక్షలు అలాగే ఉంటుంది. ఎన్సీబీ మాత్రం రూ.లక్ష తగ్గి రూ.2లక్షలకు చేరుతుంది. ఎన్సీబీని బేసిక్ ఎస్ఐ ఆధారంగానే పెంచుతారు కనుక.. తగ్గించేటప్పుడూ అదే సూత్రం అమలవుతుంది. క్లెయిమ్లు చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించని పాలసీల్లో మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ఆర్థిక ఇబ్బందులు, హెల్త్రిస్క్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని బీమా సంస్థలు పాలసీదారులు క్లెయిమ్ చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించడం లేదు. ఇందుకు ఉదాహరణ హెచ్డీఎఫ్సీ ఎర్గో. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కోవిడ్–19 చికిత్స కోసం క్లెయిమ్ చేసుకున్నా కానీ పాలసీదారుల క్యుములేటివ్ బోనస్ కవరేజీని తగ్గించకూడదని హెచ్డీఎఫ్సీ ఎర్గో నిర్ణయం తీసుకుంది. ఇదే విధమైన నిర్ణయాన్ని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్కూడా తీసుకుంది. అదనపు ఎన్సీబీ నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీ పెంపు ప్రయోజనం ఉచితంగానే లభిస్తుంది. ఇందుకు ఎటువంటి ప్రీమియంను అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా క్యుములేటివ్ బోనస్ కవరేజీని మరింత పెంచుకునేందుకు కొన్ని బీమా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. నో క్లెయిమ్ బోనస్కు అదనంగా కొంత ప్రీమియం చెల్లించి ఎన్సీబీని ఏటా అదనంగా 5–10 శాతం మేర పెంచుకోవచ్చు. ఉదాహరణకు మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ప్లాన్లో క్యుములేటివ్ బోనస్ బూస్టర్ను కొనుగోలు చేసుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్పై కచ్చితంగా 25 శాతం పెంపును, గరిష్టంగా 200 శాతం వరకు పెంపును ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో సైతం అదనపు ప్రీమియంతో క్యుములేటివ్ బోనస్ను పెంచుకునేందుకు అనుమతిస్తోంది. పోర్టింగ్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరిగానే హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ మార్గదర్శకాల మేరకు.. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు హెల్త్ ప్లాన్ను పోర్ట్ చేసుకుంటే.. గత సంస్థలో పోగు చేసుకున్న క్యుములేటివ్ బోనస్ను కొత్త సంస్థ కూడా ఎటువంటి అదనపు ప్రీమియం లేకుండానే అందించాల్సి ఉంటుంది. దీని గురించి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ హెల్త్ క్లెయిమ్స్ విభాగం హెడ్ భాస్కర్ నేరుర్కర్ వివరిస్తూ.. ‘‘పోర్టింగ్ సమయంలో బేస్ సమ్ ఇన్సూర్డ్తోపాటు క్యుములేటివ్ బోనస్ కూడా నూతన పాలసీకి బదిలీ అవుతుంది. ప్రీమియం మాత్రం బేసిక్ సమ్ ఇన్సూర్డ్కే వసూలు చేస్తారు. అయితే, ఆ తర్వాత నుంచి నూతన సంస్థ నియమ, నిబంధనల మేరకే క్యుములేటివ్ బోనస్ ప్రయోజనం లభిస్తుంది’’ అని తెలిపారు. అంటే ఒక వ్యక్తి ఏ అనే బీమా కంపెనీ నుంచి రూ.5 లక్షల సమ్ ఇన్సూర్డ్కు హెల్త్ ప్లాన్ తీసుకుని, రూ.లక్ష సమ్ ఇన్సూర్డ్ను ఎన్సీబీ కింద పొంది ఉన్నారనుకుంటే.. మరో సంస్థకు పోర్టింగ్ చేసుకునేట్టయితే నూతన సంస్థ సైతం మొత్తం రూ.6లక్షలకు కవరేజీని (రూ.5 లక్షలు బేసిక్, రూ.లక్ష బోనస్) ఆఫర్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. దీనికి అదనంగా సమ్ ఇన్సూర్డ్ను పెంచుకోవాలంటే ప్రత్యేకంగా అండర్రిటన్ చేయాల్సి ఉంటుందని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దర్ తెలిపారు. అంటే నూతన సంస్థలో బేస్ సమ్ ఇన్సూర్డ్ను పెంచుకోవాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. -
ఉద్యోగులకు పీడబ్ల్యూసీ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో అన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న తరుణంలో ఆర్థిక సేవలందించే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సంస్థ మాత్రం ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్లతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల పెంపు, పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. బోనస్లు ప్రమోషన్లను అక్టోబర్1 2020న ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నామని, కానీ గత సంవత్సరాలతో పోలిస్తే వేతనాలు, ప్రమోషన్లు కొంత మేర తగ్గవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా సంస్థ క్లయింట్లకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని పీడబ్లుసీ చీఫ్ పబ్లిక్ అధికారి పద్మజ అలగానందన్ తెలిపారు. మరోవైపు తమ సంస్థ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన రేటింగ్ సాధించిందని పద్మజ పేర్కొన్నారు. (చదవండి: లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే) -
వైద్యులకు ఒక నెల వేతనం బోనస్గా చెల్లించాలి
-
ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్
సియాటిల్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ తమ ఉద్యోగులకు 6 నెలల వేతనాన్ని బోనస్గా ప్రకటించింది. ఇంటి నుంచే పనిచేసే సిబ్బంది ఖర్చులను దృష్టిలో ఉంచుకుని 1,000 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మొత్తం 45,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జకర్బర్గ్ వెల్లడించారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సదుపాయం ఉండదు. (ఫేస్బుక్ కార్యాలయం మూసివేత) కానీ, వారి ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించిన పక్షంలో విధులకు హాజరు కాకపోయినా.. పూర్తి వేతనం లభిస్తుంది. ఫేస్బుక్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 2018లో 2,28,651 డాలర్లుగా ఉంది. ‘మీ కుటుంబాల గురించి మరింతగా జాగ్రత్తలు తీసుకునేందుకు మీకు సమయం అవసరమన్న సంగతి సంస్థకు తెలుసు. వర్క్ ఫ్రం హోమ్ ప్రక్రియకు నివాసంలో ఏర్పాట్లు చేసుకోవడానికి అదనపు ఖర్చులు ఉంటాయి. అందుకే, ఉద్యోగులందరూ అదనంగా 1,000 డాలర్లు పొందవచ్చు‘అని అధికారిక మెమోలో జకర్బర్గ్ తెలిపారు. అమెరికాలోని సియాటిల్లో ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓ కాంట్రాక్టర్కు కోవిడ్–19 బారిన పడటంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మిగతా ఆఫీసులను తర్వాత మూసివేయడంతో చాలా మటుకు ఉద్యోగులు వారం రోజుల నుంచి.. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. (‘ఊహించని పరిస్థితులు’.. ట్విటర్ కీలక నిర్ణయం!) -
కరోనా : ఫేస్బుక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచం మొత్తం కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ ఉద్యోగులకు కరోనా వైరస్ బోనస్ అందించనున్నట్లు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. 45 వేల మంది ఉద్యోగులకు రూ. 74,037 (1,000 డాలర్లు)నగదును బోనస్గా అందించనుంది. కోవిడ్ -19 (కరోనా వైరస్) మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న ఉద్యోగుల శ్రమను గుర్తించి జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తన ఉద్యోగులకు అంతర్గత నోట్లో ఈ ప్రకటన చేశారు. ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు,పిల్లలు, తదితర ఊహించని అదనపు ఖర్చులతో రిమోట్గా పనిచేసే వారికి చెల్లించనుంది. ఎంతో శ్రమిస్తున్న ఉద్యోగులకు ఇలాంటి సమాయాల్లో బోనస్ ప్రకటించడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నట్లు సీఈఓ జుకర్ బర్గ్ ఉద్యోగులకు రాసిన లేఖలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుల్ టైం ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించనుంది. కాగా ఫేస్బుక్తో పాటు, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక ఇతర టెక్ దిగ్గజాలు కరోనావైరస్ కారణంగా ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ప్రోత్సహిస్తున్నాయి. మార్చి 4 న, ఫేస్బుక్ సీటెల్ కార్యాలయంలో ఒక కాంట్రాక్టర్ కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారించింది. అలాగే కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 27న నిర్వహించాల్సిన వార్షిక సాఫ్ట్వేర్ డెవలపర్ల సమావేశాన్ని కూడా పేస్బుక్ రద్దు చేసింది. మరోవైపు కరోనా వైరస్తో ఇప్పటికే 7,987 మంది చనిపోగా, 1 లక్ష మందికి పైగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. -
ఆర్టీసీకి రూ.500 కోట్ల బోనస్?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అనగానే అప్పులు, నష్టాలే గుర్తుకొస్తాయి.. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. క్రమంగా ఆర్టీసీ గాడిన పడుతోంది. 20 రోజుల్లో చోటు చేసుకున్న పెనుమార్పులు బోనస్పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం బోనస్ రూపంలో ఏకంగా రూ.500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. బడ్జెట్ ద్వారా ఆర్టీసీకి కేటాయించే రూ.వేయి కోట్లలో సగం మొత్తాన్ని బోనస్గా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గరిష్టంగా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున బోనస్ అందే అవకాశముంది. మార్చి తర్వాత బ్రేక్ ఈవెన్కు.. వచ్చే మార్చి తర్వాత ఆర్టీసీ బ్రేక్ ఈవెన్ (లాభనష్టాలు లేని సమస్థితి)కు చేరుకుంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఆ తర్వాత మరో నాలుగైదు నెలల్లో హైదరాబాద్లో మినహా మిగతా ప్రాం తాల్లో లాభాలు కనిపించే అవకాశముంది. ఆర్టీసీని పునరుద్ధరించిన తర్వాత స్వయంగా సీఎం కె.చంద్రశేఖర్రావు పర్యవేక్షణలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన క్రమం తప్పకుండా అధికారులతో భేటీ అవుతూ పరిస్థితులు తెలుసుకుని సూచనలు, సలహాలు అందిస్తున్నారు. తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ నష్టాలను నివారించి రూ.14 కోట్ల లాభాలు తెచ్చానని స్వయంగా పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆర్టీసీని పర్యవేక్షిస్తున్నందున లాభాలను కూడా పునరుద్ధరించే అవకాశముంది. సమ్మె తర్వాత తీసుకున్న కొన్ని చర్యలు ఆర్టీసీ నష్టాలను భారీగా తగ్గించేందుకు దోహదం చేయబోతున్నాయి. కిలోమీటరుకు ఆదాయంలో పెరుగుదల ఆర్టీసీలో ప్రతి కిలోమీటరుకు వచ్చే ఆదాయం (ఈపీకే)కు ఎంతో ప్రాధాన్యముంది. గతేడాది ఇదే సమయంలో ఈపీకే గరిష్టంగా రూ.30గా ఉంది. కానీ ప్రస్తుతం అది రూ.35కు చేరుకుంది. సోమవారం రోజైతే ఏకంగా రూ.38గా నమోదైంది. సమ్మెకు పూర్వం ప్రతి కిలోమీటరుకు ఆర్టీసీ రూ.7 చొప్పున నష్టాలు చవిచూస్తోంది. తాజాగా ఆదాయం పెరగటంతో ఆ నష్టం రూ.2కు పడిపోయింది. ఇక ఆ రూ.2ను కూడా తగ్గించి సున్నాకు తీసుకొస్తే బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోజువారీ ఆదాయంలో రూ.1.8 కోట్ల మేర పెరుగుదల నమోదవుతోంది. ఇందులో మరో రూ.30 లక్షల వరకు చేరితే బ్రేక్ ఈవెన్కు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతం మూఢాలు మొదలైనందున శుభకార్యాలు లేవు. తిరిగి సంక్రాంతి తర్వాత శుభకార్యాలు మొదలవుతాయి. ఏకబిగిన మే వరకు ఉంటాయి. దీంతో ఫిబ్రవరి నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆదాయం పెరుగుదలకు కారణాలివే.. ∙పెరిగిన బస్సు చార్జీలు సాలీనా రూ.800 కోట్ల వరకు తెచ్చి పెట్టే అవకాశముంది. ∙సిబ్బందిలో పెరిగిన క్రమశిక్షణ వల్ల అదనంగా ఆదాయం పెరగనుంది. ∙ప్రస్తుతం వేయి బస్సుల వరకు తగ్గిస్తున్నారు. దీంతో నిర్వహణ (సిబ్బంది జీతాలు కా కుండా) ఖర్చులు ఆదా కానున్నాయి. ∙కొత్తగా సరుకు రవాణా విభాగాన్ని ప్రారంభిస్తున్నారు. సాలీనా రూ.400 కోట్ల ఆదాయం లక్ష్యంగా అది మొదలవుతోంది. అది పూర్తిగా అదనపు ఆదాయమే. ∙ఉన్న బస్సుల హేతుబద్ధీకరణ ద్వారా వృథా వ్యయాన్ని తగ్గించటంతో పాటు ఆదాయాన్ని పెంచుకోనున్నారు. సిబ్బంది హేతుబద్ధీకరణ ద్వారా ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించనున్నారు. వారి జీతాల భారం తగ్గనుంది. ∙ప్రభు త్వం బడ్జెట్ ద్వారా ఇచ్చే మొత్తంలోంచి కొన్ని అప్పులు తీర్చనున్నారు. వాటిపై సాలీనా చెల్లించే రూ.200 కోట్ల వడ్డీ భారం కొంత తగ్గనుంది. -
‘బోనస్’ పేరుతో భోంచేశారు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్న మహిళకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమెకు ఉన్న రూ.7 లక్షల ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్, కమీషన్ ఇప్పిస్తామంటూ రూ.49 లక్షలు వసూలు చేశారు. దాదాపు తొమ్మిది నెలల పాటు డబ్బు డిపాజిట్ చేస్తూ వచ్చిన ఆమె ఎట్టకేలకు మోసపోయినట్లు గుర్తించారు. మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళా అసిస్టెంట్ మేనేజర్ కొన్నేళ్ల క్రితం మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.3 లక్షలు, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.4 లక్షల పాలసీలు తీసుకున్నారు. ఈమెకు ఈ ఏడాది మార్చ్ మూడో వారంలో ఓ ఫోన్కాల్ వచ్చింది. ఢిల్లీకి చెందిన గవర్నింగ్ బాడీ ఆఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నుంచి చేస్తున్నట్లు చెప్పిన ప్రీతి అనే యువతి మాట్లాడింది. తన పేరుతో పాటు ఇన్సూరెన్స్ పాలసీల నంబర్ చెప్పడంతో బాధితురాలు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే ఫోన్ వచ్చినట్లు పూర్తిగా నమ్మింది. ఆపై అసలు కథ ప్రారంభించిన ప్రీతిగా చెప్పుకున్న యువతి మీ ఇన్సూరెన్స్ పాలసీలను ఏజెంట్ ద్వారా కట్టారని, ఈ కారణంగానే ప్రతి నెలా బోనస్తో పాటు కమీషన్ సదరు ఏజెంట్కు వెళ్తున్నట్లు చెప్పింది. అలా కాకుండా ఆ మొత్తం మీకే చెందాలంటే తాము చెప్పినట్లు చేయాలని సూచించింది. దీనికి అసిస్టెంట్ మేనేజర్ అంగీకరించడంతో మరో మూడు పేర్లు చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ ద్వారా రంగంలోకి దిగారు. మీ ఇన్సూరెన్స్ పాలసీలకు చెందిన బోనస్, కమీషన్ మీకే చేరాలంటే ప్రస్తుతం నడుస్తున్న పాలసీలను బ్రేక్ చేసి, ఏజెంట్ల పేరు తొలగించి మళ్లీ ప్రారంభించాలని చెప్పారు. అందుకు ఆమె అంగీకరించడంతో దీనికోసం ప్రాసెసింగ్ ఫీజుల నిమిత్తం రూ.21,450 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఆ డబ్బు కట్టడానికి మహిళ అంగీకరించడంతో ముంబైకి చెందిన ఓ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు అందులో డిపాజిట్ చేయమన్నారు. ఆపై ఆదాయపుపన్ను, జీఎస్టీ, ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్... ఇలా అనేక పేర్లు చెప్పి భారీ మొత్తం ట్రాన్స్ఫర్/డిపాజిట్ చేయించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ ప్రాసెసింగ్ ఫీజు మినహా చెల్లించిన ప్రతి పైసా వెనక్కు వస్తుందని (రీఫండబుల్) నమ్మబలికారు. ఓ దశలో బాధితురాలికి అనుమానం వచ్చి ఫోన్ చేసిన వారిని నిలదీయగా... కొత్త కథ మొదలెట్టారు. ముంబైకి చెందిన ఎస్బీఐ సెంట్రల్ ప్రాసెసింగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానంటూ సంజీవ్ గుప్త పేరుతో మరో సైబర్ నేరగాడు రంగంలోకి దిగాడు. ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన బోనస్, కమీషన్తో పాటు ఇప్పటి వరకు మీరు చెల్లించిన మొత్తం డబ్బు రీఫండ్ అయిందని, గవర్నింగ్ బాడీ ఆఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నుంచి తమ వద్దకు వచ్చి ఆగినట్లు చెప్పాడు. ఇంత మొత్తం మరో రాష్ట్రంలోని వేరే బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడానికి క్యాష్ హ్యాండ్లింగ్ చార్జీలు చెల్లించాలని, ఇవి కూడా కొన్ని రోజులకు రీఫండ్ అవుతాయని చెప్పారు. దీంతో ఆమె మరో రూ.5 లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసింది. ఇలా ఈ ఏడాది మార్చి 26–డిసెంబర్ 4 మధ్య 45 దఫాల్లో మొత్తం రూ.49 లక్షలు ముంబై, ఢిల్లీలకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. దాదాపు పది సందర్భాల్లో డబ్బు మొత్తం సిద్ధమని, రెండు గంటల్లో ఆర్టీజీఎస్ ద్వారా మీ ఖాతాలోకి వస్తుందని చెప్పి నమ్మించారు. బాధిత మహిళ తన సేవింగ్స్తో పాటు అప్పు తీసుకువచ్చి ఈ డబ్బు చెల్లించారు. మరోసారి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు మరికొంత మొత్తం కోరడంతో అనుమానించిన బాధితురాలు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వినియోగించిన ఫోన్ నంబర్లు, డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్తున్న సైబర్ కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ సమాచారం ఆధారంగానే ఈ తరహా నేరాలు జరుగుతాయని, ఆ సమాచారం సైబర్ నేరగాళ్లకు ఎలా చేరుతోంది? అనే కోణంలో ఆరా తీస్తున్నామని అధికారులు చెబుతున్నారు. -
అక్టోబర్ మొదటి వారంలో బోనస్
సాక్షి, హైదరాబాద్: దసరా కానుకగా లాభాల బోనస్ను కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో అక్టోబర్ మొదటి వారంలో జమ చేస్తామని గురువారం సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. 2018–19లో సంస్థ సాధించిన రూ.1,763 కోట్ల లాభాల్లో 28 శాతం (రూ.493 కోట్ల)ను కారి్మకులకు బోనస్గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. సీఎం చేసిన ప్రకటనపై సింగరేణివ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయని, కారి్మకులు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. బోనస్ చెల్లించడానికి తగు ఏర్పాట్లు చేయాలని సింగరేణి ఆర్థిక, పర్సనల్ విభాగాలను ఆదేశించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009–2014 వరకు పంచిన లాభాల బోనస్ రూ.314 కోట్లు మాత్రమేనని, తెలంగాణ వచ్చిన తర్వాత 2014–2019 వరకు భారీగా రూ.1,267 కోట్లను పంపిణీ చేశామన్నారు. ముఖ్యంగా సీఎం సింగరేణి కారి్మకులపై ప్రత్యేక అభిమానంతో గత ఐదేళ్ల కాలంలో ప్రతీ ఏడాది లాభాల బోనస్ను పెంచుతున్నారన్నారు. -
సింగరేణి బోనస్ రూ.1,00,899
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా పండుగ కానుకను ప్రకటించారు. సింగరేణి ఆర్జిస్తున్న లాభాల్లో కార్మి కులకి 28% వాటా ఇస్తున్నట్లు ప్రకటిం చారు. లాభాల్లో వాటా పెంచడంతో ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్గా అందనున్నట్లు వెల్లడించారు. గతేడాది అందించిన బోనస్ కన్నా ఈ ఏడాది రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుందని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సింగరేణి కాలరీస్ అంశంపై సీఎం కీలక ప్రకటన చేశారు. సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైందన్నారు. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సానుకూల వాతావరణం ఏర్పడిందని, సంస్థ పనితీరు గణనీయంగా మెరుగుపడి రికార్డుస్థాయి ఉత్పత్తి చేయడానికి ఈ పరిణామం దోహదపడిందని సీఎం తెలిపారు. ‘2013–14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 50.47 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగారు. గత ఐదేళ్లలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది. 2018–19 సంవత్స రంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.41 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2013–14లో సింగరేణి సంస్థ రూ.418 కోట్ల లాభం గడించింది. గత ఐదేళ్లలో ఇది ప్రతి ఏటా పెరుగుతూ 2018–19 నాటికి రూ.1,765 కోట్ల లాభాన్ని సింగరేణి సంస్థ సాధించగలిగింది’అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనకు ప్రతీకగా.. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్లో సింగరేణి సాధిస్తున్న ప్రగతి తెలంగాణ ప్రభుత్వ పాలనకు ప్రతీకగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. కోల్ ఇండియాతో పోల్చితే సింగరేణి ఎంతో మెరుగ్గా ఉండటం మనందరికి కూడా గర్వకారణమని, ఇంతటి సహకారం అందిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలిపారు. ‘సమైక్య పాలనలోని చివరి సంవత్సరమైన 2013–14లో కార్మికులకు ఒక్కొక్కరికి రూ.13,540 చొప్పున బోనస్ చెల్లించారు. తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో కార్మికులకు ఇచ్చే బోనస్కు క్రమంగా పెంచుతూ వస్తోంది. 2017–18లో లాభాల్లో 27 శాతం వాటాగా ఒక్కొక్క కార్మికుడికి రూ.60,369ను చెల్లించింది. ఈసారి లాభాల్లో వాటాను మరో శాతానికి అంటే 28 శాతానికి పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నా. లాభాల్లో వాటా పెంచడం వల్ల ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్గా అందుతుంది. గతేడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుక’అని సీఎం ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి మరిన్ని లాభాలు, విజయాలు సాధించిపెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
రైల్వేలో 78 రోజుల బోనస్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. రైల్వేశాఖలోని ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్(పీఎల్బీ) అందించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ..‘78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ ఇవ్వాలన్న నిర్ణయం కారణంగా రైల్వేశాఖలో 11.52 లక్షలమందికిపైగా ఉద్యోగులు లబ్ధి పొందుతారు. దీనివల్ల కేంద్రం ప్రభుత్వంపై రూ.2,024.40 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ బోనస్తో ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి వీలవుతుంది. తద్వారా రైల్వేశాఖలో ఉత్పాదకత పెరుగుతుంది’ అని తెలిపారు. అయితే కేంద్రం కేవలం 78 రోజుల బోనస్ మాత్రమే ప్రకటించడంపై రైల్వే యూనియన్లు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఈ విషయమై అఖిలభారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య స్పందిస్తూ..‘రైల్వే ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకత ఆధారంగా బోనస్ అందించాలని మేం కోరాం. ఈ విషయంలో రైల్వేబోర్డు ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరిపాం. రైల్వే ఉద్యోగులు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పగలు–రాత్రి తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. మేం న్యాయమైన బోనస్నే కోరాం. కానీ దురదృష్టవశాత్తూ అది అమలుకాలేదు’ అని విమర్శించింది. -
రైల్వే ఉద్యోగులకు బోనస్ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా 11 లక్షల మంది ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్బంగా ముందస్తు తీపి కబురు అందించింది. రైల్వే సిబ్బందికి బోనస్ అందించడం వరుసగా ఇది ఆరవ సంవత్సరం అని కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి రూ . 2024 కోట్ల వ్యయం అవుతుందన్నారు. మీడియా సమావేశంలో కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ -
అమల్లోకి వేతన చట్టం
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో 50 కోట్ల మందికి కనీస వేతనం అందేలా కేంద్రం తీసుకొచ్చిన ‘వేతనాల చట్టం– 2019’ అమల్లోకి వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లో జూలై 30న లోక్సభ, ఆగస్టు 2న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. ఆగస్టు 8న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఈ బిల్లును ఆమోదించటంతో చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ను విడుదల చేసింది. కనీస వేతనాలు, బోనస్లు, సమాన వేతనాలు వంటి నిబంధనలు కలిగిన నాలుగు చట్టాల స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం వర్తక సంఘాలు, ఉద్యోగులు, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు నిర్ణయమవుతాయి. వివక్షకు తావు లేకుండా పురుషులతో సమానంగా మహిళలు, ట్రాన్జెండర్స్ వేతనాలు పొందేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలను ఇందులో పొందుపరిచారు. -
బోనస్కు విప్రో వాటాదారుల ఆమోదం
న్యూఢిల్లీ: బోనస్ ఇష్యూ ప్రతిపాదనకు, అధీకృత మూలధనం పెంపునకు మెజారిటీ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు విప్రో తెలిపింది. వాటాదారుల వద్దనున్న ప్రతి మూడు షేర్లకు (ముఖ విలువ రూ.2) ఒక షేరును బోనస్గా ఇవ్వడానికి విప్రో బోర్డు జనవరిలో నిర్ణయించిన విషయం గమనార్హం. ఫిబ్రవరి 22 గడువు నాటికి అవసరమైన మెజారిటీ వాటాదారులు బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు విప్రో స్టాక్ ఎక్సే్చంజ్లకు సమాచారం ఇచ్చింది. అధీకృత మూలధనం పెంపునకు 98.82 శాతం, బోనస్ షేర్ల జారీకి 99.81 శాతం మంది వాటాదారుల ఆమోదం లభించినట్టు వెల్లడించింది. బోనస్ షేర్ల జారీ ద్వారా కంపెనీ అధీకృత మూలధనం రూ.1,126.50 కోట్ల నుంచి రూ.2,526.50 కోట్లకు పెరగనుంది. -
చందాకొచర్ నుంచి రూ.9 కోట్లు వెనక్కి..!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ సుమారు రూ.9 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను కోల్పోనున్నారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాల జారీలో కొచర్ బ్యాంకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ట కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో, కొచర్ను తొలగించినట్టేనని, ఆమెకు గతంలో ఇచ్చిన బోనస్లు, పెండింగ్లో ఉన్నవి, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను సైతం రద్దు చేస్తామని బ్యాంకు బుధవారమే ప్రకటించింది. బోనస్లతోపాటు అన్ఎక్సర్సైజ్డ్ స్టాక్ ఆప్షన్లను కూడా వదులుకోవాల్సి ఉంటుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2009 మే నెలలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా నియమితులైన కొచర్, తనపై ఆరోపణల కారణంగా గతేడాది పదవికి రాజీనామా చేశారు. గత రెండేళ్లకు సంబంధించి కొచర్కు ఇవ్వదలిచిన పనితీరు ఆధారిత బోనస్లకు ఆర్బీఐ ఆమోదం తెలియజేయలేదని, దీంతో ఈ బోనస్లను కొచర్కు ఇచ్చినట్టు పరిగణించబోమని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, కొచర్కు ఇప్పటిదాకా బ్యాంకు 94 లక్షల షేర్లను(స్టాక్ ఆప్షన్స్) బ్యాంకు మంజూరు చేసింది. వీటిలో ఎన్ని ఆమె వినియోగించుకున్నారనే సమాచారం లేదు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చందాకొచర్కు ముట్టిన ఆర్థిక ప్రయోజనాలు రూ.340 కోట్ల మేర ఉంటాయని బ్యాంకు వర్గాల సమాచారం. -
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
న్యూఢిల్లీ: రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్), రైల్వే రక్షక ప్రత్యేక దళం (ఆర్పీఎస్ఎఫ్) మినహా మిగిలిన నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో 11.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్టంగా రూ. 17,951 వరకు బోనస్ పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఉత్పాదకతను బట్టి ఇచ్చే ఈ బోనస్ కారణంగా రైల్వేపై రూ. 2,044.31 కోట్ల భారం పడుతుందని అంచనా. ఏటా దసరా పండుగకు ముందు ఉద్యోగులకు రైల్వే బోనస్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. రైల్వే పనితీరును మెరుగు పరిచే దిశగా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఈ బోనస్ ఉపయోగపడుతుందని రైల్వే భావిస్తుంది. తిరుపతి, బరంపురంలలో: తిరుపతితోపాటు ఒడిశా రాష్ట్రం బరంపురంలో భారత విజ్ఞానవిద్య, పరిశోధన సంస్థ (ఐఐఎస్ఈఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు, శాశ్వత భవనాల నిర్మాణం కోసం మొత్తంగా 3074.12 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. 2021 చివరికల్లా తిరుపతి, బరంపురంలలో భవనాల నిర్మాణం పూర్తవుతుందనీ, ఈ విద్యాసంస్థల కోసం రెండు రిజిస్ట్రార్ ఉద్యోగాలను సృష్టించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటూ ఓ అధికారిక ప్రకటన వెలువడింది. అన్ని సదుపాయాలతో 1,17,000 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మితమయ్యే ఒక్కో క్యాంపస్లో 1,855 మంది విద్యార్థులకు సరిపోయేలా సౌకర్యాలు ఉంటాయంది. సైన్సు విద్యలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన బోధనను అందించేందుకు ఐఐఎస్ఈఆర్లను స్థాపిస్తున్నారు. మంత్రివర్గ ఇతర నిర్ణయాలు ► జాతీయ వృత్తి శిక్షణా మండలి (ఎన్సీవీటీ), జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్డీఎస్ఏ)లను జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి (ఎన్సీవీఈటీ)లో విలీనం చేసే ప్రతిపాదనకు ఆమోదం. వృత్తి విద్య, శిక్షణకు సంబంధించిన సంస్థలను నియంత్రించే అధికారం ఎన్సీవీఈటీకి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలు, నాణ్యమైన కార్మికులను తయారుచేసేందుకు దోహద పడుతుందని కేంద్రం పేర్కొంది. ► పర్యావరణ పరిరక్షణలో సహకారం కోసం భారత్–ఫిన్లాండ్ల మధ్య జరిగిన ఒప్పందానికి, పర్యాటక రంగంలో రొమేనియాతో కుదిరిన మరో ఒప్పందానికీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
రైల్వే ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా సందర్భంగా ఈ ఏడాది కూడా 78రోజులకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్బీ) కింద రూ. 2,044.31 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి రవిశంకర్ప్రసాద్ బుధవారం వెల్లడించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ లభించనుంది. దీని కింద ఉద్యోగులు తమ వేతనంతో పాటు రూ.17,951 అదనంగా బోనస్ కింద పొందనున్నారు. పీఎల్బీ బోనస్ కింద సుమారు 12.26లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్) ఉద్యోగులకు ఇది వర్తించదు. -
ఇన్ఫోసిస్ 1:1 బోనస్
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా 1:1 బోనస్ను ప్రకటించింది. ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.3,612 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.3,483 కోట్లు)తో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే అంతకు ముందటి క్వార్టర్(గత ఆర్థిక సంవత్సరం క్యూ4)లో సాధించిన నికర లాభం, రూ.3,690 కోట్లతో పోల్చితే 2.1 శాతం క్షీణించింది. ఆదాయం రూ.17,078 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.19,128 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ, సీఈఓ సలిల్ పరేఖ్ చెప్పారు. ఆదాయం అంతకు ముందటి క్వార్టర్ ఆదాయంతో పోల్చితే 6 శాతం ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి (నిలకడ కరెన్సీ) 6–8 శాతం అంచనాలను కొనసాగిస్తున్నామని సలీల్ తెలిపారు. అలాగే మార్జిన్ అంచనాలను 22–24 శాతం రేంజ్లో కొనసాగిస్తున్నామని వివరించారు. నికర లాభం, నిర్వహణ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోగా, ఆదాయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గైడెన్స్ మాత్రం అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కంపెనీ రూ.19,093 కోట్ల ఆదాయంపై రూ.3,748 కోట్ల నికర లాభం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. తగ్గిన మార్జిన్... ఇబిట్ సీక్వెన్షియల్గా 5 శాతం తగ్గి రూ.4,267 కోట్లకు చేరిందని సలీల్ పరేఖ్ తెలిపారు. అంతకు ముందటి క్వార్టర్లో 24.7 శాతంగా ఉన్న నిర్వహణ మార్జిన్ ఈ క్యూ1లో 23.7 శాతానికి తగ్గిందని తెలిపారు. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినందువల్ల, వేతనాల పెంపు కారణంగా నిర్వహణ మార్జిన్ తగ్గిందని వివరించారు. మొత్తం ఆదాయంలో 28 శాతంగా ఉన్న డిజిటల్ వ్యాపారం 26 శాతం వృద్ధి చెందగా, ఆదాయంలో కీలకమైన ఆర్థిక సేవలు, బీమా విభాగాల ఆదాయం 1.5 శాతం తగ్గింది. భవిష్యత్తు ఆశావహంగానే.. ఈ క్యూ1లో పటిష్టమైన ఆదాయ వృద్ధిని, మార్జిన్లను సాధించామని సలిల్ పరేఖ్ చెప్పారు. డిజిటల్, కృత్రిమమేధ విభాగాలపై తమ ప్రయత్నాలకు మంచి ఫలితాలు దక్కాయని దీంతో వెల్లడవుతోందని వివరించారు. ఐటీకి భవిష్యత్తు ఆశావహంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. వివిధ ఆర్థిక అంశాల్లో మంచి పనితీరు సాధించామని కంపెనీ ఎండీ, సీఎఫ్ఓ రంగనాథ్ తెలిపారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఈఓ) 25 శాతం దాటేసిందని, ఫ్రెష్ క్యాష్ ఫ్లోస్ 32 శాతం ఎగిశాయని(సీక్వెన్షియల్గా) పేర్కొన్నారు. జనవరి–మార్చి క్వార్టర్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.1 శాతంగా ఉందని వివరించారు. ఈ క్యూ1 చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.09,905 గా ఉందని తెలిపారు. అంతకు ముందటి క్వార్టర్లో 19.5 శాతంగా ఉన్న ఆట్రిషన్ (ఉద్యోగుల వలస) ఈ క్యూ1లో 23 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. కాగా ఈ వారంలోనే మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ క్యూ1 ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. టీసీఎస్ నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.7,340 కోట్లకు, ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.34,261 కోట్లకు పెరిగాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు బాగానే ఉంటాయన్న అంచనాలతో బీఎస్ఈలో ఈ షేర్ 1.1 శాతం లాభంతో రూ.1,309 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 3 శాతం లాభంతో రూ.1,331 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. జూన్ క్వార్టర్లో ఈ షేర్ 15 శాతం ఎగసింది. బోనస్ బొనాంజా ఒక్కో షేర్కు మరొక్క షేర్ను బోనస్(ఉచితంగా) ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. అలాగే ఒక్కో అమెరికన్ డిపాజిటరీ షేర్(ఏడీఎస్)కు మరో అమెరికన్ డిపాజిటరీ షేర్ను స్టాక్ డివిడెండ్గా ఇవ్వనున్నామని వివరించారు. స్టాక్ మార్కెట్లో లిస్టయి పాతికేళ్లు అయిన సందర్భంగా ఈ బోనస్ను ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12 కల్లా బోనస్ షేర్లు వాటాదారులకు అందనున్నాయి. రూ.2,600 కోట్ల స్పెషల్ డివిడెండ్తో సహా వాటాదారులకు మొత్తం రూ.13,000 కోట్లు చెల్లించనున్నామని ఈ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్లో తెలిపింది. అధిక రాబడులు ఆశిస్తున్న వాటాదారుల అంచనాలను నెరవేర్చడం తమ లక్ష్యమని, నగదు నిల్వల్లో 70 శాతం వరకూ వాటాదారులకు చెల్లించాలన్న తమ విధానాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది. -
బోనస్ వచ్చిందా... వాడేస్తున్నారా?
వేతన జీవులకు ఏటా బోనస్ రూపంలో అదనపు ఆదాయం చేతికందుతూ ఉంటుంది. దీన్ని స్మార్ట్ఫోన్ల కోసమో లేక జాలీ ట్రిప్ కోసమో వాడేసుకునే వారు చాలా మందే ఉన్నారు. అయితే, ఈ విధంగా చేతికొచ్చే అదనపు నిధులను అనవసర వినియోగం కంటే అర్థవంతమైన వినియోగానికి మళ్లించగలిగతే ఆ డబ్బు మీ కోసం పనిచేస్తుంది. అదెలా అన్నది నిపుణులు తెలియజేస్తున్నారు. అధిక వడ్డీ రుణాలు ఇటీవలి కాలంలో రుణాలపై వడ్డీ రేట్లకు తిరిగి రెక్కలు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు గృహ రుణాల రేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మీరు పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకుని ఉంటే లేదా ఇతర రుణాలు తీసుకుని ఉన్నా బోనస్ తరహా అదనపు ఆదాయం చేతికి అందినప్పుడు ముందు ఈ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, రుణాలు చెల్లించడం కంటే అధిక రాబడులు వచ్చే చోట బోనస్ ఆదాయాన్ని ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా? అన్న సందేహం రావచ్చు. అయితే, రుణాలను తీర్చివేయడం కూడా ఒక కోణంలో మంచిదే. రుణ భారం తగ్గడం వల్ల ఆ మేరకు ఒత్తిడి తగ్గి స్వేచ్ఛ పెరుగుతుంది. క్రెడిట్ స్కోరు కూడా మెరుగవుతుంది. టర్మ్ప్లాన్ చాలా మంది బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటారు. కానీ, ఆచరణలో పెట్టేది కొద్ది మందే. ఒకవేళ తీసుకున్నా ఏటా ప్రీమియం చెల్లిస్తూ దాన్ని కొనసాగించే క్రమశిక్షణ అందరిలోనూ ఉండదు. ఈ తరహా ధోరణితో ఉండేవారికి ఉన్న మార్గం సింగిల్ ప్రీమియం పాలసీ. ఒకేసారి ప్రీమియం చెల్లించడం ద్వారా కోరుకున్న కాల వ్యవధి వరకు బీమా రక్షణ పొందొచ్చు. సింగిల్ ప్రీమియం కాబట్టి ఒకేసారి చెల్లించాల్సిన మొత్తం కొంత ఎక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకోవాలని అనుకుంటే సింగిల్ ప్రీమియం కింద సుమారు రూ.1.57 లక్షలను చెల్లించాల్సి ఉంటుంది. ఆరోగ్య రక్షణ ఈ రోజుల్లో వైద్య బీమా కూడా కనీస అవసరంగా మారిపోయింది. ప్రభుత్వం వైపు నుంచి ఆరోగ్య సంక్షేమానికి ఎటువంటి భరోసా లేని మన దేశంలో సామాన్యులకు వైద్య బీమా తప్పనిసరి. వేతన జీవులు సాధారణంగా కంపెనీ అందించే గ్రూప్ హెల్త్ పాలసీపైనే ఆధారపడుతుంటారు. కానీ, ఇది కుటుంబానికి తగినంత కవరేజీతో ఉండకపోవచ్చు. లేదా ఉద్యోగం మానేసినా, కోల్పోయినా ఆ రక్షణ కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. కనుక ఏటా వచ్చే బోనస్తో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం సరైనదే. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకుంటే ఊహించని ఖర్చుల నుంచి బయటపడొచ్చు. అత్యవసర నిధి ప్రతీ ఉద్యోగికి అత్యవసర నిధి అన్నది చాలా అవసరం. ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోతే కుటుంబ పోషణ యథావిధిగా కొనసాగేందుకు ఇది ఉపయోగపడుతుంది. తిరిగి ఉద్యోగం సంపాదించుకునే వరకు అత్యవసర నిధితో గట్టెక్కవచ్చు. అందుకే వేతన జీవులు తమ నెలసరి కుటుంబ అవసరాలకు ఎంతవుతుందో లెక్కించి అలా మూడు నుంచి ఆరు నెలల అవసరాలను తీర్చేంత నిధిని రిజర్వ్లో ఉంచుకోవాలి. ఇందుకు బోనస్ను వినియోగించుకోవచ్చు. కేవలం ఉద్యోగం కోల్పోతే అని కాదు, ఇతరత్రా ఊహించని అత్యవసరాలకు కూడా ఈ నిధి అక్కరకు వస్తుందని గుర్తించాల్సిన అంశం. ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులు బోనస్ ఆదాయాన్ని పెట్టుబడులకు కూడా మళ్లించే ప్రయత్నం చేయవచ్చు. రిస్క్ భరించేట్టు అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను పొందే అవకాశం ఉంది. అయితే బోనస్ ఆదాయం మొత్తాన్ని ఒకేసారి కాకుండా లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాన్నుంచి ప్రతీ నెలా సిప్ విధానంలో లేదా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి మళ్లించాలి. దీనివల్ల మార్కెట్లలో అస్థిరతల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. పిల్లల విద్య కోసం విద్యా వ్యయాలు ఏటా 10 శాతం మేర పెరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం. ఇటీవలే ఐఐఎం అహ్మదాబాద్ సంస్థ రెండు సంవత్సరాల మేనేజ్మెంట్ కోర్స్ ఫీజును రూ.21 లక్షలు చేసింది. 2007 నుంచి చూసుకుంటే పదేళ్ల కాలంలో ఐఐఎం ఫీజులు 500 శాతం పెరిగాయి. మరి మీ పిల్లలు కాలేజీకి వచ్చే సమయానికి ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయో ఓ సారి ఆలోచించండి. ఒకవేళ మీ పిల్లలు ప్రస్తుతం స్కూల్ విద్యలో ఉండి ఉంటే ఇప్పటి నుంచే వారి ఉన్నత విద్య కోసం బోనస్ ఆదాయాన్ని పెట్టుబడులకు మళ్లించొచ్చు. తల్లిదండ్రుల పేరిట ఎఫ్డీలు బోనస్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని మీ పేరిట కంటే 60ఏళ్లు దాటిన తల్లిదండ్రుల పేరిట ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచనే అవుతుంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంకు ఎఫ్డీలపై అరశాతం అధికంగా వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నారు. ఇక పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో వార్షికంగా 8.3 శాతం వడ్డీ లభిస్తోంది. పన్ను పరమైన నిబంధనలు అడ్డు పడుతున్నాయని భావిస్తే తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చి వారితో ఇన్వెస్ట్ చేయించొచ్చు. వృద్ధులకు వార్షికంగా రూ.50,000 వరకూ వడ్డీ ఆదాయంపై పన్ను లేదు. ఇటీవల బడ్జెట్లోనే దీన్ని ప్రవేశపెట్టారు. రిటైర్మెంట్ నిధి ఏటా వచ్చే బోనస్ను కనీసం రిటైర్మెంట్ ఫండ్కు మళ్లించినా మంచి నిర్ణయమే అవుతుంది. దీని ద్వారా పన్ను ఆదా కూడా చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బి) కింద ఏటా రూ.50,000 వరకు ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపునకు ఇది అదనం. కనుక పన్ను పరిధిలోకి వచ్చే వారు బోనస్ను ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించొచ్చు. ఒకవైపు పన్ను ఆదా మరో వైపు రిటైర్మెంట్ నిధికి మార్గం ఏర్పడుతుంది. అయితే, ఎన్పీఎస్లో పెట్టుబడులను 60 ఏళ్లు వచ్చిన తర్వాతే వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందులోనూ 40 శాతాన్ని యాన్యుటీ పథకంలో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. అంటే 60 శాతం మొత్తాన్ని మాత్రమే మీరు స్వేచ్ఛగా వినియోగించుకోగలరు. -
1000జీబీ ఎయిర్టెల్ బోనస్ డేటా
బ్రాడ్బ్యాండు యూజర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ తన బిగ్ బైట్ ఆఫర్ను 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. దీని కింద బ్రాడ్బ్యాండ్ యూజర్లు అదనంగా 1000జీబీ వరకు బోనస్ డేటా లభించనుంది. తొలిసారి ఈ ఆఫర్ 2017 మేలో లైవ్లోకి వచ్చింది. 2018 మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసింది. కానీ ఈ ఆఫర్ను అక్టోబర్ వరకు పొడిగించనున్నట్టు ఎయిర్టెల్ తాజాగా ప్రకటించింది. ఈ ఆఫర్ ఎయిర్టెల్ రూ.1099, రూ.1299 ప్లాన్లపై అందుబాటులో ఉంటుంది. బేస్ ప్లాన్పై ఎంత స్పీడులో డేటా లభిస్తోందో, బోనస్ డేటా కూడా అదే నెట్ స్పీడును యూజర్లకు అందుబాటులో ఉంటుంది. అదనపు డేటాను ప్రతి నెలా క్యారీ ఫార్వర్డ్ చేయనున్నామని, అలా 2018 అక్టోబర్ 31 వరకు లేదా డేటా ముగిసే వరకు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్ ధరలు రీజన్ రీజన్కు వేరువేరుగా ఉన్నాయి. ఢిల్లీ యూజర్లకైతే రూ.1099 ప్లాన్పై 250జీబీ అదనపు డేటాతో పాటు 1000జీబీ బోనస్ డేటా లభిస్తోంది. 100 ఎంబీపీఎస్ స్పీడులో ఈ డేటాను ఎంజాయ్ చేసుకోవచ్చు. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ను కూడా యూజర్లు వినియోగించుకోవచ్చు.రెండో ఎయిర్టెల్ ప్లాన్ రూ.1299 కింద అపరిమిత కాల్స్ను, 250జీబీ బ్రాడ్బ్యాండ్ డేటాను, 1000జీబీ బోనస్ డేటాను యూజర్లు పొందుతారు. దీని స్పీడు కూడా 100ఎంబీపీఎస్. ఈ 1000 బోనస్ డేటాను పొందడమెలా? ఈ ఆఫర్ను పొందడానికి పేజీని విజిట్ చేసి, ప్లాన్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ వివరాలను నమోదు చేయాలి. ఒక్కసారి ఆ ప్రక్రియంతా అయిపోయిన తర్వాత, అదనపు డేటా ఏడు రోజుల తర్వాత బేస్ ప్లాన్కు యాడ్ అవుతుంది. ఈ ఆఫర్ పొండానికి రెండు ప్లాన్లలో(రూ.1099, రూ.1299) ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
పౌరులకు సర్కారీ బోనస్...!
వివిధ రూపాల్లో ముక్కుపిండి పన్నులు వసూలు చేసే దేశాలే కాదు తమ పౌరులకు బోనస్ చెల్లించే దేశం కూడా ఉంది. ఈ విషయంలో సింగపూర్ది విలక్షణ శైలి. దేశ పౌరసత్వంతో పాటు 21 ఏళ్ల వయసు ఉంటే చాలు అక్కడ బోనస్ పొందేందుకు అర్హులు. అదీకూడా సంపాదించే ఆదాయాన్ని బట్టి తక్కువ ఆదాయాలు వచ్చే వారికి ఎక్కువ, పెద్దమొత్తంలో ఆర్జించే వారికి తక్కువగా ఈ మొత్తాన్ని ఇవ్వబోతోంది. 2017లో దాదాపు పది బిలియన్ల సింగపూర్ డాలర్ల మిగులు బడ్జెట్(అమెరికన్ డాలర్లలో 7.6 బిలియన్లు) సాధించడంతో ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటోంది. ఎందుకు? ప్రత్యేక సందర్భాల్లో డబ్బురూపంలో ఇచ్చే ఈ బహుమతిని స్థానికభాషలో ‘ హాంగ్బావో’ అని అంటారు. సింగపూర్ అభివద్ధి ఫలాలు పౌరులకు అందాలనే తమ ప్రభుత్వ దీర్ఘకాల నిబద్ధతకు అనుగుణంగా ఈ బోనస్ చెల్లిస్తున్నట్లు ఆ దేశ ఆర్థికమంత్రి హెంగ్స్వీకీట్ ప్రకటించారు. చట్టబద్ధ అధికారాలున్న బోర్డుల నుంచి అదనపు ఆదాయంతో పాటు, స్టాంప్ డ్యూటీ రూపంలో ఖజానాకు అంచనా కంటే అధిక ఆదాయం వచ్చింది. ఈ కారణంగా ‘ఎస్జీ బోనస్’ పేరిట ప్రజలకిస్తున్న బహుమతుల వల్ల అక్కడి ప్రభుత్వంపై 700 సింగపూర్ డాలర్ల (అమెరికన్ డాలర్లలో 533 మిలియన్లు) వ్యయం అవుతుంది. ఎంత మందికి లాభం... ఈ బోనస్ పొందేందుకు మొత్తం 27 లక్షల మంది అర్హులు. ఏడాదికి లక్షకు పైగా సింగపూర్ డాలర్లు సంపాదించే వారికి 100 డాలర్లు, 28 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల దాకా ఆర్జించే వారికి 200 డాలర్లు, 28 వేల డాలర్లు అంత కంటే తక్కువ ఆదాయం వచ్చే వారికి 300 సింగపూర్ డాలర్ల వరకు అందజేస్తారు. 2018 చివరికల్లా ఈ బోనస్లు చెల్లిస్తారు. పరిశ్రమలకు వాత... మిగులు మొత్తంలో దాదాపు సగం (5 సింగపూర్ బిలియన్ డాలర్లు) రైల్వే మౌలికసదుపాయాల నిధి కింద విడిగా ఉంచుతున్నారు. ఈ నిధితో సింగపూర్లో కొత్త రైల్వే లైన్లు వేస్తారు. మిగిలిన మొత్తంలో రెండు సింగపూర్ మిలియన్ డాలర్ల మేర వయోజనులు, హెచ్చుస్థాయిలో వికలత్వం ఉన్న వారి బీమా పథక ప్రీమియం కోసం ఖర్చుచేస్తారు. అయితే ప్రస్తుతం ప్రజలికిస్తున్న బోనస్తో పాటు వస్తుసేవాపన్ను (జీఎస్టీ)ను 7 శాతం నుంచి 9 శాతం వరకు (2021–25 మధ్య కాలంలో అమలు) పెంచనున్నట్లు మంత్రి హెంగ్స్వీకీట్ చేసిన ప్రకటన అక్కడి వారికి కొంచెం చేదు వార్తే. వాతావరణ మార్పు, సముద్రమట్టం పెరగడం వల్ల సింగపూర్కు జరిగే నష్టనివారణలో భాగంగా 25 వేల టన్నులకు పైబడి కర్బన ఉద్గారాలు వదిలే పరిశ్రమలపై టన్నుకు 5 సింగపూర్ డాలర్ల ‘కార్బన్ టాక్స్’ను (2019–23 మధ్య కాలంలో) సైతం విధిస్తారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్?
సాక్షి, హైదరాబాద్ : నాలుగు నెలలుగా భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్గా ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉన్నతస్థాయి వర్గాల్లో కసరత్తు జరుగుతోంది. ఎప్పుడో నిజాం నవాబు నాటి రికార్డులను ఎంతో శ్రమకోర్చి ప్రక్షాళన చేసిన క్షేత్రస్థాయి వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి సీసీఎల్ఏ సిబ్బంది వరకు ఈ ప్రోత్సాహకాన్ని ఇస్తారని, ఏప్రిల్ నెల జీతంతోపాటు బోనస్ వస్తుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఏం చేద్దాం.. ఎలా చేద్దాం వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొన్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ గత నెలలోనే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మరోవైపు ఈ ప్రోత్సాహకం విషయంలో ఏం చేద్దామన్న దానిపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏ) ప్రతిపాదిస్తున్న విధంగా సిబ్బంది మొత్తానికి నెల జీతం బోనస్గా ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.18 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడనుందని రెవెన్యూ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అయితే రెవెన్యూ శాఖలో పని చేస్తున్న మొత్తం 40 వేల మంది సిబ్బందికీ బోనస్ ఇవ్వాలా లేదా భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న వీఆర్ఏలు, వీఆర్వోలు, తహసీల్దార్లు, ఇతర కార్యాలయ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆర్డీవో కార్యాలయాల నుంచి కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల సిబ్బంది వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందున అందరికీ బోనస్ వర్తింపజేయాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనస్ ఎవరికి ఇస్తారన్నది త్వరగా తేల్చి వీలుంటే మార్చి లేదా ఏప్రిల్ నెల జీతంలో బోనస్ జమ చేస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
జీఎస్టీ ఎఫెక్ట్: ఉద్యోగులకు బోనస్లు, గిఫ్ట్లు కట్
సాక్షి, ముంబై: ఉద్యోగులకు 400 అపార్ట్మెంట్లు, వెయ్యి కార్లు, బంగారు నగలు దీపావళి బహుమతి గా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన సూరత్ వజ్రాల వ్యాపారి ఈ ఏడాది జీఎస్టీ షాక్ తగిలింది. అందుకే దీపావళి వచ్చిందంటే విలువైన బహుమతులతో ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు ప్రకటించే ఆయన ఈసారి మిన్నకుండిపోయారు. అవును ‘బాస్ అంటే ఈయనే’ అనే రీతిలో సిబ్బందిపై కానుకల వర్షం కురిపించి అందరి ప్రశంసలు అందుకున్న సూరత్ వజ్రాల వ్యాపారి, హరే కృష్ణ ఎక్స్పోర్ట్స్ యజమాని సావ్జీ ధోలాకియా ఈ దీవపావళికి మాత్రం ఎలాంటి కానుకలు ఇవ్వకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకే దేశం-ఒకే పన్ను అంటూ బీజీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ ఎఫెక్ట్ సూరత్ వజ్రాల వ్యాపారాలపై బాగా పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది చాలా మంది వ్యాపారులు ఇబ్బందుల్లోని నెట్టిందని చెబుతున్నారు. నల్లధనాన్ని నిరోధించే ప్రయత్నంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు డైమండ్ , ఆభరణాల చిన్న వ్యాపారస్తులను దెబ్బకొట్టిందని టాక్స్ నిపుణులు చెప్పారు. ఈ కారణంతోనే సావ్జీ ధోలాకియా ఎలాంటి కానుకలు ప్రకటించలేదని అంటున్నారు. నోట్ల రద్దు, అనంతరం తీసుకొచ్చి జీఎస్టీ చట్టం తమ వ్యాపారాన్ని బాగా దెబ్బతీసిందని సూరత్ డైమండ్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా నగదు లావాదేవీలపైననే ఆధారపడి ఉండే డైమండ్ వ్యాపారాన్ని నగదుకొరత, డిజిటల్ లావాదేవీలు ప్రభావాన్ని చూపుతున్నాయని సూరత్ పెట్టుబడిదారుడు మస్రాని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఒక్క సావ్జీ నేకాకుండా చాలామంది ఉద్యోగులు భారీ బహుమతులు, పండుగ బోనస్లు ఇవ్వడం ఆనవాయితీ అని కానీ.. ఈ దీపావళికి చాలామంది టాప్ డైమండ్ వ్యాపారులు కూడా అలా ఇవ్వలేకపోయారని వివరించారు. బంగారంపై 3 శాతం జిఎస్టీ, పీఎంఎల్ఏ నిబంధనలు ఈ సెక్టార్ను వ్యవస్థీకృతం చేసి, పారదర్శకతను తీసుకొచ్చినప్పటికీ, నిజమైన కొనుగోలుదారులకు, అమ్మకందారులతోపాటు మరికొంతమందికిఇబ్బందులను తెచ్చిపెట్టిందని మరో వ్యాపారి మణి పేర్కొన్నారు. కాగా ఏడాదికి రూ. 6వేల కోట్ల టర్నోవర్ ఉన్న సావ్జీ తన ఉద్యోగులు భారీ గిఫ్ట్లు, బోనస్లు ఆఫర్ల చేయడం తెలిసిందే. ముఖ్యంగా 2015లో 1200 మందికి నగలు, 491 ఫీయట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కానుకలుగా ఇచ్చారు. 2016లో 2 వేలమంది ఉద్యోగులకు డస్టన్ రడో గో, మారుతీ ఆల్టో కార్లు, నగలు కానుకగా ఇచ్చారు. అయితే వచ్చే ఏడాది దీపావళికి ఇద్దామనే ఆలోచనతోనే ఈసారి కానుకలను వాయిదావేసనంటూ ఈ అంచనాలను సావ్జీ తోసిపుచ్చడం విశేషం. -
సింగరేణి కార్మికులకు 25% లాభాలబోనస్
-
సింగరేణి కార్మికులకు 25% లాభాలబోనస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో 25 శాతం వాటాను కార్మికులకు బోనస్గా చెల్లించాలని యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం ఆదేశించారు. గతంలో ప్రకటించిన పి.ఎల్.ఆర్ (దీపావళి) బోనస్ రూ. 57 వేలతోపాటు లాభాల బోనస్ను శుక్రవారం కార్మికుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇది మొత్తం రూ. 98.84 కోట్లు కానుంది. వాస్తవానికి పి.ఎల్.ఆర్ (దీపావళి) బోనస్ను అక్టోబర్ రెండో వారంలో దీపావళి పండుగకు ముందుగా చెల్లించాలని ప్రకటించినప్పటికీ వెనువెంటనే వచ్చిన పండుగలు, కార్మికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు బోనస్లు కలిపి ఒకే దఫాగా శుక్రవారం చెల్లించాలని సీఎం ఆదేశించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కార్మికుల ఖాతాల్లో బోనస్ జమ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 25 శాతం లాభాల వాటా బోనస్ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు రానుంది. దీనికి దీపావళి బోనస్ రూ. 57వేలను కలపనున్నారు. మొత్తంగా ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ. 72 వేల నుంచి రూ. 77 వేల మధ్య జమ కానుంది. ఈ నెల 22న యాజమాన్యం దసరా పండుగ అడ్వాన్సుగా ప్రతి కార్మికుడికి రూ. 25 వేలు చెల్లించింది. మొత్తంగా పండుగల సీజన్లో ప్రతి కార్మికుడు సగటున లక్ష రూపాయలు పొందగలిగాడు. దసరా పండుగ అడ్వాన్సుగా ఈ నెల 22న రూ. 120 కోట్లు చెల్లించిన యాజమాన్యం... దీపావళి బోనస్గా రూ. 336 కోట్లు, లాభాల వాటా కింద రూ. 98.84 కోట్లు కలిపి మొత్తం రూ. 434 కోట్లను శుక్రవారం చెల్లించనుంది. పెరిగిన లాభాల వాటా... తెలంగాణ ఆవిర్భావానికి ముందు కార్మికులకు లాభాల బోనస్ 20 శాతం లోపే ఉండేది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గత మూడేళ్లుగా లాభాల్లో కార్మికుల వాటాను పెంచుకుంటూ వస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. తెలంగాణ రాకముందు లాభాల బోనస్ 18 శాతం ఉండగా తెలంగాణ వచ్చాక దాన్ని 2014–15లో 21 శాతానికి, 2015–16లో 23 శాతానికి పెంచగా 2016–17కి సంబంధించి తాజాగా 25 శాతానికి పెంచినట్లు వెల్లడించారు.