checking
-
Video: అమిత్షా హెలికాప్టర్ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సాధారణ పౌరులతోపాటు ప్రముఖ రాజకీయ నేతల వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, శిసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ల వాహనాలను సైతం తనిఖీ చేశారు. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన బ్యాగ్లను చెక్ చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా నే స్వయంగా వెల్లడించారు. తనిఖీలకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు.‘ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో నా హెలికాప్టర్ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను పాటిస్తుంది. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి’ అని అమిత్ షా పేర్కొన్నారు.आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई। भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है। एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT— Amit Shah (@AmitShah) November 15, 2024 -
రూ. 5తో ‘రోల్స్ రాయిస్’ క్వాలిటీ చెక్!
రోల్స్ రాయిస్... అత్యంత ఖరీదైన ఈ కారును కొనుగోలు చేయాలని కొందరు కోటీశ్వరులు తహతహలాడుతుంటారు. అలాగే రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ ప్రతీ కారును సంబంధిత వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా సిద్ధం చేస్తుంది. ఒక్కో రోల్స్ రాయిస్ కారు తయారీకి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది.దీనికిగల కారణం.. రోల్స్ రాయిస్ కారులోని కొన్ని భాగాలకు చేతితో పెయింటింగ్ చేసి, వాటిని అసెంబుల్ చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నకారణంగానే ఈ కారు ధర కోట్లలో ఉంటుంది. అయితే రోల్స్ రాయిస్ కారు క్వాలిటీని కేవలం ఐదు రూపాయల నాణెంతో చెక్ చేయవచ్చంటున్నారు ప్రముఖ యూట్యూబర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు పీ ఆర్ సుందర్. ఈ కారుకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.రోల్స్ రాయిస్ చాలా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుందని, వీటి గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. కారు ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు దానిపై ఐదు రూపాయల నాణెం ఉంచితే.. అది కదలి, కిందికు పడిపోదన్నారు. రోల్స్ రాయిస్ ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు కూడా దానిలో వైబ్రేషన్ రాదని సుందర్ తెలిపారు.రోల్స్ రాయిస్ కారును భారత్కు తీసుకురావాలంటే అధిక మొత్తంలో దిగుమతి పన్ను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. భారతదేశంలో ఈ కారును నడపాలనుకుంటే, కారు కోసం ప్రత్యేకంగా పాస్పోర్ట్, వీసా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దుబాయ్లోని తన రోల్స్ రాయిస్ను భారత్కు తీసుకురావడానికి వీసా, పాస్పోర్ట్ పొందానని తెలిపారు. ఆరు నెలల తర్వాత తన కారును తిరిగి దుబాయ్కి తీసుకెళ్లాల్సి ఉంటుందని సుందర్ పేర్కొన్నారు. -
ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
సాక్షి, ఖమ్మం: ఆహార ప్రియులకు, బిర్యానీ లవర్స్కు అలెర్ట్. వారం మొత్తం కష్టపడి వీకెండ్లో ఫ్యామిలితో రెస్టారెంట్లకు,హోటళ్ళకు వెళ్ళి తింటున్నారా.. ఐతే కొంచెం జాగర్తండోయ్.. కొందరికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. మరికొందరికి చికెన్ కబాబ్స్ అంటే మరీ లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. కానీ అవే ఆహార పదార్ధాలు వారాల కొద్దీ నిల్వ ఉంచి మీకు పెడుతున్నారంటే నమ్ముతారా.. ఇది ముమ్మాటికీ నమ్మలేని నిజమే అని చెప్పాలి. కావాలంటే ఒక్కసారి ఖమ్మం జిల్లాకు వెళ్ళి చూసొద్దాం రండి. రెస్టారెంటుకు వెళ్ళి డిమ్ లైటింగ్లో కూర్చుని వేడి వేడి బిర్యాని, దానికి తగ్గట్టుగా చికెన్ లాలిపప్స్.. చికెన్ 65, చికెన్ కబాబ్స్ తింటుంటే ఉంటుంది. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదా. చికెన్, మటన్, ప్రాన్స్, ఇలా ఎన్నోరకాల వంటలు రెస్టారెంట్లలో,హోటళ్ళలో దొరుకుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్త.. అదే ఆహారం విషంగా మారితే మీ పరిస్థితి ఏంటి?. ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినా మనం ఏం చేస్తుంటా అలా రెస్టారెంటుకు వెళ్ళి బిర్యానీ తినాలి అనుకుంటాం అలాంటప్పుడు ఎక్కువగా ఫేమస్ రెస్టారెంట్లవైపే మొగ్గు చూపుతుంటాం. ఎందుకంటే పది రూపాయలు ఎక్కువైన సరే ఫుడ్ రుచితో పాటు శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కూడా పాటిస్తారని.. అందులో తింటే ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదన్న గట్టి నమ్మకంఅయితే ఆ గట్టి నమ్మకం కాస్త ఇప్పుడు గుడ్డి నమ్మకమని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తేలిపోయింది. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్ల బండారాలు బయటపడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక.. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఒకటో రెండో రెస్టారెంట్లలో కాదండోయ్. నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లలో ఇదే సీన్ కనిపించటం ఆందోళనకరం.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లలో ఫ్రీజర్లో దాచిన చికెన్ కబాబ్స్, ప్లాస్టిక్ బకెట్లలో మ్యారినేట్ చేసిన చికెన్, బ్యాచ్ నంబర్ లేని మసాలా ప్యాకెట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ గడువు లేని పసుపు, ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులు, రూల్స్ అతిక్రమించి పామాయిల్ వినియోగం...ఇలా పలు లోపాలను, మోసాలను గుర్తించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల ఫుడ్సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్ జ్యోతిర్మయి టాస్క్ఫోర్స్ టీమ్తో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు.హోటల్లో తనిఖీల సందర్భంగా సిబ్బంది ఎవరికీ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తెలుసుకున్నారు .నాణ్యత లేని ఆహార పదార్థాలు సీజ్ చేశారు. శాంపిల్స్ను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఓ హోటల్లో ఫ్రీజర్లో నిల్వ చేసిన 12 కిలోల చికెన్ కబాబ్స్ను గుర్తించిన అధికారులు, వాటిని రూల్స్ ప్రకారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించాల్సి ఉండగా.. అక్కడే డ్రైనేజీలో పారబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిర్వాహకులు చపాతి, పరోటా పిండిని కలిపి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిజ్లో నిల్వ ఉంచారు. చికెన్ ధమ్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్ను ప్లాస్టిక్ బకెట్లో నిల్వ చేశారు. దీంతో మ్యారినేట్ చేసిన చికెన్ను కూడా బయటపడేయించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు ఫైర్ అయ్యారు. స్టోరూమ్స్ ఎక్స్పైరీ అయిన జీలకర్ర, బ్రాండెడ్ కాని జీడిపప్పు, గోధుమ పిండిని గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే పర్మిషన్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆహార వస్తువులపై లేబుల్స్, బ్యాచ్ నంబర్లోకపోతే ఫైన్తో పాటు, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 300 హోటళ్లు, 28 రెస్టారెంట్లు ఉండగా ఏడు నెలల్లో అధికారులు తనిఖీలు చేసి 14 కేసులు మాత్రమే నమోదు చేశారు. హైదరాబాద్ స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్పా తనిఖీలు చేయరన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్పించి రెగ్యులర్గా సోదాలు చేయరనే ఆరోపణలున్నాయి. మామూళ్ల వ్యవహారం కారణంగా చూసి చూడనట్టు వదిలేస్తారనే విమర్శలున్నాయి.ఇప్పటికైనా ఆహార భధ్రత అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నెలకో రెండు నెలలకో తనిఖీలు చేయడం కాకుండా నిత్యం రెస్టారెంట్లు హోటళ్ళపై నిఘా ఉంచాలని, ప్రజల ప్రాణాలకు హాని కలింగించే ఆహార పధార్దాలు ఇలాంటి రెస్టారెంట్లు,హోటళ్ళు వినియోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ లవర్స్ కోరుతున్నారు. -
మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకున్నారా? సందేహాలున్నాయా? చెక్ చేసుకోండిలా!
తెలంగాణ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది…పార్టీలు ప్రచారాల్లో మునిగితేలుతూంటే… ఓటరు మహాశయుడూ నవంబరు 30వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాడు. తొలిసారి ఓటేస్తున్నామన్న ఉత్సాహం యువ ఓటర్లది.... నచ్చని నేతలను వదిలించుకోవాలని ఇతరులు ఎదురు చూస్తున్నారు. మరి… ఓటరు జాబితాలో మీ పేరుందో? లేదో చూసుకున్నారా? దాంట్లో తప్పులేమీ లేవు కదా? ఉంటే సరిచేసుకోవడం ఎలా అన్న అనుమానం వెంటాడుతోందా? ఏం ఫర్వాలేదు… సాక్షి.కాం మీతోనే ఉంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా మీ ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? పేరెలా పరిశీలించాలి? మొబైల్ఫోన్కు ఆధార్ నెంబరును లింక్ చేసుకోవడమెలా వంటి అనేక సందేహాలకు సమాధానాలు అందిస్తోంది. ఆలస్యం ఎందుకు…. చదివేయండి. మీ సందేహాలు తీర్చుకోండి. ఇంకా ఏవైనా మిగిలిన ఉంటే ఎన్నికల కమిషన్ అధికారులతోనే మీ డౌట్స్ క్లియర్ చేసేందుకూ ప్రయత్నిస్తాం. మీరు చేయాల్సిందల్లా… మీ సందేహం/సమస్యను vote@sakshi.com ఐడీకి మెయిల్ చేయడమే!! ఓటర్ల సమాచారాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఓటర్లకు సంబంధించిన అన్ని సేవలను, సమాచారాన్ని ఒక దగ్గరకు చేర్చి https://voterportal.eci.gov.in ను రూపొందించింది. ఓటరుగా నమోదు చేసుకోవడం మొదలుకొని జాబితాలో పేరును చెక్ చేసుకోవడం వరకూ అన్ని సేవలూ ఇక్కడే లభిస్తాయి. జాబితాలో మీ పేరు చూసుకోండిలా… ఈ వెబ్సైట్లోకి ప్రవేశించగానే… కుడివైపున సర్వీసెస్ అన్న భాగంలో ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని ఒక చిన్న ట్యాబ్ను గమనించండి. దాన్ని క్లిక్ చేస్తే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునే పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ ఇలా ఉంటుంది…. ఇందులో మూడు రకాలుగా మీ పేరును చెక్ చేసుకోవచ్చు. మొదటది మీ వివరాలను అందించడం. రెండోది మీ ఓటర్ ఐడీ సంఖ్య ద్వారా… మూడోది మొబైల్ నెంబరు ద్వారా (ఓటరు ఐడీకి మొబైల్ ఫోన్ నెంబరు అనుసంధానం చేసి ఉంటేనే) వివరాలిచ్చి ఇలా…. ఓటర్ ఐడీలో ఉన్నట్టుగానే మీ పేరును టైప్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంటిపేరైనా ఇవ్వవచ్చు. లేదంటే… ఓటరు ఐడీలో మీరు ఇచ్చి తల్లి/తండ్రి లేదా ఇతర బంధువు పేరు వివరాలు ఇచ్చి కూడా వెతకవచ్చు. నమోదు చేసుకున్న పుట్టినరోజు లేదా మీ వయసు వివరాలు ఇచ్చి కూడా జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఇవేవీ లేకుంటే స్త్రీ, పురుషుడు లేదా థర్డ్ జెండర్ అన్న వివరాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు కానీ… కొంచెం వ్యయ ప్రయాసతో కూడుకున్న పని. చివరగా.. మీ జిల్లా, మీ నియోజకవర్గం వివరాలు ఇవ్వడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. పేజీ చివర ఉన్న Captcha Code బాక్స్లోఉన్న అక్షరాలు లేదా అంకెలను రాసి సెర్చ్ బటన్ నొక్కితే మీ వివరాలు కనిపిస్తాయి. నోట్: పేర్లు, ఇతర వివరాలు టైప్ చేసేటప్పుడు పెద్ద, చిన్న అక్షరాలు, పదాల మధ్య ఖాళీలు సరిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పేజీ పై భాగంలోనే మీ రాష్ట్రాన్ని ఎంపిక చేయడం మరచిపోవద్దు. అలాగే తెలుగుతోపాటు దాదాపు 11 భారతీయ భాషల్లో సమాచారాన్ని వెతకవచ్చునని గుర్తించండి. ఓటర్ ఐడీ ద్వారా… మీ ఓటర్ ఐడీలోని సంఖ్య ద్వారా జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం చాలా సులువు. పైన కనిపిస్తున్న మాదిరిగా ఉంటుంది వెబ్సైట్లోని స్క్రీన్. ఒక పక్కన ఓటర్ ఐడీ సంఖ్యను ఎంటర్ చేయాలి. రెండోవైపున ఉన్న కాలమ్ నుంచి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత Captcha Code ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సరి. మొబైల్ ఫోన్ ద్వారా… రాష్ట్రం, భాషలను ఎంచుకున్న తరువాత స్క్రీన్ మధ్యలో ఉన్న కాలమ్లో ఓటర్ ఐడీకి అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబరును ఎంటర్ చేయాలి. ఎన్నికల కమిషన్ పంపే ఓటీపీని దిగువనే ఉన్న కాలమ్లో టైప్ చేసి Captcha Code కూడా ఎంటర్ చేయాలి. దీని తరువాత సెర్చ్ కొడితే మీ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఓటర్ ఐడీ డౌన్లోడ్ చేసుకోవాలంటే… ముందుగా https://voterportal.eci.gov.in కు వెళ్లండి. సర్వీసెస్ భాగంలో దిగువన ‘ఈ-ఎపిక్ డౌన్లోడ్’ అని ఉన్న కాలమ్పై క్లిక్ చేయండి. ఇలా ఒక స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది. భారతీయ ఓటరు లేదా విదేశాల్లో ఉన్న ఓటర్లు తమకు సంబంధించిన కాలమ్స్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. రిజస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపిని ఎంటర్ చేసి ఓటర్ ఐడీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయాలో తెలుసుకోవాలంటే… హోమ్ పేజీలో సర్వీసెస్ భాగంలో ‘నో యువర్ పోలింగ్ స్టేషన్ అండ్ ఆఫీసర్’ అన్న కాలమ్ను క్లిక్ చేయండి. ఓటర్ ఐడీ సంఖ్య, Captcha Code లు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. చివరగా… ఓటర్ ఐడీలో మీ వివరాలు మార్చుకోవాలనుకుంటే https://voterportal.eci.gov.in హోమ్ పేజీలోనే ఫామ్స్ అన్న భాగంలో అవసరమైన పత్రాలు ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి మార్పులు చేర్పులు, అభ్యంతరాలు, తొలగింపుల వంటివి చేయవచ్చు. -
డబ్బే.. డబ్బు
వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి రూ.1,11,96,570 నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధితోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఒక్కరోజే మహబూబ్నగర్ జిల్లాలో రూ.99,61,370 నగదు సీజ్ చేశారు. ఇందులో మహబూబ్నగర్ వన్టౌన్ సీఐ సైదులు ఆధ్వర్యంలో క్లాక్టవర్ ఏరియాలో తనిఖీలు జరపగా ద్విచక్రవాహనంపై బ్యాగ్లో ఉదయ్కుమార్, రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు రూ.28,73,000 తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు. అలాగే రూరల్ సర్కిల్ పరిధిలో మొత్తం రూ.18,26,670, చిన్నచింతకుంట పోలీసులు లాల్కోట చౌరస్తాలో రూ.35,49,900, దేవరకద్ర పోలీసులు రూ.17,11,800 నగదు స్వాధీనం చేసుకుని కమిటీకి అప్పగించనున్నారు. అలాగే టూటౌన్ సీఐ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సంజయ్నగర్, కొత్త చెరువు రోడ్, హనుమాన్నగర్ ఏరియాల్లో బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురి ఇళ్లలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తుండగా 60 లీటర్ల లిక్కర్ సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూరులోని ఓ సినిమా థియేటర్ దగ్గర కారును తనిఖీ చేయగా దామరగిద్ద మండలాలనికి చెందిన అయ్యవారిపల్లి బాల్రెడ్డి, దూదేపల్లికి చెందిన వ్యక్తి వాహనంలో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కమిటీకి అప్పగిస్తామని కోస్గి సీఐ జనార్దన్ తెలిపారు. మరికల్లోని ఆత్మకూర్ ఎక్స్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మహబూబ్నగర్ నుంచి నర్వ వెళ్తున్న వెంకటరాజు కారులో రూ.3 లక్షలు, దేవరకద్ర నుంచి రాయిచూర్ వెళ్తున్న శ్రీశైలం కారులో రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. అలాగే ఎలిగండ్లకు చెందిన శేఖర్గౌడ్ రూ.19 వేల విలువ గల మద్యం ఆటోలో తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశామన్నారు. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో దాసుపల్లికి చెందిన జంగిరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వస్రుంనాయక్ తలిపారు. ఇందుకు సంబంధించి పత్రాలు చూపించి తీసుకెళ్లాలని సూచించామని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.1.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రక్షితాకె.మూర్తి తెలిపారు. అలాగే ఆత్మకూరు, రేవల్లి, పెబ్బేరు, గోపాల్పేట, వనపర్తి టౌన్ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలో నిల్వ చేసిన 191 లీటర్ల మద్యంను సీజ్ చేశామన్నారు. శ్రీరంగాపురం మండలంలోని నాగరాలలో బెల్టు షాపుపై దాడి చేసి 11 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటస్వామి చెప్పారు. మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ పర్వతాలు మండలంలోని చందాపూర్ శివారులో వాహనాల తనిఖీ చేపట్టగా రవికుమార్ అనే వ్యక్తి కారులో రూ.2 లక్షలు, ఎదిర కిరణ్కుమార్కు చెందిన కారులో రూ.1.29 లక్షలు పట్టుకున్నట్లు చెప్పారు. దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి చెక్పోస్టు దగ్గర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా మోదేపల్లికి చెందిన వ్యాపారి రంజిత్కుమార్ నుంచి రూ.1.57 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు చెప్పారు. అలాగే మరికల్కు చెందిన వ్యాపారి రాజు నుంచి రూ.1.85 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఎన్నికల కోడ్తో.. సొంతడబ్బు అయినా లెక్క చూపాల్సిందే! లేకుంటే జప్తే!
ఆదిలాబాద్: రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా పెద్ద మొత్తంలో నగదుతో బయటకు వెళ్లినా ప్రయాణాలు చేసినా తస్మత్ జాగ్రత్త.. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధిక మొత్తంలో డబ్బులతో పోలీసులకు దొరికితే జప్తు.. లేదా పేకాట పేరుతో కేసులు నమోదు చేయనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో పెద్దమొత్తంలో డబ్బు, మద్యం, ఆయుధాలు అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అంతర్జిల్లా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిరంతరం వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. ఆధారాలు లేకుంటే జప్తే.. ఎన్నికల సమయంలో నగదు, బంగారం, మద్యం పెద్ద మొత్తంలో తీసుకెళ్లకూడదు. సొంతడబ్బు అయినా లెక్క చూపాల్సిందే. రూ.50 వేలకు పైగా డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తే వాటికి తగిన ఆధారాలు చూపించాలి. లేదంటే జప్తు చేయక తప్పదు. ఎక్కువ మాట్లాడితే పేకాట పేరుతో కేసులు నమోదు చేయడం ఖాయం. రికవరీ ఏజెంట్లు.. ఏదైనా సంస్థలో రికవరీ ఏజెంట్లుగా పనిచేసేవారైతే పనిచేస్తున్న కంపనీ గుర్తింపుకార్డు, కలెక్షన్ చేయాల్సిన బాధితుడి పేరు, సెల్నంబర్తో కూడిన లిస్టు, ఆరోజు ఎవరెవరు ఎంత కలెక్షన్ ఇచ్చారో వారి సంతకంతో కూడిన వివరాలు అధికారులకు చూపించాలి. అప్పుగా తీసుకుంటే.. అవసరం నిమిత్తం ఎవరి వద్దనైనా అప్పుగా తీసుకుని వెళ్తుండగా పోలీసులకు పట్టుబడితే ఎవరివద్ద తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? తదితర వివరాలతో పాటు ప్రామిసరీ నోటు వెంట ఉంచుకోవాలి. ఒకవేళ ఆస్పత్రి బిల్లులు కట్టాల్సివస్తే పేషెంట్ పేరు, ఆస్పత్రికి సంబంధించిన బిల్లులు వెంట ఉంచుకోవాలి. నిబంధనలు తప్పనిసరి.. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 69–ఏ ప్రకారం ఎవరైనా తమవద్ద ఉన్న డబ్బు, బంగారం, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఒకచోట నుంచి మరోచోటుకు తరలించే ముందు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఆధారాలు లేకుంటే అంతే.. రానున్న సాధారణ ఎన్నికల దృశ్యా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి సమయంలో పెద్దమొత్తంలో నగదు పట్టుబడితే తగిన ఆధారాలు చూపించని పక్షంలో డబ్బు జప్తు చేయబడుతుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించి డబ్బు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటారు. ఆధారాలు చూపించకుంటే వాటిని ఆదాయపుపన్ను శాఖ ఖాతాలో వేస్తారు. అక్కడి నుంచి డబ్బు పొందాలంటే చుక్కలు లెక్క పెట్టాల్సిందే. లేదంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆధారాలు సరిగా లేకపోతే 30 శాతం పన్నుకింద తీసుకుని మిగతా డబ్బులు ఇస్తారు. ఈ నిబంధనలు తెలియక చాలామంది పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తూ చెక్పోస్టుల వద్ద పట్టుబడుతుంటారు. బ్యాంకు నుంచి విత్డ్రా చేస్తే.. బ్యాంకు నుంచి రూ.50 వేలకంటే ఎక్కువగా విత్డ్రా చేస్తే ఆధారాలు అవసరం. బ్యాంకు అధికారి ఇచ్చిన ఓచర్ స్లిప్ విధిగా వెంట ఉంచుకోవాలి. సెల్ఫ్ చెక్ ద్వారా అయితే సంబంధిత చెక్ జిరాక్స్ కాపీ, ఏటీఎం ద్వారా డ్రా చేస్తే మిషన్ ద్వారా వచ్చిన స్లిప్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటే వ్యక్తిగత డిక్లరేషన్, బ్యాంకు పాస్బుక్ వెంట ఉంచుకోవాలి. -
అధికారుల వింత రూల్స్.. బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్ల చెకింగ్.. ఎందుకంటే..?
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ఏ వింతైన నిబంధనను తీసుకువచ్చింది. ఇకపై బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ల ఫోన్లను కూడా తనిఖీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. చెకింగ్ అధికారుల రూట్ వివరాలను బస్సు డ్రైవర్లు తమ సహోద్యోగులకు చేరవేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. చెకింగ్ అధికారుల రూట్కు అనుగుణంగా ఇతర రూట్లలోని ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారని తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. సంస్థ ప్రయోజనాల కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారులు బస్సుల్లో చెకింగ్ చేసే సమయంలో మొదట బస్సు డ్రైవర్, కండక్టర్ ఫోన్లను చెక్ చేస్తారని మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ గార్గ్ తెలిపారు. చెకింగ్ సమయంలో డ్రైవర్, కండక్టర్ సహోద్యోగులకు సంబంధిత వివరాలను పంపినట్లు తేలితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని కనుగొన్నట్లు వ్లెడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి దయా శంకర్ సింగ్ కూడా ఈ నిబంధనలపై స్పందించారు. ఉద్యోగులందరూ ఈ నియమాలను పాటించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే విధుల నుంచి తప్పిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్ను వాడడం తమ వ్యక్తిగత హక్కు అని చెబుతున్నాయి. వ్యక్తిగత వివరాలు సెల్ఫోన్లో భద్రపరుచుకుంటామని వెల్లడించాయి. చెకింగ్ల పేరిట తమ వ్యక్తిగత హక్కుకు భంగం వాటిల్లుతుందని తెలిపాయి. ఈ నిబంధనల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించాయి. ఇదీ చదవండి: పండుగ సెలవుల్లో విషాదం: రెస్టారెంట్లో పేలిన సిలిండర్.. 31 మంది దుర్మరణం -
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్: 17 గంటలు పరిశీలన.. 26 దాకా ఉత్కంఠ
సాక్షి, జగిత్యాల: తాళాలు మిస్సింగ్ లాంటి అనేక మలుపుల మధ్య సాగిన ధర్మపురి స్ట్రాంగ్ రూం ఎపిసోడ్ ఓ కొలిక్కికి వచ్చింది. నాలుగున్నరేండ్ల గది తెరిచిన అధికారులు.. సుమారు 17 గంటలపాటు స్ట్రాంగ్ రూమ్ డాక్యుమెంట్స్ను పరిశీలించారు. హైకోర్ట్ ఆదేశాలతో నిన్న (ఏప్రిల్ 23 ఆదివారం) ఉదయం 11 గంటలకు తాళాలు పగులగొట్టి స్ట్రాంగ్ రూమ్ తెరవగా.. ఇవాళ(సోమవారం) ఉదయం 4 గంటల 50 నిమిషాలకు డాక్యుమెంట్ల పరిశీలన ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ను జిల్లా అధికారులు పరిశీలించారు. సేకరించిన డాక్యుమెంట్స్ ను నివేదిక రూపంలో ఈనెల 26 లోపు హైకోర్టుకు సమర్పించనున్నారు జగిత్యాల జిల్లా అధికారులు. డాక్యుమెంట్ల పరిశీలన ముగింపుతో హైడ్రామాకు తెర పడగా హైకోర్ట్ తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అడ్లూరి అభ్యంతరాలు.. 👉హై కోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల అధికారుల పర్యవేక్షణ లో 17A మరియు 17 c కి సంబందించిన డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది 👉కౌంటింగ్ సమయంలో రికార్డ్ చేసిన విడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ లేవు అని అధికారులు చెప్పడం జరిగింది. 👉ఎలక్షన్ పోలింగ్ అయిన తరువాత ఈవీఎంలను ప్రభుత్వం నోటిఫైడ్ చేసిన ప్రాంతంలో ఉంచాలి. కానీ, ధర్మపురి జూనియర్ కాలేజి లో ఈవీఎంలను ఉంచడం జరిగింది. అది ప్రభుత్వం నోటిఫైడ్ చెయ్యని ప్రాంతం!. 👉పోలింగ్ అయిన దగ్గర నుండి ఈవీఎంలను భద్రపరిచే వరకు అధికారులు ఎక్కడ నిబంధనలు పాటించలేదు.. 👉 నాలుగున్నర సంత్సరాలుగా స్ట్రాంగ్ రూం తాళాలు మిస్సింగ్ అయిన పరిస్థితి లోపల కోర్టు ఆదేశాల ప్రకారం తాళాలు పగలగొట్టి స్ట్రాంగ్ రూం ఓపెన్ చేస్తే పోలింగ్ కి సంబంధించిన పత్రలు సీల్ లేకుండా, ఒక క్రమ పద్దతిలో లేకుండా ఉన్నాయి. 👉209 కి సంబంధించిన పోలింగ్ బూత్ కి సంబందించిన 17C డాక్యుమెంట్స్ కి సీల్ వేసి లేదు. 👉ఒక క్యాబినెట్ మంత్రి కి సంబంధించిన ఎన్నికల పోలింగ్ లో ఇన్ని అవకతవకలు జరిగాయి అయినప్పటికీ మేము కోరెది రికౌంటిన్ మాత్రమే.. 👉స్ట్రాంగ్ రూం తాళాలు పోయాయి అని అధికారికంగా ప్రకటించారు.దానికి కారణం అయిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,వారి పైన క్రిమినల్ కేసు ఫైల్ చెయ్యాలి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. 👉అదే విధంగా 17c కి సంబంధించిన ఈవీఎంలను మళ్ళీ లెక్కించాలి.. 👉ఇదంతా మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్రరపూరితంగ చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. 👉దీనిపై హైకోర్టు కి మా అడ్వకేట్ ద్వారా విన్నవిస్తం. మరోవైపు కోర్ట్ ఆదేశాల మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతోందని, నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు వెల్లడించిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రతినిధులు. ► గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ► కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10న స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసి 17ఏ, 17సీ డాక్యుమెంట్లు, సీసీటీవీ ఫుటేజీలు, సంబంధిత డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉండగా, స్ట్రాంగ్ రూం నంబర్ 786051 నంబర్ తాళాలు మిస్ అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ► సుమారు ఐదు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో తాళాన్ని బ్రేక్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించగా, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఢిల్లీ నుంచి త్రీమెన్ కమిటీ సభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీలను సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ► దీంతో రంగంలోకి దిగిన త్రీమెన్ కమిటీ సభ్యులు ఈ నెల 17న కొండగట్టులోని జేఎన్టీయూలో గతంలో కలెక్టర్లుగా పనిచేసిన శరత్, రవితో పాటు అడిషనల్ కలెక్టర్లు రాజేశం, అరుణశ్రీ, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతిలను ఎంక్వయిరీ చేశారు. ఆ ఎంక్వయిరీకి సంబంధించిన వివరాలను వారు కోర్టుకు నివేదించారు. ► దీంతో ఈ నెల 23న ధర్మపురి స్ట్రాంగ్ రూం లాక్ పగలగొట్టాలని లేదా టెక్నీషియన్ తో తీయాలని, ప్రతి ఘటనను కెమెరాలో రికార్డు చేయాలని కోర్టు సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 26న కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ► అయితే, ఈ కేసు రెండున్నరేళ్ల పాటు పెండింగ్ లో ఉండగా, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతి కోర్టుకు హాజరుకాకపోవడం.. అరెస్ట్ వారంట్ రావడంతో మళ్లీ కొంత పురోగతి కనిపించింది. ► కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా నూకపల్లిలో వీఆర్కే కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ను ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు లాక్ పగలగొట్టి ఓపెన్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, సీసీటీవీ ఫుటేజీలకు చెందిన జిరాక్స్ లను అటెస్ట్ చేసి వాటిని ఈ నెల 26న అధికారులు కోర్టుకు అందజేయనున్నారు. -
Viral Video: బ్రేక్ టెస్టింగ్ చేసిన బస్సు
-
Hyderabad: గన్ చూపించి కారును ఆపిన ఎస్సై.. అవాక్కైన వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: మీర్చౌక్ ఏసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పాతబస్తీ ఎతేబార్చౌక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు ఓపెన్ టాప్ కారులో ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ అడ్డుకుని దానిని ఆపడానికి కారు ముందుకు వెళ్లాడు. దీనిని గమనించిన విధి నిర్వహణలో మీర్చౌక్ ఎస్సై వెంటనే స్పందించి తన పౌచ్లో ఉన్న గన్ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు. దీంతో ఎస్సై చేతిలో గన్ను చూసిన కారులోని యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎస్సై ఆవేశంతో ఆగ్రహంగా గన్తో యువకుల వద్దకు చేరుకోవడాన్ని చూసిన వాహనదారులు కొద్దిసేపు నిర్ఘాంత పోయారు. దీంతో సదరు యువకులు కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించారు. డిక్కీతో పాటు వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాతబస్తీలో ఓ ఎస్సై గన్ చూపించి సినిమా ఫక్కీలో హల్చల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాతబస్తీలో ఇప్పటి వరకు ఓ ఎస్సై గన్ చూపించి తనిఖీలు నిర్వహించిన సందర్భం, సంఘటనలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ శబ్ధ కాలుష్యానికి పాల్పడిన వాహన యజమానికి మీర్చౌక్ పోలీసులు ఫైన్ విధించి పంపించారు. How can SI take out his service revolver gun to stop vehicle during cheking in mirchowk old city ? @CPHydCity @DCPSZHyd sir kindly take action on this... On small small issues a police officer can't take out his firearm @TelanganaDGP pic.twitter.com/SPWBZKphTk — Mohammed Inayath ulla sharief (@InayathShafi) December 27, 2022 చేతిలో వెపన్ తప్పులేదు: డీసీపీ సాయి చైతన్య వాస్తవానికి అర్ధరాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించేటప్పుడు చేతిలో వెపన్లతో సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఎస్సై స్థాయి అధికారి వాహనాల తనిఖీల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ వెపన్ చేతిలోనే ఉంటుందన్నారు. (క్లిక్ చేయండి: కేసీఆర్ ఫాంహౌస్ సినిమా అట్టర్ఫ్లాప్) -
ప్రయాణికుడి బ్యాగ్లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్పోర్ట్ క్లోజ్
సాధారణంగా విమానంలో ఏ ప్రయాణికుడి వద్దనైన విమానాశ్రయానికి తీసుకురాని వస్తువులు దొరికితే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుంది. అంతేగానీ ఎయిర్ పోర్ట్ని క్లోజ్ చేయరు. కానీ ఇక్కడొక ప్రయాణకుడి లగేజ్ బ్యాగ్లో అనుమానాస్పద వస్తువు కారణంగా....మొత్తం ఎయిర్పోర్ట్నే క్లోజ్ చేశారు. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి బ్యాగ్లో అనుమానాస్పద ప్యాకేజీ కనిపించింది. దీంతో వందలాదిమంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చెకింగ్ డెస్క్ వద్ద క్యూలో నిలబడి ఉన్నారు. దీంతో విమానాల్లో వెళ్లాల్సిన మరికొంతమంది ప్రయాణికులు కార్ పార్కింగ్లోనే నిలబడిపోయి ఉండాల్సి వచ్చింది. విమానాశ్రయంలో సిబ్బంది లగేజీలపై దర్యాప్తు చేస్తున్నందున ఆలస్యమవుతుందని ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. ఐతే ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువు కారణంగానే.. సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఎయిర్పోర్ట్కి చేరుకోవడంతో మరింతమంది ప్రయాణికులు క్యూలో పడిగాపులు పడాల్సి వచ్చింది. మరోవైపు విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణకుల రద్దీ ఎక్కువ అవ్వడంతో తనిఖీలు చేయడం మరింత ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తాము ముందు జాగ్రత్తగా టెర్మినల్ భవనాన్ని మూసివేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతేగానీ ఎయిర్పోర్ట్ని మొత్తం ఖాళీ చేయించలేదని చెప్పారు. (చదవండి: కరోనా విషయమై అగ్రరాజ్యం గుట్టు బట్టబయలు..వెలుగులోకి షాకింగ్ నిజాలు) -
చికెన్లో గన్.. ఎయిర్పోర్ట్ అధికారులు షాక్!
ఇంతవరకు కొంతమంది నేరస్తులు రకరకాల మార్గాల్లో ఆయుధాలను, బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కంటపడకుండా తరలిస్తుంటారని తెలుసు. కొంతమంది విగ్గుల్లోనూ, షూ, పెన్ వంటి విచిత్రమైన ప్రదేశాల్లో చాలా గమ్మత్తుగా బంగారాన్ని తరలించడం చూశాం. అలాగే ఆయుధాలను కూడా చాలా వెరైటీగా తరలిస్తుంటారు. ఐతే ఇక్కడొక వ్యక్తి వారందరికంటే భిన్నంగా ఆయుధాన్ని తరలించే యత్నం చేసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...యూఎస్లోని ఒక వ్యక్తి చికెన్లో గన్ని స్టఫ్ చేసి చక్కగా ప్యాకింగ్ చేసుకుని ఫ్లోరిడాలో లాడర్డేల్ హాలీవుడ్ విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడ అందరీ ప్రయాణికులను తనిఖీ చేసినట్లుగానే ఇతన్ని తనిఖీ చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. అతని వద్ద ఉన్న ప్యాకింగ్ చికెన్ని చూసి కాస్త ఆశ్చర్యంతోపాటు సందేహం కూడా వచ్చింది అధికారులకు. దీంతో ఆ ప్యాకింగ్ కవర్ని ఓపెన్ చూసి పరిశీలించగా...ఆ చికెన్ లోపల గన్ని కుక్కి ఉంచాడాన్ని చూసి ఒక్కసారిగా అధికారులు షాక్కి గురయ్యారు. ఇంతవరకు తాము వివిధ రకాల్లో ఆయుధాలను తరలించడం చూశాం గానీ ఇలా ఇంత వింతగా తరలించేందుకు యత్నించడం చూసి ఆశ్చర్యపోయాం అన్నారు. దీంతో సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు ఎయిర్పోర్ట్ పోలీసులు. వాస్తవానికి యూఎస్ ఎయిర్లైన్స్లో తుపాకీలను నిషేధించ లేదు. కానీ ప్రయాణికులు వాటిని తీసుకుని వెళ్లేటప్పుడూ..తనిఖీ చేసే సామానుల్లోనే తీసుకువెళ్లాలి. పైగా ఆ తుపాకీలను అన్లోడ్ చేసి హార్డ్ కంటైనర్లో లాక్ చేసి పట్టుకెళ్లాలి. ఇలా అక్రమ మార్గంలో తరలించేందుకు యత్నిస్తే మాత్రం పోలీసులు కచ్చితంగా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. There’s a personal fowl here. Our officers @FLLFlyer made this very raw find. We hate to break it to you but stuffing a firearm in your holiday bird for travel is just a baste of time. So, don’t wing it, you'll find all the proper packaging info here: https://t.co/Zm2XnorDx7 pic.twitter.com/BpdbEwwouX — TSA (@TSA) November 7, 2022 (చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
పగలూ రాత్రీ బాదేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: పోలీసు పనితీరుకు ప్రామాణికమంటూ డీజీపీ కార్యాలయం అమలులోకి తీసుకువచ్చిన వర్టికల్స్ విధానం అటు పోలీసులు, ఇటు నగర వాసులకు నరకం చూపిస్తోంది. ఇందులో నిర్దేశించిన మేరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా రోడ్డున పడుతున్నారు. అదేమంటే రోడ్డు ప్రమాదాల నిరోధం కోసమే ఇవన్నీ చేస్తున్నామని చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే. డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడం తప్ప ఆశించిన స్థాయిలో రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు. పనితీరు మదింపు... శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ వింగ్ సహా ప్రత్యేక విభాగాలను పని తీరును మథించడానికి డీజీపీ కార్యాలయం వర్టికల్స్ విధానాన్ని రూపొందించింది. బీటు కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు ఎవరెవరు, ఏ రకమైన విధులు నిర్వర్తించాలనేది నిర్దేశించింది. వీటిని వీళ్లు ఎంత సమర్థంగా వ్యవహరిస్తున్నారన్నది గుర్తించడానికంటూ వర్టికల్స్ విధానం అమలులోకి తీసుకువచ్చారు. ప్రతి నెలా ఆయా అధికారులు తమ పని తీరును ఈ వర్టికల్స్లో నిర్దేశించిన విధంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే డీజీపీ కార్యాలయం ర్యాంకింగ్స్ ఇస్తూ ఉత్తమ అధికారులను గుర్తిస్తోంది. డీడీ తనిఖీలను చేర్చి.. సీసీఎస్, టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ వంటి ప్రత్యేక విభాగాలకు సైతం కొన్ని అంశాలను నిర్దేశించారు. ట్రాఫిక్ పోలీసుల విషయానికి వచ్చేసరికే అసలు సమస్య వచ్చిపడుతోంది. వీళ్లు నిర్వర్తించే ప్రతి పనీ నేరుగా నగర వాసులు ఇంకా పక్కాగా చెప్పాలంటే వాహన చోదకులతో ముడిపడి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుల పనితీరును గుర్తించే వర్టికల్స్లో పెండింగ్ ఈ–చలాన్ల వసూలుతో పాటు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలను డీజీపీ కార్యాలయం చేర్చింది. ఒక్కో పోలీసుస్టేషన్ ఒక నెలలో ఏ తరహావి, ఎన్ని కేసులు నమోదు చేస్తోందనేది గణిస్తోంది. ఆ ప్రాంతాలు, సమయాల్లో చేస్తే ఒకే... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు గడిచిన కొన్నాళ్లుగా ప్రతి రోడ్డు ప్రమాదాన్నీ అధ్యయనం చేస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో, ఏయే సమయాల్లో, ఏ కారణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశంపై నివేదికలు రూపొందించారు. వీటి ఆధారంగా డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో, ఆ సమయాల్లో ఈ తనిఖీలు నిర్వహించేలా చేస్తే సరిపోతుంది. అలా కాకుండా అనునిత్యం రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వీటిని నిర్వహిస్తుండటంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి పరిస్థితులను మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి.. ట్రాఫిక్ విభాగం అధికారులు వర్టికల్స్ను అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పగలు–రాత్రి తేడా లేకుండా రోడ్లపై డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలన్నీ ప్రధాన రహదారులపై జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. మరోపక్క అసలే అరకొర సిబ్బందితో ఉన్న ట్రాఫిక్ ఠాణాలకు ఈ తనిఖీలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రాత్రి వేళల్లో డ్రంక్ డ్రైవింగ్ చేసిన వాళ్లూ ఉదయం డ్యూటీకి రావాల్సి రావడం.. ఒక్కోసారి మళ్లీ పగటిపూట కూడా ఈ తనిఖీలు చేయాల్సి వస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. పని భారం తప్పించాలంటూ ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. (చదవండి: వాహనదారులకు అలర్ట్ ఈ రూట్స్లో వెళ్లకండి.. ట్రాఫిక్ మళ్లింపులు కలవు) -
సకాలంలో భూముల రీ–సర్వే : కలెక్టర్
కశింకోట: సమగ్ర భూముల రీ–సర్వే సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ రవి పఠాన్శెట్టి ఆదేశించారు. కశింకోట పొలాల్లో సర్వే, రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న భూముల రీ–సర్వేను శుక్రవారం ఆయన అకస్మాత్తుగా పరిశీలించారు. రీ–సర్వే పూర్తి చేయడానికి ఆగస్టు నెలాఖరు వరకు సమయముందని, ఈలోగా నిబంధనలకు లోబడి సర్వే పూర్తి చేయాలన్నారు. అనంతరం బయ్యవరం సచివాలయాన్ని సందర్శించి పనితీరును పరిశీలించారు. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ నెల రోజులపాటు సెలవులో ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఎవరినైనా తాత్కాలికంగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో చిన్నోడు, తహసీల్దార్ బి.సుధాకర్, ఈవోఆర్డీ ధర్మారావు, ఆర్ఐ కిషోర్ కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు. (చదవండి: టీవీ రిపోర్టర్నంటూ మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి..) -
తనిఖీలు నిల్లు.. నిబంధనలకు నీళ్లు!
సాక్షి హైదరాబాద్: పారిశ్రామిక వాడల్లో అపరిమిత కాలుష్యం వెదజల్లుతున్నవి, నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీల భరతం పట్టే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) టాస్క్ఫోర్స్ బృందాలు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. మహా నగరానికి ఆనుకొని ఉన్న పది పారిశ్రామిక వాడల్లో ఆల్ఫాజోలం వంటి నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తరచూ ఆనవాళ్లు బయటపడడంతో పాటు పలు పారిశ్రామిక వాడల్లోని కంపెనీలు భరించలేని ద్రవ, ఘన, వాయు కాలుష్యం వెదజల్లుతున్నా.. టాస్క్ఫోర్స్ బృందాలు చోద్యం చూస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుట్టుగా కార్యకలాపాలు.. నగరంలో పదికిపైగానే పారిశ్రామికవాడలున్నాయి. ఆయా వాడల్లో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు కొలువుదీరాయి. వీటిలో బల్క్డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఏం ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమల ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా ఉండదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపలేం జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతుండడం గమనార్హం. నిబంధనలివీ.. వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రె డ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమ లు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా సు మారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టూపక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్వో) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. ∙దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందాలి. నిత్యం వెలువడుతున్న వ్యర్థ జలాల, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన కాగితాలకే పరిమితమవుతుండడం గమనార్హం. ఇలాంటి కంపెనీలపై టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు చేసి కట్టడి చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. -
వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఓ అనుమానితుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి ఫోన్లోని వాట్సాప్ను పరిశీలిస్తున్న వీడియో రెండు రోజులుగా వైరల్గా మారింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భగ్నమంటూ వాట్సాప్లో కామెంట్లు వచ్చాయి. దీనిపై నగర కొత్వాల్ అంజనీకుమార్ గురువారం స్పందించారు. అనుమానితులను పట్టుకున్నప్పుడు ఆద్యంతం సోదా చేయడం తమ విధుల్లో భాగమని పేర్కొన్నారు. అలా చేయని కారణంగానే ఇటీవల నార్త్జోన్ పరిధికి చెందిన ఓ కానిస్టేబుల్పై నిందితుడు జేబులోని కత్తితో దాడి చేశాడని వివరించారు. చదవండి: వాట్సాప్ గ్రూప్లో గంజాయి ఆర్డర్ మరోపక్క అనుమానితులు, నిందితుల మధ్య సంబంధాలు కనిపెట్టడానికి వాట్సాప్ తదితరాల తనిఖీ తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నప్పటికీ.. మనమంతా వాట్సాప్ యూనివర్సిటీలో విద్యార్థులుగా మారిపోయామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మవద్దని, వాట్సాప్లో వచ్చే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. Sir @TelanganaDGP @CPHydCity is this permissible under any law? to stop and check people, their Mobile Phone, chatting, pockets and etc?. Can you do this at Banjara Hills or Hi tech City areas?. This is clear harassment to common and illiterate people. pic.twitter.com/vej4Csxqdm — S.Q.Masood | مسعود (@SQMasood) October 28, 2021 32 కేసులు.. 60 మంది అరెస్టు ఈ నెల 19 నుంచి గురువారం వరకు గంజాయి దందాకు సంబంధించి సిటీలో మొత్తం 26 కేసులు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. దీంతో పాటు ఇతర మాదకద్రవ్యాలతో కలిపి 32 కేసుల్లో 60 మందిని అరెస్టు చేశామన్నారు. గంజాయి కేసుల్లో 389 కేజీలు స్వా«దీనం చేసుకున్నామని, చిక్కిన వారిలో ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు ఏపీకి చెందిన వారూ ఉన్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఈ ఏడాది మొత్తం 114 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని, వీరిలో 31 మంది గంజాయి, డ్రగ్స్ కేసులకు సంబంధించిన వారన్నారు. మరో 21 మందిపై త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. -
జగనన్న కాలనీలను పరిశీలించిన ఎంపీ మిథున్ రెడ్డి
-
శంషాబాద్లో రవాణాశాఖా తనిఖీలు.. 11 విదేశీ కార్లు సీజ్
హైదరాబాద్: శంషాబాద్ శివారులో రవాణాశాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో, విదేశాలకు చెందిన 15 వాహనాలపై రవాణాశాఖా అధికారులు కేసులను నమోదు చేశారు. కాగా, వీరు తెలంగాణ స్టేట్ రోడ్ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికి 11 కార్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ బడాబాబుల నుంచి రూ. 5 కోట్లను జరిమాన రూపంలో వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల బాగోతం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖ కమిషన్ చేపట్టిన పాఠశాలల తనిఖీల్లో జూనియర్ కాలేజీలు నారాయణ, శ్రీ చైతన్యల అధిక ఫీజుల వసూళ్ల బాగోతం బట్టబయలైంది. రాష్ట్రంలోని పలు పాఠశాలపై విద్యాశాఖ కమిషన్ నాలుగు బృందాలు బుధవారం తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రొఫెసర్ నారాయణరెడ్డి, డాక్టర్ ఈశ్వరయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పాఠశాలల యాజమాన్యాలపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ సంక్రాంతికి 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయల వరకు ఫీజులు కట్టించుకున్నారంటూ విద్యార్థులు అధికారులతో ఎదుట వాపోయారు. టాయిలెట్లలో కనీస సౌకర్యాలు లేవని, ప్రతి ఏడుగురికి ఒక బాత్రూమ్ కేటాయించారని తెలిపారు. ఇంటర్ మొదటి ఏడాదికి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇక గూడవల్లి శ్రీ చైతన్య కళాశాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కనీస వసతులు కూడా లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. తాగునీరు, బాత్రూమ్ కుళాయిలు లేకపోవటంతో కమిషన్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నారాయణ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని, జీవో 51ని కూడా యాజమాన్యం అమలు చేయడం లేదని వెల్లడించారు. నారాయణ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని కమిషన్ సభ్యులు సీఏవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంతేగాక కాలేజీల్లో సామాజిక దూరం అమలు చేయడం లేదని, కనీసం శానిటైజర్లు కూడా అందుబాటు ఉంచలేదన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారని మండిపడ్డారు. సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మౌలిక వసతులు కూడా సరిగా లేని కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కళాశాలలు ఉల్లంఘించాయన్న ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. -
భార్యను బస్సెక్కించి..
సాక్షి, శంషాబాద్: ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న తనిఖీలు ఓ జంటకు గొంతులో పచ్చిఎలక్కాయపడినట్లైంది. ఆదివారం ఓ జంట బైక్పై షాద్నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతుండటాన్ని చూశారు. భర్తకు హెల్మెట్ ఉంది కానీ, భార్యకు లేదు. దీంతో ఆ జంట ముందుకు పోలేక..వెనక్కి వెళ్లలేక ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భర్త తన భార్యను బస్సెక్కించాడు. ఐడియా బాగానే ఉన్నా...కాస్త ఇక్కట్ల పాలయ్యేలా చేసింది. శంషాబాద్లో బస్సు దిగాల్సిన భార్య అక్కడ దిగకుండా సాతంరాయి వద్ద బస్సు దిగింది. అక్కడ నుంచి తిరిగి శంషాబాద్ రావడానికి ఆటో ఎక్కగా ఆటోవాలా కాస్త ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్టులో దించేశాడు. ఎయిర్పోర్టులో దిగిన సదరు మహిళ తాను తప్పిపోయానని తెలుసుకుని ఏడుస్తుండటంతో ఆమెను గమనించిన పోలీసులు షీ టీమ్కు అప్పగించగా.. వారు పూర్తి వివరాలు తెలుసుకుని ఆమెను భర్తకు అప్పగించారు. -
నిజామాబాద్లో వాహనాలను తనిఖీ చేసిన సీపీ కార్తికేయ
-
అనంతపురం: కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్
కరువుకు నిలయం అనంత. ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంతే. అందుకే బడుగుబలహీన వర్గాల పిల్లలకు సంక్షేమ హాస్టళ్లే దిక్కు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం.. వసతుల లేమి విద్యార్థులకు ప్రత్యక్ష నరకంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆ మేరకు తనదైన శైలిలో చర్యలకు ఉపక్రమించారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ.. అక్కడే రాత్రి బస చేస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంపై కన్నెర్ర చేస్తూ.. మెరుగైన వసతి సౌకర్యాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. సాక్షి, అనంతపురం : విద్యారంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రెండేళ్లలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్గా సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, దివ్యాంగ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అకస్మిక తనిఖీలు చేస్తూ దడ పుట్టిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల హాజరు, భోజనం నాణ్యత, మెనూ అమలు.. హాస్టల్ వార్డెన్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్న కలెక్టర్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఐదుగురు వార్డెన్లపై ఇప్పటికే వేటు వేశారు. అయినప్పటికీ మిగతా వారిలో పెద్దగా మార్పు రాలేదు. సస్పెండ్ చేయడం.. కొద్దిరోజుల తర్వాత దాన్ని ఎత్తివేయడం వల్ల ఉపయోగం లేదని భావించిన కలెక్టర్ కొత్త పంథా ఎంచుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లపై సస్పెన్షన్తో సరిపెట్టకుండా ఇంక్రిమెంట్ల కోతకు చర్యలు తీసుకుంటున్నారు. షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చిన తర్వాత(విత్/వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్) ఒకటి లేక రెండు ఇంక్రిమెంట్లు కోత విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెనుకొండ ఏఎస్డబ్ల్యూఓ ప్రసాద్, చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ మారుతీరావు, కుక్ నారాయణమ్మ, బీకేఎస్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూడేరు బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ కేఆర్ శశికళకు చార్జెస్ ఫ్రేం చేశారు. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ⇔ చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్ను ఈనెల 7న కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. 55 మంది పిల్లలకు గాను 26 మంది మాత్రమే ఉన్నారు. 29 మంది గైర్హాజరయ్యారు. వినాయక చవితి పండుగకు వెళ్లిన వారు ఇంకా రాలేదని వార్డెన్ ఇచ్చిన సమాధానంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ 3వ తేదీ అయితే 7వ తేదీ వరకు రాకపోయినా మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా పప్పులో ఉప్పు ఎక్కువైందనీ, సాంబారులో నీళ్లు తప్ప కూరగాయలు కనిపించలేదని.. పైగా పప్పులో రాళ్లు కనిపించాయన్నారు. తనకు వడ్డించిన అన్నంలోనే రాయి వచ్చిందన్నారు. మెనూ ప్రకారం వెజిటబుల్ కర్రీ చేయాల్సి ఉన్నా..నీళ్ల చారుతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇔ ఇక ఈనెల 3న కలెక్టర్ బుక్కరాయసముద్రంలో ఎస్సీ హాస్టల్ను పరిశీలించారు. 130 మందికి గాను కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎస్టీ హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన కలెక్టర్ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రాకకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ పనితీరు మార్చుకుని ప్రభుత్వ ప్రాధాన్యామాలకు అనుగుణంగా పనిచేయాలని లేకపోతే ఇంటికి పంపించేందుకు కూడా వెనకాడేది లేదని కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. సస్పెన్షన్ వేటు పడిన వార్డెన్లు ►రామునాయక్, అనంతపురం ఎస్సీ నంబర్–4 హాస్టల్ వార్డెన్ ►బాబు, బుక్కరాయసముద్రం ఎస్సీ హాస్టల్ వార్డెన్ ►వెంకటేశ్వర్లు, ఎస్టీ హాస్టల్ వార్డెన్ ►ఠాగూర్, గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు బీసీ హాస్టల్ వార్డెన్ (వీరిలో రామునాయక్, ఠాగూర్పై సస్పెన్షన్ ఎత్తివేశారు.) -
అంగన్వాడీ కార్యకర్తపై క్రిమినల్ కేసు
రాజమహేంద్రవరం : అంగన్వాడీ కార్యకర్తపై క్రిమినల్ కేసు నమోదైంది. విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు కథనం ప్రకారం.. శంఖవరం గ్రామంలో ఈ నెల 6వ తేదీన విజిలెన్స్ అధికారులు అంగన్ వాడీ కేంద్రం నంబర్ 03ను (ఎస్సీ పేట లో ఉన్న) తనిఖీ చేసి కేంద్రంలో పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసిన సరుకులు జూలై నెలకు సంబంధించినవి ఏమీ లేకపోవడం గుర్తించారు. అంగన్ వాడీ కార్యకర్త మేడిద లక్ష్మి సరుకులను ఈ నెల 4వ తేదీన తీసుకొని పీఎఫ్ షాపులో ఉంచామని తెలిపారు. పీఎఫ్ షాపులో తనిఖీ చేసిన అధికారులు అక్కడ అంగన్ వాడీ కేంద్రానికి సంబంధించిన సరుకులు లేకపోవడం, నాలుగో తేదీన లక్ష్మి అంగన్ వాడీ కేంద్రానికి సరుకులు తీసుకువెళ్లినట్టు విచారణలో తేలడంలో ఆమె ఇంటిని తనిఖీ చేయగా 82 కోడిగుడ్లు, 25 కిలోల పీడీఎస్ బియ్యం, చోడిపిండి 22 ప్యాకెట్లు గుర్తించారు. శంఖవరం మండలం అంగన్వాడీ సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్లో లక్ష్మిపై సెక్షన్ ఐపీసీ 406, 7 ఈసీఏ (ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన నిత్యావసర వస్తువులు దుర్వినియోగం) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ అంగన్ వాడీ కేంద్రానికి జూలైæ నెలకు సంబంధించిన మొత్తం సరుకులు బియ్యం 130 కేజీలు, పప్పు 29 కేజీలు, ఆయిల్ ఆరు ప్యాకెట్లు, శనగలు 7.5 కేజీలు, ఉప్పు 2 ప్యాకెట్లు, ఉండాల్సి ఉండగా మేడిద లక్ష్మి ఇంటి వద్ద తక్కువగా ఉండడం గమనించారు. విచారణలో లక్ష్మి సరుకులు బయట మార్కెట్లో అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపిస్తామని విజిలెన్స్ జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు. -
యడ్యూరప్ప హెలికాఫ్టర్లో ఎన్నికల సింబ్బంది తనిఖీలు
-
అజహరుద్దీన్, ‘కొండా’ వాహనాల తనిఖీ
సాక్షి, మామునూరు/వరంగల్ అర్బన్: రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీఏ జంక్షన్లో ఏర్పాటుచేసిన చెక్పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ గ్రామాలకు ప్రచార నిమిత్తం వెళ్తున్న ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, క్రికెట్ మాజీ కెప్టన్ ఎండీ అజహారుద్దీన్ ప్రయాణించే వాహనాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనంలో ఎలాంటి అక్రమ తరలింపులు లేకపోవడంతో వాహనాలను వదిలేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాహనాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు, మద్యం తరలిస్తే చర్యలు తప్పవని చెక్పోస్ట్ ఇన్చార్జ్ అధికారి శాంతకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై రమేష్, కానిస్టేబుల్ యాకూబ్పాషా, హెడ్ కానిస్టేబుల్ రాకేష్, సాంబయ్య, ఫొటోగ్రాఫర్ శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు. -
రూ.79 లక్షల నకిలీ నోట్ల పట్టివేత
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ అటవీశాఖ చెక్పోస్టు వద్ద శనివారం రూ.79 లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడింది. గోదావరిఖని ఏసీపీ రక్షిత కె మూర్తి కథనం.. ఎన్నికల సందర్భంగా ఎస్ఎస్టీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న షేఖ్ మస్తాన్ బ్యాగ్ను తనిఖీ చేశారు. 24 కట్టల్లో రూ.79 లక్షలు ఉన్నాయి. ‘పైనా.. కిందా అసలు నోట్లు పెట్టారు. మిగతాదంతా నకిలీ కరెన్సీ. ఇందులో కేవలం రూ. 24 వేలు మాత్రమే ఒరిజినల్ నోట్లు’ అని ఏసీపీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడిపర్తి మండలం పిండుపాకకు చెందిన షేఖ్ మస్తాన్, వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన పొడిశెట్టి కృష్ణమూర్తి, భూపాలపల్లి జిల్లాకు చెందిన ఆకుల శంకర్లు ఈ నకిలీ కరెన్సీని తరలిస్తున్నారని తెలి పారు. డబ్బు దేనికోసం తరలిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు వివరించారు. -
‘ఫేస్’ చూపించి వెళ్లిపోవచ్చు!
సాక్షి, హైదరాబాద్: ఇక ఫ్లైట్ మిస్సవుతామనే భయం లేదు. గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ టేకాఫ్ సమయానికి 10 నిమిషాలు ముందు ఎయిర్పోర్టులో వాలిపోవడం. క్షణంలో భద్రతా తనిఖీలు పూర్తి చేసుకొని.. ఎంచక్కా విమానం ఎక్కేయడం. ఇంతటి సదుపాయం ఎక్కడో కాదు.. మన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే. ఈ సరికొత్త సదుపాయం డిసెంబర్ నుంచి అమల్లోకి రానుంది. ఫేస్ రీడింగ్ టెక్నాలజీ ద్వారా భద్రతా తనిఖీలను సులభతరం చేసేందుకు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చర్య లు చేపట్టారు. దీనిలో భాగంగానే తొలుత దేశీయ విమాన ప్రయాణికులకు దీన్ని అమల్లోకి తెచ్చి ఆ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులకూ విస్తరించనున్నారు. కొంతకాలంగా ఎయిర్పోర్టు సిబ్బంది తనిఖీల కోసం ఫేస్ రీడింగ్ టెక్నాలజీని ఎయిర్పోర్టులో విజయవంతంగా అమలు చేస్తున్నారు. సిబ్బంది తనిఖీల్లో ఈ పరిజ్ఞానం సత్ఫలితాలనివ్వడంతో ప్రయాణికులకు కూడా దీనిని విస్తరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరి కొద్ది నెలల్లోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దేశంలో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అమలు చేయనున్న మొట్టమొదటి ఎయిర్పోర్టు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయమే కానుంది. వన్టైమ్ రిజిస్ట్రేషన్ చాలు.. వన్టైమ్ రిజిస్ట్రేషన్తో ప్రయాణికులు తమ వివరాలను ఒక్కసారి నమోదు చేసుకుంటే ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఎప్పుడు ప్రయాణం చేసినా ఎలాంటి తనిఖీలు లేకుండా నేరుగా లోనికి వెళ్లిపోవచ్చు. కొత్త విధానంలో ముందుగా ప్రయాణికులు ఎయిర్పోర్టులోకి ప్రవేశించిన తర్వాత ఎంట్రన్స్లో గుర్తింపు, చిరునామా, ఆధార్, తదితర ధ్రువపత్రాలను అందజేసి అత్యాధునిక కెమెరాల వద్ద ముఖకవళికలను నమోదు చేసుకోవాలి. ఈ కొత్త విధానంలో భాగంగా ఎంట్రీ గేట్ల వద్ద హైటెక్ కెమెరాలు అమరుస్తారు. ఒక్కసారి ఇలా వివరాలు నమోదు చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆ కెమెరాల వైపు చూడగానే అతడి వివరాలు స్క్రీన్పై డిస్ప్లే అవుతాయి. దీంతో బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డులు చూపెట్టాల్సిన అవసరం లేకుండానే అధికారులు సదరు ప్రయాణికుడిని లోపలికి అనుమతిస్తారు. ‘‘ఇది అత్యంత భద్రతతో కూడిన విధానం. ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవు. ఎయిర్పోర్టు సిబ్బంది ఎంట్రీల్లో ఫేస్ రీడింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ ఫలితాలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు హైటెక్ కెమెరాలను ఏర్పాటు చేస్తాం’’అని ఎయిర్పోర్టు ఉన్నతా ధికారి ఒకరు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని పూర్తిగా కాగిత రహితంగా, పర్యావరణహితంగా అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేపట్టారు. ఇందుకోసం బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 480 జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 55,000 మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సరికొత్త విధానం అమల్లోకి వస్తే హైదరాబాద్కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
చట్టపరంగానే మల్టీప్లెక్స్లపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్లలో వరుస దాడులకు సంబంధించి పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నామని తూనికలు, కొలతల శాఖ హైకోర్టుకు స్పష్టం చేసేందుకు సిద్ధమైంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం చట్టపరంగానే మల్టీప్లెక్స్ల్లో తనిఖీలు నిర్వహించామని, తనిఖీల సమయంలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించామని, దీనికి ఆధారాలు, వివరాలను తెలుపుతూ రెండ్రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ సమర్పించనుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్లపై తూనికలు, కొలతల శాఖ గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహించి, వందకు పైగా కేసులు నమోదు చేసింది. మరోవైపు తూనికలు కొలతల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేసులు నమోదు చేస్తున్నా పదే పదే నిబంధనలు ఉల్లంఘించడంతో అధికారులు బిల్లింగ్ సిస్టంలను జప్తు చేశారు. ఈ తనిఖీలు నిలుపుదల చేయాలని పీవీఆర్ మల్టీప్లెక్స్, బిల్లింగ్ సిస్టంలను జప్తు చేయవద్దని, తనిఖీలు ఆపాలని ఐనాక్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఐనాక్స్ యాజమాన్యం వేసిన పిటిషన్పై తనిఖీల నిలుపుదలకు హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తూనికలు, కొలతల శాఖ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఒకటి రెండు రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయబోతున్నట్లు తెలిసింది. హైకోర్టులో స్టే వెకేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నట్లుగా తెలిసింది. -
కుళ్లిన మాంసం..నాసిరకం అల్లం
అవి మంచిర్యాలలోని ప్రముఖ రెస్టా రెంట్లు... కాబట్టి ఆహార పదార్థాల్లో నాణ్యతను పాటిస్తారని ప్రజలు నమ్ము తారు. కానీ నాణ్యతలేని పదార్థాలు, కుళ్లిన మాంసం వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యా లతో చెలగాటమాడుతున్నారు. బుధ వారం పలు రెస్టారెంట్లలో టాస్క్ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వాటి బండారం బయట పడింది. అలాగే కళాంజలి పేరుతో తయార వుతున్న అల్లంపేస్ట్, మసాలా దినుసుల్లో నాణ్యత లోపాన్ని అధికారులు గుర్తించారు. మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని నాలుగు ప్రముఖ రెస్టారెంట్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పంజా విసిరారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో ఏ–1, సురభి గ్రాండ్, మాధవి, బాబా రెస్టారెంట్లలో ఆకస్మిక దాడులు చేసి ఆహార పదార్థాలను పరిశీలించారు. కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, మటన్, చికెన్ లభించండంతో కేసు నమోదు చేశారు. వాటి నిర్వా హకులకు రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. తదుపరి చర్యల నిమిత్తం ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారికి అప్పగించారు. అల్లం పేస్టు.. మసాలాలు సైతం.. జిల్లా కేంద్రంలోని కళాంజలి అహార పదార్థాల తయారీ కేంద్రంపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కళాంజలి బ్రాండ్ పేరుతో తయారీ చేసిన నిత్యావసర ఆహార పదార్థాలను నాణ్యత లేకుండా వివిధ కిరాణాలకు సరఫరా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి వాటిని పరిశీలించారు. అల్లం పేస్టు తయారు చేసి శుభ్రంగా లేని డ్రమ్ములో నిలువ ఉంచగా.. వాటి నమూనాలను సేకరించారు. ప్యాకెట్లపై ఎమ్మార్పీ లేకపోవడం, ప్యాకెట్పై సూచించిన విధంగా పరిమాణం లేకపోవడం, అల్లం తయారు చేసే మిషనరీ తుప్పు పట్టి ఉండటం, ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్ లేకపోవడంపై అధికారులు ప్రశ్నించారు. సరుకు వివరాల రికార్డులు లేకపోవడంతో మందలించి, పలు రకాల ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. పరీక్షల తర్వాత కల్తీ, నాసిరకం పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ బుద్దె స్వామి, ఎస్సై సమ్మయ్య, సిబ్బంది సంపత్కుమార్, భాస్కర్గౌడ్, సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. -
రైల్వేల్లో ఆర్పీఎఫ్ టికెట్ల తనిఖీకి చెల్లుచీటీ
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికుల టికెట్లను రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్) సిబ్బంది ఇకపై తనిఖీ చేయరాదని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ధర్మేంద్ర కుమార్ ఆదేశించారు. ఇటీవల టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీల నుంచి తప్పించుకునేందుకు యత్నించి దుర్మరణం చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అన్ని రైల్వే జోనల్ కార్యాలయాలకు కుమార్ లేఖ రాశారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పర్యవేక్షణాధికారిని ఇందుకు బాధ్యునిగా చేస్తామని హెచ్చరించారు. రైల్వే చట్టం ప్రకారం టికెట్ల తనిఖీతో పాటు అదనపు చార్జీలు విధించడం టికెట్ తనిఖీ బృందాలకు సంబంధించిన విషయమని కుమార్ స్పష్టం చేశారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో సామాజిక తనిఖీలు
ఉపాధి హామీ తరహాలో ఏర్పాట్లు తప్పులు చేస్తే గ్రామ సభల్లో విచారణ చాపకింద నీరులా పావులు కదుపుతున్న ప్రభుత్వం ఆందోళనలో అంగన్వాడీ కార్యకర్తలు ఏలూరు (మెట్రో): ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుందా... అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటీకరించి పాఠశాలల యాజమాన్యాలకు అప్పగించనుందా...? ప్రస్తుతం ప్రభుత్వం చేసే పనులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే నారాయణ పాఠశాలలకు అంగన్వాడీలను ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. మొదటి విడతగా జిల్లాలోని మున్సిపల్ ఏరియాల్లో, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలను అప్పగించింది. దీనిలో భాగంగా అర్బన్ ఏరియాల్లో ఉన్న నాలుగు, ఐదు కేంద్రాలను ఒకే చోట విలీనం చేసి అంగన్వాడీ కార్యకర్తలను, హెల్పర్లను కేవలం విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఈ కేంద్రాలపై నారాయణ కోఆర్డినేటర్లు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇక తనిఖీల వంతు : ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు, బయోమెట్రిక్ హాజరు అంటూ అంగన్వాడీలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో నూతన విధానంలో తనిఖీలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సామాజిక తనిఖీలు చేస్తారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి లబ్ధిదారుని వద్దకు వెళ్లి కేంద్రాల పనితీరు ఎలా ఉంది, కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సరిగ్గా అందుతుందా లేదా అన్నది పరిశీలిస్తారు. ఉపాధిహామీ సామాజిక తనిఖీలు తరహాలో బృందాలను నియమిస్తారు. ఈ బృందాలకు శిక్షణ ఇచ్చి కేంద్రాల ఆడిట్ చేయిస్తారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి బృందాలు వెళ్లి ప్రజల నుంచి వివరాలు సేకరిస్తాయి. ప్రధానంగా పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించి పలు ప్రశ్నలు తయారు చేస్తారు. కేంద్రాల్లోనే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు భోజనాలు చేస్తున్నారా లేదా ఇంటికి తీసుకెళుతున్నారా అనే అంశాలను పరిశీలిస్తారు. ఈ తనిఖీలన్నీ ఒక ఎత్తయితే ఈ బృందాల పరిశీలనలో వెల్లడైన అంశాలపై గ్రామ, మండల స్థాయిలో సభలు నిర్వహించి వీటిపై విచారణ నిర్వహిస్తారు. అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు ఏమైనా కాస్త తప్పు చేసినా ఈ సభల్లో వీరి పరువు తీసేందుకు ఈ బృందాలు సిద్ధపడతాయన్నమాట. లోపాలు సరిదిద్దేందుకంటూ వాదన : ఈ తనిఖీల ద్వారా పిల్లలు, గర్భిణుల్లో పౌష్టికాహార సమస్యలు తీరతాయనీ ప్రస్తుతం ఈ సమస్య తీరడం లేదని చెప్పుకొస్తున్నారు. ఈ తనిఖీల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇదీ జిల్లాలో లెక్క : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు 3,500 ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 3500 కార్యకర్తలు, 3500 మంది సహాయకులు విధులు నిర్వహిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థలకు మొదటి దశలో ఏలూరులో 120, తాడేపల్లిగూడెంలో 60, జంగారెడ్డిగూడెంలో 29, తణుకులో 20, నరసాపురంలో 19, పాలకొల్లులో 25, కొవ్వూరు 54, భీమవరం 30, నిడదవోలులో 18 కేంద్రాలను అప్పగించనున్నారు. నిర్వీర్యం చేసేందుకే : అంగన్వాడీ ఉద్యోగం అంటేనే భయపడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్పల్స్ సర్వే, పల్స్పోలియా, ఎన్నికల విధులు, ఓటర్ల జాబితా వంటి విధుల భారం మోపుతుంది. నూతనంగా నారాయణకు అప్పగించి ఆ చిన్నారులను వీధులు దాటించి నారాయణ సంస్థలకు విద్యార్థులను తరలించాలని ప్రభుత్వం ఆదేశిస్తోందని, తాజాగా తనిఖీల పేరుతో వేధింపులకు దిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. అంగన్వాడీలను తొలగించేందుకే కుట్ర పి.భారతి, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు క్రమక్రమంగా అంగన్వాడీలను కుదించి తద్వారా అంగన్వాడీ కేంద్రాలను తొలగించేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. ఇప్పటికే అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న అంగన్వాడీలను వివిధ తనిఖీల పేరుతో వేధించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇటువంటి తనిఖీలు చేసి అంగన్వాడీలను ఉద్యోగమంటేనే భయపడేటట్లు చేయనుంది. -
మిలటరీ ఆస్పత్రిలో తనిఖీలు
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రం అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని మిలటరీ ఆస్పత్రిని ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా కల్నల్ అనిల్కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. మందుల కొరత ఉందని వాటిని సమకూర్చాలంటూ ఆయన దృష్టికి మాజీసైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ షేకన్న తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శివప్రసాద్, అబ్దుల్ ఖాదర్, తిమ్మారెడ్డి, పెద్దిరెడ్డి, హుస్సేన్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. -
సజావుగా సర్టిఫికెట్ల పరిశీలన
ఎస్కేయూ : వర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్–2017 కౌన్సెలింగ్లో భాగంగా సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన సజావుగా సాగింది. తొలిసారిగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రవేశపెట్టారు. రెక్టార్ హెచ్.లజపతిరాయ్ ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థినికి స్క్రాచ్ కార్డును అందచేశారు. కౌన్సెలింగ్ కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిష¯Œ్స బీవీ రాఘవులు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాళ్లు సీఎ¯ŒS కృష్ణా నాయక్, వి.రంగస్వామి, సెరికల్చర్ విభాగాధిపతి ఎస్.శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు
-మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు -డీఈఓ అబ్రహం మామిడికుదురు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఆయన సోమవారం మామిడికుదురు, మొగలికుదురు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. మొగలికుదురు పరీక్షా కేంద్రంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించానని, అక్కడ ఏవిధమైన మాస్ కాపీయింగ్ జరగడం లేదని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకన వి«ధానం వల్ల విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులూ పడడం లేదన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగేందుకు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించామన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత వరకు ముగ్గురు విద్యార్థులను డీబార్ చేశామని, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డీఓ, ఆరుగురు ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
భువన్ నిఘా
ఏలూరు (మెట్రో) : ‘భువన్’ భారత ప్రభుత్వం ఇస్రోతో తయారు చేయించిన ప్రత్యేక మొబైల్ యాప్. మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని అమలులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఉపాధి హామీ పనులపై సాంకేతిక పర్యవేక్షణ కొనసాగనుంది. పూర్తి చేసిన పనుల వివరాలను భువన్ యాప్ ద్వారా అంతర్జాలంలో నమోదు చేస్తారు. దీనిని ‘జియో మన్రె’గా పిలుస్తారు. ఇప్పటివరకూ పూర్తి చేసిన పనులను జియో మన్రెలో నమోదు చేయకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల మం జూరు ఆగిపోయింది. అందుకే ఆగమేఘాలపై పనుల వివరాలు భువన్ యాప్ ద్వారా జియోమన్రెగా వెబ్లోకి అప్లోడ్ చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులన్నింటినీ తప్పనిసరిగా భువన్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో కోటిపైనే పనిదినాలు జిల్లాలో 5 లక్షల 37 వేల మంది జాబ్కార్డుల ద్వారా ఉపాధి హామీ పనులు పొందుతున్నారు. వీరికి రు.194 కనీస వేతనంగా రోజుకు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 96 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే వాటికి మించి 1.06 కోట్ల పనిదినాలు కల్పించారు. ఈ పనులన్నింటినీ గత నెల మొదటి నుంచి భువన్లో అప్లోడ్ చేస్తున్నారు. దీనిని ఉద్యమంలా చేపడుతున్నట్టు డ్వామా అధికారులు చెబుతున్నారు. ఎవరైనా చూడొచ్చు ఇప్పటివరకూ జిల్లాలో పూర్తి చేసిన ఉపాధి పనులన్నీ భువన్ యాప్ ద్వారా వెబ్లోకి అప్లోడ్ చేయాలి. ఈ పనిని సాంకేతిక సహాయకులు (టీఏ), క్షేత్ర సహాయకులు (ఎఫ్ఏ)లకు అప్పగిం చారు. వీరందరకూ ఇప్పటికే ఈ భువన్ యాప్లోకి జిల్లాలోని పనులను అప్లోడ్ చేస్తున్నారు. అవినీతిని అడ్డుకునేలా.. ఇప్పటి వరకూ నిర్వహించిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను ఇకనుంచి ఫొటో తీసి భువన్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సిందే. దీని వల్ల ఎటువంటి అవినీతికి ఆస్కారం ఉండదు. జిల్లాలో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టినా, చెరువు పనులు నిర్వహించినా ప్రతి పనీ ఫొటోలు తీసి, దానికి సంబంధించిన వివరాలు యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. – ఎం.వెంకటరమణ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ -
అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించండి
జగ్గయ్యపేట : గ్రామాల్లోని ప్రజలకు అగ్ని ప్రమాదాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణరావు పేర్కొన్నారు. పట్టణంలోని అగ్నిమాపక కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అగ్నిమాపక కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బంది, వాహనాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం రాష్ట్ర సరిహద్దులో ఉండటంతోపాటు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కావున సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని గ్రామాల్లో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సమాచారం ఉంటే ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. ప్రస్తుతం సాంకేతికరంగం పెరగటంతో సమాచారం కూడా త్వరితగతిన వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ అగ్నిమాపక కేంద్రం రాష్ట్రంలోనే మోడల్ స్టేషన్గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంసీ‘ఐ’
- సర్వజనాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంసీఐ బృందం - వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించిన సభ్యులు అనంతపురం న్యూసిటీ : ‘‘ కొన్ని విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత స్పష్టంగా కన్పిస్తోంది. సిబ్బంది పూర్తీ స్థాయిలో లేరు.. ఇంకా మెరుగుపడాలి’’ అని ఎంసీఐ బృందం పేర్కొంది. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల రెన్యూవల్కు సంబంధించి గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఇక్కడ పర్యటించింది. అప్పుడు పలు లోటుపాట్లను గుర్తించినా సీట్ల రెన్యూవల్కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లోటుపాట్లు సరిదిద్దారా..? లేదా అన్న విషయాలు తెలుసుకునేందుకు శుక్రవారం ప్రొఫెసర్లు డాక్టర్ జ్యోతికృష్ణ (బీహార్), డాక్టర్ రామకృష్ణారెడ్డి (కర్నాటక), బసవరాజు (బళ్లారి) బృందం ప్రభుత్వ సర్వజనాస్పత్రి, వైద్య కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వీరు మూడు బృందాలుగా ఏర్పడి ఆస్పత్రిలోని మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్, లేబర్, బ్లడ్ బ్యాంక్, సర్జరీ, ఆప్తమాలజీ, డెర్మటాలజీ, క్యాజువాలిటీ, వైద్య కళాశాలలోని వివిధ విభాగాలతో పాటు ఓపీ కౌంటర్ను నిశితంగా పరిశీలించారు. రోజూ ఓపీకి ఎంత మంది రోగులు వస్తున్నారని ఆరా తీశారు. అందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ రోజూ 1200 ఓపీ, 800 ఇన్పేషంట్లున్నారని సమాధానమిచ్చారు. సర్జరీ విభాగంలోని ఎంఎస్ –1, ఎంఎస్–2, ఆపరేషన్ థియేటర్ను కూడా పరిశీలించారు. హెచ్ఓడీ డాక్టర్ రామస్వామినాయక్తో గత కొన్నేళ్లుగా ఏ మేరకు శస్త్ర చికిత్సలు చేశారో వాటి వివరాలను సేకరించారు. అనంతరం సర్జరీ విభాగం వైద్యులతో వారు ఎటువంటి సర్జరీలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. డెంగీ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఏర్పాటు చేసిన చిన్న పిల్లల ప్రత్యేక వార్డును పరిశీలించారు. మెయిన్ ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో ఎటువంటి సదుపాయాలున్నాయో చూశారు. సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఏవిధంగా పని చేస్తోందో ఆరా తీశారు. రోజూ డెలివరీలు ఏమాత్రం జరుగుతాయని గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్ బేగంను ఆరా తీశారు. మెటర్నిటీ సెలవును మాత్రమే పరిగణిస్తాం ఇద్దరు, ముగ్గురు వైద్యులు క్యాజువల్ లీవ్లో ఉండటాన్ని కూడా ఎంసీఐ బృంద సభ్యులు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం క్యాజువల్ లీవ్ (సీఎల్)ను పరిగణలోకి తీసుకోం కదా.. దాన్నే కారణంగా చూపితే ఎలా అని గైనిక్ విభాగంలో ఉన్న వారిని అడగ్గా... వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. వైద్య కళాశాలలో ఎంసీఐ బృందం అన్ని విభాగాల హెడ్కౌంట్ను పరిశీలించారు. కొంత మంది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వారు అలాగే నివేదికలో పొందుపరుస్తామని తేల్చి చెప్పారు. ఈఎన్టీలో ఛాతివైద్య నిపుణుడా..? ఏం సార్ ఇది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈఎన్టీ విభాగంలో ఛాతివైద్య నిపుణుడిని ఉంచితే ఎలా..? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అన్ని విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వివరాలను రికార్డు చేసుకున్నారు. -
విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు
సూర్యాపేటః ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మిరప విత్తనాల విక్రయాలకు సంబంధించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు దుకాణాల్లో డివిజన్ వ్యవసాయాధికారి కె.శంఖర్ రాథోడ్ ఆధ్వర్యంలో తనఖీలు చేశారు. స్థానిక సాయికృప ఆగ్రో ఏజెన్సీస్, శ్రీరామచంద్ర సీడ్స్ దుకాణల్లో నకిలీ మిరప విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు దుకాణాల్లోనూ జీవ ఆగ్రో జెనిటిక్స్ కంపెనీకి చెందిన జేసీఫోర్ 801 మిరప విత్తనాలను విక్రయించడం జరిగిందని తెలిపారు. విత్తనాల విక్రయ రసీద్లను స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు వెల్లడించారు. విత్తన, ఎరువుల దుకాణాల యాజమానులు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓలు అరుణ, సందీప్తో పాటు పలువురు ఉన్నారు. -
గుమ్మడిలో డ్రగ్స్ అధికారుల దాడులు
రూ.2 లక్షలు విలువ చేసే మందులు స్వాధీనం కోవూరు: కోవూరు మందబయలు సెంటర్లో ఉన్న గుమ్మడి హాస్పిటల్లో మంగళవారం అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ సురేష్బాబు ఆకస్మికంగా దాడులు చేశా రు. ఈ దాడుల్లో రూ.2 లక్షలు విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అనుమతులు లేకుండా మందులు ఉన్నాయన్న విషయంపై ఫిర్యాదులు రావడతో దాడులు నిర్వహించామన్నారు. దాడులు జరిగి న సమయంలో విలువైన మందులు ఉండటంతో వాటిని పరిశీలిస్తున్నామన్నారు. ఇటీవల కోవూరులోని సెయింట్ పాల్స్ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో మిగిలిన మందులను గుమ్మడి హాస్పిటల్లో నిల్వ ఉంచడం జరిగిందని ఉచిత వైద్యశిబిరం నిర్వహించిన యూకో ఆర్గనైజేషన్ నిర్వాహకులు డ్రగ్ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియచేశారు. తరచుగా మా ఆర్గనైజేషన్లో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలునిర్వహిస్తుంటామని అందులో భాగంగానే ఈ మందులను కొనుగోలు చేసి తెచ్చామని యూకో నిర్వాహకులు తెలిపారు. ఆదివా రం మెగా వైద్యశిబిరం రాత్రి వరకు జరగడంతో ఈ మందులను గుమ్మడి హాస్పిటల్ ఆవరణలో ఖాళీగా ఉన్న ఓ గదిలో నిల్వ ఉంచామని డ్రగ్ అధికారులకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. నిర్వాహకులు చెప్పిన వివరాలను నమోదు చేసుకొని నివేదికలు తయారుచేశామని డ్రగ్ అధికారి సురేష్బాబు తెలిపారు. దాడుల్లో కావలి, గూడూరు, నెల్లూరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు సుభాషిణి, ప్రశాంతి, మురళీ పాల్గొన్నారు. -
రఫీ బీఈడీ కాలేజీలో తనిఖీలు
హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీఈఆర్టీ బృందం ఆధ్వర్యంలో రికార్డుల పరిశీలన నిబంధనలకు విరుద్ధంగా ఒకే క్యాంపస్లో పలు కోర్సులు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు వినుకొండ రూరల్: ఏసీబీకి పట్టుబడ్డ వివేకానంద విద్యాసంస్థల అధినేత రఫీకి చెందిన బీఈడీ కళాశాలలో ఎస్సీఈఆర్టీ బృందం శుక్రవారం తనిఖీలు చేపట్టింది. హైదరాబాదులో కాలేజీ యాజమాన్యాల వద్ద లంచం తీసుకుంటూ జూలై 28న రఫీ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. రఫీ నిబంధనలకు విరుద్ధంగా 21 కళాశాలలను నడుపుతున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన కాసరగడ్డ ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్ ఎన్.మాధవరావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి, విచారణకు సూచించిన నేపథ్యంలో ధర్మాసనం ఎస్సీఈఆర్టీకి దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పిన వివిధ బీఈడీ కళాశాలలను తనిఖీలు ప్రారంభించింది. శుక్రవారం వినుకొండ విఠంరాజుపల్లి సమీపంలోని వివేకానంద బీఈడీ అండ్ డీఈడీ కళాశాలలోని రికార్డులను ఎస్సీఈఆర్టీ బృందం సభ్యురాలు ప్రొఫెసర్ లక్ష్మీవాట్స్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ జరిగింది. కళాశాల సర్వే నంబరు, నిర్మాణం తీరు కొలతల ద్వారా బృందం సభ్యులు సేకరించారు. ఒకే క్యాంపస్లో బీఈడీ, డీఈడీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఒకే కళాశాలలో ఇన్ని క్యాంపస్లు ఎలా నడుపుతున్నారంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. బీఈడీ కళాశాలకు పెద్దగా స్పందన లేకపోవడంతో వాస్తవానికి మూడు డీఈడీ, ఒక హిందీ డీఈడీ కళాశాలలు నడుపుతున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రఫీ నెలకొల్పిన బీఈడీ, డీఈడీ కళాశాలలను తనిఖీ చేస్తున్నామని, సేకరించిన వివరాలను త్వరలో హైకోర్టుకు అందజేస్తామని లక్ష్మీవాట్స్ తెలిపారు. ఆమె వెంట డిప్యూటీ డీఈవో రామారావు, వినుకొండ ఎంఈవో జఫ్రల్లా, వినుకొండ సర్వే బృందంతో పాటు ఎస్సీఈఆర్టీ సర్వే బృందం ఉన్నారు. -
క్రీడా మైదానం తనిఖీ
అనంతపురం సెంట్రల్ : కళ్యాణదుర్గంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని గురువారం విజిలెన్స్ ఎస్పీ అనిల్బాబు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్త విచారణలో భాగంగా ఈ క్రీడా మైదానాన్ని పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు. క్రీడా ప్రాంగణం, చుట్టూ గోడలను ఇంజనీర్ల సహాయంతో తనిఖీ చేశారు. గ్రౌండుకుS ఏ రకమైన గ్రావెల్ని వాడారు, భవనాల కట్టడంలో పునాది పటిష్టత, గోడల మందం తదితర వాటిని పరిశీలించారు. సదరు క్రీడా మైదానాన్ని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హౌసింగ్బోర్డు అధికారులు నిర్మించి క్రీడా సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. పైకా గ్రాంట్స్ ద్వారా జిల్లాలో నార్పల, పెనుకొండ, రామగిరి, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వీటి నిర్మాణ ంలో నాణ్యతా ప్రమాణాల గురించి తనిఖీలు చేయడం జరిగిందన్నారు. -
ఏడీ కార్యాలయం తనిఖీ
మహబూబ్నగర్ న్యూటౌన్: భూ కొలతలు, రికార్డుల శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర సర్వే సెటిల్మెంటు, భూ రికార్డుల శాఖ కమిషనర్ శశిధర్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఏడి శ్యాంసుందర్రెడ్డి కృష్ణా పుష్కరాల విధులు నిర్వహిస్తున్నారని సర్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి కమిషనర్కు తెలిపారు. ఈ సందర్భంగా పలు శాఖా పరమైన విషయాలపై చర్చించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలుగు, ఉర్దూ, మరాఠీలలో ఉన్న పాత రికార్డులను పరిశీలించారు. బౌండ్రీ వివాదాలు, సబ్డివిజన్ సమస్యల పరిష్కారంలో అవలంబిస్తున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని పాత రికార్డులు పరిశీలించి మరాఠీ బాషలో అంకెలు ఉండటానికి కారణాలు తెలుసుకున్నారు. సేత్వార్, టీపన్లు పరిశీలించారు. టీపన్లు అందుబాటులో లేని పక్షంలో సర్వే ఎలా నిర్వహిస్తారని సర్వేయర్లను ఆరా తీశారు. పక్కా బుక్, గ్రామ నక్షా ఆధారంగా సర్వే చేస్తామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఏడీ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. -
భక్తులకే చెకింగ్!
అమరావతి (పెదకూరపాడు): అమరలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం రూ. 300 వీఐపీ టికెట్ కొన్న భక్తులకు మాత్రమే సింహద్వారం వద్ద ఉన్న పోలీసు సిబ్బంది మెటల్ డిటెక్టవ్ చెకింగ్ చేస్తున్నారు. అధికారులు, బంధువులు, పోలీసు సిబ్బంది బంధువులను మాత్రం చెకింగ్ లేకుండా పంపుతున్నారు. అధికారుల బంధువర్గం మాత్రం టికెట్టు లేకుండానే దర్జాగా దర్శనం చేసుకుంటున్నారు. -
అమ్మవారి ఆలయం వద్ద ముమ్మర తనిఖీలు
తిరుచానూరు : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాల్లోని దుకాణాలు, వాణిజ్య సముదాయాల వద్ద తిరుచానూరు సీఐ కేవీ.సురేంద్రనాయుడు, ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుచానూరు తదితర ఆలయాలకు తీవ్రవాదుల ముప్పు ఉన్న నేపథ్యంలో తిరుపతి అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో అనుమానితులు కనబడినా, బ్యాగులు వంటివి గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని దుకాణాదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
జీజీహెచ్లో ఎంసీఐ తనిఖీలు
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో సోమవారం భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇన్స్పెక్టర్లు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తనిఖీలు జరిగాయి. ప్రస్తుతం వైద్య కళాశాలలో 97 పీజీ సీట్లు ఉండగా అదనంగా 45 సీట్లు కావాలని గుంటూరు వైద్య కళాశాల అధికారులు ఎంసీఐని కోరారు. పీజీ సీట్లు పెంచేందుకు నిబంధనల ప్రకారం వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాలు తదితరాలను తనిఖీచేసి ఎంసీఐ ఇన్స్పెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్లు పెరగటం జరుగుతుంది. అందులో భాగంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, పిల్లల వైద్య విభాగం, పల్మనరీ డిపార్ట్మెంట్, పెథాలజీ, ఎస్పిఎం, మానసిక వ్యాధుల వైద్య విభాగాల్లో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు. ఆస్పత్రిలోని ఓపీ వైద్య విభాగాలు, ఇన్పేషెంట్ విభాగాలు, ల్యాబ్లు, క్యాజువాలిటీ, కళాశాలలోని గ్యాలరీలు, సిబ్బంది హాజరు పట్టీలు తనిఖీ చేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ మెండా ఫర్నికుమార్, డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజు నాయుడు, ఆయా వైద్య విభాగాధిపతులు వారికి వైద్య సౌకర్యాలు చూపించి, వారు అడిగిన సమాచారాన్ని అందించారు. -
భువనగిరిలో ముమ్మర తనిఖీలు
భువనగిరి మాజీ నక్సలైట్, గ్యాంగ్స్టర్ ఎండీ నయీం ఎన్కౌంటర్తో భువనగిరి డివిజన్ను పోలీసులు జల్లెడ పట్టారు. డివిజన్లోని పలు పోలీస్స్టేషన్ల నుంచి సీఐలు, ఎస్ఐలు అదనపు బలగాలను రప్పించారు. ఉదయం నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, వలిగొండ, భువనగిరి మండలం బొల్లేపల్లిలో నయీం అనుచరులుగా అనుమానిస్తున్న వారి ఇళ్లపై దాడులు చేశారు. భువనగిరి పట్టణంలోని నయీం ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అలాగే పీడీ యాక్టులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న నయీం అనుచరుడు పాశం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి తనిఖీ చేసి అతడి సోదరుడు కౌన్సిలర్ పాÔ¶ ం అమర్నాథ్ను అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలర్ ఎండీ నాసర్ ఇంటిని తనిఖీ చేశారు. బొల్లేపల్లిలో ఉన్న జెడ్పీటీసీ ఇంటికి వెళ్లిన పోలీసులు వారింటిని తనిఖీ చేశారు. మండలపరిషత్ అ«ధ్యక్షుడు తోటకూర వెంకటేష్ యాదవ్ను ఆయన స్వగ్రామం పగిడిపల్లిలోని అయన ఇంటిలో అదుపులోకి తీసుకున్నారు. వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, కోనపురి శంకర్ ఇళ్లపై పోలీస్లు దాడి చేశారు. యాదగిరిగుట్టలో నాలుగు ఇళ్లపైయ దాడులు చేసి నయీం అనుచరులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నయీం అనుచరులపై నిఘా: నయీం అనుచరులపై పోలీస్ల నిఘా పెంచారు. తమకు సమాచారం ఉన్న మేరకు అనుచరుల ఇళ్లపై దాడులు చేసి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నయీం అనుచరులతో ఇబ్బందులు పడ్డ వారినుంచి పోలీస్లు సమాచారం సేకరిస్తున్నారు. భూదందాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు చేసినవారి పేర్లను సేకరిస్తున్నారు. -
నల్లగొండ జిల్లాలో హై అలర్ట్
నల్లగొండ క్రైం ః గ్యాంగ్స్టర్ నయీం మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం నయీం కుటుం సభ్యులు, వారి అనుచరులు, గ్యాంగ్లో ఉన్న ముఠా సభ్యుల ఇళ్లలో కూడా పోలీసులు, ఇంటెలిజెన్స్, ప్రత్యేక పోలీస్ బలగాలు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో నయీం గ్యాంగ్ సభ్యులతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించి తపంచ, ల్యాప్టాప్లు, విలువైన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీం అనుచరులుగా భావిస్తున్న వారంతా ఎన్కౌంటర్ సమాచారం తెలియడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జిల్లా అంతటా వారి ములాలను వెతికి పట్టుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అత్యంత జాగ్రత్తగా ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా నయీంతో సంబంధం ఉన్న వారితో పాటు వారి ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తోంది. మిర్యాలగూడ, యాదగిరిగుట్ట, భువనగిరి, నల్లగొండలో విస్తృతంగా సోదాలు చేపట్టారు. మిర్యాలగూడలో నయీం అత్త, బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో ఎంపీపీ వెంకటేశ్ యాదవ్, యాదగిరిగుట్టలో మరికొందరిని, నల్లగొండ నయీం చిన్నమ్మ కూతురు అస్మత్ బేగం ఇంట్లో డీఎస్పీ సుధాకర్ సోదాలు నిర్వహించారు. ఈమె ఇంట్లో ల్యాప్టాప్, విలువలైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఓ మహిళా పెరాలసిస్తో విశ్రాంతి తీసుకుంటుంది. నయీంకు వరుసకు అత్త అయి ఉండవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. నయీం అనుచరుడైన టమాట శ్రీను ఇంట్లో తపంచను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా నయీం గ్యాంగ్తో సంబంధం ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. భువనగిరికి ప్రత్యేక బృందం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు భువనగిరికి చేరాయి. వీరిలో స్పేషల్ పార్టీ పోలీసులతో పాటు, ఎస్బీ, ఐడీ పార్టీ పోలీసులు ఉన్నారు. ఏ ఒక్కరినీ వదిలి పెట్టకుండా విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో పాటు ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. నల్లగొండలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో పాటు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడంతో పలు ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. కొందరు పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తూ అనుచరుల కదలికలను డేగ కన్నుతో నిఘా వేశారు. అండర్గ్రౌండ్లోకి నయీం అనుచరులు... నయీం ఎన్కౌంటర్లో మృతిచెందడంతో అతని అనుచరులు సమాచారం తెలిసిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. సెల్ఫోన్లను స్వీచ్ ఆఫ్ చేసుకుని అండర్గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. పోలీసు యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏ ప్రాంతంలో ఉన్నా పట్టుకు వచ్చేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ కేసులో ఎవరున్నారనే దానిపై విచారిస్తున్నారు. హత్య కేసులే కాకుండా భూ దందాల సెటిల్మెంట్, బెదిరింపుల్లో వారి పాత్రను విచారిస్తున్నారు. వీరి ఇళ్లలో సోదాలు.. నయీం అనుచరులుగా భావిస్తున్న జిల్లా కేంద్రంలోని ఏడుగురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ పోలీసులు నయీం గ్యాంగ్ ముఖ్య అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా ఓ ఇంట్లో తపంచ దొరకడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా తనిఖీలు చేస్తున్నారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రైల్వే ట్రాక్ పరిశీలన
రాయదుర్గం రూరల్ : రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం మీదుగా బెంగళూరుకు వెళ్లే రైల్వేలైన్ను చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏ.కే. గుప్తా, చీఫ్ ఇంజనీర్ రవీంద్రనాథ్ రెడ్డి గురువారం పరిశీలించారు. రైలు వెళ్లే మార్గాలను మ్యాపుల ద్వారా అధికారులకు వివరించారు. మోటార్ ట్రాలీపై 40 కిలోమీటర్లు వెళ్లి రైల్వే ట్రాక్ను పరిశీలించారు. అక్టోబర్లో రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం వరకూ కొత్త రైలు నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్యాకింగ్ మిషన్ ద్వారా పనులు వేగవంతం చేయాలని అధికారులను వారు ఆదేశించారు. రైల్వే పనులను అత్యంత నాణ్యతగా నిర్మించాలని సూచించారు. 2012లో రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం వరకు రైల్వే పనులు ప్రారంభించారు. రైల్వేలైన్ కోసం రెండు విడతల్లో రైతుల భూములను కొనుగోలు చేసి ట్రాక్ను నిర్మించారు. మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో నిర్మించిన రైల్వే స్టేషన్ పనులను కూడా వారు పరిశీలించారు. భవనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మోహన్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
నారాయణ.. ‘నారాయణ’!
మంత్రి ఫోన్తో నిలిచిపోయిన టాస్క్ఫోర్స్ తనిఖీలు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే నిలిపివేత అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే.. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు నిల్ సాక్షి, గుంటూరు: హలో... ఎక్కడున్నారు.. ఎక్కడున్నా సరే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేసి వెనక్కి రండి.. ఇది ఫోన్లో డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) నుంచి రెస్క్యూటీమ్ అధికారులకు వచ్చిన ఆదేశాలు. ఆరంభ శూరత్వంలో తమకు సాటి లేరని రాష్ట్రప్రభుత్వ పెద్దలు మరోసారి నిరూపించుకున్నారు. నెల్లూరు తరహాలో గుంటూరు నగరంలో ఎక్కడికక్కడ ఆన్లైన్లో ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకుంటాం... ఇందుకోసం నాలుగు ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశామంటూ ప్రగల్భాలు పలికిన మంత్రి నారాయణ, రాష్ట్ర పట్టణప్రణాళికాధికారులు నగరంలోని టీడీపీ నాయకుల ముందు తమ ఆదేశాలు ఏమాత్రం చెల్లవని అంగీకరించక తప్పలేదు. పరిశీలన ఊసే లేదు.. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి కొంతమంది అధికారులను ప్రభుత్వం టాస్క్ఫోర్స్ టీమ్లో సభ్యులుగా నియమించింది. టాస్క్పోర్స్ బృందం బుధవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు న గరంలో 200 చదరపు మీటర్లు కలిగిన భవన నిర్మాణాలను మొదటి విడతగా దాదాపు 200 ఇళ్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగాయా? నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజు చెల్లించినదీ, లేనిదీ తదితర అంశాలను టాస్క్పోర్స్ సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేయకుంటే వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 7.30 గంటలకే నాలుగు టీమ్లు బయలుదేరి నగరంలోని నాలుగువైపులకు వెళ్లాయి. మధ్యాహ్నం వరకు తనిఖీలు చేశారు. అయితే అనుకోకుండా డీటీసీపీ నుంచి ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో రెస్క్యూ టీమ్లోని అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తనిఖీలు నిలిపివేసి వారివారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఎన్నికలు వస్తున్నాయనే.. వాస్తవానికి వందల సంఖ్యలో భవనాలను ఈ తనిఖీల్లో కూల్చివేయడం, లేదా నోటీసులు అందించడంతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉంది. నగరంలో తనిఖీలు ప్రారంభించిన వెంటనే టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎక్కువగా టీడీపీ నాయకులు, వారికి కావాల్సిన వారే బిల్డర్లుగా ఉండటంతో వారు ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ఇంకేముంది నగరంలో మరో మూడు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని, ఇటువంటి సమయంలో భవనాల జోలికి వస్తే పార్టీకి తీరని నష్టం ఏర్పడుతుందంటూ ప్రజాప్రతినిధులపై వత్తిడి తీసుకువచ్చారు. నగరంలో ఉన్న మంత్రి పుల్లారావు దృష్టికి ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన మంత్రి నారాయణ దష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. నగరపాలకసంస్థ ఎన్నికల దృష్ట్యా రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేయాలని, ఏమైనా ఉంటే ఎన్నికల తర్వాత చూడవచ్చంటూ వత్తిడి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి నారాయణ రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేయాలని డీటీసీపీకి ఆదేశాలు జారీచేయడంతో ఆయన రెస్క్యూటీమ్ అధికారులకు ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏది ఏమైనా నగరపాలకసంస్థ ఎన్నికలను అడ్డుపెట్టుకొని నగరంలో అ«నధికార భవనాలపై చర్యలకు టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారు. దీంతో ఏ నగరంలో లేని విధంగా అక్రమ కట్టడాలకు అడ్డగా గుంటూరు నగరం మారుతోంది. -
ఇకపై నిర్మాణాల తనిఖీలు
పట్టణ ప్రణాళిక అధికారి ధనుంజయరెడ్డి ‘సాక్షి’ ఎఫెక్ట్తో అడుగు ముందుకు నెహ్రూనగర్: నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ‘ఆన్లైన్ దోపిడీ’ శీర్షికతో ‘సాక్షి’లో బుధవారం ప్రచురించిన కథనంపై పట్టణ ప్రణాళికాధికారులు స్పందించారు. వాస్తవానికి నగరంలో ఆన్లైన్ ద్వారా ఇచ్చిన భవన నిర్మాణాల అనుమతులపై టాస్క్ఫోర్స్ బుధవారం నుంచి తనిఖీలు చేస్తుందని ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడిలతో వాటిని విరమించుకున్నారు. ఇదే సమయంలో ‘సాక్షి’లో బుధవారం వచ్చిన ‘ఆన్లైన్ దోపిడీ’ కథనంపై అధికారులు స్పందించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆన్లైన్లో ఇచ్చిన భవన నిర్మాణ దరఖాస్తులు, నిర్మాణాలను తనిఖీ చేసే బాధ్యత ఆయా డివిజన్ల్లోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు అధికారులు అప్పగిస్తున్నట్లు సిటీప్లానర్ ధనుంజయరెడ్డి తెలిపారు. అలాగే బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ పథకం కింద గృహానికి బీపీఎస్ నిర్ధారించకున్న బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఇక నుంచి ఏసీపీ నుంచి కాకుండా నేరుగా ఏ డివిజన్ దరఖాస్తులను వారికే పంపుతామని తెలిపారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్పై చర్యలకు సిఫార్సు చేస్తామని ప్రకటించారు. -
ఆర్టీఏ అధికారుల నిర్వాకం
♦ తనిఖీల పేరుతో ఆటోను వెంబడించిన కానిస్టేబుల్ ♦ వేగం పెంచిన డ్రైవర్.. వాహనం బోల్తా ♦ ప్రయాణికులకు తీవ్ర గాయాలు వికారాబాద్ రూరల్: ఆర్టీఏ అధికారుల నిర్వాకంతో ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. క్షతగాత్రుల కథనం ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా నుంచి మన్నెగూడ వెళ్లే ఆటోలో డ్రైవర్ అబ్దుల్ కరీం ప్రయాణికులను ఎక్కించుకుని బయలు దేరారు. శివారెడ్డిపేటకు చెందిన బాలుడు శివ(16), మన్నెగూడకు చెందిన లక్ష్మి, ఈశ్వరమ్మ, మల్లమ్మ ఆటోలో ఎక్కారు. రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత మారుతీనగర్ గేటు సమీపంలో ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బ్రిడ్జి దిగుతూనే ఆర్టీఏ తనిఖీలను గమనించిన ఆటో డ్రైవర్ కరీం వాహనం వేగం పెంచాడు. ఈక్రమంలో మారుతీనగర్ గేటువైపు ఆటోను తిప్పాడు. ఆర్టీఏకు చెందిన కానిస్టేబుల్ ఆటో డ్రైవర్ను చెయ్యి పట్టి బయటకు లాగాడు. దీంతో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బాలుడు శివ రెండు కాళ్లు విరిగి పోయాయి. ఆటోలో ఉన్న మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ అబ్దుల్ రహీంకు చేతికి గాయమైంది. ఉడాయించిన ఆర్టీఏ అధికారులు ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన ఆర్టీఏ అధికారులు వెంటనే అక్కడి నుంచి ఉడాయించారు. ప్రయాణికులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శివను హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ప్రమాదానికి కారణమైన ఆర్టీఏ అధికారులుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
సినిమా థియేటర్ల పరిశీలన
నాగర్కర్నూల్రూరల్: పట్టణంలోని శ్రీపూర్ రోడ్డులో ఉన్న రవి, రమణ థియేటర్లను తెలంగాణ పొల్యూషన్ బోర్డు సభ్యులు మంగళవారం పరిశీలించారు. థియేటర్లతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని గత కొంతకాలంగా పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో దావా చేయడంతో కోర్టు సూచనల మేరకు అధికారులు పరిశీలించారు. టాకీస్ నుంచి లోపల, బయట వెలువడుతున్న శబ్ద తరంగాలను ప్రత్యేక మానిటర్తో పరిశీలించారు. చట్టవిరుద్ధంగా పొల్యూషన్ ఉన్నట్లు తమ పరిశీలనలో తేలితే థియేటర్ యజమానులపై చర్య తీసుకుంటామని వారు పేర్కొన్నారు. -
108 అంబులెన్సులపై నిరంతర నిఘా
-తనిఖీలు చేయాలంటూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు -ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవలు అందించే '108' అంబులెన్సులపై నిరంతర తనిఖీలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ అంబులెన్సుల వైద్య సేవలకు సంబంధించి కొంతకాలంగా వస్తోన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ బుద్దప్రకాష్ ఎం.జ్యోతి ఇటీవల జిల్లాలకు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో 337 అంబులెన్సులు '108'కింద అత్యవసర వైద్య సేవల్లో పాలుపంచుకుంటున్నాయన్నారు. ఒక్కో అంబులెన్సు ప్రతీ రోజూ నాలుగు అత్యవసర కేసుల బాధితులను ఆసుపత్రులకు చేరవేస్తుందన్నారు. అయితే నాలుగే కాకుండా ఇంకా కొన్ని కేసుల్లో బాధితులను తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. రోజువారీ పర్యవేక్షణతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. అందుకోసం ప్రాంతీయ వైద్యాధికారి (ఆర్డీ), జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్వో), సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సీనియర్ ప్రజారోగ్యాధికారి తనిఖీలు చేయాలని ఆదేశించారు. తన జోన్ పరిధిలో నెలకు కనీసం 10 శాతం అంబులెన్సుల పనితీరును ఆర్డీ తనిఖీలు చేయాలని బుద్దప్రకాష్ అన్నారు. డీఎంహెచ్వో నెలకు 25 శాతం తనిఖీ చేయాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీనియర్ ప్రజారోగ్యాధికారి నెలలో ప్రతీ అంబులెన్సును తనిఖీ చేయాలని తెలిపారు. తనిఖీ చేసినట్లుగా అంబులెన్సులో ఏర్పాటు చేయాలన్నారు. తనిఖీల నివేదికను తనకు పంపించాలని ఆదేశించారు. గర్భిణీ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ వివరాలతో సహా ప్రతీ నెల ఒకటో తేదీన తన పరిధిలోని పర్యవేక్షణ సెల్కు మెయిల్ ద్వారా పంపించాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. అలాగే ప్రతీ నెల జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశమై 108 పనితీరుపై చర్చించి అందుకు సంబంధించిన మినిట్స్తో నివేదికను పంపించాలన్నారు. సీనియర్ ప్రజారోగ్య అధికారులు ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా గర్భిణీలను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు 108ను వినియోగించుకోవాలంటూ చైతన్య పరచాలని కోరారు. రాష్ట్ర స్థాయిలోని నోడల్ ఆఫీసర్ జిల్లాల్లో పర్యటిస్తే కనీసం ఒక్క అంబులెన్సునైనా తనిఖీ చేయాలన్నారు. -
వరంగల్ జిల్లాలో తనిఖీలు : నగదు స్వాధీనం
స్టేషన్ ఘన్పూర్: వరంగల్ జిల్లా రాఘవపుర్ చెక్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. మూడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడకు చెందిన వి.జే.రెడ్డి తన వాహనంలో తరలిస్తున్న రూ. 1.90 లక్షలు, హైదరాబాద్కు చెందిన ఎస్.ఎల్.రెడ్డి తన వాహనంలో లక్ష రూపాయలు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా వారి వద్ద నుంచి సదరు నగదును పోలీసులు తీసుకున్నారు. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసుల తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. -
విశాఖలో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు
-
విశాఖలో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. యానాపురం, షీలానగర్, సింహాచలం, విమ్స్, ఆనందపురం ప్రాంతాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సదరు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు. -
బాలిక హాస్టల్లో కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు : నెల్లూరు బస్వాడపాలెంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలిక హాస్టల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ మొత్తం ఆయన కలియ తిరిగారు. హస్టల్లో అందుతున్న వసతులను ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ సిబ్బంది... నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే హాస్టల్ భవనాన్ని నూతనంగా నిర్మిస్తామని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. -
ఆన్లైన్లో పాస్పోర్ట పరిశీలన
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాస్పోర్టు దరఖాస్తుదారులకు శుభవార్త. ఆన్లైన్లోనే దరఖాస్తులను పరిశీలించే విధానం ఈ ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దేశంలోని మహానగరాల్లో ఒకటైన చెన్నైలో అమెరికన్ ఎంబసీ, శ్రీలంక రాయబార కార్యాలయం, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఎందరో పారిశ్రామిక వేత్తల ద్వారా విదేశీ మార్కెట్తో ఎగుమతులు, దిగుమతులు సాగుతుంటాయి. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వేలాది మంది విద్యార్థులు చెన్నై నుంచి వెళుతుంటారు. గతంలో విదేశాలకు వెళ్లదలిచిన వారు మాత్రమే పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునేవారు. ఇలాంటి వారి సంఖ్య స్వల్పంగా ఉండేది. కానీ సాఫ్ట్వేర్ కంపెనీల పుణ్యమా అని భారత్కు ప్రపంచ దేశాలకు మధ్య దూరం తగ్గిపోయింది. రెండు దశాబ్దాలుగా పాస్పోర్టుల సంఖ్య పెరిగిపోయింది. చెన్నై నగరం నుంచి సగటున రోజుకు వెయ్యి మంది వరకు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గత ఏడాది చెన్నై నుంచి రెండు లక్షల పాస్పోర్టులు మంజూరయినాయంటే వీటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పోలీస్ తనిఖీలు తప్పనిసరి పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోగానే అధికారికంగా పడే తొలిఅడుగు పోలీస్ వెరిఫికేషన్ (పోలీస్ తనిఖీలు). జిల్లా స్థాయిలో ఎస్పీలు, నగరంలో పోలీస్ కమిషనర్లు స్వయంగా పాస్పోర్టు దరఖాస్తుల వ్యవహారాన్ని పరిశీలిస్తుండగా, పోలీస్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా పాస్పోర్టు పరిశీలన విభాగాలే ఉన్నాయి. సంబంధిత విభాగానికి చెందిన పోలీసులు దరఖాస్తు దారుడి నివాసం , ఆపరిసరాల్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి అతనిపై ఏమైన కేసులు, రౌడీషీట్లు వంటివి ఏమైనా ఉన్నాయాని తనిఖీ చేస్తారు. ఆ తరువాత ఇంటికి వచ్చి చిరునామాను నిర్ధారణ చేసుకుని ఇతర వివరాలపై విచారణ జరుపుతారు. అన్నీ సంతృప్తికరంగా ఉన్న పక్షంలో మాత్రమే పాస్పోర్టు మంజూరుకు సిఫార్సు చేస్తారు. చె న్నై నగరంలో రోజు రోజుకూ పాస్పోర్టు దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతుండగా, వాటి పరిశీలనకు నేరుగా వెళ్లడంలో జాప్యం జరుగుతోంది. సిబ్బంది కొరత, దరఖాస్తు దారుడు ఇంటిలో లేకపోవడం వంటి అనేక కారణాలతో ఒక్కో దరఖాస్తు పరిశీలనకు కనీసం వారం నుండి 20 రోజులు పడుతోంది. ఇక ఆన్లైన్లోనే పోలీస్ తనిఖీలు పాస్పోర్టు దరఖాస్తులపై పోలీస్ పరిశీలనలో జాప్యాన్ని నివారించేందుకు ఆన్లైన్ విధానం అమలులోకి తెస్తున్నారు. జనాభా జాబితా, ఆధార్ కార్డు, ఓటరు కార్డు తదితర వివరాలను పొందుపరుస్తారు. క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ పేరుతో దరఖాస్తులను అనుసంధానం చేస్తారు. ఈ రకమైన్ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు దారునిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే సంగతి పోలీస్ కార్యాలయం నుండే పసిగట్టేస్తారు. కేసులు లేని పక్షంలో వెంటనే పాస్పోర్టు మంజూరుకు సిఫార్సు చేస్తారు. ఈ విధానం వల్ల దరఖాస్తు దారుని ఇంటికి, పరిసరాల్లోని పోలీస్ స్టేషన్లకు పోలీసు సిబ్బంది తిరిగే బాధ తప్పుతుంది. అంతేగాక జాప్యానికి తావులేకుండా పాస్పోర్టు మంజూరవుతుంది. చెన్నైకు సంబంధించి పోలీస్ కమిషనర్ జార్జ్ స్వియ పర్యవేక్షణలో పాస్పోర్టు విభాగం పనిచేస్తోంది. పోలీసు తనిఖీలు ముగిసిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారానే పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి పాస్పోర్టు కార్యాలయానికి పంపే విధానం ఇప్పటికే అమలులో ఉండటం విశేషం. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి... విచారిస్తున్నారు. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీలు రాత్రి వరకు కొనసాగుతాయని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ ఎస్ జే జనార్దన్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ సిమీ ఉగ్రవాది వికార్తోపాటు అతడి గ్యాంగ్లోని నలుగురు సభ్యులు హతమైన సంగతి తెలిసిందే. అంతకుముందు నల్గొండ జల్లాలో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో మరణించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జానకీపురం, అలేరు పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు. -
ఇక నిత్య తనిఖీలు
తణుకు : మీ దగ్గర డ్రైవింగ్ లెసైన్స్ ఉందా.. వాహనానికి సంబంధించి సీ బుక్, ఇతర రికార్డులన్నీ ఉన్నాయా.. అవన్నీ ఉంటే పర్వాలేదు. అవి లేకుండా వాహనం నడుపుతూ రోడ్డెక్కితే బుక్కయిపోతారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నారా...? అయితే తస్మాత్ జాగ్రత్త. పార్టీకి వెళ్లి తక్కువ మోతాదులో అయినా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారా. మీ డ్రైవింగ్ లెసైన్సు రద్దు చేయడానికి అధికారులు ఎక్కడిక్కడే మోహరించి ఉంటారు. నిరంతర రహదారి భద్రత పేరుతో ఇప్పుడు రవాణా, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్లర్లు, సహాయ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లతోపాటు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. రవాణా శాఖ కమిషనర్ ఆదే శాలతో.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రెండ్రోజలు హడావుడి చేసే అధికారులు తర్వాత చేతులు దులుపుకోవడం ఇటీవల పరిపాటిగా మారింది. స్పెషల్ డ్రైవ్ పేరుతో నెలకు ఒకటి, రెండుసార్లు రహదారుల వెంట తనిఖీలు నిర్వహిస్తూ, పరిమితికి మంచి ప్రయాణికులను చేరవేసినా.. సరైన పత్రాలు లేకపోయినా.. మద్యం సేవించి వాహనం నడిపినా సంబంధిత వాహన చోదకులకు జరిమానా విధించేవారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని రహదారులపై నిరంతర భద్రత, నిఘా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రవాణా శాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు పోలీసు, రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల హైదరాబాద్ నుంచి 13 జిల్లాల డెప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు, ప్రయాణికులను చేరవేసే ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలతోపాటు ఆటోలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు మద్యం తాగి వాహనాలు నడిపేవారు గతంలో ఎన్నిసార్లు దొరికితే అన్ని పర్యాయాలు కోర్టుకు హాజరుపరచడం, జరిమానా విధించడం జరిగేది. ప్రస్తుతం ఒకే వ్యక్తి మూడు పర్యాయాలు మద్యం సేవించి పట్టుబడితే అక్కడిక్కడే డ్రైవింగ్ లెసైన్సు రద్దు చేసే అధికారాన్ని ప్రాంతీయ రవాణాశాఖ అధికారులకు (ఆర్టీవో) కట్టబెట్టారు. మరోవైపు అసలు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపే వ్యక్తులపై దృష్టి సారించి చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇందుకు తక్షణ చర్యలు చేపట్టాలంటూ జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎన్.శ్రీదేవి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 8 బృందాలను నియమించారు. ఎవరెవరు ఏయే రూట్లలో తనిఖీలు నిర్వహించాలనేది కూడా నిర్ధేశించారు. ఈ బృందాలు నిత్యం గస్తీ తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 11వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ బృందాలు పోలీసు అధికారులతో కలసి రహదారుల వెంబడి గస్తీ తిరుగుతారు. ఎప్పటికప్పుడు నమోదు చేసిన కేసుల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు.. అక్కడినుంచి రాష్ట్రస్థాయి అధికారులకు నివేదిక అందజేయాల్సి ఉంటుంది. -
ఆలయంలో మంత్రి బొజ్జల భార్య హల్చల్
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మ హల్చల్ చేశారు. శనివారం ఆలయంలోని అన్ని విభాగాలను తనిఖీలు చేసిన బృందమ్మ, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేయిస్తానని ఆలయ అధికారులకు హెచ్చరికలు జారీచేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి, ఆలయ ఈవో రామ్రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగి 24 గంటలు గడవక ముందే మంత్రి భార్య తనిఖీలు అంటూ హల్చల్ చేయడం తీవ్ర దుమారమైంది. మహాశివరాత్రి ఉత్సవాల టెండర్ల వ్యవహారంలో రాధారెడ్డి, రామ్రెడ్డిల మధ్య శుక్రవారం నాడు విభేదాలు తలెత్తడంతో గొడవ జరిగిన విషయం తెలిసిందే. -
డైట్సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
బుక్కపట్నం : డైట్సెట్ -2014 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం బుక్కపట్నంలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో ప్రారంభమైంది. మొదటిరోజు హాజరైన విద్యార్థులతో కళాశాల కిక్కిరిసి పోయింది. సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 24 దాకా కొనసాగుతుందని ప్రిన్సిపాల్ మునెయ్య తెలిపారు. చెక్లిస్టులో పేర్కొన్న విధంగా అన్ని సర్టిఫికెట్లను సక్రమంగా పరిశీలనాధికారులకు సమర్పించాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. అలాట్మెంట్ కాపీతో పాటు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలన్నారు. ర్యాంకుల వారీగా ఆయా కళాశాలలకు కేటాయిస్తామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయి. అనేక మంది ఇంటర్లో సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతం తీసుకున్నారు. తెలుగు ఉంటేనే సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని డైట్ సిబ్బంది చెప్పారు. నోటిఫికేషన్లో ఎలాంటి నిబంధనలు పేర్కొనలేదని, ఇప్పుడు మాత్రం ఇలా అంటున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు. దీనిపై డైట్ ప్రిన్సిపాల్ మునెయ్య స్పందిస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకుడు రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ బడాబాబులు
హైదరాబాద్ : వీకెండ్లో మందుబాబులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెక్పెట్టారు. జూబ్లీహిల్స్లో గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వారి తనిఖీల్లో పెద్ద ఎత్తున బడాబాబులు పట్టుపడినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో మొత్తం 18 మంది మద్యం తాగి బండి నడుపుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా 13 కార్లతో పాటు ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పట్టుబడినవారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచటం విశేషం. వీటిలో వీఐపీల కార్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వారం రోజుల క్రితం ఓ సినీనటుడి బంధువు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన విషయం తెలిసిందే. మరోవైపు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 9మందిపై కేసులు నమోదు చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఒక్కొక్కరికి మేజిస్ట్రేట్ పుష్పాదేశ్ముఖ్ రెండువేలు జరిమానా విధించారు. -
ఆదాయం పెరిగితేనే అదనపు రైళ్లు
సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు గిద్దలూరు : రైల్వేస్టేషన్ రోజు వారీ ఆదాయం పెరిగితేనే గిద్దలూరు మీదుగా అదనపు రైళ్లను నడపగలమని సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు చెప్పారు. స్థానిక రైల్వేస్టేషన్ను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించిన ఆయన.. స్టేషన్లోని అన్ని ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. రికార్డులను తనిఖీ చేసి టికెట్ల ద్వారా ఎంత ఆదాయం వస్తోందని ఆరా తీశారు. అక్టోబర్ నెలలో తక్కువ ఆదాయం రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో రూ.17.60 లక్షల ఆదాయంరాగా, ఈ నెలలో ప్రస్తుతానికి రూ.13.87 లక్షలు వచ్చినట్లు శ్రీరాములు గుర్తించారు. ఇలా ప్రతి నెలా ఆదాయం తగ్గుతుంటే అదనపు బోగీలు, రైళ్లు నడపడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిం చారు. గిద్దలూరు ప్రాంతంలో ఎక్కువ మంది ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారని, గరీభ్థ్ ్రరైలును ఇక్కడ ఆగేలా చర్యలు తీసుకోవాలని విలేకరులు కోరగా కనీసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించేందుకు టికెట్లు అమ్ముడుపోతేనే ఆ రైలును ఇక్కడ ఆపుతామని చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటే అదనపు సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే వారు గిద్దలూరులోనే పూర్తిస్థాయి టిక్కెట్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నడుస్తున్న రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, బోగీలు సిద్ధం కావాల్సి ఉందని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలి పారు. యడవల్లి రైల్వేస్టేషన్లో టిక్కెట్లు ఇచ్చేందుకు చొరవ చూపాలని కోరగా అక్కడ ఎంతమేర ఆదాయం వస్తుందో పరిశీలించి నివేదిక ప్రకారం టిక్కెట్లు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఎక్కువ సమయం పనిచేసేలా చూడాలని, చాలా మంది నంద్యాల వెళ్లి రిజర్వేషన్ చేయించుకుంటున్నారని, రైల్వే విచారణ కోసం ఫోన్ చేస్తే సిబ్బంది ఫోన్ తీసి సమాధానం చెప్పడం లేదని విలేకర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్టేషన్లో గంటకొట్టే వద్ద ఉన్న బూజు, దుమ్మును గమనించిన శ్రీరాములు.. స్టేషన్ మాస్టర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆయనతో పాటు పలువురు టిక్కెట్ కలెక్టర్లు, స్క్వాడ్ అధికారులు ఉన్నారు. -
రాష్ట్రావ్యాప్తంగా వాహనాలు తనిఖీ: శిద్దా రాఘవరావు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీ, స్కూల్ బస్సులను తనిఖీ చేసి... రేపటి సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని 13 జిల్లాల ఆర్డీవోలను ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో శిద్ధా రఘవరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్ల పరిస్థితి బాగోలేదన్ని తెలిపారు. రోడ్ల పరిస్థితిపై కూడా నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నష్టాలలో ఉన్న అర్టీసీ గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అందులోభాగంగా అర్టీసీ సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాలు గుర్తించి... వాటిని లీజు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జేఎన్ఎన్యూఆర్ఎమ్ కింద 500 బస్సులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. 1000 పల్లె వెలుగు బస్సులు కొనుగోలు చేస్తామని శిద్దా రాఘవరావు చెప్పారు. -
తిరుమలలో కారు కలకలం
తిరుమల: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అనుమానాస్పద పరిస్థితుల్లో కారు కనిపించడంతో కలకలం రేగింది. యాత్రికుల వసతి సముదాయం వద్ద రెండు నెలలుగా ఓ కారును ఆపి ఉంచారు. ఈ విషయం భద్రతాధికారుల దృష్టికి రావడంతో బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ సిబ్బందిని రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం బయట వ్యాపిండంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. -
12 బస్సుల సీజ్
సాక్షి, సంగారెడ్డి: ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్న ప్రైవేటు ట్రాన్స్పోర్టు ఆపరేటర్లపై ఆర్టీఏ అధికారులు కొరడా జులుపించారు. మహబూబ్నగర్ జిల్లాలో వోల్వో బస్సు దగ్ధమై 45 మంది ప్రయాణీకులు దుర్మరణం చెందిన నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు శుక్రవారం నిబంధనలు పాటించని 12 బస్సులను సీజ్ చేశారు. ఉదయం 04-08 గంటల మధ్య రవాణా శాఖ ప్రత్యేక బృందాలు విస్తృతంగా సోదాలు జరిపాయి. జహీరాబాద్ చెక్పోస్టు వద్ద ఐదు, కంది వద్ద ఐదు బస్సులు, చిరాగ్పల్లి బైపాస్ ఒక బస్సు, పటాన్చెరు రహదారిపై ఒక వోల్వో బస్సును సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిలో కేసినేని, నేట, నకోడా, సహార, సూపర్ ట్రావెల్స్ చెందిన ఒక్కో వాహనం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయటపడడానికి ఎమర్జెన్సీ ద్వారం లేకపోవడం, పర్మిట్ లేని ప్రాంతంలో తిప్పుతుండడం, ప్రథమ చికిత్స పెట్టే లేకపోవడం, ప్రత్యామ్నాయం డ్రైవర్ లేకపోవడం, డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం తదితర ఉల్లంఘనలు బయటపడడంతోనే ఈ బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ మమతా ప్రసాద్ తెలిపారు. సీజ్ చేసిన బస్సుల యజమానులపై కేసులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. గురువారం జరిపిన సోదాల్లో పరిమితికి మించిన ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న అక్బర్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సును అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. -
ప్రైవేటు బస్సులపై కొరడా
సాక్షి, సంగారెడ్డి: మహబూబ్నగర్ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమై 45 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో రవాణా శాఖ మేల్కొంది. గురువారం ఉదయం 04 - 08 గంటల మధ్య రవాణా శాఖ అధికారులు జిల్లాలో ప్రైవేటు బస్సులపై అకస్మిక దాడులు జరిపారు. జహీరాబాద్, చిరాగ్పల్లి, కంది చెక్పోస్టుల వద్ద బస్సులను నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రవాణా పర్మిట్లు, ఇన్స్యూరెన్స్, ప్రయాణికుల సంఖ్య, డ్రైవర్ లెసైన్స్ తదితర అంశాలను పరిశీలించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ మమతా ప్రసాద్ నేతృత్వంలో 15 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ దాడుల్లో పాల్గొన్నారు. సుమారు 70 బస్సులను తనిఖీ చేశారు. అధికారుల కన్నుగప్పి తనిఖీలను తప్పించుకోవడానికి జహీరాబాద్ చెక్పోస్టు మీద నుంచి కాక చిరాగ్పల్లి మీదుగా ఎక్కువగా ప్రైవేటు బస్సులు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిపిన సోదాల్లో పరిమితికి మించిన ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న అక్బర్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సును అధికారులు సీజ్ చేశారు. ప్రయాణీకులను పటాన్చెరువద్ద దింపేసి ఆ బస్సును సంగారెడ్డి మండలం కందిలోని డీటీసీ కార్యాలయానికి తరలించారు. బస్సు సీటింగ్ సామర్థ్యం డ్రైవర్తో సహా 37 ఉండగా మరో 5 మంది ప్రయాణీకులను అధికంగా కలిగి ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రయాణికుల వివరాలను సైతం రిజిస్టర్లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో బస్సు యజమానిపై క్రిమినల్ కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. డ్రైవర్ యూనిఫాం వేసుకోకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం లాంటి స్వల్ప ఉల్లంఘనలతో పట్టుబడిన మరో రెండు బస్సులపై జరిమానాలు విధించి వదిలేశారు. ఇకపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని డీటీసీ మమతా ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు.