civils
-
అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ
పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధిలో తల్లి తండ్రుల పాత్ర చాలా కీలకమైంది. అమ్మానాన్న ప్రోద్బలంతోనే బాగా చదువుకుంటే, మంచి జీవితం ఉంటుందని, సాధించాలనే పట్టుదల ఉంటే, ఎలాంటి కలల్ని అయినా సాకారం చేసుకోవచ్చనే గుణం అలవడుతుంది. అలా బాగా చదువుకుని తన కుటుంబానికి పేరు తేవడమే కాదు యూపీఎస్సీ సివిల్స్(UPSC Civils) మంచి ర్యాంకు సాధించాడు. అతని పేరే మర్రిపాటి నాగభరత్(Marripati Naga Bharath). పదండి నాగ భరత్ సక్సెస్గురించి తెలుసుకుందాం.వైఎస్సార్ కడప జిల్లాకు నాగభరత్ చిన్నప్పటినుంచి చదువులో బాగా రాణించాడు. ఉన్నత విద్య పూర్తైన తర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాడు. చక్కటి జీవితం. సంతృప్తికరమైన జీతం. కానీ కలెక్టర్ అవ్వాలన్న అమ్మ కోరిక నెరవేరలేదనే వెలితి అతడిని వెంటాడింది. అందుకే 15 లక్షల రూపాయల వేతనాన్ని వదులుకొని మరీ యూపీఎస్సీపై దృష్టి పెట్టాడు. 2023 యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) ఫలితాల్లో విద్యార్థి ఉన్నత ర్యాంక్ సాధించాడు.నాగ భరత్ ఖరగ్ పూర్ ఐఐటీలో( Kharagpur IIT ) బీటెక్ పూర్తి చేయడంతో పాటు అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. అయితే సివిల్స్ కొట్టాలనే ప్రయత్నాల్లో 2022లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కు వచ్చాడు. అయినా సరే పట్టువీడలేదు. ఆశించిన ఫలితాలు రాకపోయినా నాగభరత్ మాత్రం వెనుకడుగు వేయలేదు. నిపుణుల శిక్షణలో మరింత రాటు దేలాడు. చివరికి 580వ ర్యాంక్ సాధించాడు.తల్లి కోరిక (ఈమె 2013లో చనిపోయింది.) మేరకు బాల్యం నుంచి కలెక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్న నాగభరత్ భవిష్యత్తుపై చాలా ధీమా వ్యక్తం చేశాడు. ఐఏఎస్గా ఎంపికై పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని వెల్లడించాడు. రైతుల కష్టాలు తీర్చడానికి తన వంతు ప్రయత్నిస్తానని చెప్పడం విశేషం. అంతేకాదు తన చిన్నతనంలో తండ్రి కలెక్టర్ అంటే ఏంటి? ఈ పదవి ద్వారా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవచ్చు అనేది చెప్పేవారట. పేదలకు ఎలా సాయం చేయవచ్చో కూడా వివరించేవారట. తన తల్లి కోరిక,కల కూడా అదేనని, అమ్మనాన్నలే తన విజయానికి స్ఫూర్తి అని చెప్పాడు గర్వంగా. ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణలో ఉన్నాడు. (ఒకే ఒక్క మాటతో 94 నుంచి 71 కిలోలకు : ఏం చేసిందో తెలిస్తే ఫిదానే!) View this post on Instagram A post shared by Marripati Naga Bharath (@bharath_avow) -
లక్షల వేతనాన్ని వద్దునుకుని సివిల్స్కి ప్రిపేరయ్యింది..కట్చేస్తే..!
ఐఏఎస్ అవ్వాలనేది చాలామంది యువత ప్రగాఢమైన కోరిక. కొందరు అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అసామాన్య ప్రతిభతో ఐఏఎస్ అవ్వుతారు. ఆ క్రమంలో తొలి , రెండు ప్రయత్నాల్లో తడబడి.. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించినవారు ఉన్నారు. అలా ఇలా కాకుండా విదేశాల్లో లక్షల్లో జీతం సంపాదిస్తూ సెటిల్ అయ్యి..కూడా ఐఏస్ అవ్వాలనుకోవడం సాహసోపేతమైన నిర్ణయం. అదికూడా విదేశాల్లోని లగ్జరీ వాతావరణానికి అలవాటు పడ్డవాళ్లు ఇక్కడకు వచ్చి సివిల్స్ ప్రిపేరవ్వడం అంటే అంతా పిచ్చా నీకు అంటారు. బానే ఉన్నావు కదా అనే అవమానకరమైన మాటలు వినిపిస్తాయి. అందులోనూ పెళ్లైన అమ్మాయికైతే ఏంటీ ఆలోచన అని తిట్టిపోస్తారు. కానీ ఈ అమ్మాయి వాటన్నింటిని పక్కన పెట్టి మరీ భర్త అండదండలతో సివిల్స్ ప్రిపేరయ్యింది. మరీ ఐఏఎస్ సాధించిందా అంటే..హర్యానాకు దివ్య మిట్టల్ లండన్ ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్లోని జేపీ మోర్గాన్ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసింది. హయిగా లక్షల్లో జీతం తీసుకుంటూ ధర్జాగా గడుపుతుండేది. పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అక్కడే సెటిల్ అయ్యింది. ఎందుకనో ఆ లైఫ్ ఆమె కస్సలు నచ్చలేదు. ఏదో తెలియని అసంతృప్తి దీంతో ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్కి ఎందుకు ప్రిపేరవ్వకూడదు అనుకుంది. కఠినతరమైన ఈ పరీక్షను ఇలాంటి పరిస్థితిలో సాధించి గెలిస్తే ఆ కిక్కే వేరు అనుకుంది. అనుకున్నదే తడువుగా భర్తతో కలిసి స్వదేశానికి వచ్చేసి మరీ 2012లో యూపీఎస్సీ(UPSC)కి ప్రిపేరయ్యింది. అయితే తొలి ప్రయత్నంలో అనుకున్నది సాధించలేకపోయింది. ఐపీఎస్తో సరిపెట్టకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిలో 2013 లో మళ్ళీ పరీక్ష రాసి 68 వ ర్యాంకు సాధించి ఐఏఎస్(IAS) కలను సాకారం చేసుకుంది. ప్రస్తుతం ఆమె మిర్జాపూర్, సంత్ కబీర్ నగర్ బస్తీ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేస్తోంది. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ఐఏఎస్కి సిద్ధమయ్యే అభ్యర్థులు ఎల్లప్పడూ తమ లక్ష్యంపై దృష్టి సారించాలి. "చక్కటి ప్రణాళితో ఎలా చదవుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకోసారి విరామం తీసుకుంటే..రిఫ్రెష్గా మరింత బాగా చదవగలుగుతారని సలహాలిస్తోంది." దివ్య. ఇలాంటి కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఏ అభ్యర్థి అయిన ఫోన్కి దూరంగా ఉంటే అన్నుకున్నది సాధించగలుగుతారని అంటోంది. ఇక్కడ దివ్య స్టోరీ కారణాలు చెప్పేవారికి చెంపపెట్టు. అనుకున్నది సాధించాలనుకునేవారు ముందు చూపుతో సాగిపోవాలే గానీ తప్పుచేస్తన్నానా..అనే అనుమానంతో ఊగిసలాడితే ఘన విజయాలను అందుకోలేరు, రికార్డులు సృష్టించలేరు అని ధీమాగా చెబుతోంది దివ్య. ఆమె గెలుపు ఎందరికో స్ఫూర్తిదాయకం.(చదవండి: ప్రపంచంలోనే అత్యల్ప సంతోషకరమైన దేశాలివే..! భారత్ ఏ స్థానంలో ఉందంటే..) -
సక్సెస్ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!
'సక్సెస్' అంది అందనంత దూరంలో మిస్ అవ్వుతూ దోబుచులాడుతుంటే విసిగిపోతాం. మన వల్ల కాదని చేతులెత్తేస్తాం. కానీ ఈమె అలా చేయలేదు. చిన్నప్పటి నుంచి సక్సెని ఏదోలా అందుకున్నా..ఇప్పుడు ఈ సివిల్స్ ఎగ్జామ్(Civil Services Examination)లో ఇలా ఈ తడబాటు ఏంటనీ అనుకుంది. సక్సెస్ అంతు చేసేదాక వదలిపెట్టేదే లే అని భీష్మించింది. తాడోపేడో అన్నట్లు ఆహర్నిశలు కష్టపడింది. చివరికి విజయమే తలవంచి వొళ్లోకి వచ్చి వాలింది. ఫెయిల్యూర్స్తో ఆగిపోకూడదు ఓటమిని ఓడించేలా గెలిచితీరాలని చేతల్లో చూపించింది.. సివిల్స్లో గెలిచి మంచి ర్యాంకు సంపాదించుకోవాలనేది చాలామంది యువత కోరిక. ఆ క్రమంలో మాములు తడబాటులు రావు. ఒకనోకదశలో మన వల్ల కాదని చేతులెత్తేసే పరిస్థితి వచ్చేస్తుంది. దాన్ని తట్టుకుని ముందుకు సాగిన వారే విజయతీరాలను అందుకోగలరు. అలాంటి గొప్ప సక్సెనే అందుకుంది నీపా మనోచ(Neepa Manocha). ఆమె విద్యా నేపథ్యం వచ్చేసి..2015లో ప్రసిద్ధ లేడీ శ్రీ రామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది. ఇక 2017లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) నిర్వహించే సెక్రటరీ (CS) ప్రొఫెషనల్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై స్టాక్ ఎక్స్ఛేంజ్ కంపెనీ సెక్రటరీ(CS)గా ఉద్యోగం సాధించింది. అయినా సంతృప్తి చెందాక ఇంకా ఏదో సాధించాలన్న ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకమైన సివిల్స్ సర్వీస్కి ప్రిపేరయ్యింది. పగలు స్టాక్ ఎక్ఛ్సేంజ్ మార్కెట్లో కంపెనీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ.. రాత్రిళ్లు ప్రిపరేషన్ సాగించేది. అయితే సీఎస్లో వరించినట్లుగా సక్సెస్ని సులభంగా అందుకోలేకపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఫెయిలైంది. తన ఆత్మవిశ్వాసమే సన్నగిల్లిపోయేలా ఓటమిని ఎదుర్కొంది. లాభం లేదు ఈ ఎగ్జామ్ మన వల్ల కాదనే నైరాశ్యం తెప్పించేలా నిపాకి సివిల్స్ చుక్కలు చూపించింది. ఇక్కడ నిపా ఆ తడబాటుల్ని తరిమేసి సక్సెని అందుకునేదాక వెనక్కి తగ్గకూడదనే పట్టుదల, కసితో చదివింది. చివరికి ఆమె కష్టం ముందు ఓటమే తలవంచి..దోబులాచుడతున్న సక్సెస్ ఒడిసిపట్టింది. నాలుగో ప్రయత్నంలో 144వ ర్యాంకు సాధించి ఐపీఎస్ సాధించింది. అంతేగాదు నిపా గనుక వరుస ఓటములతో ఆగిపోతే ఎవ్వరికీ ఆమె గురించి తెలిసి ఉండేది కాదు. ఓ ఫెయ్యిల్యూర్ స్టోరీగా మిగిలిపోయేది. ఓటమే తలొగ్గాలి తప్పా తాను కాదనుకుంది కాబట్టే సివిల్స్లో నిపా నెగ్గింది. అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. వదలిపెట్టకుండా పలకరిస్తున్న ఓటమి అంతు చూడాలే తప్ప తగ్గొద్దని చాటి చెప్పింది. (చదవండి: డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..) -
13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా
సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈవిషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. ఒకటి కాదు రెండు ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించడమే కాకుండా, యూపీఎస్సీలో మంచి (60) సాధించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన శ్రద్ధా గోమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి!శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధా చిన్నప్పటినుంచీ తెలివైన విద్యార్థిని. ఇండోర్లోని సెయింట్ రాఫెల్స్ హెచ్ఎస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది.తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని బావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో టాపర్గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగుళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభకు గాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రచేతులమీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపరకొనసాగుతూనే ఉంది. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేసింది. ముంబై, లండన్లో విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్కు తిరిగొచ్చి, 2021లొ సివిల్ సర్వీసెస్కు (సీఎస్ఈ) ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధా మంచి ఆర్టిస్ట్ కూడా. -
Humera Begum: టీచర్ కొలువిచ్చిన సివిల్ పవర్
ఆమధ్య వచ్చిన కమల్హాసన్ సినిమాలో ఒక డైలాగ్....‘ఈ లోకంలో అత్యంత ధైర్యవంతులు ఎవరో తెలుసా? కోల్పోవడానికి ఏమీ మిగలని వాళ్లు!’ఒకప్పుడు హుమేరా బేగం పరిస్థితి అలాగే ఉండేది. సివిల్స్కు ఎంపిక కావాలనేది తన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు అడుగులు పడకుండానే...‘మేమున్నాం’ అంటూ సమస్యలు, వాటితోపాటు వచ్చిన బాధలు వరుస కట్టాయి. ఇలాంటప్పుడు లక్ష్యం మసక మసకగా కనిపించడం మాట అటుంచి అసలే కనిపించకపోయే ప్రమాదం ఉండవచ్చు.‘కోల్పోవడానికి ఏమీ లేదు’ అనుకునే స్థితిలో ఉన్న తనకు భయం ఎందుకు! ఆ ధైర్యంతోనే సమస్యలను తట్టుకునే నిలబడింది. ఎస్జీటి ఉర్దూ టీచర్గా సెలెక్ట్ అయింది. మరి సివిల్స్ కల..? అంటారా... ‘వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా, ఒక అడుగుతోనే ఆరంభం అవుతుంది’ అనే మాట మనకు తెలియనిది కాదు...హుమేరా బేగం స్వస్థలం తెలంగాణాలోని వనపర్తి. నాన్న రోజువారీ కూలీగా సైదాబాద్ (హైదరాబాద్)లో ఒక మదర్సాలో పని చేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్గా కొంతకాలం పని చేసింది. అన్న ఓబిద్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది హుమేరా చిన్నప్పటి కల. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు కష్టాలు మొదలయ్యాయి.తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. ప్రైవేట్ స్కూల్ నుంచి చాదర్ఘట్లోని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. మరోవైపు తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తమకు దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.‘నా తండ్రి వెయ్యి ఏనుగుల బలం’ అనుకునే అమ్మాయి ‘తండ్రి లేని బిడ్డ’ అయింది.తండ్రి చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగి వనపర్తి వెళ్లిపోయారు. హైదరాబాద్ విడిచి వెళుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘హైదరాబాద్ అంటే పెద్ద సిటీ... పెద్ద చదువులు చదువుకోవచ్చు’ అనుకునేది. ధైర్యం ఇచ్చే నాన్న లేడు. ధైర్యం ఇచ్చే మహా నగరం దూరం అయింది.అయితే తన కల మాత్రం దూరం కాకుండా జాగ్రత్త పడింది. హుమేరాలో చదువుకోవాలనే తపన చూసి అక్క (చిన్నమ్మ కూతురు) సమీన, కానిస్టేబుల్గా పనిచేస్తున్న బావ అహ్మద్ అలీ హుమేరా కుటుంబాన్ని మళ్లీ హైదరాబాద్ తీసుకువచ్చారు. పట్టుదల గట్టిదైతే ఒక్కో ద్వారం దానికదే తెరుచుకుంటూ దారి చూపుతుంది. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల, కల జైలు సూపరింటెండెంట్ వరకు వెళ్లింది. చంచల్గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్గౌడ్ ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ తరఫున హుమేరాకు అండగా నిలబడ్డాడు. ‘మేము సైతం’ అన్నారు జైలు సిబ్బంది. తమ పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు హుమేరాకు అవకాశం ఇచ్చారు.జైలు అధికారులు, సిబ్బంది సహకారం హుమేరా కుటుంబానికి ఆర్థికంగా భరోసాను ఇచ్చాయి. ఆమెలో ఆత్మవిశ్వాస శక్తిని రెండింతలు చేశాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసింది. నేరేడ్మెట్లో డీఎడ్ కూడా పూర్తి చేసింది. కష్టపడే వారిని విజయం వెదుక్కుంటూ వస్తుంది... అన్నట్లు హుమేర కష్టం వృథా పోలేదు. ఎస్జీటీ ఉర్దూ టీచర్గా ఎంపిక అయింది.ఒకప్పుడు... ‘ఐఏఎస్ కావాలనేది నా కల’ అని హుమేరా అని ఉంటే నవ్వేవాళ్లేమో. ఎందుకంటే తాను ఉన్న దయనీయమైన పరిస్థితుల్లో ఇంటర్మీడియేట్ పూర్తి చేయడమే చాలా కష్టం. ఇప్పుడు ఎవరూ ఎగతాళిగా నవ్వే పరిస్థితి లేదు. ‘యస్... ఆ అమ్మాయి కచ్చితంగా సాధిస్తుంది’ అంటారు ఇప్పుడు. ఈ నమ్మకం కలిగించడానికి ఆమె ఎంతో కష్టపడింది. గుండె ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. హుమేరాది ఎంతోమంది పేద అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే పట్టుదల. ఆమె భవిష్యత్ కల నెరవేరాలని బలంగా కోరుకుందాం.జీవితం ముగిసిపోయింది అనుకున్న సమయంలో....సివిల్స్ సాధించాలనే నా కలను దృష్టిలో పెట్టుకొని ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ సహకారంతో శివకుమార్ గౌడ్ సార్ నాకు దిల్లీకి చెందిన ఓ కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఓపెన్ డిగ్రీతో పాటు, నా ట్యూషన్లు కొనసాగిస్తూనే మిగిలిన సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా జీవితం ముగిసింది అనుకున్న సమయంలో ఒక దారి దొరికింది. నాలా అవకాశాల కోసం కష్టపడే ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకే నేను సివిల్స్ను లక్ష్యంగా పెట్టుకున్నాను.– హుమేరా బేగం – నాగోజు సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్ స్టేట్ బ్యూరో -
TG: ‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం' చెక్కుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం పంపిణీ చేశారు. సివిల్స్లో ప్రిలిమ్స్ పాసై మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న 135 మందికి ఆర్థికసాయం అందించారు. ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. 90 రోజుల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని, మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో తెలంగాణ యువత రాణించాలని, అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేదలకు మంచి విద్యను అందిస్తామని, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్దిలో పనిచేస్తున్నాం. సివిల్స్ విద్యార్ధులకు ఆత్మస్తైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నం. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నాం. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలి. మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తాంగతంలో సచివాలయంలోరి రానివ్వని పరిస్థితి ఉండేది. సచివాలయంలోకి వెళ్తే అరెస్ట్ చేయించారు. చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. పరిశ్రమలు పెట్టే వాళ్లంతా వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ల కోసం వెతుతుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడాకారులకు శిక్షణ ఇస్తాం. 2028 ఒలింపిక్స్లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. పేద పిల్లలకు న్యాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. వచ్చే 10, 15 రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తాం. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. ’ అని తెలిపారు. ‘డిప్యూటీ సీఎం భట్టి కమెంట్స్..‘సివిల్స్లో మంచి ర్యాంకులు సాధించి తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి. సివిల్స్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి కొంతైనా ఉపశమనం లభిస్తుంది. మన రాష్ట్రం నుంచి ఐఎఎస్ అయిన వారు ఏ రాష్ట్రంలో పనిచేసినా.. మనకు గర్వకారణమే.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను 5 వేల కోట్ల తో ఏర్పాటు చేస్తున్నాం. మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గ్లోబలైజేషన్కు అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకుంటున్న వారిలో ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 21 మంది. ఓబీసీ కేటగిరిలో 62 మంది. ఎస్సీ కేటగిరిలో 19 మంది.. ఎస్టీ కేటగిరీలు 33 మంది. ఎస్టీ కేటగిరిలో 33 మందిలో 22 మంది మహిళా అభ్యర్థులు ఉండడం స్ఫూర్తిదాయకం. దేశంలో ఈ తరహా పథకం అమలు ఇదే తొలిసారి.’ అని తెలిపారు. -
లక్ష్యం.. క్రమశిక్షణే విజయ రహస్యం
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ మానేసి సివిల్సే లక్ష్యంగా.. సివిల్స్కు ఎంపిక కావడమే లక్ష్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని మెయిన్స్కు ప్రిపేర్ అయిన మెరుగు కౌశిక్.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేసిన ఆయన.. ఢిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు 8–9 గంటలపాటు ప్రిపేర్ అయినట్లు చెప్పారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్కు ప్రిపరేషన్ మొదలు పెట్టానని, ఆ తర్వాత ఏడాది పాటు జాబ్ చేశానని తెలిపారు. ప్రిలిమ్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి మెయిన్స్ రాసినట్లు పేర్కొన్నారు. ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యం అని చెప్పారు. తనకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదన్నారు. తన తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారని, తల్లి గృహిణి అని చెప్పారు. విధి వంచించినా... విధి వంచించినా.. విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా.. చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తి చేసి కుటుంబ సభ్యులు, గురువుల సహకారంతో విశాఖపట్టణానికి చెందిన హనిత వేములపాటి సివిల్స్లో 887వ ర్యాంక్ సాధించి సత్తాచాటారు. తాను ఆత్మవిశ్వాసంతో చదువును కొనసాగించి సివిల్స్ ప్రిపేరయ్యానని ఆమె చెప్పారు. దేశంలోనే అత్యున్నత సివిల్స్ సర్విసెస్కు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాత జస్టిస్... మనవరాలు సివిల్స్ ర్యాంకర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామస్వామి మనవరాలు ఐశ్వర్య నీలిశ్యామల సివిల్స్లో 649వ ర్యాంకు సాధించారు. బీటెక్ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రణాళికాబద్ధంగా ప్రిపేరై ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తాత జస్టిస్ రామస్వామి తనను ఎంతగానో ప్రేరేపించారని, అందుకే ప్రజాసేవ చేయాలనే లక్షంతో సివిల్స్ రాశానని అన్నారు. తండ్రి సివిల్ సర్వెంట్, తల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలు అని, తన మామ ఐఏఎస్ అధికారి అని పేర్కొన్నారు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి : అలేఖ్య ఖమ్మం జిల్లాలో సాధారణ కానిస్టేబుల్ కూతురు అలేఖ్య. పోలీసు వృత్తిలోనూ నిజాయితీని చాటుకున్న తండ్రిని ఆమె ఆదర్శంగా తీసుకుంది. పాఠశాల విద్య నుంచే సివిల్స్ లక్ష్యంగా ఎంచుకుంది. అనుక్షణం తండ్రి ప్రోత్సాహం ఆమెకు కలిసి వచ్చింది. తన కష్టాలే ఆమెను మానసికంగా బలపడేలా చేశాయి. ఐపీఎస్ కావాలన్న లక్ష్య సాధనలో ఆమె 938వ ర్యాంకు సాధించింది. నాలుగుసార్లు సివిల్స్ విజయానికి దగ్గరగా వెళ్లిన ఆమె ఎన్నడూ నిరుత్సాహ పడలేదు. ఐదోసారి అనుకున్నది సాధించారు. ప్రతీ తల్లీదండ్రీ పిల్లలను ప్రోత్సహించాలని ఆమె చెప్పార. ప్రజా జీవితానికి చేరువగా విధి నిర్వహణ చేయాలని ఆమె కోరుకుంటున్నారు. వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్కు.. పూడూరు: వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్కు ఎంపికయ్యారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్పల్లికి చెందిన దయ్యాల బాబయ్య, శశికళ దంపతుల కుమారుడు తరుణ్ (24) సివిల్స్లో 231వ ర్యాంక్ సాధించారు. 2017లో తరుణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. 2023లో బీటెక్ పూర్తి చేశారు. ఐఏఎస్కు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, పేదలకు సేవ చేసే అవకాశం వచ్చిందని తరుణ్ తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తరుణ్ ఇంటికి వెళ్లి అభినందించారు. మారుమూల గ్రామానికి చెందిన తరుణ్ ఐఏఎస్కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. 60 మంది తోటి కానిస్టేబుళ్ల ముందు సీఐ అవమానించారని.. చిక్కడపల్లి: ‘60 మంది పోలీసుల ముందు ఇన్స్పెక్టర్ అవమానించారు. నాపై వ్యక్తిగత కోపంతో తిట్టారు. 2013 నుంచి 2018 వరకు చేసిన కానిస్టేబుల్ జాబ్కు ఆరోజే రిజైన్ చేశాను. ఐఏఎస్ సాధించాలని ఆ రోజే కసితో దీక్ష తీసుకున్నాను. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్టారెడ్డి చెప్పారు. తనకు ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఈ జాబ్లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా గుడ్లూరు పీఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న తనకు సీఐ చేసిన అవమానమే ఈ రోజు సివిల్స్ సాధించేందుకు దోహదపడిందన్నారు. తనకు జంతువులంటే ఎంతో ప్రేమ అని, మనుషుల కోసం 108 వాహనం ఉన్నట్లే జంతువుల కోసం దేశవ్యాప్తంగా 109 అంబులెన్స్ వాహనం కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని నానమ్మ పెంపకంలో పెరిగానని వివరించారు. ఢిల్లీ ఐఐటీ వదిలి.. దూర విద్య చదివి... ముషీరాబాద్: నల్లగొండ జిల్లా అల్వాలకు చెందిన సత్యనారాయణరెడ్డి స్కూల్ ప్రిన్సిపల్, తల్లి హేమలత టీచర్. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నత విద్యావంతులు కావడంతో కుమారుడు పెంకేసు ధీరజ్రెడ్డిని ఐఐటీ చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఐఐటీ ఢిల్లీలో సీటు సాధించారు. మొదటి సంవత్సరంలో 9.3 సీజీపీఏ సాధించి ఐఐటీ ఢిల్లీలోనే టాప్ 7లో నిలిచాడు. ఇలా సాగిపోతున్న తరుణంలో ధీరజ్రెడ్డికి చదువు పరుగు పందెంలా అనిపించింది. ఎప్పుడూ కంప్యూటర్తో కుస్తీ, మెకానికల్ లైఫ్ అనిపించి ఈ చదువు తనకు ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అయినప్పటికీ కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తల్లిదండ్రులు నీకు నచ్చకపోతే ఐఐటీ వదిలేయమని చెప్పారు. దీంతో ఐఐటీని మధ్యలోనే ఆపేసి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే డిగ్రీ అడ్మిషన్లు అయిపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్(దూర విద్య)లో బీఏ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ అడ్మిషన్ కేవలం డిగ్రీకి మాత్రమే.. వెంటనే సివిల్స్పై దృష్టి సారించాడు. తల్లిదండ్రుల్లో మాత్రం కుమారుడి భవిష్యత్తు మీద ఆందోళన మొదలైంది. 2019లో మొదటిసారి సివిల్స్ ఫలితాల్లో 0.6 మార్కులతో రాలేదు. రెండవ ప్రయత్నంలో 17 మార్కులతో, మూడవ ప్రయత్నంలో ప్రిలిమ్స్లో ఫెయిలయ్యాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిoచి నాలుగోసారి 173వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు దారులు వేసుకున్నాడు. మేస్త్రీ కుమారుడికి 574వ ర్యాంక్ కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ కాలనీకి చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్ ఆరో ప్రయత్నంలో 574వ ర్యాంకు సాధించారు. రజనీకాంత్ కుటుంబానిది రాజంపేట మండలం ఆర్గోండ గ్రామం. రామారెడ్డిపేట సిద్ధిరాములు, పద్మ దంపతుల రెండవ కుమారుడు. పేద కుటుంబమే. తల్లి గృహిణి కాగా, తండ్రి భవన నిర్మాణ పనులతోపాటు డ్రైవర్గా చేస్తారు. చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడ్డామని, కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని రజనీకాంత్ చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తమ అబ్బాయి సివిల్స్ సాధించి తమ జన్మను సార్థకం చేశాడని తల్లిదండ్రులు ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. బీడీ కార్మికురాలి కొడుకు సివిల్స్ ర్యాంకర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ 27వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయికిరణ్ తండ్రి నందాల కాంతారావు మహారాష్ట్రలోని భివండిలో చేనేత కార్మికుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీ బీడీలు చుట్టేవారు. కాంతారావు కేన్సర్తో 2016లో మరణించారు. ఆ సమయంలో సాయికిరణ్ వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2018లో క్యాంపస్ ఇంటరŠూయ్వలో క్వాల్కమ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం వచ్చింది. బాల్యం నుంచి ఐఏఎస్ కలగా ఉన్న సాయికిరణ్ అప్పటి నుంచి ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా సివిల్స్కు ప్రిపేరయ్యాడు. క్రితంసారి విఫలమైనా.. ఈసారి మాత్రం విజయం సాధించి తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. పాలమూరు బిడ్డ... ప్రతిభకు అడ్డా సివిల్స్ లక్ష్యంగా నిద్రాహారాలు మానేసి చదివిన పాలమూరు బిడ్డ అనుకున్నది సాధించింది. ఆలిండియా మూడో ర్యాంకు సాధించింది. మహబూబ్నగర్కు జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే విజయ శిఖరాలు అధిరోహించడం విశేషం. అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి, మంజులతకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనన్యరెడ్డి కాగా.. రెండో సంతానం చరణ్య. పదో తరగతి వరకు మహబూబ్నగర్ గీతం హైసూ్కల్లో చదివిన అనన్య.. ఇంటర్ విద్యను హైదరాబాద్లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎంతో కష్టపడి చదివి సివిల్స్లో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ మీద దృష్టి సారించానని చెప్పారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివానని పేర్కొన్నారు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకున్నానని, ఇందుకు హైదరాబాద్లోనే కోచింగ్ తీసుకుని పకడ్బందీగా ప్రిపేరయ్యానని చెప్పారు. అయితే ఈ ఫలితాల్లో మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్ను ఎంచుకున్నట్లు తెలిపారు. తమ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని తానేనని చెప్పారు. అనన్య తల్లి గృహిణి కాగా, తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. -
Hyderabad: సివిల్స్ విజేతల సరికొత్త ఫ్యాక్టరీ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సివిల్ సర్వీసెస్..దేశంలో కోట్లాది మంది యువత మదిలో మెదిలే అత్యున్నత ఉద్యోగం. అన్ని పరీక్షల కంటే అత్యంత క్లిష్టంగా, అనేక వడపోతలతో సాగే ఈ ప్రక్రియ గురించి వింటేనే..వామ్మో మనకెలా సాధ్యం..? అని అన్పిస్తుంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఐఎస్, ఐడీఈఎస్.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల కోసం ఒకప్పుడు ఢిల్లీకి వెళ్లి మరీ సన్నద్ధులైన తెలుగు రాష్ట్రాల వారిని పరిశీలిస్తే ఫెయిల్యూర్ స్టోరీలే ఎక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాంతం క్రమంగా పట్టు బిగిస్తోంది..ర్యాంకుల సాధనలో సక్సెస్ అవుతోంది. 2021–2022 సివిల్స్ ఫలితాలే అందుకు నిదర్శనం అని నిపుణులు అంటున్నారు. తాజాగా ర్యాంకులు సాధించినవారిలో 46 మంది ఇక్కడివారే కావటం కొత్త చరిత్రగా పేర్కొంటున్నారు. హైదరాబాద్ సివిల్స్ విజేతల ఫ్యాక్టరీగా రూపుదిద్దుకున్న ఫలితమే గడిచిన నాలుగేళ్లుగా తెలుగింటి బిడ్డల జైత్రయాత్ర అని చెబుతున్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ఎప్పుడూ టాప్లో ఉండే ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాల సరసన ఇప్పుడు తెలంగాణ కూడా చేరుతోంది. అమెరికా, ఐటీలొద్దంటూ.. ఇంజనీరింగ్, మెడికల్ ఇతర ప్రొఫెషనల్ చదువుల అనంతరం ఉన్నత ఉద్యోగం, అమెరికా లేదా ఇండియాలో ఐటీ ఉద్యోగాల్లో చేరేందుకు ఉత్సాహం చూపే ప్రతిభావంతుల్లో ఎక్కువమంది దృష్టి ఇప్పుడు సివిల్స్ వైపు మళ్లుతోంది. సమాజం నుంచి తీసుకున్న దాంట్లో కొంతైనా సేవా రూపంలో తిరిగి సమాజానికి ఇవ్వాలనే లక్ష్యంతో కొందరు సివిల్స్ వైపు అడుగులేస్తున్నారు. ఢిల్లీ ఐఐటీలో గోల్డ్మెడల్ సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అజ్మీరా సంకేత్ జపాన్లో మంచి ప్యాకేజీతో ఉన్నత ఉద్యోగం సంపాదించాడు. అయితే తన స్నేహితుడు కట్టా రవితేజ సివిల్స్కు ఎంపికై సమాజానికి చేస్తున్న సేవ, అందులోని సంతృప్తిని గమనించి తానూ సివిల్స్ రాసి 35వ ర్యాంకు సాధించాడు. తనకు మిత్రుడు రవితేజ రోల్మోడల్ అని సంకేత్ సాక్షికి చెప్పారు. అవగాహన పెరిగింది గతంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు? వారి విధులు ఎలా ఉంటాయి? సమాజంలో వారు తీసుకొచ్చే మార్పు ఎలా ఉంటుందనే అంశాలపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. చాలామందికి డాక్టర్లు, ఇంజనీర్లే ఎక్కువ అనే భావన ఉండేది. మరోవైపు సివిల్స్ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు చాలావరకు ఢిల్లీ కేంద్రంగానే ఉండేవి. దీంతో ఢిల్లీతో ఎక్కువ అనుసంధానమై ఉండే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ ఎంపిక అయ్యేవారు. అయితే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. సివిల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈజీగా తెలిసిపోతోంది. హైదరాబాద్ కేంద్రంగానూ మంచి కోచింగ్ సెంటర్లు వచ్చాయి. అలాగే అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అవగాహన పెరిగింది. ఫలితంగా మనవారు ఇప్పుడు సివిల్స్పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. విజయం సాధిస్తున్నారు. – దురిశెట్టి అనుదీప్ (సివిల్స్–2017 ఆలిండియా టాపర్, మెట్పల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా), (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్) ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించొచ్చు నాన్న వెంకటేశ్వర్లు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. నేను బీటెక్లో ఉన్నప్పుడే మా కలెక్టర్ అలా అన్నారు. ఎస్పీ ఇలా అన్నారు అంటూ వారి గురించి గొప్పగా చెబుతుండేవారు. అప్పుడే నేనూ నిర్ణయించుకున్నా కలెక్టర్ కావాలని. అందుకోసం ఐదేళ్లు కష్టపడ్డా. కుటుంబసభ్యులు అందించిన సహకారంతో చివరకు జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించా. నాలా అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ దొరికితే రాష్ట్రం నుంచి అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్లు వస్తారు. – ఉమా హారతి, సివిల్స్ 3వ ర్యాంకర్ నాలాంటి వాళ్లకు సాయం చేయాలని.. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తూ నన్ను, అన్న, చెల్లెల్ని చదివించింది. మా కోసం ఆమెపడే కష్టం ఎప్పుడూ కళ్ల ముందే ఉండేది. అందుకే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ ఇంటర్ వరకు చదివా. ఐఐటీ చెన్నైలో సీటు వచ్చినప్పుడు కనీస ఫీజు సరే అక్కడికి వెళ్లేందుకు, ఇతర ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. అయితే కొందరు దాతలు ముందుకొచ్చి సహాయం చేయడంతో ఐఐటీ çపూర్తి చేశా. ఆపై ఓఎన్జీసీలో ఉన్నత ఉద్యోగం సంపాదించా. కానీ ఏదో వెలితిగా అనిపించేంది. నేను కూడా కొంత మందికి సహాయం చేయాలంటే మరింత ఉన్నత స్థితిలో ఉండాలనుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి రెండవ ప్రయత్నంలోనే సివిల్స్లో 410 ర్యాంకు సాధించా. – డొంగ్రి రేవయ్య, ఆసిఫాబాద్ జిల్లా ఇప్పుడు అన్నీ హైదరాబాద్లోనే.. ఒకప్పుడు సివిల్స్ రాయాలంటే ఢిల్లీ వెళ్లాలి. అక్కడ ఉండి కోచింగ్ తీసుకోవాలి. అక్కడి వాతావరణం, ఆహారం, భాష అన్నీ మనకు కొత్తగా అనిపించేవి. దాంతో ఎక్కువగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల వారే సివిల్స్లో రాణించేవారు. కానీ ఇప్పుడు అన్నింటికీ హైదరాబాద్ అడ్డా అయ్యింది. నిపుణుల కొరత లేదు. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికా లాంటి దేశాలపై మోజు తగ్గించుకుని మరీ సివిల్స్ వైపు వస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ఎంపికవుతుండటంతో, ఇతరులు వారిని ఆదర్శంగా తీసుకుని విజేతలవుతున్నారు. – ఎం.బాలలత, సివిల్స్ ట్రైనర్ మాధోపట్టి..సివిల్స్ విజేతల పుట్టినిల్లు! యూపీ రాజధాని లక్నోకు 300 కి.మీ. దూరంలో ఉన్న మాధోపట్టి గ్రామంలో మొత్తం 75 ఇళ్లు. అందులో సివిల్స్ సాధించిన వారు ఏకంగా నలభై మంది ఉండటం అబ్బురపరిచే విషయం. ఇక్కడ ఉపాధికి సరిపోయే భూమి లేక అందరూ ఉన్నత చదువులనే ఆ«ధారం చేసుకున్నారు. ఇలా 1952లో డాక్టర్ ఇందుప్రకాష్ తొలిసారి యూపీఎస్సీ పరీక్షల్లో రెండో ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన నలుగురు సోదరులు ఐఏఎస్ ను సాధించారు. అందులో వినయ్సింగ్, ఛత్రçసల్సింగ్లు బిహార్, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఇలా మాధోపట్టి మేధావులకు నిలయంగా మారింది. పురుషులతో పాటు మహిళలు కూడా ఐఏఎస్, ఐపీఎస్లకు ఎంపికయ్యారు. అలా మాధోపట్టి ఐఏఎస్ల ఫ్యాక్టరీగా మారింది. -
UPSC Result 2023: కోచింగ్ నచ్చలేదు.. ఇంటిలోనే.. ఇంటర్నెట్లో శోధిస్తూ..
నారాయణపేట/హుజూర్నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సార్లు యూపీఎస్సీ రాసినా ర్యాంకు రాలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. ఐదోసారి సైతం పట్టుదలతో ప్రయత్నించి ఏకంగా ఆలిండియా 3వ ర్యాంకు సాధించింది. ఆమెనే నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, శ్రీదేవిల కుమార్తె నూకల ఉమాహారతి. హైదరాబాద్లో 2010లో 9.8 జీపీఏతో టెన్త్లో ఉత్తీర్ణత సాధించిన ఉమాహారతి... 2012లో ఇంటర్ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు. ఆపై 2017లో ఐఐటీ హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లుది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందినవారు. యూపీఎస్సీ 2020లో నిర్వహించిన ఐఈఎస్లో ఆమె తమ్ముడు సాయి వికాస్ 12వ ర్యాంకు సాధించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం సోమవారమే ముంబైలోని సీపీడబ్ల్యూడీలో ఐఈఎస్గా విధుల్లో చేరగా ఆ మర్నాడే అక్క ఉమాహారతి సివిల్స్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కానుండటం విశేషం. సివిల్స్లో ర్యాంకు సందర్భంగా ఉమాహారతితో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ ఆమె మాటల్లోనే.. గత సివిల్స్ పేపర్లూ చదివా... సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం బదులు సివిల్స్వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఢిల్లీలోని వాజీరావు కోచింగ్ సెంటర్లో 2018–19లో శిక్షణ పొందినప్పటికీ అక్కడి కోచింగ్ నచ్చలేదు. ఇంటికొచ్చి ఆప్షనల్ సబ్జెక్టు అంథ్రోపాలజీతోపాటు కామన్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్లో స్టడీ మెటీరియల్ సెర్చ్ చేశా. గత సివిల్ పేపర్లనూ చదివా. దేశ, అంతర్జాతీయ ఆంశాలు, సంఘటనలపై నిత్యం ఆంగ్ల దినపత్రికలు చదివేదాన్ని ఈ ఏడాదంతా నాన్న, అమ్మతో నారాయణపేటలో ఉండి చదివా. సివిల్స్ సాధించా. ఈసారి 2,500 ర్యాంకుల్లో ఏదో ఒకటి వస్తుందనుకున్నా. మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. విఫలమైనా తమ్ముడు వెన్నుతట్టాడు... ఐపీఎస్ అధికారి అయిన మా నాన్న వెంకటేశ్వర్లు నుంచే స్ఫూర్తి పొందా. తమ్ముడు సాయి వికాస్ను ఆదర్శంగా తీసుకున్నా. గత ప్రయత్నాల్లో నాలుగుసార్లు విఫలమైనా బాధపడొద్దని తమ్ముడు అండగా నిలిచాడు. స్నేహితులు నిఖిల్, అంకితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. -
సివిల్స్ గురుగా మహేశ్ భగవత్ మార్కు.. ఆలిండియా టాపర్లుగా 125 నుంచి 150 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ ‘సివిల్స్ గురూ’గా మరోసారి తన మార్కు చాటారు. సివిల్స్–2022 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ఆయన వద్దే ఇంటర్వ్యూ శిక్షణ పొందారు. తన వద్ద ఇంటర్వ్యూ శిక్షణ పొందిన వారిలో ఆల్ ఇండియా టాపర్లుగా దాదాపు 125 నుంచి 150 మంది నిలిచారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్ భగవత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆలిండియా టాపర్, యూపీ యువతి ఇషితా కిశోర్కు తాను మెంటార్గా ఉండటం సంతృప్తినిచ్చిందన్నారు. తనతోపాటు మరికొందరు గత పదేళ్లుగా సివిల్స్ అభ్యర్థులకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది టాప్–100 ర్యాంకుల్లో 14వ ర్యాంకర్ కృతికా గోయల్, 22వ ర్యాంకర్, తిరుపతివాసి పవన్ దత్తా, 25వ ర్యాంకర్ కశ్మిరా సంకే, 27వ ర్యాంకు సాధించిన యాదవ్ సూర్యభాన్, 35వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన అజ్మీర సంకేత్ కుమార్, 38వ ర్యాంకర్ అనూప్దాస్, 54వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన రిచా కులకర్ణి, 74వ ర్యాంకర్ ఐషి జైన్, 76వ ర్యాంకు సాధించిన దబోల్కర్ వసంత్, 78వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్లు తన వద్ద ఇంటర్వ్యూ పొందినవారేనని మహేశ్ భగవత్ తెలిపారు. గత ఐదు నెలలుగా తాను ఇంటర్వూలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విజేతలు గర్వం పెరగకుండా చూసుకోవాలని, ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఆయన సూచించారు. -
కానిస్టేబుల్కు సివిల్స్లో 667 ర్యాంకు..
ఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న రామ్భజన్ కుమార్ సివిల్స్లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్భజన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్భజన్కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్గా చేరారు. ఇది కూడా చదవండి: సివిల్స్లో నారీ భేరి -
భార్య సివిల్స్ పోరాటం..భర్తలో అనుమానం
సాక్షి, బెంగళూరు: భార్యను సినిమాశైలిలో హత్య చేసిన భర్త బండారం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు. మడివాళ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ అని ఫిర్యాదు చేసిన భర్త పృధ్వీరాజ్ (48) పై అనుమానంతో పోలీసులు అదుపులోకి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డీసీపీ సీకే.బాబా కేసు వివరాలను వెల్లడించారు. మడివాళలో గత 13 ఏళ్లుగా ఎలక్ట్రానిక్ప్ అప్లయన్స్ దుకాణం నిర్వహిస్తున్న బిహార్కు చెందిన పృధ్వీరాజ్, 8 నెలల కిందట జ్యోతికుమారి (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెది కూడా బిహారే. గత కొద్దిరోజులనుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య విద్యావంతురాలు కాగా ఆమె సివిల్స్కు ప్రిపేరవుతోంది. ఒక యువకునితో తరచూ ఫోన్లో మాట్లాడేది. దీంతో భర్త ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. చివరకు ఆమెను హత్యచేయాలని పృధ్వీరాజ్ పథకం రూపొందించాడు. భర్త పృధ్విరాజ్ భార్య జ్యోతి (ఫైల్) ఉడుపిలో తొలి యత్నం విఫలం ఇద్దరి సెల్ఫోన్లు ఇంట్లో పెట్టి ఈ నెల 2న భార్యను ఉడుపి మల్పె బీచ్కు తీసుకెళ్లడానికి జూమ్ కారును బాడుగకు తీసుకున్నాడు. స్నేహితుడు సమీర్కుమార్ను కూడా తీసుకెళ్లాడు. బీచ్లో భార్యను ముంచేసి సహజ మరణంగా నమ్మించాలన్నది భర్త కుట్ర. కానీ సముద్రం లోతులోకి దిగలేక ప్లాన్ ఫలించలేదు. తరువాత సకలేశపురకు తీసుకెళ్లి కారులోనే ఆమెను చున్నీతో గొంతుబిగించి ప్రాణాలు తీసి అక్కడే పొదల్లో పడేసి ఇంటికి చేరుకున్నాడు పృధ్వీరాజ్, అతని మిత్రుడు. చదవండి: (మహిళపై అత్యాచారం.. బీజేపీ నేతపై కేసు నమోదు చేయాలని కోర్టు సీరియస్) మిస్సింగ్ అని ఫిర్యాదు 5వ తేదీన మడివాళ పోలీస్స్టేషన్లో భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సెల్ఫోన్ ఇంట్లోనే ఉండటాన్ని తెలుసుకుని అనుమానంతో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు చివరకు అనుమానం వచ్చి భర్తను తమదైన శైలిలో విచారించగా ఒప్పుకున్నాడు. భార్య తనను తీవ్ర వేధింపులకు గురిచేసిందని చెప్పాడు. రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాయడానికి, శిక్షణ సమయంలో ఢిల్లీకి వెళ్లిన సమయంలో అక్కడ ఒక యువకునితో సంబంధం పెట్టుకుందని, దీంతో విరక్తి చెంది హత్యచేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతని మిత్రుని కోసం గాలింపు జరుగుతోంది. -
సోషల్ మీడియాకు దూరంగా ఉంటే సక్సెస్ సాధ్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సోషల్ మీడియాకు వీలైనంత దూరం ఉంటే సక్సెస్ త్వరగా సాధ్యమవుతుందని సివిల్స్ ఆలిండియా 136 ర్యాంక్ సాధించిన అరుగుల స్నేహ అన్నారు. సక్సెస్ అయ్యాక మాత్రం సోషల్ మీడియాలో మనమే ఉంటామని చెప్పారు. శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్నేహ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విషయాన్ని ఎంత తొందరగా ఆకళింపు చేసుకుంటామనే దాన్నిబట్టి ఎన్ని గంటలు చదవాలనే దానిపై ప్రణాళిక నిర్దేశించుకోవాలని సూచించారు. నెగెటివ్ ఆలోచనలను రాకుండా చూసుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. ఓటములను గెలుపునకు నాందిగా భావించాలని చెప్పారు. తాను మూడు విడతల్లో విఫలమై, మూడో విడతలో ఒకే ఒక్క మార్కుతో సివిల్స్ ర్యాంక్ కోల్పోయినప్పటికీ పట్టు వదలకుండా నాలుగో విడతలో విజేతగా నిలిచానన్నారు. స్నేహితులతో ఎప్పటికప్పుడు గ్రూప్ డిస్కషన్స్ ద్వారా అనేక సందేహాలు నివృతి చేసుకున్నట్లు స్నేహ పేర్కొన్నారు. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలను రోజూ కచ్చితంగా చదవి నోట్స్ తయారు చేసుకోవాలని వివరించారు. ‘సాక్షి’ తరపున జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్నేహను సన్మానించి మెమొంటో అందజేశారు. -
27 ఏళ్ల క్రితం వదిలేసిన చదువు.. కొడుకు కోసం కలం పట్టిన నాగరాణి
బచ్చు స్మరణ్రాజ్. సివిల్స్ 676వ ర్యాంకు విజేత. లక్షల మంది పోటీపడిన పరీక్షల్లో అతని ఆలోచనాధారకు తల్లి నాగరాణి అక్షర రూపమిచ్చారు. సివిల్స్కోసం స్మరణ్తో పాటు ఆమె సైతం అహర్నిశలు శ్రమించారు. 27ఏళ్ల క్రితం డిగ్రీతో చదువు ఆపేసిన ఆమె కలానికి పదును పెట్టి.. సెకన్లు, నిమిషాలను లెక్కిస్తూ కాగితాలు నింపేశారు. ప్రతి ప్రశ్నకు అతడు మాటల్లో సమాధానం చెబుతుంటే ఆమె తన కలంతో అక్షరాలను పరుగులు పెట్టించారు. కొడుకు విజయంలో ప్రత్యక్ష భాగస్వామిగా నిలిచిన నాగరాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తార్నాకకు చెందిన స్మరణ్ చెన్నై ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ (బీటెక్) పూర్తి చేశారు. 2016 డిసెంబర్లో ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. చేరిన కొద్ది రోజులకే 2017 ఫిబ్రవరిలో ఆకస్మాత్తుగా అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న స్మరణ్ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ హేమరేజ్గా నిర్ధారించారు. శస్త్రచికిత్స తప్పనిసరైంది. కలం పట్టుకోవడమే కష్టం... చెన్నైలోనే ఓ ప్రముఖ ఆసుపత్రిలో జరిగిన అరుదైన సర్జరీతో అతడు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు. మెదడుకు రక్షణగా ఉండే కపాల భాగాన్ని 37 రోజులు అతని పొట్టలోనే భద్రపరిచి అనంతరం తలకు అమర్చి కుట్లువేశారు. కానీ బ్రెయిన్ హేమరేజ్తో కుడివైపు శరీరానికి పక్షవాతం వచ్చింది. మరో మూడున్నరేళ్ల పాటు ఫిజియోథెరపీ చికిత్స పొందాడు. కుడివైపు భాగం అతని స్వాధీనంలోకి వచ్చింది. కానీ చేతివేళ్ల కదలిక కష్టమైంది. చదవగలడు. కానీ రాయలేడు. ఐఏఎస్ కావాలని కలలుగన్న స్మరణ్కు అది అవరోధంగా మారింది. అంతేకాదు.. కొన్ని సంస్థలైతే అతనికి శిక్షణనిచ్చేందుకూ నిరాకరించాయి. మరోసారి నిరాశకు గురైన స్మరణ్ కలను సాకారం చేయాలని తల్లిదండ్రులు నాగరాణి, రమేష్లు సంకల్పించారు. సివిల్స్ కోచింగ్ ఇస్తోన్న బాలలతను సంప్రదించారు. అక్కడ అతని ఆశయానికి అండ లభించింది. కలం పట్టుకొని గెలిపించారు... ఆ శిక్షణ స్మరణ్కు మాత్రమే కాదు. అతని తల్లికి కూడా. ఇద్దరికీ కలిపి పరీక్షలు నిర్వహిం చిన బాలలత... కొడుకు చెప్పే వేగాన్ని ఆమె అందుకోగలుగుతుందా? లేదా? అని పరీక్షిం చారు. అలా 37 పరీక్షలు నిర్వహించారు. కొడుకు కోసం పరీక్షలు రాసేందుకు ఏడాది పాటు ప్రాక్టీస్ చేశారామె. స్మరణ్ రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడితే.. ఆ అంశాలను వేగంగా రాసేందుకు నాగరాణి పోటీపడ్డారు. తప్పుల్లేకుండా స్పష్టంగా రాసేందుకు యూట్యూబ్ శిక్షణ తీసుకున్నారు. నిమిషానికి రాయగలిగే అక్షరాలను లెక్కిస్తూ వేగం పెంచారు. ‘మొదట్లో గంటకో పేజీ రాయడం కష్టంగా ఉండేది. క్రమంగా 4 గంటల్లో 40 పేజీలు రాసే నైపుణ్యం వచ్చింది. స్మరణ్ చదివే పుస్తకాల్లోని అంశాలే రాయడం వల్ల సివిల్స్ పరీక్షల్లో ఇబ్బంది కాలేదు’ అని నాగరాణి చెప్పారు. అమ్మనే స్క్రైబ్.. ఎందుకంటే? సాధారణంగా ఏ పరీక్షల్లో అయినా రాయలేనంత వైకల్యం ఉన్న వాళ్లు స్క్రైబ్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అభ్యర్ధి చెప్పే సమాధానాలను స్క్రైబ్ తప్పుల్లేకుండా, ఉన్నదున్నట్లుగా రాయాలి. ‘స్క్రైబ్గా వ్యవహరించేందుకు బయటివాళ్లు అందు బాటులో ఉండొచ్చు. కానీ వాళ్లకు మా అబ్బాయి గెలుపు పట్ల తపన, అంకి తభావం ఉండవు కదా. అందుకే స్మరణ్ తల్లి ఆ బాధ్యతను తీసుకుంది’ అని స్మరణ్ తండ్రి రమేష్కుమార్ చెప్పారు. పైగా స్క్రైబ్గా వ్యవహరించేవాళ్లు యూపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలు రాసే అర్హతను కోల్పోతారు. ‘నాకు, మా అబ్బాయిని గెలిపించడం కంటే గొప్ప పోటీ పరీక్ష మరొకటి లేదు కదా’ అని నవ్వేశారు నాగరాణి. -
క్రేన్ ఆపరేటర్ కూతురికి 323వ ర్యాంక్.. స్మార్ట్ఫోన్తో ప్రిపరేషన్!
రాంఘర్(రాంచి): పేద కుటుంబం..కోచింగ్ తీసుకునే స్తోమత లేదు..అయినప్పటికీ వెనుకాడలేదు. రోజుకు 18 గంటలపాటు చదువుకుని, స్మార్ట్ఫోన్ను ఉపయోగించుకుని యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరైంది. రెండు రోజుల క్రితం వెలువడిన యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా 323వ ర్యాంక్ సాధించింది. జార్ఖండ్కు చెందిన దివ్యా పాండే(24) ఘనత ఇది. రాంచీ యూనివర్సిటీ నుంచి దివ్య 2017లో డిగ్రీ పొందారు. ఈమె తండ్రి జగదీష్ ప్రసాద్ పాండే సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్)లో క్రేన్ ఆపరేటర్గా పనిచేసి 2016లో రిటైరయ్యారు. ‘ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ఫోన్ సివిల్స్ సాధించేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇంటర్నెట్లోని అపార సమాచారాన్ని వాడుకున్నా. రోజుకు 18 గంటలపాటు సొంతంగా చదువుకున్నా. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. యూపీఎస్సీ కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఏడాది కష్టానికి తొలి ప్రయత్నంలోనే ఫలితం దక్కింది’ అని దివ్యా పాండే తెలిపారు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం పనిచేస్తానన్నారు. కుమార్తె సాధించిన ఘనతతో జగదీష్ ప్రసాద్ ఆనందానికి అవధుల్లేవు. ‘నాకు చాలా గర్వంగా ఉంది. దివ్య ఎంతో కష్టపడింది. అందుకు తగిన ఫలితం దక్కింది’ అని అన్నారు. దివ్య చెల్లెలు ప్రియదర్శిని పాండే కూడా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణురాలైంది. -
తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2021 తుది ఫలితాలను (ఇంటర్వ్యూ) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్ పోస్టులకు ఎంపిక చేసింది. సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లి యశ్వంత్కుమార్రెడ్డి 15వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ.. యశ్వంత్కుమార్రెడ్డి నేపథ్యమిదీ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లె యశ్వంత్కుమార్రెడ్డి తల్లిదండ్రులు.. పుల్లారెడ్డి, లక్ష్మీదేవి. యశ్వంత్ వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కూలురు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు, రాజంపేట నవోదయలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివారు. విజయవాడలో ఇంటర్, కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఐవోసీఎల్ కంపెనీలో చేరారు. అనంతరం గ్రూప్–1లో మూడో ర్యాంక్ సాధించి సీటీవోగా కర్నూలులో పనిచేస్తూ సివిల్స్లో శిక్షణ పొందారు. 2020లో సివిల్స్లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సివిల్స్ రాసి పట్టుదలతో 15వ ర్యాంక్ సాధించారు. పూసపాటి వంశీకురాలికి 24వ ర్యాంక్ విశాఖ జిల్లా ఎండాడకు చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్లో 24వ ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా ద్వారపూడికు చెందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పూసపాటి కృష్ణంరాజు మనవరాలు ఈమె. సాహిత్య తల్లిదండ్రులు.. జగదీష్వర్మ, పద్మజ. బీఫార్మసీలో నేషనల్ టాపర్గా నిలిచి ఎమ్మెస్సీ చేసిన సాహిత్య ఏడాదిపాటు ఉద్యోగం చేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్కు సిద్ధమయ్యాను’ అని సాహిత్య తెలిపారు. సత్తా చాటిన నర్సీపట్నం యువకుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్య భరద్వాజ్ 28వ ర్యాంకు సాధించారు. 2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. భరద్వాజ్ తండ్రి సత్యప్రసాద్ హైస్కూల్లో హెచ్ఎంగా, తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి చేసిన భరద్వాజ్ కొద్దికాలం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలాన్ని శిక్షణకు వెచ్చించి విజయం సాధించారు. ‘పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా నా వంతు కృషి చేస్తాను.. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే నా అభిమతం’ అని భరద్వాజ చెప్పారు. కందుకూరు కోడలికి 37వ ర్యాంక్ నెల్లూరు జిల్లా కందుకూరు కోడలు వి.సంజన సింహ 37వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. హైదరాబాద్కు చెందిన ఆమె హైదరాబాద్లోనే బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. భర్త హర్ష ప్రోత్సాహంతో సివిల్స్కు ప్రయత్నించిన సంజన మూడో ప్రయత్నంలో ఐఆర్ఎస్కు ఎంపికై., ప్రస్తుతం హైదరాబాద్లో ఇన్కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని సంజన చెప్పారు. 56వ ర్యాంకర్ డాక్టర్ కిరణ్మయి కాకినాడ రూరల్ వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్లో ఆలిండియా స్థాయిలో 56వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి కొప్పిశెట్టి లక్ష్మణరావు హైదరాబాద్లో రక్షణశాఖ (డీఆర్డీఎల్)లో సీనియర్ టెక్నికల్ అధికారిగా, తల్లి వెంకటలక్ష్మి టీచర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కిరణ్మయి ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎంఎస్ చేసి అక్కడే వైద్యురాలిగా పనిచేశారు. 2019లో సివిల్స్ డానిక్స్లో 633 ర్యాంకు సాధించి ఆర్డీవో స్థాయి ఉద్యోగానికి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. ఉన్నతోద్యోగాలు వదులుకొని.. 62వ ర్యాంకు సాధించిన తిరుమాని శ్రీపూజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండికి చెందినవారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీపూజ ఎన్ఐటీ సూరత్కల్లో బీటెక్ చేశారు. అనంతరం సివిల్స్కు ప్రిపేరయ్యారు. ‘లక్షలాది రూపాయల వేతనం కూడిన ఉన్నతోద్యోగాలు వచ్చినా చేరలేదు. మొదటిసారి సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. రెండోసారి ర్యాంకును సాధించాను’ అని శ్రీపూజ చెప్పారు. సత్తా చాటిన రైతు బిడ్డ 2021 సివిల్స్లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్కుమార్ సత్తా చాటారు. పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్కుమార్రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. ఇంటర్ గుడివాడలో చదివి, ఖరగ్పూర్ ఐఐటీ చేశారు. 4వ ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. రాజమహేంద్రి కుర్రాడికి 99వ ర్యాంకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన తరుణ్ పట్నాయక్ తొలి ప్రయత్నంలోనే 99వ ర్యాంకు సాధించారు. తరుణ్ తండ్రి రవికుమార్ పట్నాయక్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచిలో క్లర్క్గా పనిచేస్తుండగా, తల్లి శారదా రాజ్యలక్ష్మి వైజాగ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తరుణ్ పట్నాయక్ గౌహతి ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ‘సివిల్స్కు స్వంతంగా చదువుకుంటూనే తొలి ప్రయత్నంగా పరీక్ష రాశాను. 99వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఏఎస్గా ఎంపికై ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యం నెరవేరింది’ అని తరుణ్ పట్నాయక్ తెలిపారు. ఎమ్మిగనూరు అమ్మాయికి 128వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికాజైన్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో 128వ ర్యాంకు సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్కుమార్, అనిత దంపతుల కుమార్తె అయిన అంబికాజైన్ 10వ తరగతి వరకు ఇక్కడే చదివారు. ఇంటర్మీడియెట్, డిగ్రీలను హైదరాబాద్లో పూర్తి చేసి ఢిల్లీలోని సౌత్ ఏషియన్ వర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఎంఏ చేశారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆన్లైన్ కోచింగ్..154వ ర్యాంక్ నంద్యాల జిల్లా నందిపల్లెకు చెందిన వంగల సర్వేశ్వరరెడ్డి, మల్లేశ్వరమ్మల కుమార్తె మనీషారెడ్డి సివిల్స్లో 154వ ర్యాంకు సాధించింది. మనీషా ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేసింది. సివిల్స్లో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకుంది. మనీషారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆడపిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్ చదువులే కాదు కష్టపడితే అతి తక్కువ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్లు కూడా సాధించగలరు’ అని చెప్పారు. న్యాయవాది కుమారుడికి 157వ ర్యాంక్ పల్నాడు జిల్లా పెదకూరపాడుకి చెందిన కన్నెధార మనోజ్కుమార్ 157వ ర్యాంక్ సాధించారు. న్యాయవాది కన్నెధార హనమయ్య, రాజరాజేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మనోజ్ ఐఐటీ ఇంజనీరింగ్ విద్యను తిరుపతిలో అభ్యసించారు. ఆ తరువాత రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం రాగా.. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 157 ర్యాంకు సాధించారు. ‘దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్కు సిద్ధమయ్యా. తల్లిదండ్రుల స్ఫూర్తితో రోజుకు 8 గంటలు చదివేవాడిని’ అని మనోజ్కుమార్ తెలిపారు. మూడో ప్రయత్నంలో 235వ ర్యాంక్ గుంటూరు శ్యామలానగర్కు చెందిన కాకుమాను అశ్విన్ మణిదీప్ మూడో ప్రయత్నంలో 235వ ర్యాంకు సాధించారు. మణిదీప్ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ టెక్నాలజీలో బీటెక్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మణిదీప్ మాట్లాడుతూ.. ‘తొలిసారి దారుణంగా ఓటమి చెందినా నిరాశ చెందకుండా చెన్నైలో శిక్షణ పొందాను. ఆన్లైన్ టెస్ట్లు రాసేవాడిని, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, పత్రికలు చదవడం చేసేవాడిని’ అని చెప్పారు. తల్లిదండ్రుల స్ఫూరితో సివిల్స్కు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన షేక్ అబ్దుల్ రవూఫ్ సివిల్స్లో 309 ర్యాంక్ సాధించారు. రవూఫ్ తండ్రి మహ్మద్ ఇక్బాల్ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్గా పని చేస్తుండగా.. తల్లి గౌసియా బేగం కృష్ణా జిల్లా మైనార్జీ సంక్షేమ అధికారిగా, వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పని చేశారు. ‘ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాక అమెరికాలో ఎంఎస్ చేశాను. చెన్నైలో నాబార్డు మేనేజర్గా రెండున్నరేళ్లు పని చేశాను. ఏడాదిగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ పొందాను’ అని రవూఫ్ పేర్కొన్నారు. గంగపుత్రుడికి 350వ ర్యాంక్ కాకినాడ పర్లోవపేటకు చెందిన దిబ్బాడ సత్యవెంకట అశోక్ 350వ ర్యాంక్ సాధించారు. అశోక్ తండ్రి సత్తిరాజు సముద్రంలో చేపల వేట చేస్తుంటారు. అశోక్ ఇంటర్మీడియెట్ గుంటూరులో, గౌహతిలో ఐఐటీ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశారు. నాలుగో ప్రయత్నంలో 350వ ర్యాంకు సాధించారు. రైతు బిడ్డకు 420వ ర్యాంక్ తెనాలి రూరల్ మండలం చావావారి పాలెంకు చెందిన రైతుబిడ్డ నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు సాధించారు. విజయవాడలో ఇంటర్, జేఎన్టీయూ, పులివెందులలో బీటెక్, చెన్నైలో రెన్యూవబుల్ ఎనర్జీలో ఎంటెక్ చేశాడు. జూనియర్ సైంటిస్ట్గా పనిచేశారు. ‘ప్రస్తుత ర్యాంక్తో ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నా. మరోసారి సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలనేది నా ఆశయం’ అని బాలకృష్ణ చెప్పారు. ఓఎన్జీసీ ఉద్యోగికి 602వ ర్యాంకు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన పండు విల్సన్ 602వ ర్యాంకు సాధించారు. ముంబైలోని ఓఎన్జీసీ ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం చేస్తూ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. తండ్రి ప్రసాద్ వ్యవసాయం చేస్తుంటారు. తల్లి లక్ష్మి గృహిణి. విల్సన్ కాకినాడ జేఎన్టీయూలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడై ఓఎన్జీసీలో ఉద్యోగం సాధించారు. సీఎం, గవర్నర్ శుభాకాంక్షలు సివిల్స్–2021లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 15వ ర్యాంకు సాధించిన సి.యశ్వంత్కుమార్రెడ్డితో పాటు ఇతర అభ్యర్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. 15 ర్యాంకు సాధించిన యశ్వంత్కుమార్రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరితో పాటు సివిల్స్కు ఎంపికైన 685 మందికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చదవండి👉సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ -
కావలి మేఘనకు కేటీఆర్ అభినందనలు, శాలువాతో సత్కారం
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2020 తుది పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘనను ఐటీ శాఖమంత్రి కేటీ రామారావు అభినందించారు. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మేఘన తన తండ్రి టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (కమర్షియల్) కె.రాములుతో శుక్రవారం ప్రగతిభవన్కు వెళ్లి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మేఘనను మంత్రి శాలువాతో సత్కరించారు.నేటి యువతరం మేఘనను ఆ దర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ను కలిసిన వారిలో కార్మిక శాఖమంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులున్నారు. -
Civils Prilimanary Exam: నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
సాక్షి, తిరుపతి: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి తిరుపతిలో 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 7,201 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జనవరి 7న మెయిన్స్ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అరగంట ముందుగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. తెలంగాణ... తెలంగాణ వ్యాప్తంగా 53,015 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్ లో 101 పరీక్ష కేంద్రాల్లో 46,953 మంది, వరంగల్లో 14 కేంద్రాల్లో 6,062 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణ బస్ భవన్ ప్రెస్ నోట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 కి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా అందించడానికి టీఎస్ఆర్టీసీ నిర్వహణ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించడం ద్వారా హైదరాబాద్, వరంగల్లోని మూడు నగరాల్లోని మెట్రో, ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సులలో ఈ ఉచిత రవాణా సేవను పొందవచ్చు అని తెలిపారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్ సివిల్ సర్వీస్ పరీక్ష -2021 కి హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అన్నారు. -
1993లో ఇంటర్వ్యూలో ఫెయిల్.. నాలాగా ఇబ్బంది పడొద్దనే..
సాక్షి, హైదరాబాద్: వృత్తిరీత్యా ఆయన పోలీస్ కమిషనర్. నిత్యం పనులతో బిజీనే. అయినా సమయం చిక్కించుకుని.. సివిల్స్ రాసే అభ్యర్థులకు శిక్షణ.. గైడెన్స్తో అండగా నిలుస్తున్నారు. ఇలా ఇప్పటివరకు వెయ్యికి పైగా అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తీర్చిదిద్దారు. తాజాగా 2020 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మొదటి 20 ర్యాంకుల్లో ఆరు మంది (3, 8, 14, 18, 19, 20), వంద ర్యాంక్స్లో 19 మందికి ఈయనే మెంటార్షిప్ వహించారు. ఆయనే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం.భగవత్. మంగళవారం తెలంగాణ టాపర్ పీ శ్రీజ (20వ ర్యాంక్), కనక్నాల రాహుల్ (218వ ర్యాంక్), పీ గౌతమి (317వ ర్యాంక్)లు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... చదవండి: సివిల్స్ టాప్ 20 ర్యాంక్: ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా ► 1993లో యూపీఎస్సీ మెయిన్స్లో పాసయ్యా. కానీ సరైన గైడెన్స్ లేకపోవటంతో ఇంటర్వ్యూలో ఫెయిలయ్యా. లోలోపల ఏదో తెలియని భయం. మానసికంగా కృంగదీసింది. స్థానికంగా ఉన్న సీనియర్ ఆఫీసర్ల మార్గనిర్దేశంతో రెండో ప్రయత్నంలో 1994లో విజయం సాధించా. సివిల్స్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేందుకు నాకు ఎదురైన ఇబ్బందులు నేటి యువతకు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో 2014 నుంచి శిక్షణ ఇవ్వటం ప్రారంభించా. చదవండి: సివిల్స్లో తెలుగువారి సత్తా ► హోదా వచ్చాక ఎవరైనా గౌరవిస్తారు. సాయం చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సరైన మార్గనిర్ధేశం చేసేవాళ్లే చాలా అవసరం. సివిల్స్లో ప్రతి ఒక్క మార్కు కూడా కీలకమే. దేశంలో ఏటా 10 లక్షల మంది పోటీపడితే ఉత్తీర్ణలయ్యేది 800 మంది లోపే ఉంటుంది. టాప్ 10 ర్యాంకర్ల మధ్య ఒక్క మార్కు తేడానే ఉంటుంది. మౌఖిక పరీక్షే ముఖ్యం ► సివిల్స్లో 275 మార్కులతో ఉండే మౌఖిక పరీక్ష చాలా కీలకం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. లేకపోతే విజయం సాధించలేం. అందుకే ఇంటర్వ్యూకు ప్రిపేర్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించా. అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం, మనోధైర్యాన్ని నింపేందుకు మెయిన్స్ పూర్తవగానే 3 నుంచి 4 నెలల పాటు ఉచితంగా ఇంటర్వ్యూపై కోచింగ్ ఇస్తున్నాం. మరికొందరి సాయం.. భద్రాద్రి–కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐఆర్ఎస్లు (ఏపీ) సాధు నరసింహా రెడ్డి, నితేష్ పాథోడ్, ముకుల్ కులకర్ణి, ఐఆర్ఎస్ రిటైర్డ్ రాజీవ్ రణాదే, ఐఏఎస్లు నీల్కాంత్ అవద్, ఆనంద్ పాటిల్, డాక్టర్ శ్రీకర్ పరదేశి, అభిషేక్ సరాఫ్, ఎంయూఏడీ జాయింట్ కమిషనర్ సమీర్ ఉన్హాలే, ఐసీఏఎస్ సుప్రియ దేవస్థలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ శైలేంద్ర డియోలాంకర్, జేపీసీ డైరెక్టర్ డాక్టర్ వివేక్ కులకరి్ణలు కూడా నాతోపాటు సివిల్స్ అభ్యర్థులకు సహకరిస్తున్నారు. రెండు వాట్సాప్ గ్రూప్ల ద్వారా, జూమ్, వీడియో కాల్స్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్కు చెందిన అభ్యర్థులకు భౌతికంగా శిక్షణ ఇస్తున్నాం. ఫారెస్ట్ సర్వీసెస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరీక్షలకు కూడా ట్రెయినింగ్ ఉంటుంది. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, బీహార్, అసోం, ఒడిశా, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన సివిల్స్ అభ్యర్థులు మా వద్ద శిక్షణ పొందుతున్నారు. నా వద్ద శిక్షణ పొందిన సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (హైదరాబాద్ మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడు), భైంసా ఏఎస్పీ కిరణ్ ఖరేలు ప్రస్తుతం మన రాష్ట్రంలో విధుల్లో ఉన్నారు. https://t.co/zb1mcIV0OA — Rachakonda Police (@RachakondaCop) September 28, 2021 -
Civils Ranker: ఎవరి కోసమూ ఎదురు చూడొద్దు..
సాక్షి, హైదరాబాద్: జీవితంలో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని, అలా అని అంత ఈజీగా ఏదీ దక్కదని సివిల్స్లో 20వ ర్యాంకు సాధించిన డాక్టర్ పొడిశెట్టి శ్రీజ అన్నారు. ఎంబీబీఎస్ పూర్తవ్వగానే తండ్రి శ్రీనివాస్ ప్రోత్సాహంతోనే ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నట్లు తెలిపారు. సివిల్స్లో తాను 100 లోపు ర్యాంక్ను ఊహించానని ఇంత మంచి ర్యాంకు వస్తుందనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ర్యాంకర్ శ్రీజ తన కెరియర్ విశేషాలను ‘సాక్షి’కి వివరించారు. అమ్మ ప్రేరణే డాక్టర్గా మలిచింది తన చిన్న తనంలోనే అమ్మ నర్సుగా సేవలందిస్తున్న అంశాలు తనను ప్రేరేపించడంతో ఎంబీబీఎస్ చేసి డాక్టరయ్యానని శ్రీజ తెలిపారు. విద్యాభ్యాసం రెండవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చైతన్యపురిలోని రఘునాథ హైస్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య కళాశాలలో, ఎంబీబీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ(2019)లో పూర్తి చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి సివిల్స్ కోచింగ్ ప్రిపరేషన్ ప్రారంభించానన్నారు. కూతురుకు మిఠాయి తినిపిస్తున్న శ్రీజ తల్లిదండ్రులు, శ్రీనివాస్, శ్రీలత, చిత్రంలో సోదరుడు సాయిరాజ్ మహిళా సాధికారతకు కృషి... డాక్టర్గా సేవలందించాలనుకున్న తనకు అమ్మతో పాటు నాన్న ప్రోత్సాహం తోడైందని..అక్కడ నుంచి తన సేవలను కొద్ది మందికి కాకుండా మరింత మందికి అందించాలన్న ఆశయంతో సివిల్స్ వైపు అడు గులు వేసినట్లు తెలిపారు. మహిళ ఉన్నత చదువు చదివితే ఆ ప్రభావం కుటుంబపై ఎలా చూపుతుందో తెలుసుకున్నట్లు తెలిపారు. మహిళా సాధికారతతోపాటు విద్యాభివృద్ధికి కృషిచేస్తానన్నారు. యువతకు సూచన ఎవ్వరూ తమను తాము తక్కువ అంచనా వేసుకోకూడదని, అందరూ సమర్థులేనని గుర్తించి ముందుకు సాగాలని శ్రీజ పేర్కొన్నారు. ఎవ్వరి ప్రోత్సా హం కోసం ఎదురు చూడొద్దని.. ఎవరికి వారు తమకు తాముగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి వాటినైనా సాధించుకోవచ్చన్నారు. సివిల్స్ ర్యాంకర్ డాక్టర్ పొడిశెట్టి శ్రీజ తండ్రి కల నెరవేర్చిన కూతురు చదువులో చురుగ్గా ఉండే శ్రీజ తన తండ్రి కోరిక మేరకు మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సాధించడంతో తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతటితో ఆగకుండా కూతురును ఐఏఎస్ చదివించాలనే కోరిక తండ్రిలో బలపడింది. అదే విషయాన్ని శ్రీజకు చెప్పి ఒప్పించాడు. అతి సాధారణ కుటుంబం నుంచి ఐఏఎస్ వరకు... అతి సాధారణ కుటుంబ నుంచి వచి్చను శ్రీజ సివిల్స్ బెస్ట్ ర్యాంక్ సాధించడంతో శ్రీనివాస్ స్నేహితులు చిలుకానగర్ డివిజన్ సాయినగర్కాలనీలో సంబరాలు చేసుకుంటున్నా రు. 20 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చిన శ్రీనివాస్ పలు ఆటోమొబైల్ షోరూమ్స్లో పని చేశారు. ప్రస్తుతం ఉప్పల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలో సాయినగర్లో డబుల్ బెడ్ రూం ఇంటిలో అద్దెకుంటున్నారు. శ్రీజకు ఓ సోదరుడు సాయిరాజ్ కూడా ఉన్నాడు. అతను బీబీఏ పూర్తి చేశాడు. -
నా విజయం వెనుక చాలామంది కృషి ఉంది : సివిల్స్ 20 వ ర్యాంకర్
-
సివిల్స్– 2021 ప్రిలిమ్స్ పరీక్ష.. ఈ నాలుగు సక్సెస్కు కీలకం
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 ఉన్నత స్థాయి సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే మూడంచెల ఎంపిక ప్రక్రియలో తొలిదశ! ప్రిలిమ్స్లో ప్రతిభ చూపితే.. సివిల్స్లో విజయం దిశగా మొదటి అడుగు పడినట్లే! ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది వరకూ దరఖాస్తు చేసుకున్నారని అంచనా! ఇంతటి తీవ్ర పోటీ నెలకొన్న సివిల్స్ ప్రిలిమ్స్లో గట్టెక్కి.. మలిదశ మెయిన్కు ఎంపికయ్యేందుకు అభ్యర్థులు ఎంతో శ్రమిస్తుంటారు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 పరీక్ష.. అక్టోబర్ 10న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహాలు, ఫోకస్ చేయాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం... సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అక్టోబర్ 10వ తేదీన జరగనుంది. అంటే.. అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 33 రోజులు మా త్రమే. ప్రిలిమ్స్ అనే మైలురాయిని దాటేందుకు ఈ సమయం ఎంతో కీలకం. సివిల్స్ అభ్యర్థులు ఈ అమూల్యమైన సమయంలో ముఖ్యంగా నాలుగు విజయ సూత్రాలు పాటించాలి అంటున్నారు నిపు ణులు. అవి..విశ్లేషణాత్మక అధ్యయనం, పునశ్చరణ, సమయ పాలన, ప్రాక్టీస్. ఈ నాలుగు సూత్రాలు పక్కాగా అమలు చేస్తే..ప్రిలిమ్స్లో విజయావకా శాలు మెరుగుపరచుకోవచ్చని సూచిస్తున్నారు. సమయ పాలన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులకు టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. జనరల్ స్టడీస్ పేపర్లో పేర్కొన్న ఏడు విభాగాలకు సంబంధించిన సిలబస్ను పరిశీలించి.. దానికి అనుగుణంగా ప్రతి సబ్జెక్ట్ను నిత్యం చదివేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటల సమయం ప్రిపరేషన్కు కేటాయించాలి. దీంతోపాటు ప్రతి వారం అధ్యయనం పూర్తిచేసిన టాపిక్స్పై సెల్ఫ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు రాయాలి. తద్వారా ఆయా అంశాలపై తమకు లభించిన అవగాహనను విశ్లేషించుకోవాలి. గత ప్రశ్న పత్రాల సాధన కూడా లాభిస్తుంది. కరెంట్ అఫైర్స్తో కలిపి సిలబస్లో పేర్కొన్న కోర్ టాపిక్స్ను కరెంట్ అఫైర్స్తో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. ఎందు కంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్లో ప్రశ్నలు.. కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు 2020 జూలై నుంచి 2021 జూలై వరకూ జరిగిన.. ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్పై దృష్టిపెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. సంఘటనల నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా.. వంటి అంశాలను విశ్లేషించుకుంటూ చదవడం చాలా అవసరం. అనుసంధానం చేసుకుంటూ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో భాగంగా అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్లను ఇతర సబ్జెక్ట్లతో అనుసంధానం చేసు కుంటూ చదవాలి. ముఖ్యంగా ఎకానమీ–పాలిటీ, ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకాలజీ; జాగ్రఫీ–సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ–పాలిటీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దీనివల్ల ప్రిపరేషన్ పరంగా ఎంతో విలువైన సమయం కలిసొస్తుంది. ఇలా మిగిలిన సమయంలో తాము క్లిష్టంగా భావించే.. ఇతర ముఖ్య టాపిక్స్పై దృష్టిపెట్టొచ్చు. ముఖ్యాంశాల గుర్తింపు ప్రస్తుతం సమయంలో..అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ముఖ్యాంశాలను గుర్తించాలి. అందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. వాటిల్లో సబ్జెక్టుల వారీగా ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధా న్యం లభించిందో గుర్తించాలి. ఉదాహరణకు చరిత్రలో.. సాంస్కృతిక చరిత్ర, రాజ్య వంశాలు వంటి వి. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో గత ఏడాది కాలంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారించాలి. ప్రధానంగా కరోనా పరిస్థితులు, ప్రపంచ వాణిజ్యంపై చూపిన ప్రభావం, వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు ముఖ్యమైనవిగా గుర్తించాలి. అదే విధంగా..ఆయా దేశాల మధ్య ఒప్పందాలు–వాటి ఉద్దేశం–అంతర్జాతీయంగా, జాతీయంగా వాటి ప్రభావం తదితర అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. కొత్త అంశాలు చదవాలా విస్తృతమైన సివిల్స్ సిలబస్ ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు కొన్ని టాపిక్స్ను వదిలేస్తుంటారు. అలా విస్మరించిన అంశాలను ఇప్పుడు చదవడం సరైందేనా.. అనే సందేహాన్ని చాలామంది అభ్య ర్థులు వ్యక్తం చేస్తుంటారు. గతంలో చదవకుండా వదిలేసిన టాపిక్స్లో కొరుకుడు పడని అంశాలుం టే.. అనవసర ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి విస్మరించిన అంశాలను ఇప్పుడు కొత్తగా చదవడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పట్టు బిగించిన వాటినే మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ కొత్త అంశాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. కాన్సెప్ట్లపై అవగాహన పొందితే సరిపోతుంది. పేపర్–2కు కూడా సమయం అభ్యర్థులు పేపర్–2(సీశాట్)కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని అర్హత పేపర్గానే పేర్కొ న్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధి స్తేనే.. పేపర్–1 మూల్యాంకన చేస్తారు. దాని ఆధా రంగానే మెయిన్కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. రెండుసార్లు రివిజన్ సిలబస్ అంశాల ప్రిపరేషన్ సెప్టెంబర్ చివరికల్లా పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి రోజూ కొంత సమయం రివిజన్కు కేటాయిస్తూ.. ప్రతి సబ్జెక్ట్ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేయాలి. రివిజన్కు ఉపకరించేలా ప్రిపరేషన్ సమయంలోనే ఎప్పటికప్పుడు షార్ట్నోట్స్ రాసుకోవాలి. మెమొరీ టిప్స్ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు మెమొరీ టిప్స్ సాధన చేయాలి. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్ టెక్నిక్స్, అన్వయించుకోవడం వంటి వాటి ద్వారా మెమొరీ పెంచుకోవాలి. ఇలా ప్రతి విష యంలో నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే.. ప్రిలి మ్స్లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. సబ్జెక్ట్ వారీగా ఇలా కరెంట్ అఫైర్స్: కరోనా పరిణామాలు, అభివృద్ధి కారకాలపై చూపుతున్న ప్రభావం; గత ఏడాది కాలంలో ఆర్థిక ప్రగతికి సంబంధించిన గణాం కాలు; ముఖ్యమైన నియామకాలు; అంతర్జా తీయంగా పలు సంస్థల నివేదికల్లో భారత్కు సంబంధించిన గణాంకాలు. చరిత్ర: ఆధునిక భారత చరిత్ర; జాతీయోద్యమం; ప్రాచీన, మధ్యయుగ భారత చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక–ఆర్థిక చారిత్రక అంశాలు. ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన–పరిపాలన విధానాలు; బ్రిటిష్కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు–ఉద్యమాలు,సంస్కరణోద్యమాలు. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటం. పాలిటీ: రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాం గ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు–వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు. రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి,గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు,అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వంటి వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు. పంచాయతీరాజ్ వ్యవస్థ: బల్వంత్రాయ్, అశోక్మెహతా, హన్మంతరావ్, జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ప్రభుత్వ విధానాలు: విధానాల రూపకల్పన జరిగే తీరు; విధానాల అమలు, వాటి సమీక్ష; ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు; కేంద్ర–రాష్ట్ర సంబంధాలు; గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత. ఎకానమీ: ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు– మూలధన వనరుల పాత్ర. ► ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(ముఖ్యంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం వంటివి). ► ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి. ► పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం ► పంచవర్ష ప్రణాళికలు–ప్రణాళిక రచన–వనరుల కేటాయింపు–10, 11 పంచవర్ష ప్రణాళికలు ► బ్యాంకింగ్ రంగం ప్రగతి–సంస్కరణలు– ఇటీ వల కాలంలో బ్యాంకింగ్ రంగంలో స్కామ్లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం; ► తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు. సైన్స్ అండ్ టెక్నాలజీ: గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; ఇటీవల కాలంలో సంక్రమిస్తున్న వ్యాధులు–కారకాలు; సైబర్ సెక్యూరిటీ యాక్ట్; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్ ప్రయోగాలు; ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు–పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు; వివిధ ఐటీ పాలసీలు. జాగ్రఫీ: జనగణనకు సంబంధించిన ముఖ్యాంశాలు; అత్యధిక, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు; అత్యధిక, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలు; స్త్రీ, పురుష నిష్పత్తి; స్త్రీ, పురుష అక్షరాస్యత శాతం; గత పదేళ్లలో జనన, మరణ రేట్లు. పర్యావరణ సమస్యలు– ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు. ► సౌర వ్యవస్థ, భూమి అంతర్ నిర్మాణం, శిలలు, జియలాజికల్ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు. ► మన దేశంలో నగరీకరణ; రుతుపవనాలు, నదులు; జలాల పంపిణీ; వివాదాలు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 ముఖ్యాంశాలు ► మొత్తం పోస్ట్ల సంఖ్య: 712 ► ప్రిలిమినరీ పరీక్ష తేది: అక్టోబర్ 10, 2021 ► రెండు పేపర్లు.. 400 మార్కులకు పరీక్ష (ఒక్కో పేపర్కు 200 మార్కులు). ► ప్రిలిమ్స్లో ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో మలి దశ మెయిన్కు ఎంపిక ► తెలుగు రాష్ట్రాల్లో.. అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్లలో పరీక్ష కేంద్రాలు. -
సివిల్స్ అభ్యర్థులకు కేంద్రం తీపి కబురు
న్యూఢిల్లీ: 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి, వరదల కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది అభ్యర్థులు సివిల్ సర్వీస్ పరీక్షకు(సీఎస్ఈ) హాజరు కాలేకపోయారు. వీరిలో చివరి ప్రయత్నం(లాస్ట్ అటెంప్ట్) అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరికి కేంద్రం తీపి కబురు చెప్పింది. వీరికి 2021లో మరో అవకాశం ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అవకాశం నిర్దేశిత వయసులోపు ఉన్నవారికే వర్తిస్తుంది. వయసు మీరిన ‘చివరి ప్రయత్నం’ అభ్యర్థులకు మరో అవకాశం లేనట్లే. 2020లో పరీక్ష రాయలేకపోయిన వారు మరో అవకాశం కింద 2022లో రాసేందుకు మాత్రం వీల్లేదు. కరోనా వల్ల 2020లో సివిల్స్కు హాజరుకాలేకపోయిన అభ్యర్థులు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది. చదవండి: శభాష్ పోలీస్: క్షణం ఆలస్యమైతే ఘోరం జరిగేది! సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్! -
ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ
కరీంనగర్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తెలంగాణలో ఎనలేని క్రేజ్. ఏటా వేల మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులే లక్ష్యంగా.. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటారు. యూపీఎస్సీ వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మందికిపై దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. విజయం సాధించాలంటే.. కనీసం ఏడాదిన్నరపాటు నిపుణుల సలహాలతో అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు వ్యక్తిగతంగా క్లాసులకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు వింటూ.. సివిల్స్కు ప్రిపేర్ అయ్యేలా.. క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. ఇందుకు సాక్షి మీడియా గ్రూప్.. మీడియా పార్టనర్గా వ్యవహరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఠీఠీఠీ. జుpజ్చీట. ఛిౌఝలో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోర్సు కాల వ్యవధి ఏడాదిన్నర.‡ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25,000. ప్లే స్టోర్ నుంచి క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వీడియో క్లాసులు వినొచ్చు. ఈ వీడియోలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ టెస్టులు ఉంటాయి. టెస్ట్ సబ్మిట్ చేయగానే ఫలితం వస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 9133637733, 9505514424, 9666013544 పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సంప్రదించొచ్చు. -
సివిల్స్లో రష్మితకు 534వ ర్యాంకు
తూర్పుగోదావరి,అంబాజీపేట: యుపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో నీతిపూడి రష్మితారావు 534వ ర్యాంకు సాధించడం పట్ల పుల్లేటికుర్రు శివారు కొల్లివారిపేట కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రష్మిత ఇంటర్ వరకు విశాఖపట్నంలో విద్యనభ్యసించి, బీటెక్, ఎంటెక్లను కాన్పూర్ ఐఐటీలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్స్లో రెండు సార్లు హాజరై నిరాశపడకుండా మూడో సారి విజయం సాధించడంపై పుల్లేటికుర్రులో సొసైటీ అధ్యక్షుడు నీతిపూడి వెంకటరమణ, విలసిత మంగతాయారు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రష్మితారావు తల్లిదండ్రులు నీతిపూడి భాస్కరరావు, డాక్టర్ విశ్వమిత్రలు కొల్లివారిపేటలో నివాసముండేవారు. వృత్తిరీత్యా భాస్కరరావు గుంటూరు ప్రభుత్వాస్పత్రి మత్తు విభాగంలో ప్రొఫెసర్గా సేవలందించి విశాఖపట్నంలో స్థిరపడ్డారు. తల్లి డాక్టర్ విశ్వమిత్ర కాకినాడ ప్రభుత్వాస్పత్రి కంటి విభాగంలో సేవలందిస్తున్నారు. -
ఈ కండక్టర్.. కాబోయే కలెక్టర్?
తీరిక లేకుండా కండక్టర్ ఉద్యోగం. పెద్ద పెద్ద అకాడమీల్లో శిక్షణ పొందలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు ఉన్న వనరులతోనే సివిల్స్ వైపు సాగిపోతున్నాడో యువ కండక్టర్. దూరవిద్యలో డిగ్రీ, పీజీలు చేసి సివిల్స్ పరీక్షల్లో మెయిన్స్ను అధిగమించాడు. కర్ణాటక, యశవంతపుర: పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించే పనిలో ఉన్నారు బస్సు కండక్టర్ ఒకరు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన ఎన్సీ మధు బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో కండక్టర్గా పని చేస్తున్నాడు. తన 19 ఏటనే కండక్టర్ కొలువు సాధించాడు. చదువు అంటే ఎంతో ఇష్టం కావడంతో మధు ఐఏఎస్ కావాలని కలగన్నాడు. అందుకోసం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీని పూర్తి చేశాడు. 2014లో కేఎఎస్, 2018, 2019లో యుపీఎస్సీ పరీక్షలను రాశాడు. 2019లో కన్నడ మాధ్యమంలో సివిల్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. రాజనీతి శాస్త్రం, జనరల్ స్టడీస్ను ఎంపిక చేసుకొని రాసిన మెయిన్స్ పరీక్షల్లో పాసై ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూలో పాసైతే కలెక్టర్ లేదా ఎస్పీ ఏదైనా సాధించినట్లే. రెండుసార్లు పరాజయం 2014లో కేఎఎస్ పరీక్ష , 2018లో సివిల్స్ రాసినా ఫలితం లేదు. నిరుత్సాహం పడకుండా ఈసారి సాధించాలనే పట్టుదలతో యూ ట్యూబ్లో సివిల్స్ పరీక్షల మెళకువలు నేర్చుకున్నాడు. తన మొబైల్ ఫోన్లో యూ ట్యూబ్ ద్వారా కోచింగ్ తీసుకుంటూ సన్నద్ధమయ్యాడు. 2019లో యుపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ రాసి సత్తా చాటాడు. రోజూ 5 గంటలు వీడియోలతో కోచింగ్ తాను ఎక్కడా కోచింగ్కు వెళ్లలేదని, రోజు ఐదు గంటల పాటు యూ ట్యూబ్లోలో కోచింగ్ తరగతులను చూస్తూ పరీక్షకు సిద్ధమైనట్లు మధు చెబుతున్నాడు. తనకు యూ ట్యూబే మార్గదర్శనమని చెప్పాడు. ఇప్పుడు ఇంటర్వ్యూపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. -
చిరకాల స్వప్నం.. సివిల్స్లో విజేతను చేసింది
చెన్నై, తిరువళ్లూరు: సన్మాన గ్రహీత రమేష్రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే నిశ్శబ్ద వాతావరణం...సుమారు 20 నిమిషాల ప్రసంగం.. మద్యలో ఒక యువకుడిని వేదిక మీదకు పిలిచి, నా తర్వాత సివిల్స్ విజేత ఇతనే అంటూ పరిచయం చేశాడు. రమేష్రెడ్డి చెప్పిన మాటలకు అక్కడున్న వారిలో పూర్తి నమ్మకం.. కారణం అతడు క్లాస్టాపర్ మాత్రమే కాదు అనుకున్నది సాధించే మొండి వాడు కూడా. అనాడు రమేష్రెడ్డి చెప్పిన మాటలను నిజం చేస్తూ సివిల్స్లో 179వ ర్యాంక్ సాధించారు ప్రకాశం జిల్లాకు చెందిన అల్లాటిపల్లి పవన్కుమార్రెడ్డి. నేపథ్యం అల్లాటిపల్లి పవన్కుమార్రెడ్డిది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు. తండ్రి నారాయణరెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తల్లి వెంటకరత్నమ్మ గహిణి. ఐదవ తరగతి వరకు నేరేడుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఆ తర్వాత 10 వరకు ఒంగోలులోని నవోదయ పాఠశాలలో, ఇంటర్ రత్నం కళాశాలలో పూర్తి చేశారు. బాపట్ల వ్యవసాయ కళాళాలలో అగ్రికల్చర్ బీఎస్సీ జాయిన్ అయ్యారు. బీఎస్సీ పూర్తి కాగానే ఉత్తరాఖాండ్లోని జీపీ పంత్ కళాశాలలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత దొనకొండ ఏఈఓగా 2011 లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. సివిల్స్పై సమరం: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ సన్నాహాలు ప్రారంభించారు పవన్. 2012లో సివిల్స్ రాయడం మొదలుపెట్టి 2015 వరకు సివిల్స్పై సమరం సాగించారు. 2012లో ప్రిలిమినరీ, 2014, 2015లో మెయిన్స్ వరకు వచ్చి ఓడిపోయినా నిరాశ చెందలేదు. జీవితంలో ఓడిపోయానని అనిపించిన ప్రతిసారి స్టేజీపై రమేష్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి. 2016లో ఢిల్లీ నుండి హైదరాబాదుకు తిరిగి వచ్చి స్నేహితులతో కలసి మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. గతంలో ఏర్పడిన వైపల్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు. నాలుగవ ప్రయత్నంలో మెయిన్స్ను పూర్తి చేసి ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇంటర్వ్యూను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. చిరకాల స్వప్నం నిజమైన వేళ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లారు పవన్. 2016 మే10న పలితాలు విడుదలయ్యాయి. 179వ ర్యాంక్తో ఐపిఎస్కు సెలక్ట్ అయ్యారు. ఆరోజు సంఘటన ఆయన మాటల్లోనే ‘‘ ఫలితాల్లో నా పేరు చూడగానే అమ్మానాన్న అంటూ గట్టిగా అరిచేసా. పక్కరూమ్లో వున్న అమ్మానాన్నలు పరుగెత్తుకొచ్చి గట్టిగా కౌగలించుకున్నారు. ఓ అరగంట పాటు ఆనందభాష్పాలు. కష్టానికి తగిన ప్రతిçఫలం దక్కిందన్న సంతృప్తి. ఆరోజు రమేష్రెడ్డి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. సర్వీస్ రాకముందు, వచ్చిన తర్వాత ఆ ఒక్కక్షణం జీవితంలో ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవనేవారు ఆయన. అది నిజమే’’ అంటూ ఆ మధుర జ్ఞాపకాలను సాక్షికి వివరించారు పవన్. తెలుగు సాహిత్యాభిలాషి పవన్కుమార్రెడ్డికి తన విధులు ఎంతో ముఖ్యమో అంతకంటే తెలుగు సాహిత్యంపైన మక్కువ. సమయం దొరికితే చాలు పుస్తకాలతో సావాసం చేస్తారు. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతోనే సివిల్స్ మెయిన్స్కు తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్గా ఎంచుకున్నారు. కుక్కపిల్ల..సబ్బుబిల్ల,.. కాదేదీ కవితకు అనర్హం అంటూ శ్రీశ్రీ చెప్పిన మాటల స్ఫూర్తితో ఇప్పటి వరకు 30 పైగా కవిత్వాలు కూడా రాశారు. తెలుగు మీడియం విద్యార్థులకు సివిల్స్పై ఉన్న భయాన్ని పోగట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు పవన్. స్నేహితులతో కలిసి తెలుగులో సివిల్స్ మెటీరియల్ తయారు చేస్తున్నారు. మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి పొన్నేరీ ఏఎస్పీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మత్య్సకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపాళయవనం పొన్నేరి తదితర ప్రాంతాల్లో 35 మత్సకార గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ తరచూ ఘర్షణలు, హత్యలు, దాడులతో నిత్యం రణరంగంగా ఉండేవి. ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కుమార్ అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాల్లో శాంతి కమిటీలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి అందరి వద్ద ప్రశంసలు కూడా అందుకున్నారు. ప‘వన్’ మ్యాన్ షో: సివిల్స్లో విజయం సాధించాక ఎన్పీఏలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని పొన్నేరీ అసిస్టెంట్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. రౌడీలకు షెల్టర్గా వున్న పొన్నేరీలో శాంతిభద్రతల అదుపు కోసం అల్లరిమూకలను జల్లెడపట్టారు. సుమారు 25 మంది రౌడీలను అరెస్టు చేశారు.. 10 మందిపై గూండాచట్టం ప్రయోగించారు. ఎర్రచందనం, రేషన్బియ్యం, గంజా విక్రయంపై ఉక్కుపాదం మోపారు. 300 పైగా సీసీ కెమరాలను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాపిక్ను నియంత్రించి శభాష్ అనిపించుకున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక మాఫియాను నెలరోజుల్లోనే అణచివేసి అక్రమార్కులకు సింహస్వప్నంలా మారారు. ఎంతలా అంటే ఆయన సెలవు పెట్టి రెండు రోజులు ఊరికి వెళితే.. బదిలీపై వెళ్లిపోయాడని ఇసుక మాఫియా తమకు అడ్డు తొలగిందని టపాసులు కాల్చేంతగా. మొత్తానికి అక్రమార్కులకు తెలుగోడి సత్తాను చూపించారు పవన్. వేదిక : బాపట్లలోని వ్యవసాయ కళాశాల కార్యక్రమం : సివిల్స్లో విజయం సాధించిన కళాశాల పూర్వ విద్యార్థి ఆవుల రమేష్రెడ్డికి సన్మానం.. -
ఫిల్మ్మేకింగ్ అంటే కామన్సెన్స్
∙చిన్నప్పుడే స్కూల్ ఎగ్గొట్టి మరీ మా అమ్మతో కలిసి సినిమాలు చూశాను. కానీ చదువును అశ్రద్ధ చేయలేదు. పదో తరగతిలో తొంభైశాతానికిపైగా మార్కులు సాధించాను. ఆ తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాక చదువు ఆపేద్దాం అనుకున్నా. నాన్నగారి మాటలతో బీటెక్ చేశాను. యూకేలో మాస్టర్స్ చేశా. అక్కడే ఫిల్మ్ కోర్స్ కంప్లీట్ చేసి సినిమాల వైపు వచ్చాను. ∙మన సొసైటీలో నచ్చింది చేయడం కష్టం. అదే నేను యూకేలో పుట్టి ఉంటే ఈ సినిమాను ఎప్పుడో తీసేవాడినేమో. యూకే నుంచి తిరిగొచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావ్ అని నా ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు? వాళ్ల బలవంతంపై సివిల్స్లో జాయిన్ అయ్యాను. అక్కడే ‘హుషారు’ స్క్రిప్ట్ రాశా. మధ్యలో హ్యాండ్ కెమెరాతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాను. ముందు ‘హుషారు’ చిత్రాన్ని సొంతంగా నిర్మిద్దాం అనుకున్నాం. సినిమాను రిలీజ్ చేయడం తీసినంత ఈజీ కాదని ఓ శ్రేయోభిలాషి చెప్పడంతో బెక్కెం వేణుగోపాల్గారిని కలిసి కథ చెప్పాను. ‘పెళ్ళిచూపులు’ సినిమాకు ముందు ఈ స్క్రిప్ట్ను విజయ్ దేవరకొండకు వినిపించాను. ఆయన ఓకే అన్నారు కూడా. ఆ తర్వాత కుదర్లేదు. నచ్చినట్టు బతకాలనుకునే నలుగురు స్నేహితులు లైఫ్లో ఎలాంటి సమస్యలను ఫేస్ చేశారు? జీవితంలో ఎలా గెలిచారు? అనేది సినిమా కథ. నా దగ్గర మరో రెండు కథలు ఉన్నాయి. -
ఊరు కాదు.. ఐఏఎస్ల కార్ఖానా
ఉత్తరప్రదేశ్లోని మారుమూల గ్రామం మేథోపట్టి. కేవలం 75 ఇళ్లు ఉండే ఈ ఊరు విద్యుత్, రోడ్లు వంటి సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉంది. అనారోగ్యంపాలైతే గ్రామస్తులు చికిత్స కోసం 10 కి.మీ దూరంలో ఉన్న ఆసుపత్రికి పరుగుతీయాల్సిందే. అదంతా నాణేనికి ఓవైపు. మరోవైపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ పరీక్షలో ఈ గ్రామస్తులు ర్యాంకులు కొల్లగొడుతున్నారు. ఈ ఊరు నుంచి ఇప్పటిదాకా ఏకంగా 47 మంది ఐఏఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. ఒకే ఇంటి నుంచి నలుగురు ఐఏఎస్ అధికారులవ్వడం విశేషం. బ్రిటిష్ ఇండియాలో 1914లో ఖాన్ బహద్దూర్ సయ్యద్ మొహమ్మద్ ముస్తఫా ఖాన్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఊరు నుంచి ఐఏఎస్ అయ్యారు. 1952లో ఇందు ప్రకాశ్ అనే వ్యక్తి ఈ ఊరి నుంచి రెండో ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి ఈ గ్రామ యువకుల జైత్రయాత్ర కొనసాగుతోంది. 1955లో మేథోపట్టి నుంచి వినయ్ కుమార్ ఐఏఎస్గా ఎంపికై బిహార్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశారు. ఆయన తర్వాత ముగ్గురు తమ్ముళ్లు ఛత్రపతిపాల్, అజయ్, శశికాంత్లు ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యారు. ఈ విషయమై స్థానికంగా టీచర్గా పనిచేస్తున్న కార్తికేయ సింగ్ మాట్లాడుతూ..‘జోన్పూర్లోని డిగ్రీ కళాశాలే వీరిలో పోటీతత్వాన్ని నింపింది. ఇక్కడ సివిల్స్ కోసం కోచింగ్ తీసుకున్నవారు చాలా అరుదు. సివిల్స్ అనగానే ఇప్పుడంతా ఇంగ్లిష్ మీడియంవైపు పరుగులు పెడుతున్నారు. కానీ ఊరిలో సివిల్స్కు ఎంపికైన వారంతా హిందీ మీడియంలో చదువుకున్నవారే’ అని వెల్లడించారు. -
సివిల్స్ కోచింగ్కు కటాఫ్ మార్కులు
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్లో ఉచిత కోచింగ్ ఇప్పించేందుకు అభ్యర్థుల ఎంపికలో కటాఫ్ మార్కులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కటాఫ్ మార్కులు లేకుండా ఆయా సంక్షేమ శాఖలు నిర్ణయించిన ప్రకారం టార్గెట్ వరకు మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల నుంచి మొత్తం 3,850 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. కోచింగ్ కోసం మూడు నెలల క్రితం ఎంట్రెన్స్ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన నెల రోజుల తరువాత ఫలితాలు ప్రకటించారు. అయితే రెండు నెలలుగా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. కటాఫ్ మార్కులపై తేల్చని ప్రభుత్వం.. మొత్తం 150 మార్కులకు పరీక్ష పెట్టారు. ఇందులో ఎన్ని మార్కుల వరకు కటాఫ్ పెట్టాలనే విషయంలో ప్రభుత్వం తేల్చుకోలేకపోతున్నది. దాదాపు 95శాతం మందికి వందలోపు మార్కులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సివిల్స్కు కోచింగ్ తీసుకునే వారు 80 శాతం మార్కులతో ఎంట్రెన్స్ పాస్ అయితే ఆలోచించవచ్చునని, అలా కాకుండా 50 శాతం లోపు మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేస్తే ఫలితాలు రావడం లేదనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కోచింగ్ కోసం ప్రభుత్వం కోచింగ్ సెంటర్లకు తొమ్మిది నెలలకు కలిపి సుమారు రూ. 40 కోట్లు ఖర్చుచేస్తున్నది. అందుకని కటాఫ్ కనీస మార్కులు ఎంత పెట్టాలనే విషయం తేల్చుకోలేకపోతున్నది. దీనిపై ఈనెల 26న సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనూ ఎటూ తేల్చలేదు. ఇప్పటికే రెండు నెలల నుంచి పరీక్షలు రాసిన 45,447 మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్, దివ్యాంగులకు 0.3శాతం రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉంది. దీనిపైనా కసరత్తు జరుగుతోంది. గత సంవత్సరం బీసీలకు మహిళా రిజర్వేషన్, కటాఫ్ మార్కులు అమలు చేయాలనుకుంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చివర్లో ఆ ప్రతిపాదన విరమించుకొని మెరిట్ ప్రకారం ఇచ్చారు. సివిల్స్కు ఎంపిక కావడం లేదని.. సివిల్స్లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా.. తగిన ఫలితాలు రావడం లేదు. మూడు సంవత్సరాలుగా సంవత్సరానికి 3,850 మందికి కోచింగ్ ఇప్పిస్తున్నా ఒక్కరు కూడా ఎంపిక కాలేదు. అందువల్ల కటాఫ్ మార్కుల అంశం తెరపైకి వచ్చింది. రెండు నెలలుగా ఎదురు చూపులు సివిల్స్ శిక్షణకు ఎంట్రెన్స్ ఫలితాలు ప్రకటించి రెండు నెలలైనా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటి నుంచి కోచింగ్ ప్రారంభిస్తారో వెల్లడించలేదు. సరైన శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ను ఎంపిక చేసి విద్యార్థులను అందులో చేర్పించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఆయా సంక్షేమ శాఖల నుంచి ఉన్నతాధికారులతో కమిటీలు వేసి దేశ వ్యాప్తంగా పంపించి రిపోర్టులు తెప్పించింది. రిపోర్టు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద ఉంది. ఇంకా ఈ రిపోర్టుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. -
సివిల్స్ ర్యాంకర్ @ మసాజ్ సెంటర్
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు గరిక సంతోష్ కుమార్. రెండేళ్ల క్రితం యూపీఎస్సీ పరీక్షల్లో ర్యాంకు సాధించాడు. కేసు పెండింగ్లో ఉండటంతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా ఆ కేసు ముగించుకునే మార్గాలు అన్వేషిస్తారు. సంతోష్ మాత్రం దీనికి పూర్తి ‘భిన్నం’. మసాజ్ సెంటర్ నిర్వాహకుడిగా మారి మరో కేసును తనపై వేసుకున్నాడు. ‘క్రాస్ మసాజ్’లు నిర్వహిస్తున్న ఆరోపణలపై సంతోష్ సహా ఏడుగురు నిందితుల్ని మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు సోమవారం వెల్లడించారు. విశాఖపట్నానికి చెందిన సంతోష్ కుమార్ ఫిజిక్స్ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. సివిల్స్ కోచింగ్ కోసం సిటీకి వచ్చి అశోక్నగర్ చౌరస్తాలో ఉన్న ఓ ఇన్స్టిట్యూట్లో దాదాపు ఏడాది కోచింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలోనే వైఎంసీఏ చౌరస్తాలోని స్లా్పష్ సెలూన్లో భాగస్వామిగా చేరాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరో భాగస్వామితో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో అతడి భార్యపై దాడి చేశాడనే ఆరోపణలతో సంతోష్పై నారాయణగూడ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇది కోర్టు విచారణ దశలో ఉంది. ఇదిలా ఉండగా 2016లో సివిల్స్ రాసిన సంతోష్ తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి చేసి ర్యాంకు సాధించాడు. అయితే నారాయణగూడలో క్రిమినల్ కేసు నమోదై ఉండడంతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్ వేసిన యూపీఎస్సీ సంతోష్ పేరును విత్హెల్డ్లో పెట్టింది. మరోపక్క ఆ సెలూన్ను సంతోష్ బంధువైన రాధారెడ్డి స్పాగా మార్చారు. మగవారికి ఆడవారితో మసాజ్లు చేయించడం (క్రాస్ మసాజ్) చట్ట విరుద్ధమైనప్పటికీ అలా చేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల క్రితం ‘స్పా’ బాధ్యతలు చేపట్టిన సంతోష్ క్రాస్ మసాజ్ల పరంపరను కొనసాగించాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతుల్ని ఉద్యోగినులుగా నియమించుకున్నాడు. వీరితో కస్టమర్లకు మసాజ్లు చేయిస్తూ భారీగా వసూలు చేస్తున్నాడు. ఈ ఉద్యోగినులకు కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. కస్టమర్లకు మసాజ్ చేసిన సందర్భంలో వారిచ్చిన టిప్పులతోనే ఈ యువతులు బతుకీడుస్తున్నారు. స్లా్పష్ స్పా వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు జి.తిమ్మప్ప తమ బృందంతో సోమవారం స్పాపై దాడి చేశారు. సంతోష్తో పాటు రిసెప్షనిస్ట్ వై.శ్రీకాంత్, కస్టమర్లు ఎల్.గోపినాథ్, కె.కుమార్, మసాజ్ చేసే యువతులను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, సెల్ఫోన్లు తదిరాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తాను సివిల్స్ ర్యాంకర్ అని, కేసుతో ఎంపికకు బ్రేక్ పడిందని సంతోష్ చెప్పడంతో టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. రికార్డులు పరిశీలించిన అధికారులు అతడు చెప్పింది నిజమేనని ధ్రువీకరించారు. తదుపరి చర్యల నిమిత్తం సంతోష్ సహా నిందితుల్ని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. దీంతో కలిపి అదే ఠాణాలో సంతోష్పై రెండు కేసులు ఉన్నట్లైంది. -
‘ఇపుడు తెలంగాణకు కావాల్సింది విద్యే’
సివిల్స్ పరీక్షలో అఖిల భారతస్థాయిలో ప్రథమర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందిస్తూ గొప్ప ఐఏఎస్ కావాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆనందింపచేసింది. సివిల్స్లో కీర్తి కిరీటాన్ని మెట్పల్లి మట్టికాళ్ల దాకా తీసుకవచ్చి తెలంగాణ ఖ్యాతిని పెంచటంలో అనుదీప్ కృషి అభినందించతగింది. తెలంగాణ వచ్చాక చదువుల రంగం కూడా మున్నెన్నడూ లేని విధంగా పురోగమిస్తోంది. పాఠశాల స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి భవిష్యత్తులో వందలమంది అనుదీప్లు తయారయ్యేందుకు బాటలు వేసి తీరటం ఖాయం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల విద్యాలయాలు 815 అయ్యాయి. ఒక్కొక్క విద్యార్థిపై ఏటా ఒక లక్ష రూపాయలు వెచ్చిస్తున్నారు. పేదపిల్లలకు కార్పోరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా చదువు, సౌలభ్యాలు, మౌలిక వసతులు లభిస్తున్నాయి. దాని వల్లనే తొలి సారిగా కార్పోరేట్ విద్యాసంస్థల పాతర్యాంకుల చరిత్రను తలకిందులు చేస్తూ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు అగ్రస్థానం సాధిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ద్వారా చేస్తున్న నిశ్శబ్ద విప్లవం. జాతీయస్థాయిలో యువతకు ఆదర్శంగా అనుదీప్ నిలిచినందుకు అభినందించటమే గాకుండా సివిల్స్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇప్పించేం దుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయబోతుంది. మౌఖిక పరీక్షకు ఎంపిౖకైన రాష్ట్ర అభ్యర్థులకు ఢిల్లీలో నిపుణులతో తర్ఫీదు ఇప్పిస్తానని కేసీఆర్ ప్రకటిం చారు. ఇది బహుజన పిల్లలకు వరంగా మారుతుంది. ఈ ఫలితాలను క్రమంగా మరో ఐదు, పదేళ్లలో తెలంగాణ చూస్తుంది. తెలంగాణకు సేవచేయాలన్నదే తనధ్యేయమని అనుదీప్ చెప్పడం ఆహ్వానించతగింది. ఇపుడు తెలం గాణకు కావాల్సింది ఈ నేలను సస్యశ్యామలం చేసే జ్ఞానార్జన. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఈ మట్టిని దున్నుకుంటూ పోతే వందలమంది అనుదీప్లు వస్తారని తేలింది. భవిష్యత్ తెలంగాణ రూపురేఖలు గురుకుల విద్యాలయాల నుంచే రూపొందుతాయి. గురుకుల విద్యాలయాలను బహుజనుల రక్షణ కవచాలుగా మార్చుకోవాలి. జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు 94401 69896 -
సివిల్స్లో ప్రిలిమ్స్ పాసైతే లక్ష నజరానా
పట్నా : 2019 లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వరాలు గుప్పించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(బీపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష పాసైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. లక్ష, రూ. 50 వేలు నజరానాగా అందిస్తామని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు బిహార్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్ణయాన్ని వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంజని కుమార్ సింగ్ వెల్లడించారు. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఖర్చుల గురించి ఆలోచించకుండా మెయిన్స్కు ప్రిపేర్ అయ్యేలా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. -
సివిల్ టాపర్కి సీఎం కేసీఆర్ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నుంచి పిలుపు అందింది. అనుదీప్, ఆయన తల్లిదండ్రులను సోమవారం ప్రగతి భవన్కు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. వారితో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. ఇటీవల వెలువడిన సివిల్ 2017 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సివిల్స్ సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. సివిల్స్ మొదటి ర్యాంకు సాధించిన అనుదీప్ది జగిత్యాల జిల్లా మెట్పల్లి. -
కోటి జీతం వదిలి..కోచింగ్ లేకుండా..
ఓవైపు మల్టీనేషన్ కంపెనీ (ఎంఎన్సీ)లో ఏడాదికి కోటి రూపాయల జీతం. మరోవంక అనుకున్న లక్ష్యం సాధించాలనే సంకల్పం. భారీ జీతం కంటే లక్ష్యం వైపే మొగ్గు చూపి.. కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్లో 24వ ర్యాంకు సాధించాడు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్. ముంబైలో ఎలక్టిక్రల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సామ్సంగ్ కంపెనీలో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఏడాదిపాటు ఉద్యోగం చేశాడు. తర్వాత దానిని వదిలిపెట్టి సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. పట్టుదలతో చదివి ప్రతిభ కనబరచాడు. చిన్నప్పటి నుంచే చదువులో పృథ్వీ మంచి ప్రతిభ కనబరచేవాడని ఆయన తండ్రి యిమ్మడి శ్రీనివాసరావు, తల్లి రాణి తెలిపారు. 100వ ర్యాంకు సాధించిన నారపురెడ్డి మౌర్య వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలోని నాగులపల్లెకు చెందిన రైతు నారపురెడ్డి ఓబుళరెడ్డి కుమార్తె మౌర్య యూపీఎస్సీ ఫలితాల్లో 100వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్లో స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించింది. 206వ ర్యాంక్: నాగవెంకట మణికంఠ గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీహెచ్ నాగవెంకట మణికంఠ సివిల్ సర్వీసెస్లో 206 ర్యాంక్ సాధించారు. ప్రకాశం జిల్లా మార్టురులో ఇంటర్ వరకు చదివిన మణికంఠ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశారు. 2017లో ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు ఎంపికై ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు. ఆయన తండ్రి సీహెచ్ మంగాచారి ఫొటోగ్రాఫర్, తల్లి శారదాదేవి గహిణి. 512వ ర్యాంక్: ప్రవీణ్చంద్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సివిల్స్లో 512వ ర్యాంకు సాధించారు. పాట్నా ఐఐటీలో ఎలక్టిక్రల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ప్రవీణ్ చంద్ ..నలుగురికీ సేవచేయాలనే లక్ష్యంతో తన బెంగళూరులో తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి సివిల్స్కు ప్రిపేరయ్యాడు. 2016లో సివిల్స్కు ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అవకాశం రాలేదు. 2017 జూన్లో ప్రిలిమ్స్లోను, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు రాసి, ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూకు వెళ్లాడు. తాజాగా శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో 512వ ర్యాంకు సాధించాడు. కోచింగ్ తీసుకోకుండానే 374వ ర్యాంకు 2017 సివిల్స్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాతల కుమారుడు రిషికేశ్రెడ్డి శుక్రవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 374 ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సివిల్స్లో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. 245వ ర్యాంకు: చందీష్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం అడపగుండ్లపల్లి గ్రామానికి జి. చందీష్ సివిల్స్లో 245వ ర్యాంకు సాధించారు. తనను ఐపీఎస్గా చూడాలన్నదే తన అమ్మానాన్న కోరిక అని తెలిపారు. 513వ ర్యాంకు: ప్రసన్నకుమారి అనంతపురం జిల్లాకు చెందిన ప్రసన్న కుమారికి సివిల్స్ ఫలితాల్లో 513వ ర్యాంకు పొందారు. తాడిపత్రి రూరల్ మండలం కొండేపల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకుమారి బీటెక్ను 2014లో పూర్తి చేసి 2015 నుంచి సివిల్స్కు ప్రిపరేషన్ ప్రారంభించారు. ఇటీవల విడుదలైన గ్రూప్–1లోనూ డీఎస్పీ పోస్టు దక్కింది. సేవాభావమే సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లేలా చేసిందని ప్రసన్న కుమారి తెలిపారు. 884 ర్యాంకు: వంశీ దిలీప్ 2017 సివిల్స్ ఫలితాల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఇరుకుపాలెంకు చెందిన మీరావత్ వంశీదిలీప్ 884వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి డాక్టర్ మీరావత్ గోపినాయక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఐదేళ్లపాటు గుంటూరు జిల్లాలో పనిచేశారు. వరంగల్ నిట్లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో క్యాంపస్ సెలక్షన్లో తమిళనాడు నైవేలీలో నెలకు రూ.67వేల వేతనానికి ప్రై వేటు కంపెనీలో ఎంపికయ్యాడు. తొమ్మిదేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి సివిల్స్పై ఆసక్తితో ఉద్యోగం వదిలిపెట్టి ఢిల్లీలో కోచింగ్లో చేరాడు. ఒకసారి సివిల్స్ మెయిన్స్ వరకు, మరోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. మూడోసారి పట్టుదలతో చదివి 884వ ర్యాంకు సాధించాడు. తన తండ్రి జిల్లా వైద్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన్ను చూసి ప్రజలకు సేవలు అందించేందుకు సివిల్స్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు వంశీ దిలీప్ తెలిపాడు. 6వ ర్యాంకు శ్రీహర్ష ఖమ్మంఅర్బన్: ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన కోయ శ్రీహర్ష శుక్రవారం వెలువరించిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. ఈయన తల్లిదండ్రులు కోయ నాగేశ్వరరావు, సులోచన ప్రభుత్వ ఉపాధ్యాయులు. శ్రీహర్ష 1 నుంచి 5వ తరగతి వరకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు బల్లేపల్లి ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ను హైద రాబాద్లోని నారాయణ కళాశాలలో, ఇంజనీరింగ్ను ఎన్ఐటీ జంషెడ్పూర్లో పూర్తి చేశారు. 2012లో సిగ్నోర్ ఇండియా కంపెనీలో ఉద్యోగాన్ని పొంది.. హైదరాబాద్, గుజరాత్లో పనిచేసిన ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. 2017 సివిల్స్ పరీక్షలో ప్రతిభను చాటి, శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో 6వ ర్యాంక్తో సత్తా చాటారు. 22 ఏళ్లకే సివిల్స్.. హైదరాబాద్ కుర్రాడి ఘనత హెదరాబాద్ కుర్రాడు సాయి తేజ మొదటి ప్రయత్నంలోనే 22ఏళ్లకే సివిల్స్లో 43వ ర్యాంకు సాధించారు. ఆయన మాటల్లోనే...‘ హైదరాబాద్(మలక్ పేట). నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే జరిగింది. ఐఐటీ, హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాను. 2016లో బీటెక్ పూర్తవుతూనే సివిల్స్కు ప్రిపరేషన్ ప్రారంభించాను. 2017 జూన్లో ప్రిలిమ్స్ రాశాను. పబ్లిక్ సర్వీసులోకి రావాలని, సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి ఎంతో చేయొచ్చని భావించి సివిల్స్ను లక్ష్యంగా ఎంచుకున్నాను. నాన్న సివిల్స్ ద్వారా సమాజానికి సేవ చేయొచ్చని చెబుతుండటం కూడా నేను సివిల్స్ వైపు రావడానికి కారణం. సివిల్స్కు చాలా తక్కువ పుస్తకాలు చదివా. క్రమశిక్షణతో అంకితభావంతో ప్రిపరేషన్ కొనసాగించా. ఆయా అంశాలను విశ్లేషణాత్మకంగా చదవడం లాభించింది. పొలిటికల్సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ను ఆఫ్షనల్గా ఎంచుకున్నా. ఇంటర్వ్యూలో రాష్ట్ర విభజన, అంతర్జాతీయ అంశాలను అడిగారు. నమ్మకం, పట్టుదలతోనే విజయం సాధించా’. జేసీ కుమారుడికి 393 ర్యాంక్ సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సురభి సత్తయ్య కుమారుడు సురభి ఆదర్శ్ సివిల్స్లో 393 ర్యాంకు సాధించారు. గతంతో మెయిన్స్ వరకు వెళ్లిన ఆదర్స్ ఈసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధించారు. సివిల్స్ సాధించాలన్నది తన కల అని.. ఇందుకోసం కష్టపడి చదివినట్లు చెప్పారు. అమ్మానాన్న పోత్సాహంతోనే: సాయినాథ్రెడ్డి యూపీఎస్సీ శుక్రవారం వెల్లడించిన సివిల్స్ తుది ఫలితాలలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి పరిధి కాపులపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ ఆలిండియా 480వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి భాగ్యలక్ష్మి, లింగారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు సాయినాథ్రెడ్డి. ఒకటి, రెండు తరగతులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఢిల్లీలో సివిల్స్కు కోచింగ్ తీసుకొని ర్యాంక్ సాధించాడు. 607వ ర్యాంకు: కృష్ణకాంత్ పటేల్ సివిల్స్లో 607వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఐపీఎస్ కావాలనేది నా చిన్ననాటి కల. 2011లో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అప్పటినుంచి సివిల్స్కు సిద్ధమవుతూ ఉన్నాను. ఇప్పటివరకు 5 సార్లు సివిల్స్ రాశాను. 2016లో ఎస్ఎస్బీలో అసిస్టెంట్ కమాండెంట్ (డీఎస్పీ ర్యాంకు)ఉద్యోగానికి ఎంపికయ్యాను. సివిల్స్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎస్ఎస్బీ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. ఎన్నిసార్లు ఓటమి వచ్చినా పట్టుదల వదలకుండా కష్టపడ్డాను. నా విజయానికి తల్లిదండ్రులు, మా అన్నయ్య తోడ్పాటు అందించారు. పాజిటివ్గా ఆలోచించడమే నా సక్సెస్ మంత్ర. 624వ ర్యాంకు: ఎడవెల్లి అక్షయ్కుమార్ మాది వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ. మా తాత, తండ్రి ఇద్దరు పోలీస్శాఖలో పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితోనే పోలీసుగా మారాలని నిర్ణయించుకున్నా. అందుకే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. నాన్న ప్రస్తుతం మడికొండ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు కొనసాగిస్తున్నాడు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ భూపాల్లోని నిట్లో పూర్తి చేశాను. క్యాంపస్ ఇంటర్య్వూలో దుబాయ్లోని పెట్రోలియం కంపెనీలో అవకాశం వచ్చింది.. కానీ ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో వదులుకున్నా. జాతీయ స్థాయిలో 726వ ర్యాంక్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషు (23) చిన్నవయస్సులోనే సివిల్ సర్వీస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2012–16 విద్యాసంవత్సరంలో ఢిల్లీలో బీటెక్(మెకానికల్) కోర్సు పూర్తి చేసి సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. -
వాట్సప్ ‘గురు’..!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి...విధి నిర్వహణలో తీరిక లేని పనులు...దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన కమిషనరేట్కు బాస్ కావడంతో నిరంతరం శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలై ఉండాల్సిన పరిస్థితి...అయినా దేశంలో అత్యున్నతమైన పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు గురువు అవతారమెత్తారు. సివిల్స్ పరీక్షలో కీలకమైన ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సలహాలు, సూచనలను వాట్సాప్ గ్రూప్ల ఏర్పాటు ద్వారా అందించారు. ఇప్పటికే ‘సివిల్స్ గురు’గా అవతారమెత్తిన మహేష్ భగవత్ మార్గదర్శనంలో తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) విడుదలైన ఫలితాల్లో దాదాపు పది మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన అభ్యర్థులకు ఆయన సలహాలు అందించారు. ఇందులో పాటిల్ సుమిత్కుమార్ సుభాష్ రావు(7వ స్థానం), కాజోల్ పాటిల్ (11), ఆనంద్రెడ్డి (41), తవల్నిఖిల్ దశరథ్ (46), జాదవ్ సుదర్శన్ (47), కస్తూరి ప్రశాంత్ (56), శ్వేత (70), షిండే అమిత్ లక్ష్మణ్ (73), సతీశ్ ఆశోక్ (79), మానే శశాంక్ సుధీర్ (100) విజేతలుగా నిలిచారు. సివిల్స్ ఫలితాల్లో 84 మంది... మహేష్ భగవత్ సలహాలను పాటించిన 300 మందిలో 84 మంది గతేడాది సివిల్స్ ఫలితాల్లో అర్హత సంపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులతో ఆయన లోగడ వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమేగాక సందేహాలను నివృత్తి చేశారు. ఆయన సలహాలు పొందిన వారిలో పుణేకు చెందిన వైశ్ణవి గౌడ్ 11వ ర్యాంక్ సాధించడం విశేషం. తొలి 100 ర్యాంకుల జాబితాలో ఆరుగురు స్థానం పొందారు. ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ తనయుడు ముజామిల్ ఖాన్ (22), ఒంగోలుకు చెందిన రిజ్వాన్ భాషా షేక్ (48), స్వప్పిల్ పాటిల్ (55), అన్వేష్ రెడ్డి (80), పర్జీత్ నాయర్ (87), శోడిశెట్టి మాధవి (104), పోలుమెట్ల అభిషేక్ (373), కపిల్ జీబీ గేడ్(401), శరత్చంద్ర ఆర్రోజు (425), వాసగిరి శిల్ప (547), రంజిత్ (555), మధుసూదన్రావు (588), కుమార్ చింత (608), పిన్నని సందీప్కుమార్ (732), నర్ర చైతన్య (733), బి.రవితేజ (741), కాపల పవన్కుమార్ (799), నరేశ్ మన్నే (979), ప్రేమ్ ప్రకాశ్ (1015), శాలిని (1047) వీరిలో ఉన్నారు. భవిష్యత్లోనూ అండగా... గతేడాది మొత్తం 1099 మంది సివిల్స్ ఎంపిౖకైతే వారిలో నేను సలహాలిచ్చిన 84 మందికి స్థానం దక్కడం సంతోషంగా ఉంది. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో నా మార్గదర్శనంలో సలహాలు, సూచనలు అందుకున్న పది మంది అభ్యర్థులు విజేతలుగా నిలవడం గర్వంగా భావిస్తున్నా. భవిష్యత్లోనూ వాట్సాప్ గ్రూప్ల ద్వారా మరెంతో మంది అధికారులను వెలుగులోకి తెస్తా. అండగా ఉంటా. – మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
యూఎస్ వదిలి... ఐపీఎస్ చేపట్టి...
లక్షల డాలర్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకొని సివిల్స్ బాట పట్టారు అజిత వేజెండ్ల. చెన్నై ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి యూఎస్లో ఫైనాన్స్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే కొంతకాలం ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చేశారు. తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎకనమిక్స్లో పీహెచ్డీ చేస్తూనే సివిల్స్ సాధించారు. జనపక్షపాతి అయిన ఆమె లక్షల డాలర్ల జీతాన్నిచ్చే ఉన్నతోద్యోగాన్ని వదులుకున్నారు. చిన్ననాటి నుంచీ చూసిన ప్రజల ఇబ్బందులను గమనించిన ఆమె హృదయంలో.. వారి కోసమే తన శక్తియుక్తులను వినియోగించాలన్న సంకల్పం బలంగా నాటుకుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసే లక్ష్యంతోనే సివిల్స్ రాశారు. కృషికి కుటుంబ ప్రోత్సాహం తోడు కాగా ఐపీఎస్ సాధించారు. ఆ లక్ష్యసాధకురాలే.. ఇప్పుడు రంపచోడవరం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అజిత వేజెండ్ల. చెన్నై ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక అమెరికా వెళ్లి ఫైనాన్స్లో ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే కొంత కాలం ఉద్యోగం చేసినా తన జీవితధ్యేయ సాధనకు స్వదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎకనమిక్స్లో పీహెచ్డీ చేస్తూనే సివిల్స్లో విజయం సాధించారు. లక్ష్యసాధకురాలైన అజిత విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే.. తూర్పుగోదావరి, రంపచోడవరం: నా బాల్యం తెనాలిలో గడవగా.. పెరిగింది హైదరాబాద్లో. నాన్న, అమ్మ ఉద్యోగస్తులు కావడంతో హైదరాబాద్లోనే పెరిగాను. అక్కడే సెయింటాన్స్లో ప్రా«థమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు చదివాను. నెల్లూరు నారాయణలో ఇంటర్, మద్రాస్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. స్కాలషిప్తోనే యూఎస్లో ఎంఎస్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేశాను. కొద్దికాలం క్రితమే వివాహం జరిగింది. భర్త రాహుల్దేవ్సింగ్ కూడా ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఏఎస్పీగా పనిచేస్తున్నారు. తమ్ముడు అజయ్ కూడా ఐఐటీలో చదివాడు గిరిజన బాలలతో గడుపుతా.. ఖాళీ సమయాల్లో దగ్గరలోని పాఠశాలకు వెళ్లి పిల్లలకు బోధన చేయడం ఎంతో ఇష్టం. రంపచోడవరం ఏజెన్సీలో కూడా వీలైతే గిరిజన బాలలతో సమయం గడపదలచుకున్నాను. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ప్రతి వ్యక్తీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకుని, దానిని సాధించడానికి శాయశక్తులా కృషి చేయాలి. ఎన్నుకున్న రంగంలో నైపుణ్యం పొందాలి. లక్ష్యం సాధించే వరకూ కష్టపడాలి. మానవతా దృక్పథంతో ముందుకు సాగాలి. ప్రజల కష్టాలు దగ్గరగా చూశాను.. తాత గారి ఊరు తెనాలి తరచూ వచ్చేవారం. అక్కడ ప్రజల ఇబ్బందులు, బంధువుల పరిస్థితి దగ్గర నుంచి చూశాను. అప్పుడే పబ్లిక్ ఓరియంటెడ్ జాబ్ (ప్రజాజీవితంతో ముడిపడ్డ ఉద్యోగం) చేయాలని ఉండేది. యూఎస్లో ఉద్యోగం వచ్చినా సివిల్స్ సాధించాలనే కోరికతో ఇండియాకు వచ్చేశాను. ఎకనామిక్స్లో పీహెచ్డీ చేస్తూనే సివిల్స్ సాధించాను. గ్రేహౌండ్స్లో శిక్షణ వృత్తి నైపుణ్యం పెంచింది.. గ్రేహౌండ్స్లో అసిస్టెంట్ కమాండెంట్గా చేయటం వృత్తి నైపుణ్యాన్ని పెంచింది. ప్రాథమికంగా పోలీస్ ఉద్యోగంలో నేర్పుకోవాల్సిన మెళకువలు, వ్యూహరచన, సహనం, సమయస్ఫూర్తి ఆకళింపు చేసుకున్నాను. పోలీసులు చైతన్యవంతులై పనిచేసేలా సహకరిస్తాను. చట్టం అమలు కోసం అన్ని విభాగాలనూ సమన్వయం చేస్తాను. మానవీయంగా వ్యవహరించాలనేది నా లక్ష్యం. -
కసి ఉంటే కష్టమేం కాదు
- ఇంగ్లిషు నేర్చుకోండి...మోజును తగ్గించుకోండి - తెలుగుకే పరిమితమైతే అవకాశాలు రావనేది అపోహ - సివిల్స్ రాసే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నదే ఆకాంక్ష - అందుకే విద్యార్థులను కలుసుకుంటున్నా... - తెలుగు అకాడమీ అనువాదాలు విసృ్తతంగా చేపట్టాలి – ‘సాక్షి’తో... సివిల్స్లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాల కృష్ణ రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం: సివిల్స్లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం జీవితంలో మరచిపోలేని రోజని రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం సివిల్స్ రాస్తున్న విద్యార్థులను కలిసి సలహాలు, సూచనలిస్తూ వారిలో స్ఫూర్తిని రగిలించి ఏపీ నుంచి మరింతమంది సివిల్ ర్యాంకులను చూడాలన్నదే నా ఆకాంక్షని అన్నారు. అందుకే తనకున్న ఖాళీ సమయంలో ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి విద్యార్థులను కలుసుకుంటున్నానని పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... . సాక్షి: సివిల్స్ రాయాలంటే ఆర్థికబలం ఉండాలా? గోపాలకృష్ణ: ఆర్థికంగా కొంతైనా నిలదొక్కుకోవాలి. సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేయడం వల్ల శిక్షణకు, ఇతరత్రా మెటీరియల్, పుస్తుకాల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులేమీ ఎదుర్కోలేదు. సాక్షి: కోచింగ్ సెంటర్లు మీ ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నాయని, దీనిపై మీ స్పందన? గోపాల కృష్ణ: నేనైతే ప్రత్యేకంగా ఏ శిక్షణా సంస్థలో కోచింగ్ తీసుకోలేదు. అయితే అన్ని కోచింగ్ సెంటర్లు నిర్వహించే మాక్ టర్వ్యూకు, మ్యూనికేషన్స్కు మాత్రమే హాజరయ్యాను. ఇక వారు నా ఫొటోను వాడుకుంటే అది వారి విచక్షణకే వదిలేస్తున్నాను. సాక్షి: సివిల్స్ తెలుగు మాధ్యంలో రాస్తే లక్ష్యాన్ని సాధించవచ్చా? గోపాలకృష్ణ: అందుకు నేనే ఉదాహరణ. ప్రిలిమనరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఎలా నెగ్గుకు రాగలిగాను. మూడో ర్యాంకు ఎలా సాధింగలిగాను. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. సాక్షి: తెలుగు మాధ్యంలో మెటీరియల్ లభ్యం కావడం కష్టమంటారే? గోపాలకృష్ణ: నిజమే. ఇంగ్లిషు మెటీరియల్ను సంపాదించి తెలుగులో తర్జుమా చేసుకుని అధ్యయనం చేశాను. సాక్షి: మీరిచ్చే సూచనలేమిటి...? గోపాలకృష్ణ: మనకు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ ఉంది. వీరు చేయాల్సింది ఎంతో ఉంది. సివిల్ సర్వీసుకు సంబంధించిన ఎథిక్స్, ఎకనామిక్స్, ఆప్టిట్యూడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర పుస్తకాలు ఇంగ్లిషులో ఉన్నాయి. వీటిని తెలుగులో అనువదించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ పని నేను చేయాలనుకుంటున్నాను. ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి. సాక్షి: సివిల్స్ రాసేవారికి మీరిచ్చే సూచనలు? గోపాలకృష్ణ: సిలబస్ పట్ల కసితో కూడిన లక్ష్య నిర్దేశం ఉండాలి. పాత సివిల్ పరీక్షా పేపర్లను చదువుతూ ఉండాలి. వర్తమాన అంశాలపై బాగా అవగాహన ఉండాలి. సాక్షి: ప్రజలకు ఏవిధమైన సేవలందిస్తారు? గోపాలకృష్ణ: పేదప్రజలకు, అణగారిన వర్గాలకు సేవలందిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలన్నది తన ఆకాంక్ష. సాక్షి: మీ స్వగ్రామంలో మీ కుటుంబాన్ని వెలి వేశారు, భూమిని కబ్జా చేశారన్నారు కదా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గోపాలకృష్ణ: సివిల్స్ సాధించగానే గ్రామంలో సమస్యలన్నీ సమసిపోయాయి. అందరూ బాగానే ఉంటున్నాం. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం. -
నాన్న కోరిక, నా లక్ష్యం నెరవేరింది..
సివిల్ సర్వీస్లో 3వ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ నన్నయ్య వర్సిటీ, లెనోరా దంత వైద్య కళాశాలలో ఘన సత్కారం ‘నీ జేబులో గ్రీనింకు పెన్ను ఉండాలిరా, నీ ద్వారా మనలాంటి పేదలెందరికో సేవలందాలిరా’ అన్న నాన్న మాటలే... సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణకు ప్రేరణ. నాన్న కోరికను లక్ష్యంగా చేసుకున్న అతడు 11 ఏళ్లపాటు కఠోరంగా శ్రమించాడు. కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు నిరుత్సాహపరిచినా.. పేదరికం అడ్డంకిగా మారిన.. అతడి గురి లక్ష్యంపైనే ఉంది. ఇంతవరకూ తెలుగు రాష్ట్రంలోనే ఎవరూ సాధించలేని ఈ ర్యాంకును... తెలుగు మీడియంలో పరీక్ష రాసిన ఇతడు సాధించి కొత్త రికార్డును నెలకొల్పాడు. అందుకే తెలుగు ప్రజలు ఇతడికి నీరాజనాలు పడుతున్నారు. మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన ఇతడిపై విద్యార్థులతో సమానంగా అధ్యాపకులు, అచార్యులు కూడా ప్రేమాభిమానాలు కురిపించారు. వారి అభిమాన వర్షానికి తడిచి ముద్దైన గోపాలకృష్ణ వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. రాజానగరం : ‘తెలుగు మీడియంలో చదువుకున్నా, పేదరికం అడ్డంకిగా ఉన్నా.. నాన్న కోరికను తీర్చడంతోపాటు నా లక్ష్యాన్ని కూడా సాధించాలనే తపనతో 11 సంవత్సరాలపాటు కఠోరంగా శ్రమించాను’ అంటూ... అంటూ సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ చేసిన ప్రసంగం అటు విద్యార్థులను ఇటు అధ్యాపకులు, ఆచార్యులను మంత్రముగ్ధులను చేసింది. నగరానికి వచ్చిన మంగళవారం అతడిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరంలోని కేఎల్ఆర్ లెనోరా దంతవైద్య కళాశాలలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోణంకి మాట్లాడుతూ లక్ష్యసాధనకు కష్టపడుతుంటే కొంతమంది మిత్రులు, సహచరులు, బంధువులు కాస్త నిరుత్సాహపరిచినా వెనుకంజవేయలేదన్నారు. అప్పటికే చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగం ఆత్మస్ధైర్యాన్నిచ్చిందన్నారు. ఇంత ర్యాంకు సాధించడంలో ఎదురైన కష్టాలు, ఇబ్బందులు, లక్ష్యాన్ని సాధించేందుకు చేసిన కృషిని వివరించారు. ప్రభుత్వ బడులలోనే ఉన్నత విద్య సాగిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్ తరువాత టీటీసీ చేసి డీఎస్సీ రాయడంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చిందన్నారు. అయితే సివిల్స్ కోసం డిగ్రీ ప్రైవేటుగా చదివానన్నారు. ఇలా 11 ఏళ్లు కఠోర శ్రమతో మూడుసార్లు విఫలమై..నాలుగో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించినట్టు చెప్పారు. ఇంతవరకూ పడిన కష్టమే రేపు మంచి పరిపాలనాధికారిగా తీర్చిదిద్దుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పరీక్షకు ప్రివేర్ అయిన తీరు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్స్ పరీక్షకు ఏవిధంగా ప్రిపేర్ కావాలి, ఏ పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు సాధించాలనే విషయాలను కూలకషంగా వివరించారు. ఇంటర్య్వూతోపాటు 2,025 మార్కులకు 1,104 మార్కులే తనకు వచ్చాయన్నారు. తన ప్రసంగం వింటున్న విద్యార్థులలో కనీసం ఒకరిద్దరైనా సివిల్స్ లక్ష్యం వస్తే ఇక్కడకు వచ్చినందుకు ఫలితం ఉంటుందన్నారు. ఇంగ్లిష్లో చదువుకున్న వారే విజయం సాధిస్తారనే భావాన్ని విడనాడాలని, భాష ఏదైనా భావం ఉండాలనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా దంత వైద్య కళాశాలలో విద్యాభ్యాసంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ఆయన అందజేశారు. నాడు బుర్రా, నేడు రోణంకి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసులో 1993లో బుర్రా వెంకటేష్ 12వ ర్యాంకును సాధిస్తే నేడు రోణంకి గోపాలకృష్ణ మూడో ర్యాంకును పొందారని నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో మొదటి ర్యాంకును సాధించేవారెవ్వరని విద్యార్థులను ప్రశ్నించారు. తెలుగులో మాట్లాడటమే నామోషీ అనుకునే ఈ రోజుల్లో తెలుగులో పరీక్ష రాసి ఈ ర్యాంకును పొందడం సా«ధారణ విషయం కాదన్నారు. సాధారణ కుటుంబం నుండి వచ్చినవాడు కావడం మరీ విశేషమన్నారు. కేఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి మట్లాడుతూ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం లోపం ఉండకూడదన్న విషయాన్ని గోపాలకృష్ణ నిరూపించారన్నారు. ఘన సత్కారం అనంతరం గోపాలకృష్ణను కళాశాల యాజమాన్యం గజమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసింది. నన్నయ యూనివర్సిటీలో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో నన్నయ అధ్యాపక బృందం ఆచార్య ఎస్.టేకి, ఆచార్య మట్టారెడ్డి, ఆచార్య పి.సురేష్వర్మ, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ ఆలీషాబాబు, ఈసీ మెంబర్ విజయనిర్మల, డీఎస్పీ రమేష్బాబు, సింగపూర్ సిటీ బ్యాంకు ఉపాధ్యక్షులు అనుమోలు సారథి, దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విశ్వప్రకాష్రెడి, వైస్ ప్రిన్సిపాల్ ధల్సింగ్, డైరెక్టర్లు లక్ష్మణరావు, నాగార్జనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'కోచింగ్ లేకుండానే సివిల్స్లో మంచి ర్యాంక్'
-
చీత్కారాలే నాలో కసిని పెంచాయి
-
సివిల్స్లో తెలుగు ప్రభంజనం
-
చీత్కారాలే కసిని పెంచాయి
► నన్నెందుకూ పనికి రావన్నారు ► కోచింగ్ సెంటర్లలో అడ్మిషన్ కూడా ఇవ్వలేదు ► పట్టుదలతో చదివాను... మూడో ర్యాంకు సాధించాను ► ‘సాక్షి’మెటీరియల్ ఎంతో ఉపయోగపడిందన్న గోపాలకృష్ణ హైదరాబాద్: సివిల్స్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ. తల్లిదండ్రులు రోణంకి అప్పారావు, రుక్మిణి వ్యవసాయ కూలీలు. అన్నయ్య కోదండరావు ఎస్బీఐలో మేనేజర్. పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే పలాస మండంలో చదివారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(ఎంపీసీ)లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్లలోని డైట్లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 2007లో డీఎస్సీ రాసి సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)గా ఎంపికయ్యారు. ప్రస్తుతం పలాస మండలం రేగులపాడులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 2012లో గ్రూప్–1లో ఇంటర్వూ్య వరకు వెళ్లినా సుప్రీంకోర్టు తీర్పుతో ఇంటర్వూ్యలు రద్దయ్యాయి. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు 2006 నుండి సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చివరికి నాలుగో ప్రయత్నంలో తన కల సాకారం చేసుకున్నాడు. 1వ తరగతి నుండి సివిల్స్ వరకు మాతృభాష తెలుగులో చదివి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకు సాధించడం ఇదొక చరిత్ర అని సివిల్స్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరుకు గది.. గది నిండా పుస్తకాలు.. అశోక్నగర్ చౌరస్తాలోని ఓ మారుమూల గల్లీ. రూ.3,500 కిరాయితో సింగిల్ రూం. ఆరు నెలలుగా ఇదే గోపాలకృష్ణ చిరునామా. ఓ వాలు కుర్చీ, 4 ప్యాంట్లు, చొక్కాలు, ఓ ఎలక్ట్రి కల్ కుక్కర్ ఇవే అందులోని వస్తువులు. గది లో ఎక్కడ చూసినా పుస్తకాలే కనిపిస్తాయి. ఎప్పుడైనా అనాసక్తిగా అనిపిస్తే దేశభక్తి గేయాలు వినడం ఇదే గోపాలకృష్ణ దినచర్య. ‘సాక్షి’మెటీరియల్ ఉపయోగపడింది ‘సాక్షి’పత్రికను ప్రతిరోజూ చదవుతానని, ఎడిటోరియల్స్, ప్రత్యేక కథనాలను క్రమం తప్పకుండా చదవడంతో పాటు వాటిని కట్ చేసుకుని తర్వాత కూడా చదివేవాడినని గోపా లకృష్ణ చెప్పారు. ‘సాక్షి’భవిత కూడా తనకెం తో ఉపయోగపడిందన్నారు. ‘సాక్షి’దిన పత్రిక లో బాలలత పేరుతో ఎన్నో ఎడ్యుకేషన్ వ్యాసాలు రాశానన్నారు. ఎన్నో అవమానాలు.. చీత్కారాలు.. సివిల్స్లో తర్ఫీదు పొందడానికి హైదరాబాద్ వచ్చిన తనకు ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయని కన్నీటి పర్యంతమవుతూ ‘సాక్షి’కి వివరించారు గోపాలకృష్ణ. ఏ కోచింగ్ సెంటర్కు వెళ్లినా నువ్వు పనికిరావంటూ అడ్మిషన్ ఇవ్వడానికే నిరాకరించారని, అయినా దేవుని దయ, అమ్మానాన్నల దీవెనలు, అన్నయ్య కోదండరావు స్పూర్తి, స్నేహితుల సహకారంతో పట్టుదలతో చదివానన్నారు. చిన్నప్పుడు తాను పడ్డ బాధలు తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి ప్రతీకారంతో ఈ విజయాన్ని సాధించానని స్పష్టం చేశారు. తమ ఊరికి కరెంట్ లేకపోతే దీపం వెలుగులో చదువుకున్నానని, ఇప్పటికీ తమ ఊరికి న్యూస్ పేపర్ అంటే ఏమిటో తెలియదని చెప్పారు. తనకు ఎటువంటి అలవాట్లూ లేవని, ఆకలి, ఇతర అవసరాలు లేకపోతే చదువే తన లోకమని, అందులోనే ఆనందం పొందుతానని అన్నారు. సివిల్స్లో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పదేళ్ల కృషి ఫలితం.. ప్రభుత్వాధికారి కావాలని, ప్రజలకు సేవ చేయాలని నిరంతరం తప్పించేవా డని, పదేళ్ల కృషితో కలెక్టర్ అవుతున్నాడని గోపాలకృష్ణ తల్లిదండ్రులు ఆనందం వ్య క్తం చేశారు. తన తమ్ముడు మంచి అధికా రిగా రాణిస్తాడనే నమ్మకం ఉందన్నారు గోపాలకృష్ణ సోదరుడు కోదండరావు . -
సివిల్స్లో తెలుగు ప్రభంజనం
► ఎంపికైన 1099 మందిలో 90 మందికిపైగా మనోళ్లే.. సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్లో తెలుగు అభ్యర్థులు దుమ్మురేపారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 90 మంది వరకు సివిల్స్లో విజయం సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం రాత్రి సివిల్ సర్వీసెస్ ఎగ్జామి నేషన్–2016 ఫలితాలు వెల్లడించింది. కర్ణాట కకు చెందిన కేఆర్ నందిని తొలి ర్యాంకు కైవసం చేసుకున్నారు. కన్నడ సాహిత్యం ఆప్షనల్గా ఎంచుకుని ఆమె సివిల్స్ రాసి నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. ఈమె ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా శిక్షణ పొందుతున్నారు. రెండోర్యాంకును అన్మోల్ షేర్ సింగ్ బేడీ సొంతం చేసుకున్నారు. పంజా బ్కు చెందిన ఈయన బిట్స్ పిలానీ నుంచి కంప్యూటర్ సైన్స్లో బీఈ పూర్తి చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాల కృష్ణ మూడో స్థానంలో నిలవగా, విజయవా డకు చెందిన కొత్తమాసు దినేశ్కు మార్(వరంగల్ ఎన్ఐటీలో చదివారు) ఆరో ర్యాంకు సాధించారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు కైవసం చేసు కున్నారు. ఆగస్టులో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 11,35,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,59,659 మంది పరీక్ష రాశారు. వీరిలోంచి 2016 డిసెంబర్లో నిర్వహించిన మెయిన్స్కు 15,452 మంది ఎంపికయ్యారు. తుదకు 2,961 మందికి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మౌఖిక పరీక్ష నిర్వహించి 1099 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేశారు. ఐఏఎస్, ఐఎఫ్ ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ – గ్రూప్ ఏ, గ్రూప్ బీ సర్వీసులకు వీరు అర్హత సాధించారు. వీరిలో 253 మంది మహిళలు ఉండటం గమనార్హం. టాప్–25లో 18 మంది పురు షులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. వివిధ సర్వీసులకు ఎంపికైనవారిలో 500 మంది జనరల్ కేటగిరీలో, 347 మంది ఓబీసీ కేటగి రీలో, 163 మంది ఎస్సీ, 89 మంది ఎస్టీ కేటగిరీల్లో ఉన్నారు. మరో 172 మందిని రిజర్వు లిస్టులో పెట్టారు. ఐఏఎస్కు ఎంపికైన 180 మందిలో జనరల్ 90, ఓబీసీ 49, ఎస్సీ 27, ఎస్టీ 14 మంది ఉన్నారు. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికైన 45 మంది అభ్యర్థుల్లో జనరల్ 26, ఓబీసీ 12, ఎస్సీ 06, ఎస్టీ కేటగిరీలో ఒక్కరు ఉన్నారు. ఐపీఎస్ కేటగిరీలో ఎంపికైన 150 మందిలో జనరల్ 81, ఓబీసీ 37, ఎస్సీ 18, ఎస్టీ 14 మంది అభ్యర్థులున్నారు. కలిసొచ్చిన ఆంత్రోపాలజీ: సివిల్స్కు ఎంపికైన వారిలో ఎక్కువ మంది ఆంత్రోపాలజీని ఆప్షనల్గా ఎంచుకున్న వారే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో ఎక్కువ మంది ఆంత్రోపాలజీనే ఆప్షనల్గా ఎంచుకున్నారు. విజేతలు ఏమంటున్నారు..? సివిల్స్లో ఆరో ర్యాంకు సాధించిన దినేశ్ వరంగల్ నిట్లో 2010–14 మెకానికల్ బ్రాంచీలో చదివారు. రెండు సంవత్సరాలుగా ఢిల్లీలో పొలిటికల్ సైన్స్ను సబ్జెక్ట్గా ఎంచుకుని సివిల్స్కు ప్రిపేర్ అయినట్లు తెలిపాడు. ఇక వైఎస్సార్ జిల్లావాసులు ఇద్దరు సివిల్స్లో మంచి ర్యాంకు సాధించారు. కడపలోని బాలాజీనగర్కు చెందిన గడికోట పవన్ కుమార్రెడ్డి 353వ ర్యాంకు సాధించారు. గతంలో ఐఎఫ్ఎస్లో 26వ ర్యాంకు సాధించిన ఆయన ప్రస్తుతం అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖలో డీఎఫ్ఓగా పనిచేస్తున్నారు. కడపలోని అక్కాయపల్లెకు చెందిన మేరువ సునీల్కుమార్రెడ్డి 354వ ర్యాంకు సాధించి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. ఈయన పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ నిట్లో బీటెక్ చదివారు. భవిష్యత్తులో ఐఏఎస్ను సాధించ డమే తన లక్ష్యమని సునీల్కుమార్రెడ్డి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తిలోని పద్మశాలీ కాలనీకి చెందిన చెన్నూరి రూపేశ్ 526 ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. హసన్పర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేసిన రూపేష్ ఆ తర్వాత పాలిటెక్నిక్ పూర్తి చేశారు. అనంతరం కిట్స్ కళాశాలలో బీటెక్ చదివారు. అలాగే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింతా కుమార్ గౌడ్ 608 ర్యాంకు సాధించారు. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన కుమార్ ఘట్కేసర్లోని శ్రీనిధి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. సివిల్ సర్వీసే లక్ష్యంగా ఐదుసార్లు పరీక్షలు రాశాడు. 2015లో 768 ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. తాజా ర్యాంకుతో ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది. కాగా, ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో కొనసాగుతున్న ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఇద్దరు అభ్యర్థులు సివిల్స్–2016లో అర్హత సాధించారు. వీరిలో పి.ప్రేమ్ ప్రకాశ్ (ర్యాంకు–971), ఎం.నరేశ్కుమార్ (ర్యాంకు–1015) ఉన్నారు. ఏకే ఖాన్ కుమారునికి 22వ ర్యాంక్ సాక్షి, హైదరా బాద్: మాజీ ఐపీ ఎస్ అధి కారి, ప్రభుత్వ మైనా ర్టీ సంక్షేమ వ్యవ హారాల సలహా దారు ఏకే ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ సాధించారు. నగరంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ముజామిల్ గత ఏడాది సివిల్స్ రాసి ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్కు ఎంపికయ్యారు. ఈసా రి 22వ ర్యాంక్ రావడంతో ఐఏఎస్కు ఖరారయ్యే అవకాశం ఉంది. ఎంపికలో భగవత్ పాత్ర.. దేశవ్యాప్తంగా 100 మంది సివిల్స్కు ఎంపిక కావడం వెనుక రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ పాత్ర ఉంది. సివిల్స్ ఇంటర్వూ్యలకు సంబంధించి ఈ ఏడాది దాదాపు 300 మందికి తర్ఫీదు ఇచ్చారు.300 మందిలో దాదాపు 100 మంది వివిధ ర్యాంకులు సాధించారని మహేష్ భగవత్ ‘సాక్షి’కి తెలిపారు. దివ్యాంగుల్లోఆత్మస్థైర్యం నింపడానికే.. హైదరాబాద్: సివిల్స్లో 167వ ర్యాంకు వచ్చిన ప్పటికీ ఐఏఎస్లో చేర ను. కేవలం దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడానికే నేను సివిల్స్ రాశాను. 2004 సివిల్స్లో కూడా నాకు 399వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం నేను రక్షణ శాఖ (ఇండియన్ డిఫెన్స్)లో పనిచేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సివిల్స్ కోచింగ్ కోసం అభ్యర్థులు నగరానికి వస్తున్నారు. వారికి అవసరమైన మెళకువలు బోధిస్తున్నాను. 3వ ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ కూడా నా విద్యార్థే. ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని, ఆత్మవిశ్వాసంతో సివిల్స్ రాయాలని వారికి సూచించాను. –బాలలత, దివ్యాంగురాలు, 2017 సివిల్స్లో 167వ ర్యాంకర్ దినపత్రికలు చదివే సివిల్స్ సాధించా.. సివిల్స్లో 142వ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అటు ఉద్యోగం చేస్తూనే సొంతంగా సివిల్స్కు ప్రిపేర్ అయ్యా. రోజూ దినపత్రికలతో పాటు ఆన్లైన్ మెటీరియల్ సేకరించి చదివాను. – ప్రవీణ్ శామీర్ కుమార్ చిరువూరి -
నెరవేరిన ‘ఆకాంక్ష’
- కిరాణ కొట్టు యజమాని కొడుకు సివిల్స్ విజేత – వి. సాయి వంశీవర్థన్కు 220 ర్యాంకు – రెండో ప్రయత్నంలో విజయం – జార్ఖండ్లో మావోల కిడ్నాప్నకు గురైన వంశీవర్థన్ – పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ లక్రా స్ఫూర్తితో సివిల్స్ – పేదరిక నిర్మూలన కోసం ఆకాంక్ష పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు కర్నూలు (సిటీ) : కృషి, పట్టుదల ఉంటే అత్యున్నత లక్ష్యాలను సాధించవచ్చని ఓ కిరాణ కొట్టు యజమాని కుమారుడు నిరూపించారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని అతను చాటిచెప్పారు. 2016 సివిల్స్ ఫలితాల్లో అతను ఏకంగా 220వ ర్యాంకు సాధించి తన ‘ఆకాంక్ష’ను నెరవేర్చుకున్నారు. కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయనిపేటకు చెందిన వి.సుధాకర్, వి.లక్ష్మిదేవి దంపతుల కుమారుడు వి.సాయివంశీవర్దన్..సివిల్స్లో మెరిశారు. చదువులో మొదటి నుంచి ముందంజలో ఉండటంతో అతనని.. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ప్రాథమిక విద్య వైఎస్ఆర్ జిల్లా జమ్ములమడుగు నుంచి మొదలైంది. ఇక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు సెయింట్ మేరీస్ స్కూలు, 8 నుంచి 10వ తరగతి వరకు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీవాణి స్కూలులో చదివారు. ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ కళాశాలలో ఎంపీసీ గ్రూపు చదివి 950 మార్కులు సాధించారు. 2010లో చిత్తూరు జిల్లాలోని విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2010లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయగా ర్యాంక్ రాలేదు. అనంతరం టాటా కన్సల్టెన్సీ సర్వీసులో 2010–12 వరకు ఉద్యోగం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన ఫెలోషిప్కు ఎంపికై.. రెండు సంవత్సరాల పాటు జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో పని చేశారు. ఈ సమయంలో పరాస్నాథ్ కొండల్లో పర్యటిస్తుండగా.. నలుగురు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే 48 గంటల తర్వాత తిరిగి అతన్ని వదిలేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో పంజాబ్ రాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ లక్రాను స్ఫూర్తిగా తీసుకొని.. 2015 నుంచి సివిల్స్కోసం ఢిల్లీలోని వాదిరామ్ ఇన్సిట్యూట్లో శిక్షణ పొందారు. 2016 నోటిఫికేషన్ విడుదల కావడంతో సోషియాలజీ ఆప్షన్ పరీక్ష రాసి 220 ర్యాంకు సాధించారు. అనాథలను ఆదుకునేందుకు ఆకాంక్ష .. టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి పేద విద్యార్థులను, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఆకాంక్ష పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కోసం పని చేస్తున్న సమయంలోనే పేదరికం నిర్మూలించాలంటే ఐఏఎస్ సాధించి సమాజానికి తమవంతుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు సాయి వంశీవర్థన్ తెలిపారు. అక్క సౌజన్య, బావ ప్రసాద్లు తనకు ఆర్థికంగా సాయం చేశారని చెప్పారు. స్నేహితులు రమేష్, రాజేష్...సలహాలు సూచలు ఇచ్చేవారని తెలిపారు. ముత్యాల రాజు స్ఫూర్తి - సివిల్స్ 905 ర్యాంకర్ రవికాంత్ మనోగతం నంద్యాల: ఆంధ్రప్రదేశ్కే చెందిన 2007 బ్యాచ్ సివిల్స్ టాపర్ ముత్యాల రాజు తనకు స్ఫూర్తి అని సివిల్స్ ర్యాంకర్ గోవిందపల్లె రవికాంత్ అన్నారు. బుధవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 905 ర్యాంక్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ర్యాంక్కు ఐపీఎస్, ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని, మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రోజూ 10 గంటలు చదివానని, మధ్యలో రిలాక్స్ కోసం ధ్యానం చేసేవాడినన్నారు. అమ్మ కృపమ్మ, నాన్న రాజు ఆశీస్సులతోనే తాను ఈ ఘనత సాధించానన్నారు. కుటుంబ నేపథ్యం రవికాంత్ తండ్రి రాజు రిటైర్డ్ కానిస్టేబుల్, తల్లి కృపమ్మ హెల్త్ సూపర్వైజర్. స్థానిక జ్ఞానాపురంలోని వైఎస్ ప్రభుదాస్రెడ్డి రోడ్డులో నివాసం ఉంటున్నారు. రవికాంత్ ఎన్జీఓ కాలనీలోని గుడ్షప్పర్డ్ స్కూల్లో 10వ తరగతి వరకు, హైదరాబాద్లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్, వరంగల్లోని ఎన్ఐటీలో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత సివిల్స్లో ర్యాంకు సాధించడానికి ఏడాది పాటు హైదరాబాద్లోని రెండు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. అనంతరం నెల్లూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఏడాది ఉద్యోగం చేసి మళ్లీ సివిల్స్ రాయడానికి రాజీనామా చేశారు. గత ఏడాది సివిల్స్లో ప్రిలిమినరీ, మెయిన్స్లో ప్రతిభ చూపినా ఇంటర్య్వూలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆయన మరింత పట్టుదలగా చదివి ప్రస్తుతం 905 ర్యాంకును సాధించారు. -
యానాం యువకుడికి సివిల్స్లో 410వ ర్యాంకు
ఉదయ్శ్రీరామ్వినయ్ కు అభినందనలు వెల్లువ యానాం: యానాంకు చెందిన యువకుడు మల్లిపూడి ఉదయ్శ్రీరామ్ వినయ్ యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ)లో 410వ ర్యాంకు సాధించారు. యానాం నుంచి సివిల్ సర్వీసెస్కు ఎంపికైన మొట్టమొదటి వ్యక్తిగా వినయ్ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా గురువారం సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల కావడంతో వినయ్కు ర్యాంకు రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను ప్రాథమిక తరగతి నుంచి ఇంటర్ వరకు రీజెన్సీ పబ్లిక్ స్కూల్లో చదివానని అనంతరం పుదుచ్చేరి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా సంవత్సరంపాటు ఉద్యోగం చేశానని తెలిపారు. అయితే ప్రజలకు సేవలందించేందుకు సివిల్ సర్వీసెస్ ఒక మార్గమని కొంతమంది ఐఏఎస్ల ద్వారా స్ఫూర్తి పొందానని, ఈ నేపథ్యంలో ఐఏఎస్కు వెళ్లాలనే బలమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నానని తెలిపారు. మొదటి ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు రాలేదనే దిగులుచెందకుండా రెండో ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలో శిక్షణ తీసుకున్నానని, విజయం సాధించానని తెలిపారు. ఈ ర్యాంకును ప్రకారం ఐఏఎస్ లేదా ఐఆర్ఎస్ కేటాయించే అవకాశం ఉందన్నారు. వినయ్ తండ్రి మల్లిపూడి రంగారావు కోలంక హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వినయ్ సివిల్స్లో ర్యాంకు సాధించడం పట్ల పుదుచ్చేరి ఆరోగ్యశాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు, ఏపీ డిప్యూటి సీఎం చినరాజప్ప ఫోన్లో వినయ్కు శుభాకాంక్షలు తెలిపారు. . సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రజా సేవచేయాలనే తలంపు ఉండడంతో ఆ దిశగా ప్రోత్సహించాను. వినయ్కూడా కష్టపడి 410వ ర్యాంకు సాధించాడు. సంతోషంగా ఉంది. ––తండ్రి మల్లిపూడి రంగారావు ప్రాథమిక విద్యనుంచి మెరుగైన రీతిలో రాణించేవాడు. కష్టపడి చదివేతత్వం ఉంది. ఇంజినీరింగ్ పూర్తి చేశాక సాఫ్ట్వేర్ ఇంజినీరుగా చేరాడు. పబ్లిక్సర్వీస్ మీద మక్కువతో సివిల్స్లో ర్యాంకు సాధించాడు తల్లి విజయకుమారి. -
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్తో వాగ్వాదం
‘సివిల్స్’ రెమ్యునరేషన్పై వివాదం వైస్ ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకుల నిరసన కేయూక్యాంపస్ : హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామానుజరావుకు ఆ కళాశాల అధ్యాపకులు వా గ్వాదానికి దిగారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా కళాశాలలో సెంటర్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులకు ఇన్విజిలేట ర్లుగా విధులు కేటాయించగా.. పరీక్ష ముగిశాక సా యంత్రం రెమ్యునరేషన్ విషయమై వివాదం ప్రా రంభమైంది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సందర్భం గా ఒక్కో గదిలో పన్నెండు మందికి ఓ ఇన్విజిలేట ర్ను నియమించాల్సి ఉండగా ప్రిన్సిపాల్ 24మందికి అభ్యర్థులు ఉన్నా ఒక్క ఇన్విజిలేటర్నే నియమించారని అధ్యాపకులు విమర్శించారు. ఈ మేర కు ప్రతీ ఇన్విజిలేటర్కు రెట్టింపు రెమ్యునరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రిన్సిపా ల్ రామానుజరావు సర్దిచెప్పేందుకు యత్నించినా అధ్యాపకులు వినలేదు. అధ్యాపకులతో పారదర్శకంగా, సమన్వయంగా ఉండడం లేదని.. వీసీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మధుకర్తో సహా ఇన్విజిలేటర్ విధులను నిర్వర్తిం చిన అధ్యాపకులు ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి ది గారు. అలాగే, ఏ విషయంలోనూ తనకు సరైన సమాచారం ఇవ్వడం లేదని వైస్ ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు.. అందరితో సమన్వయంతో వ్యవహరిస్తానని, నిబంధనల ప్రకారం సోమవారం రెమ్యునరేషన్ చెల్లిస్తానని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
అనంతపురం అర్బన్: జిల్లాలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలను కలెక్టర్ కోన శశిధర్ తనిఖీ చేశారు. పరీక్షకు మొత్తం 3,537 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్–1 పరీక్షకి 2,099 మంది, పేపర్–2 పరీక్షకి 2,106 మం ది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 1,438 మంది (40. 65 శాతం), మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 1,431 మం ది (40.45 శాతం) మాత్రమే హాజరయ్యారు. ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశా రు.అదే విధంగా దివ్యాంగులు, అంధులు పరీక్ష రాస్తున్న కేంద్రా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివి ల్స్ ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో జరగడం ఇది రెండవసారి అన్నా రు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా, యూపీఎస్సీ నిబంధనల మేరకు పరీక్షలను నిర్వహించామన్నారు. అనంతరం యూ పీఎస్సీ పరీక్ష పరిశీలకురాలిగా వచ్చిన సర్వే, భూ రికార్డుల శాఖ కమిషనర్ వాణిమోహన్కు పరీక్షల నిర్వహణ వివరాలను తెలి యజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మలోలా, ఎస్ఎస్బీఎన్ కేం ద్రం పరిశీలకులు సురేశ్, జిల్లా పరిశీలకులు హౌసింగ్ పీడీ ప్రసా ద్, యువజన సంక్షేమ శాఖాధికారి గీతాగాంధీవాణి ఉన్నారు. -
ప్రశాంతంగా సివిల్స్
ఉదయం పరీక్షకు 39.27 శాతం.. మధ్యాహ్నం 38.83 శాతం హాజరు నగరంలో 23 కేంద్రాల్లో నిర్వహణ ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు హన్మకొండ అర్బన్ : జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 10, 858 అభ్యర్థులకు కనీసం సగం మంది కూడా హాజరు కాలేదు. ఉదయం 4,264(39.27 శాతం) మంది, మధ్యాహ్నం 4,216(38.83 శాతం) మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తం 23 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కొత్త రాష్ట్రంలో జిల్లాకు మొదటగా వచ్చిన అవకాశం కావడంతో ఎలాంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా కృషి చేశారు. నగరంలోని ఐదు ప్రధాన కేంద్రాల్లో సమాచార కేంద్రాలు, కలెక్టరేట్లో టోల్ ఫ్రీనెంబర్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ వాకాటి కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్బాబు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్రం, కేంద్రం నుంచి వచ్చిన యూపీఎస్సీ పరిశీలకులు సైతం ఏర్పాట్లు, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కాలేజీలో హాజరు ఎక్కువ.. మొత్తం 23 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ సెంటర్లోనే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సెంటర్లో ఉదయం 500 మందికి 268, మధ్యాహ్నం 275 మంది పరీక్ష రాశారు. అతితక్కువగా ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్లో ఉదయం 539 మందికి 134 మంది మాత్రమే హాజరయ్యారు. సాయంత్రం సెషనల్లో యూనివర్సిటీ పీజీ కాలేజీలో 456 మందికి 116 మంది పరీ క్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో ఇదే తక్కువ హాజరుశాతమని అధికారులు వెల్లడించారు. కాగా, వికలాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్ సెంటర్లో మొత్తం 59 మందికి గాన 21 మంది హాజరయ్యా రని అధికారులు తెలిపారు. -
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశాంతం
విజయవాడ/ఆటోనగర్ : యూపీఎస్సీ నగరంలో ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతగా ముగిశాయి. నగరంలోని పరీక్షా కేంద్రాల్లో 4, 647 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంది. ఉదయం జరిగిన పేపర్–1కు 4,372 మంది, మధాహ్నం పేపర్–2కు 4,293 మంది (29.31 శాతం) హాజరయ్యారు. బిషప్ హజరయ్య స్కూల్లోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ బాబు.ఎ పరిశీలించారు. ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. -
గ్రూప్స్కు చేయూత
ఉచితంగా శిక్షణ శిక్షకులుగా ఉద్యోగులు హిందూ రీడింగ్ రూం కమిటీ, ఆల్ ఇండియా సంఘ మిత్ర స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. నగరంలోని పలు కోచింగ్ సెంటర్లు గ్రూప్లకు శిక్షణ ఇస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్న తరుణంలో విశాఖ పాతనగరంలోని హిందూ రీడింగ్ రూం కమిటీ, ఆల్ ఇండియా సంఘ మిత్ర స్పోర్ట్స్ ఫౌండేషన్లు సంయుక్తంగా యువతకు ఉచితంగా వివిధ పోటీ పరీక్షలకు శి„ý ణ ఇస్తున్నాయి. గడిచిన ఆరు నెలలుగా గ్రూప్ 1, 2, 3, 4 పోటీ పరీక్షలతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచితంగా శి„ý ణ పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో డి.నంద, శ్రీకాంత్ అనే యువకులకు ఉద్యోగాలు లభించాయి. ఇక్కడ శిక్షణ పొందేందుకు దూర ప్రాంతాల వారు సైతం ముందుకు వస్తున్నారు. ఈ శిక్షణా శిబిరంలో కమర్షియల్ టాక్స్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లాభాపేక్ష లేకుండా ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ వివిధ సబ్జెక్టులలో శిక్షణ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 6 గంటల వరకూ రీడింగ్ రూంలోని లైబ్రరీలో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల పుస్తకాలను చదువుకొంటూ, నోట్స్లను తయారు చేసుకుంటూ విద్యార్థులు పూర్తి స్థాయిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. పదిహేను మంది విద్యార్థులతో ప్రారంభమైన శిక్షణ నేడు 80 విద్యార్థులకు చేరుకుంది. –పాతపోస్టాఫీసు లాభాపేక్ష లేకుండా ఉచిత శిక్షణ కమర్షియల్ టాక్స్ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎటువంటి రుసుం తీసుకోకుండానే పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను విద్యార్థులకు అందిస్తున్నారు. శ్రీనివాసరావు (డీసీటీవో)–ఆధునిక చరిత్ర డి.రాంబాబు (డీసీటీవో–అనకాపల్లి)–చరిత్ర, కరెంట్ ఎఫైర్స్ సిహెచ్.గోవిందు (జూనియర్ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్)–మెంటల్ ఎబిలిటీ యల్లాజీరావు(లేబర్ ఆఫీసర్–విజయనగరం)–జనరల్ సైన్స్ దేముడుబాబు (ఉపాధ్యాయుడు–పెందుర్తి)–జాగ్రఫీ వీరితో పాటు మరికొందరు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడమే లక్ష్యం విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించడమే లక్ష్యంగా గ్రూప్స్తో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సిద్దార్థ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ పొందినవారిలో సుమారు 150 మంది ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నారు. సివిల్స్పై యువతలో ఉన్న అపోహలు తొలగించి కుల, మత, వర్గ బేధాలు లేకుండా ఎవరైనా శిక్షణ పొంది మంచి ఉద్యోగాన్ని పొందవచ్చని నిరూపించడమే ధ్యేయంగా శిక్షణ ఇస్తున్నాం. –తమ్మిరెడ్డి శివశంకర్,డిప్యూటీ కమర్షియల్ టాక్స్ కమిషనర్–విశాఖపట్నం విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాం శిక్షణార్థం వస్తున్న విద్యార్థులందరికీ సొంత నిధులతో ఉచితంగా ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలతో పాటు స్టడీ మెటీరియల్ను అందిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు ఎన్ఏడీ కొత్తరోడ్డులో ఉన్న బొత్స స్క్వేర్లో ఉచిత వసతిని కల్పించాం. ఈ ఉచిత శిక్షణ ఎల్లకాలం కొనసాగుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నాం. శిక్షణ పొందాలనుకున్న విద్యార్థులు 94403 95763, 88852, 83225 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. –పాండ్రంగి రుక్మాకరరావు–ఆల్ ఇండియా సంఘమిత్ర స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సివిల్స్ సాధించడమే లక్ష్యం రీడింగ్ రూంలో ఉచితంగా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వచ్చి గ్రూప్స్నకు శిక్షణ పొందుతున్నాను. శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ను కూడా ఉచితంగా అందించారు. లైబ్రరీలోని పుస్తకాలను చదువుకొంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. –బి.కష్ణవేణి–అలమండ మంచి శిక్షణ ఇస్తున్నారు వేలాది రూపాయల ఖర్చయ్యే గ్రూప్స్ శిక్షణను ఉచితంగా అందించడం ఆనందంగా ఉంది. నాన్న చనిపోయిన తరువాత అమ్మ టైలరింగ్ చేస్తూ నన్ను చదివించింది. అమ్మ రుణం తీర్చుకోడానికైనా గ్రూప్స్లో విజయం సాధిస్తాను. ఇక్కడకు రాకముందు బ్యాంకులకు సంబంధించిన పరీక్షలు రాశాను. ఇక్కడకు వచ్చిన తరువాత గ్రూప్స్ ఎలాఅయినా పాస్ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. –మీసాల భానుశ్రీ,విశాఖపట్నం శివశంకర్ మాస్టారే స్ఫూర్తి నాన్న కూలీపని చేసి నన్ను డిగ్రీ వరకూ చదివించారు. ఒకసారి శివశంకర్ మా ఊళ్లో చిన్న సమావేశం ఏర్పాటు చేసి గ్రూప్స్ గురించి తెలియజేయడంతో పాటు విశాఖపట్నం రీడింగ్ రూంలో ఇస్తున్న ఉచిత శిక్షణ గురించి తెలియజేయడంతో ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతున్నాను. ఆయనే చెప్పకుండా ఉంటే ఈ శిక్షణ శిబిరం గురించి తెలిసేదికాదు. ఎం.తిరుపతిరావు,గుడ్డిప గ్రామం,రావికమతం మండలం సివిల్స్లో విజయం సాధిస్తాను శివశంకర్ ఇచ్చిన స్ఫూర్తితో గ్రూప్ 1లో విజయం సాధించాలన్న పట్టుదలతో శిక్షణ పొందుతున్నాను. గతంలో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నా.. ఇక్కడ ఇస్తున్న శిక్షణ ఎంతో మెరుగ్గా ఉంది. నాలాంటి వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. పి.సురేష్–విశాఖపట్నం ఉద్యోగం సాధించాను ఇంజినీరింగ్ విభాగంలో ఉన్న నేను వివిధ పోటీ పరీక్షలకు ఇతర కోచింగ్ సెంటర్లద్వారా వెళ్లినా ఫలితం దక్కలేదు. శివశంకర్ స్ఫూర్తితో గత ఆరు నెలలుగా ఇక్కడే శిక్షణ పొందాను. ప్రస్తుతం కువైట్లోని ఓ ప్రైవేటు కంపెనీ పెట్టిన పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించుకున్నాను. దినసరి కూలీగా పనిచేసి నా భవిష్యత్తు గురించి కలలు నా తండ్రి కలలు నెరవేర్చాను. శ్రీకాంత్–విశాఖపట్నం -
శెభాష్ పుష్పలత!
వైవీయూ : కాపు, బీసీ విద్యోన్నతి పథకంలో భాగంగా సివిల్స్ ఉచితశిక్షణకు నిర్వహించిన ప్రవేశపరీక్షలో కడప నగరానికి చెందిన ప్రభాకుల గంగాపుష్పలత చక్కటి ప్రతిభ కనబరిచి ఉచిత శిక్షణకు ఎంపికయ్యారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో జూన్ 26న కేఎస్ఆర్ఎంలో సివిల్స్లో ఉచిత శిక్షణ కోసం నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈనెల 14న కాకినాడలో రెండవ విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎంపికలకు 61 మంది మహిళా అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరుకాగా ఇందులో 22 మందికి అవకాశం దక్కింది. ఇందులో ఆప్షన్స్ ద్వారా నచ్చిన కోచింగ్ సెంటర్ను ఎన్నుకునే అవకాశం కల్పించగా ఈమె ఢిల్లీలోని సివిల్స్కోచింగ్ సెంటర్ను ఎన్నుకుంది. ఈ పథకం ద్వారా సదరు విద్యార్థినికి నెలకు రూ.10వేలు సై ్టపండ్తో పాటు శిక్షణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. -
ఉద్యోగమే అసలు పరీక్ష
సివిల్స్ ర్యాంకర్లతో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: సివిల్స్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ బాధ్యతలే అసలైన పరీక్షలా ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు అధికారులు పనిచేయాలని సూచించారు. సివిల్స్లో ర్యాంకులు సాధించిన 20 మంది బుధవారం మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను మంత్రి అభినందించారు. ప్రభుత్వం, పరిపాలన, రాజకీయాలు, ప్రజల ఆకాంక్షలు వంటి అంశాలపై తన ఆలోచనలను వారితో పంచుకున్నారు. ఇక కేటీఆర్తో భేటీ పట్ల ర్యాంకర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సలహాలు, సూచనలు తమకు దిశానిర్దేశం చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సివిల్స్ పరీక్షల సంసిద్ధత కోసం తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
ముందు ఐఐటీ ముంబై.. ఆ తర్వాత సివిల్స్
ఇంజనీరింగ్ టాపర్ సాయితేజ హైదరాబాద్: ‘నా తొలి లక్ష్యం ఐఐటీ ముంబైలో సీటు సాధించడమే. ఆ తర్వాత సివి ల్స్ టాపర్గా నిలవాలనుకుంటున్నా’ - ఇదీ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 160 మార్కులకు 160 మార్కులు సాధించిన ఇంజనీరింగ్ టాపర్తాళ్లూరి సాయితేజ మనోగతం. చదువుల తల్లి ముద్దుబిడ్డసాయి ఏపీ ఎంసెట్లోనూ ఏడో ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ఐఐటీ జేఈఈలోనూ 345 మార్కులతో ఆలిండియా టాపర్గా నిలిచాడు. జేఈఈ అడ్వాన్స్లోనూ 300కు పైగా మార్కులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తండ్రే తనకు ఆదర్శమంటున్న సాయి, రోజూ ఉదయం ఆరింటి నుంచి రాత్రి 10.30 దాకా చదువుపైనే దృష్టి పెట్టానని వివరించాడు. సివిల్స్లో ర్యాంక్ సాధించి ప్రజలకు నేరుగా మెరుగైన సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. జూనియర్ సైన్స్-2014లో గోల్డ్మెడల్ సాధించిన సాయి ప్రస్తుతం ముంబైలో జాతీయ స్థాయి ఫిజిక్స్ ఒలింపియాడ్లో పాల్గొంటున్నాడు. సాయితేజ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి. హైదరాబాద్లో స్థిరపడ్డారు. తండ్రి చలపతిరావు భవన నిర్మాణ రంగంలో ఉన్నారు. తన కుమారుడు సివిల్ సర్వెంట్గా సేవలందిస్తే చూడాలని ఉందని ఆయన చెప్పారు. లేదంటే సొంతంగా ఐటీ కంపెనీ స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
మాక్ టెస్ట్లు...మేలెంతో!!
ప్రతి పరీక్షకి పోటీ తీవ్రం.. వందల్లో పోస్టులు, సీట్లుంటే... లక్షల్లోనే దరఖాస్తులు! సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్.. వంటి ఉద్యోగ పరీక్షలైనా.. గేట్, జేఈఈ, ఎంసెట్ తదితరప్రవేశ పరీక్షలకైనా.. టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్ మొదలైన స్టడీ అబ్రాడ్ స్టాండర్ట్ టెస్టులైనా.. మాక్ టెస్టులతో మెనీ బెనిఫిట్స్ అంటున్నారు నిపుణులు!! పోటీలో మేటిగా నిలుపుతూ అభ్యర్థుల విజయంలో కీలకంగా మారుతున్న మాక్ టెస్టులపై టాప్ స్టోరీ.. నాటి నమూనా పరీక్షలే నేటి మాక్ టెస్ట్లు మాక్ టెస్ట్లు.. అంటే అర్థం.. నమూనా పరీక్షలు. వాస్తవానికి ఇవి విద్యార్థులకు ఎప్పటి నుంచో సుపరిచితం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్కు కార్పొరేట్ కళాశాలల్లో శిక్షణ మొదలైనప్పటి నుంచే మాక్టెస్టులు కొనసాగుతున్నాయి. అయితే ఇవి కేవలం ఆయా కళాశాలల విద్యార్థులకే పరిమితం. ఇతర విద్యార్థులకు మాత్రం మాక్ టెస్ట్లు/నమూనా పరీక్షల గురించి పెద్దగా అవగాహన ఉండేదికాదు. ఇటీవల కాలంలో మాక్ టెస్ట్లు అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. విజయపథంలో నడిపించేందుకు సాధనంగా నిలుస్తున్నాయి. అన్నిటికీ మాక్ పోటీ పరీక్షల విజయంలో కీలకంగా నిలుస్తున్న మాక్టెస్ట్లు అన్ని రకాల పోటీ పరీక్షలకు అందుబాటులోకి వస్తున్నాయి. స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులు హాజరయ్యే టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్ తదితర స్టాండర్డ్ టెస్ట్లు.. జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, గేట్ వంటి ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలు.. రాష్ట్రాల స్థాయిలో జరిగే ఎంసెట్, ఐసెట్ వంటి ఎంట్రన్స్ల వరకు.. మాక్టెస్ట్లు విస్తరించాయి. ఉద్యోగార్థుల కోణంలో జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ నుంచి బ్యాంక్స్, ఎస్ఎస్సీ సీజీఎల్.. రాష్ట్రాల స్థాయిలో జరిగే గ్రూప్స్ పరీక్షల వరకూ.. అన్నిటా ఇప్పుడు మాక్టెస్టుల హవా నడుస్తోంది. ఆన్లైన్ / ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు ఆన్లైన్, ఆఫ్లైన్ల్లోనూ ఉన్నాయి. ఆన్లైన్లో మాక్ టెస్ట్లను ఆన్లైన్ ట్యుటోరియల్ సంస్థలు, ఆన్లైన్ కోచింగ్ పోర్టల్స్ అందిస్తున్నాయి. ఆయా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు వీటికి హాజరుకావచ్చు. మాక్ టెస్ట్లు అందించే విషయంలో ఆన్లైన్దే పైచేయి. కొన్ని ఆన్లైన్ ట్యుటోరియల్ సంస్థలు ఉచితంగా కూడా మాక్ టెస్ట్లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు ఆయా శిక్షణ సంస్థల విద్యార్థులకే పరిమితం. పరీక్ష శైలిపై అవగాహన నిర్దిష్ట పరీక్షకు నిర్వహించే మాక్ టెస్ట్ అసలు పరీక్ష తరహాలోనే ఉంటుంది. దీంతో మాక్టెస్ట్కు హాజరవడం ద్వారా సదరు పరీక్ష శైలిపై అవగాహన పెంచుకోవచ్చు. ప్రశ్నలు అడిగే తీరు, ఏ తరహా ప్రశ్నలు వస్తాయి? తదితర అంశాలపై స్పష్టత వస్తుంది. అంతేకాకుండా మాక్టెస్టుల ప్రశ్నపత్రాలను సబ్జెక్టు నిపుణులతో రూపొందించడం వల్ల వాస్తవ పరీక్షకు హాజరైన అనుభవం అభ్యర్థికి కలుగుతుంది. సబ్జెక్ట్ వైజ్.. చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లలో సబ్జెక్ట్ వారీగా, చాప్టర్ వారీగా అందుబాటులో ఉంటున్నాయి. ఒక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ ప్రిపరేషన్ పరంగా నిర్దిష్ట చాప్టర్ను పూర్తి చేసుకోగానే ఆ చాప్టర్లో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకునే విధంగా మాక్ టెస్ట్లకు హాజరు కావచ్చు. అదేవిధంగా పరీక్ష ప్యాట్రన్ను అనుసరించి ఆ పరీక్షలో ఉండే విభాగాల్లో తమకు నచ్చిన విభాగంలోనూ మాక్ టెస్ట్కు హాజరు కావచ్చు. ఫీడ్ బ్యాక్ మాక్ టెస్ట్లతో మరో ప్రయోజనం.. తక్షణ ఫీడ్బ్యాక్. అంటే.. ఒక మాక్ టెస్ట్ను పూర్తి చేసుకున్న వెంటనే మార్కులు తెలుసుకోవచ్చు. అభ్యర్థుల సమాధానాలు ఆధారంగా..ఇంకా పట్టు సాధించాల్సిన అంశాల గురించి కూడా సలహాలు తీసుకోవచ్చు. ఫలితంగా ప్రిపరేషన్ పరంగా మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. నిర్దిష్ట టెస్ట్లో సెక్షన్ వారీగా లేదా చాప్టర్ వారీగా అంతకుముందు టెస్ట్లో పొందిన స్కోర్ను చూసుకునే అవకాశం కూడా లభిస్తోంది. దీనివల్ల గతంలో తాము బలహీనంగా ఉన్న అంశాల్లో ప్రస్తుతం పెంచుకున్న అవగాహన స్థాయి గురించి తెలుసుకోవచ్చు. ఒత్తిడికి దూరంగా మాక్ టెస్ట్లలో ముఖ్యమైన ప్రయోజనం పరీక్ష రోజు ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడం. ఎందుకంటే.. మాక్టెస్టులు వాస్తవ పరీక్షను పోలి ఉంటాయి. ఫలితంగా పరీక్ష రోజు లభించే సమయం మేరకు ముందుగానే సన్నద్ధం కావచ్చు. అంతేకాకుండా పరీక్ష సమయంలో అనుసరించాల్సిన విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. పరీక్ష శైలిపై అవగాహన నుంచి ఎగ్జామ్ డే స్ట్రాటజీ వరకు మాక్ టెస్ట్లతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. మాక్ టెస్ట్స్ ప్రయోజనాలివే ఎగ్జామ్ ప్యాట్రన్పై అవగాహన టైం మేనేజ్మెంట్ సబ్జెక్ట్లలో నైపుణ్యం స్థాయిపై అవగాహన నిపుణుల సలహాలు సమాధానాలివ్వాల్సిన తీరుపై అవగాహన వీలైన సమయంలో హాజరయ్యే అవకాశం తక్షణ ఫలితం, ఫీడ్ బ్యాక్తో ప్రిపరేషన్ను మెరుగుపరచుకునే అవకాశం నిరంతరం ప్రోగ్రెస్ను సమీక్షించుకోవచ్చు. ఎగ్జామ్ డే ఒత్తిడి నుంచి ఉపశమనం మాక్ టెస్ట్స్లు.. జాగ్రత్తలు మాక్ టెస్ట్ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాల్సిన అవసరముంది. విద్యార్థులు ఆన్లైన్ మాక్టెస్ట్లకు హాజరయ్యే ముందు సదరు వెబ్పోర్టల్కు ఉన్న ప్రాముఖ్యత, ఆదరణ.. సబ్జెక్ట్ నిపుణుల వివరాలు అందుబాటులో ఉంచుతోందా? లేదా?.. ప్రశ్నపత్రాలు, అడుగుతున్న ప్రశ్నల్లో మార్పు ఉంటోందా?.. ఫీడ్బ్యాక్ అందిస్తుందా? తదితర విషయాలు తెలుసుకున్న తర్వాతే సదరు ఆన్లైన్ మాక్టెస్ట్ ప్రొవైడింగ్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితాల్లో 25 నుంచి 30 శాతం ప్రభావం మాక్ టెస్ట్లకు హాజరు కావడం ప్రిపరేషన్లో భాగంగా, విజయ వ్యూహంగా భావించాలి. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్లలో రాణించేందుకు మాక్ టెస్ట్లు ఎంతో మేలు చేస్తాయి. సబ్జెక్ట్ వారీగా, సెక్షన్ వారీగా మాక్ టెస్ట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. గ్రాండ్ మాక్ టెస్ట్లు రాయడం ఎంతో అవసరం. జాతీయ స్థాయి పరీక్షలకు కనీసం ఆరు నుంచి ఎనిమిది మాక్ టెస్ట్లు par రాయాలి.ఙ- రామ్నాథ్ ఎస్.కనకదండి, డెరైక్టర్, క్యాట్ కోచింగ్, టైమ్ ఇన్స్టిట్యూట్ ఎంఎన్సీ ఇంటర్వ్యూల్లో రాణించొచ్చు.. ఇటీవల కాలంలో మాక్ ఇంటర్వ్యూస్ కూడా అందిస్తున్న సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. వీటివల్ల ఆయా ఉద్యోగాలకు ముఖ్యంగా ఎంఎన్సీ ఔత్సాహికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో అనుసరించాల్సిన పర్సనాలిటీ స్కిల్స్, బాడీలాంగ్వేజ్ వంటి బిహేవియరల్ స్కిల్స్తోపాటు సబ్జెక్ట్ నైపుణ్యాల ఫీడ్బ్యాక్ కూడా ఈ మాక్ ఇంటర్వ్యూ ద్వారా లభిస్తుంది. అయితే అభ్యర్థులు మాక్ ఇంటర్వ్యూస్ను నిర్వహించే సంస్థలకున్న ప్రాముఖ్యత ఆధారంగా వాటిని ఎంపిక par చేసుకోవాలి.ఙ- ఎం.మదన్మోహన్ రెడ్డి, డెరైక్టర్, టెస్ట్ మై ఇంటర్వ్యూ డాట్ కామ్ -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్లో జాగ్రఫీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా? - ఎన్. ప్రియబాంధవి, అనంతపురం సివిల్స్ ప్రిలిమ్స్లో జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ నుంచి 24 నుంచి 30 ప్రశ్నల వరకు వస్తున్నాయి. జాగ్రఫీ, ఎకాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికలో వీటికి అధిక సమయం కేటాయించాలి. సిలబస్లో ‘భారతదేశం, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రం’ అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత భౌగోళిక అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. మనదేశానికి సంబంధించి వ్యవసాయం, వ్యవసాయ సంక్షోభం, రుతువులు, నదులు, అడవులు - అటవీ భూముల ఆక్రమణ, అంతరిస్తున్న జీవ జాతులు, శక్తి వనరులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రవాణా, పట్టణీకరణ ప్రక్రియ, సరిహద్దుల వివాదాలు వంటివీ ముఖ్యమే. కోర్ ఎకాలజీ నుంచి ప్రధానంగా రెండు అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అవి.. ఎకాలజీ బేసిక్ కాన్సెప్టులు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల కోసం జనరల్ సైన్స్కు ఎలా ప్రిపేర్ కావాలో తెలపండి? - హెచ్. లహరి, కొత్తపేట జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో వృక్ష, జంతు వైవిధ్యం-వాటి లక్షణాలు; ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అలాగే మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. గ్రూప్-1లో శరీర అవయవాలు- పని తీరు- వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్తో మిళితమైన ప్రశ్నలూ కనిపిస్తున్నాయి. (ఉదా: ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అమల్లోకి వచ్చిన టీకాలు, మందులు, చికిత్స విధానాలు, నోబెల్ పురస్కారాలు-సంబంధిత పరిశోధనలు వంటివి). ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం ముఖ్యాంశాలుగా చదవాలి. రసాయన శాస్త్రానికి సంబంధించి సివిల్స్, గ్రూప్స్లో క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. నిత్య జీవితంలో మానవులు వినియోగించే పలు రసాయనాలు (ఉదా: కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్స్), ప్లాస్టిక్స్, పాలిమర్స్, కాంపొజిట్స్పై సమాచారం తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక ప్రత్యేకత, మూలకాలపై దృష్టి సారించాలి. -
తెలుగు చేవ తగ్గుతోందా?
సీశాట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదలైన సమస్య ప్రాంతీయ భాషా నేపథ్యమున్న అభ్యర్థులు నెగ్గుకురాలేకపోతున్నారన్న నిపుణులు సాక్షి, ఎడ్యుకేషన్ డెస్క్: దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ తదితర 24 అఖిల భారత సర్వీసుల్లో అభ్యర్థుల ఎంపికకు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రాంతీయ భాషల అభ్యర్థుల ప్రాభవం తగ్గుతోందా? హిందీ, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు.. మెట్రో నేపథ్యమున్న అభ్యర్థులకే పరీక్ష విధానం అనుకూలంగా ఉంటోందా? ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులపైనా పడుతోందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష-2015 ఫలితాల ద్వారా ఈ విషయం మరింత ప్రస్ఫుటమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సివిల్స్... ఈ పరీక్షలో విజయం కోసం తపస్సులా కృషి చేసే అభ్యర్థుల సంఖ్య రాష్ట్రంలో వేలల్లోనే ఉంటుంది! వారి కష్టం ఫలితాల్లోనూ కనిపించేది. 2005 నుంచి 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏటా 80 నుంచి 100 మంది వరకు తుది విజేతలుగా నిలిచారు. ఇదేకాలంలో రెండుసార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కూడా తెలుగు అభ్యర్థులు (రేవు ముత్యాల రాజు, అడపా కార్తీక్) సొంతం చేసుకున్నారు. కానీ 2011 నుంచి తుది విజేతలుగా నిలిచే అభ్యర్థుల సంఖ్య తగ్గుతోందని, సగటున 30 నుంచి 40 మధ్యలోనే ఉంటోందని నిపుణులు అంటున్నారు. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో మార్పులే ఇందుకు కారణమని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. తాజాగా విడుదలైన సివిల్స్ మెయిన్స్ 2015 రాత పరీక్ష ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు 500 మంది వరకు హాజరుకాగా.. తాజా ఫలితాల్లో ఇంటర్వ్యూకు ఎంపికైన వారు గరిష్టంగా 80 మందికి మించి ఉండరని అంచనా. సీశాట్ నుంచి మొదలైన సమస్య సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఇతర ప్రాంతీయ భాషా అభ్యర్థుల సంఖ్య క్రమేణా తగ్గడం సీశాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదలైంది. 2011 నుంచి ప్రిలిమినరీ పరీక్షలో రెండో పేపర్గా సీశాట్ను ప్రవేశపెట్టారు. అప్పటివరకు అభ్యర్థులకు రెండో పేపర్గా తమకు నచ్చిన ఆప్షనల్ సబ్జెక్ట్ను రాసుకునే వెసులుబాటు ఉండేది. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ పేరుతో, అదేవిధంగా అభ్యర్థుల్లో అన్నిరకాల సామర్థ్యాలను అంచనా వేయాలనే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన సీశాట్.. అందుకు విరుద్ధంగా కేవలం ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యమున్న వారికే అనుకూలంగా ఉందనే నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో 2014 నుంచి సీశాట్లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ను తొలగించారు. సీశాట్ పేపర్ (జనరల్ స్టడీస్ పేపర్-2)ను కేవలం అర్హత పరీక్షగానే పేర్కొంటూ గతేడాది నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో 200 మార్కులకు కనీసం 33 శాతం మార్కులు సాధించాలని యూపీఎస్సీ పేర్కొంది. ఈ కనీస అర్హత మార్కుల నిబంధన కూడా ప్రాంతీయ భాషల అభ్యర్థులు, నాన్-మ్యాథ్స్ అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. కారణం.. ఈ పేపర్లో పేర్కొన్న అంశాలన్నీ మ్యాథమెటికల్ ఓరియెంటెడ్గా, ఇంగ్లిష్ ఓరియెంటేషన్గా ఉండటమే. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ను తొలగించినప్పటికీ.. రీడింగ్ కాంప్రహెన్షన్ను కొనసాగించడం ప్రాంతీయ భాషా అభ్యర్థులకు శరాఘాతమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెయిన్స్లో మార్పులతో మరింతగా.. 2013లో మెయిన్ పరీక్షలోనూ యూపీఎస్సీ మార్పులు ప్రవేశపెట్టింది. అప్పటి వరకు ఒక ప్రాంతీయ భాష, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఎస్సే, రెండు జీఎస్ పేపర్లు, రెండు ఆప్షనల్ సబ్జెక్ట్స్ (నాలుగు పేపర్ల)లలో సివిల్స్ మెయిన్స పరీక్షలు జరిగేవి. కానీ 2013 నుంచి ఈ విధానంలో మార్పు తెచ్చింది. 2014లో మరోసారి మార్పులు చేసింది. 2012 వరకు ఉన్న రెండు ఆప్షనల్ సబ్జెక్ట్లను ఒక ఆప్షనల్ సబ్జెక్ట్కు కుదించింది. జనరల్ స్టడీస్ పేపర్లను నాలుగుకు పెంచింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 శాతం, ఇండియన్ లాంగ్వేజ్లో 30 శాతం(2015లో 25 శాతంగా మార్పు) కనీస అర్హత మార్కులు సాధిస్తేనే.. అభ్యర్థులు మిగతా పేపర్లలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. ఇప్పుడు ప్రాంతీయ మాధ్యమంలో చదివిన అభ్యర్థులకు ఇదే సమస్యగా మారింది. మెయిన్ ఎగ్జామినేషన్లో పేర్కొన్న 4 జనరల్ స్టడీస్ పేపర్ల విషయంలోనూ ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. దేశంలో విద్యా వ్యవస్థకు.. యూపీఎస్సీ సివిల్స్లో ప్రవేశపెడుతున్న మార్పులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని, అందుకే ప్రాంతీయ భాష నేపథ్యం ఉన్న అభ్యర్థులు, గ్రామీణ అభ్యర్థులు నెగ్గుకు రాలేకపోతున్నారని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మళ్లీ ఆప్షనల్.. అదే పరిష్కారం అన్ని ప్రాంతాలు, నేపథ్యాల అభ్యర్థులు సివిల్ సర్వీసెస్లో ప్రాతినిథ్యం వహించేలా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్కు ఆస్కారం కల్పించాలంటే.. మళ్లీ ప్రిలిమ్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఫలితంగా అభ్యర్థులు తాము అకడమిక్గా చదువుకున్న సబ్జెక్ట్లలో పట్టున్న సబ్జెక్ట్లను ఆప్షనల్గా ఎంపిక చేసుకోవడం, తద్వారా మెయిన్స్కు విజయావకాశాలకు ఆస్కారం ఉంటుంది. సీశాట్ వల్ల గత నాలుగేళ్లుగా ఇంటర్వ్యూకు ఎంపికవుతున్న తెలుగు అభ్యర్థుల సంఖ్య 70 నుంచి 80 మధ్యలో.. తుది జాబితాలో నిలుస్తున్న అభ్యర్థుల సంఖ్య 30 నుంచి 40 మధ్యలోనే ఉంటోంది. తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా ఎంచుకున్న వారి విజయావకాశాలు సైతం తగ్గిపోతున్నాయి. 2010లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్తో 12వ ర్యాంకు రాగా.. 2013లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్కు 887వ ర్యాంకు రావడమే ఇందుకు నిదర్శనం. సీశాట్ వల్ల అన్ని ప్రాంతీయ భాషల అభ్యర్థులకు సివిల్స్ అందని ద్రాక్షగా మారిపోతోంది. - వి. గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ ఇంగ్లిష్ నేపథ్యానికి అనుకూలం వాస్తవమే ప్రస్తుతమున్న సివిల్స్ ఎంపిక విధానం ఇంగ్లిష్ నేపథ్యం ఉన్న వారికి అనుకూలం అనే మాట వాస్తవమే. పరీక్షలో విజయానికి అనుకూలించే మెటీరియల్ పరంగా ఇంగ్లిష్లో అపారమైన వనరులున్నాయి. ప్రాంతీయ భాషల అభ్యర్థులు వాటిని అనువాదం చేసుకుని చదువుకోవడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. ఇక సీశాట్లో పేర్కొన్న రీడింగ్ కాంప్రహెన్షన్ను కూడా తొలగిస్తే లోకల్ లాంగ్వేజ్ అభ్యర్థులకు అనుకూలంగా ఉంటుంది. - శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ అవన్నీ అపోహలే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రస్తుత విధానం కొందరికే అనుకూలం అనే అభిప్రాయాలన్నీ అపోహలే. అభ్యర్థులు తమకు నచ్చిన మాధ్యమంలో పరీక్ష రాసుకునే వీలుంది. అయితే విజేతలుగా నిలుస్తున్న అభ్యర్థుల నేపథ్యాలను పరిగణించడం కారణంగా కొందరికే అనుకూలం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అత్యధిక శాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులవైపు అడుగుపెడుతున్నారు. ఇదే క్రమంలో సివిల్స్కు హాజరయ్యే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. - ప్రొఫెసర్ వై.వెంకటరామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యులు -
సివిల్స్కు తగ్గిన హాజరు
దరఖాస్తు చేసింది 15,589 33 శాతానికి మించని హాజరు కట్టుదిట్టమైన ఏర్పాట్లు విజయవాడ సెంట్రల్ : సివిల్స్ (ప్రిలిమినరీ) పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గింది. నగరంలో 32 కేంద్రాల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. 15,589 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఉదయం 5,201(33.36) శాతం, మధ్యాహ్నం 5,133 (32.93) శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. మూడుసార్లకు మించి పరీక్ష రాసే అవకాశం లేకపోవడంతో అభ్యర్థులు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో హాజరుశాతం తగ్గినట్లు అధికారులు అంచనా కట్టారు. ఒక్కో కేంద్రంలో 20 నుంచి 24 మంది విద్యార్థులు పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేశారు. హాజరు శాతం తగ్గడంతో 2 నుంచి 10 మంది విద్యార్థులు మాత్రమే కనిపించారు. అభ్యర్థులు లేక కొన్ని గదులు ఖాళీగా కనిపించాయి. శాతవాహన కళాశాల ఆవరణలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం లో 43 మందికిగాను 18 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఉదయం హాజ రైన అభ్యర్థుల్లో 68 మంది మధ్యాహ్నం డుమ్మా కొట్టారు. చివరి నిమిషంలో కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు పరుగులు తీయాల్సి వచ్చింది. పకడ్బందీగా ఏర్పాట్లు బిషప్ అజరయ్య స్కూల్, శాతవాహన కళాశాల ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ బాబు.ఏ పరిశీలించారు. ఇన్విజిలేటర్లకు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జేసీ-2 ఒంగోలు శేషయ్య ఆధ్వర్యంలో పని చేసిన నలుగురు అధికారుల బృం దం ఏర్పాట్లపై పర్యవేక్షణ చేశారు. సెల్ఫోన్లను తీసుకు వెళ్లకుండా నిరోధించారు. నిరుపయోగంగా పరీక్షలకు చెందిన బుక్లెట్స్ను కాల్చివేశా రు. ఉపకేంద్రాల నిర్వాహకుల సమస్యల్ని పరిష్కరించేందుకు గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేశా రు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నలుగురు అధికారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ కళాశాల, గాంధీ, మాంటిస్సోరి, చైతన్య, ఆంధ్రా లయో లా కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీపీ గౌతం సవాంగ్ నేతృత్వంలో పోలీసులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. -
సివిల్స్ ప్రిలిమ్స్ తుదిదశ వ్యూహాలు..
ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉజ్వల భవిష్యత్తుకు దారిచూపే సివిల్స్ ప్రిలిమ్స్ మరికొద్ది రోజుల్లో (ఆగస్టు 23) జరగనుంది. ఔత్సాహికులు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తిచేసుంటారు. అయితే పరీక్షను ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న ఈ కొద్ది రోజుల్లో చదివిన అంశాలను పునశ్చరణ చేసుకుంటే మంచి స్కోరింగ్కు అవకాశముంటుంది. ప్రిలిమ్స్లోని పేపర్-2ను అర్హత పరీక్షగా మార్చడంతో పేపర్-1 జనరల్ స్టడీస్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో జీఎస్లో అధిక మార్కులు సాధించేందుకు సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న తుది దశ వ్యూహాలు... ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్లోని రెండో పేపర్ (సీశాట్) అర్హత పరీక్ష కావడం వల్ల మెయిన్స్కు ఎంపిక సాధించడంలో పేపర్-1 జనరల్ స్టడీస్ కీలకంగా మారింది.ప్రశ్నలు గతంతో పోల్చితే కొంత కఠినంగా ఉండొచ్చని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్-బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ కొనసాగించాలంటున్నారు. పాలిటీ శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. వీటితో సంబంధమున్న సమకాలీన పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి.స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలపై అవగాహన ఉండటం ముఖ్యం. రాజ్యాంగ సవరణలు-సంబంధిత ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో జరిగిన రాజ్యాంగ సవరణలపై అవగాహన పెంపొందించుకోవాలి.గిరిజన ప్రాంతాలకు సంబంధించిన 5, 6 రాజ్యాంగ షెడ్యూళ్లులోని అంశాలు చాలా ముఖ్యమైనవి. వీటి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. భూ సేకరణ, అవినీతిని నిరోధించడానికి సంబంధించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. అభ్యర్థులు ఈ అంశంపై దృష్టిసారించాలి.నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్) అంశం ముఖ్యమైనది. దీని ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, సభ్యులు తదితర వివరాలతో పాటు సంస్థ కార్యకలాపాలపై అవగాహన పెంపొందించుకోవాలి.ఉరిశిక్ష, క్షమాభిక్ష అంశాలు కూడా ముఖ్యమైనవి. వీటికి సంబంధించిన సమకాలీన పరిణామాల నుంచి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయనే దానిపై అవగాహన అవసరం. చైనా అభివృద్ధి వ్యూహమైన ‘వన్ బెల్ట్, వన్ రోడ్ (ఓబీఓఆర్)తో పాటు దీనికి సంబంధించిన సిల్క్ రోడ్ ఎకనమిక్ బెల్ట్ (ఎస్ఆర్ఈబీ), మారిటైమ్ సిల్క్ రోడ్ (ఎంఎస్ఆర్)ల గురించి తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో భారత్-చైనా సంబంధాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యలు; ఇరాన్ ఆరు అగ్రరాజ్యాలతో కుదుర్చుకున్న అణుఒప్పందం, ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలు ముఖ్య అంశాలు. 50 శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి వస్తాయి కాబట్టి ప్రిపరేషన్కు ఈ పుస్తకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. హిస్టరీ జనరల్ స్టడీస్ పేపర్-1లో హిస్టరీకి సంబంధించిన సిలబస్ను ‘భారతదేశ చరిత్ర-భారత జాతీయ ఉద్యమం’ అని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు భారత దేశ చరిత్రపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి కాబట్టి దానిపై పట్టు సాధించాలి. ఆధునిక భారతదేశ చరిత్రలో 1885 నుంచి 1947 వరకు ఉన్న చరిత్రను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ఉద్యమంలో కీలక ఘట్టాలు, వాటి ఫలితాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఉదాహరణకు 1935 భారత ప్రభుత్వ చట్టం, అందులోని అంశాలు,వాటి ఫలితాలను అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే హిస్టరీకి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రశ్నలనే వేరే రూపంలో ఇస్తున్నట్లు గమనించవచ్చు. అందువల్ల అభ్యర్థులు తప్పనిసరిగా పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. వాటితో సంబంధం ఉన్న అంశాలను వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి.భారతదేశ సంస్కృతి-వారసత్వం అంశం ముఖ్యమైనది. దీన్నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. మధ్యయుగ భారతదేశ చరిత్రకు అంతగా ప్రాధాన్యం ఉండటం లేదు. అయితే ఈసారి ఈ విభాగం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రశ్నలు రావొచ్చు. అందువల్ల అభ్యర్థులు ఆయా కాలాల్లో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన అంశాలను అధ్యయనం చేయాలి.భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం, ఢిల్లీ సుల్తానులు, మొగల్ సామ్రాజ్యం తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. అప్పుడే ప్రశ్న ఏ కోణంలో వచ్చినా సరైన సమాధానం గుర్తించేందుకు వీలవుతుంది. జాగ్రఫీ ప్రిలిమ్స్లో జాగ్రఫీకి సంబంధించి ప్రశ్నలు కోర్ అంశాలతో పాటు వాటితో సంబంధమున్న సమకాలీన అంశాల నుంచి కూడా వచ్చేందుకు అవకాశముంది. నేపాల్ భూకంపం నేపథ్యంలో ఈసారి భూకంపాలు-స్థితిగతులపై దృష్టిసారించాలి. రుతుపవనాలు-ముందస్తు అంచనాలు, పులుల అభయారణ్యాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు తదితర అంశాలను మరోసారి పునశ్చరణ చేసుకోవాలి.2015-టైగర్ సెన్సస్ అంశాలను అధ్యయనం చేయాలి. గతంతో పోల్చితే పులుల సంఖ్యలో వచ్చిన మార్పులు, పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలను గుర్తుంచుకోవాలి. ఇటీవలి కాలంలో నదుల అనుసంధానం (River Linking) పై బాగా చర్చ జరుగుతోంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక కమిటీ సమావేశమవుతోంది. నీరు, ఆహార భద్రతకు నదుల అనుసంధానం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అభ్యర్థులు నదుల అనుసంధానం స్థితిగతులు, రాష్ట్రాల మధ్య జలవివాదాలు తదితరాలపై దృష్టిసారించాలి. ప్రస్తుతం స్మార్ట్సిటీలపైనా పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వీటికి అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ అంశం నుంచి కూడా ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది.ప్రపంచ వ్యాప్తంగా (భారత్కు ప్రాధాన్యమిస్తూ...) ఐలాండ్ గ్యాస్ నిల్వలపై దృష్టిసారించాలి. యురేనియం నిక్షేపాలపైనా అవగాహన తప్పనిసరి.అమర్నాథ్ యాత్ర, కైలాష్ మానససరోవరం యాత్రా మార్గాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గత ఏడాది కాలంలో జరిగిన ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి అంశాలపై దృష్టిసారించాలి.అంతరిక్ష రంగం; రక్షణ రంగం; సమాచార-సాంకేతిక రంగాలపై దృష్టిసారించాలి. భారత అంతరిక్ష కార్యక్రమంలో భాగమైన పీఎస్ఎల్వీ ప్రయోగాలు, ప్రయోగించిన దేశీయ, విదేశీ ఉపగ్రహాలు, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ నిర్వహించిన ప్రయోగాలపై దృష్టిసారించాలి.శక్తి రంగం (ఉ్ఛటజడ ్ఛఛిౌ్టట) నుంచి కూడా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. పర్యావరణం, జీవవైవిధ్యం(బయోడైవర్సిటీ), వాతావరణ మార్పులు అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి వీటికి సంబంధించి ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆవరణ వ్యవస్థలు (ఉఛిౌ డట్ట్ఛఝట), అనుకూలనాలు (అఛ్చీఞ్ట్చ్టజీౌట), ఎకలాజికల్ ఇంటరాక్షన్స్, ఇంటర్ గవర్న్మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) అసెస్మెంట్ రిపోర్ట్ 5, జీవవైవిధ్యం ఎదుర్కొంటున్న ప్రమాదాలు తదితర అంశాలను రివిజన్ చేయాలి. దేశంలోని ప్రధానమైన ఉఛ్ఛీఝజీఛి ఞ్ఛఛిజ్ఛీట, వాటి విస్తరణ, ప్రత్యేక లక్షణాలు ముఖ్యమైనవి. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీలో మంగళ్యాన్, న్యూ హరైజన్స్, అగ్ని 5, తేలికపాటి యుద్ధ విమానాలు-దేశీయ సాంకేతికపరిజ్ఞానం అభివృద్ధి, మిషన్ ఇంధ్రధనస్సు, కాంబినేషన్ టీకా వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎకానమీ కానమీకి సంబంధించి జాతీయ ఆదాయం, పన్నుల వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, అంతర్జాతీయ వాణిజ్యం, వ్యవసాయ-పారిశ్రామిక-సేవా రంగాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. 2011 జనాభా లెక్కలపై పట్టు అవసరం. ఆర్థికాభివృద్ధిపై అధిక జనాభా ప్రభావాన్ని అయనం చేయాలి. పంచవర్ష ప్రణాళికలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పట్టణీకరణ వంటి అంశాలు కూడా ముఖ్యమైనవి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో తదితర అంతర్జాతీయ సంస్థలతో భారత్ సంబంధాలు, ఇటీవలి పరిణామాలపై ప్రశ్నలు రావొచ్చు.పన్నుల వ్యవస్థకు సంబంధించి జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) ముఖ్యమైన అంశం. దీనిపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి.అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ద్వైపాక్షిక, నియమావళి ఆధారిత బహుళ వాణిజ్య ఒప్పందాలను అధ్యయనం చేయాలి. ఎకానమీ మాదిరి ప్రశ్నలు 1. Tripartite Free Trade is a proposed African Free Trade Agreement between 1) Common Market for Eastern and Southern Africa 2) Southern African Development community 3) East African Community (Select the correct answer using the codes given below) a) 1 only b) 1 and 2 c) 2 and 3 d) 1, 2 and 3 2. When the demand for money is infinitely interest elastic, the effectiveness of an expansionary monetary policy is? a) The highest b) Moderate c) Very low d) Nil 3. Which of the following has operationalized the overnight Liquid tansaction facility on its web based mutual fund service system platform on 22nd June 2015? a) New York Stock exchange b) London stock exchange c) National stock exchange d) Japan Exchange Group 4. Which one of the following pairs is not correctly matched in the Indian context? a) Cash reserve ratio: Monetary policy b) Non-performing assets: Profitability of commercial banks c) Market-determined rate of interest: Post office deposits d) Minimum support price: Agricultural cost and price commission 5. Global Economic Prospects (GEP) report is published by? a) IMF b) World Bank c) World Trade Organization d) UNCTAD -
క్వాలిఫైయింగ్ పేపర్గా సీశాట్
సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్ష ప్రిలిమ్స్లో రెండో పేపర్ అయిన సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్టు (సీశాట్)ను క్వాలిఫైయింగ్ పేపర్గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. సీశాట్ను రద్దుచేయాలని, దీనివల్ల తమకు అవకాశాలు దెబ్బతింటున్నాయంటూ వివిధ రాష్ట్రాల ప్రాంతీయ, ఆర్ట్స్ సైన్స్ అభ్యర్థులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సీశాట్లో గణితం, ఆంగ్లం, డెసిషన్ మేకింగ్ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు అడుగుతుండడం, వాటిలో వచ్చిన మార్కుల్ని పరిగణనలోకి తీసుకొని మెయిన్స్కు ఎంపిక చేయడం వల్ల ఆ సబ్జెక్టుల్లో ప్రావీణ్యమున్నవారే లబ్ధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు, హ్యుమానిటీ సబ్జెక్టుల్నిబట్టి పరీక్షలు రాసే వారు నష్టపోతున్నారు. మొదటి పేపర్లో ఎక్కువ మార్కులొచ్చినా రెండో పేపర్ అయిన సీశాట్లో ఐఐటీ, ఐఐఎం తదితర అభ్యర్థులకంటే తక్కువ మార్కులొస్తుండడంతో మెయిన్స్కు అర్హత కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సీశాట్ను కంపల్సరీ అని కాకుండా క్వాలిఫైయింగ్ పేపర్గా కేంద్రం మార్చింది. ఈ పేపర్లో 33 శాతం మార్కుల్ని క్వాలిఫైయిం గ్కు నిర్దేశించారు. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీశాట్ వల్ల ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులకు కలుగుతున్న నష్టాన్ని నివారించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన కృషి ఫలించింది. ఆర్ట్స్, సైన్స్ తదితర విభాగాల విద్యార్థులలతోపాటు వివిధ ప్రాంతీయ భాషా విద్యార్థులకు నష్టం వాటిల్లుతున్న విషయాన్ని ఆ పార్టీ ఎంపీ అవినాశ్రెడ్డి తదితరులు ప్రధాని మోదీ దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. -
అది తేలాకే సివిల్స్ ఫలితాలు
న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత ప్రభుత్వ సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్వంటి హోదాలకు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల మెయిన్స్ ఫలితాలు మరింత ఆలస్యమయ్యేలా ఉంది. జాట్ల అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాట్లకు కూడా ప్రత్యేక రిజర్వేషన్ కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఆ రిజర్వేషన్ వర్తించేలా అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వం అదర్ బ్యాక్వార్డ్ క్లాస్ (ఓబీసీలు) జాబితాలో జాట్లను చేర్చింది. అయితే దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా జాట్లకు ఓబీసీల ద్వారా రిజర్వేషన్ వర్తింపచేసేందుకు కేంద్రం ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, ఆ తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కేంద్రం మరోసారి పిటిషన్ వేసింది. దీంతో మెయిన్స్ ఫలితాల వెల్లడిపై జాప్యం నెలకొంది. కోర్టు తుది తీర్పు తర్వాతే ఫలితాలు వెల్లడించాలని యూపీఎస్సీ భావిస్తోంది. -
పోటీపరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి
ఏఎన్యూ: ప్రత్యేక శిక్షణతోపాటు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయితేనే సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు లక్ష్యాన్ని చేరుకోగలుగుతారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్ ఆచార్య కె.వియ్యన్నారావు అన్నారు. యూనివర్సిటీ సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో విజయవాడ ఏస్ ఐఏఎస్ అకాడమీ శుక్రవారం యూనివర్సిటీలో సివిల్స్, గ్రూపు-1, 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించింది. ముఖ్యఅతిథి ఆచార్య వియ్యన్నారావు మాట్లాడుతూ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. సమాజంలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన అవసరమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలతోపాటు, స్వతహాగా పరీక్షలకు సిద్ధమవడం కూడా కీలకమని తెలిపారు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేప్పుడు సమయం చాలా విలువైందని దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్లో ఖాళీలు ఎక్కువగా ఉంటున్నాయని వాటిని అందిపుచ్చుకునేందుకు అభ్యర్థులు సిద్ధం కావాలన్నారు. అన్ని అవరోధాలను అధికమించి ఐఏఎస్కు ఎంపికైన రేవు ముత్యాలరాజు వంటి వారిని ఆదర్శంగా తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఏఎన్యూ సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో ఆయా రంగాల నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఏస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ వైవీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ నిరంతర కృషి, అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా సిద్ధమయితే సివిల్స్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో విజయం సాధించవచ్చన్నారు. అకాడమీ కోఆర్డినేటర్ ఈ.వీరబాబు ఐఏఎస్ పరీక్ష విధానం, మార్కుల కేటాయింపు, పరీక్షకు సిద్ధమవడం, పరీక్ష రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. హెచ్ఆర్డీ డెరైక్టర్ డాక్టర్ బి.నాగరాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. -
చెరువు బాగు.. ఎవుసం సాగు
* చెరువుల పునరుద్ధరణతోనే రైతుకు బంగారు భవిత * ‘మిషన్ కాకతీయ’ అమలుకు రూ.2 వేల కోట్ల కేటాయింపు * నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు వెల్దుర్తి/నర్సాపూర్: ‘మిషన్ కాకతీయ’ను ఓ మహాయజ్ఞంలా చేపట్టి.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణతోనే అన్నదాతల బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. మండలంలోని మంగళపర్తికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, .. మిషన్ కాకతీయలో గుర్తించిన చెరువుల పునరుద్ధరణ పనులు ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని చెరువుల పునరుద్ధరణ కోసం టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిషన్ కాకతీయను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని సొంత ఖర్చులతో పొలాల్లోకి తరలించుకోవాలన్నారు. దీనివల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గడంతోపాటు పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే చెరువుల పునరుద్ధరణ కోసం ఆయా గ్రామాల సర్పంచ్లు గ్రామసభలు ఏర్పాటు చేసి రైతులను, ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఆయన వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర నాయకులు మురళీయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణాగౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి హరీష్రావు మంగళపర్తికి చెందిన సంఘ సేవకుడు మణికొండ రాఘవేందర్రావును పరామర్శించారు. ఇటీవలే రాఘవేందర్రావు తల్లి జానకీదేవి మృతి చెం దడంతో హరీష్రావు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సివిల్స్లో రాణించాలి... శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీవీఆర్ఐటీ కాలేజీలో ఏర్పాటైన తెలంగాణ సంప్రదాయ ఉత్సవాలకు హరీష్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, .. ఇంజనీరింగ్ విద్యార్థులు సివిల్స్లోనూ రాణించాలని సూచించారు. సౌత్ ఇండియాలోని రాష్ట్రాల నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్లో చాలా తక్కువ మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారన్నారు. నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది ఉంటారని, మన రాష్ర్టం నుంచి ఎక్కువ మంది సివిల్స్లో రాణించాలని తాను ఆశిస్తున్నానన్నారు. బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ పట్ల దృష్టి పెట్టి అందుకు అనుగుణంగా కృషి చేయాలని మంత్రి హరీష్రావు విద్యార్థులకు సూచించారు. బీటెక్ పూర్తవగానే అందరూ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారని, అలా కాకుండా సివిల్స్ పట్ల దృష్టి పెట్టాలని, ఐఏఎస్, ఏపీఎస్లో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు విద్యార్థులు హరీష్రావుకు ఎడ్లబండిపై ఘన స్వాగతం పలికారు. -
పది ఫెయిలైనా..కావచ్చు ఐఏఎస్!
* సివిల్స్ సాధించాలంటే.. సేవా గుణం ఉండాలి * ఇంగ్లిష్ వస్తేనే.. అపోహ మాత్రమే * తెలుగులో రాసిన చాలామంది కలెక్టర్లు అయ్యారు * ‘కోచింగ్’ నోట్స్ ఇస్తుంది.. నాలెడ్జ్ ఇవ్వదు * అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఇందూరు: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే చాలా మంది సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కాని సమాజ సేవనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళితే సివిల్స్ సాధించడం త్వరగా సాధ్య పడుతుందని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. సమాజ సేవ కోసం సివిల్స్ చదివి ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్తారే కానీ, సమాజ సేవను ఎందుకు లక్ష్యంగా పెట్టుకోకూడదని అన్నారు. శుక్రవారం తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడారు. ప్రసంనికి ముందు సివిల్స్కు ప్రిపేర్ కావాలంటే ఏం చేయాలో సదస్సుకు వచ్చిన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన వివరాలను ఓ విద్యార్థినిచే నోట్ చేయించారు. వారు చెప్పిన ఒక్కో అంశాన్ని తీసుకుని మాట్లాడుతూ... ప్రశ్నల వర్షం కురిపించారు. వారు వ్యక్తం చేసిన సందేహాలకు, ప్రశ్నలకు విద్యార్థుల చేతనే సమాధానాలు చెప్పిస్తూ తాను కూడా సమాధానాలు, సందేహాలను నివృత్తి చేశారు. దాదాపు గంటకు పైగా విద్యార్థులతో సంభాషించి కలెక్టర్ హోదాను పక్కనపెట్టి ఒక టీచర్గా మారిపోయారు. ప్రయివేటు విద్యా సంస్థల్లో చదువుతున్నవారే సివిల్స్కు సిద్ధమవుతున్నారని, ప్రభుత్వ సంస్థల్లో చదివిన వారు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అయితే ఇంగ్లీషు వచ్చి ఉంటేనే పరీక్షలు రాయగలుగుతారనే విషయం ఇక్కడ చాల మంది చెబుతున్నారు. కాని తెలుగు నేర్చుకున్న వారు సివిల్స్ పరీక్ష రాసే అవకాశం ఉందని, తెలుగులో పరీక్షలు రాసి ఐఏఎస్లు అయినవారు చాలా మంది ఉన్నారని తెలిపారు. పరీక్షలు రాయకపోవడగానికి కూడా పట్టుదల లేకపోవడం, భయం, నమ్మకం లేకపోడం కూడా కారణమవుతాయన్నారు. చిన్ననాటి నుంచే బాగా చదివితేనే సివిల్స్ సాధిస్తామనేది ఒక అపోహ మాత్రమేనని, పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫెయిలైనా.. తిరిగి పాసై సివిల్ పరీక్షలు రాసిన వారు ఎందరో ఉన్నారని తెలిపారు. 16 గంటలు చదివితేనే గోల్ సాధ్యమవుతుందని చాలా మంది గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతారని, ప్రస్తుత కాలంలో ఆ పద్ధతి పాటించడం లేదన్నారు. తాను చదువుకున్న కాలంలోనే రోజుకు 3 నుంచి 4 గంటల సమయం కేటాయించే వాడినని తెలిపారు. తమనకు ఏదీ నచ్చితే ఆదే చదవాలని, అదే నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలని పోటీ పరీక్షలు నాలుగైదు సార్లు రాస్తే కాని అనుభవం రాదన్నారు. ఇంట్లో కూర్చుండి పరీక్షలకు సిద్ధం కావడం సాధ్యపడదని, అలాగని కోచింగ్ తీసుకుంటే అస్సలు సాధ్యపడదన్నారు. ఎందుకంటే కోచింగ్లో నోట్స్లభిస్తుందే కాని నాలెడ్జ్ లభించదన్నారు. అనుభవాజ్ఞులు, లేదా తోటి స్నేహితుల సహాలు,సూచనలు తీసుకుని ప్రశాంతమైన వాతావరణంతో మైండ్సెట్తో చదివితే లక్ష్యంగా నెరవేరుతుందన్నారు. వీటితో పాటు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దిన పత్రిలు, రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు చదివితే మరింత సులువుగా ఉంటుందన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సవిల్స్కు సిద్ధం కావడానికి మంచి అవకాశమని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాని సూచించారు.అయితే అన్ని ఉద్యోగాల కన్నా సివిల్స్ సాధించి ఉద్యోగం పొందడం గొప్ప విషయమని అన్నారు. సివిల్స్కు ఉన్న పాముఖ్యత అలాంటిదని అన్నారు. అన్ని రకాలుగా సమాజ చేయాలంటే సివిల్స్కు మించిన మార్గం మరొకటి లేదని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యేక శిక్షకుల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి విమలాదేవి, సహాయ సంక్షేమాధికారులు విజయ్కుమార్, శంకర్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్కు అనుగుణంగా డిగ్రీ!
* బీఏ సిలబస్లో మార్పులు చేర్పులు * ఆంత్రోపాలజీ కాంబినేషన్లతో కొత్త కోర్సులు * సోషియాలజీ, సోషల్ వర్క్ పాఠ్యాంశాల్లోనూ మార్పులు * బీఏ విద్యార్థులు ఎన్జీవోలతో కలసి పనిచేసేలా ఒప్పందం * చదువు పూర్తికాగానే ఉపాధి అవకాశాలు లభించేలా ఏర్పాట్లు * తె లంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: సివిల్స్ పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీ సిలబస్లో మార్పులు తేవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సివిల్స్ రాసేవారు ఆంత్రోపాలజీ సబ్జెక్టుకు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే ఆంత్రోపాలజీ కాంబినేషన్తో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో (బీఏ) కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు డిగ్రీ స్థాయిలో ఆంత్రోపాలజీ కాంబినేషన్తో కోర్సులు ఉన్నా.. ఇటు ప్రభుత్వ కాలేజీలు, అటు ప్రైవేటు కాలేజీలు ఆ కోర్సులకు అడ్మిషన్లు తీసుకోవడం లేదు. ఇకపై అలా కాకుండా ఆయా కోర్సులను అన్ని కాలేజీలు కచ్చితంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత కాలేజీల్లో కచ్చితంగా ఈ కోర్సులకు అడ్మిషన్లు చేపట్టాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్ మారనుంది. ఈ మార్పుల్లో భాగంగా ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్టుల సిలబస్ను మార్చాలని నిర్ణయించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం ఆధ్వర్యంలో అన్ని యూనివర్సిటీల విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, డీన్లతో సోమవారం సమావేశం జరిగింది. ఇందులో డిగ్రీ సిలబస్లో తీసుకు రావాల్సిన మార్పులపై చర్చించారు. మార్పులు చేర్పుల్లో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సిలబస్, యూపీఎస్సీ సిలబస్ను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలోని ప్రధాన అంశాలతో బీఏలో మూడేళ్లపాటు ఆంత్రోపాలజీ కాంబినేషన్తో కోర్సును నిర్వహిస్తారు. తద్వారా సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి డిగ్రీ స్థాయి నుంచే పునాది వేయొచ్చని మండలి వైస్ చైర్మన్ మల్లేశ్ పేర్కొన్నారు. దీంతో డిగ్రీ తర్వాత కోచింగ్ సెంటర్లలో ఆంత్రోపాలజీలో శిక్షణ పొందాల్సిన అవసరం ఉండదన్నారు. బీఏలో హిస్టరీ-ఆంత్రోపాలజీ-సోషియాలజీ, ఆంత్రోపాలజీ-పొలిటికల్ సైన్స్-ఫిలాసఫీ, ఆంత్రోపాలజీ-సైకాలజీ-ఇంగ్లిష్ లిటరేటర్ వంటి కాంబినేషన్లతో మార్పులు తెస్తామన్నారు. సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్టుల సిలబస్లోనూ మార్పులు తేనున్నారు. ఈ మార్పులపై మరింత లోతుగా అధ్యయనం చేసి సిలబస్ను మార్చేందుకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ విశ్వ విద్యాలయాల విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి అదనంగా.. డిగ్రీ కాలేజీల్లో బోధించే 10 మంది లెక్చరర్లతో మరో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. వీటన్నింటికి సమన్వయకర్తగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ గణేశ్ వ్యవహరిస్తారు. సోషియాలజీలో ముఖ్యంగా ప్రాంతీయ సంస్కృతి అంశంలో తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతికి పెద్దపీట వేస్తారు. సోషియాలజీ, సోషల్ వర్క్ వంటి సబ్జెక్టులతో బీఏ చేసే వారి సిలబస్ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చడంపై దృష్టి సారిస్తారు. ఇందులో భాగంగా క్షేత్ర పర్యటనలు, ఇతర ప్రాక్టికల్స్ విషయంలో ఎన్జీవో సంస్థలతో కలసి విద్యార్థులు పని చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో డిగ్రీ పూర్తయ్యాక విద్యార్థులకు ఎన్జీవో సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. -
పోటీ పరీక్షల ప్రిపరేషన్లో సందేహాల అడ్డంకుల్ని తొలగించుకోండి..
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు కదిలి.. లక్షలాది మంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల్లో గెలుపు కోసం శ్రమిస్తోంది. సర్కారీ కొలువుల మేళాలో సక్సెస్ కోసం పరితపిస్తోంది. ఈ క్రమంలో చేస్తున్న ప్రిపరేషన్ ప్రయాణంలో అనేక సందేహాలు అడ్డుతగులుతుంటాయి.. వీటిని తొలగించి, ముందుకుసాగేలా చేయూతనిచ్చేందుకు మీ ‘భవిత’ సిద్ధంగా ఉంది. సివిల్స్, బ్యాంకు పరీక్షలతో పాటు త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న పరీక్షలకు సంబంధించి గ్రూప్-1, గ్రూప్-2, కానిస్టేబుల్, ఎస్ఐ, డీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, రక్షణ తదితర అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్న నిపుణుల వివరాలు.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ బీఏ, బీఎస్సీ, బీటెక్.. ఇలా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో జాతీయ స్థాయిలో ఉన్నత హోదాలకు నెలవైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి 23 సర్వీసుల్లో అడుగుపెట్టేందుకు వీలుకల్పిస్తుంది సివిల్ సర్వీసెస్ పరీక్ష. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి వయోపరిమితిని, ప్రయత్నాల సంఖ్యను పెంచడం శుభపరిణామం. ఈ పరీక్షకు పోటీ తీవ్రంగా ఉంటుంది. సివిల్స్-2014 ప్రిలిమ్స్కు 4,52,334 మంది హాజరయ్యారు. సివిల్స్ పరీక్ష మూడు దశలుగా ఉంటుంది. అవి.. 1. ప్రిలిమ్స్ 2. మెయిన్స్ 3. పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష). ఇప్పటికే ప్రిలిమ్స్ను పూర్తిచేసుకొని, మెయిన్స్కు సిద్ధమవుతున్నవారు లేదంటే సివిల్స్-2015కు దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్రారంభించిన వారు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లు రాకపోవడంతో ఉద్యోగార్థులు నిరాశ చెందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల చర్యలు ఇప్పుడు వారిలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. పలు శాఖల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపడమే ఇందుకు కారణం. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇందుకోసం ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆర్టీవో, సీటీవో తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే గ్రూప్-1 రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు దశలుగా ఉంటుంది. డిప్యూటీ తహశీల్దార్, ఏసీటీవో, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 తదితర మండల స్థాయి పోస్టుల భర్తీ కోసం నిర్వహించే గ్రూప్ 2లో మొత్తం మూడు పేపర్లుంటాయి. అవి.. పేపర్-1 జనరల్ స్టడీస్; పేపర్-2 హిస్టరీ అండ్ పాలిటీ; పేపర్-3 ఎకానమీ. పరీక్ష 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఎస్ఐ/పోలీస్ కానిస్టేబుల్ అధికారిక చిహ్నం మొదలు.. విధులకు అవసరమైన వాహనాల వరకు అన్నింటికీ ఆధునిక సొబగులు అద్దిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల్లో విజయానికి అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్, సబ్జెక్ట్ నాలెడ్జ్ రెండింటిలోనూ సన్నద్ధత సాధించాలి. ఈ నియామకాల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని రెండు దశల్లో అంటే.. దేహ దారుఢ్యం, రాత పరీక్ష ద్వారా పరీక్షిస్తారు. ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గతంలో బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణులు సైతం పోటీ పడ్డారు. దీన్నిబట్టి పోటీ తీవ్రతను అంచనా వేయొచ్చు. ఔత్సాహిక అభ్యర్థులు శారీరక సామర్థ్యం, రాత పరీక్షలకు సంబంధించి తమ సందేహాలను పంపొచ్చు. నిపుణుల బృందం: బ్యాంకు పరీక్షలు ఆకర్షణీయ వేతనాలు; ప్రతిభ ఆధారంగా పదోన్నతులు, ప్రోత్సాహకాలు.. ఇవీ బ్యాంకు ఉద్యోగులకు అందే సౌకర్యాలు. ఇవే యువతను బ్యాంకు కొలువుల వైపు ఆకర్షితులను చేస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగాలను చేజిక్కించుకోవాలనుకునే వారికి వచ్చే నాలుగైదేళ్లు స్వర్ణయుగమంటే అతిశయోక్తి కాదు. సేవల విస్తరణ, కొత్త బ్రాంచ్ల ఏర్పాటు, ప్రైవేటు బ్యాంకులకు లెసైన్సులు వంటివి దీనికి కారణం. ఐబీపీఎస్ క్లరికల్, ఐబీపీఎస్ పీవో, ఎస్బీఐ క్లరికల్, ఎస్బీఐ పీవో, ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో పీవో.. ఇలా వివిధ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు యువత ముంగిట వచ్చి వాలుతున్నాయి. కాస్త శ్రమిస్తే చాలు వీటిలో విజయం సాధించి, మంచి కొలువును సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయానికి కీలకమైన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రెటేషన్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇలా ఏ సబ్జెక్టుకు సంబంధించిన సందేహాలైనా పంపి, నివృత్తి చేసుకోవచ్చు. నిపుణుల బృందం: డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. ముందే ప్రకటించినట్లు సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అర్హులుగా చేసేందుకు ప్రయత్నిస్తుండటం వల్లే నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అన్ని అడ్డంకులూ తొలగి త్వరలోనే నోటిఫికేషన్ రావొచ్చని ఉద్యోగార్థులు ఆశిస్తున్నారు. ఖాళీల భర్తీ జిల్లా యూనిట్గా నిర్వహించడం.. ఆయా సబ్జెక్ట్ టీచర్ పోస్ట్ల బ్రేక్-అప్ సంఖ్య తక్కువగా ఉండటంతో అభ్యర్థులు డీఎస్సీలో విజయానికి తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఎస్జీటీ.. స్కూల్ అసిస్టెంట్.. డీఎస్సీలో నిర్వహించే రెండు పరీక్షలు. ఈ రెండింటికి సంబంధించి ఔత్సాహికులు తమ సందేహాలను పంపవచ్చు. నిపుణుల బృందం: -
శిక్షణ ‘క్యూ’
లక్ష ఉద్యోగాలు వస్తాయని సంతోషం కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్న అభ్యర్థులు కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలపై కోటి ఆశలు ఫంక్షన్ హాళ్లకు మారిన తరగతి గదులు సాక్షి, సిటీబ్యూరో/ముషీరాబాద్: హైదరాబాద్ ఆశావహుల కేంద్రంగా మారింది. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న వేలాది మంది నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్నారు. ఒకటి, రెండు నెలల్లో సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడవచ్చునన్న వార్తల నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నిరుద్యోగ అభ్యర్ధులు భారీ సంఖ్యలో నగరానికి తరలిస్తున్నారు. దీంతో గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. కోచింగ్ సెంటర్లకు నెలవైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో పంక్షన్ హాళ్లు తరగతి గదులుగా మారాయి. ఒక్కొక్క సెంటర్లో వేలాది మంది శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకోవడంతో నిర్వాహకులు తరగతి గదులను పంక్షన్ హాళ్లలోకి మార్చారు. ఈ ప్రాంతాల్లోని అన్ని ఫంక్షన్ హాళ్లు మరో 6 నెలల వరకు కోచింగ్ సెంటర్ల కోసమే బుక్ అయ్యాయి. కొన్ని చోట్ల కమ్యూనిటీ హాళ్లు, సాంస్కృతిక కేంద్రాలు సైతం కోచింగ్ కేంద్రాలకు వేదికలవుతున్నాయి. కళలకు, సాంస్కృతిక ప్రదర్శనలకు కేంద్రమైన త్యాగరాయ గానసభ సైతం కోచింగ్ సెంటర్గా మారింది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభ్యర్థులకు శిక్షణనిచ్చేందుకు ఓ విద్యా సంస్థ 6 నెలల పాటు బుక్ చేసుకుంది. ఆర్టీసీ క్రాస్రోడ్స్ చుట్టూ ఉన్న ఫంక్షన్ హాళ్లు కోచింగ్లకు వచ్చే అభ్యర్ధులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కొక్క తరగతిలో 1000 నుంచి 1500 మంది విద్యార్థులకు ఒకేసారి బోధిస్తున్నారు. బంగారు భవిత కోసం నిరీక్షణ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోటి ఆశలతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ నాటికి వరుసగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ నియామకాలు, పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్నగర్, తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉన్న కోచింగ్ సెంటర్లలో సుమారు 50 వేల మంది శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం అశోక్నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో 1200 మందితో కొత్త బ్యాచ్ను ప్రారంభిం చేందుకు దర ఖాస్తులు విక్రయించగా, 4 వేల మందికి పై గా పోటీ పడ్డారు. దరఖాస్తుల కోసం అశోక్నగర్ చౌరస్తా నుంచి ఇందిరా పార్కు వరకు బారులు తీరారు. అభ్యర్థుల తాకిడితో కొన్ని కోచింగ్ సెంటర్లు శిక్షణ కాలాన్ని 3 నుంచి 4 నెలలకు కుదిస్తున్నాయి. సాధారణంగా కరెంట్ అఫైర్స్, మెం టల్ ఎబిలిటీ, పాలిటీ, తదితర అంశాలలో ఆరు నెలల శిక్షణతో పాటు, స్టడీ మెటీరియల్ను అందించే శిక్షణ సంస్థ లు డిమాండ్ దృష్ట్యా స్టడీ మెటీరియల్ను అందజేయలేకపోతున్నాయి. వారం రోజుల్లో ప్రస్తుత బ్యాచ్లను ముగించి, కొత్త బ్యాచ్ల కోసం కోచింగ్ సెంటర్లు సన్నద్ధమవుతున్నాయి. ఉద్యోగం వదులుకొని వచ్చాను గచ్చిబౌలీలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాను. ఎలాగైనా సరే గ్రూప్-2 సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. - బాలకృష్ణ, ఎంబీఏ, మెదక్ ఆడపిల్లలకు మంచి అవకాశం కొత్త రాష్ట్రంలో ఎలాగైనా ఉద్యోగా లు వస్తాయనే నమ్మకం ఉంది. ము ఖ్యంగా అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఎంటెక్ చదువుతున్నాను. ప్రైవేట్ ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోనే మంచి భవిష్యత్తు ఉంటుందని పట్టుదలగా చదువుతున్నాను. - వనిత, ఎంటెక్, నల్లగొండ లక్ష ఉద్యోగాల పైనే ఆశలు లక్ష ఉద్యోగాలొస్తాయనే వార్తలు ఎంతో ఆశ కలిగిస్తున్నాయి. కష్టపడి చదివితే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. కోచింగ్ తీసుకోవడం వల్ల మరింత అవగాహన పెరుగుతుంది. - సోమేష్, పీజీ, నల్లగొండ నమోదు కేంద్రాల్లోనూ రద్దీ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లకు ఉద్యోగార్థులు తరలి వస్తున్నారు. వివిధ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దీంతో మెహిదీపట్నంలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల వద్ద రద్దీ బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే ఉద్యోగార్ధులు భారీ సంఖ్యలో తరలివచ్చినట్లు అధికారులు చె ప్పారు. తె లంగాణ ఆవిర్భావం తరువాత ఉద్యోగాలపై అందరిలోనూ ఆశలు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 29వ వరకు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 12,204 మంది, రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 18,021 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. -
సివిల్స్పై దృష్టి పెట్టండి
నేటి యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు బదులు సమాజసేవకు ఉపకరించే ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలపై దృష్టి సారించాలని నల్గొండ కలెక్టర్ చిరంజీవులు సూచించారు. సివిల్స్ పరీక్షలపై అవగాహన కోసం ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ మాటలన్నారు. సాక్షి, ముంబై: నేటి యువతీయువకులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇతర ఎన్నో రంగాలున్నప్పటికీ వాటిపై ఆసక్తి కనబర్చడం లేదని నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. యూపీఎస్సీ, సీఎస్ఈ, ఎంపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం దీపక్ టాకీస్ సమీపంలో ఉన్న యశ్వంత్ భవన్ హాలులో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవులు అనేక అంశాలపై విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చా రు. ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు సంపాదిస్తే కేవలం కార్యాలయంలో పనిచేయడానికే పరిమితమవుతారు. అదే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు వస్తే ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశముంటుంది. లోకజ్ఞానం కూడా సంపాదించుకోవచ్చు’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి ఐపీఎస్ అధికారి, ఠాణే జిల్లా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లపై కాకుండా చదువుపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖరీదైన మొబైల్ ఫోన్లు కొనిస్తున్నారు. వాటివల్ల నష్టమే తప్ప లాభం లేదు. మీకు తెలియకుండా నే వారు ఫేస్బుక్, వాట్సప్ వంటి సైట్లు చూస్తూ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు. ఈ సమయాన్ని చదువుకునేందుకు కేటాయిస్తే మంచి భవిష్యత్ ఉం టుంది. మనం ఏ కాలేజీలో చదువుకున్నామో అదే కాలేజీకి ఒక ముఖ్య అతిథిగా వెళితే ఆ ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుచేసుకోండి. మనం ఇతరుల ఆటోగ్రాఫ్ కోసం పాకులాడే బదులుగా మన ఆటోగ్రాఫ్ కోసం ఇతరులు ఎగబడేస్థాయికి ఎదగాలి. కన్నవారిని, గురువులను గౌరవించే పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుంది’ అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి హాజ రైన అతిథులకు పద్మశాలి సేవాసంఘం అధ్యక్షుడు పోతు రాజారాం, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ శాలువ, పుష్పగుచ్ఛాలు, మెమొంటోలు ఇచ్చి ఘనం గా సత్కరించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు అతిథులు, నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇటీవల తెలంగాణలో సకలజన సర్వే సక్రమంగా జరగలేదని, ఎన్యుమలేటర్లందరూ సక్రమంగా విధులు నిర్వహించనందున, మరోసారి సర్వే చేపట్టాలని కోరుతూ పోతు రాజారాం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కూరపాటి అరుణ (జెడ్పీటీసీ-నిజామాబాద్), ఎనుగందుల అనిత (జెడ్పీటీసీ-మోర్తాడ్), జోగు సంగీత (జెడ్పీటీసీ-బాల్కొండ), పోతు నర్సయ్య (మండల అధ్యక్షుడు-ఆర్మూర్), జక్కని సంధ్యారాణి (ఎంపీటీసీ-ఏర్గట్ల), ఎనుగందుల అశోక్ (ఎంపీటీసీ-పాలెం), పెంటు గంగాధర్ (ఎంపీటీసీ-ముప్కాల్), చిలుక గోపాల్ (ఎంపీటీసీ-ముప్కాల్), తాళ్ల భూషణ్ (సర్పంచి-వన్నెల్ బి), గుర్రం నారాయణ (సర్పంచి-బోదేపల్లి), తాటికొండ శివకుమార్ (వ్యాపారవేత్త)ను సన్మానం పొందినవారిలో ఉన్నారు. ఈ సెమినార్లో ఐఏస్ అధికారి సంతోష్ రోకడే, ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సెవై రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుక శైలజ , సిద్ధివినాయక్ మందిరం ట్రస్టుకు చెందిన ఏక్నాథ్ సంగం తదితరులు హాజరయ్యారు. -
నేడే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష
-
గణిత ప్రావీణ్యం కాదు పాలన అభిరుచిని గుర్తించాలి
ఇంటర్వ్యూ: దేశంలో లక్షలాది మంది యువత కలల కెరీర్ సివిల్స్. అలాంటి ఉన్నత కెరీర్లోకి సివిల్ సర్వెంట్లను ఎంపిక చేయాల్సిన పరీక్షపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2011లో ప్రవేశపెట్టిన సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్).. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ పరీక్ష సివిల్ సర్వీసెస్ ఔత్సాహికుల ఆశలపై నీళ్లుచల్లేలా ఉందనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దేశానికి ఉత్తమమైన పాలనాదక్షులను ఎంపిక చేయాల్సిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో.. గణితం, ఇంగ్లిష్పై పట్టు ఉన్నవారిని ఎంపిక చేస్తున్నారంటున్నారు ఆర్.సి.రెడ్డి స్టడీసర్కిల్ డెరైక్టర్ ఆర్.సి.రెడ్డి. సివిల్ సర్వీసెస్కు ఎంపిక పరీక్ష.. పాలన అభిరుచిని గుర్తించేలా ఉండాలని, అన్ని మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలని అంటున్న ఆర్.సి.రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. బాధ్యతలకు తగ్గ ఎంపిక విధానం ఉండాలి సివిల్స్ ఎంపిక ప్రక్రియ మూస ధోరణిలో అందరినీ ఒకే గాటన కట్టేలా ఉండకూడదు. చేపట్టాల్సిన బాధ్యతలకు తగ్గట్టు ఎంపిక విధానం ఉండాలి. చేయబోయే పనికి అవసరమైన ప్రతిభా సామర్థ్యాలను పరీక్ష ద్వారా గుర్తించాలి. అయితే, యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అభ్యర్థి అభిరుచి తెలుసుకునేందుకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అవసరమే. అందుకోసం పరీక్షలో పరిపాలనా సంబంధమైన ప్రశ్నలను ఇచ్చి పరిష్కరించమనాలి. అధికారులుగా తమకు ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారో గుర్తించేందుకు అది చక్కటి మార్గం. ఆప్టిట్యూడ్ పేపర్లో 6 ప్రశ్నలు మాత్రమే పాలనా ప్రతిభను పరీక్షించేవిగా ఉంటున్నాయి. మిగతా ప్రశ్నలన్నీ మ్యాథ్స్కు సంబంధించినవే! దాంతో గణితేతరులు తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. మూడేళ్ల నుంచి సీశాట్ నిర్వహిస్తున్నా.. ఇటీవల సమాచార హక్కుచట్టం ద్వారా ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడి కావడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. గణితేతర అభ్యర్థులకు మార్కులు తగ్గాయనేందుకు యూపీఎస్సీ ఇచ్చిన సమాచారమే నిదర్శనం. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ క్లిష్టంగా ఉంది 1979 నుంచి 2011 వరకూ ఉన్న సిలబస్తో అన్ని విభాగాల అభ్యర్థులూ పోటీపడేందుకు అవకాశం ఉండేది. 2011లో ఆప్షనల్ స్థానంలో ఆప్టిట్యూడ్ టెస్ట్ చేర్చారు. 6 ప్రశ్నలు తప్ప మిగతావన్నీ ఏ మాత్రం పాలనా అభిరుచికి సంబంధం లేనివి. సీశాట్ను పరిశీలిస్తే ఇంగ్లిష్ కాంప్రహెన్షన్.. సగటు విద్యార్థి స్టాండర్డ్కు మించి ఉంది. క్లిష్టమైన ప్యాసేజ్లు ఇస్తున్నారు. దాంతో తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల విద్యార్థులకు ప్రిలిమినరీ పరీక్ష కష్టంగా మారింది. కీలకమైన బాధ్యతలు చేపట్టే అధికారికి అన్ని అంశాలపై పరిజ్ఞానం ఉండటం అవసరమే. అయితే మరీ ఇంత క్లిష్టత ఉండ కూడదు. ఇంగ్లిష్పై అవగాహనతోపాటు గణాంకాలపై పట్టు ఉండాలనే ఉద్దేశంతో గతంలో ‘స్టాటిస్టికల్ ఎనాలసిస్’ నుంచి కూడా ప్రశ్నలిచ్చేవారు. హిందీ అభ్యర్థులకు కొంత అనుకూలమే! ఇతర ప్రాంతీయ భాషల వారితో పోల్చితే హిందీ మాధ్యమం వారికి సీశాట్ కొంత అనుకూలమనే చెప్పాలి. ఎందుకం.టే.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. హిందీలో ప్రశ్నపత్రం ఉండటం వల్ల ప్రశ్నలను అర్థం చేసుకోవడం ఆ భాషలో చదువుకున్న అభ్యర్థులకు తేలికవుతుంది. ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులకు ఈ వెసులుబాటు లేదు. పాలనలో రాణించేవారిని గుర్తించేలా పరీక్ష ఉండాలి.. మూడేళ్లుగా సివిల్స్ సర్వీసెస్కు ఎంపికవుతున్న అభ్యర్థులను గమనిస్తే.. ఐఐటీలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడిసిన్ నేపథ్యాల నుంచి వచ్చినవారే జాబితాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సోషల్ సెన్సైస్ అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతమాత్రాన ఐఐటీల్లో చదివిన వారు అనర్హులని చెప్పట్లేదు. ఆయా రంగాల్లో నిపుణులైన వారు పరిపాలనలో రాణిస్తారని నిర్ధారించడం సరికాదంటున్నాను. శాస్త్ర, సాంకేతిక రంగాల నిపుణులు కూడా దేశానికి అవసరమే. పాలనాపరమైన ఉద్యోగానికి కాకుండా.. ఐఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ జాబ్స్కు ఎంపిక కోసం మ్యాథ్స్, రీజనింగ్ వంటివి కావాలి. అభ్యర్థులకు కనీస పరిజ్ఙానం అవసరమని భావిస్తే మెయిన్స్లో ఇవ్వొచ్చు. కానీ ప్రస్తుత విధానంతో ప్రిలిమినరీ దశలోనే గణితేతర ప్రతిభావంతుల్ని బయటకు పంపించడం సరికాదు. అభ్యర్థుల్లో పాండిత్యాన్ని కాకుండా.. పాలనలో ఎంతవరకూ రాణించగలరనే అంశాన్ని గుర్తించేలా ప్రశ్నల రూపకల్పన చేయాలి. భావోద్వేగ నైపుణ్యంపై ప్రశ్నలు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పాలనలో కీలకమైన బాధ్యతలు అప్పగించే ముందు ఆయా వ్యక్తులను అంచనా వేసేందుకు కొన్ని ప్రామాణికాలను అనుసరిస్తున్నారు. అన్ని స్థాయిల వ్యక్తులతో మెలిగేతీరు.. మాటతీరు.. కిందిస్థాయి సిబ్బందితో పనిచేయించే శైలి.. ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వంటివి పరిశీలిస్తున్నారు. మన దేశంలోనూ ఆర్మీలో ఎంపికకు సర్వీస్ సెలక్షన్ బోర్డ(ఎస్ఎస్బీ) అభ్యర్థుల నాయక త్వ లక్షణాలను పరిశీలిస్తుంది. సివిల్ సర్వెంట్గా అభ్యర్థిలో భావోద్వేగ నైపుణ్యం(ఎమోషనల్ ఇంటెలిజెంట్)ను కనిపెట్టేలా ప్రశ్నలుం డాలి. దైనందిన వ్యవహారాల్లో ఎదుర య్యే సవాళ్లను, సమస్యలను పరిష్కరించేందుకు వారు చూపే చొరవను పసిగట్టగలగాలి. వారి మానవ నైజం తెలియాలి. అన్ని మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలి పాలనాపరమైన ఇబ్బందులు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రశ్నపత్రంలో పొందుపర్చవచ్చు. పేరుకే ఇంటర్ పర్సనల్ స్కిల్స్.. ఒక్క ప్రశ్న కూడా దానిపై ఇవ్వడం లేదు. తెలివితేటలు అనేక రకాలు.. ఫలానా అంశాలు తెలిస్తేనే తెలివిగలవారంటూ నిర్ధారించడం సరికాదు. పాలన, గణిత ప్రతిభాపాటవం, శాస్త్ర, సాంకేతిక, భాష, నటన, చిత్రలేఖన అంశాల్లో తెలివితేటలు పలు రకాలుగా ఉంటాయి. సివిల్సర్వీసెస్ పరీక్ష నిష్ణాతులను కాకుండా.. పరిజ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేసేలా ఉండాలి. సులభమైన ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ఇవ్వాలి. అన్ని మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్షలో పాలనా పరమైన అభిరుచిని, నాయకత్వ లక్షణాలను పరిశీలించాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్.. సోషల్ సెన్సైస్ అభ్యర్థులకు పెద్ద అడ్డంకి ప్రస్తుతం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో గట్టెక్కాలంటే 240/400 పైగా మార్కులు తెచ్చుకోవాల్సిందే. 2013 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన జనరల్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు 241. 2013లో 3,23,949 మంది ప్రిలిమ్స్ రాస్తే.. మెయిన్స్కు అర్హత సాధించింది 14,959 మంది మాత్రమే. వీరిలో గణితం నేపథ్యం ఉన్నవారే అధికం. పేపర్-2లో ఆర్ట్స్, హుమానిటీస్ అభ్యర్థులు మ్యాథ్స్వారితో పోటీపడలేకపోతున్నారు. ఫలితంగా ప్రతిభ ఉన్నప్పటికీ మెయిన్స్కు అర్హత సాధించలేకపోతున్నారు. గణితం నేపథ్యం కలిగిన అభ్యర్థులు పేపర్-1లో తక్కువ మార్కులు సాధించినా.. పేపర్-2లో స్కోరు చేసి విజేతలుగా నిలుస్తున్నారు. అంటే.. గణితేతర అభ్యర్థులు ప్రిలిమ్స్లో క్వాలిఫై కాకపోవడానికి ఆప్టిట్యూడ్ టెస్ట్ అడ్డంకి అనేది స్పష్టమవుతోంది. ఇవన్నీ మూడేళ్ల తర్వాత బయటకు వచ్చాయి కాబట్టే సోషల్ సెన్సైస్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆప్టిట్యూడ్ టెస్ట్లో మ్యాథ్స్ సంబంధమైన ఒక్కో ప్రశ్నకు ఇచ్చిన సమయం 90 సెకన్లు. గణితేతర అభ్యర్థికి ప్రశ్నను అర్థం చేసుకునేందుకూ ఆ సమయం చాలదు. -
వర్తమానమూ... విజయసూత్రమే
అస్పష్టత.. క్లిష్టత:కొన్ని ప్రశ్నల సమాధానాలు సులభంగానే అనిపిస్తాయి. కానీ క్లిష్టంగా, అస్పష్టంగా, తికమక పెట్టేలా ఉంటాయి. ఇలాంటివాటికి తొందరపాటు పనికిరాదు. అలా చేస్తే భారీ మూల్యం తప్పదు. ఉదాహరణ:కేంద్ర మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్సభకా? పార్లమెంట్కా? దీని వివరణ కోసం ఆర్టికల్ 75లో సమగ్రంగా చదివితే స్పష్టత వస్తుంది. అదే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు సంబంధించిన విషయాలు కూడా ఇలాగే ఇబ్బందిపెడతాయి. అందువల్ల వీటిపై సమ గ్ర అధ్యయనం అవసరం. ప్రిలిమ్స్కు స్వల్పవ్యవధి మాత్ర మే ఉంది. ఈ కొద్ది సమయాన్ని సరైన ప్రణాళికతో సద్వినియోగపరచుకోవచ్చు. అందుకు మేలైన దారుల్లో కొన్ని... పాత ప్రశ్నపత్రాలతో పూర్తి అవగాహన: పాత పేపర్లను క్షుణ్నంగా చదివితే పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పాత ప్రశ్నపత్రాలకు మించిన ఉత్తమ వనరులు వేరేవేమీ లేవనడంలో సందేహం లేదు. సివిల్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని ఇదే. ఇలా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎకానమీ సబ్జెక్ట్కు 15 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాలను, మిగతా సబ్జెక్టులకైతే 20-30 సంవత్సరాల పేపర్లను నిశితంగా పరిశీలించాలి. వీటిని అధ్యయనం చేస్తే మానసికంగా కొంత విజయం సాధించినట్లే. గత పదేళ్లలో నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా పరిశీలించి ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పరచుకోవాలి.ప్రశ్నల ప్రాతిపదికకు సంబంధించి ముఖ్యాంశాలను నోట్స్లో రాసుకోవాలి. ఏడాదిగా సివిల్స్ కోసం సాధన సాగించిన వారు నోట్స్లో రాసుకున్న అంశాలను పునశ్చరణ చేయాలి. క్లిష్టమైన అంశాలను మరింత గుర్తుండి పోయేలా పాకె ట్ బుక్లో రాసుకుంటే మంచిది. రాజ్యాంగం, ఎకనామిక్స్, చరిత్ర.. ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన కీలక పాయింట్లను ఇందులో రాసుకోవాలి. ప్రిలిమ్స్.. మెయిన్సకు ఉపయుక్తమే: సాధారణంగా ప్రిలిమ్స్ కోసం చదివిన అంశాలు మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్కు అంతగా ఉపకరించవని అనుకుంటారు. కానీ ఈ భావన తప్పు. ప్రిలిమ్స్ అంశాలు పూర్తిగా కాకున్నా కొంతమేర దోహద పడతాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ మధ్య చాలావరకు భిన్నత్వం ఉంటుంది. ఈ రెంటికీ సిలబస్ కూడా వేర్వేరు. అయితే అంశాలకు సంబంధించి స్పష్టత, అనుబంధ సమాచారం, మానసిక క్రమశిక్షణ, మార్గదర్శక సూత్రాల అమలులో రెండు పరీక్షలకు ఒకేలా ఉంటుంది. వర్తమాన అంశాలపై పట్టు: ఇటీవల 16వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సరళి, ఎన్నికల కమిషన్. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య పోలిక మొదలైన అంశాలు చదవాలి. 14వ ఆర్థిక సంఘం తుది నివేదిక కొద్ది నెలల్లో సమర్పిస్తుంది. దీనిపై ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల గవర్నర్ల నియామకం - తొలగింపు (ఆర్టికల్ 123) వివాదాస్పదంగా మారింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థకు జ్యుడీషియల్ కమిషన్ మధ్య వివాదం... ఇలా వర్తమానవ్యవహారాలకు సంబంధించి ప్రశ్నలు రావచ్చు. జాతీయ అత్యయిక పరిస్థితి (ఆర్టికల్ 352), రాష్ట్రపతి పాలన మొదలైనవి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తరచూ రాష్ట్రపతిని కలవడానికి ప్రధాన కారణాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో), మానిటరీ పాలసీ, సెబీ ఆర్డినెన్స్, చెల్లింపుల్లో సమతూకం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్), రాయితీలు, ఎఫ్ఆర్బీఎం, పన్ను వసూలు భావనలు (ట్యాక్సేషన్ కాన్సెప్ట్స్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల పంపిణీ మొదలైన అంశాలపై ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్లోనూ తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. ఈ అంశాలు వర్తమాన వ్యవహారాలకు సంబంధించినవే అయినా ఏటా మారుతుంటాయి. కాబట్టి ఈ అంశాలపై ఎల్లప్పుడూ విశ్లేషణాత్మక అధ్యయనం సాగిస్తే ప్రిలిమ్స్, మెయిన్సకు తోడ్పడుతుంది. సైన్స్ అంశాల నుంచి: ప్రిలిమినరీలో కరెంట్ ఐఫైర్స్ విభాగం ప్రత్యేకమైంది. రాజ్యాంగం, ఎకానమీ, సైన్స్లో సాధించిన పురోగతిపై అధికంగా ప్రశ్నలు వస్తున్నాయి. జాతీయ స్థాయి పత్రికల్లో తరచూ వచ్చే అంశాలపై అంటే సైన్స్లో ఎబోలా వైరస్, క్రయోజెనిక్ ఇంజిన్, శుద్ధి చేసిన యురేనియం, అణు సంబంధ పదార్ధాలు తదితర విషయాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఎకానమీ, జాతీయ విధానం అంశాలు కూడా కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నారు. అన్ని రంగాల నుంచి పలు రూపాల్లో ప్రశ్నలు రావొచ్చు. వీటితోపాటు సంప్రదాయ జీవ, భౌతిక శాస్త్రాల అంశాలు కరెంట్ అఫైర్స్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జన్యు మార్పులు, జన్యు సాంకేతికతపై పలు నివేదికలు వెలువడ్డాయి. డీఆర్డీవో పరిశోధ నలు, బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు.. ఇలా పలు అంశాలపై పట్టు సాధిస్తే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కూ ఉపయుక్తం. దినపత్రికలతోనే దిశ-దశ: సివిల్స్కు సన్నద్ధమయ్యే వారు ప్రామాణిక దినపత్రికలను చదవడం ఉత్తమం. పత్రికల్లో వచ్చే వర్తమాన వ్యవహారాలు, ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలకు చెందిన విశ్లేషణలు మనం చదివినవాటికి మరింత అదనపు సమాచారాన్ని అందిస్తాయి. ఉదాహరణకు ఆర్థిక సర్వే-2013. ఇందులో ఆర్థికపరమైన అంశాలన్నీ వివరణాత్మకంగా పత్రికల్లో వచ్చాయి. ఆర్థిక నిపుణులు తమ ఆలోచనలు, అనుభవాలను రంగరించి రూపొందించిన ఈ నివేదికలోని అంశాలను చదివితే ఎంతో ప్రయోజనం. ఇటీవల ఎక్కువగా స్మార్ట్సిటీల గురించి ప్రస్తావన వస్తోంది. వీటితోపాటు కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు పాతపేర్లను తొలగించి వాటి స్థానంలో దీన్దయాళ్ ఉపాధ్యాయ, శ్యామప్రసాద్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ్, మదన్మోహన్మాళవీయ పేర్లను పెడుతున్నారు. వీటిపై అభ్యర్థులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చదవని అంశాల గురించి ఆందోళన చెందకుండా చదివిన అంశాలను ఏ మేర విశ్లేషణతో ఆకళింపు చేసుకున్నారో స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. కొత్తగా ప్రాధాన్యమనిపించిన విషయాలేవైనా గుర్తించినట్లైతే అలాంటి వాటిపై పట్టు సాధించేందుకు మరింత కృషి చేయాలి. చర్చా కార్యక్రమాలు: టీవీల్లో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలను చూస్తే విశ్లేషణ శక్తి పెరుగుతుంది. కొన్ని చానెళ్లు విషయ పరిజ్ఞానం లేనివారితో చర్చలు కొనసాగిస్తుంటాయి. వాటి జోలికి వెళ్లకుండా ఆయా రంగాల్లో నిపుణులైన వారితో చేపట్టే కార్యక్రమాలను వీక్షిస్తే ఫలితం ఉంటుంది. కొందరు టీవీ చర్చా కార్యక్రమాలను చూస్తున్నాం కాబట్టి పత్రికలను చదవాల్సిన అవసరం లేదనుకుంటారు. అలాంటివారు ఈ ధోరణి విడనాడాలి. కనీసం ఒక ప్రామాణిక దినపత్రికనైనా చదవాలి. పరీక్షకు అవసరమైన వార్తలు, సమీక్షలు, సంఘటనలపై ఎప్పటికప్పుడు నోట్స్ రూపొందించుకోవాలి. జయాపజయాలను నిర్ణయించేది ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి కనీసం 40 నుంచి 45 ప్రశ్నలు వస్తాయి. ఎవరైతే ఇందులో 40 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తిస్తారో వారు విజయానికి చేరువవుతారు. ఓ రకంగా చెప్పాలంటే జయాపజయాలను నిర్ణయించే విభాగం ఇదే. కరెంట్ అఫైర్స్కు ప్రిపేరవ్వాలనుకునేవారు ప్రామాణిక దినపత్రికలు, వార్తా మ్యాగజైన్లను చదివితే మంచిది. వాటిలో కీలకమైన పాయింట్లను గుర్తించి, దాన్ని ప్రశ్న రూపంలో ఇలా అడగొచ్చు అని ఏవరికి వారు విశ్లేషించుకోవాలి. ఒక్కో అంశాన్ని నాలుగు కోణాల్లో ఆలోచించి సమాధానం గుర్తించడం సాధన చేయాలి. గత ప్రిలిమ్స్లో ఏ రూపంలో ప్రశ్నలు వచ్చాయో వాటికి అనుగుణంగా నోట్స్ రాసుకోవాలి. ఇలా చేయడం నాకు ఎంతో ఉపకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల అధినేతలు, పభుత్వ పథకాలు, వాటి లక్ష్యాలు, అంతర్జాతీయ సంఘటనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. వార్తల్లోకెక్కిన ప్రదేశాలపై పట్టుకోసం అట్లాస్ చూస్తే మరింతగా గుర్తుండి పోతుంది. ఇలా సాధన సాగిస్తే కరెంట్ అఫైర్స్ విభాగంలో 95 శాతం విజయం సాధించవచ్చు. - శశాంక ఆల, సివిల్స్- 2013 విజేత. రిఫరెన్స్ బుక్స్ హిస్టరీ: ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ - బిపన్ చంద్ర ఫాసెట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ - స్పెక్ట్రమ్ (కల్చర్) జాగ్రఫీ: జాగ్రఫీ ఆఫ్ ఇండియా - మాజిద్ హుస్సేన్ ఆక్స్ఫర్డ స్కూల్ అట్లాస్ - ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ- జి చాంగ్ లియోంగ్ ఎకానమీ: ఇండియన్ ఎకానమీ - ఎన్సీఈఆర్టీ 10, 12 తరగతుల సిలబస్-ఎకానమీ ఆక్స్ఫర్డ్/పెంగ్విన్ డిక్షనరీ ఆఫ్ ఎకానమిక్స్ సోషియో ఎకనమిక్ సర్వే (2013) సైన్స అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా- కల్పనా రాజారామ్, స్పెక్ట్రమ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫ్రమ్ క్రైసిస్ టు క్యూర్ - రెండో ఎడిషన్-ఆర్.రాజగోపాలన్ (ఎన్విరాన్మెంట్) కరెంట్ అఫైర్స-జీకే ఇండియా ఇయర్ బుక్ 2014 మనోరమ ఇయర్ బుక్ 2014 పామాణిక కెరీర్ జర్నల్ న్యూస్ మ్యాగజైన్స్ సెలెక్టివ్ రీడింగ్ ఫ్రమ్ వికీపీడియా -
సివిల్స్ సాధించడం సులభమే
కరీంనగర్ : కృషి, పట్టుదల ఉంటే సివిల్స్ సాధించడం సులభమేనని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారుడు రామచంద్రుడు అన్నారు. తెలంగాణ యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ యువతకు నిర్వహించిన సివిల్స్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సివిల్స్లో రాణించాలంటే పుస్తకాలు, పేపర్లు, టీవీలు చూడడం, కోచింగ్లకు వెళ్లడం ఎంత ప్రధానమో.. మనం ఎక్కడున్నా అక్కడి విషయూలు పరిగణనలోకి తీసుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణలో అవగాహన కల్పించకపోవడం కారణంగానే తక్కువ మంది సివిల్స్ రాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్స్పై కరీంనగర్లో అవగాహన నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. సమష్టి కృషితో బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. సదస్సుకు హాజరైన పలువురు వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించగా రామచంద్రుడు క్లుప్తంగా సమాధానమిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ కడారు వీరారెడ్డి, కేయూ మాజీ వీసీ లింగమూర్తి, మాజీ డీన్ రవిప్రసాద్, యువ ఐఆర్ఎస్ అనుదీప్, తెలంగాణ యువజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కుడిది శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ గుర్రం వాసు, ఆరు జిల్లాలకు చెందిన 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ఐపీఎస్ కుటుంబం
ఒకే ఇంట్లో ముగ్గురు ఐపీఎస్లు తండ్రి విష్ణువర్థన్ హైదరాబాద్ సదరన్ సెక్టార్ ఐజీ ఏసీపీగా శిక్షణ పొందుతున్న తనయుడు హర్షవర్థన్ తాజాగా ఐపీఎస్కు ఎంపికైన కుమార్తె దీపిక 13 పాఠశాలలు మారినా లక్ష్యం సాధించారు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటేనే కఠోరంగా శ్రమించాల్సిన నేపథ్యంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు ఒకే ఇంటి నుంచి ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న తమ తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని ఆయన కుమారుడు, కుమార్తె కూడా ఐపీఎస్కు ఎంపికై తండ్రికి తగ్గ పిల్లలుగా పేరు తెచ్చుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆముదార్లంక (చల్లపల్లి) : గ్రామానికి చెందిన మండవ విష్ణువర్థన్ ప్రస్తుతం హైదరాబాద్ సదరన్సెక్టార్లో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు హర్షవర్థన్, కుమార్తె దీపిక కూడా ఐపీఎస్కు ఎంపికయ్యారు. వారిని పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు. విష్ణువర్థన్ 1987లో ఐపీఎస్గా ఎంపికై దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైద రాబాద్ సదరన్ సెక్టార్లో కేంద్ర సర్వీసుల విభాగంలో ఐజీగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు హర్షవర్థన్ 2012లో తొలిసారి సివిల్స్రాసి 165వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆయన పశ్చిమఢిల్లీలో ఏసీపీగా శిక్షణ తీసుకుంటున్నారు. కుమార్తె దీపిక 2013లో నిర్వహించిన సివిల్స్లో 135వ ర్యాంకు సాధించి తండ్రికి తగ్గ తనయగా నిరూపించారు. తొలిసారిగానే ఈ ఘనత సాధించి, తన సోదరుడి కంటే ఉత్తమ ర్యాంకు తెచ్చుకున్నారు. ఇంటర్ వరకు బీహార్లో చదివిన దీపిక బిట్స్పిలానీ(రాజస్థాన్)లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం అక్కడే ఎంఎస్సీ, ఎకనామిక్స్ పూర్తి చేసిన ఆమె తొలిప్రయత్నంలోనే సివిల్స్లో ఉత్తమ ర్యాంకు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఆమె రెండేళ్లపాటు ఐపీఎస్ శిక్షణ తీసుకోనున్నారు. 13 పాఠశాలలు మారినా... తండ్రి విష్ణువర్థన్ ఉద్యోగరీత్యా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్పీ, ఐజీగా పనిచేశారు. దీంతో హర్షవర్థన్, దీపిక ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకూ మొత్తం 13 పాఠశాలలు, కళాశాలల్లో చదవాల్సి వచ్చింది. వీరిద్దరూ అన్ని విద్యాసంస్థలు మారినా చదువులో మాత్రం ఎప్పుడూ వెనుకబడలేదు. తొలినుంచి తరగతిలో ప్రథమ స్థానంలోనే ఉన్నారు. తండ్రి స్ఫూర్తితో తాము ఐపీఎస్ సాధించాలనే తపనతో అహ ర్నిశలూ శ్రమించి లక్ష్యాన్ని సాధించారు. సేవాకార్యక్రమాల్లోనూ.. ఉద్యోగరీత్యా విష్ణువర్థన్ ఆముదార్లంకను వదిలి వేరే ప్రాంతానికి వెళ్లినా ఏటా ఆయన కుటుంబ సమేతంగా రెండు, మూడు సార్లు గ్రామానికి వస్తుంటారు. సొంతూరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఐదేళ్ల క్రితం ‘పరివర్తన’ సచ్ఛంద సంస్థ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హర్షవర్థన్ ఈ సంస్థ ద్వారా మిత్రబృందంతో కలిసి ఆముదార్లంక, జువ్వలపాలెం, పెసర్లంకలో రెండేళ్ల క్రితం టెలిమెడిసిన్ విధానం ద్వారా వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఆముదార్లంక, పెసర్లంక, కిష్కిందపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటుచేసి ఈ-తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థానంలో ఉన్నవారితో ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఈ పాఠశాలల్లోని విద్యార్థులకు కౌన్సెలింగ్, సూచనలు, సలహాలు అందించడంతోపాటు నిష్ణాతులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు. తండ్రి స్ఫూర్తి.. తల్లి ప్రోత్సాహం నేను ఐపీఎస్కు ఎంపికయ్యానంటే దానికి మా తండ్రి విష్ణువర్థనే స్ఫూర్తి. నేను ఆడపిల్లనన్న దృష్టితో చూడకుండా మా అమ్మ భవాని ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహించేది. ఎవరైనా ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటే దానిని సాధించే వరకు తపన పడాలి. ఎందులోనూ భయపడకూడదు. ఇంటర్నెట్ వల్ల నేడు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఐపీఎస్ అధికారిగా ప్రజలకు న్యాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటా. - మండవ దీపిక ప్రజల మెప్పు పొందితే మరింత ఆనందం నా పిల్లలిద్దరూ నాలాగానే ఐపీఎస్కు ఎంపికవడంతో ఎంతో సంతోషంగా ఉంది. వారు ప్రజలకు మరింత చేరువై వారికి న్యాయం చేయడం ద్వారా ప్రజల మెప్పు పొందినపుడు మరింత ఆనందంగా కలుగుతుంది. ఏ వ్యక్తీ తమకు తాము తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎన్నోసార్లు అపజయాలు పొందినా, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. - మండవ విష్ణువర్థన్, ఐజీ, సదరన్ సెక్టార్, హైదరాబాద్ ‘పరివర్తన’ ద్వారా మరిన్ని సేవలు గ్రామీణ ప్రాంతంలో ఎందరో మేధావులు ఉన్నారు. గతంలో ఏదైనా సాధించాలంటే గెడైన్స్ పెద్ద సమస్యగా ఉండేది. ఇంటర్నెట్ వచ్చిన తరువాత ఆ సమస్యేలేదు. లక్ష్యాన్ని సాధించాలనుకునే వారు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకుని అహర్నిశలూ కష్టపడాలి. ఉద్యోగ బాధ్యతలతోపాటు ఈ ప్రాంతానికి పరివర్తన స్వచ్ఛంద సంస్థ ద్వారా మరిన్ని సేవలు అందిస్తాం. - మండవ హర్షవర్థన్ -
ఐపీఎస్ల ఖాళీలు... 930
న్యూఢిల్లీ: సివిల్స్ ఆశావహుల్లో ఐఏఎస్ తర్వాత ఎక్కువ మంది కోరుకునే ఐపీఎస్లో దేశవ్యాప్తంగా 930 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ కేడర్కు సంబంధించి 51 ఖాళీలు కూడా ఉన్నాయి. దేశం మొత్తం మీద 4,728 ఐపీఎస్ అధికారుల పోస్టులు ఉండగా, అందులో సీనియర్ అధికారులకు సంబంధించి 930 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఖాళీల్లో 105 ఉత్తరప్రదేశ్కు సంబంధించినవే. ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో 96, ఒడిశాలో 83 ఖాళీలు ఉన్నాయి. ఐపీఎస్ అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ కేడర్లలో ఖాళీలు ఇంకా ఉంటున్నాయని ఆయన చెప్పారు. -
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
చెన్నారావుపేట/మట్టెవాడ : తమ కుమారుడు చదువుకుని ఉన్నత ఉద్యోగం సంపాదిస్తాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యూరుు. ఇద్దరు కొడుకుల్లాగే చిన్న కువూరుడు ఎదుగుతాడని కూలీనాలీ చేసి చదివించిన ఆ తల్లిదండ్రుల కలలు కల్లలయ్యూరుు. సివిల్స్కు ప్రిపేరవుతున్న ఓ యువకుడు మానసిక సమస్యతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగెం మండలం చింతలపల్లి-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట వుండలంలోని ఉప్పరపల్లి గ్రావూనికి చెందిన కందుల కొమురయ్యు, కవులవ్ము దంపతులకు వుుగ్గురు కువూరులు, ఒక కూతురు ఉన్నారు. రజక వృత్తిని చేసుకుంటూనే కువూరులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కువూరుడు వుల్ల య్యు ట్రాన్స్కో ఏడీ గా భూపాల్పల్లిలో పనిచేస్తుండగా, రెండో కువూరుడు ఎల్లస్వామి ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. చిన్నకువూరుడు అశోక్(30) పీజీ పూర్తి చేసి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో తన చిన్న అన్నయ్యు వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. వుంగళవారం సాయుంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి రైలులో బయల్దేరిన అశోక్ అర్ధరాత్రి చింతలపల్లి-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న కేఎం 383/16 మైలు రాయివద్దకు చేరుకున్నాడు. తన వూనసిక స్థితి సరిగ్గా లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అశోక్ వుృతితో గ్రావుంలో విషాద ఛాయులు అలువుుకున్నారుు. కాగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు సీఐ తెలిపారు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్లో తెలుగు సాహిత్యం
సివిల్స్లో తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్గా తీసుకునే వాళ్లు అత్యధిక మార్కులు సాధించాలంటే ఏయే అంశాలను నేర్చుకోవాలి? రెఫరెన్స్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? - పి.అరవింద్ కుమార్, ఉప్పల్ పోటీ పరీక్షల్లో కెమిస్ట్రీ ప్రాధాన్యం ఎంత మేరకు ఉంటుంది? ఏయే పాఠ్యాంశాలు ముఖ్యమైనవి? - కె.స్పందన, అంబర్పేట తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్లు అత్యధిక మార్కులు సాధించాలంటే వ్యాఖ్యానాలపై పట్టు పెంచుకోవాలి. ఎందుకంటే మొత్తం 250 మార్కుల్లో 100 మార్కులకు వ్యాఖ్యానాలు అడుగుతారు. ఈ మార్కులే అభ్యర్థి ర్యాంకును నిర్ణయిస్తాయి. కాబట్టి అభ్యర్థులు పేపర్-2లోని రసము, ధ్వని, వక్రోక్తి లాంటి సౌందర్య సంబంధ అంశాలను ఔపోసాన పట్టాలి. పాఠ్యగ్రంథాలను ప్రత్యక్షంగా చదివి ఉండడం అనివార్యం అని యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అభ్యర్థులు రాసిన వ్యాసరూప సమాధానాలు, వ్యాఖ్యానాల్లో పాఠ్య గ్రంథాలు చదివారనే విషయం ప్రతిబింబించాలి. పేపర్లో ప్రస్తుతం ఛాయిస్లు ఇవ్వడం లేదు. మారిన పేపర్ విధానంతో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. గత పరీక్షల్లో అడగని ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నారు. అభ్యర్థులు ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని అధ్యయనం కొనసాగించాలి. ఉదాహరణకు సోమిదమ్మ పాత్ర చిత్రణ(గుణనిధి కథ) గురించి 2012 సివిల్స్లో అడిగారు. ఈ ప్రశ్నను అప్పటి వరకు నిర్వహించిన ఏ పరీక్షలోనూ అడగలేదు. సిలబస్లో ఉన్న ఎనిమిది కాన్సెప్ట్ల్లో నాలుగు ప్రాచీన, నాలుగు ఆధునిక సాహిత్యానికి సంబంధించినవి. ఇవే కాకుండా మరో 5 నుంచి 6 కళాసౌందర్య అంశాలపై పట్టు సాధించాలి. పాఠ్యగ్రంథాలనే ప్రామాణికంగా తీసుకోవాలి. రిఫరెన్స్ పుస్తకాలు: 1. తెలుగు సాహిత్య సమీక్ష (రెండ సంపుటాలు) - జి.నాగయ్య 2. తెలుగు భాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి 3. తెలుగు భాషా చరిత్ర - వెలమల సిమ్మన్న ఇన్పుట్స్: డాక్టర్ పాతూరి నాగరాజు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ తెలుగు సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 లాంటి పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ విభాగంలో రసాయన శాస్త్రం ఒక ముఖ్యమైన విభాగం. గత నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే రసాయనశాస్త్రం నుంచి ఆరు నుంచి పది ప్రశ్నలు వస్తుండడాన్ని గమనించవచ్చు. వివిధ పాలీమర్లు, ఔషధాలు, పర్యావరణ రసాయనశాస్త్రం, ఆమ్లాలు-క్షారాలు, లోహశాస్త్రం, వివిధ మూలకాల ఉపయోగాలు, హానికర ప్రభావాలు, కేంద్రక రసాయన శాస్త్రం మొదలైన అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయనశాస్త్రం, వివిధ రసాయన పదార్థాల ఫార్మూలాలు వాటి ఉపయోగాలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటి అంశాలను రిపీటెడ్గా చదవాలి. ఈ పాఠ్యాంశాల్లోంచి ఇస్తున్న ప్రశ్నలను గమనిస్తే ఫండమెంటల్స్ పైనే ఎక్కువగా అడగడాన్ని మనం గమనించొచ్చు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుంది. ఇక మూడోది కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలతో ఇమిడి ఉన్న రసాయన శాస్త్రం. ఉదాహరణకు బాక్సైట్ మైనింగ్పై చర్చ జరుగుతున్నప్పుడు ఆ ధాతువు నుంచి సంగ్రహించే లోహం ఏది? అని అడిగారు. కాబట్టి హైస్కూల్ స్థాయి పాఠ్యపుస్తకాలతో పాటు పత్రికల్లో వచ్చే విషయ సంబంధిత వ్యాసాలు, సమకాలీన అంశాలకు సంబంధించిన అంశాలు దృష్టిలో ఉంచుకుని చదివితే రసాయన శాస్త్రంలోని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇన్పుట్స్: డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ, హన్మకొండ. -
సివిల్స్ ప్రిలిమినరీ పాలిటీకి పదిలమైన వ్యూహాలు
దేశంలో జరిగే ప్రతి పోటీ పరీక్షలో ‘ఇండియన్ పాలిటీ (భారత రాజకీయ వ్యవస్థ) పై తప్పనిసరిగా అధిక సంఖ్యలో ప్రశ్నలు ఉంటాయి. అత్యున్నత పరీక్ష అయిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలోని జనరల్ స్టడీస్ పేపర్-1లో పాలిటీ విభాగం ఎంతో ముఖ్యమైంది. దీనిలో సుమారు 16 నుంచి 18 ప్రశ్నలను అడుగుతారు. అందుకే పాలిటీపై సునిశిత దృష్టి సారించడం చాలా అవసరం. విస్తృత పఠనం, తార్కిక విశ్లేషణ, వర్తమాన రాజకీయ అంశాలను, సంఘటనలను రాజ్యాంగపరంగా అన్వయించుకుంటూ అధ్యయనం చేస్తే పాలిటీ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు. సిలబస్ విస్తృతం-సమకాలీన సమన్వయం: పాలిటీ విభాగం మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుంది. సిలబస్లోని ప్రతి అంశం సమకాలీన సంఘటనలతో ముడిపడి గతిశీలతను సంతరించుకొంటుంది. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, హక్కుల సమస్యలు మొదలైన అంశాలను సిలబస్లో ప్రస్తావించారు. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకొన్నప్పుడు సిలబస్ పరిధి చాలా విస్తృతం అవుతుంది. ప్రశ్నల సరళి, స్వభావం, ప్రమాణాలు: ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నలు పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషిస్తే ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా విభజించవచ్చు. 1. విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి (Knowledge based) 2. విషయ అవగాహన (Understanding - Comprehension) 3. విషయ అనువర్తన (Application) మొదటిరకం ప్రశ్నలకు జవాబులు Facts, Figures ఆధారంగా గుర్తించాల్సి ఉంటుంది. చదివి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మాదిరి ప్రశ్న: ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ర్టపతి ఎవరు? a) నీలం సంజీవరెడ్డి b) డా. రాజేంద్రప్రసాద్ c) ఆర్. వెంకట్రామన్ d) ఎవరూ కాదు సమాధానం: a రెండో తరహా ప్రశ్నల్లో సమాచారాన్ని అభ్యర్థి ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు అనేది పరిశీలిస్తారు. మాదిరి ప్రశ్న: రాష్ర్టపతిగా పోటీ చేయాలంటే? a) పార్లమెంటులో సభ్యత్వం ఉండాలి b) లోక్సభలో సభ్యత్వం ఉండాలి c) రాజ్యసభలో సభ్యత్వం ఉండాలి d) ఏ సభలోనూ సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు సమాధానం: d వివిధ పదవులకు పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలపై అవగాహన ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సులభంగా సమాధానం గుర్తించగలుగుతారు. మూడో తరహా ప్రశ్నలు అభ్యర్థి తెలివి, సందర్భానుసార అనువర్తనకు సంబంధించి ఉంటాయి. తన విచక్షణా జ్ఞానంతో సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మాదిరి ప్రశ్న: రాష్ర్టపతికి ఉన్న ఆర్డినెన్స జారీ చేసే అధికారం? a) పార్లమెంట్ శాసనాధికారాలకు సమాంతరం b) పార్లమెంట్ శాసనాధికారాలకు అనుబంధం c) పార్లమెంట్ శాసనాధికారాలకు ప్రతిక్షేపం d) పైవేవీ కాదు సమాధానం: b రాష్ర్టపతి ఆర్డినెన్స అధికారాలకు సంబంధించి సంపూర్ణ అవగాహన,తార్కిక విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నప్పుడే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ తరహా ప్రశ్నలనే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కవగా అడుగుతున్నారు. సిలబస్-అధ్యయనం చేయాల్సిన ముఖ్యాంశాలు రాజ్యాంగ చరిత్ర - రాజ్యాంగ పరిషత్: రాజ్యాంగ చారిత్రక పరిణామం, బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన ముఖ్య సంస్కరణలు, చార్టర్, కౌన్సిల్ చట్టాలు, రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ముఖ్య కమిటీలు, ప్రముఖ సభ్యులు, తీర్మానాలు, రాజ్యాంగ ఆధారాలు వంటి అంశాలపై దృష్టి సారించాలి. మాదిరి ప్రశ్న: భారత రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సరైన అంశం? a) పూర్తిగా పరోక్ష ఎన్నికలు జరిగాయి b) ప్రొవిజనల్ పార్లమెంట్గా పనిచేసింది c) ఏకాభిప్రాయ పద్ధతిలో అంశాలను నిర్ణయించారు d) పైవన్నీ సమాధానం: d ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు: రాజ్యాంగ పునాదులు, తత్వం, లక్ష్యాలు, ప్రాథమిక హక్కులు - రకాలు, ప్రాముఖ్యత, వాటి సవరణలు, విస్తరణ, సుప్రీంకోర్టు తీర్పులు, సమకాలీన వివాదాలు, ఆదేశిక నియమాలతో ప్రతిష్టంభన, తాజా పరిణామాలపై విస్తృత అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మాదిరి ప్రశ్న: రాజ్యాంగంలో అంతర్భాగమైన ఆర్థిక న్యాయాన్ని ఏ భాగంలో ప్రస్తావించారు? a) ప్రవేశిక, ప్రాథమిక హక్కులు b) ప్రవేశిక, ఆదేశిక నియమాలు c) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు d) పైవేవీకాదు సమాధానం:b కేంద్ర ప్రభుత్వం: కార్యనిర్వాహక స్వభావం, రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి ఎన్నిక, తొలగింపు అధికారాలు, ప్రధానమంత్రి, మంత్రి మండలి, సంకీర్ణ రాజకీయాలు, బలహీనపడుతున్న ప్రధానమంత్రి పదవి, పార్లమెంట్ నిర్మాణం, లోక్సభ, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, పార్లమెంట్ ప్రాముఖ్యత- క్షీణత, జవాబుదారీతనం లోపించడం, విప్ల జారీ, పార్టీ ఫిరాయింపుల చట్టం, నేరమయ రాజకీయాలు. సుప్రీంకోర్టు అధికార విధులు, క్రియాశీలత, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ బిల్లు మొదలైన సమకాలీన పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలి. మాదిరి ప్రశ్న: ముఖ్యమంత్రిగా, స్పీకర్గా, రాష్ర్టపతిగా పనిచేసిన వారు? a) నీలం సంజీవరెడ్డి b) జ్ఞానీ జైల్సింగ్ c) సర్వేపల్లి రాధాకృష్ణన్ d) a, b సమాధానం: a మాదిరి ప్రశ్న: కింది వాటిలో 16వ లోక్సభకు సంబంధించి సరైంది? a) అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉంది b) మెజారిటీ సభ్యులు మొదటిసారి ఎన్నికైనవారు c) రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే d) పైవన్నీ సమాధానం: d రాష్ర్ట ప్రభుత్వం: గవర్నర్ నియామకం, అధికార విధులు విచక్షణాధికారాలు - వివాదాలు, ముఖ్యమంత్రి - మంత్రి మండలి, విధానసభ, విధాన పరిషత్, హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. మాదిరి ప్రశ్న: కింది వారిలో ఎవరికి ప్రత్యక్షంగా విచక్షణాధికారాలు ఉన్నట్లుగా రాజ్యాంగంలో పేర్కొనలేదు? a) గవర్నర్ b) రాష్ర్టపతి c) ముఖ్యమంత్రి d) ప్రధానమంత్రి సమాధానం: b కేంద్ర రాష్ర్ట సంబంధాలు: సమాఖ్య స్వభావం, అధికార విభజన, శాసన, పాలన, ఆర్థిక సంబంధాలు, అంతర్రాష్ర్ట మండలి, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, కేంద్ర - రాష్ర్ట సంబంధాల సమీక్షా కమిషన్లు వాటి సిఫారసులను లోతుగా అధ్యయనం చేయాలి. మాదిరి ప్రశ్న: భారత సమాఖ్యలోని ఏకకేంద్ర లక్షణం? a) గవర్నర్ల నియామకం b) అఖిల భారత సర్వీసులు c) అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం d) పైవన్నీ సమాధానం: d స్థానికస్వపరిపాలన-73, 74వ రాజ్యాంగ సవరణలు: ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, చారిత్రక పరిణామం - మేయో, రిప్పన్ తీర్మానాలు, సమాజ వికాస ప్రయోగం - బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్.ఎం. సింఘ్వి కమిటీలు, వాటి సిఫార్సులు; 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు, నూతన పంచాయతీ వ్యవస్థ, పెసా (PESA) చట్టం మొదలైన అంశాలపై పరిపూర్ణ అవగాహన ఉండాలి. మాదిరి ప్రశ్న: షెడ్యూల్డ్ ఏరియాకు వర్తించేందుకు చేసిన పంచాయతీ విస్తరణ చట్టం (PESA) 1996 ముఖ్య ఉద్దేశం? a) గ్రామ పంచాయతీలకు కీలక అధికారాలు b) స్వయంపాలన అందించడం c) సంప్రదాయ హక్కులను గుర్తించడం d) పైవన్నీ సమాధానం: d రాజ్యాంగపరమైన సంస్థలు: ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఇతర చట్టపర కమిషన్ల గురించి సాధికారిక సమాచారాన్ని కలిగి ఉండాలి. మాదిరి ప్రశ్న: కేంద్ర-రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న రాజ్యాంగపర సంస్థ, సంస్థలు? a) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ b) ఆర్థిక సంఘం c) ఎన్నికల సంఘం d) పైవన్నీ సమాధానం: d రాజ్యాంగ సవరణలు: ముఖ్యమైన రాజ్యాంగ సవరణలపై అవగాహన పెంచుకోవాలి. ప్రధానంగా 1, 7, 15, 24, 25, 42, 44, 52, 61, 73, 74, 86, 91, 97, 98వ రాజ్యాంగ సవరణలతోపాటు తాజాగా ప్రతిపాదించిన బిల్లులను గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ విధానాలు హక్కుల సమస్యలు: విధాన నిర్ణయాలు, వాటిని ప్రభావితం చేసే గతిశీలక అంశాలు, అభివృద్ధి, నిర్వాసితులు, పర్యావరణం, ఉద్యమాలు, పౌర సమాజం, మీడియా పాత్ర మొదలైన అంశాలను కూడా చదవాల్సి ఉంటుంది. రీడింగ్ అండ్ రిఫరెన్స బుక్స్ విస్తృత పఠనం/అధ్యయనం తప్పనిసరి. ప్రామాణిక పుస్తకాలను చదవాలి. మార్కెట్లో వ్యాపార ధోరణితో ముద్రించిన పుస్తకాలు, గైడ్లను చదవకూడదు! పునరుక్తి (రిపిటిషన్) అవుతాయి కాబట్టి సమయం వృథా అవుతుంది. ‘రీడింగ్’కు ‘రిఫరెన్సకు’ తేడా గుర్తించాలి. ఒకటి లేదా రెండు ప్రామాణిక పుస్తకాలు చదివితే చాలు. అంశాలను, అవసరాన్ని బట్టి ముఖ్యమైన పుస్తకాలను సంప్రదించాలి. (రిఫరెన్స): విషయ పరిధిని విస్తరించుకోవాలి. - NCERT 10th, 11th, 12th స్థాయి సివిక్స్ పుస్తకాలు - Our parliament, our constitutions our judicialy - National Book Trust Publication - భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ - బి. కృష్ణారెడ్డి, జి.బి.కే. పబ్లికేషన్స - The constitution of India (Bare act) P.M. Bakshi - Introduction to the constitution of India - D.D. Basu - Note: ప్రీవియస్ క్వశ్చన్స సాధన చేయాలి. చాప్టర్ వారీగా టెస్ట్ పేపర్స కూడా సాధన చేయాలి. వీటిని గుర్తుంచుకోండి - జాతీయ స్థాయిలో నిర్వహించే అత్యున్నత పరీక్ష. సుదీర్ఘ ప్రయత్నం, పట్టుదల అనివార్యం. కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండే మనస్తత్వం ఉండాలి. - చదివే అంశంపై స్పష్టత తప్పనిసరి. తార్కికంగా ప్రశ్నించుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. - ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్లను పీరియాడికల్గా రివిజన్ చేస్తూ వాటిని గుర్తుంచుకోవాలి. కొన్ని మెమొరీ టెక్నిక్స్ను కూడా సృష్టించుకోవాలి. - చదవడం ఎంత ముఖ్యమో, చదివిన అంశంపై ఆలోచించడం అంతే ముఖ్యం. - గత ప్రశ్న పత్రాలను విస్తృతంగా సాధన చేయాలి. తద్వారా పరీక్ష ట్రెండ్, ప్రశ్నలస్థాయి తెలుస్తుంది. - నిర్ణీత ప్రణాళిక తయారు చేసుకొని దానికి కట్టుబడి ఉండాలి. - పాలిటీలో సమకాలీన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. - సొంత నోట్స్ తయారు చేసుకోవడం ఉత్తమం - ఆత్రుతతో సిలబస్ పూర్తి చేయొద్దు. ఆకళింపు చేసుకొని, ఎక్కువ పర్యాయాలు పునశ్చరణ చేయాలి. -
మనపై మనకు నమ్మకముంటే ఏదైనా సాధ్యమే!
-
అనుకున్నది సాధించాడు!
గండేడ్: మారుమూల పల్లెలో జన్మించాడు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నాడు.. ఇంటర్, ఇంజినీరింగ్ నగరంలోని ఎస్వీఎంఆర్ కళాశాలలో చదువుకున్న అతను సివిల్స్ను టార్గెట్గా చేసుకున్నాడు.. ఈ క్రమంలో వచ్చిన అనేక ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్నాడు.. చివరకు లక్ష్యం చేరుకున్నాడు.. రెండు రోజుల క్రితం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 885వ ర్యాంకు సాధించాడు. ఆయనే గండేడ్ మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన అనిల్కుమార్. గ్రామానికి చెందిన సుతారి చెన్నకేశవులు, లింగమ్మల కుమారుడు అనిల్. తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. వీరికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అక్కాచెల్లెల్లిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. సివిల్స్నే టార్గెట్ చేసుకున్న అనిల్ ఏడు సార్లు ఐఏఎస్ పరీక్ష రాసి చివరిసారిగా ర్యాంకు సాధించాడు. నగరంలో ఏడాదిపాటు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూనే ప్రిపేర్ అయ్యానని చెప్పాడు అనిల్. స్నేహితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఇప్పుడు సాధించిన ర్యాంకుకు రైల్వే శాఖలో ఉద్యోగం రావొచ్చని, ఏ కేటగిరీలోనైనా ఐఏఎస్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరోమారు అవకాశం ఉంటే మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. మా కల నెరవేరింది మాకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. ఇన్నాళ్లు కుమారుడి గురించి బెంగ ఉండేది. ఇప్పుడది తీరింది. ఐఏఎస్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. -చెన్నకేశవులు, అనిల్ తండ్రి