customer
-
ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్ ఇతనే..
ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్గా లోపలికి అడుగుపెట్టాడు.యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. ఇలాంటి లింక్స్పై క్లిక్ చేయొద్దు
మోసపూరిత సందేశాలను పంపి అమాయక ప్రజలను దోచుకునేవారు ఎక్కువైపోతున్నారు. ఇటీవల ఎస్బీఐ కస్టమర్లను టార్గెట్ చేసుకుని కొందరు ఫ్రాడ్ మెసేజ్లు పంపిస్తున్నారు. దీంతో కస్టమర్లను అప్రమత్తం చేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది.ఎస్బీఐ కస్టమర్లకు వస్తున్న సందేశాలు చట్టబద్దమైనవి కావు. బ్యాంక్ ఎప్పుడూ ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ ద్వారా లింక్స్ లేదా యాప్స్ పైల్స్ పంపదు. కాబట్టి వస్తున్న సందేశాలకు ఎవరూ స్పందించవద్దని వెల్లడించింది.జాగ్రత్తగా ఉండండి, ఎస్బీఐ రివార్డ్లను రీడీమ్ చేయడానికి APK ఫైల్ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయమని మీకు సందేశం కూడా వచ్చిందా జాగ్రత్త ?.. అటాంటి ఫైళ్లను క్లిక్ చేయవద్దు, డౌన్లోడ్ చేయవద్దని ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ట్వీట్ చేసింది.సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్లుప్రియమైన వాల్యూ కస్టమర్, మీ ఎస్బీఐ నెట్బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్ల (రూ.9980.00) గడువు ఈరోజు ముగుస్తుంది. ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ ద్వారా రీడీమ్ చేసుకోండి. మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుందని మెసేజ్ చేస్తున్నారు. ఇది నిజమే అని చాలామంది మోసపోతున్నారు.ఇలాంటి సందేశాలకు మోసపోకుండా ఉండాలంటే?మెసేజ్ ఎవరు పంపించారు అనే విషయాన్ని ఖచ్చితంగా ధ్రువీకరించండి. నిజంగానే బ్యాంక్ నుంచి సందేశం వచ్చిందా? అని తెలుసుకోవాలి.తెలియని లింక్లపై క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేయడం వంటివి మానుకోవాలి.మీ బ్యాంక్ నుంచి అనుమానాస్పద సందేశాన్ని స్వీకరించినట్లయితే.. అధికారిక వెబ్సైట్ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి.బ్యాంకుకు సంబంధించిన అధికారిక యాప్స్ లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే లావాదేవీలను జరపండి.ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత, ఆర్థిక సంబంధిత లాగిన్ వివరాలను పంచుకోవద్దు.ఏవైనా అనుమానాస్పద సందేశాలు లేదా ఫిషింగ్ ప్రయత్నాల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయాలి.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/GhheIEkuXp— PIB Fact Check (@PIBFactCheck) July 31, 2024 -
‘ఉబర్’ రైడ్కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
మరీ ఇంత మోసమా? ఐఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్..
ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువులు కొన్ని సందర్భాల్లో మారిపోతూ ఉంటాయి. ఒక వస్తువు బుక్ చేస్తే.. మరో వస్తువు డెలివరీ అయిన సందర్భాలు చాలానే వున్నాయి. ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అమెజాన్లో ఒక ఐఫోన్ 15 ఆర్డర్ చేశారు. అయితే అతనికి డెలివరీ అయిన ఫోన్ను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే అతనికి వచ్చిన ఫోన్ నకిలీది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. వావ్ అమెజాన్ ఇన్.. ఒక నకిలీ ఐఫోన్ 15ని డెలివరీ చేసింది. బాక్స్లో కేబుల్ కూడా లేదు. మొత్తం డబ్బా, ఇలాంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొన్నారా? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ రెస్పాండ్ అవుతున్నారు. ఈ సంఘటనపైన అమెజాన్ స్పందించి ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి, ఆర్డర్ వివరాలను తెలియజేస్తే.. 6 నుంచి 12 గంటల్లో మీకు తప్పకుండా సహాయం చేస్తామని వెల్లడించింది. ఐఫోన్ కోసం వెచ్చించిన మొత్తాన్ని రీఫండ్ చేయమని బాధితుడు అమెజాన్ను కోరారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే? Waah @amazonIN delivered a Fake iPhone 15. Seller is Appario. Tagged with “Amazon choice” No cable in the box. Total Dabba. Has anyone faced similar issue? pic.twitter.com/QjUqR7dKSU — Gabbar (@GabbbarSingh) February 23, 2024 -
చెప్పిన మైలేజీ రాలేదు.. కంపెనీకి షాకిచ్చిన కస్టమర్
ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఓ కస్టమర్. తాను కొన్నకారుకు కంపెనీ చెప్పిన మైలేజీ రాలేదని వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ కస్టమర్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కస్టమర్కు రూ. లక్ష చెల్లించాలని కంపెనీని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. వివరాలోకి వెళ్తే.. 2004లో రాజీవ్ శర్మ అనే కస్టమర్ లీటరుకు 16-18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్న ప్రకటనలతో ఆకర్షితుడై మారుతీ సుజుకీ కారును కొనుగోలు చేశారు. తీరా కొన్న తర్వాత ఆ కారు లీటరుకు 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజీ ఇస్తుండటంతో అసంతృప్తి చెందిన రాజీవ్ శర్మ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ను ఆశ్రయించారు. రూ.4 లక్షల మొత్తాన్ని వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమాతో సహా కంపెనీ నుంచి ఇప్పించాలని కోరారు. కస్టమర్ అభ్యర్థనను కొంతమేరకు పరగణనలోకి తీసుకున్న జిల్లా ఫోరమ్ రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై మారుతీ సుజుకీ రాష్ట్ర కమిషన్కి అప్పీల్కు వెళ్లింది. అలా కేసు ఎన్సీడీఆర్సీకి చేరింది. ఇరు పక్షాలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాయి. శర్మ తన వాదనను ఆగస్టు 7, 2023న సమర్పించగా, మారుతి సుజుకి నవంబర్ 2, 2023న స్పందించింది. మారుతీ సుజుకి ప్రకటన మైలేజ్ క్లెయిమ్లు తప్పుదారి పట్టించేవిగా, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) మునుపటి తీర్పులను సమర్థించింది. కస్టమర్కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు షాకిచ్చింది. తాజా రివ్యూలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక వడ్డరీట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బెంచ్మార్క్ లెండింగ్ రేట్లను సైలెంట్గా పెంచేసింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) గరిష్టంగా 10 పాయింట్ల బేసిస్ పాయింట్ల వరకు పెంచింది బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్మార్క్ PLR 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్) తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్ నైట్ రుణాలపై MCLR 10 bps 8.50 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది. నెల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెరిగి 8.55 శాతం నుండి 8.65 శాతానిచేరింది మూడు నెలల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.85 శాతంగా ఉంటుంది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 9.05 శాతం నుంచి 9.10కి పెంచింది. ఇక ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.20 శాతంగానూ, రెండేళ్ల కాలానికి గాను 9.20గాన ఉంటుంది. అదే మూడేళ్ల వ్యవధి రుణాలపై వర్తించే ఎంసీఎల్ఆర్ 9.25 శాతంగా ఉంటుంది. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
ఆన్లైన్ షాపింగ్ వైపు .. కొత్త తరం చూపు
కొత్త తరం కస్టమర్లు (11–26 ఏళ్ల వయస్సువారు– జెన్ జీ) కొనుగోళ్ల కోసం భారీగా ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యాషన్ ఇండియా వీపీ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెగ్మెంట్లలో కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తిగా ఉంటున్నట్లు ఆయన వివరించారు. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్లో ప్రివ్యూ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి ఫ్యాషన్, బ్యూటీకి ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుండగా మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు ఆల్టైమ్ ఫేవరెట్స్గా ఉంటున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ఈసారి ఏజీఐఎఫ్లో అమ్మకాలు కొత్త గరిష్ట స్థాయిని తాకగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాబోయే పండుగ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం వరకు వృద్ధి చెంది రూ. 90,000 కోట్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది.. రెస్టారెంట్లన్నీ..
రెస్టారెంట్లన్నీ సాధారణంగా కస్టమర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటిని ఇస్తుంది. మహా అయితే ప్రత్యేకంగా ఉండేందుకు మరింత హంగులు ఆర్భాటాలతో కస్టమర్లని ఆకర్షించే యత్నం చేస్తాయి అంత వరకే. కానీ దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరం ఉన్న కస్టమర్ల సంగతిని గుర్తించవు అనలా లేక పరిగణించరు అని చెప్పాలో తెలియదు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవాళ్ల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి వాళ్లు రెస్టారెంట్కి వచ్చి.. మెను చూసి ఆర్డర్ ఇవ్వాలంటే మరొకరి సాయం తీసుకోవాల్సిందే. లేదా వారు ఫ్రెండ్స్నో, బంధువులనో తోడు తెచ్చుకోవాల్సిందే. ఇంతవరకు ఎవ్వరికీ.. వారు కూడా మెనుని చూసి ఆర్డర్ చేసుకుంటే బావుంటుంది అనే ఆలోచనే రాలేదు. ఆ దిశగా అడుగులు వేయాలేదు . కానీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా అడుగులు వేసి ఆచరణలోకి తీసుకొచ్చి చూపింది. ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. ఇండోర్లోని గురుకృపా రెస్టారెంట్ దృష్టిలోపం ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. వారు కూడా స్వయంగా మెను చూసి ఆర్డర్ చేసుకుని తిసేలా చేసింది ఆ రెస్టారెంట్. మహేష్ దృష్టిహీన్ కళ్యాణ సంఘ నుంచి కొంతమంది దృష్టిలోపం ఉన్న పిల్లలను రెస్టారెంట్కి ఆహ్వానించారు. బ్రెయిలీ లిపిలో చెక్కబడిన మెనూ కార్డ్ సాయంతో ఆ పిల్లలంతా తమ ఆర్డర్లను స్వయంగా వారే తెప్పించుకుని తిన్నారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతమంది రెస్టారెంట్ ఆపరేటర్లు కలిసిన తర్వాత ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియన్ గ్రూప్ చైర్పర్సన్ భావన గనేదివాల్ మాట్లాడుతూ..అన్ని రెస్టారెంట్లవారు ఇలా చేసేలా పురికొల్పేందుకు మహేష్ దృష్టిహీన్ కళ్యాణ్ సంఘ్ నుంచి దృష్టి లోపం ఉన్న పిల్లలను పిలిపించి ట్రయల్ వేశాం. అది నిజంగా సక్సెస్ అయ్యింది. వారికోసం ఈ బ్రెయిలీ లిపి మెను కార్డ్లను చండీగఢ్ నుంచి తెప్పించి. అలాంటి పది కార్డ్లను ఇతర రెస్టారెంట్లకు పంపుతాం. ఇక నుంచి రెస్టారెంట్లన్నీంటిలో ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ మెనూ కార్డ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్ని ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలనుకుంటున్నాం. రెస్టారెంట్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు దృష్టిలోపం ఉన్న కస్టమర్లు ఇక ఇబ్బంది పడరు, పైగా ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. అని చెప్పుకొచ్చారు భావన గనేదివాల్. ఇక సదరు గురుకృపా రెస్టారెంట్ యజమాని సిమ్రాన్ భాటియా మాట్లాడుతూ.. యంగ్ ఇండియా గ్రూప్ మమ్మల్ని సంప్రదించి బ్రెయిలీ లిపిలో మెను కార్డ్లను తయారు చేయమని అడిగింది. ఇది మాకు కొత్తగా అనిపించినా.. నచ్చింది. ఇంతవరకు అలాంటి సౌకర్యం ఏ రెస్టారెంట్లలోనూ లేదు. పిల్లలంతా అలా బ్రెయిలీ లిపి మెను కార్డులను చూసి ఆర్డర్ చేసినప్పుడూ చాలా ఆనందంగా అనిపించిందన్నారు రెస్టారెంట్ యజమాని భాటియా. అలాగే దృష్టిలోపం పిల్లలు సైతం తాము మెను కార్డ్ని చదవి ఆర్డర్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. ఇది తమకి ఎవ్వరిపై ఆధారపడటం లేదన్న ఫీలింగ్ని ఇచ్చిందన్నారు. అందరికీ ఇలాంటి సౌకర్యం అందాలని కోరుకుంటున్నారు. ఏదీఏమైన ఇలాంటి ఆలోచన రావడమే గ్రేట్ అనుకున్నదే తడువుగా ఆచరించి చూపడం ఇంకా గ్రేట్ కదూ!. (చదవండి: వాట్! ఈజిప్టు మమ్మీ నుంచి పరిమిళాలు వెదజల్లే "సెంట్"! షాకింగ్ విషయాలు వెల్లండించిన శాస్త్రవేత్తలు!) -
దోపిడీకి వచ్చి, అందరినీ చూసి.. ‘ఇదేందిది’ అంటూ తోక ముడిచిన దొంగ!
ఏదైనా దుకాణం లేదా స్టోర్లో లూటీ జరినప్పుడు అక్కడ అలజడి నెలకొంటుంది. లేదా ఆగంతకుడి చేతిలో ఆయుధం ఉంటే ఆ ప్రాంతంలో మౌనం నెలకొంటుంది. అయితే ఇటీవల అట్లాంటాలో దీనికి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఒక నెయిల్ సెలూన్లో లూటీ చేసేందుకు వచ్చిన ఆగంతకుని ఎటువంటి పరిస్థితి ఎదురయ్యిందంటే.. దానిని ఎవరూ ఊహించలేరు. ఈ లూటీకి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దానిని చూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు. నెయిల్ సెలూన్లోని సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నదాని ప్రకారం అక్కడి సిబ్బంది కస్టమర్లకు సర్వీస్ చేస్తున్నారు. ఇంతలో ఒక ఆగంతకుడు అరుచుకుంటూ నెయిల్ సెలూన్లోకి ప్రవేశించి.. ‘అందరూ కింద కూర్చుని, నోరుమూసుకుని మీ దగ్గరున్న సొమ్ము ఇవ్వండి’ అని డిమాండ్ చేశాడు. ఆ ఆగంతకుని చేతిలో ఒక బ్యాగు ఉంది. దానిలో ఆ ఆగంతకుడు చేతులు పెట్టి, దీనిలో ఒక తుపాకీ ఉంది. బయటకు తీసి ఎవరినైనా కాల్చేస్తానని బెదిరించాడు. అయితే ఆగంతకుని అరుపులకు, బెదిరింపులకు అక్కడున్న ఎవరూ కించిత్తు కూడా భయపడలేదు. వారంతా ఎంతో రిలాక్స్ అవుతూ, ఫోను చూసుకుంటూ కూర్చున్నారు. అక్కడున్నవారంతా ఈ విధంగా ప్రవర్తిస్తారని ఆ ఆగంతకుడు అస్సలు ఊహించలేదు. చివరికి సెలూన్ యజమాని కూడా ఏ మాత్రం స్పందించకపోవడాన్ని ఆ ఆగంతకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇంతలో ఒక మహిళ తన ఫోనును బయటకు తీయగా, ఆ ఆగంతకుడు దానిని లాక్కున్నాడు. అయితే ఆమె ఏమాత్రం రియాక్ట్ అవకుండా మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సెలూన్లో ఉన్న పరిస్థితులను చూసి ఆ ఆగంతకుడు ఉత్త చేతులతోనే బయటకు జారుకున్నాడు. ఆ సెలూన్ రెగ్యులర్ కస్టమర్ లీజా బోరె మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో సెలూన్ యజమాని కొద్దిగా భయపడ్డాడని, వినియోగదారులెవరూ స్పందించలేదని, దీంతో ఆ దొంగ పారిపోయాడని తెలిపారు. ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది? -
ఫుడ్ కోసం వెయిటింగ్.. కస్టమర్కు షాకిచ్చిన డెలివరీ బాయ్.. ఇంత లేజీగా ఉన్నావేంటి!
ఇంట్లో ఎన్ని వెరైటీ వంటకాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రెస్టారెంట్లలో పుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ పుణమ్యా అని ఆన్లైన్ డెలివరీ యాప్లు రాకతో చేతిలో మొబైల్ ఉంటే చాలు నచ్చిన పుడ్ ఇంటి దగ్గరకే డోర్ డెలివరీ అవుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఇందులో మరో కోణం కూడా దాగుంది. వివిధ కారణాలతో డెలివరీ ఏజెంట్లు కస్టమర్లు ఆర్డర్ పెట్టిన ఆహారాన్ని అందివ్వడంతో విఫలమవుతున్నారు. అలా జరిగినప్పుడు, వారు తరచుగా సాకులు చెబుతారు. మరో విషయం ఏమిటంటే.. కొన్ని సందర్భాల్లో డెలివరీ ఏజెంట్లు కస్టమర్ల ఆహారాన్ని స్వయంగా తింటున్నారు కూడా. తాజాగా ఈ తరహా ఘటనే సోషల్మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన పిల్లల కోసం ఆన్లైన్లో పుడ్ ఆర్డర్ పెట్టి ఎదురుచూస్తుంటాడు. డెలివరీ సమయం సమీపిస్తున్న ఆహారం రాకపోవడంతో డెలివరీ ఏజెంట్కి ఈ విషయమై మెసేజ్ చేస్తాడు. ఆ సంభాషణలో.. సారీ బ్రదర్ మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ని నేనే తిన్నట్లు కస్టమర్కు మెసేజ్ చేస్తాడు. దీంతో రూల్స్ ఉల్లంఘించినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఏజెంట్కు కస్టమర్ మెసేజ్ చేశాడు. అందుకు ఏజెంట్ వెటకారంగా స్పందిస్తూ, "మీరు దానిని నిరూపించలేరు, మిత్రమా అంటూ బదులిచ్చాడు. డెలివరీ ఏజెంట్ తమ హౌసింగ్ కాంప్లెక్స్లోకి ప్రవేశించలేదని నిరూపించడానికి తమ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొంటాడు కస్టమర్. అయితే, ఏజెంట్ కస్టమర్ను ఫుడ్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావ్ ఇంత సోమరిగా ఉన్నావేంటి అని పిలవడంతో వీరి మధ్య సంభాషణ కాస్త సీరియస్గా మారింది. చివరిలో ఆ డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారం అద్భుతంగా ఉందని, అతను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తిన్నానని నిర్ధారిస్తూ సంభాషణను ముగించాడు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు డెలివరీ ఏజెంట్ చేసిన పనికి మండిపడుతున్నారు. చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు -
కస్టమర్ల ఫోన్ నంబర్లు తీసుకోవద్దు..రీటైల్ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: మొబైల్ నంబరు ఇవ్వని కస్టమర్లకు రిటైలర్లు సర్వీసులు, రిఫండ్లను నిరాకరిస్తున్న ఉదంతాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇటువంటి విధానాలను మానుకునేలా తమ తమ పరిధిలోని రిటైలర్లను కట్టడి చేయాలని పరిశ్రమల సమాఖ్యలకు సూచించింది. ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే సమయంలో కస్టమర్ల సమ్మతి లేకుండా వారి మొబైల్ నంబర్లు తీసుకోకుండా చూడాలని పేర్కొంది. సీఐఐ, ఫిక్కీ, అసోచాం, పీహెచ్డీసీసీఐ, రిటైలర్ల అసోసియేషన్ ఆర్ఏఐ, అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు లేఖ రాశారు. ఉత్పత్తి లేదా సర్వీసు కొనుగోలుకు వినియోగదారు తన మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయొద్దని సూచించారు. ‘మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయడం వల్ల పలు సందర్భాల్లో కస్టమర్లు తమ అభీష్టానికి విరుద్ధంగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాత నుంచి వారికి రిటైలర్లు అసంఖ్యాకంగా మార్కెటింగ్, ప్రమోషనల్ సందేశాలు పంపిస్తుండటం సమస్యాత్మకంగా ఉంటోంది‘ అని సింగ్ పేర్కొన్నారు. విక్రయ సమయంలో.. కస్టమరుకు ఇష్టం లేకపోయినా, మొబైల్ నంబరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం అనేది వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్ నంబరు ఇవ్వలేదన్న కారణంతో వినియోగదారుకు విక్రయించకపోవడం, రిటర్నులు .. ఎక్ఛేంజీలు .. రిఫండ్లను అనుమతించకపోవడం లేదా వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించకపోవడం అనేవి అనుచిత వ్యాపార విధానాల కిందికే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమాఖ్యలు సహకరించి, రిటైలర్లకు తగు సూచనలను ఇవ్వాలని పేర్కొన్నారు. -
Swiggy: స్విగ్గీ నిర్వాకం.. వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. మండిపడ్డ కస్టమర్
స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ శాకాహారికి చేదు అనుభవం ఎదురైంది. పార్సిల్ ఓపెన్ చేసి తింటున్న ఆమెకు ఊహించని విధంగా బిర్యానీలో చికెన్ ముక్క కన్పించింది. దీంతో స్వచ్ఛమైన వెజిటేరియన్ అయిన ఆమె.. స్విగ్గీ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిర్యానీలో మాంసం ముక్క ఫొటో, ఆర్డర్ బిల్లు వంటి వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మండిపడింది. ఈ కస్టమర్ పేరు నటాషా భరద్వాజ్. తన విశ్వాసాలకు విఘాతం కల్గించేలా చేసిన స్విగ్గీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదన్నారు. నిజమైన శాకాహారులు స్విగ్గీలో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని ఇతర కస్టమర్లకు సూచించారు. If you’re a strict vegetarian (like me) think twice before ordering from @Swiggy ! I ordered biriyani rice with aloo which is clearly MARKED AS VEGETARIAN on the platform and I found a piece of meat (could be chicken, mutton or anything!) in the rice. Such grave errors are… pic.twitter.com/h7K57CPML4 — Natasha Bhardwaj (@bhardwajnat) April 11, 2023 ఈ విషయంపై స్విగ్గీ ఎగ్జిక్యూటివ్స్కు ఫిర్యాదు చేస్తే వారికి అసలు బాధగా లేదని నటాషా అసహనం వ్యక్తం చేశారు. అది నాన్ వెజ్ రెస్టారెంట్ అని, అయినా స్విగ్గీలో వెజ్ రెస్టారెంట్గా ఎందుకు మార్క్ చేసుకున్నారో తెలియడం లేదని వారు బదులిచ్చారని చెప్పారు. ఈ మహిళ ట్వీట్కు స్విగ్గీ కూడా బదులిచ్చింది. మా రెస్టారెంట్లలో ఇలాంటి మిక్స్ప్లు జరుతాయని ఊహించలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆర్డర్ ఐడీ చెప్పాలని సూచించింది. దీంతో మహిళ ఆర్డర్ ఐడీని కూడా స్విగ్గీకి షేర్ చేసింది. చదవండి: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు.. మరో 7,830 మందికి పాజిటివ్.. -
ఉబర్ డ్రైవర్ ఔదార్యం! అపరిచిత ప్రయాణికుడి కోసం..
మనకు తెలియని వ్యక్తి కనీసం రూ. 10 ఇవ్వాలన్న ఆలోచిస్తాం. అలాంటి ఎవరో తెలియని వ్యక్తికి ఏకంగా ఒక అవయవాన్నే దానం చేయడం అంటే వామ్మో అని పిస్తుంది కదా. ఔను ఇక్కడొక ఉబర్ డ్రైవర్ అలానే చేశాడు. ఆ వ్యక్తి డ్రైవర్కి తెలియదు. తను డ్రాప్ చేయాల్సిన కస్టమర్ మాత్రమే. వివరాల్లోకెళ్తే..యూఎస్కి చెందిన బిల్ సుమీల్ అనే వ్యక్తి డయాలసిస్ సెంటర్కి వెళ్లాలని ఉబర్ బుక్ చేసుకున్నాడు. ఇంతలో తనని పికప్ చేసుకునేందుకు కారు వచ్చింది. బిల్ సుమీల్ ఆ కారులో ప్రయాణిస్తూ డ్రైవర్ టిమ్ లెట్స్తో మాటలు కలిపాడు. తన గురించి, తన అనారోగ్యం గురించి డ్రైవర్తో పంచుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణం ముగిసి గమ్యస్థానానికి చేరుకోగానే.. సదరు ఉబర్ డ్రైవర్ టిమ్ తన కిడ్నిని సుమీల్కి దానం చేసేందుకు రెడీ అయ్యాడు. విచిత్రంగా అతడి కిడ్నీ సుమీల్కి సూట్ అయ్యింది. బహుశా దేవుడు ఇందుకోసమే మిమ్మల్ని నా కారులో వచ్చేలా చేశాడని డ్రైవర్ టిమ్ సుమీల్కి చెప్పాడు కూడా. కిడ్నీ బదిలీ కోసం సుమీల్కి ఆపరేషన్ చేశారు. అది విజయవంతమయ్యింది. ఆ తర్వాత నుంచి ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అయితే సుమీల్ డెలావేర్ యూనివర్సిటీ మూత్రపిండ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నాడు. ఉబర్ డ్రైవర్ టిమ్ లైట్స్ జర్మనీలో నివశిస్తున్నాడు. అయితే ఇద్దరూ టచ్లోనే ఉన్నారని తమ స్నేహాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అందుకు సంబంధించిన కథనాన్ని ఇన్స్టాగ్రాంలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆ ఉబర్ డ్రైవర్ ఔదార్యానికి ఫిదా అవుతూ పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: విమానంలో అనౌన్సర్గా బీజేపీ ఎంపీ..షాక్లో ప్రయాణికులు) -
జొమాటో యాప్ ద్వారా బుకింగ్, డెలివరీ గంటైనా రాకపోవడంతో..
యశవంతపుర: జొమాటో యాప్ ద్వారా బుక్ చేసిన భోజనం సమయానికి రాకపోవడంతో ఓ వ్యక్తి కేసు వేయగా రూ. 3 వేల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం జొమాటోను ఆదేశించింది. బెంగళూరు రాజాజీనగరలో 2022 ఏప్రిల్ 14న రాత్రి అభిషేక్ అనే వ్యక్తి యాప్ ద్వారా భోజనం ఆర్డర్ చేశాడు. గంట సేపైనా భోజనం అందలేదు. దీంతో ఆర్డర్ క్యాన్సిల్ చేయగా, డబ్బు కూడా వాపస్ రాలేదు. ఈ బాగోతంపై బాధితుడు శాంతినగరంలోని వినియోగదారుల ఫోరంలో రూ. లక్ష పరిహారం ఇప్పించాలని కేసు వేశాడు. విచారణ జరిపిన ఫోరం.. రూ. 3 వేల పరిహారాన్ని అర్జీదారుకు అందజేయాలని జొమాటోను ఆదేశించింది. చదవండి: వచ్చేస్తోంది, మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ విడుదల ఎప్పుడంటే? -
కస్టమర్ కంప్లైంట్.. ఫ్లిప్కార్ట్కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం!
ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్కార్ట్కు వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. ఓ యూజర్ డబ్బులు చెల్లించినా మొబైల్ డెలివరీ చేయనందుకు రూ. 42,000 జరిమానా చెల్లించాలని బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఫ్లిప్కార్ట్కు జరిమానా విధించింది. అందులో కస్టమర్ పేమెంట్ చేసిన రూ. 12,499 లకు 12 శాతం వార్షిక వడ్డీ, రూ. 20,000 జరిమానా, చట్టపరమైన ఖర్చుల కోసం రూ. 10,000 చెల్లించాలని అధికార యంత్రాంగం తెలిపింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని రాజాజీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యూజర్ ఫ్లిప్కార్ట్పై ఫిర్యాదు చేశారు. ‘తాను జనవరి 15, 2022న మొబైల్ని బుక్ చేసుకున్నాను. వెబ్సైట్లో పేర్కొన్న విధంగా పూర్తి నగదుని చెల్లించి రోజులు గడుస్తున్నా కంపెనీ తనకు మొబైల్ డెలివరీ చేయలేదు. సర్వీసు విషయంలో ఫ్లిప్కార్ట్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఫిర్యాదులో ’పేర్కొంది. కస్టమర్ కేర్ సెంటర్కు ఎన్ని సార్లు కాల్ చేసినా ఫలితం లేకపోయేసరికి చివరికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపింది. చదవండి: కస్టమర్లకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ! -
హోండా కార్లకు ఐడీబీఐ బ్యాంక్ రుణాలు
హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా ఐడీబీఐ బ్యాంక్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హోండా కార్స్ కస్టమర్లకు సులభ రుణ పథకాలను ఐడీబీఐ బ్యాంక్ ఆఫర్ చేయనుంది. అందుబాటు ధరలకే, వేగంగా, సులభంగా రుణాలను కస్టమర్లు పొందొచ్చని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, నామమాత్రపు ప్రాసెసింగ్ చార్జీలపై రుణాలు అందిస్తున్నట్టు తెలిపాయి. చదవండి: రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ -
కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగానికి చెక్.. ఇకపై అలాంటివి కుదరదు!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డేటా రక్షణ బిల్లుతో కస్టమర్ డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధమైన యూజర్ల లొకేషన్ ట్రాకింగ్ వివాదానికి సంబంధించిన కేసును టెక్ దిగ్గజం గూగుల్ సెటిల్ చేసుకున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లొకేషన్ ట్రాకింగ్ సిస్టం నుండి వైదొలిగినప్పటికీ యూజర్లను తప్పు దోవ పట్టించి, వారి లొకేషన్ను ట్రాక్ చేయడాన్ని కొనసాగించిందంటూ గూగుల్పై కేసు నమోదైంది. దీన్ని 392 మిలియన్ డాలర్లకు గూగుల్ సెటిల్ చేసుకుంది. ఇలా కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగం కాకుండా డేటా రక్షణ బిల్లు పటిష్టంగా ఉంటుందని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో లోక్సభలో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం మరింత బలమైన నిబంధనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
రూ.75,000 కోట్లకు చేరుకున్న సెక్యూరిటైజేషన్
ముంబై: సెక్యూరిటైజేషన్ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 48 శాతం పెరిగి రూ.75,000 కోట్లకు చేరుకున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఇన్వెస్టర్లు (బ్యాంకులు/ఆర్థిక సంస్థలు) రిటైల్ రుణాల పట్ల నమ్మకం చూపించడం ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. సెక్యూరిటైజేషన్ అంటే ఒక రుణదాత ఒక రుణంపై భవిష్యత్తులో తనకు వసూలు కావాల్సిన మొత్తాలను కొంత తక్కువకు వేరే రుణదాతకు విక్రయించడం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కరోనా రెండో విడత వల్ల సెక్యూరిటైజేషన్ మార్కెట్ ప్రతికూలతలను చూసి నట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. అయతే, ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులకు కొంత వెనుకాడడం వల్ల కొన్ని డీల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి అర్ధభాగంలో పూర్తి కాలేదని వెల్లడించింది. మార్ట్గేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ రుణాలు అతిపెద్ద వాటా కలిగి ఉన్నాయి. మార్కెట్ పరిమాణంలో 40%గా ఉన్నాయి. దీని తర్వాత వాణిజ్య వాహన రుణాలు 30%, సూక్ష్మ రుణాల వాటా 13% చొప్పున ఉంది. మార్ట్గేజ్, బంగారం, సూక్ష్మరుణాల వాటా కలిపి 62 శాతంగా ఉంది. పాస్ త్రూ సర్టిఫికెట్ల (పీటీసీలు) వాటా ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 44 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది. సెక్యూరిటైజేషన్ మార్కెట్లో సగం మేర రుణాలను ప్రైవేటు బ్యాంకులు సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు పావు వంతు కొనుగోలు చేశాయి. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
సాంబార్ లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావనడంతో..
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీలోకి సాంబార్ అడిగినందుకు ఓ కస్టమర్పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడిచేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాపూర్నగర్ రంగాభుజంగా సినిమా థియేటర్కు ఎదరుగా ఉన్న గోకుల్ టిఫిన్ సెంటర్కు సోమవారం ఉదయం ఉపేందర్రెడ్డి అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి టిఫిన్ చేసేందుకు వచ్చి ఇడ్లీ తీసుకున్నారు. అనంతరం ఇడ్లీలోకి సాంబార్ కావాలని హోటల్ సిబ్బందిని కోరగా వారు లేదంటూ సమాధానం చెప్పడంతో సాంబారు లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావంటూ ఉపేందర్రెడ్డి సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ విషయంలో ఉపేందర్రెడ్డి, హోటల్ సిబ్బందికి మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో హోటల్ పనిచేస్తున్న కాలీదాస్ అనే వ్యక్తి పూరిచేసే కర్రతో దాడిచేసి ఇద్దరిని గాయపరిచాడు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం ఉపేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్ట్యాక్స్ రద్దు -
ప్చ్..అధ్వాన్నంగా భారతీయ బ్యాంకుల్లో మొబైల్ యాప్స్ సేవలు!
భారత్కు చెందిన బ్యాంకులు కస్టమర్లకు మొబైల్ సర్వీసుల్ని అందించడంలో విఫలమవుతున్నాయి. కస్టమర్ల ఖర్చుల్ని, అప్పుల్ని అర్థం చేసుకోవడం, ఉపయోగకరమైన బడ్జెట్లను రూపొందించడం, ఆర్ధిక వృద్ధి సాధించేలా సలహాలు ఇవ్వడం, వారి ఆర్థిక స్థితుల్ని ట్రాక్ చేయడంలో బ్యాంకుల పనితీరు సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఫర్ రెస్టర్..మనీ మేనేజ్మెంట్ సామర్థ్యాలలో దేశీయ బ్యాంకులకు అత్యల్ప స్కోర్ను ఇచ్చింది. తాజా క్యూ3లో మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు అందించే ఏ బ్యాంక్కు కూడా 60శాతం మించి స్కోర్ ఇవ్వలేదు. అందుకు కారణం బ్యాంకులు కస్టమర్లకు అందించే సర్వీసులపై అసంతృప్తి వ్యక్తం చేయడమేనని తెలుస్తోంది. బ్యాంకుల్లో నావిగేషన్ బాగున్నప్పటికీ యాప్స్లో సెర్చ్ బార్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ముఖ్యంగా వినియోగదారులు చేసిన ట్రాన్సాక్షన్లను గుర్తించేలా యాప్లో సులభమైన పద్దతులు లేవని ఫర్ రెస్టర్ తెలిపింది. దీంతో పాటు బ్యాంకులు గోప్యతా విధానాన్ని ప్రదర్శిస్తున్నాయి. వారి సమస్యల పరిష్కారం కోసం బ్యాంకులు పబ్లిష్ చేసే ఆర్టికల్స్ సామాన్యులకు అర్ధం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. "చాలా బ్యాంకులు యాప్స్ను బిల్డ్ చేయడంలో రాజీ పడడం లేదు. మంచి విషయమే. మొబైల్ బ్యాకింగ్ వ్యవస్థతో యూజర్లకు ఉపయోగం, సులభంగా ఉంటుంది. తద్వారా బ్యాంకుల్ని వినియోగించేందుకు మక్కువ చూపుతారని పేర్కొంది. -
నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్: ఓలాకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు ఎదురు దెబ్బ తగిలింది. ఒక కస్టమర్ నుంచి ఎక్కువ చార్జీ వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. హైదరాబాద్కు చెందిన బాధితుడు జబేజ్ శామ్యూల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కోర్టు నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్ కారణంగా మొత్తం రూ. 95,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ఓలా క్యాబ్స్ నుండి పరిహారం కోరుతూ ఫిర్యాదు దారు జబేజ్ శామ్యూల్ 2021, అక్టోబరు 19న నాలుగు గంటలకు ఓలా క్యాప్ బుక్ చేసుకున్నాడు. భార్య, మరొకరితో కలిసి క్యాబ్ ఎక్కినపుడు అంతా డర్టీగా కనిపించింది. ఏసీ ఆన్ చేయమన్నా, డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాదు నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శామ్యూల్ని మధ్యలోనే దింపేశాడు. దీనిపై ఓలాను సంప్రదించినప్పటికీ ఫలితం కనబడలేదు. పైగా రూ. 861 ఫీజు చెల్లించాల్సిందిగా పదేపదే కోరడంతో విసిగిపోయిన కస్టమరు దాన్ని చెల్లించారు. (భారీ నష్టాలు: సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం) దీంతో హతాశుడైన శామ్యూల్ వినియోగదారుల చట్టం సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ - III ను ఆశ్రయించారు. దాదాపు రూ.5 లక్షల పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు. దీన్ని విచారించిన కోర్టు 5 లక్షల అంటే, చాలా పెద్ద మొత్తం అని అభిప్రాయపడినకోర్టు, ట్రిప్ చార్జీ, రూ. 861 వడ్డీతో (సంవత్సరానికి 12శాతం చొప్పున), అలాగే మానసిక వేదనకుగాను రూ. 88వేలు, ప్రొసీడింగ్స్ ఖర్చుల నిమిత్తం రూ. 7 వేలు కలిపి మొత్తం 95 వేల రూపాయలు చెల్లించాలని కమిషన్ ఓలా క్యాబ్ను ఆదేశించింది. -
అరే నాయన ఏంట్రా బాబు ఇది? తినాలా? వద్దా!
ఇటీవల కాలంలో కొన్ని హోటల్లో సదరు కస్టమర్లకు ఎదురైన చేదు అనుభవాలను చూస్తే బయట ఫుడ్ తినాలంటేనే భయపడేలా చేశాయి. మొన్నటికి మొన్న ఒక ఆమె కూతురు కోసం దోశ ఆర్డర్ చేస్తే...ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము కుబుసం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరొకసారి సాంబార్ బొద్దింకల అవయవాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అవన్నీ ఒకత్తెయితే ఇక్కడొక కస్టమర్ ఆర్డర్ చేసిన టిఫిన్ ప్లేట్లో బతుకున్న బల్లిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వివరాల్లోకెళ్తే...చండీగఢ్లో ప్రసిద్ధి చెందిన ఈలాంటే మాల్లోని సాగర్ రతన్ ఫుడ్ కోర్ట్లో గురిందర్ చీమా అనే కస్టమర్కి చేదు అనుభవం ఎదురైంది. చోలే భాతురే(పూరీ, శనగల కర్రీ) ఆర్డర్ చేశాడు. సదరు కస్టమర్ పూరీ తిందాం అనుకునేటప్పటికీ ప్లేట్లో బతికున్న బల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో సదరు కస్టమర్ ఫిర్యాదు మేరకు ఆరోగ్యశాఖాధికారులు రంగంలోకి దిగి ఆహార పదార్థాల నమునాను సేకరించి పరీక్షలకు పంపిచడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బీజేపీకి పార్టీకి చెందిన రవిరాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఫుడ్ కోర్ట్లో ఇది సర్వసాధారణం, బొద్దింకలు, చిన్న చిన్న సరీసృపాలు కూడా ఆహారాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాయంటూ వ్యగ్యంగా కామెంట్లు చేస్తూ...ట్వీట్ చేశారు. Had a very horrible experience on 14.6.22, at Sagar Ratan, food court, Elante Mall, Chandigarh. A live Lizard was found in semi-conscious state under the Bhatura. Complaint given to @DgpChdPolice they made sample seized by food health Dept. Chd. @KirronKherBJP@DoctorAjayita pic.twitter.com/ej4sLHrnH5 — Ravi Rai Rana #RWorld (@raviranabjp) June 15, 2022 (చదవండి: అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్ కట్ చేస్తే...) -
టాటూ ట్రెండింగ్.. క్యూ కడుతున్న యువత !
సాక్షి,నిర్మల్చైన్గేట్: ప్రస్తుత కాలంలో టాటూ.. ట్రెండ్ గా మారింది. నాటి పచ్చబొట్టే.. నేడు టాటూ.. పేరేదైనా జీవితకాలం ఉండే జ్ఞాపకం. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్గా కనిపించాలని శరీరంపై టాటూ డిజైన్ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారి పేర్లతో పాటు వ్యక్తుల ఫొటోలను టాటూగా వేసుకుంటున్నారు. కొందరు స్టైల్ కోసం.. మరికొందరు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్, డిఫరెంట్ వెరైటీస్తో లవర్స్ ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం కలర్ టాటూస్ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం డిఫరెంట్ కలర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తమ మనసుకు నచ్చిన భావాలను ఒంటిపై వేయించుకొని మురిసిపోతున్నారు యువత. యూత్ ఫ్యాషన్గా.. టాటూ ఒక ఫ్యాషన్గా మారింది. ప్రతిఒక్కరూ తమకు నచ్చిన వారి పేరు లేదా ఫొటోతో పాటు తాము ఇష్టపడే నాయకులు, దేవతల ఫొటోలను టాటూగా వేసుకోవడం ట్రెండ్గా మారింది. మనసుకు నచ్చినట్టుగా.. గతంలో కేవలం గ్రీన్ టాటూ మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం డిజైనర్లు డిఫరెంట్ వెరైటీస్తో వేస్తున్నారు. వివిధ రకాలతో యూత్ను ఆకట్టుకుంటున్నారు. మల్టీకలర్స్తో లైఫ్ లాంగ్ గుర్తుండేలా వేసుకోవడం ప్రస్తుత రోజుల్లో క్రేజ్గా మారింది. వెలిసిన సెంటర్లు.. గతంలో కేవలం నగరాలకే పరిమితమైన టాటూ కల్చర్ ప్రస్తుతం చిన్నపట్టణాలను సైతం విస్తరించింది. గతంలో జాతర్లలో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పచ్చబొట్టు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం టాటూలు వేసేందుకు ప్రత్యేక సెంటర్లు వెలిశాయి. క్రేజ్ పెరిగింది.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం నేటి యువత టాటూలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం యువతకు టాటులపై క్రేజ్ పెరిగింది. – సంతోష్ వర్మ, టాటూ కళాకారుడు ఫ్యాషన్గా ఉండడం ఇష్టం ఫ్యాషన్గా ఉండడం ఇష్టం. అందుకు తగ్గట్టుగానే నేను టాటూ వేయించుకున్నాను. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే టాటూ సెంటర్ అందుబాటులో ఉండడంతో యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. – దరందాస్ సాయి, నిర్మల్ -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం
-
స్టాకు పాతదే ధర కొత్తది.. లీటరు ప్యాకెట్లో 650 మి.లీ నూనే! రూ.500 తేడా?
సాక్షి,భైంసాటౌన్(నిర్మల్): ఉక్రెయిన్పై రష్యా యుద్ధం సాకుతో కొన్ని వంటనూనెల ఉత్పత్తి సంస్థలు మన మార్కెట్లో ధరల మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతిలో మన దేశం ఉక్రెయిన్, రష్యాపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితుల నేపథ్యంలో దిగుబడిపై ప్రభావం పడింది. ఇదే అదనుగా కొన్ని నూనెల ఉత్పత్తి సంస్థలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రిటైలర్లు, డీలర్లకు స్టాక్ లేదని చెప్పి క్యాష్ చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలయితే నేరుగా పాత స్టాకుపై ఉన్న ధరను చెరిపేసి, కొత్త ధర ముద్రించి మార్కెట్లోకి పంపుతున్నాయి. ఫలితంగా వినియోగదారులపై ప్రభావం చూపుతోంది. షార్ట్ వెయిట్తో మోసం... చాలా వరకు పేద, మధ్య తరగతి ప్రజలు, నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎక్కువగా ద్వితీయ శ్రేణి వంటనూనెలనే వినియోగిస్తారు. తక్కువ ధరకే వస్తుండడం, ప్రముఖ బ్రాండ్లను పోలిన స్టిక్కర్లు ఉండడంతో నమ్మి మోసపోతుంటారు. ప్రముఖ బ్రాండ్ల నూనెలు ఖచ్చితమైన కొలతల్లో ఉంటాయి. ద్వితీయశ్రేణి నూనెలు మాత్రం 350 మి.లీ. నూనెను 500 మి.లీ పాకెట్లో, 650 మి.లీ.నూనెను లీటరు పాకెట్లో నింపి విక్రయిస్తారు. దీంతో తక్కువ ధర ఉందని చూసి, నిరక్షరాస్యులు మోసపోతున్నారు. రూ.200–500ల వరకు పెంచేస్తూ... జిల్లా మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులు సన్ఫ్లవర్, పామాయిల్, ఇతర వంటనూనెలు ఎక్కువగా హైదరాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుంచి తీసుకొస్తుంటారు. భైంసా మార్కెట్లో శనివారం ఓ హోల్సేల్ వ్యాపారి హైదరాబాద్ నుంచి ఓ కంపెనీకి చెందిన 15కిలోల వంటనూనె క్యాన్లను తెప్పించాడు. అయి తే ఆ క్యాన్లపై పాత ధర చెరిపేసి, కొత్త ధర రూ. 2899గా ముద్రించి పంపించారు. ఇలా ఒక్కో క్యా న్పై సుమారు రూ.200–500 వరకు పెంచి సరఫరా చేస్తున్నారు. అయితే వినియోగదారులు మాత్రం తానే ధర పెంచి విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారని వ్యాపారి వాపోయాడు. దీంతో వ్యాపారం దెబ్బతినే పరిస్థితి ఉందని చెబుతున్నాడు ఇతడు. తనిఖీలు చేపడితే ప్రయోజనం... యుద్ధం సాకుతో వంటనూనెల ధరలు ఇష్టానుసారం పెంచి పలు కంపెనీలు వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఈమేరకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టి స్టాకు కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ధరలు అమాంతం పెంచేశారు.. యుద్ధం సాకుతో పాత స్టాకుపై ధరలు చెరిపేసి, పెంచిన ధరలతో వంటనూనెలు అమ్ముతున్నరు. ఇలా చేయడం సరికాదు. పాత స్టాకును పాత ధరకే విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – అనుసూరి శ్రీనివాస్, భైంసా తనిఖీలు చేపడుతాం.. పాత స్టాక్ వంటనూనెల ధరలు పెంచి విక్రయిస్తే ఫిర్యాదు చేయాలి. అయితే అది పాత స్టాకేనా.. కాదా అనేది వారి బిల్లులు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. తనిఖీలు జరిపి ఎవరైనా పాత స్టాకును రేటు పెంచి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – చిస్తేశ్వర్రావు,వాణిజ్యపన్నుల శాఖ జిల్లా అధికారి -
కస్టమర్ల ధ్రువీకరణ తర్వాతే చెక్కులకు ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రూ.10 లక్షలు అంతకుమించిన చెక్కుల ఆమోదానికి కస్టమర్ల ధ్రువీకరణను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పేసిస్టమ్ (పీపీఎస్)ను అమలు చేయనుంది. రూ.10 లక్షలకు మించిన చెక్కు క్లియరెన్స్ కోసం వచ్చినప్పుడు కస్టమర్ ధ్రువీకరణను తీసుకోనుంది. తద్వారా చెక్కుల రూపంలో భారీ మోసాలకు చెక్ పెట్టొచ్చన్నది పీఎన్బీ అభిప్రాయంగా ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ విధానంలో రూ.50,000, అంతకుమించిన చెక్కులకు పీపీఎస్ను పీఎన్బీ అమలు చేస్తోంది. ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారుల ఇష్టానికి వదిలేయాలని, రూ.5లక్షలకు మించిన చెక్కులకు బ్యాంకులు తప్పనిసరి చేయవచ్చని గతంలో ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి.. 60 నిద్ర మాత్రలు మింగేశాడు!
బీజింగ్: ఒక్కొసారి జీవితంలో మనం ఊహించుకునే దానికి, జరిగే దానికి చాలా తేడా ఉంటుంది. మనం పెట్టుకున్న అంచనాలు.. పూర్తిగా తలకిందులుగా మారుతుంటాయి. ఇలాంటి పరిస్థితులను కొందరు ధైర్యంగా ఎదుర్కొంటే.. మరికొందరు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. ఈ సమయాల్లో వీరు .. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ మిత్రులకు గానీ, దగ్గరి వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెబుతుంటారు. ఈ సమయంలో అవతలివారు.. అప్రమత్తంగా వ్యవహరిస్తే.. బాధితుల ప్రాణాలు నిలుస్తాయి. తాజాగా, ఒక డెలీవరీ బాయ్ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ఒక నిండు ప్రాణం నిలిచింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు.. చైనాలోని హెనాన్ ప్రావీన్స్లో ఒక కస్టమర్ వ్యాపారంలో నష్టపోయాడు. ఈ క్రమంలో తాను.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే, తనకు ఇష్టమైన ఆహరం తిని చనిపోవాలనుకున్నాడో.. ఏమో గానీ.. ఫుడ్ కోసం ఆర్డర్ పెట్టాడు. ఈ క్రమంలో.. డెలీవరీబాయ్ డెలీవరీని ఇవ్వడానికి కస్టమర్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ‘ది లాస్ట్ మీల్ ఇన్ మై లైఫ్ ’ ఇది నా జీవితంలో చివరి భోజనం.. అంటూ నోట్ రాసిపెట్టి ఉంది. దీన్ని చూసిన డెలీవరీబాయ్ షాక్కు గురయ్యాడు. కస్టమర్ ఇంటి తలుపు తట్టడానికి ప్రయత్నించాడు. ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కస్టమర్ను.. తలుపును తీయాలని కోరారు. అయితే, బలవంతంగా లోపలికి వస్తే.. కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడిని ఓదార్చి.. మాటల్లో పెట్టారు. ఆ తర్వాత.. బాధితుడు చెప్పిన విషయాన్ని ఓపికతో విన్నారు. కాగా, కస్టమర్.. తాను చేస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు చాకచక్యంగా గదిలోపలికి ప్రవేశించారు. కస్టమర్ అప్పటికే బాధతో 60 నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి ఆసుపత్రికి తరలించడంతో బాధితుడి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం .. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. డెలీవరీ బాయ్ను అభినందిస్తున్నారు. -
వెయిటర్ నిర్వాకం.. టిప్పు ఇవ్వలేదని యువకులపై దాడి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్లో ఒక వెయిటర్ కస్టమర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. టిప్పు ఇవ్వలేదన్న కోపంతో యువకులపై దాడికి తెగబడ్డాడు. శంషాబాద్ పరిధినిలోని ఎయిర్పోర్ట్ బావర్చీ హోటల్లో స్థానికంగా కొంత మంది యువకులు నిన్న(మంగళవారం) రాత్రి బిర్యానీ తినడానికి వచ్చారు. ఆ తర్వాత.. యువకులు బిల్లు చెల్లించి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో.. వెయిటర్ టిప్పు చెల్లించరా.. అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బందితో కలిసి యువకులపై దాడికి తెగబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను సముదాయించి హోటల్ నుంచి పంపించి వేశారు. గతంలోను ఇదే హోటల్పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్పోర్టు బావార్చి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యువకులు వెయిటర్పై స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెయిటర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఐస్క్రీమ్ చల్లగా ఉందేంటి, నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. కస్టమర్ ఫిర్యాదు
గతంలో పుడ్ తినాలంటే హోటల్కి వెళ్లి తినేవాళ్లం. కానీ స్విగ్గి, జొమాటో లాంటి ఆన్లైన్ యాప్లు వాడకంలోకి వచ్చాక కూర్చున్న చోటు నుంచే నచ్చిన పుడ్ని తెప్పించుకు తింటున్నాం. కస్టమర్ల సౌకర్యం కోసం ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్లు కొన్ని రూల్స్ని పాటిస్తుంటాయి. అయితే కొందరు కస్టమర్లు మాత్రం వీటిని అలుసుగా తీసుకుని డబ్బులు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇటువంటి ఘటనలే యూకేలోని ఓ హోటల్లో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. యూకేలోని ఓల్డ్హామ్లో హాసన్ హాబిబ్ అనే వ్యక్తికి జస్ట్ ఈట్ అనే రెస్టారెంట్ ఉంది. అన్ని హోటల్లో లానే అందులో టేక్ అవే సౌకర్యం ఉంది. ఆ ప్రాంతంలో పుడ్ సరిగా లేకుంటే మనీ రీఫండ్ లాంటి స్వీమ్లు కొన్ని కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొందరు దాన్నే అదునుగా తీసుకుని ఫుడ్ ఆర్డర్ చేస్తూ డెలివరీ అయ్యాక ఏదో ఒక సాకులు చెప్పి.. డబ్బులు రిఫండ్ చేయాలంటూ రెస్టారెంట్పై ఫిర్యాదులు చేస్తున్నారట. ఇటీవల ఓ కస్టమర్.. ఐస్క్రీమ్ ఆర్డర్ చేసి డెలివరీ కాగానే ఐస్క్రీమ్ చల్లగా ఉంది నాకేమి నచ్చలేదు మనీ రిఫండ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టాడట. ఇదొక్కటే కాదు ఇలాంటి సిల్లీ కారణాలతో మనీ రిఫండ్ చేయాలని ఫిర్యాదులు రోజు వస్తూనే ఉండడంతో ఆ రెస్టారెంట్ ఓనర్ ఆన్లైన్ ఆర్డర్స్, టేక్ అవేని ఆపేశాడట. చివరకి ఆ రెస్టారెంట్ యజమాని తన కస్టమర్లు ఎవరైనా ఫుడ్పై ఫిర్యాదు చేయాలనుకుంటే.. దానికి కొంత చార్జ్ వసూలు చేయడం మొదలు పెట్టాడు. కనీసం 30 రోజుల గడువు తీసుకొని ఆలోపు కస్టమర్ల ఫిర్యాదులో పేర్కొన్న విధంగా సమస్య ఉంటే.. రిఫండ్ ఇవ్వడం ప్రారంభించారు. చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే! -
అమెజాన్ మోసం.. పార్సిల్ ఓపెన్ చేయగానే అవాక్కైన కస్టమర్
సాక్షి,గరుగుబిల్లి(విజయనగరం): మండలంలోని నాగూరుకు చెందిన గొట్టాపు భార్గవ నాయుడు ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. షటిల్ కాక్లకు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్లో ఆర్డర్ ఇస్తే ఆదివారం వచ్చిన పార్శిల్లో పనికిరానివి, కాక్లకు డిప్పలు లేనివి ఉండడంతో ఆవాక్కయ్యాడు. ఆన్లైన్ షాపింగ్లో మోసం జరిగిందని గ్రహించి వెంటనే ఆ సంస్థ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి తిప్పి పంపించేశాడు. పాముకాటుతో వ్యక్తి మృతి రేగిడి: మండల పరిధిలో ని అంబకండి గ్రామానికి చెందిన లొట్టి అచ్యుతరావు (45) ఆదివారం పాముకాటుతో మృతి చెందారు. గడ్డి కోత కోసం ఆయన సాయంత్రం పొలానికి వెళ్లారు. ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా గట్టుపై అ పస్మారక స్థితిలో పడి ఉన్నా రు. వారు అచ్యుతరావును రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని ఎంపీటీసీ పుర్లి సత్యవతి తెలిపారు. అచ్యుతరావుకు భార్య అన్నపూర్ణ, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె నీలిమ, కుమారుడు ఉన్నారు. అచ్యుతరావు గీత కార్మికుడు. ఆయన మృతితో కుటుంబానికి ఆధారం పోయింది. అచ్చుతరావు మృతిపై మాజీ సర్పంచ్ లావేటి అప్పలనాయుడు, లావేటి గణపతిరావునాయుడు, పుర్లి గోపాలకృష్ణ మాస్టారు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న.. -
వందకు అరలీటర్ తక్కువగా పెట్రోల్..
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): మండల కేంద్రంలోని ఓపెట్రోల్ బంక్లో సోమవారం కృష్ణ అనే యువకుడు పెట్రోల్ను బాటిల్లో పోయించుకున్నాడు. బాటిల్లో రూ.వందకు అరలీటర్కు తక్కువగానే రావడంతో, పెట్రోల్ పోసిన వ్యక్తిని నిలదీశాడు. తర్వాత ఆ పెట్రోల్ను వేరే బాటిల్లో పోసి, మరోసారి పోయగా సుమారుగా లీటర్ వరకు వచ్చింది. ఇప్పుడు ఎలా సరిగ్గా పోశారని, ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని ఆ యువకుడు నిలదీశాడు. అదే నేరుగా బండిలో పోసుకుంటే దూరం వెళ్లే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ విషయంపై పెట్రోల్ బంక్ యజమాని ప్రేంసాగర్ను ‘సాక్షి’ వివరణ కోరగా మిషన్లోని పైపు లీకేజీ, టెక్నికల్ సమస్య వల్ల ఇబ్బంది ఏర్పడిందని, మరమ్మతు చేసే వరకు ఆ మిషన్ను పక్కన పెట్టి, మరో మిషన్తో పెట్రోల్ పోయిస్తున్నామని చెప్పారు. చదవండి: సికింద్రాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ స్కామ్ -
బంగారు నగలు తాకట్టు పెడితే నకిలీవి ఇచ్చారు
సాక్షి, కర్నూల్: పట్ణంలోని డీసీసీబీ బ్రాంచ్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెడితే నకిలీవి తిరిగి ఇచ్చారని ఓ ఖాతాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక అంబేడ్కర్ నగర్కు చెందిన ప్రమోద్ కుమార్ 2017లో 35.81 తులాల బంగారు ఆభరణాలు డీసీసీబీ బ్రాంచ్లో తాకట్టు పెట్టి రూ.4,98,600 రుణం పొందాడు. 2019 డిసెంబర్లో రెన్యూవల్ చేసుకోగా.. రుణం, వడ్డీ కలిపి మొత్తం రూ. 6,02,436 గురువారం మధ్యాహ్నం చెల్లించి బంగారు ఆభరణాలు విడిపించాడు. కాగా గంట తర్వాత మళ్లీ బ్యాంక్కు చేరుకుని బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన నగలు నకిలీవని, తనకు బంగారు నగలు ఇవ్వాలని చెప్పాడు. అయితే బ్యాంక్లోనే సరిచూసుకుని అడిగితే తమకు సంబంధమని, బయటకు వెళ్లి వస్తే తమది బాధ్యత కాదని మేనేజర్ మహబూబ్ చెబుతున్నాడు. అంతా సరిగా ఉన్నట్లు బ్యాంక్ రికార్డులో ప్రమోద్ కుమార్ సంతకం చేశాడని, సాక్ష్యంగా సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నట్లు మేనేజర్ చెబుతున్నాడు. ఈ విషయంపై బాధితుడు, బ్యాంక్ మేనేజర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఇద్దరి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అమ్మా.. నీవు లేని లోకంలో నేనుండలేను.. -
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ గొడవ.. కస్టమర్పై కత్తెర విసిరికొట్టిన ఉద్యోగి
ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వచ్చిన కస్టమర్లకు రకరకాల రుచులు ఆహ్వానం పలుకుతుంటే.. వాటిని ఆరగించే తొందరలో హడావిడి చేస్తుంటారు. ఆ హడావిడి నార్మల్గా ఉంటే పర్లేదు. ఒక్కోసారి శృతి మించితే..! లేదంటే ఫాస్ట్ఫుడ్ సిబ్బంది విచక్షణ కోల్పోతే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరానికి చెందిన ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ 'చిపోటిల్'కు ఆంటోనీ ఎవాన్స్ అనే కస్టమర్ వచ్చాడు. ఆంటోనీ తనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాడు. అయితే, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్ అందాలంటే అరగంట వెయిట్ చేయాల్సి ఉంది. కానీ ఆంటోనీకి ఇక్కడ సర్వీస్ బాగోలేదని తిట్టుకుంటూనే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఐటమ్ను వెంటనే తీసుకొని రావాలని అడిగాడు. ఆలస్యం అవుతుందని మేనేజర్తో మాట్లాడాలని హడావిడి చేశాడు. అదే సమయంలో కౌంటర్లో ఉన్న ఓ మహిళా ఉద్యోగి తానే ఈ రెస్టారెంట్ మేనేజర్ను అంటూ కస్టమర్ తో వాదనకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మహిళా.. కస్టమర్పై కత్తెర విసిరి కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను ఆర్డర్ ఇచ్చాను. మీరు ఆర్డర్ను తీసుకొని రాలేదు. అందుకే కంప్లెయింట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న వీడియో ఫేస్ బుక్లో లైవ్లో వస్తుంది. దీంతో కస్టమర్ తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మహిళా ఉద్యోగి కిచెన్ రూమ్లో నుంచి కేకలు వేసింది. అయినా వీడియో తీస్తుండడంతో.. క్యాష్ కౌంటర్లో ఉన్న రెండు కత్తెర్లని కస్టమర్పై విసిరేసింది. దీంతో భయాందోళనకు గురైన కస్టమర్ .. వామ్మో మీరే చూశారుగా ఆమె నాపై కత్తెర్లతో ఎలా దాడి చేసిందో అంటూ కేకలు వేశాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాల్టిమోర్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఏం చేశాడో తెలిస్తే.. షాక్ అవుతారు!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో ఫుడ్ డెలివరీ సంస్థలకు గిరాకీ భారీగా పెరిగింది. ఒక క్లిక్తో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని ఎంచెక్కా లాగించేయడం సర్వ సాధారణమైపోయింది. అదే సందర్భంలో డెలివరీ ప్రతినిధులు కస్టమర్ ఆహారంకోసం కక్కుర్తి పడటం, ఆహారాన్ని దొంగిలిండం లాంటి షాకింగ్ వీడియోలు ఇటీవల ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. తాజాగా అలాంటి మరో వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. బ్యాక్యార్డ్ స్టేట్ కంబైన్ యూ ట్యూబ్లో షేర్ చేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం అందించలేదు. సుమారు 185 వేలకు పైగా వ్యూస్, కమెంట్లతో దూసుకుపోతోంది. ఉబెర్ ఈట్స్కు చెందిన ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లు ఆర్డర్ చేసిన ప్యాకేజీలనుంచి ఆహారాన్ని దొంగిలించడం కెమెరాకు చిక్కింది. వరుసగా ఒక్కో డబ్బా ఓపెన్ చేసి, దాంట్లో ఉన్న ఫుడ్ను చేత్తో తీసి పక్కన ఉన్న తన డబ్బాలో వేసుకుంటూ పట్టుబడ్డాడు. ఏమీ తెలియనివాడిలాగా మధ్యలో ఫోన్ చెక్ చేసుకుంటూ తన పనికానిచ్చాడు. చివరికి సూప్ బాక్స్నుకూడా వదల్లేదు. అలా తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తైన తర్వాత, అతను స్టాప్లర్ సహాయంతో బ్యాగ్ని రీసీల్ చేశాడు. దీనిపై యూజర్లు విభిన్నంగా స్పందించారు. మన దృష్టిలో పడనివి ఇలాంటివి చాలానే ఉంటాయంటూ ఒకరు వ్యాఖ్యానించగా, "డ్యూడ్ బహుశా అతను ఆకలితో ఉన్నట్టున్నాడు" మరి కొందరు కమెంట్ చేస్తున్నారు. -
కస్టమర్ ఇచ్చిన టిప్ చూసి డెలివరీ బాయ్ షాక్!
ఫుడ్ డెలివరీ యాప్లు పెరిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున వాటికి ఆర్డర్లు ఇస్తున్నారు. కరోనా సమయంలో ఫుడ్ డెలివరీ చేసే వారిని కూడా వారియర్లుగా గుర్తించారు. డెలివరీ యాప్లకు సంబంధించిన వార్తలు వైరల్గా మారుతున్నాయి. తాజాగా ఓ సంఘటన వైరల్గా మారింది. ఆర్డర్ పెట్టిన కస్టమర్కు ఫుడ్ డెలివరీ చేసిన బాయ్ టిప్ అడిగాడు. అయితే అప్పటికే కస్టమర్ వద్ద డబ్బులు లేవు. దీంతో ఆ డెలివరీ బాయ్కు ఊహించని టిప్ ఇచ్చాడు. దాన్ని తీసుకుని డెలివరీ బాయ్ వెళ్లిపోయాడు. సీసీ టీవీలో రికార్డయిన ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అమెరికాలో ఓ వ్యక్తి పిజ్జాహట్లో పిజ్జా ఆర్డర్ పెట్టాడు. పిజ్జాను తీసుకుని వచ్చి కస్టమర్ ఇంటి తలుపు తట్టాడు. టిప్ ఇవ్వాలని డెలివరీ బాయ్ అడగ్గా.. ‘నా దగ్గర డబ్బులు లేవు. పిజ్జాలో ఒక ముక్క (స్లైస్) తీసుకో’ అని కస్టమర్ చెప్పాడు. అయితే డెలివరీ బాయ్ ‘మీరేమైనా జోక్ చేస్తున్నారా’! అని ప్రశ్నించాడు. ‘లేదు లేదు నిజంగంటే డబ్బులు లేవు’ అని చెప్పడంతో డెలివరీ బాయ్ తెచ్చిన పిజ్జాలో ఓ ముక్క తీసుకుని తింటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను ఆ కస్టమర్ టిక్టాక్లో వీడియో అప్లోడ్ చేశాడు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన విషయాలన్నీ ఆ వీడియోలో టెక్ట్స్ రూపంలో వివరించాడు. ఈ భిన్నమైన స్పందన లభిస్తోంది. రింగ్డోర్బెల్ కంపిలేషన్ అనే టిక్టాక్ అకౌంట్లో ఈ వీడియో ఉంది. -
మాస్క్ పెట్టుకోలేదని కస్టమర్తో సెక్యూరిటీ గార్డ్ గొడవ
-
ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్ చేస్తే చాలు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ కస్టమర్ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్బీ అలయన్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్బీ అలియన్స్ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్ మిరాఖుర్ను పీఎస్బీ అలియన్స్ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది. నమూనాపై కసరత్తు.. ‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్బీల పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్ను పీఎస్బీ అలయన్స్ నియమించుకుంది. రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్లను అధ్యయనం చేసేందుకు పీఎస్బీలు ‘కార్డెక్స్ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్బీ అలయన్స్గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్బీలు అన్నీ కలసి ప్రమోట్ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్ చెప్పారు. ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్బీ అలయన్స్ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజ్కిరణ్రాయ్ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. కొన్ని బ్యాంకుల పరిధిలో.. ‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్బీ అలయన్స్ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్ మిరాఖుర్ తెలిపారు. నాన్ ఫైనాన్షియల్ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్ నివేదిక ఇవ్వడం, టీడీఎస్ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను కూడా ఆర్డర్ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్, మొబైల్ యాప్, ఫోన్కాల్ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్కు బ్యాంకులు చెల్లిస్తాయి. -
జాక్ పాట్: ఆపిల్ పండ్లు ఆర్డర్ ఇస్తే..ఐఫోన్ ఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: సాధారణంగా ఖరీదైన వస్తువులు ఆర్డర్ ఇస్తే.. చీప్ వస్తువులను అందించిన మోసగించిన కథనాల్ని చూశాం. అంతేకాదు లగ్జరీ ఫోన్లకు బదులు, ఇటుకలు, డమ్మీ ఫోన్లు డెలివరీ, ఆపిల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే ఆపిల్ ఫ్లేవర్ డ్రింక్ ఇచ్చిన వైనాన్ని కూడా చూశాం. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కానీ తాజాగా ఇందుకు భిన్నంగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్లో ఆపిల్ పళ్లను ఆర్డర్ ఇస్తే.. ఏకంగా ఖరీదైన ఆపిల్ ఐఫోన్ వచ్చింది. తీరిగ్గా విషయం తెలుసుకుని సంతోషంతో ఉబ్బితబ్బివ్వడం అతని వంతైంది. ట్వికెన్హామ్కు చెందిన 50 ఏళ్ల నిక్ జేమ్స్ ఈ అరుదైన జాక్ పాట్ కొట్టేశారు. స్వయంగా ఆయనే ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టనప్పటినుంచి కిరాణా సామాగ్రి నుంచి విలాస వస్తువులుదాకా దాదాపు ప్రతీదీ ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం అవసరంగా మారిపోయింది. ఈ క్రమంలో బ్రిటన్లో జేమ్స్ ఆన్లైన్లో కొన్ని ఆపిల్ పండ్ల కోసం సూపర్ మార్కెట్కు ఆర్డర్ ఇచ్చారు. అయితే పార్సిల్లో పండ్లతో పాటు ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ కూడా రావడంతో ఎగిరి గంతేశాడు. కానీ ఈస్టర్ సందర్భంగా ఏదైనా ప్రాంక్ చేశారేమో అనుకుని కొద్దిగా అనుమానించాడు. అయితే టెస్కో మార్కెట్ కంపెనీ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అని తెలుసుకుని జేమ్స్ను సూపర్ థ్రిల్ అయ్యాడు. విషయం ఏమిటంటే.. టెస్కో గ్రోసరీ సంస్థ ప్రమోషనల్ క్యాంపేన్లో భాగంగా ఆపిల్ పళ్లతో పాటు ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ ఫోన్ను గిఫ్ట్గా అతనికి అందించిందన్నమాట. 'సూపర్ సబ్స్టిట్యూట్'లో రెగ్యులర్ అవసరమైన వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్పాడ్స్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఊహించని బహుమతులుగా అందిస్తోందట టెస్కో సంస్థ. A big thanks this week to @Tesco & @tescomobile. On Wednesday evening we went to pick up our click and collect order and had a little surprise in there - an Apple iPhone SE. Apparently we ordered apples and randomly got an apple iphone! Made my sons week! 😁 #tesco #substitute pic.twitter.com/Mo8rZoAUwD — Nick James (@TreedomTW1) April 10, 2021 Did you get your apples? — craig jenkins (@craigjenkins05) April 14, 2021 Well that’s one way to boost sales of apples — Jake Russell (@jakerussell47) April 14, 2021 -
ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే!
సాక్షి, హైదరాబాద్: సిటీలోని ఉత్తర మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓయో హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలని భావించాడు. ఆ సంస్థను సంప్రదించడానికి అవసరమైన నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసి నిండా మునిగాడు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఉమేష్ ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స తీసుకున్న అతడికి నెగిటివ్ వచ్చింది. అయితే తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని భావించారు. దీని కోసం తమ ప్రాంతానికి సమీపంలోని ఓయో హోటల్ రూమ్ తీసుకుందామని భావించి ఆ సంస్థ ఫోన్ నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేయగా ఒక నంబర్ లభించింది. అది నకిలీది అని తెలియక ఉమేష్ ఆ నంబర్ను సంప్రదించగా.. ఓయో సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. మీకు కావాల్సిన రూమ్ బుక్ చేసుకోవడానికి సహకరిస్తామంటూ క్విక్ సపోర్ట్ (క్యూఎస్) యాప్ను డౌన్లోడ్ చేయించారు. తర్వాత బాధితుడి ఫోన్ను హ్యాక్ చేశారు. రూమ్ బుకింగ్ కోసం తమకు రూ.10 పంపాలన్నారు. ఉమేష్ ఆ మొత్తం తన ఫోన్ నుంచి బదిలీ చేస్తుండగా అతడి యూపీఐ వివరాలను క్యూఎస్ యాప్ ద్వారా తస్కరించారు. వీటిని వినియోగించి అతడి ఖాతా నుంచి రూ.3.08 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న ఉమేష్ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గూగుల్ను ఆశ్రయించొద్దు ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రముఖ సంస్థల కాల్ సెంటర్ల పేరుతో తమ నంబర్లను గూగుల్లో జొప్పిస్తున్నారని, ఈ విషయం తెలియక సంప్రదించిన అనేక మంది మోసపోతున్నారని పేర్కొన్నారు. ఏదైనా సంస్థకు సంబంధించిన ఫోన్, కాల్ సెంటర్ నంబర్లు అవసరమైతే నేరుగా దాని వెబ్సైట్ లేదా యాప్లనే సంప్రదించాలని సూచిస్తున్నారు. గూగుల్లో ఉన్న వాటిని గుడ్డిగా నమ్మితే నిండా మునుగుతారని హెచ్చరిస్తున్నారు. చదవండి: 128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు -
బ్యాంకుల విలీనంతో ఖాతాదారుల పరిస్థితి అంతేనా..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల విలీన పరిణామాలతో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త మార్పుల కారణంగా గతంలో ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులు బౌన్సయితే చార్జీల భారం పడటం, డివిడెండ్ చెల్లింపులను సక్రమంగా అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత ఎంఐసీఆర్ చెక్కుల స్థానంలో కొత్త వాటిని జారీ చేసేందుకు, డివిడెండ్లు మొదలైనవి చెల్లించాల్సిన సంస్థలకు కొత్తగా మారిన ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను అందించేందుకు మరింత సమయం పట్టేయనున్నందున విలీన అమలు ప్రక్రియ డెడ్లైన్ను మరింతగా పొడిగించాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగిసింది. అకౌంట్ల అనుసంధానంలో సమస్యలు.. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) నాలుగు పీఎస్బీల్లో విలీనం చేసిన ఉత్తర్వులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకుల సిస్టమ్స్ మొదలైన వాటి అనుసంధానం, కొత్త ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్ (ఐఎఫ్ఎస్సీ)ని అమల్లోకి తేవడం వంటి అంశాలకు మార్చి 31 డెడ్లైన్గా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, అకౌంట్ల అనుసంధానం మొదలుకుని ఇతరత్రా పలు సమస్యలు ఇంకా ఉంటున్నాయని కస్టమర్లు, పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లలో చాలా మందికి ఏవో కంపెనీల్లో షేర్లో లేదా బాండ్లలో పెట్టుబడులో ఉండే అవకాశముంది. వాటి మీద డివిడెండ్లు, ఇతరత్రా చెల్లింపులు మొదలుకుని ఐటీ రీఫండ్లు కూడా రావాల్సి ఉండొచ్చు. అయితే, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిపోవడం తదితర పరిణామాల వల్ల ఇలాంటివి పొందడం సమస్యగా మారే అవకాశం ఉంటోంది. పోనీ అలాగని కొత్త మార్పుల గురించి ఆయా సంస్థలకు తెలియజేయాలన్నా చాలా సమయం పట్టేయొచ్చు. ఈ నేపథ్యంలోనే డెడ్లైన్ను మూడు నెలల పాటు పొడిగించాలని కస్టమర్లు కోరుతున్నారు. ఇక కొత్త మార్పులకు అలవాటు పడేందుకు కూడా ఖాతాదారులకు ఇబ్బందిగా ఉంటోంది. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో విలీనమైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఓ కస్టమరు విషయం తీసుకుంటే.. దాదాపు అన్ని లావాదేవీలకు గతంలో ఈ–యూబీఐ యాప్ ఉపయోగించేవారు. కానీ విలీనం తర్వాత ప్రస్తుతం కొత్త యాప్ను వినియోగించడం చాలా మటుకు తగ్గించేశారు. యాప్ చాలా సంక్లిష్టంగానే కాకుండా నెమ్మదిగా లోడ్ అవుతుండటం కూడా ఇందుకు కారణమని వివరించారు. ఇక తండ్రి మరణానంతరం ఆయనకు చెందిన సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంటు నుంచి నగదు విత్డ్రా చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు నెల రోజులు పైగా పట్టేసిందని మరో యూబీఐ ఖాతాదారు వాపోయారు. ఇలాంటి సాంకేతిక సమస్యలతో విలీన బ్యాంకుల కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విలీనం ఇలా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేశారు. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమయ్యాయి. చదవండి: రిటైల్ రుణాలు.. రయ్రయ్! -
కస్టమర్ ఫిర్యాదుకు అమెజాన్ సీఈఓ స్పందన
ముంబై : తన మెయిల్కు వచ్చిన కస్టమర్ల ఫిర్యాదులకు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కచ్చితంగా స్పందించటమే కాకుండా వాటి పరిష్కారానికి మార్గం చూపుతారన్న సంగతి మరోసారి రూఢీ అయింది. తాజాగా ముంబై వ్యక్తి ఫిర్యాదుకు జెఫ్ స్పందించారు. సదరు వ్యక్తికి న్యాయం జరిగేలా చూశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓంకార్ హన్మంతే కొద్దిరోజుల క్రితం తన బామ్మ కోసం అమెజాన్ సైట్లో ఓ సెల్ ఫోన్ను ఆర్డర్ చేశాడు. అయితే సెల్ఫోన్ ప్యాకేజ్ను ఓంకార్కు అందించాల్సిన డెలివరీ బాయ్ అతడు నివాసం ఉంటున్న భవన సముదాయం గేట్ వద్ద ఉంచి వెళ్లాడు. ఈ నేపథ్యంలో దాన్ని ఓ దొంగ ఎత్తుకెళ్లిపోయాడు. సీసీటీవీ రికార్డు ద్వారా సెల్ఫోన్ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ( బిహార్ మంత్రిని ఏకిపారేస్తున్న నెటిజన్లు ) దీంతో ఆగ్రహానికి గురైన ఓంకార్ అమెజాన్ కస్టమర్ సర్వీస్కు ఫోన్ చేశాడు. డెలివరీ బాయ్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశాడు. అక్కడ కూడా సరైన స్పందన రాకపోయే సరికి ఏకంగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్కు ఈ సంగతుల్ని మెయిల్ పంపాడు. అతడి మెయిల్ను చదివిన జెఫ్.. ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్కు ఈ విషయాని చెప్పి, సమస్యను పరిష్కరించమని ఆదేశించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఓంకార్కు ఫోన్ చేశాడు. ఆధారాలను పరిశీలించి, సరైన అడ్రస్కు సెల్ఫోన్ను పంపించేశాడు. -
యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేసింది : విశేషాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా యాపిల్ లవర్స్ ఎదురు చూస్తున్న దేశంలో యాపిల్ తొలి ఆన్లైన్ స్టోర్ ను అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రారంభించింది. రానున్నపండుగ సీజన్ డిమాండ్ను క్యాష్ చేసుకునే వ్యూహంలో భాగంగా దేశీయ వినియోగదారుల నెట్టింట వాలిపోయింది. యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్ (www.apple.com/in)ను సందర్శించి, థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా నేరుగా కొనుగోళ్లు చేయవచ్చు. అంతేకాదు డైరెక్ట్ కస్టమర్ సపోర్టు కూడా యూజర్లకు భిస్తుంది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్లైన్ టీం సిద్ధంగా ఉన్నారని యాపిల్ ప్రకటించింది. ఆన్లైన్ స్టోర్ ద్వారా యాపిల్ మొదటిసారిగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు పూర్తి స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. రవాణా కోసం యాపిల్ బ్లూడార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. (గుడ్ న్యూస్ చెప్పిన టిమ్ కుక్) యాపిల్ ఆన్లైన్ స్టోర్ అందించే సేవలు అన్ని ఆర్డర్లు కాంటాక్ట్లెస్ డెలివరీ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఫైనాన్సింగ్ సదుపాయం విద్యార్థులు ప్రత్యేక ధరల వద్ద మాక్ లేదా ఐప్యాడ్ లు. ఆపిల్ కేర్ ఉత్పత్తులపై స్పెషల్ డిస్కౌంట్లు. యాక్సిడెంట్ కవరేజి వారంటీ ఎయిర్పాడ్స్లో ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం తెలుగు భాషలలో స్పెషల్ ఎమోజీలు , టెక్ట్స్, ప్రపంచవ్యాప్తంగా 38 వ ఆన్లైన్ స్టోర్ ఆపిల్ ఇండియా స్టోర్ ద్వారా భారతీయ వినియోగదారులకు యాపిల్ నిపుణుల సలహాలు, సూచనలు అందుబాటులో ఉంటాయి. ప్రొడక్ట్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడం, సెటప్ చేయడం వరకు వినియోగదారులు ఇంగ్లీష్లో ఆన్లైన్ లో సాయం అందిస్తుంది. అలాగే ఫోన్ ద్వారా హిందీ ఇంగ్లీషులో నేరుగా సలహాలు యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారు, తమ డివైస్ గురించి మరింత తెలుసుకునేందుకు , ఇతర సలహాలు, సందేహాల నివృత్తి కోసం ఎగ్జిక్యూటివ్తో 30 నిమిషాల పాటు మాట్లాడవచ్చు. ఫోటోగ్రఫీ, సంగీతాభిమానులకు 'టుడే ఎట్ ఆపిల్' ద్వారా స్థానిక నిపుణుల నేతృత్వంలో ఆన్లైన్ సెషన్లు అక్టోబర్లో ప్రారంభించనుంది. కాగా ఇటీవల యాపిల్ లాంచ్ చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 6, కొత్త ఐప్యాడ్ ఎయిర్ తోపాటు, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లాంటి ఉత్పత్తులు ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. యాపిల్ ప్రస్తుతం భారత్లో ఉత్పత్తులను థర్డ్ పార్టీ విక్రేతలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. (ఆపిల్ ఈవెంట్ 2020 : ప్రధాన ఆవిష్కరణలు) -
కస్టమర్ల భద్రత కోసం ఎస్బీఐ కొత్త ఫీచర్
న్యూఢిల్లీ : తమ ఖాతాదారుల భద్రత కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ మరో ముందడుగు వేసింది. ఏటీఎమ్ మోసాలను అరికట్టేందుకు ఓ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఏటీఎమ్తో బ్యాలెన్స్ , మినీ స్టేట్మెంట్ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓ మెసెజ్ పంపటం ద్వారా ఖాతాధారులను అలర్ట్ చేయనుంది. ఈ మెసేజ్ అలర్ట్ కారణంగా.. ఒకవేళ అనధికార లావాదేవీ జరుగుతున్నట్లయితే సదరు ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ( ఐఆర్సీటీసీ ఎస్బీఐ రుపే కార్డ్ : ఆఫర్లు) ఈ కొత్త ఫీచర్కు సంబంధించిన వివరాలను ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో మంగళవారం వెల్లడించింది. బ్యాలన్స్, మినీ స్టేట్మెంట్ ఎంక్వైరీలకు సంబంధించిన ఎస్ఎమ్ఎస్ అలర్ట్లను నిర్లక్ష్యం చేయవద్దని ఎస్బీఐ పేర్కొంది. అనధికారిక లావాదేవీ జరుగుతున్నట్లయితే వెంటనే ఏటీఎమ్ను బ్లాక్ చేయాలని తెలిపింది. -
రిలయన్స్ ఆభర్ కలెక్షన్స్
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ సంస్థ రిలయన్స్ జ్యువెల్స్ వార్షికోత్సవ కానుగా అద్భుతమైన కలెక్షన్స్ను లాంచ్ చేసింది. ‘‘ఆభర్’’ పేరుతో వినూత్న డిజైన్లతో బంగారం, వెండి, వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా తమ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జ్యువెల్స్ తెలిపింది. ఒక దశాబ్దానికి పైగా తమ బ్రాండ్కు అండగా నిలిచిన వినియోగదారులందరికీ కృతజ్ఞతగా వి వోయూ (మేము మీకు రుణపడి ఉన్నాము ) థీమ్తో ఒక ప్రమోషన్ వీడియోను విడుదల చేసింది. కస్టమర్లకు కృతజ్ఞతను చాటేలా ఈ ప్రమోషన్ క్యాంపైన్ను స్కేర్క్రో ఎం అండ్ సీ సాట్చి డిజైన్ చేయడం విశేషం. 3-15 గ్రాములతో 54 ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్ అందుబాటులో ఉంచింది. బంగారు ఆభరణాలపై మేకింగ్ చార్జెస్ పై 24 శాతం, డైమండ్ జువెలరీ పై 30 శాతం తగ్గింపుతో ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్ను ప్రకటించింది. ఆస్టు 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అలాగే కోవిడ్-19కు సంబంధించిన భౌతిక దూరం లాంటి అన్ని మార్గదర్శకాలతో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. ఆధునిక మహిళల అభిరుచులకు తోడుగా, ఆశ, వెలుగులు నింపేలా లాంతర్ల స్ఫూర్తితో డిజైన్లను రూపొందించినట్టు తెలిపింది. కఠినమైన సమయాల్లో వారి మద్దతు ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
నెగిటివ్ రివ్యూ ఇచ్చిందని..
బీజింగ్: ఆన్లైన్ షాపింగ్లో చాలా మంది రివ్యూలను చూసే ఒక వస్తువును కొంటుంటారు. ఆన్లైన్ నుంచి ఏదైన కొన్నప్పుడు మనం కొన్న రేటుకు తగ్గట్టుగా ఆ వస్తువు క్వాలిటీ ఉందా, చెప్పిన తేదికి వస్తువును డెలివరీ చేశారా, వస్తువు ఏమైనా పాడైందా, రిటర్న్ పాలసీ ఎలా ఉంది ఇవన్నీ చూసి రేటింగ్ ఇస్తూ ఉంటాం. అయితే అలా రేటింగ్ ఇవ్వడమే ఒక కస్టమర్ పాలిట శాపంగా మారింది. నెగిటివ్ రివ్యూ ఇచ్చిన పాపానికి ఆమెను వెతుకుంటూ 850 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఆమెను చావ గొట్టాడు ఒక షాపు యజమాని. చైనాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. (వాచ్.. తూచ్..) జియో డి అనే కస్టర్మర్ ఒక ఆన్లైన్స్టోర్ నుంచి 300 యువాన్ల విలువైన బట్టలను ఆర్డర్ పెట్టింది. అయితే మూడురోజుల్లో అవి వస్తాయని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. అయితే అనుకున్న తారీఖు నాటికి అవి డెలివరీ కాలేదు. దీంతో ఆమె ఆన్లైన్లో ఆ స్టోర్కు నెగిటివ్ రివ్యూ ఇచ్చింది. దీంతో స్టోర్ స్కోరు 12 పాయింట్లు పడిపోయింది. దీంతో కోపం వచ్చిన యజమాని జాంగ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్లి నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు ఆమెను రోడ్డు మీదే చితక్కొట్టాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తీవ్రంగా గాయాలపైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రతిఒక్కరూ షాపు యజమాని మీద తీవ్రంగా మండిపడుతున్నారు. (ఆన్లైన్ ద్వారా ఘరానా మోసం; యువకుల అరెస్టు) -
జీఎస్టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే!
సాక్షి, న్యూఢిల్లీ: ఒక దేశం, ఒకే పన్ను అంటూ బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై మరోసారి వినియోగదారులకు, వ్యాపారులకు బంపర్ ఆఫర్ గెల్చుకునే అవకాశాన్ని కేంద్రం పరిశీలీస్తోంది. జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు (బీ టూ సీ) , వ్యాపారాల ఇన్వాయిస్లపై ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించనుంది. ఏప్రిల్ 1 నుంచి రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య లాటరీ ఆఫర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వస్తువుల కొనుగోళ్లు సందర్భంగా తప్పనిసరిగా బిల్లులు తీసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వస్తువులు కొన్న తర్వాత వినియోగదారులు తీసుకునే బిల్లు ద్వారా లాటరీని గెల్చుకోవడానికి అర్హత పొందుతారు. ఈ పథకం కింద, రెవెన్యూ విభాగం నెలవారీ లక్కీ డ్రాలను నిర్వహిస్తుంది. ఇందులో ఒక బంపర్ బహుమతితోపాటు, రెండవ, మూడవ బహుమతులు రాష్ట్రాల వారీగా ఉంటాయని ఒక అధికారి తెలిపారు. లాటరీ ఆఫర్లు రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ గత నెలలోనే ప్రకటించడం గమనార్హం. దీని ప్రకారం కస్టమర్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు బిల్లును స్కాన్ చేసి జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ యాప్ ఈ నెల చివరి నాటికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. లక్కీ డ్రాకు అర్హత పొందడానికి ఇన్వాయిస్ విలువపై ఎటువంటి పరిమితి లేదు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. 5జీబీ డేటా
సాక్షి, ముంబై: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను లాంచ్ చేసింది. రూ. 90 రోజుల చెల్లుబాటుతో రూ. 109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. "మిత్రం ప్లస్" పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో మొత్తం 5 జీబీ డేటాను అందిస్తుంది. దీంతోపాటు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాలింగ్ సదుపాయం లభ్యం. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఉన్న (రూ.49, రూ. 40, 500 ఎమ్బి డేటా, 15 రోజుల వాలిడిటీ) మిత్రం ప్లాన్లతో పాటు అందుబాటులో ఉండనుంది. బీఎస్ఎన్ఎల్ కేరళ వెబ్సైట్లో లిస్టింగ్ ప్రకారం రూ. 109 మిత్రం ప్లస్ ప్లాన్ 5 జీబీ డేటా, ముంబై ఢిల్లీ, సర్కిల్లతో సహా భారతదేశంలోని ఏ నెట్వర్క్కైనా ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్ను అందిస్తుంది. అయితే కేరళ సర్కిల్లోని బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా మిగతా సర్కిళ్లకు త్వరలోనే రీఛార్జ్ ప్లాన్ను తీసుకురానుంది. అయితే ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు. -
పీఎంసీ స్కాం, మరో బాధితుని కన్నుమూత
సాక్షి,ముంబై: పీఎంసీ కుంభకోణం బాధితుల్లో మరొకరు అకస్మాత్తుగా ప్రాణాలు విడవడం విషాదాన్ని నింపింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ బ్యాంక్) లో డబ్బులు దాచుకున్న ప్రతాప్ జియందాని (71) ములుండ్లోని తన నివాసంలోగుండెపోటుతో మరణించారు. ఈ సమాచారాన్ని ఆయన బంధువు ముఖేష్ చండిరామణి శుక్రవారం వెల్లడించారు. కాగా గత రెండు నెలల కాలంలో పెద్దమొత్తంలో పీఎంసీలో డబ్బులు దాచుకున్న డిపాజటర్లలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరో ఏడుగురు డిపాజిటర్లు గుండెపోటుతో మరణించారు. సుమారు 16 లక్షల మంది డిపాజిటర్లను కలిగి ఉన్న పీఎంసీలో రూ 4355 కోట్ల రూపాయల కుంభకోణం సెప్టెంబరు మాసంలో వెలుగులోకి రావడంతో ఆర్బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలు విధించింది. కస్టమర్లు వెయ్యిరూపాయల మాత్రమే విత్ డ్రా చేసుకోగలరని నిబంధనలు విధించింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం బ్యాంకులో నగదును డిపాజిట్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని అంటూ నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో విత్డ్రా పరిమితిని రూ.40,000 నుంచి 50 వేలకు పెంచింది. అయితే 78 శాతం ఖాతాదారులు తమ మొత్తం బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. మెడికల్ ఎమర్జెన్సీ, వివాహాలు, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో పీఎంసీ డిపాజిటర్ రూ.1 లక్ష వరకూ విత్డ్రా చేసుకోవచ్చంటూ వారికి భారీ ఊరట కల్పించిన సంగతి తెలిసిందే. -
జియో ఫైబర్, మరో బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఫైబర్బ్రాడ్ బ్రాండ్ సేవలను రేపు ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరో బంపర్ ఆఫర్ను కూడా తన వినియోగదారులకు అందించనుంది. తాజా సమాచారం ప్రకారం కాంప్లిమెంటరీ ఆఫర్ను కూడా ప్రకటించనుంది. ప్రతి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్తో డైరెక్ట్-టు-హోమ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రతి కస్టమర్కు ఉచిత సెట్ టాప్ బాక్స్ను అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి వుంది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో రేపు(సెప్టెంబర్, 5)న ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా జియో ఫైబర్ కస్టమర్లు అందరికీ కాంప్లిమెంటరీ ఆఫర్గా సెట్ టాప్ బాక్స్ లభించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్ను ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే ఫుల్ హెచ్డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా అందిస్తామని గత నెలలో జరిగిన ఏజీఎంలో ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి : జియో ఫైబర్ బ్రాడ్బాండ్ లాంచింగ్ రేపే: రిజిస్ట్రేషన్ ఎలా? -
‘మారుతి ఎర్టిగా’ కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ఇండియా తాజాగా ‘ఎర్టిగా’ మోడల్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ అందుబాటులో ఉండగా... ఇంజిన్ సామర్థ్యాన్ని మరింత పెంచి ఈ వేరియంట్ను విడుదల చేశారు. ఈ నూతన కారు ధరల శ్రేణి రూ.9.86 లక్షల నుంచి రూ.11.20 లక్షలు. ప్రతి లీటరుకు 24.20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. కస్టమర్ల అవసరాలను విశ్లేషించి ఈ తదుపరి తరం ఎర్టిగాను విడుదలచేసినట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్.కల్సి చెప్పారు. గతేడాది నవంబర్ నుండి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో ఈ మోడల్ అమ్మకాలు 40,000 యూనిట్లుగా కంపెనీ వెల్లడించింది. -
ఉద్యోగుల ఖాతాల హ్యాకింగ్పై దర్యాప్తు
న్యూఢిల్లీ: తమ కంపెనీ ఉద్యోగులకు సంబంధించిన ఖాతాలు హ్యాకింగ్కు (అడ్వాన్స్డ్ ఫిషింగ్ ద్వారా) గురైనట్లు గుర్తించామని.. దీనిపై దర్యాప్తును కూడా చేపట్టామని విప్రో మంగళవారం ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించింది. హ్యాకింగ్ ప్రభావాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని కూడా తెలిపింది. దర్యాప్తులో సహకారం కోసం స్వతంత్ర ఫోరెన్సిక్ సంస్థను నియమించుకున్నామని విప్రో పేర్కొంది. ‘అడ్వాన్స్డ్ ఫిషింగ్ క్యాంపెయిన్ ద్వారా కొంత మంది ఉద్యోగుల అకౌంట్లలో అసాధారణ కార్యకలాపాలను గుర్తించాం. వెనువెంటనే దీనిపై దర్యాప్తును మొదలుపెట్టడంతో పాటు నష్ట నివారణకు తగిన చర్యలు కూడా తీసుకున్నాం’ అని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల అకౌంట్లను హ్యాకింగ్ చేయడం ద్వారా విప్రోకు చెందిన కొందరు క్లయింట్లపై సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోందని ఉందని సైబర్ సెక్యూరిటీ బ్లాగ్ క్రెబ్స్ ఆన్ సెక్యూరిటీ పేర్కొంది. -
3,000 కార్లను సమకూర్చుకుంటున్న డ్రైవెన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్ సబ్స్క్రిప్షన్ సర్వీసుల కంపెనీ కార్2డ్రైవ్ హైదరాబాద్లో తన సేవలను ప్రారంభించింది. సంప్రదాయ పద్ధతిలో కారు కొనుగోలుకు బదులు.. ఎటువంటి డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా కేవలం చందా చెల్లించడం ద్వారా కస్టమర్ తనకు నచ్చిన కారును ఎంపిక చేసుకోవచ్చు. కారు డ్యామేజ్, రిపేర్లు, బీమా భారం అంతా కంపెనీదే. డ్రైవెన్ ప్రమోట్ చేస్తున్న కార్2డ్రైవ్ బెంగళూరులో కూడా సేవలు అందిస్తోంది. ఒక్కో కారు ఖరీదు రూ.1 కోటి పైనే ఉంటుందని డ్రైవెన్ ఎండీ అశ్విన్ జైన్ శుక్రవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘ప్రస్తుతం కంపెనీ వద్ద 145 లగ్జరీ కార్లున్నాయి. 500 సీసీ అపై సామర్థ్యమున్న సూపర్ ప్రీమియం 55 బైక్లు ఉన్నాయి’ అని వివరించారు. కొత్తగా 3,000 వాహనాలు.. దీర్ఘకాలిక చందా, అద్దె విధానంలో కార్లను అందించేందుకు డ్రైవెన్ వచ్చే 12 నెలల్లో 3,000 కార్లను కొనుగోలు చేయనుంది. కస్టమర్ కోరిన మోడల్, ఫీచర్ల ఆధారంగా వాహనాన్ని అందజేస్తారు. ఈ విధానంలో రూ.3 లక్షల కారును సైతం వినియోగదారు ఎంచుకోవచ్చు. వాహనాల కొనుగోలుకు రూ.700 కోట్లు సమీకరించే పనిలో ఉన్నట్టు డ్రైవెన్ భాగస్వామి సయ్యద్ హుస్సేన్ వెల్లడించారు. ‘ఈ–వీ’ పేరుతో షేర్డ్ మొబిలిటీ సేవలను ఏప్రిల్లో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. వచ్చే 18 నెలల్లో ఆరు నగరాల్లో 30,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఇందుకోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. -
జీఎస్టీ 5%, 1% ప్రయోజనం శూన్యమే
హమ్మయ్య! జీఎస్టీ తగ్గింది. నిర్మాణంలో ఉన్న గృహాల మీద 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు గృహాల మీద 8 శాతం నుంచి 1 శాతానికి! బావుందని సంబరపడిపోకండి.. తగ్గిన జీఎస్టీ శ్లాబును కాస్త లోతుగా విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఐటీసీ లేకుండా జీఎస్టీ తగ్గింపుతో పెద్దగా ప్రయోజనం లేదు. సింపుల్గా చెప్పాలంటే తాజా జీఎస్టీలో పన్ను రేటు తగ్గలేదు.. ఐటీసీ ఎంతొస్తుందనే అంశం మీద డెవలపర్లకు, కస్టమర్లకు మధ్య సందిగ్ధత తొలగిందంతే! సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ తగ్గింపు కస్టమర్లకు లాభమా? నష్టమా? అంటే నష్టమే అని చెప్పాలి. పాత, కొత్త రెండు జీఎస్టీ శ్లాబుల్లోనూ ప్రభుత్వానికొచ్చే పన్ను ఆదాయంలో ఎలాంటి మార్పు లేదు. ‘‘కేంద్రం ఐటీసీని నికరంగా 7 శాతంగా గణించింది. ఈ లెక్కన పాత జీఎస్టీలో 7 శాతం ఐటీసీ, 8 శాతం జీఎస్టీ.. రెండు కలిపి 12 శాతంగా ఉండేది. తాజా జీఎస్టీలో 7 శాతం ఐటీసీని ఇవ్వకుండా 1 శాతం జీఎస్టీ కేటాయించింది. తన్ని పడేసినా.. పడేసి తన్నినా తగిలే దెబ్బ కొనుగోలుదారునికే! గత జీఎస్టీలో కస్టమర్లకు ఐటీసీ 7–8 శాతం వరకొచ్చేది. 12 శాతం జీఎస్టీలో మిగిలిన 4–5 శాతం జీఎస్టీ కట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. అంటే గతంతో పోలిస్తే 1–2 శాతం జీఎస్టీ పెరిగినట్టేగా! చ.అ.కు రూ.300–500 పెంపు.. 12 శాతం జీఎస్టీ ఉన్నప్పుడు హైదరాబాద్లో చాలా మంది డెవలపర్లు ఏం చేసేవారంటే.. కస్టమర్ల నుంచి 12 శాతం జీఎస్టీకి బదులు 8 శాతం వసూలు చేసేవాళ్లు. ఐటీసీని బదలాయించేవాళ్లు కాదు! ఒక్కోసారి డెవలపర్లకు ఐటీసీ 7–9 శాతం వరకూ వచ్చేది. దీంతో నిర్మాణ వ్యయం, తిరిగొచ్చిన ఐటీసీ అక్కడికక్కడే సరిపోయేది. కానీ, ఇప్పుడు కేంద్రం ఐటీసీని ఎత్తేసింది. అంటే డెవలపర్లకు నిర్మాణ సామగ్రి మీద వెచ్చించే ఐటీసీ తిరిగి రాదన్నమాట. హైదరాబాద్లో డెవలపర్లకు 15–20 శాతం వరకు మార్జిన్లుంటాయి. ఏప్రిల్ 1 తర్వాతి నుంచి ఐటీసీ రాదు కాబట్టి మార్జిన్లు 5–10 శాతం వరకు తగ్గే అవకాశముంది. ఈ నష్టాన్ని డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తారు. అంటే ప్రాపర్టీ ధరలను పెంచుతారన్నమాట. దీర్ఘకాలంలో ధరలు చ.అ.కు రూ.300–500 వరకూ పెరిగే అవకాశముంది. ఐటీసీ లేకపోతే వ్యయం పెరుగుతుంది.. కొత్త జీఎస్టీ వల్ల స్థలాల ధరలు ఎక్కువ ఉన్న చోట లాభదాయకమని, తక్కువగా ఉన్న చోట పెద్దగా ప్రయోజనం ఉండదని క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. అర్బన్, నాన్–అర్బన్ ఎక్కడైనా సరే నిర్మాణ వ్యయం ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. మెట్రో నగరాల్లో ప్రాజెక్ట్ వ్యయంలో 1/3 వంతు వ్యయం స్థలం మీదనే పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి చోట ఐటీసీ లేకపోవటం అనేది డెవలపర్లకు భారమే. ఇదిలా ఉంటే 1 శాతం జీఎస్టీ ఉన్న అందుబాటు గృహాలు కొందామంటే.. 60 చ.మీ., రూ.45 లక్షల లోపు గృహాలు మెట్రో నగరాల్లో దొరకడం కష్టమే. కొత్త జీఎస్టీలోనూ కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏంటంటే.. ఒక ప్రాజెక్ట్లో 50 ఫ్లాట్లు ఉన్నాయనుకుందాం. గతంలో 25 ఫ్లాట్లను విక్రయించిన డెవలపర్.. ఏప్రిల్ 1 తర్వాతి నుంచి విక్రయించే మిగిలిన ఫ్లాట్లకు ఐటీసీ తీసుకోవాలా? వద్దా? మరి, గతంలో విక్రయించిన ఫ్లాట్లకు ఐటీసీ తిరిగి వస్తుందా? రాదా?! తగ్గించాల్సింది నిర్మాణ సామగ్రి మీద సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి మీద జీఎస్టీని తగ్గించకుండా ప్రాపర్టీలపై జీఎస్టీని తగ్గించి లాభం లేదని టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్మాణ వ్యయంలో అత్యంత కీలకమైన సిమెంట్, స్టీల్ వంటి ఉత్పత్తుల మీద జీఎస్టీ భారం తగ్గించకుండా ప్రాపర్టీల మీద జీఎస్టీ తగ్గించడం.. అది కూడా ఐటీసీ లేకుండా సరైంది కాదని తెలిపారు. ప్రస్తుతం సిమెంట్ మీద 28 శాతం, స్టీల్, టైల్స్, రంగులు, సీపీ ఫిట్టింగ్స్, ఎలక్ట్రిక్ వంటి ఉత్పత్తుల మీద 18 శాతం, ఇటుకల మీద 5 శాతం, ఇసుక, మెటల్స్ మీద 8 శాతం జీఎస్టీ ఉంది. ఇక, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వర్క్ కాంట్రాక్టర్స్ వంటి నిర్మాణ సంబంధమైన సేవల మీద 18 శాతం జీఎస్టీ ఉంది. నిర్మాణ ఉత్పత్తులు, సేవలు అన్నింటినీ 5– 8 శాతం జీఎస్టీలోకి తీసుకురావాలి. భవిష్యత్తులో జనప్రియ గృహాలే! ముందునుంచి కూడా కేంద్రం అందుబాటు గృహాల మీద ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ విభాగానికి 1 శాతం జీఎస్టీతో పాటూ క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) కింద రూ.2.5 లక్షల వరకూ వడ్డీ రాయితీ, పరిశ్రమ హోదాతో చౌక వడ్డీ రేట్లకు గృహ రుణాలు వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. పైగా అఫడబుల్ హౌజింగ్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే భవిష్యత్తులో జనప్రియమైన అందుబాటు గృహాల నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఆధునిక వసతులు, సౌకర్యాలు, లగ్జరీ ఏర్పాట్ల మీద దృష్టిపెట్టిన డెవలపర్లు మళ్లీ పాత బాట పడతారని ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి తెలిపారు. దశాబ్ధం క్రితం హైదరాబాద్లో నిర్మించిన 1000 లోపు చ.అ. ఫ్లాట్లు మళ్లీ దర్శనమిస్తాయని పేర్కొన్నారు. శివారు ప్రాంతాలు, అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతాల్లో అందుబాటు గృహాలను నిర్మిస్తారు. -
పొలం నుంచి వంట గదికి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైతు పండించే పంట వినియోగదారునికి చేరే క్రమంలో మధ్యలో పెద్ద తతంగమే ఉంటుంది. మిల్లర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్.. ప్రతీ వ్యవస్థనూ దాటుకొని ఉత్పత్తులు కస్టమర్కు చేరాలి. అలా కాకుండా పంట ఉత్పత్తులు రైతు నుంచి నేరుగా కస్టమర్కు చేరితే? దీంతో అన్నదాతకు సరైన ధర రావటంతో పాటూ ఉత్పత్తుల వేస్టేజ్, నాణ్యత ఇబ్బందులూ ఉండవు. ఇదే – హైదరాబాద్కు చెందిన అగ్రిప్రెన్యూర్ స్టార్టప్ అవర్ఫుడ్ కాన్సెప్ట్! మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్ బాలారెడ్డి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మా సొంతూరు సూర్యాపేటలోని ఆత్మకూరు గ్రామం. ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ పూర్తయ్యాక.. కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరా. రైతు కుటుంబం కావటంతో పొలం పనులు, అందులోని ఇబ్బందులు బాగా తెలిసినవాణ్ని. టెక్నాలజీ సహాయంతో అగ్రికల్చర్లో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా ఆలోచనలు చేసేవాణ్ణి. అందుకే ఐఐఎం అహ్మదాబాద్లో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశా. ఆ తర్వాత మరో ఇద్దరు మిత్రులు రఘు ప్రసాద్, శశికాంత్లతో కలిసి రూ.3 కోట్ల పెట్టుబడులతో 2016 జనవరిలో అవర్ఫుడ్.కో.ఇన్ ప్రారంభించాం. గ్రామీణ యువతతో పొలం దగ్గర్లోనే ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయించి.. ఆయా ఉత్పత్తులను రెస్టారెంట్లు, హోటల్స్, కేటరింగ్, వ్యాపారస్తుల వంటి రిటైలర్లకు విక్రయించడమే అవర్ఫుడ్ ప్రత్యేకత. డిసెంబర్ నాటికి 500 యూనిట్లు.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో మొత్తం 85 ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతతో లీజ్ రెంటల్ మోడల్లో ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టిస్తున్నాం. ఒక్క యూనిట్ ఏర్పాటుకు రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ప్రతి నెలా 50 యూనిట్లను జత చేస్తూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 500 యూనిట్లను పెట్టాలని లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది నుంచి రాజస్తాన్, జార్ఖండ్, గుజరాత్లో యూనిట్లను నెలకొల్పుతాం. నెలకు రూ.15 కోట్ల ఆదాయం.. ప్రస్తుతం ప్రతి నెలా రిటైలర్ల నుంచి 180 టన్నుల ఉత్పత్తుల ఆర్డర్లు వస్తున్నాయి. గత నెలలో 1.2 కోట్ల ఆదాయం ఆర్జించాం. డిసెంబర్ నుంచి నెలకు రూ.15 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మియాపూర్లో 4 వేల చ.అ.ల్లో సొంత గిడ్డంగి ఉంది. ఇందులోనే అన్ని రకాల ఉత్పత్తులను నిల్వ చేస్తున్నాం. త్వరలోనే వరంగల్, కరీంనగర్ వంటి అన్ని జిల్లా కేంద్రాల్లో గిడ్డంగులను అద్దెకు తీసుకోనున్నాం. ఆయా జిల్లాలో సేల్స్ ఆఫీసులు ఏర్పాటు చేసి.. లోకల్ మార్కెట్లో విక్రయిస్తాం. 2 నెలల్లో రూ.21 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 35 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో 200 మంది ఉద్యోగులను నియమించుకుంటాం. ‘‘ప్రస్తుతం ఆపరేషనల్ బ్రేక్ఈవెన్కు వచ్చాం. ఇటీవలే అమెరికాకు చెందిన ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ మా కంపెనీలో రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టింది. త్వరలోనే మన దేశానికి చెందిన ఓ వీసీ ఫండ్ నుంచి రూ.21 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పేపర్ వర్క్ పూర్తయింది. 2 నెలల్లో డీల్ క్లోజ్ అవుతుంది’’ అని బాలారెడ్డి వివరించారు. -
అమ్మ తోడు.. డబ్బులు వస్తాయి!
ప్రతీచోటా ఆన్లైన్ వినియోగం పెరిగింది. అది ఎంతలా అంటే.. ఆకలేస్తే వండుకోవడం మానేసి.. ఆన్లైన్లో ఆర్డర్ చేసేంతంలా ఆన్లైన్ అలవాటైపోయింది. జోమాటో, స్విగ్గీ, ఫుడ్ పాండాలాంటి ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫుడ్ ఆర్డర్చేస్తే.. క్షణాల్లో మన ముందుకు వచ్చేస్తుంది. అయితే అప్పుడప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసేప్పుడు సాంకేతిక సమస్యల దృష్ట్యా మన డబ్బు కట్ అవుతుంది కానీ ఫుడ్ డెలివరీ కాదు. అయితే మళ్లీ ఐదారు రోజుల తరువాత మన డబ్బు మనకు రిటర్న్ వస్తుంది. ఇలాంటి సమస్య చాలా మందికి ఎదురై ఉంటుంది. అయితే ఓ కస్టమర్కు ఈ విధంగానే జరిగింది. ప్రస్తుతం ఆ కస్టమర్కు, జొమాటోకు మధ్య జరిగిన సంభాషణ బాగా వైరల్ అవుతోంది. ఆ కష్టమర్ ఫుడ్ను ఆర్డర్ చేయగా.. మరోసారి తన ఫుడ్ను ఆర్డర్ చేయాలని జొమాటో కోరింది. అయితే ఇంతకు ముందు కట్ అయిన్ డబ్బులు ఏమయ్యాయని కస్టమర్ అడిగాడు. ఆ డబ్బులు నాలుగైదు రోజుల్లో రిటర్న్ అవుతాయని సదరు కస్టమర్కు తెలిపింది. అయితే నమ్మకం కలగని కస్టమర్.. అమ్మతోడు వేసి చెప్పండి కచ్చితంగా డబ్బులు వస్తాయి కదా? అని అడిగాడు. ‘అమ్మతోడు కచ్చితంగా డబ్బులు వస్తాయ’ని జొమాటో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫన్నీ కన్వర్జేషన్ నవ్వు తెప్పింస్తోందని కొందరు, జొమాటో ప్రామిస్ డేను ఫాలో అవుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. -
లంచ్ బాక్స్ తేవాలా..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓ విద్యార్థి సహచర విద్యార్థి ఇంట్లో ఖరీదైన పెన్సిల్ మర్చిపోయాడు. తెల్లవారితే డ్రాయింగ్ కాంపిటీషన్. ఆ స్టూడెంట్ పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగులు. పెన్సిల్ తెచ్చే సమయం లేక డెలివరీ యాప్ ‘విజ్జీ’ని ఆశ్రయించారు. స్కూల్కు వెళ్లే సమయానికి విద్యార్థి చేతిలోకి ఆ పెన్సిల్ వచ్చి చేరింది. ఇలాంటి అవసరాలే కాదు.. లంచ్ బాక్స్ ఇంటి నుంచి తేవాలన్నా, ఇంట్లో మర్చిపోయిన పెన్ డ్రైవ్, పేపర్స్, పాస్పోర్ట్ వంటివి దరి చేరాలన్నా మేమున్నాం అని అంటోంది విజ్జీ. ఫుడ్, గ్రాసరీ డెలివరీ కంపెనీలకు భిన్నంగా ఈ స్టార్టప్ సేవలను విస్తరిస్తోంది. కస్టమర్ కోరితే రూ.10,000 వరకు క్యాష్ సైతం విజ్జీ ఉద్యోగి తీసుకొచ్చి ఇస్తారు. పేటీఎం ద్వారా వినియోగదారుడు ఆ మొత్తాన్ని కంపెనీకి చెల్లించాలి. పేటీఎం లావాదేవీ చార్జీతోపాటు డెలివరీ చార్జీ ఉంటుంది. ఏడాదిలో 1,000 మందికి ఉపాధి... ఎన్నారైలు రవి బత్తి, రవి గొల్లపూడి నాలుగు నెలల కిందట విజ్జీని ప్రారంభించారు. ప్రస్తుతం 15 మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. డిసెంబరుకల్లా ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని లకి‡్ష్యంచుకున్నట్లు రవి బత్తి తెలిపారు. ఇప్పటి వరకు 1,300 మంది కస్టమర్లు 3,000 పైచిలుకు ఆర్డర్లు ఇచ్చారని చెప్పారు. మూడు కిలోమీటర్ల వరకు డెలివరీ చార్జీ రూ.20. ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.10 ఉంటుందని రవి గొల్లపూడి పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్కు రోజుకు 8 గంటలకు గాను నెలకు రూ.14,000 వేతనం, రూ.3,000 పెట్రోల్ అలవెన్స్ ఇస్తున్నామని చెప్పారు. ‘ఆహారోత్పత్తుల తయారీదార్లకు డెలివరీ పెద్ద సమస్య. విజ్జీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. వారి వ్యాపార వృద్ధికి మా సేవలు ఉపయోగపడుతున్నాయి. వారు తయారు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తాం’ అని వివరించారు. -
క్షేత్రం పేరుతో జోరుగా రియల్ వ్యాపారం
ద్వారకాతిరుమల: ‘శ్రీవారి క్షేత్రానికి కూతవేటు దూరంలోనే.. నాలుగడుగులేస్తే స్వామి సన్నిధికి చేరుకోవచ్చు.. అతి తక్కువ ధరకు ప్లాటును పొందండి.. త్వరపడండి..’ అంటూ కొందరు రియల్ వ్యాపారులు ద్వారకాతిరుమల క్షేత్రంలో జోరుగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. క్షేత్రానికి సమీపంలో ఉన్న గ్రామాల్లోని కొండ గుట్టలను సైతం కొందరు వ్యాపారులు వెంచర్లుగా మార్చేస్తున్నారు. కనీసం అక్కడ మంచినీరు కూడా దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సంపాదనే ధ్యేయంగా పలువురు వ్యాపారులు మాయ మాటలు చెబుతూ, అమాయకులకు ఆ ప్లాట్లను అంటగడుతున్నారు. కొనుగోలు చేసిన తరువాత అవి ఎందుకూ పనికిరాక అనేకమంది లబోదిబోమంటున్నారు. దేవుడి సన్నిధికి దగ్గర్లో ఉండొచ్చన్న ఆశతో రూ. లక్షలు కుమ్మరించి కొనుగోలు చేసిన ప్లాట్లు, అక్కరకు రాకపోయే సరికి, తిరిగి వాటిని వదిలించుకునేందుకు కొనుగోలుదారులు నానా తంటాలు పడుతున్నారు. చినవెంకన్న సాక్షిగా భక్తులను టార్గెట్ చేస్తూ సాగుతున్న వ్యాపారమిదీ.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ద్వారకాతిరుమల ఒకటి. ఇక్కడ సెంటు భూమి ఉంటే చాలనుకునేవారు కోకొల్లలు. ఎందుకంటే పుణ్యక్షేత్రంలో శేషజీవితాన్ని గడిపితే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నది కొందరి భక్తుల భావన. ఉద్యోగరీత్యా ఇక్కడకు వచ్చేవారిలో అధికశాతం మంది ఆలోచన కూడా అదే. అందుకే ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో ప్రస్తుతం ఎకరం భూమి రూ.కోటి పైమాటే పలుకుతోంది. ఇక ఆలయానికి సమీపంలో అయితే చెప్పనక్కరలేదు. ధరలు వింటే గుండెగుబేల్మంటుంది. క్షేత్రంలో గజం భూమి రూ.25 వేలకు పైగా పలుకుతుంటే, కుంకుళ్లమ్మ ఆలయ సమీప ప్రాంతాల్లో గజం భూమి రూ.15 వేల వరకు ఉంది. అయినా కొనుగోలు చేసేందుకు చాలా మంది వెనకాడటం లేదు. కొండల్లో రియల్ వెంచర్లు: ద్వారకాతిరుమల పరిసర గ్రామాల్లోని కొండప్రాంతాల్లో సైతం రియల్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చుక్కనీరు కూడా దొరకని ప్రదేశాల్లో వెంచర్లు వేసి జోరుగా విక్రయిస్తున్నారు. వ్యాపారులు చేసే ప్రచార ఆర్భాటాలను చూసి అనేక మంది, భవిష్యత్తులో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఆశతో ప్లాట్లను రూ. లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇలా కొనుగోలు చేసిన వారు చాలా మంది, తిరిగి వాటిని అమ్ముకునే వీలు లేక నానా అవస్థలు పడుతున్నారు. రాళ్లకుంట, సత్తెన్నగూడెం, తిమ్మాపురం తదితర గ్రామాల్లోని రహదార్ల పక్కనున్న వెంచర్లు ఇందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. భూములకే రెక్కలొచ్చాయి: క్షేత్రంలో ఏకంగా భూములకే రెక్కలొచ్చాయి. ఇక్కడ స్థలాల విలువ రూ.కోట్లు పలుకుతుండటం వల్ల కొందరు దళారులు స్థానిక వసంత్నగర్ కాలనీ వద్ద ఉన్న ఆర్ఎస్ నంబర్ 11, 1/2 లోని ఎంతో విలువైన కొండ పోరంబోకు భూమిని ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా సొంత భూముల్లా దర్జాగా అమ్ముకుని, లక్షలు మూటగట్టుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లినా ఇప్పటి వరకు ఫలితం లేదు. క్షేత్ర పరిసరాల్లో భూముల ధరలు ఏవిధంగా పెరుగుతున్నాయో.. అదేవిధంగా అన్యాక్రాంతమవుతున్నాయి. ఒక పక్క రియల్ వ్యాపారులు.. మరో పక్క దళారులు తమ దందాను దర్జాగా సాగిస్తున్నారనడానికి ఈ భూబాగోతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. -
చంచల్గూడ జైలు పెట్రోల్ బంక్లో కలకలం
-
ట్రిమ్మర్కు బదులు కండోమ్స్ ప్యాకెట్లు!
కోల్సిటీ(రామగుండం): ఆన్లైన్ సంస్థల మోసం మరోసారి వెలుగు చూసింది. గడ్డం గీసుకోవడానికి ఉపయోగించే ఎలక్ట్రిక్ షేవర్ (ట్రిమ్మర్) మిషన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే... కస్టమర్కు కండోమ్ ప్యాకెట్లు పంపించిన విడ్డూరమైన సంఘటన గోదావరిఖనిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖని లక్ష్మీనగర్లో ఎనగందుల శ్రీనివాస్ సెలూన్నిర్వహిస్తున్నాడు. కస్టమర్లకు మెరుగైన సేవలందించడం కోసం ఇటీవల ఎలక్ట్రిక్షేవర్ మిషన్ కొనుగోలు చేయాలని స్మార్ట్ఫోన్ ద్వారా ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీలో ఆర్డర్ చేయడంతో పంపించారు. షేవర్ను వాడకముందే అది పని చేయలేదు. దీంతో ఆన్లైన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో, షేవర్ను స్వాధీనం చేసుకొని డబ్బులు తిరిగి పంపించారు. సదరు కంపెనీపై నమ్మకం ఏర్పడడంతో ఈనెల 11న మరో షేవర్ మిషన్ కొనుగోలుకు అదే సంస్థకు ఆర్డర్ ఇచ్చారు. ఆదివారం కొరియర్ బాయ్ ఇంటికి వచ్చి పార్సిల్ ఇచ్చాడు. తీరా దాన్ని తెరిచి చూడగా దాంట్లో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. విస్తూపోయిన బాధితుడు హుటాహుటిన సదరు కొరియర్ కార్యాలయానికి వెళ్లి నిలదీశాడు. తమకు సంబంధం లేదని, ఆర్డర్ ఇచ్చిన ఆన్లైన్ సంస్థకే ఫిర్యాదు చేయాలని చెప్పి తప్పించుకున్నారు. దీంతో సదరు సంస్థకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో, ఆర్డర్ చేసిన వస్తువుకు మరోసారి పరిశీలించి పంపిస్తామని అప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. కస్టమర్ చేతికి రిటన్ ఆర్డర్గా బుక్ చేసిన షేవింగ్ మిషన్ పార్సిల్ వచ్చాక, కండోమ్ ప్యాకెట్లను తిరిగి పంపించాలని సంస్థ ప్రతినిధులు సూచించారని బాధితుడు తెలిపాడు. తక్కవ ధరలో లభిస్తున్నాయనే ఆశతో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇలాంటి మోసాలే జరుగుతాయని పలువురు వెల్లడిస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
అప్పు తీర్చమన్నందుకు.. ప్రాణం తీశాడు
కోల్కతా : పాత బాకీ తీర్చమన్నాడన్న కోపంతో బిర్యానీ బండి యాజమానిపై తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ సంఘటన ఆదివారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరగణ జిల్లాలోని భట్పారా పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భట్పారా పారిశ్రామిక వాడకు చెందిన సంజయ్ మండల్(40) తోపుడు బండిపై బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫిరోజ్(26) అతని స్నేహితులు అక్కడికి వచ్చారు. తమకు బిర్యానీ పార్శిల్ కట్టాల్సిందిగా సంజయ్ని కోరారు. దీంతో సంజయ్ మండల్ ముందుగా డబ్బులు ఇస్తేనే బిర్యానీ ఇస్తానన్నాడు. ఆగ్రహించిన ఫిరోజ్ బిర్యానీ అధిక ధరలకు విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ సంజయ్తో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దది చేయడం ఇష్టంలేని సంజయ్ వారిని పాత బాకీ 190 ఇవ్వాలన్నాడు. పాత బాకీ అడగటంతో కోపగించిన ఫిరోజ్ వెంట తెచ్చుకున్న తుపాకీతో సంజయ్పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో సంజయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహ్మద్ ఫిరోజ్ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపినపుడు ఫిరోజ్ వెంట ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోకుంటే మోసపోయే ఆస్కారముందని జాయింట్ ఎస్.వెంకట్రావు అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక రెవెన్యూ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సదస్సును జేసీ ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ చెల్లింపులతో వస్తు సేవలు, కొనుగోళ్ల సందర్భంగా నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగదారులు వస్తు సేవలు, కొనుగోలు వ్యవహారాల పై అవగాహన పెంచుకోవాలని, ప్రతీ వస్తువుకు రశీ దు తీసుకోవాలని సూచించారు. డీఎస్ ఓ శారదాప్రియదర్శిని మాట్లాడుతూ వినియోగదారులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హక్కులు, బా ధ్యతలు తెలుసుకోవాలన్నారు. వినియోగదారుల వ్యవహారాల నిపుణు లు, ఎంవీఎస్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్కుమార్ మాట్లాడు తూ వినియోగదారులు ప్రశ్నించే తత్వా న్ని అలవర్చుకోవాలని సూచించారు. సివిల్ సప్లయీస్ డీఎం బిక్షపతి, డ్రగ్ ఇన్స్పెక్టర్ దినేష్కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్, మున్సిపల్ కమీషనర్ సురేందర్, వినియోగదారుల క్లబ్ కన్వీ నర్ బాల్లింగయ్య పాల్గొనగా.. రెవె న్యూ సమావేశ మందిరం ఎదుట పలు శాఖల స్టాళ్లు ఏర్పాటుచేశారు. -
చెత్త రివ్యూ.. వెతుక్కుంటూ వెళ్లి మరీ...
బీజింగ్ : ఆన్లైన్ షాపింగ్ కంపెనీలకు కస్టమర్లు ఇచ్చే రివ్యూల ఆధారంగా కూడా అమ్మకాలు జరుగుతుంటాయి. అందుకే ఉత్పత్తులు, వినియోగదారులకు సేవలు అందించే విషయంలో సంస్థలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అయినప్పటికీ ఏదో ఒక దగ్గర పొరపాటు దొర్లటం ఖాయం. ఇదిలా ఉంటే చైనాలో జరిగిన ఓ ఘటన ఆసక్తికరంగా ఉంది. సెంగ్స్యూ పట్టణానికి చెందిన క్సియో డై అనే మహిళ 300 యువాన్ల విలువ చేసే దుస్తులను టావోబావో అనే ఆన్లైన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసింది. అయితే డెలివరీ ఆలస్యం కావటంతో(మూడు రోజులు) సదరు కంపెనీ సర్వీస్ పట్ల ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నెగటివ్ రివ్యూను ఫీడ్ బ్యాక్లో పేర్కొంది. మీ సర్వీసులు చాలా చెత్తగా ఉన్నాయి అంటూ అందులో పేర్కొంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మార్ట్ యాజమాని ఝాంగ్ వెతుక్కుంటూ వెళ్లి మరీ చితకబాదాడు. ఇందుకోసం అతను 852 కిలో మీటర్లు ప్రయాణించి సెంగ్స్యూ పట్టణానికి చేరుకున్నాడు. చివరాఖరికి నడిరోడ్డుపై ఆమెపై దాడి చేశాడు. అతని గాడి పిడిగుద్దులకు ఆమె ముక్కు పగిలిపోగా.. చెయ్యి విరిగిపోయింది. పోలీసులు ఝాంగ్ను అరెస్ట్ చేయగా.. కోర్టు పది రోజుల జైలు శిక్ష విధించింది. -
చంపాలా? వద్దా?
కథాసారం అతడు మౌనంగా లోపలికి వచ్చాడు.బుల్లెట్లున్న తోలుపట్టీని, దానికి వేలాడుతున్న తుపాకి సహా తీసి గోడకు వున్న కొక్కానికి తగిలించాడు. తన మిలిటరీ టోపీని కూడా అక్కడే పెట్టాడు. తర్వాత టై ముడి విప్పుతూ, ‘ఈ వేడిమి భయంకరంగా వుంది. నాకు గడ్డం చెయ్’ అని కుర్చీలో కూర్చున్నాడు. క్యాప్టెన్ టోరెస్! అతడిని చూడగానే క్షురకుడికి వణుకు మొదలైంది. భయంతో కూడిన భావోద్వేగాన్ని బయట పడనీయకుండా, తన దగ్గరున్న కత్తుల్లో అన్నిటికన్నా వాడిగా వున్నదాన్ని తోలుపట్టీ మీద పైకీ కిందకూ తిప్పుతూ పదునును మరింత పెంచడానికి ప్రయత్నించాడు. తర్వాత చేతి వేలితో సుతారంగా ఆ పదునును అంచనా వేశాడు. టోరెస్ గడ్డం నాలుగు రోజులదై వుంటుంది! అతడు నాలుగు రోజులుగా దళాలను వెతికే పనిలో ఉన్నాడు. అందువల్ల ముఖం ఎండ వేడిమికి కమిలి ఎర్రబడింది. క్షురకుడు జాగ్రత్తగా సబ్బు నురగ తయారు చేయటం ప్రారంభించాడు. కొన్ని సబ్బుముక్కల్ని ప్లాస్టిక్ కప్పులో పడేసి, కొన్ని వేణ్నీళ్లను అందులో పోసి, బ్రష్తో తిప్పటం మొదలెట్టాడు. ‘మా పటాలంలోని మిగిలినవాళ్లక్కూడా ఇంతే గడ్డం పెరిగి వుండాలి’ అన్నాడు టోరెస్. ‘ముఖ్యమైనవాళ్లు మాకు దొరికారు. కొందర్ని చంపేశాం. మరికొందరు ఇంకా బతికేవున్నారు. కానీ త్వరలోనే వాళ్లంతా చనిపోతారు’ అని కూడా అన్నాడు. ‘ఎందర్ని పట్టుకున్నారు మీరు?’ అడిగాడు క్షురకుడు. ‘పద్నాలుగు మందిని. వాళ్ల ఆచూకీ కనుక్కోవటం కోసం మేము అడవిలో చాలా లోపలికి వెళ్లాల్సి వచ్చింది. మిగిలినవాళ్లను కూడా పట్టుకుంటాం. ఒక్కడు... ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు’. క్షురకుడు ఆందోళన చెందాడు. అతడు కూడా రహస్య దళానికి చెందినవాడే! డ్రాయరు సొరుగులోంచి గుడ్డను తీసి టోరెస్ మెడ వెనకాల ముడి వేశాడు. ‘మా చర్య ఈ నగర ప్రజలకు మంచి గుణపాఠాన్ని నేర్పివుండాలి’ అన్నాడు టోరెస్. అతడు బాగా అలసిపోయినట్టుగా కళ్లు మూసుకుని, సబ్బు నురగ తాలూకు చల్లదనాన్నీ, హాయినీ అనుభవించడానికి వేచి వున్నాడు. టోరెస్కు అంత సమీపంగా ఎప్పుడూ వెళ్లలేదు క్షురకుడు. నగర ప్రజలందరినీ స్కూలు ప్రాంగణంలో గుమిగూడాలని టోరెస్ ఆజ్ఞ జారీ చేసినప్పుడు మాత్రం ఒక్క నిమిషం సేపు అతడికి ఎదురుగా నిలిచాడు. అక్కడ నలుగురు విప్లవకారులను చెట్లకు వేలాడదీసి తుపాకులతో కాల్చేస్తుంటే ప్రజలందరూ చూడాలని టోరెస్ కోరిక. గాయాలతో చెదిరిపోయిన ఆ శవాలను చూసి, ఆ చర్యకు ముఖ్యకారకుడైన మిలిటరీ అధికారి ముఖాన్ని అప్పుడు అంత పరీక్షగా చూడలేదు. కానీ ఆ ముఖాన్నే ఇప్పుడు తన చేతుల్లోకి తీసుకోబోతున్నాడు. టోరెస్ అందవికారంగా ఏం లేడు. ఆ గడ్డం వల్ల వయసు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. అతడు మంచి ఊహాశాలీనత ఉన్నవాడయ్యుండాలి. లేకపోతే విప్లవకారుల్ని నగ్నంగా చెట్లకు వేలాడదీసి, వాళ్ల శరీరాలను టార్గెట్లు చేస్తూ షూట్ చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? సబ్బు నురగను అనుభవిస్తూ, కళ్లు మూసుకునే అన్నాడు టోరెస్: ‘నేను ఎంతగా అలసిపోయి వున్నానంటే ఇప్పుడు నేరుగా నిద్రలోకి జారుకోగలను. కానీ ఈ సాయంత్రం నేను చేయాల్సిన పని ఎంతో వుంది’. సబ్బు నురగ పులమటం ఆపి, ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా, ‘మళ్లీ కాల్పులు కొనసాగిస్తారా?’ అడిగాడు క్షురకుడు. ‘అట్లాంటిదే. కానీ అంత తీవ్రమైన చర్య కాదు’. క్షురకుడి చేతులు మళ్లీ వణికాయి. అయినా ఇతర కస్టమర్లకు చేసినట్టుగానే ఇతడికి కూడా ఒక్క చుక్క రక్తం రాకుండా జాగ్రత్తగా గడ్డం తీయాలి. వెంట్రుకల మీద కత్తిని పక్కకు పోనీయకూడదు. అరచేతి వెనుక భాగాన్ని ముఖానికి ఆనించి కదిపితే ఒక్క వెంట్రుక కూడా లేనట్టు తెలియాలి. కత్తి బ్లేడును తెరిచి సైడ్ లాక్ నుండి గీయటం మొదలెట్టాడు. కత్తి మెత్తగా జారుతోంది. టోరెస్ వెంట్రుకలు మందంగా, బిరుసుగా ఉన్నాయి. గీస్తుంటే చిన్నగా చర్మం తేలుతోంది. ‘ఈరోజు ఆరు గంటలకు బడి దగ్గరకు రా’ అన్నాడు టోరెస్. ‘ఆరోజు లాగానే జరగబోతోందా?’ ‘ఇంకా బాగా కూడా వుండొచ్చు’ ‘ఏం చెయ్యాలనుకుంటున్నారు?’ ‘ఇంకా నాకే తెలియదు. కానీ మంచి వినోదం వుండబోతోంది’ ‘అందర్నీ శిక్షించాలని ప్లాను వేసుకున్నారా?’ ధైర్యం చేసి అడిగాడు. ‘అందర్నీ’ అద్దంలో కనబడే వీధిని చూశాడు క్షురకుడు. ముందరిలాగే కిరాణా దుకాణం, అందులో ఇద్దరో ముగ్గురో కస్టమర్లు ఉన్నారు. గడియారం రెండూ ఇరవై సూచిస్తోంది. మెడమీద కత్తిని మెల్లగా కదుపుతున్నాడు. అక్కడ గీసేటప్పుడు చాలా చాకచక్యంగా ఉండాలి. వెంట్రుకలు మందంగా లేకపోయినా చిన్నచిన్న రింగులుగా మెలి తిరిగినయ్. ఆ చర్మరంధ్రాల్లో ఏదైనా ఒకటి తెరుచుకుని రక్తాన్ని స్రవింపజేయగలదు. విప్లవకారుల్లో ఎంతమంది చంపించాడతడు! ఎంతమందిని చిత్రవధల పాలు చేశాడు! తన చేతుల్లో వున్న టోరెస్ ముఖానికి శుభ్రంగా గడ్డం గీసి, భద్రంగా ప్రాణాలతో వదిలేయటం భరించరాని విషయమనిపించింది. నిజానికి అతణ్ని చంపటం ఇప్పుడు ఎంత సులభం! గొంతును సర్రుమని కోసి. ప్రతిఘటించటానికి కూడా సమయం ఇవ్వకుండా. కళ్లు మూసుకుని వున్నాడు కనుక మెరిసే కత్తిని గుర్తించలేడు. మెడలోకి కత్తిని దించితే అందులోంచి రక్తం చిమ్మి గుడ్డనూ, కుర్చీనీ, నేలనూ మొత్తంగా తడిపేయగలదు. వెచ్చని రక్తం నేల మీదుగా పారి వీధిలోకి కూడా ప్రవహిస్తుంది. లోతుగా పెట్టే గాటు పెద్ద నొప్పిని కూడా కలిగించదు. మరి శవాన్ని ఏం చేయాలి? ఎక్కడ దాచాలి? క్యాప్టెన్ టోరెస్ను చంపిన హంతకుడు... గడ్డం గీస్తున్నప్పుడు గొంతు కోశాడు పిరికిపంద, అనుకుంటారు జనం. మనందరి వైపు నుండి ప్రతీకారం తీర్చుకున్నాడు, అని కూడా అనుకోవచ్చు! పట్టువస్త్రంలాగా, మెత్తని రబ్బరు ముక్కలాగా అతని చర్మం సులభంగా తెగిపోతుంది. మనిషి చర్మం కన్నా ఎక్కువ మెత్తనైనది మరేదీ లేదేమో! బయటికి చిమ్ముకుని రావడానికి లోపల రక్తం వుండనే వుంటుంది. కానీ నేను హంతకుణ్ని కాదలుచుకోలేదు. నువ్వు గడ్డం గీయించుకోవటం కోసం నా దగ్గరికి వచ్చావు. నేను నా పనిని గౌరవప్రదంగా చేస్తాను. నా చేతులకు రక్తం అంటుకోవడం నాకిష్టం లేదు. కేవలం సబ్బు నురగ చాలు! నున్నగా శుభ్రంగా గడ్డం గీకేశాడు క్షురకుడు. టోరెస్ అద్దంలో చూసుకున్నాడు. అరచేతుల్తో చెంపల్ని ముట్టుకుని, ‘థాంక్స్’ అన్నాడు. కుర్చీలోంచి లేచి, బెల్టు, పిస్తోలు, టోపీ చేతిలోకి తీసుకున్నాడు. ప్యాంటు జేబులోంచి నాణాల్ని బయటికి తీసి ఇచ్చాడు. బయటికి వెళ్లబోతూ, ద్వారం దగ్గర ఆగి– ‘నువ్వు నన్ను చంపుతావని అన్నారు కొందరు. ఆ విషయం తేల్చుకోవటానికి ఇక్కడికి వచ్చాను. చంపటం అంత సులువైన పనికాదు. నేను చెబుతున్న ఈ వాక్యంలో ఎంతో వాస్తవం ఉంది’ అన్నాడు టోరెస్. క్షురకుడు అక్కడే ఉండిపోయాడు. -
ఐ ఫోన్ కస్టమర్కి భారీ ఊరట
ఆపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టు షాక్ ఇచ్చింది. ఖరీదైన ఐ ఫోన్ను కొనుగోలు చేస అష్టకష్టాలుపడిన ఓ కస్టమర్కి భారీ ఊరటనిస్తూ తీర్పు చెప్పింది. వినియోగదారుడి కోరికపై ఐ ఫోన్ రిఫండ్ చేయాలని, లేదా అదనపు ధర చెల్లింపు తర్వాత హై ఎండ్ మోడల్ ఐ ఫోన్ ను ఇవ్వాలని తీర్పు చెప్పింది. లేదంటే రూ.54వేలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు సదరు కస్టమర్ పడిన మానసిక వేదనకు, న్యాయ ఖర్చులకుగాను రూ.4,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే... సౌరాష్ట్ర ధరోజీ టౌన్కి చెందిన ఇక్బాల్ దంధల్ అనే విద్యార్థి 2015లో రూ.54వేలు వెచ్చించి ఓ ఐఫోన్ను కొన్నాడు. దీంతోపాటు ఫోన్కు అదనపు సొమ్ము చెల్లించి డిసెంబర్ 2017 వరకు ఎక్స్టెండెడ్ వారంటీ పొందాడు. అయితే ఇక్బాల్ కొన్న ఐఫోన్ కొద్ది నెలలకే పాడై పోయింది. ఈ విషయాన్ని లోకల్ యాపిల్ డీలర్ దృష్టికి తీసుకెళ్లి, ఆ ఫోన్ను మార్చి అదే మోడల్కు చెందిన కొత్త ఐఫోన్ను తీసుకున్నాడు. అయితే రెండోసారి కూడా సేమ్ సీన రిపీట్. మూడో సారి కూడా ఇక్బాల్కు ఈ కష్టాలు తప్పలేదు. దీంతో ఈ బాధలు తన వల్ల కాదని .. తనకు లేటెస్ట్ మోడల్ ఐ ఫోన్ కావాలని...దీనికి అదనంగా డబ్బులు కూడా చెల్లిస్తానని కోరాడు. కానీ ఇందుకు డీలర్ స్పందించకపోవడంతో విసిగిపోయిన ఇక్బాల్ యాపిల్ ఇండియా కంపెనీతోపాటు ఆ డీలర్పై రాజ్కోట్ కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ కొనసాగించిన న్యాయస్థానం ఇక్బాల్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. -
ఫుడ్ బాగా లేదన్న పాపానికి..!?
ముంబై : రోడ్సైడ్ హోటల్లో ఫుడ్ బాగా లేదన్న ఓ కస్టమర్పై సలసల కాగే నూనె పోసేందుకు ప్రయత్నించాడో యజమాని. షాకింగ్కు గురి చేసే ఈ ఘటన ముంబై శివారులోని ఉల్లాస్ నగర్లో జరిగింది. రోడ్ పక్కగా ఉండే ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు ఓ యువకుడు వెళ్లాడు. తింటున్న టిఫిన్ రుచిగా లేదని చెప్పాడు. అంతేకాక ఇంత చట్నీలు కూడా సరిగ్గా లేవని యువకుడు హొటల్ యజమానితో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాక టిఫిన్ చేసేందుకు వస్తున్న ఇతర కస్టమర్లతో.. ఇక్కడ టిఫిన్ బాగాలేదని యువకుడు చెప్పడంతో హోటల్ యజమానికి ఆగ్రహం తెప్పించింది. గొడవ పెట్టుకున్న కస్టమర్పై కోపం తెచ్చుకున్న హోటల్ యజమాని అతనిమీద సలసల మరిగే నూనెను పోసేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన కస్టమర్ అక్కడనుంచి పారిపోయాడు. అయినా అతని మీద నూనె పోసేందుకు హోటల్ యజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ఘటన అంతా అక్కడ ఉండే సీసీటీవీలో రికార్డయింది. కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి.. సదరు హోటల్ యజమానిపై కేసును నమోదు చేశారు పోలీసులు ఫుడ్ బాగా లేదన్న కస్టమర్పై హోటల్ యజమాని గొడవ -
ఎయిర్టెల్ అన్ యూజ్డ్ డేటా మాయ..చార్జీల బాదుడు
సాక్షి, హైదరాబాద్: ఉచిత ఆఫర్లు, డాటా ప్రయోజనాలు అంటూ ఊదర గొట్టే టెలికాం ఆపరేటర్లు.. అంతిమంగా వినియోగదారుల నెత్తిన టోపీ పెడుతున్నాయి. దీనికి తాజా పరిణామాలే ఓ ఉదాహరణ. ఒకవైపు టెలికాం మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన రిలయన్స్ జియో టారిఫ్ రివ్యూలతో చార్జీల బాదుడుకు దిగింది. దీంతో మొబైల్ యూజర్లు భగ్గుమంటున్నారు. మరోవైపు ఈ బాదుడులో దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ కూడా తక్కువేమీ తినలేదు....అన్ యూజ్డ్ డేటా క్యారీ ఫార్వార్డ్ అంటూ.. మెసేజ్లతో కస్టమర్లను మభ్యపెడుతూ.. భారీ ఎత్తున చార్జీలను వడ్డిస్తోందన్న ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. హైదరాబాద్కు చెందిన ఓ ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ వినియోగదారుడి అనుభవం ఈ ఆరోపణలను మరింత బలపరుస్తోంది. అన్ యూజ్డ్ డాటా 4.14 జీబీ ఈ నెలకు యాడ్ అయినట్టుగా ఎయిర్ టెల్ నుంచి ఆ వినియోగదారుడికి అక్టోబర్ 17న రెండు సార్లు మెసేజ్ వచ్చింది. ఎయిర్ టెల్ అఫీషియల్ యాప్ లోనూ డాటా యాడ్ అయినట్టుగా చూపించింది. అయితే కేవలం రెండు రోజుల్లో అన్ బిల్డ్ బిల్లు మాత్రం 302గా చూపించడంతో విస్తుపోవడం కస్టమర్ వంతైంది. ఇదే విషయంపై కస్టమర్ కేర్ ను సంప్రదిస్తే మీకు ఎలాంటి డాటా ప్యాక్ లేదు. డాటా యూజ్ చేసినందుకే బిల్ పడిందన్న సమాధానం ఇచ్చింది. మరి ఎయిర్ టెల్ నుంచి మెసేజ్ ఎందుకు వచ్చింది.. యాప్ లో డాటా ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోందని ప్రశ్నిస్తే.. షరా మామూలుగానే సర్వర్ ప్రాబ్లం అనే సమాధానం రావడంతో సదరు ఎయిర్టెల్ యూజర్ మండి పడుతున్నారు. వాడని సేవలకు తానెందుకు భారాన్ని భరించాలని, తన లాంటి వినియోగదారులు ఇంకా ఎంతమంది ఉన్నారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వినియోగదారుల నుంచి అక్రమంగా చార్జీలను గుంజడం అన్యాయని, తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్మార్ట్ఫోన్, డాటా యూసేజ్ నిత్యావసరంగా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో వినియోగదారులనుంచి అక్రమంగా అనధికారిక అధిక ఫీజులు వసూలు చేయడం నేరమని నిపుణులు పేర్కొన్నారు. వీటిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉంటూ, న్యాయపోరాటం చేయాలని సూచిస్తున్నారు. -
కస్టమర్లకు షాకిచ్చిన మరో బ్యాంకు
సాక్షి, ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా మరో ప్రభుత్వ రంగ బ్యాకు తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా చార్జీల వడ్డన మొదలు పెట్టేసింది. ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్న ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఇక మీదట బాదుడు షురూ చేయనుంది. పీఎన్బీ ఏటీఏల విత్డ్రాలపై నియంత్రణ విధించింది. ఏటీఎం ద్వారా నెలకు 5 లావాదేవీలు మించితే చార్జీని వసూలు చేయనున్నట్టు ఒక ప్రకటలో తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈసవరించిన నిబంధనలు అమలు కానున్నాయి. సేవింగ్ / కరెంట్/ ఓవర్డ్రాఫ్ట్ ఖాతాదారులందరూ నెలకు అయిదు సార్లు పరిమితికి మించితే ఒక్కో లావాదేవీకి రూ.10 వసూలు చేయనున్నట్టు పేర్కొంది. పీఎన్బీ ఏటీఎం లావాదేవీలకుడా ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే, బ్యాలెన్స్ ఎంక్వయిరీ, ఫండ్ బదిలీ లేదా గ్రీన్ పిన్ అభ్యర్థన లాంటి ఇతర నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు ఎటువంటి ఛార్జ్ ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది. తద్వారా ఉచిత లావాదేలకు చరమగీతం పాడి ఖాతాదారులపై భారం పెంచింది. -
జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్..!
ముంబై: ఉచితడేటా, వాయిస్ కాలింగ్ ఆఫర్లతో ఎంజాయ్ చేస్తున్న రిలయన్స్ జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్. జియో కస్టమర్ల డేటా ఆన్లైన్లో లీక్ అయిందన్న వార్త ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. జియో వినియోగదారుల సమాచారం ప్రస్తుతం ఒక వెబ్సైట్లో అందుబాటులోఉందన్నవార్త హల్ చల్ చేస్తోంది. లక్షల కొద్దీ రిలయన్స్ జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం ఆన్లైన్లో మాజిక్ ఏపీకే.కాం అనే వెబ్సైట్లో లీక అయిందనే కథనాలు ఆదివారం వెలువడ్డాయి. సంబంధిత వెబ్సైట్ యూఆర్ఎల్ను కొంతమంది ట్విట్టర్లో షేర్ చేశారు. జియో కస్టమర్ల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్తదితర సమాచారం ఈ సైట్ లో దర్శనిమస్తున్నాయని ట్వీట్ చేయడంతో దుమారం రేగింది. డేటాబేస్ ఉల్లంఘన ఏమేరకు ఉంది అనేది మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. అయితే ఈ వార్తను జియోతీవ్రంగా ఖండించింది. వదంతులను నమ్మవద్దని వివరించింది. మరోవైపు ఈ వార్తలను రిలయన్స్ జియో కొట్టిపారేసింది. తమ వినియోగదారుల డేటా సురక్షితంగా ఉందని గట్టిగా వాదిస్తోంది. ఎలాంటి డేటా లీక్ కాలేదని జియో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తమ కస్టమర్ల డేటా భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అనంతరం డేటాలీక్ అనేది అవాస్తవమని, నిరాధారనమైనదని జియో తేల్చింది. దీనిపై మరింత విచారణ కొనసాగుతోందని చెప్పారు. కాగా రిలయన్స్ జియోలో సుమారు 120 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నట్టు అంచనా. -
సామాజిక సేవలో టాటా మోటార్స్
కర్నూలు (టౌన్) ; టాటా మోటార్స్ సంస్థ తమ వంతుగా సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆ సంస్థ ఏరియా మేనేజర్ మీర్జా దావుద్ బేగ్ పేర్కొన్నారు. మంగళవారం టాటా మోటార్స్ ఆధీకృత డీలర్ మేరు ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో స్థానిక సస్య ప్రైడ్ హోటల్ సమావేశ హాలులో టాటా డిలైట్ కస్టమర్ల పిల్లలకు స్కాలర్ షిప్పులు పంపిణీ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి పది, ఇంటర్లో 75 శాతంపైగా మార్కులు సాధించిన విదా్యర్థినులకు ప్రశంసాపత్రం, రూ. 25 వేలు నగదును చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏరియా మేనేజర్ మాట్లాడుతూ టాటా కస్టమర్ల కోసం 2011 సంవత్సరం నుంచి ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. టాటా డిలైట్ కార్డు కలిగిన డ్రైవర్లకు ప్రమాదం జరిగితే రూ. 2.45 లక్షలు నుంచి రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అలాగే ఆసుపత్రి ఖర్చుల కింద రూ. 30 వేల నుంచి రూ. 50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేరు ఆటోమొబైల్స్ సీఈఓ జయరాం, సంస్థ మేనేజర్లు, సభ్యులు పాల్గొన్నారు. -
షాపింగ్ మాల్ సంచలన వీడియో
షాపింగ్ మాల్స్, పెద్దపెద్ద స్టోర్లలో కస్టమర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో.. లేదా.. కస్టమర్లను ఇబ్బంది పెట్టే స్టోర్ల తీరును వెల్లడించే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కస్టమర్ది తప్పంటే, ఇంకొందరు షాప్ ఓనర్లదే తప్పంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడు పొరపాటున మన చెయ్యో, కాలో తగిలి హ్యాంగర్లకుండే దుస్తులో, తేలికపాటి వస్తువులో కిందపడితే ఏం చేస్తాం? అక్కడ బాయ్/గర్ల్ ఉంటే గనుక చిన్నగా నవ్వి 'సారీ' అన్నట్లు చూస్తాం. అదే ఖరీదైన వస్తువును పడేశామనుకోండి.. అప్పుడెలా? బ్రిటన్లో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో బాగా పేరున్న హెచ్బీహెచ్ సంస్థకు అక్కడ లెక్కకు మిక్కిలి స్టోర్లున్నాయి. వాటిలో ఒకదాంట్లో చోటుచేసుకున్న సంఘటన తాలూకు వీడియోను ఆ కంపెనీయే అక్టోబర్ 13న యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు 31 లక్షల మంది ఈ వీడియోను చూశారు. కస్టమర్ పొరపాటు వల్ల ఒక్కోటీ రూ.4 లక్షలు విలువ చేసే నాలుగు టీవీలు బద్దలయ్యాయి. ఒక్క 'సారీ'తో మాఫీ అయ్యే పొరపాటు కానందున నష్టంలో కస్టమర్ వాటాను కూడా వసూలు చేసిందట ఆ కంపెనీ. మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? -
షాపింగ్ మాల్ సంచలన వీడియో
-
దొంగ దొరికాడు!
► రూ.23.40 లక్షలు కాజేసినట్లు నిర్థారణ ► పదిమంది పేర్ల మీద నకిలీ బంగారం తనఖా ► పోలీసుల అదుపులో బ్యాంకు అప్రైజర్ సాగర్ పిడుగురాళ్ళ (గుంటూరు) : పట్టణంలోని ఓ జాతీయ బ్యాంకు (యూనియన్ బ్యాంక్)లో నకిలీ బంగారాన్ని పెట్టి బ్యాంకు అధికారులను మోసం చేసిన అప్రైజర్ సాగర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన స్నేహితులు, బంధువులు సుమారు పది మంది పేర్లపై దొంగ బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మొత్తం రూ.23.40 లక్షలను నొక్కేశాడు. బంగారాన్ని తీసుకెళ్లమని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు ఫోన్ చేయడంతో అసలు గుట్టు బయట పడింది. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని పరిశీలించి ప్రతి ఖాతాదారుడి వివరాలు, ఖాతాదారుడు ఎంత బంగారం బ్యాంకులో పెట్టాడు , ఎంత నగదు తీసుకున్నాడన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో బ్యాంకు ఆడిట్ బృందం రహస్యంగా రెండు వారాల పాటు విచారణ నిర్వహించింది. ఆ సమయంలోనే బ్యాంకులో భారీ నగదు స్వాహా అయినట్లు సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. అప్పట్లో బ్యాంకు పరువు పోతుందని బ్యాంకు మేనేజర్ సమాచారం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బ్యాంకులో అప్రైజర్ చేసిన మోసాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు నిగ్గు తేల్చారు. దీంతో బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తి పట్టణ పోలీస్స్టేషన్లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పట్టణ ఇన్చార్జి సీఐ వై. శ్రీధర్రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అప్రైజర్ సాగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తిని సాక్షి వివరణ కోరగా అప్రైజర్ సాగర్ దొంగ బంగారం పెట్టి బ్యాంకు సొమ్మును కాజేసిన మాట వాస్తవమేనన్నారు. అతను కాంట్రాక్టు ఉద్యోగి అని, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించామని, అతని వద్ద నుంచి బ్యాంకు నగదును రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. -
కోపంతో రెస్టారెంట్లో కొండచిలువను వదిలాడు!
లాస్ ఏంజిల్స్: రెస్టారెంట్లో పుష్టిగా తిన్న ఓ కస్టమర్ అక్కడి సిబ్బందిపై కోపంతో ఓ భారీ కొండచిలువను తీసుకొచ్చి వదిలాడు. దీంతో సిబ్బందితో పాటు అక్కడ ఉన్న కస్టమర్లు రెస్టారెంట్ బయటకు పరుగులు తీశారు. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన ఈ ఘటనలో ఈ చర్యలకు పాల్పడిన సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హిరోషి మెతోహషి ఓ పెట్ షాప్ నిర్వాహకుడు. అతనికి వివిధ దేశాలకు చెందిన అరుదైన జంతువులంటే ఆసక్తి. మెతోహషి ఇటీవల లాస్ ఏంజిల్స్లోని 'సుశి ఆఫ్ టోక్యో' రెస్టారెంట్కు వెళ్లి భోజనం చేసిన అనంతరం అతిని వద్ద ఉన్న అరుదైన చిన్న పామును అక్కడివారికి చూపిస్తుండగా.. అది మిగతా కస్టమర్లకు ఇబ్బందిగా ఉంటుందని, ఆ చర్య మానుకోవాలని హోటల్ సిబ్బంది అతనితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మెతోహషి వెంటనే వెళ్లి.. 13 అడుగుల భారీ ఎల్లో పైథాన్ను తీసుకొచ్చి హోటల్లో వదిలి, అక్కడి సిబ్బందిని నానా బూతులు తిట్టి వెళ్లిపోయాడు. భారీ పైథాన్ను చూసిన కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న లాస్ ఏంజిల్స్ ఫైర్ సిబ్బంది, జంతు సంరక్షణ అధికారులు.. హోటల్ క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న పామును పట్టుకున్నారు. మెతోహషి చర్యపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గతంలో పలు అరుదైన జంతువులను అమ్మకానికి పెట్టిన కేసులో మెతోహషి జైలు శిక్ష అనుభవించాడని లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. -
ట్యాక్సీ డ్రైవర్ ఝలక్
నోయిడా: ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఊబర్కు చెందిన డ్రైవర్ కస్టమర్కు ఝలక్ ఇచ్చాడు. అతడు డబ్బులు డ్రాచేసుకునేందుకు వెళ్లడం చూసి అతడి ల్యాప్ టాప్తో ఉడాయించాడు. ఏటీఎం నుంచి వెనక్కి వచ్చిన కస్టమర్ అది చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన హిమాంశు కౌశిక్ అనే వ్యక్తి న్యూ ఫ్రెండ్స్ కాలనీ సెక్టార్ 18 గుండా వెళ్లేందుకు ఊబర్ సంస్థ నుంచి క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. అది వచ్చిన తర్వాత కారులోకి ఎక్కిన అతడు మధ్యలోకి వెళ్లాక తన స్నేహితుడికి డబ్బులు ఇవ్వాల్సి ఓ ఏటీఎం వద్ద కారు ఆపాడు. అతడు లోపలికి డబ్బు డ్రా చేసుకునేందుకు అలా వెళ్లగానే డ్రైవర్ ఇలా వెళ్లి మోసం చేశాడు. 'నేను ఎన్నోసార్లు ఆ డ్రైవర్కు ఫోన్ చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. 20 నిమిషాల తర్వాత నా ఫోన్ లిఫ్ట్ చేశాడు. నా బ్యాగ్ గురించి ప్రశ్నించగానే వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఎత్తలేదు' అని హిమాంశు ఆందోళన వ్యక్తం చేశాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఊబర్ సంస్థకు ఫిర్యాదు చేసినా వారి నుంచి కూడా ఎలాంటి బదులు రాలేదని వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
పిజ్జా లేటయిందేంటి అన్నందుకు పొడిచేశాడు!
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో డొమినోస్ పిజ్జాకు చెందిన ఓ డెలివరీ ఉద్యోగి వినియోగదారున్ని కత్తితో పొడిచాడు. పిజ్జా ఆలస్యంగా తీసుకురావడంపై గొడవ జరగడంతో అతను దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కాలిఫోర్నియాలోని గ్లెన్ డోరాకు చెందిన మైఖేల్ చార్లెస్ (31)ను పోలీసులు అరెస్టు చేశారు. పిజ్జా డెలివరీ లేట్ అయినందుకు గొడవ జరగడంతో అతను 20 ఏళ్ల వ్యక్తిని పొడిచాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని, అయితే ప్రాణాపాయం లేదని చెప్పారు. కాలిఫోర్నియాలోని కొవిన్ లో శనివారం ఈ ఘటన జరిగింది. మెడపై, మణికట్టుపై గాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అరెస్టైన నిందితుడు 30వేల డాలర్ల పూచీకత్తు బెయిల్ పై విడుదలయ్యాడు. అతనిపై మార్చ్ 21న పోలీసులు అభియోగాలు నమోదుచేయనున్నారు. -
వైన్ షాపు యజమాని దాష్టీకం
మిర్యాలగూడ: మద్యం కొనుగోలు చేసిన అనంతరం తనకు రావాల్సిన డబ్బులు అడిగిన వ్యక్తిపై వైన్ షాపు యజమాని మద్యం బాటిల్తో దాడి చేయడంతో.. బాధితుడి తలకు బలమైన గాయమైంది. దీంతో స్థానికులు వైన్ షాప్ యజమాని తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. తిమ్మాపురంకు చెందిన రమావత్ మంతు(35) మద్యం కొనుగోలు చేయడానికి బస్టాండ్ సమీపంలోని ఓ వైన్స్ షాపుకు వెళ్లాడు. రూ. 200 ఇచ్చి ఒక బీరు కొనుగోలు చేశాడు. అనంతరం తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన వైన్స్ యజమాని అదే బీరు బాటిల్తో తలపై బలంగా కొట్టాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'మంటల్లో చస్తావన్నా.. ఆ వీడియోనే చూస్తానన్నాడు'
బెర్లిన్: ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఉన్న ఓ వీడియో షాపులో మంటలు షాపంతా వ్యాపించాయి. ఆ పాపులో ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓ క్యాబిన్లో ఉన్న ఓ వ్యక్తి మాత్రం డోర్ లాక్ చేసుకుని పోర్న్ వీడియో చూస్తూ అందులో లీనమైపోయాడు. మంటలు ఆ వ్యక్తి ఉన్న క్యాబిన్కు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసినా.. ఆ గదిలో పొగ కమ్మేసినా అతను దగ్గుతూనే వీడియో చూస్తున్నాడు కానీ బయటకు మాత్రం రాలేదు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న ఆ వ్యక్తిని గుర్తించి బయటకు రావాల్సిందిగా హెచ్చరించారు. అయినా అతను నిరాకరించాడు. ఆ సెక్స్ వీడియో పూర్తిగా చూడనిదే బయటకు రానంటూ లోపలే ఉండిపోయాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది బలవంతంగా అతణ్ని బయటకు తీసుకుని వచ్చారు. ఈ సంఘటన జర్మనీలోని సెయింట్ పౌలీలో జరిగింది. కాగా అతని వివరాలను బయటకు వెల్లడించలేదు. -
ప్రాణాలకు తెగించిన కస్టమర్
ముంబయి: ఆర్ధిక రాజధాని ముంబయి నగర వీధిలో దారుణం చోటుచేసుకోబోయింది. వికలాంగుడైన రజ్నీష్ సింగ్ ఠాకూర్ అనే ఓ మొబైల్ షాప్ యజమానిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో షాపులో ఫోన్ కొనేందుకు వచ్చిన ఒక వినియోగదారుడు ఎంతో ధైర్యం చేసి ఆ వ్యక్తిని అడ్డుకోవడమే కాకుండా తన చేతుల్లో బంధించి పక్కన ఉన్న వ్యక్తులకు అప్పజెప్పాడు. ఆ వినియోగ దారుడు సాహసం చేసి ఉండకపోతే ఆ యజమాని చనిపోయేవాడు. అప్పటికే హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రెండుసార్లు కత్తితో దాడి చేయడంతో చేతికి, మెడకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ దృశ్యం అంతా కూడా ఆ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన వెనుక మొత్తం ఆరుగురు వ్యక్తుల హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం గాలింపులు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే.. ఈ మధ్య రౌడీయిజం చేస్తూ కొందరు వ్యక్తులు రోజుకు వెయ్యి రూపాయలు తమకు చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలని, ఎవరైనా మాముళ్లు ఇస్తే వారి షాపులు తగులబెడతామని కూడా ఆ పోస్టర్లో హెచ్చరించారు. దీంతోపాటు ఎవరైనా వసూళ్లకు పాల్పడేవారు వస్తే తనకుగానీ, తన సోదరుడికిగానీ ఫోన్ చేయవచ్చని కూడా అందులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే వసూళ్లకు పాల్పడేవారు మొత్తం ఆరుగురు కలిసి రజ్నీష్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఆరుగురిలో ఐదుగురు కారులో కూర్చోగా ఒకరు మాత్రం కత్తితో వచ్చి సింగ్ పై దాడి చేయగా ఓ వినియోగదారుడు ధైర్యంగా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ కస్టమర్ లేకుంటే తన సోదరుడు చనిపోయేవాడని సింగ్ సోదరుడు తెలిపాడు. -
కస్టమర్పై చికెన్ వ్యాపారి కత్తితో దాడి
హైదరాబాద్: ఓ కస్టమర్పై చికెన్ వ్యాపారి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఎల్బీనగర్ మండలం అనాజ్పూర్లో ఆదివారం వెలుగుచూసింది. చికెన్ వ్యాపారికి కస్టమర్కి మధ్య గొడవ చోటుచేసుకుంది. చికెన్ వ్యాపారి ఆగ్రహంతో కస్టమర్ను కత్తితో నరికాడు. ఈ ఘటనలో కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎయిర్టెల్ నెట్వర్క్కు అంతరాయం