deputy chief minister
-
మహరాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా షిండే!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం ఎంపికపై మహాయుతి కూటమి మధ్య గత పదిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇక డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఆజాద్ మైదాన్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనుండగా.. షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ అదే రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ సీఎం పదవి వదులుకునేందుకు ఏక్నాథ్ షిండే సుముఖంగా లేనట్లు శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక అనేక రోజుల చర్చల తర్వాత షిండే మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. -
ఉచిత బస్సును సమీక్షిస్తాం: శివకుమార్
బెంగళూరు: కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఐరావత క్లబ్ క్లాస్ 2.0 బస్సులను బుధవారం ప్రవేశపెట్టాక శివకుమార్ మాట్లాడారు. ‘సోషల్ మీడియా ద్వారా, ఈ–మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దీనిపై చర్చిస్తాం’ అని శివకుమార్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకం కాంగ్రెస్ కన్నడనాట ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కిందటేడాది జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈనెల 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగ్గా.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,507 కోట్లను దీనిపై వెచ్చించింది. ‘‘ 5 నుంచి 10 శాతం మంది మహిళలు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా.. కండక్టర్లు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. రవాణా మంత్రి రామలింగా రెడ్డితో దీనిపై చర్చిస్తాను’’ అని శివకుమార్ వివరించారు. -
మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!
చెన్నై: తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగోతంది.ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేవలం మరికొన్నిగంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన వెలువడగానే.. ఉదయనిధి కొత్త పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 24 గంటల్లో స్పష్టత రానుంది.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలుకాగా ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.మరోవైపు డిప్యూటీ వార్తలను ఉదయనిధి ఇప్పటికే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక ఈ వార్తలపై సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే స్పందిస్తూ.. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే టైమ్ ఇంకా రాలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
నోరెత్తని పవనం.. అసలు ఆ కథేంటి?
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శాసనసభ ఎన్నికలకు ముందు చేసిన ఒక ప్రసంగం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే.. ఏది పెట్టుకున్నా ఒన్ టైమ్ డబ్బు పది లక్షల చొప్పున ఐదువందల మంది యువతకు ఇస్తే అది ఎంతమందికి ఉపాధి అవుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి సంవత్సరానికి ఐదువందల మందికి ఇలా ఇస్తే ఎందరికి ఉపయోగపడుతుంది! మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా కొడుకుకు నేను పెట్టుబడి పెడతాను. మీకు ఎవరు పెడతారు! అంతా మన కుటుంబమే అనుకుంటాం. ఆ కుటుంబానికి ఏమి చేయాలి! యువతకు ఈ డబ్బు ఇవ్వడానికి ఏడాదికి పదివేల కోట్లు అవసరం అవుతుంది. ఒక్క ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరుగుతోంది. దీనిని ఆపి యువతకు పది లక్షల చొప్పున ఇస్తే ఆంధ్రప్రదేశ్లో యువత ఎందుకు అభివృద్ది పథంలోకి వెళ్లదు?.. అని పవన్ ప్రశ్నించారు.పవన్ కల్యాణ్కు ఆ రోజుల్లో ఇలాంటి విన్నూత్నమైన ఆలోచనలు చాలానే వచ్చేవి. వాటిని ఆయన దాచుకోకుండా యువతను అట్రాక్ట్ చేయడానికి బాగానే వాడుకున్నారు. ఈ మధ్య జిల్లా కలెక్టర్ల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం నుంచి తాను నేర్చుకుంటున్నట్లు చెప్పారు. మంచిదే. ఎవరి అనుభవం నుంచి అయినా మంచిని గ్రహిస్తే సంతోషించవలసిందే. కాని పవన్ కల్యాణ్ ఏమి గ్రహించారో తెలియదు కాని, ఎన్నికలకు ముందే చంద్రబాబు మాదిరి ఎలాంటి ఆచరణసాధ్యం కాని హామీల గురించి ఊదరగొట్టాలన్నది నేర్చుకున్నట్లున్నారు. అందుకే ఇలాంటి కొత్త ఐడియాలను ఆయన ప్రచారంలో పెట్టారు.పవన్ కల్యాణ్ చెప్పినదాని ప్రకారం నిజంగానే ఒక్కో యువకుడికి పది లక్షల చొప్పున ఇవ్వగలిగితే గొప్ప విషయమే. ఏడాదికి 500 మందికి ఇలా పది లక్షలు ఇవ్వాలని ఆయన అన్నారు.దాని ప్రకారం ఏపీలోని 175 నియోజకవర్గాలకు కలిపి సంవత్సరానికి 8750 కోట్ల వ్యయం అవుతుంది. ఐదేళ్లకు కలిపి నలభైమూడువేల ఏడువందల ఏభై కోట్ల మేర ఖర్చు చేస్తే సరిపోతుంది. యువతకు ఇచ్చే పది లక్షల ఆదారంగా వారు పది మందికి ఉపాది కల్పిస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చో కదా అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నారు కనుక అది జరిగి తీరుతుందని ఆయన అభిమానులు చాలామంది ఆశించి ఉండవచ్చు.జనసేన కార్యకర్తలు తమకు పదేసి లక్షల చొప్పున డబ్బులు వస్తే, తమ జీవితాలు మారిపోతాయని భావించి ఉండవచ్చు. దాని ప్రభావం ఎన్నికలలో కూడా విశేషంగానే పడిందని అనుకోవాలి. భారీ ఆధిక్యతతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ల తర్వాత క్యాబినెట్లో పవన్ కల్యాణ్ కీలకమైన వ్యక్తి అయ్యారు. పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాగానే ఉంది. పంచాయతీలన్నీ ఆయన చేతిలో ఉంటాయి కనుక, తను ప్రకటించిన పది లక్షల రూపాయలు యూత్కు ఇచ్చే స్కీమ్ ఆరంభించి ఉంటే, ఈపాటికి ప్రతి గ్రామంలో కొద్ది మందికి అయినా మంచి ఉపాధి లభించి ఉండేది.కాని అదేమిటో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ విషయం గురించి అసలు ప్రస్తావించడం లేదు. బహుశా మర్చిపోయారో, యువత కూడా మర్చి పోయి ఉంటుందిలే అనుకున్నారో కాని దాని ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు అనుభవం నుంచి పరిపాలనను నేర్చుకుంటున్నానని ఆయన అన్నారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత హామీలను ఎలా ఎగవేయాలన్న విషయాన్ని కూడా బహుశా ముఖ్యమంత్రి అనుభవం నుంచి పవన్ నేర్చుకున్నారేమో అనే చమక్కులు వినిపిస్తున్నాయి.అసలు ఈ మద్యకాలంలో పవన్ కల్యాణ్ ప్రజలకు సంబందించిన హామీల గురించి పెద్దగా మాట్లాడడం లేదు. గెలిచామా! పదవిలోకి వచ్చామా! అధికారాన్ని అనుభవిస్తున్నామా! అన్నచందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల వాగ్దానాలు ప్రకటించినప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కలిసే చేశారు. మహానాడులో చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు పలు ఇతర వాగ్దానాలతో టీడీపీ, జనసేన సంయుక్త మానిఫెస్టోని ప్రకటించాయి. పవన్ తన ఎన్నికల ప్రచారాలలో వాటి గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించేవారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ప్రతి ఇంటిలో ఉన్న విద్యార్థులందరికి పదిహేనువేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని పవన్ కల్యాణ్ పదే, పదే చెప్పారు. వలంటీర్లను మొదట అవమానించినా, తదుపరికాలంలో తాము కూడా ఆ వ్యవస్థను కొనసాగిస్తామని, ఒక్కో వలంటీర్కు నెలకు పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ఆయన ఆయా సభలలో చెప్పారు.ఇలా ఒక్కటేమిటి! అనేక వాగ్దానాలను చంద్రబాబు, లోకేష్లతో పాటు పవన్ కల్యాణ్ కూడా విస్తారంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం వాటి మాటే ఎత్తడం లేదు. వాటికి తోడు పవన్ కల్యాణ్ తన సొంత ఆలోచనల ప్రకారం పది లక్షల రూపాయల చొప్పున ప్రతి యువతకు ఇస్తామని ప్రతి పాదించారు. ఇసుక దోపిడీని ఆపితే ఇది సాధ్యమేనని ఆయన అప్పట్లో అన్నారు. ఆ రోజుల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 700 కోట్ల వరకు ఆదాయం సమకూరేది.అయినా దోపిడీ అని ప్రచారం చేశారు. కూటమి గెలిచిన తర్వాత టీడీపీ, జనసేన పార్టీల నేతలు దొరికినకాడికి దొరికినంత ఇసుకను దోచుకుపోయారు. పేరుకు ఉచితం అయినా, భారీ మొత్తాన్నే ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.మరి ఇసుక దోపిడీ ఆపితే పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేవన్న పవన్ ఇప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచించడం లేదు? ఇసుక సంగతి పక్కనబెడితే తన మద్దతుతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని భావిస్తున్న పవన్ కల్యాణ్ తలచుకుంటే ఈ పది లక్షల స్కీమును చంద్రబాబుతో అమలు చేయించలేరా? అన్న ప్రశ్న వస్తుంది. పవన్ కల్యాణ్ ఈ విషయం గురించి చంద్రబాబుతో చర్చించే ధైర్యం అన్నా చేస్తారా? అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదూ అచ్చంగా చంద్రబాబు మాదిరే మాటమార్చేస్తే అదే పాలన అనుభవం అని భావిస్తే ఏ గొడవ ఉండదు. మరి పాపం పది లక్షల సాయం వస్తుందని ఆశించి ఓట్లు వేసిన జనసేన కార్యకర్తలు, యువత ఇంకెంతకాలం వేచి ఉండాలో!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్ ఇదే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు. డీఎంకే ఒక కుటుంబమని.. తమ ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలేనని పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని తెలిపారు.‘డీఎంకేలోని మంత్రులందరూ మా ముఖ్యమంత్రికి డిప్యూటీలు. నాకు ఏ పెద్ద పదవి లేదా బాధ్యత ఇచ్చినా.. నా మనసుకు దగ్గరయ్యేది డీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవే. నాకు ఏ పదవి వచ్చినా డీఎంకే యువజన విభాగం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డిప్యూటీ సీఎం పదవిపై అనేక వార్తలు వచ్చాయి. అది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
యమునా తీరే.. ఎవరికి వారే
లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి. 2019తో పోలిస్తే యూపీలో బీజేపీ అనూహ్యంగా సగానికి సగం స్థానాలు కోల్పోవడం తెలిసిందే. పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని కమలనాథులు సీరియస్గా తీసుకున్నారు. రాష్ట్ర పారీ్టలోనూ, యోగి కేబినెట్లోనూ త్వరలో భారీ మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు అధిష్టానమే ప్రయతి్నస్తున్నట్టు చెబుతున్నారు. యోగి ప్రభుత్వంపై సాక్షాత్తూ సొంత పారీ్టకే చెందిన ఉప ముఖ్యమంత్రి మౌర్య బాహాటంగా విమర్శలు... రాష్ట్ర పార్టీ చీఫ్తో కలిసి ఆయన హస్తిన యాత్రలు... మోదీ, నడ్డా తదితర పెద్దలతో భేటీ... ఇవన్నీ అందులో భాగమేనని రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది...!ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్రసింగ్ చౌదరి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన మంగళవారమే హస్తిన చేరుకున్నారు. అదే రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మౌర్య గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం చౌదరి కూడా నడ్డాతో విడిగా భేటీ అయ్యారు. నిజానికి యోగి, మౌర్య మధ్య మొదటినుంచీ సత్సంబంధాలు లేవు. యోగి అభీష్టానికి వ్యతిరేకంగా మౌర్యకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ హస్తిన యాత్ర రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతోంది. మౌర్య నెల రోజులుగా కేబినెట్ సమావేశాలకు వరుసగా డుమ్మా కొడుతూ వస్తున్నారు. యూపీలో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు కీలక ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటి సన్నద్ధత కోసం మంత్రులతో యోగి ఏర్పాటు చేసిన భేటీకి కూడా మౌర్య వెళ్లలేదు. పైగా నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను వరుస పెట్టి కలుస్తూ వస్తున్నారు. జూలై 14న కూడా నడ్డాతో చాలాసేపు మంతనాలు జరిపారు. ఆ భేటీతో... ఆదివారం లఖ్నవూలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం యూపీలో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, బీజేపీ నేతలు, ప్రతినిధులు కలిపి 3,500 మందికి పైగా పాల్గొన్న ఆ భేటీలో వేదిక మీదే యోగి, మౌర్య మధ్య పరోక్షంగా మాటల యుద్ధం సాగింది. మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కంటే పారీ్టయే మిన్న. కనుక పారీ్టదే పై చేయిగా వ్యవహారాలు సాగాలి’’ అంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. దాంతో అంతా విస్తుపోయారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బీజేపీ నేతల మాట పెద్దగా చెల్లడం లేదని పారీ్టలో యోగి వ్యతిరేకులు చాలాకాలంగా వాపోతున్నారు. అధికారులకు యోగి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు దూకుడుగా పని చేయలేదని, రాష్ట్రంలో దారుణ ఫలితాలకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటన్నది వారి వాదన. ఎస్పీ, బీఎస్పీ సానుభూతిపరులైన అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారంటూ వారంతా యోగిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం సమక్షంలోనే మౌర్య మాటల తూటాలు పేల్చారు. ‘‘కార్యకర్తలే కీలకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ వారిని గౌరవించాల్సిందే. నేనైనా ముందు బీజేపీ కార్యకర్తను. తర్వాతే డిప్యూటీ సీఎంను’’ అన్నారు. ‘‘కార్యకర్తల బాధే నా బాధ. ప్రతి కార్యకర్తకూ నా ఇంటి తలుపులు నిత్యం తెరిచే ఉంటాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. యోగి సమక్షంలోనే ప్రభుత్వ పనితీరును తప్పుబట్టేలా మౌర్య ఇలా మాట్లాడటం వెనక అధిష్టానం ఆశీస్సులున్నట్టు చెబుతున్నారు. అయితే మౌర్య అనంతరం మాట్లాడిన యోగి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వ పనితీరు ఏమాత్రం మారబోదని అదే వేదిక నుంచి కుండబద్దలు కొట్టారు. ఆ వెంటనే మౌర్య, చౌదరి హస్తిన వెళ్లడం, మోదీ, నడ్డా తదితరులతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం తాజాగా బుధవారం ఎక్స్ పోస్టులో కూడా ‘ప్రభుత్వం కంటే పారీ్టయే పెద్ద’దన్న వ్యాఖ్యలను మౌర్య పునరుద్ఘాటించారు. వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే యూపీకి సంబంధించి బీజేపీ అధిష్టానం త్వరలో ‘పెద్ద’ నిర్ణయం తీసుకోవచ్చంటూ యోగి వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత యోగిని సీఎం పదవి నుంచి తప్పించడం ఖాయమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందే.యోగి సంచలన వ్యాఖ్యలు అధిష్టానం మనోగతాన్ని పసిగట్టిన యోగి ముందుగానే వ్యూహాత్మకంగా పై ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని మూడు రోజుల క్రితం ఆయన ఏకంగా బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేయడం ఉద్దేశపూర్వకమేనని భావిస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బీజేపీ అధిష్టానం ఇప్పటికిప్పుడు యోగిని మార్చడం వంటి భారీ నిర్ణయాలకు వెళ్లకపోయినా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సత్ఫలితాలు రాబట్టలేకపోతే ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు బీజేపీ ఇంటి పోరుపై విపక్షాలన్నీ చెణుకులు విసురుతున్నాయి. యూపీకి ముగ్గురు సీఎంలున్నారంటూ కాంగ్రెస్, సమాజ్వాదీ సహా ఎద్దేవా చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతూ పాలనను గాలికొదిలారంటూ దుయ్యబడుతున్నాయి. మౌర్య, మరో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ కూడా సీఎంలుగానే వ్యవహరిస్తున్నారన్నది వాటి విమర్శల ఆంతర్యం. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను నెగ్గడం యోగికి అత్యవసరం. రాష్ట్ర పార్టీ కీలక నేతల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈ కఠిన పరీక్షలో ఆయన ఏ మేరకు నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మిస్సింగ్ అమ్మయిలు!.. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా ?
-
ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ
-
బెంగళూరు గొంతెండుతోంది
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళో వస్తున్నాయి. అవీ మురికిమయం! స్నానపానాలకే కాదు, చివరికి టాయ్లెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయక ఏ ఫ్లాట్లో చూసినా టాయ్లెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దాంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అలా వెళ్లలేనివాళ్లం విధిలేక పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్లోకి వెళ్లి టాయ్లెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం!’’ – రెడిట్లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్టిది! అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఖండించినా ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనికి బెంగళూరు టెకీల నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది... దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. నగరవ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్లు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేష్టలుడిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూములు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంతదూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది. బెంగళూరులోనే గాక కర్ణాటకవ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. ‘‘నిజానికి మూడు నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించింది’’ అంటూ వాపోతున్నారు. ట్యాంకర్ల రేట్లు చుక్కల్లోకి... ► బెంగళూరులో ఏకంగా 60 శాతం జనం నీటి కోసం వాటర్ ట్యాంక్ల మీదే ఆధారపడ్డారు! అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి. ► మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్కు రూ.600, 8,000 లీటర్లకు రూ.800, 12 వేల లీటర్ల ట్యాంకరైతే రూ.1,000 చార్జి చేస్తారు. ► ఈ రేట్లకు జీఎస్టీ అదనం. పైగా దూరం 5 కి.మీ. దాటితే మరో రూ.200 దాకా పెరుగుతుంది. ► ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకుమించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ► దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు. ► ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్వాలాలు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు. ► మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడా ఒక్క బిందెకు మించి ఇవ్వడం లేదు! ► ఆర్వో ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యానే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి! ► చాలా ప్లాంట్లు ‘నో వాటర్’ అంటూ బోర్డులు పెట్టి బ్లాకులో అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నాయి. ► నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి. ఎందుకింత సమస్య... ► 2023లో కర్ణాటకవ్యాప్తంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులు ప్రస్తుత నీటి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ► రాష్టంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి. ► కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటిమట్టం ఈసారి 29 శాతానికి పడిపోయింది. ► బెంగళూరులో ఎక్కడ చూసినా బోర్లే దర్శనమిస్తుంటాయి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నగరంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం. ► రియల్టీ బూమ్ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా నగరంలోని చెరువులు, నీటి ఆవాసాలన్నీ కాలనీలు, అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. ఆ దెబ్బకు స్థానిక నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maharashtra Politics: బారామతిలో ప‘వార్’!
ఎన్సీపీ పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవార్.. తన భార్యను రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారా? అందులోనూ దిగ్గజ నేత శరద్పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న‘బారామతి’ నుంచే బరిలో దింపుతున్నారా? అంటే ఎన్సీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్తలను బలం చేకూరుస్తూ ఇప్పటికే కొన్ని చోట్ల ‘బారామతి ఎంపీ సునేత్రా పవార్’ అంటూ భారీ హోర్డింగ్లనూ పెట్టేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే పుకార్లు బారామతి నియోజకవర్గంలో షికార్లుచేస్తున్నాయి. అసలు సునేత్రా పేరు తెరమీదకు ఎందుకొచి్చంది? అనే ప్రశ్నకు ఆమె భర్త అజిత్ వ్యాఖ్యల్లో సమాధానం దొరుకుతుంది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం అజిత్ పవార్ భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఈ వార్తలకు బలం చేకూర్చింది. బారామతి లోక్సభ స్థానం నుంచి ఎవరిని నిలపబోతున్నారో ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. ‘ ఈసారి బారామతిలో కొత్త అభ్యరి్థని నిలుపుతాం. తొలిసారి పోటీచేస్తున్న అభ్యరి్థ.. మన భవిష్యత్ తరాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేయగలరు. కొందరు ‘పాత’ భావోద్వేగాలతో ఓటేయాలని మిమ్మల్ని అడుగుతారు. పట్టించుకోకండి. జరగబోయే నిరంతర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మొదటిసారి పోటీచేస్తున్నా ఆశీర్వదించండి. అభివృద్ధిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. వెంటనే భార్య సునేత్రనే ఆయన రంగంలోకి దింపబోతున్నారని భావించిన ఎన్సీపీ పార్టీ వర్గాలు ఆ నియోజకవర్గం ప్రధాన కూడళ్లలో భారీ హోర్డింగ్లు పెట్టేశాయి. కాబోయే ఎంపీ సునేత్రా పవార్ అని రాసి ఉన్న ప్లెక్సీలతో బారామతిలో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. శరద్పవార్ కుటుంబానికి కంచుకోట ఈ నియోజకవర్గం. ఇక్కడ ఎన్సీపీ దిగ్గజ నేత శరదపవార్ కూతురు సుప్రియా సూలే సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2009 ఏడాది నుంచి అప్రతిహతంగా ఆమె జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆమెను ఢీకొట్టాలంటే తమ కుటుంబానికే చెందిన మహిళా అభ్యర్థి అయితేనే ఎన్నికల రణరంగంలో నెగ్గుకు రాగలరని అజిత్ పవార్ భావిస్తున్నారు. అందుకే భార్యను బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీపీ పార్టీని అజిత్ పవార్ చీలి్చన నేపథ్యంలో పార్టీ ఓటర్లు సైతం రెండు వర్గాలుగా చీలే అవకాశముంది. అప్పుడు సుప్రియా, సునేత్రలలో ఎవరు గెలుపు తలుపు తట్టగలరో వేచి చూడాల్సిందే. ఎవరీ సునేత్రా? అజిత్ భార్యగా తప్పితే రాజకీయ వర్గాల్లో ఎవరికీ తెలియని పేరు సునేత్ర. ఆమె చాలా సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శరద్పవార్కు ఒకప్పటి సన్నిహిత నేత, మాజీ మంత్రి పద్మసిన్హా పాటిల్ చెల్లెలే ఈమె. ప్రత్యక్ష రాజకీయాలు ఈమెకు కొత్త. ఎని్వరాన్మెంట్ ఫోరమ్ ఆఫ్ ఇండియా పేరిట ఒక ఎన్జీవోను సునేత్ర నడుపుతున్నారు. సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ఈమె అమితంగా ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణహిత గ్రామాల స్థాపనకు కృషిచేస్తున్నారు. ప్రముఖ విద్యాసంస్థ ‘విద్యా ప్రతిష్ఠాన్’కు ట్రస్టీగా ఉన్నారు. ఫ్రాన్స్లోని మేథో సంస్థ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్íÙప్ ఫోరమ్లో 2011 నుంచి భాగస్వామిగా కొనసాగుతున్నారు. అయితే ఈమె మెల్లిగా ప్రచారకార్యక్రమాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. 2019లో సుప్రియాపై పోటీచేసి ఓడిపోయిన బీజేపీ మహిళా అభ్యర్థి కంచన్ రాహుల్ కౌల్ను ఈవారమే కలిసి చర్చించారని వార్తలొచ్చాయి. అజిత్, సునేత్రలకు ఇద్దరు కుమారులు. జై పవార్, పార్థపవార్. 2019లో మావాల్ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి పార్థపవార్ ఓటమిని చవిచూశారు. కంచుకోట బారామతి పవార్ల కుటుంబానికి పుణె జిల్లాలోని బారామతి పెట్టనికోట. గత 55 సంవత్సరాలుగా ఇక్కడ వీరిదే హవా. తొలిసారిగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 1967లో బారామతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పోటీచేసి శరద్పవార్ గెలిచారు. తర్వాత 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానంలో ఘన విజయం సాధించారు. ఇదే బారామతి లోక్సభ స్థానం నుంచీ శరద్పవార్ 1984, 1996, 1999, 2004 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. అజిత్ పవార్ సైతం 1991లో ఇదే లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి అజిత్ ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బారామతి ఎమ్మెల్యే అజితే. 2009 నుంచి సుప్రియా సూలే ఇక్కడ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈసారి సునేత్రను దింపితే స్పష్టంగా ‘పవర్’ప్లే మొదలైనట్లే. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కన వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆమె రాజవంశపు యువరాణి, రాయల్ ఫ్యాషన్ ఐకాన్! ఏకంగా డిప్యూటీ సీఎంగా..!
రాజవంశానికి చెందిన ఓ యువరాణి రాజకీయాల్లో రావడమే గాక ఏకంగా డిప్యూటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె రాజకీయ ప్రస్థానం సాగింది. ఎలా అత్యున్నత పదవిని అలకరించగలిగారు తదితరాల గురించే ఈ కథనం!. దియా కుమారి 1971లో జన్మించారు. ఆమె జైపూర్ రాజరిక రాష్ట్రానికి చివరి పాలక మహారాజా మాన్సింగ్II మనవరాలు. జైపూర్కు చెందిన మహారాజా సవాయి భవానీసింగ్, హెచ్ హెచ్ మహారాణి, పద్మినీ దేవిల ఏకైక కుమార్తె. ఆమెకు ముగ్గురు పిల్లలు, హెచ్హెచ్ సవాయి పద్మనాభ్ సింగ్, యువరాణి గౌరవి కుమారి, హెచ్హెచ్ లక్షరాజ్ ప్రకాష్, సిర్మౌర్ మహారాజా. దియా కుమారి ఎన్నో మహిళా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను మనసును దోచుకుంది. రాజరికంలో పెరిగిన ఆమె తండ్రి దాతృత్వాన్ని వారసత్వంగా తీసుకుని ప్రజలకు సంబంధించిన ఎన్నో సేవా కార్యక్రమాలను చురుగ్గా ముందుండి చేసేది. ఆమె ప్రస్తుతం జైపూర్లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సిటీ ఫ్యాలెస్లో నివాసం ఉంటున్నారు. మాన్సింగ్ మ్యూజియం నిర్వహణకు కూడా సాయం అందిస్తున్నారు. రాజరికం ఆధునికత కలగలిసిన మహిళ దియా కుమారి. ఆమె తన విధ్యాభ్యాసాన్ని భారత్, యూకేలలో పూర్తి చేశారు. రాజకీయ ప్రస్థానం.. 2013లో దియా కుమారీ బీజేపీలో చేరి రాజకీయాల్లోకి తెరంగేట్రం చేశారు. మహిళల హక్కులు, విద్య, గ్రామీణాభివృద్ధి కోసం తన వాణిని వినిపించడమే గాక, అందుకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత లోక్సభకు ఎన్నికయ్యారు. రాజకీయాలతో సంబంధం లేకుండానే స్వతహాగా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు. ఆమె ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేషన్ను స్థాపించింది. దీని ద్వారా పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. దియా కుమారీ సాంప్రదాయ కళలను, చేతిపనులు, సంగీతం, నృత్యం వంటి వాటిని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. వివాదాస్పద అంశాలు.. తాజ్ మహల్ని సొంతం చేసుకోవాలని కోర్టులో దావా వేశారు. తాజ్మహల్ను నిర్మించే స్థలం తన కుటుంబానికి చెందినదని, అందుకే ఆ ఆస్తి తనకే చెందుతుందని ఇటీవల ఆమె వాదనలు వినిపించారు. తమ వద్ద సరైన డాక్యుమెంటేషన్ ఉందని, అవసరమైతే కోర్టుకి సమర్పిస్తామని కూడా ఆమె స్పష్టం చేశారు. బహిరంగా బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చి తరుచుగా వార్తల్లో నిలవడం ఏదీఏమైన రాజవంశం నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే. మహామహులే రాజకీయాల్లో ఎదురుదెబ్బలతో బొక్కబోర్లాపడినవారు ఎందరో ఉన్నారు. కానీ ఈమె అప్రతిహాసంగా రాజకీయాల్లో దూసుకుపోవడమే గాక డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. (చదవండి: 'బ్లడ్ మనీ డీల్': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!) -
డీకే శివకుమార్కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అవినీతి కేసులో తమ దర్యాప్తును నిలుపుదల చేస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా దానిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి పదో తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులో కలగజేసు కోబోమని బెంచ్ స్పష్టంచేసింది. గతంలో కర్ణాటక హైకోర్టు సీబీఐ దర్యాప్తుపై స్టేను పలుమార్లు పొడిగించడం తెల్సిందే. -
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసిన వైఎస్ షర్మిల
-
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
-
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం: కేసీ వేణుగోపాల్
Updates: ►కర్ణాటక విజయంతో కాంగ్రెస్లో జోష్ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. పీసీసీ చీఫ్గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి(శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ►డిప్యూటీసీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రముఖపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా ఆయన్ను సోనియా బుజ్జగించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయియి. ► ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో చర్చల అనంతరం వీరు రాహుల్గాంధీని కలవనున్నారు. ► కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటించడం లాంఛనమే! పార్టీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ► ‘నేను పూర్తి సంతోషంగా లేను. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల దృష్ట్యా, పార్టీ ప్రయోజననాల కోసం.. మా నాయకత్వం చెప్పిన ఫార్ములాకి అంగీకరిస్తున్నా’అని డీకేశీ పేర్కొన్నారు. న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ వీడినట్లే తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక రేసులో నిలిచిన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నేడు అధికారిక ప్రకటన వెలువరించనుంది. అర్దరాత్రి వరకు సాగిన చర్చలు బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత చెరొక రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారని, తరువాత సిద్ధరామయ్యే పూర్తి కాలం సీఎంగా ఉంటారని ప్రచారాలు సాగాయి. అయితే ఏఐసీసీ కర్ణాటక ఇంచార్జి రణ్దీప్ సుర్జేవాలాతోపాటు డీకే శివకుమార్ వీటిని ఖండించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున వరకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర మంతనాలు జరిపింది. ముందు నుంచి ఢిల్లీలోనే ఉంటూ లాబియింగ్ చేసిన సిద్ధరామయ్య.. ఖర్గే, అనంతరం సోనియా గాంధీతో చర్చించారు. చదవండి: కర్ణాటక సీఎం పంచాయితీ...ఎందుకిలా..? ఢిల్లీకి వెళ్లడంతోనే ఈ చిక్కులు మెట్టుదిగిన డీకే! మరోవైపు డీకే శివకుమార్ కూడాఖర్గే, సోనియా, రాహుల్ను కలిశారు. అయితే అర్థరాత్రి జరిగిన చర్చలతో డీకే మెట్టు దిగినట్లు, రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు నేడు రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గవర్నర్ను కలవనున్నారు. శనివారం ప్రమాణ స్వీకారం ఇక ఈనెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. పలు రాష్ట్రాల సీఎంలు సైతం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ యోచిస్తోంది. చదవండి: ‘చేతి’కి అధికారం ఇచ్చాక? సీఎం సీటు షేరింగ్.. ఓ ఫ్లాప్ ఫార్ములా..! -
కర్ణాటక సీఎం పీఠంపై వీడిన సస్పెన్స్
-
తేజస్వీ యాదవ్కు పుత్రికోత్సాహం!
కేంద్ర మాజీ మంత్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ మేరకు బిహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తన నవజాత బిడ్డతో దిగిన ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు. ఇది తనకు దేవుడు పంపిన గిఫ్ట్ అని అన్నారు. కుమార్తె రూపంలో దేవుడి పంపించిన బహుమతిగా అభివర్ణించారు. తేజస్వీ యాదవ్ రాచెల్ గోడిన్హోను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇది తొలి సంతానం. ఈమేరకు తేజస్వీ యాదవ్ సోదరి రోహిణి ఆచార్య కూడా ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడూ మా ఇల్లు ఆనందకరమైన కీచులాటతో ధ్వనిస్తుంది. దేవుడు అలాంటి ఆనందాన్ని మాకు బహుమతిగా ఇచ్చాడు అని రోహిణి ట్వీట్ చేశారు. (చదవండి: రాహుల్ గాంధీ అంశం: కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. ఖర్గే ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమన్న కోమటిరెడ్డి) -
మన దేశానికి ఇద్దరు పితామహులు: డిప్యూటీ సీఎం భార్య కీలక వ్యాఖ్యలు
నాగ్పూర్: మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర పితామహులుగా అభివర్ణించారు. మన దేశానికి ఇద్దరు పితామహులు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కాలానికి జాతి పితా మహాత్మా గాంధీ అయితే నేటీ సరికొత్త భారతావనికి పితామహులు నరేంద్ర మోదీ అంటూ ప్రధానిపై పొగడ్తలు జల్లు కురిపించారు అమృతా ఫడ్నవిస్. ఈ మేరకు అమృతా ఫడ్నవిస్ నాగ్పూర్ రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె నరేంద్ర మోదీని రాష్ట్ర పితాగా వ్యవహరించారు. దీంతో మరి మహాత్మా గాంధీ ఏమవుతారంటూ విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆమె సమర్థించుకుంటూ ఆ కాలంలో మహాత్మా గాంధీ జాతి పితా, ప్రస్తుతం నరేంద్ర మోదీ అంటూ కవర్ చేశారు. ఆమె ఇలా మోదీని పొగడ్తలతో ముంచెత్తడం మొదటి సారి కాదు. 2019లో ప్రధానికి పంపిన ట్విట్టర్ సందేశంలో కూడా మన దేశ పితామహుడు నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేయడంలో మాకు స్ఫూర్తి మీరే అని పోస్ట్ చేశారు. ఆమె తరుచు ఇలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ వార్తలో నిలుస్తుంటారు. అంతకు మునుపు ఉద్ధవ్ థాక్రేపై విరుచుపడి వార్తల్లో నిలిచారు. కాగా, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే సీఎం కాగానే ఆమె భర్త దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిన సంగతి తెలిసిందే. (చదవండి: ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..) -
Delhi Liquor Scam: బీజేపీలో చేరితే కేసులు ఎత్తేస్తామన్నారు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి, బీజేపీలో చేరితే తనపై కేసులన్నీ ఎత్తివేయడంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కట్టబెడతామంటూ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి కల్పిస్తామంటూ బీజేపీ నుంచే ఈ సందేశం వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. అనంతరం గుజరాత్లోని అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కేజ్రీవాల్తో కలిసి గుజరాత్కు వచ్చారు. ‘‘బీజేపీకి నేను ఇచ్చే సమాధానం ఇదే. నేను మహారాణా ప్రతాప్ వారసుడిని. రాజ్పుత్ను. తల నరుక్కోవడానికైనా సిద్ధమే గానీ, కుట్రదారుల ఎదుట, అవినీతిపరుల ఎదుట తలవంచే ప్రసక్తే లేదు. నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. మీకు చేతనైంది చేసుకోండి’’ అని ట్విట్టర్లో తేల్చిచెప్పారు. బీజేపీ ఇచ్చిన రెండు ఆఫర్లతో తన వద్దకు వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యానికి గురయ్యానని మీడియాతో చెప్పారు. నాయకులను బీజేపీలో చేర్పించడమే ఆ వ్యక్తి పని అన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనకు రాజకీయ గురువు అని, ఆయన వద్దనే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నానని, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో కావడానికి రాజకీయాల్లోకి రాలేదంటూ అతడికి తేల్చిచెప్పానని సిసోడియా వెల్లడించారు. తాను నిజాయితీ పరుడినని, కేసులతో భయపెట్టలేరని తేల్చిచెప్పారు. దేశంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యనందించాలన్నదే తన కల అని, అందుకోసం కృషి చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అయితే, తనకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది సిసోడియా బహిర్గతం చేయలేదు. కాగా, బీజేపీ ఆఫర్కు సంబంధించి తమ వద్ద ఆడియో టేపులున్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతామని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సిసోడియా భారతరత్నకు అర్హుడు: కేజ్రీవాల్ విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపర్చిన మనీశ్ సిసోడియా భారతరత్న పురస్కారానికి అర్హుడని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను వెంటాడుతోందని ఆక్షేపించారు. సన్మానించాల్సింది పోయి వేధింపులకు గురిచేయడం ఏమిటని నిలదీశారు. కేజ్రీవాల్ సోమవారం అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ విద్యా విధానాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రతిక ప్రశంసించిందని గుర్తుచేశారు. ఐదేళ్లలో అద్భుతాలు చేసిన వ్యక్తిపై సీబీఐ దాడులు చేయడం మీకు సిగ్గనిపించడం లేదా? అని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లలో ప్రభుత్వాలు చేయని అద్భుతాలను సిసోడియా చేశారని, ఆయనకు భారతరత్న దక్కాలని ఉద్ఘాటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిసోడియాతోపాటు తనను కూడా అరెస్టు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. గుజరాత్లో 27 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినట్లుగానే తమ ప్రభుత్వాన్ని సైతం పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా సీబీఐ, ఈడీతో సోదాలు చేయించారని విమర్శించారు. నిజానికి లిక్కర్ పాలసీకి, సీబీఐ–ఈడీ సోదాలకు సంబంధం లేదన్నారు. ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని ట్విట్టర్లో కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దమ్ముంటే పేరు బయటపెట్టండి: బీజేపీ మనీశ్ సిసోడియా ఆరోపణలను బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఖండించారు. బీజేపీ తరఫున ఆఫర్ ఇచ్చిన వ్యక్తుల పేర్లను దమ్ముంటే బయటపెట్టాలని సిసోడియాకు సవాలు విసిరారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ.. సిసోడియా మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆప్ నేతలు డ్రామాలు అడుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరంగా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. మీరు నిజంగా నిజాయితీపరులైతే 24 గంటల్లోగా స్పందించండి అని కేజ్రీవాల్కు సూచించారు. కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ ధర్నా ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ప్రసంగించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడైన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును దోచుకొనేందుకు లిక్కర్ మాఫియాకు అనుమతులు ఇచ్చారన్నారు. -
అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, ముంబై: రాయ్గఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే పడవలో మందుగుండు సామాగ్రీ ఎందుకు ఉన్నాయో ఇప్పుడే చెప్పలేమన్న డిప్యూటీ సీఎం.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగుతోందన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. కొట్టుకొచ్చిన బోటు ఆస్రేలియాకు చెందిన హాన్ అనే మహిళదని తెలిపారు. తన భర్త జేమ్స్ హర్బర్ట్తో కలిసి మస్కట్ మీదుగా యూరప్ వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. జూన్ 26న ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్ల బోటు ప్రమాదానికి లోనైందన్నారు. బోట్లో ఉన్న వారిని కొరియా షిప్ రక్షించిందని పేర్కొన్నారు. చదవండి: రాయ్గఢ్లో బోటు కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా అయితే ధ్వంసమైన పడవ మాత్రం సముద్ర జలాల్లో కలిసిపోయి అలలకు రాయ్గఢ్ తీరానికి కొట్టుకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం స్థానిక పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్లు కేసు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలు జరుపుకునే దహీ హండీ, వినాయకచవితి పండుగలకు పటిష్ట భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర తీరం వద్దకు గురువారం ఓ అనుమానాస్పద బోటు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. బోటులో మూడు ఏకే 47 రైఫిళ్లు, తూటాలు, మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి. దీంతో ఉగ్రవాదుల కట్రమోనని భావించిన అధికారులు, పోలీసులు రాయ్గఢ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. -
బీజేపీ సంబరాలకు ఫడ్నవీస్ దూరం
ముంబై: మహారాష్ట్ర సీఎం అవుతారని అంతా భావించగా బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్నారా? ఆయన వ్యవహార శైలి ఈ అనుమానాలను బలపరిచేలానే ఉందంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు శుక్రవారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాలకు ఆయన డుమ్మా కొట్టారు. హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కాబోరని సమాచారం. ఆదివారం నుంచి జరిగే రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన చర్చల్లో ఫడ్నవీస్ బిజీగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని ఆయన గురువారం ప్రకటించడం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాన్ని వెంటనే ఖండించడం తెలిసిందే. బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరుతుందని, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అవుతారని నడ్డా ప్రకటించారు. 2014 నుంచి 19 దాకా ఐదేళ్ల పాటు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షిండే ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు షిండే మంత్రివర్గంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా చేరాల్సి వచ్చింది! మరోవైపు షిండే ప్రమాణస్వీకారం ముగుస్తూనే ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేతో ఫడ్నవీస్ భేటీ అయినట్టు చెబుతున్నారు. అయితే ఫడ్నవీస్ డిప్యూటీ అవడం అనూహ్యమేమీ కాదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చెప్పుకొచ్చారు. ‘‘ఇది చాలా మందికి షాకిచ్చిందని నాకు తెలుసు. కానీ ఇందులో అనూహ్యమేమీ లేదు. హిందూత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షిండేకు సీఎం పోస్టు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. కానీ షిండే స్వయంగా ఫడ్నవీస్ను తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు. దాంతో ఢిల్లీ పెద్దల అనుమతితో ఆయన చేరారు’’ అని చెప్పారు. మనకింద పని చేసిన వ్యక్తి సారథ్యంలో పని చేయాలంటే ఎంతో పెద్ద మనసుండాలన్నారు. -
నీట మునిగిన డిప్యూటీ సీఎం నివాసం; వీడియో వైరల్
పట్నా: బిహార్ రాజధాని పట్నాలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణుదేవి నివాసం నీటమునిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారీ వర్షం దాటికి ఆమె నివాసం ఎదుట ఒకటిన్నర అడుగుమేర నీరు నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి కొద్ది గంటల్లోనే కురిసిన జడివానకు 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పెద్ద ఎత్తున రోడ్లు నీట ముగగా.. కాలువలు పొంగి పొర్లాయి. ప్రస్తుత సీజన్లో వర్షాలు భారీగా పడడం సాధారణమేనని వాతావరణ కేంద్ర శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం భారీగా ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. వాతావరణ శాఖ శనివారం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చదవండి: 15 ఏళ్ల క్రితం తప్పించుకున్నాడు.. తాజాగా అరెస్ట్ నర్సు నిర్వాకం, ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్.. వీడియో వైరల్ #WATCH | Water accumulates outside Bihar's Deputy Chief Minister Renu Devi's residence in Patna due to rain pic.twitter.com/P1cy4g7ivO — ANI (@ANI) June 26, 2021 -
బిహార్ డిప్యూటీ సీఎంగా మహిళకు చాన్స్!
పట్నా: బిహార్ మంత్రి మండలిలో ఏ పార్టీకి అధిక ప్రాధాన్యం, ఎవరెవరికి అవకాశం దక్కనుందనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 73 స్థానాలు గెలుపొందిన బీజేపీకి మంత్రి మండలిలో అధిక ప్రాధాన్యం ఉండనుంది. బీజేపీ నేతలు తారా కిశోర్ ప్రసాద్, రేణు దేవికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీ లెజిస్లేటివ్ నేతగా తారా కిశోర్ ప్రసాద్, ఉప నేతగా రేణు దేవి ఎన్నికవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. బీజేపీ నేత నంద కిశోర్ స్పీకర్గా ప్రమాణం చేయనున్నారు. జేడీయూ నుంచి విజయ్ చౌదరి మరోమారు మంత్రి పదవి చేపట్టనున్నారు. హెచ్ఏఎం పార్టీ నుంచి సంతోష్ సుమన్, వీఐపీ పార్టీ నుంచి ముఖేశ్ సాహ్ని మంత్రులుగా ప్రమాణం చేస్తారని సమాచారం. జేడీయూ నేత విజేంద్ర యాదవ్, జేడీయూ బిహార్ ప్రెసిడెంట్ అశోక్ చౌదరి, తారాపూర్ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి, ఫూల్పూర్ ఎమ్మెల్యే షీలా కుమారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు తెలిసింది. ఇక ప్రస్తుత నితీశ్ కేబినెట్లో డిప్యూటీ సీఎం సుశీల్ మోదీకి ఈసారి మొండిచేయి ఎదురవనుంది. అయితే, ఆయనకు కేంద్రంలో పదవీ బాధ్యతలు ఇస్తారని తెలిసింది. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ 122 సీట్లు. ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ పార్టీల మహాగఠ్ బంధన్ 110 స్థానాలు మాత్రమే సాధించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోమంత్రి అమిత్ షా నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలి
సాక్షి, కడప : చంద్రబాబునాయుడుకు వయసు మీద పడిందని, ఆయన రాజకీయాల నుంచి వైదొలగడమే ఉత్తమమని ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ చేష్టలను భరించలేకనే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో చంద్రబాబు ఎన్నో అవినీతి పనులకు పాల్పడ్డారని, తొందర్లోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. అందుకే ముందు జాగ్రత్తగా తన అవినీతిలో భాగస్వామ్యులుగా ఉన్న ఎంపీలను బీజేపీలో చేర్పించారనేది జగమెరిగిన సత్యమని ఎద్దేవా చేశారు. కాగా టీడీపీ రాజ్యసభ సభ్యులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్,టీజీ వెంకటేశ్లు నిన్న ఉపరాష్ట్రపతిని కలిసి తమను బీజేపీలో విలీనం చేయాలని కోరిన సంగతి తెలిసిందే. -
ఆళ్ల నాని ఔదార్యం
సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. విజయవాడ జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. అదే రహదారిలో వెళుతున్న వైద్యశాఖ మంత్రి ఈ ఘటనను చూసి వెంటనే స్పందించి తన కాన్వాయ్లో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి పంపించారు. ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్ల నాని విజయవాడ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులు బాధపడుతున్న దృశ్యాన్ని చూసిన ఆయన వెంటనే కారును ఆపి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిలో ఇద్దరికి ప్రాథమికి చికిత్స అనంతరం డాక్టర్లు పంపించివేశారు. మరొక క్షతగాత్రుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి మంత్రి ఆళ్ళ నాని 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గాయపడిన వ్యక్తి గుంటూరు సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఔదార్యం చూపిన ఉప ముఖ్యమంత్రిపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. -
మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్(71)కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ ల్యాండర రెండేళ్ల జైలుశిక్ష అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. తన ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు విన్నవించుకున్న భుజ్బల్, డిసెంబర్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద సుప్రీంకోర్టు కొన్ని సెక్షన్లపై తీసుకున్న నిర్ణయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చి తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ.5 లక్షల పూచీకత్తుపై బాంబే హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో గత రెండేళ్లుగా భుజ్బల్తో పాటు ఆయనతో పాటు అక్రమ ఆస్తులు కూడబెట్టిన బంధువులు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలడంతో భుజ్బల్, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేశారు. భుజ్బల్, ఆయన భార్య మీనా, కొడుకు పంకజ్, కోడలు విశాఖ, మేనల్లుడు సమీర్ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కేసులు భుజ్బల్పై నమోదయ్యాయి. 2016 మార్చిలో భుజ్బల్ను ముంబై ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సెంట్రల్ లైబ్రరీ భూమి స్కాం, మహారాష్ట్ర సదన్ స్కాంలతో పాటు అక్రమంగా సంపాదించిన సొమ్ము కూడా ఆయన దగ్గర చాలా ఉందని ఏసీబీ తన కేసులో పేర్కొంది. దాదాపు రూ.870 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు భుజ్బల్పై ఆరోపణలున్నాయి. -
‘ఆసిఫ్నగర్’ ఆందోళన తాత్కాలిక విరమణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా ఆసిఫ్నగర్ మండల కార్యాలయ సిబ్బందిపై కొందరు దుండగులు చేసిన దాడికి నిరసనగా గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏ) ప్రకటించింది. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన హామీ మేరకు ఆందోళనలను విరమించుకుంటున్నామని టీఆర్ఎస్ఏ అధ్యక్షుడు మఠం శివశంకర్ తెలిపారు. మహమూద్ అలీతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్తివారీ సమక్షంలో మంగళవారం టీజీటీఏ, వీఆర్వో, వీఆర్ఏ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. దాడి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి వారంలోగా జిల్లా కలెక్టర్తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పినట్లు శివశంకర్ తెలిపారు. దాడికి పాల్పడ్డ దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సమావేశంలో టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతంకుమార్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు జి.సతీశ్, వీఆర్ఏల అధ్యక్షుడు వి.ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంతైనా.. లాలు కొడుకు కదా!
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్కు ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లిద్దరూ కూడా ప్రస్తుత బిహార్ ప్రభుత్వంలో మంత్రులే. ఒకరు ఉప ముఖ్యమంత్రి కూడా. కానీ ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లే కనిపిస్తున్నారు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు వేటిలోనూ వాళ్లిద్దరూ కనిపించడం లేదు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలకు ఉచితంగా వై-ఫై సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం ఓ పెద్ద కార్యక్రమంలో ప్రకటించారు. అయితే, ఇంత ముఖ్యమైన ప్రకటన సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తేజస్వి యాదవ్, మంత్రి తేజ్ ప్రతాప్ ఇద్దరూ సీఎం పక్కన లేరు. కావాలనే వాళ్లు ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ వరుసగా మూడోసారి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 2015 ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిందన్నది నిర్వివాదాంశం. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆర్జేడీ, జేడీయూ పోటీ చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దాంతో బాగా యువకులైన లాలు కొడుకులిద్దరికీ కేబినెట్లో బెర్తులు లభించాయి. బుధవారం నాటి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా పాల్గొని ప్రసంగించాల్సి ఉందని, అయితే ఆయన కార్యక్రమం చిట్ట చివరి నిమిషంలో రద్దయిందని బిహార్ విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి చెప్పారు. ఇంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు కార్యక్రమాన్ని నితీష్ కుమార్ బాగా ప్రశంసించారు. అది లాలుకు ఏమాత్రం నచ్చలేదు. నితీష్, తాను రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్నామని.. ఇక యువ నాయకులు తమ స్థానాన్ని తీసుకోవాలని లాలు ఈ మధ్య అన్నారు. అయితే దీనిపై నితీష్ ఏమీ వ్యాఖ్యానించలేదు. ఇక మంత్రులిద్దరిలో పెద్దవాడైన తేజ్ప్రతాప్ యాదవ్ తరచు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. దాంతో ఆయనకు ఈ పదవి ఇష్టం ఉన్నట్లు లేదని ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
బీజేపీ యూటర్న్.. శివసేన ఫైర్
ముంబై: ఉప ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ యూటర్న్ తీసుకోవడం పట్ల ఎన్డీఏ కీలక భాగస్వామ్య పార్టీ శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులను నియమించడాన్ని తప్పుబట్టింది. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం నియామకానికి ససేమీరా అన్న కమలం పార్టీ ఇప్పుడు ఎందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను పెట్టిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను నియమించే విధానం లేదని 2014లో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీ చెప్పిందని ఆయన వెల్లడించారు. పీడీపీ భాగస్వామ్యంతో జమ్మూకశ్మీర్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో బీజేపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకుందని, తాజాగా యూపీలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించిందని గుర్తు చేశారు. ఈ విషయంలో బీజేపీ విధానం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోవాలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తాత్కాలికమైందని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. అదో అవినీతి కూటమని మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీని గోవా ప్రజలు పూర్తిగా తిరస్కరించారని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ డిప్యూటీ సీఎంకు స్వైన్ ప్లూ
-
మాజీ డిప్యూటీ సీఎంపై ఏసీబీ కేసు
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్బల్, మరో 11 మందిపై అవినీతి నిరోధక శాఖ తాజా కేసు నమోదుచేసింది. ఆయన ఆదాయానికి మించి రూ. 203 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలడంతో భుజ్బల్, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టారు. భుజ్బల్, ఆయన భార్య మీనా, కొడుకు పంకజ్, కోడలు విశాఖ, మేనల్లుడు సమీర్ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. వీళ్లతోపాటు సీఏలు సునీల్ నాయక్, చంద్రశేఖర్ శారద, హవాలా ఆపరేటర్ సురేష్ జజోడియా, భుజ్బల్ కంపెనీల డైరెక్టర్లు ప్రవీణ్కుమార్ జైన్, జగదీష్ప్రసాద్ పురోహిత్, ఆర్థిక సలహాదారు సంజీవ్ జైన్, స్నేహల్ సహకార సంఘం డైరెక్టర్ కపిల్ పూరీల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కేసులు భుజ్బల్పై నమోదయ్యాయి. సెంట్రల్ లైబ్రరీ భూమి స్కాం, మహారాష్ట్ర సదన్ స్కాంలతో పాటు అక్రమంగా సంపాదించిన సొమ్ము కూడా ఆయన దగ్గర చాలా ఉందని ఏసీబీ తన కేసులో పేర్కొంది. ముంబై, పుణె, లోనావాలా, నాసిక్ ప్రాంతాల్లో ఉన్న ఛగన్ భుజ్బల్ ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసి మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు భుజ్బల్తో పాటు పంకజ్, సమీర్, నాయక్లపై వచ్చాయి. -
వరంగల్లోనే ఐఐఎం
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ వరంగల్లోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. హన్మకొండలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఐఎంను వరంగల్లోనే ఏర్పాటు చేయాలని తాము సీఎం కేసీఆర్ను కోరామని, సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది ఐఐఎం రానుందన్నారు. జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు రక్షణ శాఖకు చెందిన కెప్టెన్ రాంబాబు స్థల పరిశీలన చేశారన్నారు. దీనిపై రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో సైనిక్ స్కూల్ ప్రారంభం కానుందని తెలిపారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ఇంగ్లిష్ మీడియంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో గురుకులానికి రూ.20 కోట్లతో భవనాలు నిర్మించి, వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. టీచింగ్, నాన్ టీచింగ్ కలుపుకుని ఒక్కో గురుకులంలో 35 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. -
ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు
- డిప్యూటీ సీఎం కడియం మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు విద్యావ్యవస్థను ధ్వంసం చేశారని, దానిని గాడిలో పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గిర్మాపూర్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కశాశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వాలు పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు మంజూరు చేసినా వాటిని భవనాలు నిర్మించలేదని, అధ్యాపకులను కేటాయించలేదని విమర్శించారు. 20 ఏళ్లుగా ధ్వంసం అయిన విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తాము అన్ని పాఠశాలలు, కళాశాలలకు భవనాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమిస్తామని శ్రీహరి హామీ ఇచ్చారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక చొరవ తీసుకుంటోందని దళిత, పేద విద్యార్ధులకు అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. -
బందరు బయలుదేరిన చినరాజప్ప
ఈరోజు విజయనగరంలో పర్యటించాల్సిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకొని మచిలీపట్నం బయలుదేరారు. స్థానిక నిజాంపేటలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో పట్టణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సంభవించే అవకాశం ఉండటంతో.. ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి ఆయన వెళ్తున్నట్లు సమాచారం. -
తుని ఘటనలో అసలు బాధ్యులనే శిక్షిస్తాం
తుని సంఘటనకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించామని, అసలు బాధ్యులను గుర్తించి శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కృష్ణా జిల్లా బందరు ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తుని సంఘటనలో బయట వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారనటం అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. సీఐడీ విచారణలో అసలు బాధ్యులను గుర్తించి శిక్ష విధిస్తామని తెలిపారు. ఎర్ర చందనం, భూకబ్జాలు, చైన్స్నాచింగ్ వంటి ఘటనలపై ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గిరిజనులకు అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బందరు మండలం పెదపట్నం ప్రాంతంలో మెరైన్ అకాడమీని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాపు రుణమేళాను ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,25,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్నాయుడు పాల్గొన్నారు. -
మీరూ చూడరా..!
* పంచాయతీరాజ్ రోడ్ల పనులపై పెద్దల ఉదాసీనత * పట్టించుకోని డిప్యూటీ సీఎం, కలెక్టర్ * శాఖ పనితీరుపై సమీక్షలు చేయని దుస్థితి సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ లక్ష్యాలకు అనుణంగా పనిచేయల్సిన శాఖలు ఆ పనులను విస్మరిస్తున్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తీరు మరీ అధ్వానంగా ఉంది. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే ప్రభుత్వ ఆశయానికి పంచాయతీరాజ్ శాఖ విఘాతం కలిగిస్తోంది. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. జిల్లాకు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల పునరుద్ధరణకు రూ.416 కోట్లు మంజూరు చేసింది. రూ.230.35 కోట్లతో 1676.37 కిలో మీ టర్ల పొడవైన బీటీ రోడ్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది. కొత్తగా 396.83 కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేసేందుకు రూ.185.71 కోట్లు విడుదల చేసింది. అయితే, నిధులను ఖర్చు చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం.. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోంది. జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పనితీరు అధ్వాన్నంగా ఉన్నదన్న విషయూన్ని గ్రహించి న ఆ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఎం.సత్యనారాయణరెడ్డి స్వయంగా జిల్లాకు వచ్చి సమీక్షలు నిర్వహించారు. జిల్లా అధికారులు పనితీరు మార్చుకోవాలని గట్టిగా చెప్పారు. అయినా అధికారుల తీరు మా త్రం మారడం లేదు. అధికారుల తరహాలోనే రోడ్ల పను లు చేసే కాంట్రాక్టర్ల తీరూ అలాగే ఉంది. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరితో జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతోంది. రూ.416 కోట్లతో చేపట్టిన పనుల విషయంలో జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లుగా ఉంటుండడంపై గ్రామీణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రోడ్ల పనులు చేయకపోవడం, చేసినా.. కొన్ని పనులు నాసిరకంగా ఉండ డం, మరికొన్ని పనులు మధ్యలోనే నిలిపివేయడం వం టివి జరుగుతున్నా... ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ వాకాటి కరుణ పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయించాల్సిన అత్యున్నత ప్రజాప్రతినిధి, పాలనాధికారి సమీక్షలు సైతం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ విభాగంలోని రోడ్ల పునరుద్ధరణ పనులు కొన్నిచోట్ల మరీ నాసిరకంగా జరుగుతున్నట్లు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా ప్రభుత్వ పరంగా ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
'కాంగ్రెస్ తీవ్రవాదులతో చేతులు కలిపింది'
కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులతో చేతులు కలిపిందని పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. రాష్ట్ర శాంతి భద్రతలపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచు పడ్డారు. పంజాబ్ లో అశాంతికి కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. జాతి వ్యతిరేక శక్తులకు ఆ పార్టీ నిధులు ఇస్తూ.. ప్రోత్సహిస్తోందని అన్నారు. -
లాలు తనయుడికి డిప్యూటీ సీఎం పదవి?
పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్కు బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆర్జేడీ శాసనసభ పక్ష నాయకుడిగా తేజస్వి యాదవ్ను నియమించవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం బిహార్ ముఖమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. నితీశ్ కేబినెట్లో లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు బెర్తులు దక్కనున్నట్టు సమాచారం. లాలు చిన్న కొడుకు తేజస్వికి డిప్యూటీ సీఎం పదవి దక్కే చాన్స్ ఉంది. లాలు ఈ విషయంపై నితీష్తో చర్చించినట్టు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. లాలు కొడుకులు తాజా ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా లాలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 సీట్లు గెల్చుకున్నాయి. -
'సీఎం, మంత్రికి తెలియకుండానే బాక్సైట్ జీవో'
విజయవాడ: బాక్సైట్ తవ్వకాల జీవో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే అటవీశాఖ జారీ చేసిందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇదే విషయం మంత్రివర్గ సమావేశంలోనూ చర్చకు వచ్చిందని, ఇలాంటి లోపాలను సరిదిద్దుతామని ఆయన చెప్పారు. విజయవాడ స్టేట్ గెస్ట్హౌస్లో మంగళవారం కేఈ కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని సీఎం గతంలో ఒకసారి అన్నారని, తరువాత ఇంకెప్పుడూ అనలేదన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని ఓ మంత్రి మాట్లాడుతున్నారని, ఆయన మాదిరి సంబంధం లేని ఇతర శాఖల గురించి తాను మాట్లాడబోనని కేఈ చురకలు అంటించారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులపై దాడులపట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. బ్యాంకు రుణాలకు పాస్బుక్లు అవసరం లేకుండా లోన్ చార్జ్ క్రియేషన్ మాడ్యూల్ను బ్యాంకులకు అనుసంధానిస్తామన్నారు. సర్వే పనులు వేగవంతం చేయడానికి సుమారు రూ.15 కోట్లతో 273 ఈటీఎస్ మిషన్లు రప్పిస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ-పంట కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. మీ-సేవ కేంద్రాల ద్వారా 62 రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెచ్చామని, అవసరంలేని 18 రకాల సేవలను తొలగించామన్నారు. 240 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. సమావేశంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) అనిల్చంద్ర పునీత పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎంగా మీసా భారతి?
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈనెల 20వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలో మూడు పార్టీలు 4:4:2 నిష్పత్తిలో పదవులను పంచుకోవాలని భావిస్తున్నాయి. అయితే, అత్యంత కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని మాత్రం తన కూతురు మీసా భారతికి ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ పట్టుబట్టే అవకాశం ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో లాలు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ మాత్రమే పోటీచేసే విజయం సాధించారు. మీసాభారతి గత సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆమెను శాసన మండలికి పంపించి డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలన్నది లాలు ఆశగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండి, తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తన పీఏ భోలా యాదవ్ స్థానాన్ని తన కూతురికి కేటాయిస్తారని చెబుతున్నారు. అలాగే కుమారులిద్దరిలో ఒకరికి తప్పనిసరిగా మంత్రిపదవి తీసుకుంటారని అంచనా. అయితే, ఇద్దరిలో ఎవరికి పదవి ఇవ్వాలన్న విషయమై నిర్ణయం తీసుకోవడం మాత్రం లాలుకు కష్టమే. బిహార్ అసెంబ్లీ స్థానాలను బట్టి చూస్తే గరిష్ఠంగా 36 మంది మంత్రులు కేబినెట్లో ఉండే అవకాశం ఉంది. కానీ అక్కడ ముందు జాగ్రత్తగా 8-10 స్థానాలను ఖాళీగా ఉంచుకుని, తర్వాత విస్తరించుకోవాలన్నది సీఎం నితీష్ కుమార్ వ్యూహంలా కనిపిస్తోంది. ఇక అనూహ్యంగా ఈ ఎన్నికల్లో 27 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అధికారాన్ని పంచుకోవాలనే భావిస్తోంది. ఏడు అంశాల కార్యక్రమాన్ని అమలుచేస్తామని తాము బిహార్ ప్రజలకు మాటిచ్చామని, దాన్ని అమలుచేస్తామని బిహార్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సీపీ జోషి అన్నారు. ఈ పార్టీ నుంచి ప్రధానంగా అశోక్ కుమార్ చౌదరి, సదానంద సింగ్, అవధేష్ కుమార్ సింగ్, షకీల్ అహ్మద్ ఖాన్, మహ్మద్ జావేద్లలో కొందరికి మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. -
ఆ మోటార్లు ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?
-
పనిచేయని మోటార్లు ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హంద్రీ నీవా మోటార్లను పట్టిసీమకు తరలించిన అంశంపై చర్చ రావడం కేఈ ఆగ్రహానికి కారణమైంది. మోటార్లను రహస్యంగా ఎందుకు తరలించారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. మీకు తెలియకుండానే మోటారును ఎలా తరలిస్తారని కేఈపై మండిపడ్డారు. దాంతో డిప్యూటీ సీఎం ఒక్కసారిగా సహనం కోల్పోయారు. హంద్రీ నీవాకు నీళ్లు కావాలంటే నాలుగు రోజుల్లో మోటారు తీసుకొస్తామని చెప్పారు. అయినా, అసలు పనిచేయని మోటార్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'వచ్చే ఏడాది ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు'
హన్మకొండ (వరంగల్ జిల్లా) : రానున్న ఏడాదిలో ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకోస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని జాకరీయా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈవిధంగా వ్యాఖ్యానించారు. మసీదుల్లో పని చేసే ఇమామ్లకు గౌరవ వేతనంగా రూ. 2వేల చెక్కులను ఇచ్చేందుకు మంత్రి వరంగల్ చేరుకున్నారు. కాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప దినాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇమామ్లు తమ బ్యాంకు ఖాతా నంబర్లును ఇస్తే ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు. -
నిజాం రుబాత్ వివాదానికి తెర
జెడ్డాలో రుబాత్ ఆర్గనైజర్తో డిప్యూటీ సీఎం చర్చలు సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలోని మక్కా నిజాం రుబాత్ భవనంలో రాష్ట్ర హజ్ యాత్రికుల ఉచిత వసతి వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సోమవారం అక్కడి జెడ్డా పట్టణంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, అక్కడి భారత రాయబారి ముబారక్తో కలిసి రుబాత్ కార్యనిర్వాహకుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా హజ్-2015లో 600 మంది యాత్రికులకు రుబాత్లో ఉచిత వసతి కల్పించేందుకు అంగీకారం కుదిరింది. ఈ యాత్రికులను ఎంపిక చేసేందుకు హైదరాబాద్కు రావాలని హుస్సేన్ మహ్మద్ను మహమూద్ అలీ కోరగా.. ఆయన అంగీకరించారు. ఈ మేరకు ఈ నెల 22న లేదా 23న రాష్ర్ట హజ్ హౌస్లో జరిగే లక్కీడ్రా కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఏమిటీ వివాదం: హైదరాబాద్ సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం 1857లో నిజాం నవాబు మక్కాలో 14 ధర్మసత్రాలు నిర్మించారు. అందులో 13 సత్రాలు అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన దానినే నిజాం రుబాత్గా పిలుస్తుంటారు. హైదరాబాద్లోని నిజాం నవాబు ధార్మిక కమిటీ ఆ రుబాత్ నిర్వహణ బాధ్యతలను చూసేది. ఆ పనుల నిమిత్తం మక్కాకు ప్రత్యేకంగా ఉద్యోగులను పంపేది. అలా చివరగా వెళ్లిన ఉద్యోగి ఒకరు సౌదీ పౌరసత్వాన్ని తీసుకుని, అక్కడే ఉండిపోయారు. ఆయన కుమారుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్ ప్రస్తుతం నిజాం రుబాత్కు కార్యనిర్వాహకుడిగా ఉన్నారు. అయితే తొలి నుంచి డీజీపీ, మతపెద్దలతో కూడి కమిటీ.. రాష్ట్రం నుంచి హజ్కు వెళ్లేవారిలో కొందరిని లాటరీ ద్వారా రుబాత్లో ఉచిత వసతి కోసం ఎంపిక చేసేది. కానీ మూడేళ్లుగా రుబాత్ నిర్వాహకుడే నేరుగా ఎంపిక చేయడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యంతో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. -
కడియం దారెటు ?
ఏమాత్రం ఊహించనైనా ఊహించకుండా అందివచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిలో కడియం శ్రీహరి ఎన్నాళ్లు కొనసాగుతారు? అసలు ఆయన దారి లోక్సభ వైపా, లేక శాసన మండలి వైపా? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు ఇవి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా కడియం ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న డాక్టర్ రాజయ్యను ఆ పదవి నుంచి తప్పించాల్సి రావడంతో సీఎం కేసీఆర్ కుల, వర్గ సమీకరణలు బేరీజు వేసుకుని, కడియం శ్రీహరిని ఆ పీఠం పైకి ఎక్కించారు. ఇది బాగానే ఉన్నా, ఆయన ఇప్పటి దాకా ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. రాష్ట్ర కేబినెట్లో చేరిన ఆరునెలల్లోపు ఆయన ఉభయ సభల్లో ఎందులోనో ఒక దాన్లో సభ్యుడు కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆయనను శాసన మండలికి పంపుతారని అంతా ఊహించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి షెడ్యూలు కూడా విడుదలైంది. ఇంతలోనే కడియం ఎంపీగానే కొనసాగుతారని, డిప్యూటీగా తప్పుకుంటారనే ప్రచారం గుప్పుమంటోంది. ఆయన రాజీనామా చేయక పోవడమూ బలం చేకూరుస్తోంది. కడియం ఖాళీ చేస్తే వరంగల్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయడం, గెలవడం అన్నీ తలనొప్పులే అన్న భావన టీఆర్ఎస్ హైకమాండ్లో ఉందంటున్నారు. ఈ రిస్కు కంటే కడియంను ఎంపీగా కొనసాగించడమే మంచిదని భావిస్తున్నట్టున్నారు. అంటే ఆయన ‘ఉప ’పోస్టును వదులుకోవాల్సిందేనా? తిరిగి ఆయన హస్తిన బాట పట్టాల్సిందేనా? -
లోకేష్ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి: కేఈ
లోకేష్ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న యాత్రకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీలో లోకేష్కు మంచి స్థానం కల్పించాలని కేఈ కోరారు. ఇక భోగాపురంలో ఎయిర్పోర్టుకు భూసేకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ చెప్పారు. భూసేకరణ చట్టానికి పార్లమెంటులో తుదిరూపు వచ్చిన తర్వాతే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రెవెన్యూ అధికారులు అసలు గ్రామాల్లోకి వెళ్లడం లేదని, రెవెన్యూ శాఖలో త్వరలోనే సంస్కరణలు చేపడతామని చెప్పారు. ఎమ్మార్వో, వీఆర్వోలను సొంత రెవెన్యూ డివిజన్లలో ఉండనిచ్చేది లేదని స్పష్టం చేశారు. రాజధానిలో కూడా గ్రామకంఠాల వివాదాలు ఉన్నాయని, బీపీఎల్ కేటగిరీకి చెందినవారి ఆధీనంలో ఉన్న గ్రామకంఠాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ చెప్పారు. మిగిలిన వాళ్ల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన వివరించారు. -
ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మార్పురాలేదు'
కాకినాడ: శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప స్పష్టం చేశారు. శనివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మాట్లాడుతూ... గత ఆరు నెలలుగా ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరికలు చేస్తునే ఉన్నామన్నారు. విధిలేని పరిస్థితిలో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతంలో గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని రాజప్ప ఈ సందర్భంగా గుర్తు చేశారు. 20 ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ నేపథ్యంలో అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన సంక్షోభాన్ని నివారించే చర్యలు చేపడతామన్నారు ఇరు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా స్నేహ సంబంధాలను పునరుద్ధరిస్తామని రాజప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉర్సు ఉత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం
భువనగిరి(నల్లగొండ): భువనగిరిలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలలో శనివారం రాత్రి తెలంగాణ డిప్యూటీ సీఎం మహ మూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అమరేందర్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో జరిగిన గొడవపై ఆయన స్పందిస్తూ...తాము ప్రజాస్వామ్య బద్ధంగానే వ్యవహరించామని తెలిపారు. -
రామలింగేశ్వర స్వామి సేవలో చినరాజప్ప
తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికొర్రు గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో త్రికతు హోమాలు, పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వీటిలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఆలయంలో శనివారం ప్రారంభమైన విశేష పూజలు సోమవారం వరకు జరగనున్నాయి. (అంబాజీపేట) -
సీఎం హామీల పరిస్థితేంటి...
నేడు ఉప ముఖ్యమంత్రి కడియం సమీక్ష మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీహరి వరంగల్ : అనూహ్య పరిణామాలతో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కడియం శ్రీహరి శనివారం జిల్లాలో పథకాల అమలు, అభివృద్ధి అంశాలపై తొలి సమీక్ష నిర్వహించనున్నారు. కడియం శ్రీహరి శుక్రవారం విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శని వారం ఉదయం ఆయన వరంగల్కు వస్తున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించనున్నారు. సీఎం కేసీఆర్ జనవరి 8 నుంచి 11 వరకు వరంగల్ నగర పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపైనే ప్రధానంగా సమీక్ష జరగనుంది. కేసీఆర్ 4 రోజుల పర్యటనలో కడియం శ్రీహరి, 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. సీఎం ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ఏ హామీలు ఇచ్చారు, వాటి అమలు తీరు ఎలా ఉందనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కేసీఆర్ పర్యటన సమయంలో ఉన్న జిల్లా కలెక్టర్, జేసీ, కార్పొరేషన్ కమిషనర్ బదిలీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి నియమితులయ్యారు. ఈ క్రమంలో కొత్త బృందం వేగంగా పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. హామీలు ఎక్కడివక్కడే... రూ.400 కోట్లతో నగరంలోని ఆరు బస్తీల్లో జీ ప్లస్ వన్తో 3954 ఇళ్లు నిర్మిస్తామమని కేసీఆర్ చెప్పారు. అధికారుల తీరుతో ఈ అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. జీ ప్లస్ వన్పై సర్వే ఇంకా పూర్తి కాలేదు. పది రోజుల్లోపే ప్రణాళికలు రూపొందించాలని పర్యటనలో ముఖ్యమంత్రి చెప్పినా... జిల్లా అధికారులు ఈ దిశగా పనులు చేయడం లేదు. తెలంగాణలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ భూముల సమీకరణ ముఖ్య అంశమని కేసీఆర్ చెప్పారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నగరంలో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు మార్కెట్లు వంటి ప్రజా సౌకర్యాలు ఏర్పాటు చేసేం దుకు ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశిం చారు. రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికీ ఈ పని పూర్తి చేయలేదు. రూ.2 వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయని చెబుతున్నా... ఎంత విస్తీర్ణం అనేది చెప్పడంలేదు. ‘వరంగల్ నగర అభివృద్ధికి ప్రధానంగా రహదారులను విస్తరించాలి. ప్రధాన రహదారులను 150 అడుగులకు విస్తరించాలి. ఇలాంటి ప్రధాన రహదారుల్లో సైకిల్ బే, బస్బే, ఫుట్పాత్లు ఉండాలి. స్టాప్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు వచ్చేలా ఫై ్ల ఓవర్లు నిర్మించాలనే ప్రణాళికలో ఉన్నాం’ అని కేసీఆర్ అన్నారు. దీనికి అధికారులు చర్యలు తీసుకోవాలి. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా ప్రధాన రహదారులను 150 అడుగులకు విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ, నష్టపరిహారం అంచనాలను సిద్ధం చేశారు. భూసేకరణ, భవనాల నష్టపరిహారం కోసం రూ.3 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.ఉపాధి అవకాశాలకు వరంగల్ను రాష్ట్రంలో రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనువైన ప్రాంతం ఎంపికకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని బృందం సూరత్, తిర్పూరుకు వెళ్లి వచ్చింది. షోలాపూర్కు వెళ్లాల్సి ఉంది. జిల్లాలో టెక్స్టైల్ పార్కుకు అనువైన ప్రాంతం ఏదనేది మాత్రం ఇప్పటికీ ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. -
రాజయ్య పయనమెటు!
‘తాటికొండ’ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదుపరి పయనం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రాజయ్య.. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పదవికి దూరమయ్యారు. తెలంగాణలో బర్తరఫ్ అయిన మొదటి మంత్రిగా మిగిలారు. ఏడు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది. రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవి పోవడం ఎలా ఉన్నా.. తన దీర్ఘకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరికి ఆ పదవి దక్కడం ఇబ్బందికరంగా మారింది. మంత్రి పదవి రావడం, పోవడం ఎలా ఉన్నా.. ఉన్నతమైన పదవి నుంచి తప్పించిన తీరుపై రాజయ్య అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజయ్య పయనం ఎలా ఉంటుందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇన్నాళ్లు ఉన్నతమైనన పదవిలో ఉన్న రాజయ్య ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా మారారు. 2019 ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా రాజయ్య ఎలా సర్దుకుంటానే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రి పదవి పోయిన నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు బహిరంగ వివరణ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా.. 2009 సాధారణ ఎన్నికల్లో టి.రాజయ్య స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. 2012 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సన్నిహితుడిగా మారారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని తాటికొండ రాజయ్య 2014 జూన్ 2వ తేదీన చేపట్టారు. వరంగల్లో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు, వైద్య ఆరోగ్య శాఖలో పలు ఆంశాలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజయ్య వివరణతో ఈ అంశం సద్దుమణిగిందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా భారీ మార్పులు జరిగాయి. -
ఎంపీగా ఎవరు..
* వరంగల్ లోక్సభకు త్వరలో కడియం రాజీనామా * ‘కారు’లో పోటీ అభ్యర్థులపై కానరాని స్పష్టత * టీఆర్ఎస్తోపాటు బీజేపీ, కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం * ‘గులాబీ’ ఎమ్మెల్సీ ఆశావహుల్లో అసంతృప్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్ఎస్కు మరో ఉప ఎన్నిక పరీక్ష వస్తోంది. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వరంగల్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఎన్నిక అనివార్యం కాగా... టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కడియం శ్రీహరికి పెద్ద సవాలేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్కు సైతం ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గులాబీ వర్గాల్లో ఈ అంశంపై ఇప్పటికే చర్చ మొదలైంది. వరంగల్ లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో టీఆర్ఎస్లోని ఈ వర్గం నేతల్లో ఎవరికి అవకాశం వస్తుందనే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన చాలా మంది ఎస్సీ వర్గం నేతలు ఆ తర్వాత కాలంలో పార్టీకి దూరమయ్యారు. 2014 ఎన్నికలకు ముందు ఇది ఎక్కువగా జరిగింది. కొందరు పార్టీ మారగా, మరికొందరు స్తబ్దుగా ఉన్నారు. 2014 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... పార్టీలో గెలిచే స్థాయి నేతలు లేరనే ఉద్దేశంతో కడియం శ్రీహరిని తీసుకున్నారు. కేసీఆర్ అంచనాలకు తగినట్లుగానే ఈ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు కడియం రాజీనామా చేయనున్న నేపథ్యంలో అభ్యర్థిత్వం విషయంలో టీఆర్ఎస్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అన్యూహ రాజకీయాలు, నియామకాలకు చిరునామాగా ఉండే గులాబీ పార్టీలో వరంగల్ లోక్సభ అభ్యర్థి ఎవరు అనే దానిపై ఇప్పటికిప్పుడు స్పష్టత రావడం లేదు. గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించి ఇప్పుడు స్తబ్ధుగా ఉన్న పసునూరి దయాకర్, జన్ను జకారియాలకు అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.సాంబయ్య పేరు వినిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో నాగర్కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మంద జగన్నాథం వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. టీఆర్ఎస్కు దూరమైన మాజీ ఎమ్మెల్యే ఒకరు మళ్లీ పార్టీలోకి వస్తారని తెలుస్తోంది. అన్యూహ రాజకీయాలు, నియామకాలకు చిరునామాగా ఉండే గులాబీ పార్టీలో కొత్త వారికీ అవకాశం వచ్చే పరిస్థితి ఉండనుంది. ఇలా ఎన్నాళ్లు... ప్రస్తుత పరిస్థితుల్లో కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున నామినేటెడ్ చేసే ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే పోటీ నెలకొంది. కడియం శ్రీహరికి నామినేటెడ్ ఎమ్మెల్సీ అవకాశం వస్తుందా... ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందా అనేది స్పష్టత రావడంలేదు. కడియం శ్రీహరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సి వస్తుండడంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న జిల్లా నేతల్లో అసంతృప్తి నెలకొంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకుండా... పనిచేస్తున్న నేతలు ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వీరికి మళ్లీ ఎదురుచూపులే మిగలనున్నాయి. -
కడియం.. డిప్యూటీ సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. వరంగల్ లోక్సభ సభ్యుడు కడియం శ్రీహరి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఈ స్థానంలో ఉన్న తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. వెంటనే శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కడియంకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తూ, విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మన జిల్లాకు రాజకీయంగా, పరిపాలనా పరంగా ప్రాధాన్యం పెరిగింది. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుంచి సీఎం తప్పించారు. ఈ పరిణామం శ్రీహరికి అనుకూలించింది. పరిపాలనా పరంగా అనుభవం, దళిత సామాజిక వర్గం కావడంతో శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. కడియం శ్రీహరి 1994 డిసెంబరు నుంచి 2004 అక్టోబరు వరకు మంత్రిగా పని చేశారు. రాష్ట్ర మంత్రులుగా పని చేస్తూ గతంలో పలువురు లోక్సభకు ఎన్నియ్యారు. లోక్సభ సభ్యుడు నేరుగా రాష్ట్ర మంత్రి కావడం అరుదైన విషయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి. శ్రీహరి లోక్సభకు రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. టీఆర్ఎస్లో అయోమయం డిప్యూటీ సీఎం మార్పు అంశంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. టి.రాజయ్యను ఈ పదవి నుంచి తప్పించడం.. వెంటనే కడియం శ్రీహరిని ఈ పదవిలో నియమించడం గులాబీ పార్టీ జిల్లా ముఖ్యనేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రుల మార్పు ముఖ్యమంత్రి అభీష్టం మేరకు జరిగే ప్రక్రియే అయినా.. ఇంత వేగంగా చేయడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావంలో, తర్వాత కీలక సమయాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శించిన కడియం శ్రీహరి.. ఎన్నికల ముందు పార్టీలోకి రావడం ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కావడం అంతా అయోమయంగా ఉందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. శ్రీహరికి పదవి విషయం టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. నేడు సన్మానం : తక్కెళ్లపల్లి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం జిల్లాకు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి జిల్లాకు వస్తున్న శ్రీహరిని ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు తెలిపారు. శ్రీహరి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జనగామ, మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్ఘన్పూర్, 2 గంటలకు మడికొండ, 3 గంటలకు కాజీపేట జంక్షన్, సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకుంటారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు హన్మకొండ ఏకశిలాపార్కులో ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. -
వారికి మామూలే
సీఎం, డిప్యూటీ సీఎంలే లంచంపై విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటే ఎవరేం చేస్తారులే అనుకున్నారేమో.. ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది లంచాలకు తెగబడ్డారు. రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులు అనారోగ్యం పాలైతే వారికి చికిత్స చేసేందుకు ప్రభుత్వం ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అక్కడకు వెళ్తే పానం బాగుచేస్తారన్న నమ్మకం.. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి ఎందుకొచ్చాంరా భగవంతుడా అనాల్సిన పరిస్థితి. జేబునిండా డబ్బులు తీసుకెళ్తే తప్పా వైద్యం అందడం లేదు. ప్రతి పనికీ చేతులు తడపాల్సిందే.. ఆస్పత్రుల్లో రోగుల ప్రాణాలతో బేరమాడుతున్నారు. చావుకైనా, పుట్టుకైనా పైసలు ముట్టజెప్పాల్సిందే. ఇచ్చేదాకా వేధింపులు తప్పవు. వాళ్లు డిమాండ్ చేసినంతా ఇవ్వాల్సిందే. లేదంటే చీదరింపులు, చీత్కారాలే. సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో ఒక ప్రధాన ఆసుపత్రి, నాలుగు ఏరియా ఆసుపత్రులు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 85 పీహెచ్సీలున్నాయి. వీటికి ప్రధానంగా అనునిత్యం వెయ్యికి పైగానే ఓపీ ఉంటుంది. ఆస్పత్రులకు వచ్చే వారిని ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మరీ ప్రధానంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి దోపిడీకి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో డబ్బుల కక్కుర్తి ఆగడంలేదు. ప్రధానం గా నాలుగు విభాగాల్లో విచ్చలవిడిగా పేషెంట్ల సంబంధీకుల నుంచి డబ్బుల కోసం పీల్చి పిప్పిచేస్తున్నారు. ప్రసూతిగది, ఆపరేషన్ థియే టర్, క్యాజువాలిటీ, మార్చురీ విభాగాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రిలో ప్రసవం జరిగి తే.. మగపిల్లవాడు పుడితే రూ.వెయ్యి, ఆడపిల్ల పుడితే రూ.500 డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇటువంటి ఆరోపణలు రావడంతో మూడుసార్లు పలువురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయినా వారిలో మార్పు రా వడంలేదు. కొన్ని నెలల క్రితమే పోస్టుమార్టం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎన్ఎంఓలు యా దయ్య, కిష్ణయ్యలు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణపై సస్పెండ్ చేశారు. అయినా ఆస్పత్రి సిబ్బంది తాజాగా చెన్నకేశవులు, ఆయన కూతురు ఆత్మహత్యకు కారకులయ్యారు. వైద్యులదీ అదే పరిస్థితి..! కమీషన్లకు కక్కుర్తి పడుతున్న వైద్యులు ప్రతి చిన్నదానికీ టెస్టుల కోసం బయటకు రాస్తున్నారు. సంబంధిత పరీక్షలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నా వారికి అవేమీ పట్టవు. ముఖ్యంగా జిల్లా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న పరికరాలు... సరిగా పనిచేయడం లేదనో, కండిషన్ లేదనో రకరకాల కారణాల చేత బయటకు పంపుతున్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేవలం గర్భవతులకు మాత్రమే తీస్తున్నారు. మిగతా కడుపునొప్పి బాధతో వచ్చే వారిని ఆస్పత్రిలో చికిత్స నిర్వహించకుండా బయటకు పంపుతున్నారు. ఎక్స్రే మిషన్ ఉన్నా ఫిల్మ్ సరిగా రావడం లేదంటూ బయటకు రాస్తారు. అందుబాటులో ఉన్న సీబీపీ, ఎలక్ట్రోలైట్స్, హిమోగ్లోబిన్, సీఆర్పీ, ఏఎస్ఓ, వైడల్, ఆర్యటెస్టు తదితర వాటికి కూడా బయటకే. ఆస్పత్రిలో అందుబాటులో లేని ఎల్పీటీ, కాల్షియం, కొలెస్ట్రాల్, యూరిక్యాసిడ్, సిరమ్ప్రొటిన్ వంటి పరీక్షలను అతితక్కువ ఖర్చులో స్థానికంగా ఉన్న ఎస్వీఎస్ ఆస్పత్రిలో పరీక్షలు జరిపేలా గతంలో ఉన్న కలెక్టర్ గిరిజాశంకర్ ఆదేలిచ్చారు. అయితే అటువంటి పరిస్థితి ఇప్పటిదాకా లేదు. అంతా ప్రైవేట్ నర్సింగ్హోంలకు పంపుతున్నారు. ఇలా చేయడం వల్ల సంబంధిత వైద్యులకు కమీషన్లు అందుతున్నట్లు వినికిడి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించం. లంచావతారుల భరతం పడతాం. లంచం ఎవరడిగినా 040-23254071 నెంబర్కు ఒక్క ఫోన్ కాల్ కొట్టండి చాలు - ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు దవాఖానాల్లో వందో, రెండొందలో తీసుకుంటే తప్పేంటి. సహజంగా చేతి ఖర్చులకు అడిగి తీసుకుంటే తీసుకోవచ్చు. అయినా దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు - డిప్యూటీ సీఎం, -
రాజయ్యకు రంది!
ఉప ముఖ్యమంత్రికి వరుసగా ఎదురుదెబ్బలు సాంబశివరావుపై వేటుతో కొత్త ఇబ్బందులు ‘తాటికొండ’కు సన్నిహితుడు డీహెచ్ పట్టుబట్టి పోస్టింగ్ ఇప్పించిన డిప్యూటీ సీఎం వరంగల్ : అనూహ్య రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తాటికొండ రాజయ్యకు రాజకీయంగా, పరిపాలనా పరంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలో పరిపాలనా పరమైన నిర్ణయాలపై అవినీతి ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజయ్యకు ప్రతికూల పరిస్థితులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమైంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా రాజయ్య నియమించిన బి.రాజును తొలగించారు. ఇలా వరుస నిర్ణయాలతో రాజయ్యకు రాజకీయంగా ఇబ్బందు లు తప్పవనే ప్రచారం జరిగింది. నియామకాలు, స్వైన్ఫ్లూ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల తీరును తప్పుపట్టిన కేసీఆర్.. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు ఒకింత మద్దతు ఇచ్చినట్లుగా మంగళవారం ప్రకటన చేశారు. ఇది జరిగిన 12 గంటల్లోనే ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వైద్య, ఆరోగ్య శాఖ డెరైక్టరు పి. సాంబశివరావుపై వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఈ పోస్టు నుంచి తప్పించి ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు సాంబశివరావు అత్యంత సన్నిహితుడు. సాంబశివరావుపై ప్రభుత్వం ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్యకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో ఇబ్బందికరంగా మారిన స్వైన్ఫ్లూ నియంత్రణలో విఫలమైన కారణంగానే సాంబశివరావును డెరైక్టరు పోస్టు నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది. అసలు కారణం ఇది కాదని అధికారికంగా ప్రకటన రావడంతో.. అవినీతి ఆరోపణలే దీనికి కారణమని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు తాటికొండ రాజయ్య జూన్ 2న ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పటికి వరంగల్ జిల్లా వైద్యాధికారిగా ఉన్న సాంబశివరావుకు జూలై 1న ప్రాంతీయ డెరైక్టరు పోస్టు ఇచ్చారు. ఆయనపై శాఖ పరమైన అవినీతి ఆరోపణలు ఉన్నా ప్రాంతీయ డెరైక్టరు పోస్టు ఇచ్చారు. మళ్లీ సాంబశివరావుకు జూలై 31న వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర డెరైక్టరుగా పోస్టింగ్ పొందారు. ఈ అత్యున్నత పోస్టు ఆయనకు వచ్చేందుకు రాజయ్యతో ఉన్న సాన్నిహిత్యమే ప్రధాన కారణమనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఈ పోస్టింగ్ విషయంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ విషయంలోనే ఉన్నతాధికారులపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. వరంగల్ జిల్లా వైద్యాధికారిగా ఉన్నప్పుడు తనకు దగ్గరగా ఉన్నవారిని మధ్యవర్తులుగా పెట్టుకుని రాష్ట్ర స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్లు ఇచ్చేందుకు సాంబశివరావు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. వైద్య, ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఈ విషయాల్లో చూసిచూడనట్లుగా ఉండడం ఆయనపైనా విమర్శలు వచ్చేలా చేసింది. చివరికి ఇది సాంబశివరావుపై వేటుతో ఆగింది. అంతా ఆరు నెలల్లోనే.. జఫర్గఢ్కు చెందిన డాక్టర్ పిల్లి సాంబశివరావు ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ వైద్యుడిగా కొనసాగుతూ ఒక్కొమెట్టు పైకి ఎదిగారు. 2011 నవంబరు 6న వైద్య ఆర్యోగ శాఖ జిల్లా అధికారి(డీఎంహెచ్వో)గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రిలో ఆర్ఎంవోగా పని చేశారు. జూన్ 2న ప్రాంతీయ డెరైక్టరుగా ఉన్న సాంబశివరావు రాష్ట్ర డెరైక్టరుగా పోస్టింగ్ దక్కించుకున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) పోస్టింగ్ల విషయంలో ఆరోపణలతో ఆరు నెలల్లోనే ఈ పోస్టు నుంచి తొలగింపునకు గురయ్యారు. -
'రాజధానికి మద్దతుగా భారీ సభను ఏర్పాటు చేస్తాం'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తనదైన శైలిలో స్పందించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 20 లోగా రాజధానికి మద్దతుగా లక్ష మందితో విజయవాడలో సభ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో విధ్వంసాన్ని డిప్యూటీ సీఎం తీవ్రంగా ఖండించారు. ఆ సంఘటనకు సంబంధించి ఎవరినీ ఉపేక్షించమన్నారు. గ్రామ కంటం భూములు, ఫోరం బోకు భూములు ఉపయోగపడే విధంగా ప్రయత్నాలు చేస్తామన్నారు. వీఆర్వోవోల సంఖ్యను పెంచి సమర్ధవంతంగా పనిచేయిస్తామన్నారు. -
రాజయ్యా.. కనవయ్యా..
‘ఇక్కడ ప్రతిదానికీ పైసలు అడుగుతుండ్రు. మత్తు సూది డాక్టర్కు రూ.1500, పుట్టిన బిడ్డను కడిగినందుకు రూ.800, బిడ్డను చూపించాలంటే రూ.200. డాక్టర్లు, ఇతర పనోళ్లు పీడిస్తుండ్రు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా నరకం చూపిస్తుండ్రు. బాత్రూములు కంపుకొడ్తున్నయ్. లైట్లు ఎల్గుతలేవ్. మంచినీటికీ గోసవెడుతుండ్రు...’ గోదావరిఖని ప్రభుత్వాసుత్రిలో రోగుల గోడు ఇది. ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య ఆస్పత్రిని తనిఖీ చేయడానికి ఆదివారం ఉదయం రానున్నారు. రాత్రికి ఆస్పత్రిలోనే బస చేయనున్నారు. ఈ సమస్యలన్నీ మంత్రికి కనిపించకుండా ఉండేందుకు రెండు రోజులుగా అధికారులు కష్టపడుతున్నారు. ఆస్పత్రి రూపురేఖలు మార్చేశారు. అయినా సమస్యలు వేలెత్తి చూపిస్తున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషెంట్లు, వారి బంధువులు ఆస్పత్రి లీలలను మంత్రికి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. వైద్యుల కొరతతో ఇబ్బందులు ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో నెలకు 200 నుంచి 250 వరకు రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. అందుకు తగినవిధంగా వైద్య సిబ్బంది లేరు. 2002లో ఆస్పత్రి ప్రారంభమైనప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన మూడు సివిల్ సర్జన్ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ కాలేదు. వీటిలో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎనిమిది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్, ఈఎన్టీ, కంటి వైద్య నిపుణులు, అనస్తీషియా, పాతాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణులు తదితర డాక్టర్లు సేవలందించాల్సి ఉండగా, వీరిలో ప్రస్తుతం గైనకాలజిస్ట్, అనస్తీషియా మాత్రమే సేవలందిస్తున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ వినయ్కుమార్ నెల రోజులుగా ఆస్పత్రికి రావడం లేదు. లాంగ్లీవ్లో ఉండడంతో ప్రజలకు సేవలు అందడం లేదు. ఐదుగురు ఎంబీబీఎస్ డాక్టర్లతో కాంట్రాక్టు పద్ధతిన సేవలందిస్తున్నారు. ఎనిమిది నెలలుగా ఆస్పత్రికి డైట్ బిల్లులు సుమారు రూ.8 లక్షల వరకు రాలేదు. విద్యుత్ బకాయిలు రూ.7 లక్షలకుపైగా ఉన్నాయి. గత డిసెంబర్ నుంచి ఆస్పత్రి అంబులెన్స్ సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రిలో స్పెషలిస్టు డాక్టర్లను నియమిస్తే ఆస్పత్రిని నమ్మి వస్తున్న నిరుపేద ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు నీరుగారిపోతున్నాయి. పదేళ్లుగా ఆస్పత్రిని నమ్ముకుని సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని కోరుతున్నారు. సమస్యలతో తల్లడిల్లుతున్న ధర్మాస్పత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎలాంటి చికిత్స అందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులతో ప్రయోగాలు ఆస్పత్రిలో అనస్తీషియాగా పనిచేస్తున్న డాక్టర్ మోహన్రావు కొంతకాలంగా ఓ ప్రైవేట్ మహిళను డాక్టర్గా పరిచయం చేస్తూ... ఆస్పత్రిలోని థియేటర్లో ప్రయోగాలు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అధికారుల అనుమతి లేకుండా సదరు మహిళతో చికిత్స చేయించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై డీసీహెచ్ఎస్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీరావుకు, డాక్టర్ మోహన్రావుకు మధ్య వివాదం చోటు చేసుకుంది. మోహన్రావు థియేటర్లోకి వస్తే, తాను వైద్య సేవలు అందించనంటూ గైనకాలజిస్ట్గా సేవలందిస్తున్న సూర్యశ్రీరావు తేల్చిచెప్పారు. దీంతో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఈ గొడవ ఆస్పత్రిలో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల మహదేవాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన నగునూరి శారద అనే నిరుపేద బాలింతకు డాక్టర్లు అందుబాటులో ఉండి కూడా ప్రసవం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో గత్యంతరం లేక ఆస్పత్రి సిబ్బంది కరీంనగర్కు తరలించారు. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.20 వేలు అప్పు చేసి శారదకు కుటుంబసభ్యులకు పురుడు పోయించారు. లంచాల కోసం డిమాండ్ ప్రసవం కోసం ఆస్పత్రికి వస్తే కొందరు వైద్యులు, సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మత్తు సూదికి, పుట్టిన బిడ్డను శుభ్రం చేయడానికి, బిడ్డను చూపించడానికి, బాత్రూమ్లు శుభ్రం చేయడానికి ఇలా.. వివిధ సేవల పేరుతో కాసులు దండుకుంటున్నారని రోగులు, వారి బంధువులు పేర్కొంటున్నారు. వివిధ సమస్యలతో వస్తున్న పేషెంట్లకు, స్థానికంగానే ఉచితంగా చికిత్స చేయాలి. కొందరు డాక్టర్లు, వాళ్లు పని చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి డబ్బులు దండుకుంటున్నారు. సిబ్బందికి కూడా ఇందులో వాటా ఇస్తున్నారు. -
రెండు దశాబ్దాల తర్వాత..
సంప్రదాయాలకు విరామం ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత లేకుండా శీతాకాల సమావేశాలు సమావేశాలకు ముందు అధికారపక్షంలో చేరిన శివసేన ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్, ఎన్సీపీ హోరాహోరీ సాక్షి ముంబై: రాష్ర్టంలో ఈసారి శీతాకాల సమావేశాలు ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు లేకుండా జరుగుతుండటం విశేషం. 20 ఏళ్ల అనంతరం ఉపముఖ్యమంత్రి లేకుండా ఈ సమావేశాలకు నాగపూర్ వేదికకావడం విశేషంగా చెప్పుకోవచ్చు. 1995-99 మధ్య కాలంలో శివసేన-బీజేపీల కాషాయ కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పరంపర కొనసాగుతూ వచ్చింది. అయితే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఒంటరిగా పోరాడాయి. ఎవరికీ పూర్తి మద్దతు లభించకపోయినప్పటికీ 122 స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మళ్లీ మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలు ఒక్కటయ్యాయి. అయితే ఉపముఖ్యమంత్రి పదవి మాత్రం ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న శివసేన శీతాకాల సమావేశాలకు ఒక రోజు ముందు ప్రభుత్వంలో భాగస్వామిగా మారడంతో ఈసారి ప్రతిపక్ష నాయకుడు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు 2012లో ఉపముఖ్యమంత్రి లేకుండా సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైనప్పటికీ చివరి క్షణంలో మళ్లీ అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ సమయంలో జలవనరుల కుంభకోణంపై ఆరోపణలు రావడంతో ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఉపముఖ్యమంత్రి ఖాళీ అయింది. ఈ పదవిని భర్తీ చేయరని భావించినప్పటికీ శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందు భర్తీ చేసి ఆ సమావేశాల్లోనే ప్రమాణస్వీకారం చేశారు. 1978 నుంచి డిప్యూటీ సీఎం... రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1978లో ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించారు. ఆ సమయంలో ఎస్ కాంగ్రెస్కు చెందిన వసంత్దాదా పాటిల్ ముఖ్యమంత్రి ఉండగా ఉపముఖ్యమంత్రిగా ఇందిరా కాంగ్రెస్కు చెందిన నాశిక్రావ్ తిరపుడే బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఉపముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్కు చెందిన రామారావ్ అధిక్కు లభించింది. ఆయన వసంత్దాదా పాటిల్తోపాటు శరద్పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రామారావ్ అధిక్ అనంతరం మళ్లీ కాంగ్రెస్లో ఎవరికి ఉపముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టే గౌరవం లభించలేదు. 15 ఏళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎవరికీ ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదు. అనంతరం శివసేన-బీజేపీ కాషాయ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో శివసేనకు చెందిన మనోహర్ జోషీ ముఖ్యమంత్రిగా ఉండగా దివంగత బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. నాలుగేళ్ల అనంతరం శివసేనకు చెందిన నారాయణ రాణే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ ఉపముఖ్యమంత్రిగా మాత్రం గోపీనాథ్ ముండేనే కొనసాగారు. అదే సమయంలో శరద్పవార్ కాంగ్రెస్నుంచి విడిపోయి నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అలాగే శివసేన ప్రముఖ నాయకుడైన ఛగన్భుజ్బల్ తిరుగుబాటు బావుట ఎగురవే సి ఎన్సీపీలో చేరిపోయారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీల డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్కు చెందిన విలాస్రావ్ దేశ్ముఖ్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టగా, ఎన్సీపీలో చేరిన ఛగన్ భుజ్బల్కు ఉపముఖ్యమంత్రి పదవి లభించింది. 2003లో ఎన్సీపీకి చెందిన విజయ్సింగ్ మోహితేపాటిల్, 2004లో ఎన్సీపీకి చెందిన ఆర్ ఆర్ పాటిల్లు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008 నవంబర్లో జరిగిన ముంబై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న విలాస్రావ్ దేశ్ముఖ్తోపాటు ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆర్ ఆర్ పాటిల్ రాజీనామా చేయాల్సివచ్చింది. దీంతో మరోసారి ఛగన్భుజ్బల్కు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లభించింది. 2009 ఎన్నికల్లో తిరిగి డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2012లో శీతాకాల సమావేశాలకు ముందు కొన్నిరోజులపాటు అజిత్పవార్ రాజీనామా చేసి, చివరిక్షణంలో మళ్లీ పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈసారి ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రి పదవిని ఎవరికీ కట్టబెట్టలేదు. దీంతో 20 యేళ్ల అనంతరం మరోసారి శీతాకాల సమావేశాలు ఉపముఖ్యమంత్రి లేకుండా జరుగుతున్నాయి. -
రూ. 700 కోట్ల రుణ మాఫీ
* ఇది కేవలం సొసైటీల ద్వారానే.. * ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప * సహకార వారోత్సవాల ముగింపు అమలాపురం రూరల్ : జిల్లాలో సహకార సంఘాల ద్వారా రూ.700 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 61వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా కోనసీమ సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో సభ జరిగింది. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా రాజప్ప మాట్లాడుతూ 1.55 లక్షల మంది రైతులకు రూ.700ల కోట్ల రుణమాఫీ జరుగుతుందన్నారు. వాణిజ్యపంటలకూ రుణమాఫీ అమలు చేయాలని కోరుతున్నారని, ఉద్యానపంటల రుణమాఫీకి రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,500ల కోట్లు కావాలని, దీనిపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సహకార సంఘాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంటు ఏర్పాటు చేస్తే డీసీసీబీ ద్వారా రూ.లక్ష నిధులు మంజూరు చేస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 12 బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ కోనసీమలో అధిక శాతం రైతులు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని, వీరికి రుణమాఫీ అమలు చేయాలన్నారు. అనంతరం రాజప్పను సహకార సంఘ ఉద్యోగులు సత్కరించారు. కాకినాడ బిల్డింగ్ సొసైటీ చైర్పర్సన్ కె.చిలక వీరరాఘవులు తమ సంఘం తరఫున రూ.2లక్షల 22వేల 202ను సీఎం సహాయనిధికి అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సీఈఓ హేమసుందర్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు దున్నా జనార్దనరావు, మాజీ చైర్మన్ శిరంగు కుక్కుటేశ్వరరావు, డివిజన్ సహకార అధికారి కె.రాధాకృష్ణారావు, డీసీసీబీ డెరైక్టర్లు పాల్గొన్నారు. వాణిజ్య పంటలకు రుణమాఫీ వర్తింపజేయలేం అంబాజీపేట : వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని, వాణిజ్య పంటలకు రుణమాఫీని వర్తింపజేయలేమని డిప్యూటీ సీఎం, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అంబాజీపేటలో సహకార సంఘం ద్వారా మీ సేవా, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉద్యాన పంటలకూ రుణమాఫీ వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లామని, దానిపై స్పష్టత రావాల్సి ఉందని, మరోసారి ఈ అంశాన్ని కోనసీమ రైతులతో కలిసి సీఎంతో సమావేశమవుతామని పేర్కొన్నారు. అనంతరం ఉద్యాన పంటలకు రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బీకేఎస్ నాయకులు ముత్యాలు జమ్మీలు, సొసైటీ అద్యక్షుడు రాఘవులు తదితరులు రాజప్పకు అందజేశారు. -
జూడాలపై చర్యలు తీసుకుంటా
-
జూడాలపై చర్యలు తీసుకుంటా
ఉపముఖ్యమంత్రి రాజయ్య సాక్షి, సంగారెడ్డి: కోర్టు మొట్టికాయవేసినా మొండిగా వ్యవహరిస్తున్న జూనియర్ డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖను వికేంద్రీకరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వైద్యకళాశాల వార్షిక వేడుకలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. జూడాలు వ్యవహరిస్తున్న తీరు బాధ కలిగిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందజేయబోమని చెప్పటం దారుణమన్నారు. వైద్యులైన నా పిల్లలను గ్రామీణ ప్రాంతాలకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జూడాల ఐదు డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించినా.. వారు మొండిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. -
జూనియర్ డాక్టర్లపై చర్యలు తప్పవు: రాజయ్య
గ్రామాల్లో వైద్య సేవలు అందించకపోతే జూనియర్ డాక్టర్లపై చర్యలు తప్పవని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు. జీవో నెంబర్ 1022 ప్రకారం వాళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తన కొడుకు, కూతురు ఇద్దరూ కూడా వైద్యులేనని, వాళ్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారని రాజయ్య చెప్పారు. జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక తప్పదని ఆయన అన్నారు. -
‘పొత్తు’కు పదవులే అడ్డు..!
* బీజేపీ, శివసేన మధ్య కొనసాగుతున్న చర్చలు * డిప్యూటీ సీఎంతోపాటు 10 మంత్రి పదవులపై పట్టుపడుతున్న శివసేన * 8 మంత్రి పదవులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న బీజేపీ * డిప్యూటీ సీఎం పదవి దగ్గరే ఆగిపోయిన సంప్రదింపులు సాక్షి, ముంబై: బీజేపీతో చేతులు కలిపేందుకు శివసేన సుముఖంగా ఉన్నప్పటికీ ఉపముఖ్యమంత్రి పదవితోపాటు కనీసం 10 మంత్రి పదవులు ఇవ్వాలనిడిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై బీజేపీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి మాత్రం శివసేనను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శివసేన నాయకులతో బీజేపీ నాయకులు శనివారం కూడా ఈ విషయంపై చర్చలు జరిపినట్టు తెలిసింది. అందిన వివరాల మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ టీమ్లో మొత్తం 32 మంది మంత్రులుండనున్నారు. వీరిలో ఉపముఖ్యమంత్రితోపాటు 12 మంత్రి పదవులను శివసేన కోరుతోంది. అయితే ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పదవి విషయంపై బీజేపీ, శివసేన చర్చలు ముందుకువెళ్లడంలేదని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం 20 మంత్రి పదవులు తమ వద్ద ఉంచుకుని ఎనిమిది మంత్రి పదవులు శివసేనకు, మిగతావి మిత్ర పక్షాలకు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై అధికారికంగా మాట్లాడేందుకు ఎవరు ముందుకురాక పోయినప్పటికీ రాష్ట్రంలో మరోసారి శివసేన, బీజేపీలు కలిసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల విషయంపై దూరమైన మిత్రులు ఎన్నికల ఫలితాల అనంతరం తమ వైఖరిని మార్చుకున్నారు. ముఖ్యంగా బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంలో శివసేన మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు శివసేనకు కూడా బీజేపీతో చేతులు కలపాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో సీట్ల పంపకాల కారణంగా విడిపోయిన శివసేన, బీజేపీలు మంత్రి పదవుల పంపకాలపై సానుకూలంగా వ్యవహరించి ఇద్దరు మళ్లీ ఒక్కటవుతారని పరిశీలకులు భావిస్తున్నారు. -
నేను.. డిప్యూటీ సీఎం పీఏని...
పెద్దాపురం :రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పీఏనంటూ డెరైక్టర్గా డీఎస్పీకే మస్కా కొట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి పంపారు. స్థానిక పోలీసు స్టేషన్లో సోమవారం మధ్యాహ్నం డీఎస్పీ ఓలేటి అరవిందబాబు ఆ నిందితుడిని విలేకరుల ముందు హాజరుపరిచారు. డీఎస్పీ కథనం ప్రకారం... గత నెల 27న డిప్యూటీ సీఎం పీఏని మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి పెద్దాపురం డీఎస్పీ సెల్కు ఫోన్ చేశాడు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో డిప్యూటీ సీఎం ఫలానా వ్యక్తికి న్యాయం చేయాలని సెల్ : 9440156511 నుంచి కాల్ వచ్చింది. దీనిపై అనుమానం వచ్చిన డీఎస్పీ పెద్దాపురం పోలీసులను విచారణ జరపాలని అదే రోజు ఆదేశించారు. దీంతో సీఐ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై శివకృష్ణ కేసు విచారణ చేపట్టారు. పెద్దాపురం పట్టణానికి చెందిన చిట్టూరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి నుంచి ఈ ఫోన్కాల్ వచ్చినట్టు నిర్ధారించుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. చిట్టూరి రాజేంద్రప్రసాద్ స్వగ్రామం ప్రత్తిపాడు కాగా, రెండేళ్ల నుంచి పెద్దాపురంలో ఉంటున్నాడన్నారు. నిందితుడుని కోర్టులో హాజరుపరుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇలాంటి తప్పుడు ఫోన్కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నవారిపై నిఘా ఉంచినట్టు ఆయన తెలిపారు. -
నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం
ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 9 గంటలకు జడ్చర్లలోని ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ టీ బ్రేక్ తీసుకుని కలెక్టర్ గిరిజాశంకర్తో కాసేపు భేటీ కానున్నారు. 9.20 గంటలకు జడ్చర్ల ఏరియా ఆస్పత్రిని సందర్శిస్తారు. 20 నిమిషాల పాటు అక్కడి పరిసరాలను పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం 9.40 గంటలకు నాగర్కర్నూల్కు బయల్దేరతారు. 10.40 గంటలకు నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రిని సందర్శిస్తారు. ఉదయం 11గంటలకు డీఎంహెచ్ఓ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్ బ్రేక్ తీసుకొని 2.00గంటలకు బిజినేపల్లికి బయల్దేరుతారు. 2.30 గంటలకు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మహబూబ్నగర్కు బయల్దేరతారు. 3.40కు మహబూబ్నగర్లోని ఆర్ అండ్బీ అతిథి గృహానికి చేరుకుని, ఆ తర్వాత జిల్లా ప్రధాన ఆస్పత్రిని సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు రవీంద్రనగర్లోని పోచమ్మగుడి వద్ద జరగనున్న బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. అన ంతరం సాయంత్రం 5 గంటలకు జెడ్పీ మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. 6 గంటలకు ప్రెస్మీట్ అనంతరం హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు. -
తాగునీటికి మొదటి ప్రాధాన్యం
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు: తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మండలాలకు మంజూరయిన నిధులను ఖర్చు చేయాలని అధికారులకు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం పత్తికొండ, డోన్ నియోజకవర్గ పరిధిలోని అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లతో గ్రామీణ ప్రాంతాల్లో నీరు వృథా అవుతోందన్నారు. అలాంటి చోట్ల వెంటనే కొత్త పైపులైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ రహదారులకు ఎంత బడ్జెట్ ఉంది, ఇంకా ఎంత అవసరమవుతుంది అనే విషయంపై అడిగి తెలుసుకున్నారు. సరిగాలేని రోడ్లను గుర్తించి, వాటి నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య మెరుగుదల కోసం సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ఇంటర్నల్ రోడ్లు నిర్మించాలన్నారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి జెడ్పీటీసీ సభ్యులు సుకన్య, పురుషోత్తం చౌదరి, వరలక్ష్మి, లక్ష్మిదేవిలతో పాటు ఎంపీపీలు తలారి లక్ష్మి, పద్మావతి, గురుస్వామి, సుంకులమ్మ, శైలజ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ క్రిష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల చేరికను అడ్డుకున్న టీడీపీ నేతలు... ప్యాపిలి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధ పడగా ప్యాపిలికి చెందిన టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్యాపిలికి చెందిన కాంగ్రెస్ నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, కమతం భాస్కర్రెడ్డి, సింగిల్విండో ఛైర్మన్వెంకటరెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం నాయకులు ప్యాపిలి ఎంపీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారి చేరికను అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటే బావుండదని స్థానిక నాయకులు అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. -
దళితుల అభ్యున్నతికి ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం రాజయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దళితుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనిఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. ఆదివారం తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మాదిగ ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సభలో రాజయ్య మాట్లాడుతూ, దండోరా ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి తాను అందులో భాగస్వామినని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా మాదిగల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కేసీఆర్ చేపట్టిన ఉద్యమం వరకు అమరులైనది దళిత బిడ్డలేనన్నారు. ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ, మాదిగ దండోరా ఉద్యమం సామాజిక ఉద్యమమన్నారు. కానీ రాజకీయ నిర్ణయం తీసుకోవడంతో ఆదరణ కోల్పోయిందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూర్ రమేశ్ మాట్లాడుతూ, భాస్కర్ నాయకత్వంలో జరిగే ఈ మలిదశ దండోరా ఉద్యమం మాదిగల ప్రయోజనాలు నెరవేర్చాలన్నారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, సంపత్కుమార్ మాట్లాడుతూ, మాదిగ ప్రజాప్రతినిధులంతా సంక్షేమమే ఎజెండాగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మెల్యేలు కాల యాదయ్య, రసమయి బాలకిషన్, నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జీవ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య, అధికార ప్రతినిధి సురేందర్, దేవయ్య పాల్గొన్నారు. -
పెద్దన్నపైనే ఆశలు!
రాయలేలిన రతనాల సీమ రాళ్లు తేలింది. చినుకు పడితే వరద భయం వెంటాడుతోంది. తాగునీటి కోసం గొంతెండుతోంది. ఛిద్రమైన రహదారుల్లో ప్రయాణం నరకప్రాయమవుతోంది. సంక్షేమ పథకాల అమలు కాగితాలకే పరిమితమైంది. రైతన్న గోడు అరణ్యరోదన అవుతోంది. పెద్దన్నా.. ఇక నీపైనే భారం. సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా రాజకీయాల్లో పెద్దాయనగా గుర్తింపు పొందిన టీడీపీ నేత కె.ఈ.కృష్ణమూర్తి రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కనబర్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అరుదైన గౌరవం ఆయన సొంతమైంది. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగిన కేఈని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇదే సమయంలో రెవెన్యూ.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విభజనానంతరం అభివృద్ధిపై నెలకొన్న అపోహలను తొలగించి కర్నూలును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే బాధ్యతను భుజానికెత్తుకోవాలని కోరుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం కేఈ తొలిసారిగా నేడు కర్నూలులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పురోభివృద్ధికి ఆయన ఎలాంటి చర్యలు చేపడతారో.. కొండలా పేరుకుపోయిన సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతారోననే చర్చ జరుగుతోంది. ఒక్కసారి జిల్లాలో పాలన తీరుతెన్నులను పరిశీలిస్తే.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు అవసరమైన విత్తనాలు ఇప్పటికీ అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన పంటగా సాగు చేస్తున్న వేరుశనగకు సంబంధించి సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 40వేల క్వింటాళ్ల విత్తనం మాత్రమే మంజూరైంది. జూన్ నెల సగం గడిచిపోయినా సరఫరా ప్రణాళికలో 20 శాతం ఎరువులు కూడా జిల్లాకు చేరని పరిస్థితి. ఇదే అదనుగా డీలర్లు బ్లాక్ విక్రయాలకు తెరతీశారు. రుణ మాఫీపై టీడీపీ చేస్తున్న కాలయాపనతో బ్యాంకుల్లో కొత్త రుణాలు అందక పెట్టుబడుల కోసం రైతులు అల్లాడిపోతున్నారు. ఇకపోతే రహదారులు ఛిద్రం కావడంతో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా కర్నూలు-బళ్లారి రోడ్డు పేరెత్తితే ప్రయాణికులు వణికిపోతున్నారు. నాయకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా రహదారి విస్తరణ అటకెక్కింది. ఉపాధి నిధులతో గ్రామ పంచాయతీల్లోని ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరైనా పనుల్లో నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. అదేవిధంగా సామాజిక పింఛన్ల పంపిణీలో అక్రమార్కుల చేతివాటం వృద్ధులు, వికలాంగులకు నిరాశ మిగులుస్తోంది. స్మార్ట్ కార్డు లేవనే కారణంతో జిల్లాలో 60వేల వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు నిలిపేయడంతో ఆసరా కరువైన బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అభయహస్తం పథకం కింద 1.70 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినా.. 18వేల మందికే ప్రయోజనం చేకూర్చడం విమర్శలకు తావిస్తోంది. తాగునీటికీ కటకటే... జిల్లాలోని 165 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. 48 వాటర్ స్కీంలలో అత్యధికం నిరుపయోగమే. ప్రజలకు శుద్ధి చేసిన నీటి సరఫరా రికార్డులకే పరిమితమైంది. సీపీడబ్లూ స్కీంల ద్వారా మంచినీరు కొన్ని గ్రామాలకు మాత్రమే అందుతోంది. మూడు రోజులకోసారి నీరు సరఫరా అవుతున్న పల్లెల్లో ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతం. ఫ్లోరైడ్ నీటితో చాలా పల్లెల్లో చిన్న వయస్సులోనే యువకులు సైతం వికలాంగులుగా మారిపోతున్నారు. నిర్లక్ష్యం పారుతోంది... తెలుగుగంగ, శ్రీశైలం కుడి బ్రాంచ్ కెనాల్, గాలేరు-నగరి, తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ పనుల్లో పురోగతి లోపించింది. 1983లో ప్రారంభమైన తెలుగుగంగ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుకు సాగునీరు.. చెన్నైకి తాగు నీరు అందిస్తున్న ప్రధాన కాలువ పూర్తి చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా జిల్లాలో 1.51 లక్షల ఎకరాలకు, 16 మండలాల పరిధిలోని 194 గ్రామాలకు సాగు, తాగు నీరు అందించాల్సి ఉంది. కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాటా నీరు అందక ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమవుతోంది. శ్రీశైలం కుడి గట్టు కాలువ కర్నూలు, కడప జిల్లాలకు వరప్రదాయిని. కాలువ పూర్తయితే 10 మండలాల్లో 200 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే కాలువ కాంక్రీట్ పనులు పూర్తి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదేవిధంగా ప్రధాన కాల్వ నుంచి గోరుకల్లు ప్రాజెక్టులోకి నీటిని పంపే ఇన్ఫాల్ రెగ్యులేటర్ పూర్తి కాలేదు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం ఫేజ్-1 పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీనీవా సుజల స్రవంతి పనులు ఎనిమిదేళ్లు దాటిన ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. మూడు రోజులు జిల్లాలో పర్యటన కర్నూలు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు కర్నూలుకు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో 4.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. బళ్లారి చౌరస్తాలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఊరేగింపుగా ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు. 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో అతిథిగృహంలో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు కర్నూలు నుంచి రోడ్డు మార్గంలో 1.30 గంటలకు డోన్ చేరుకుంటారు. 4 గంటలకు పంచాయతీరాజ్ ప్రభుత్వ అతిథిగృహంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 5.30 గంటలకు తిరిగి కర్నూలుకు చేరుకుంటారు. 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమై అభివృద్ధిపై చర్చించనున్నారు. అనంతరం హైదరాబాద్కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆదివారం ఓఎస్డీ ఎం.గోపాలం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీకి పర్యటన వివరాలు అందాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో కేఈ మొదటిసారి జిల్లా పర్యటనకు వస్తున్నందున జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. -
వీలైనంత త్వరలో నిమ్స్లో వైద్యసేవలు
- మొదట ఓపీ విభాగం ప్రారంభిస్తాం - అంచలంచెలుగా అభివృద్ధి - అదనపు నిధుల కోసం కేబినెట్లో చర్చిస్తా - ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య బీబీనగర్ : బీబీనగర్లోని నిమ్స్ (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సెన్సైస్)లో వీలైనంత త్వరలో వైద్యసేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆయన బీబీనగర్లోని నిమ్స్ యూనివర్సిటీలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రిని ప్రారంభించేందుకు అయ్యే అంచనా వ్యయం, వైద్యాధికారులు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వీలైనంత త్వరలో ప్రజలకు వైద్యసేవలు అందించేలా మొదట ఓపీ (అవుట్ పేషంట్) విభాగాన్ని ప్రారంభిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలను ప్రక్షాళన చేస్తానన్నారు. నిమ్స్ అభివృద్ధికి అదనపు నిధుల కోసం కేబినెట్లో కూడా చర్చిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే దిశగా హెల్త్హబ్, టూరిజం ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. పదేళ్ల ఉమ్మడి రాజధానిలో హెల్త్ యూనివర్సిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని ఆలోచించి కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. గ్రామీణస్థాయిలో ప్రతి గడపకు, వైద్యం, మందులు చేరేలా, అంటువ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తానన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసి మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఓపీ విభాగం ప్రారంభించిన అనంతరం అంచలంచెలుగా నిమ్స్ను అభివృద్ధి చేస్తామన్నారు. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా ఆలేరు : ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆయనకు ఆలేరులో టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. బంగారు తెలంగాణను సాకారం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేరుస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదన్నారు. ఈ సందర్భంగా రాజయ్య, సునీతలు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. డప్పు కళాకారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కొద్దిసేపు డోలు వాయించి ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు గొంగిడి మహేందర్రెడ్డి, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, నాయకులు ఆకవ రం మోహన్రావు, చింతకింది మురళీ, దాసి సంతోష్, కాసగల్ల అనసూర్య, పిక్క శ్రీను, బింగి రవి, పోరెడ్డి శ్రీనివాస్, రచ్చ కావ్యశ్రీ, ఆడెపు బాలస్వామి, కర్రె అశోక్, బొంకూరి బాల్నర్సయ్య, బండారి సాంబయ్య, బైరి చంద్రంగౌడ్, జైరాంనాయక్, పల్ల జోగిరెడ్డి పాల్గొన్నారు. -
విస్తరణపైనే ఆశలు
ఉత్కంఠలో ‘కొప్పుల’మంత్రా.. చీఫ్ విప్పా.. ఈశ్వర్ వర్గీయుల్లో టెన్షన్ కరీంనగర్ సిటీ : ఒకటి తను వద్దన్నాడు... మరొకటి పార్టీ ఇవ్వనంది.. అన్నట్లు తయారైంది ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పరిస్థితి. తనకు వస్తుందనుకున్న డెప్యూటీ సీఎం పదవిరాకపోగా, అధినేత ఆఫర్ చేసిన స్పీకర్ పదవి పట్ల ఆయన విముఖత చూ పారు. అయినప్పటికీ స్పీకర్, డెప్యూటీ స్పీకర్లలో ఏదో ఒక పదవి వస్తుంద నే అంతా భావించారు. చివరకు స్పీకర్గా మధుసూదనాచారి, డెప్యూటీ స్పీకర్గా పద్మాదేవేందర్రెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. దీంతో కొప్పులకు దక్కే పదవిపై మళ్లీ చర్చ మొదలైంది. తనకు ఏ ఇతర పదవులు వద్దని, మంత్రి పద వే కావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి చెప్పిన ఈశ్వర్, అందుకు అనుగుణంగా హామీ పొందినట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. తనకు కచ్చితంగా మంత్రి పదవే వస్తుందనే భరోసాతో ఉన్న కొప్పుల, మంత్రివర్గ విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఆయనకు కచ్చితంగా స్థానం లభిస్తుందనే భరోసాతో ఆయన వర్గీయులు ఉన్నారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్కు పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అయితే మంత్రి పదవి లభిస్తుందా, అంతే స్థాయిలో ఉన్న మరో పదవి వరిస్తుందా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఆయనకు కేబినెట్ ర్యాంకుతో సమానమైన చీఫ్ విప్ పదవి వస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇవ్వగా, కొప్పులకు చీఫ్ విప్ కట్టబెట్టాలని సీఎం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. డెప్యూటీ సీఎం, స్పీకర్, డెప్యూటీ స్పీకర్ పదవులకు కొప్పుల పేరు వినపడినా ఆ పదవులు దక్కకపోవడం, ప్రస్తుతం ఏ పదవి వస్తుందో అంచనా వేయలేకపోతుండడంతో ఈశ్వర్ వర్గీయుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈశ్వర్ మాత్రం మంత్రివర్గ విస్తర ణపైనే ఆశలు పెట్టుకున్నారు. -
పెద్దాయన ఉప ముఖ్యమంత్రి
పెద్దాయనకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సౌమ్యుడు, వివాద రహితునిగా పేరున్న సీనియర్ నాయకుడు, పత్తికొండ శాసనసభ్యుడు కె.ఈ.కృష్ణమూర్తిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన కేఈ అంచెలంచెలుగా ఎదిగిన బీసీ నేతగా కీర్తి గడించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయనకు అత్యున్నత పదవి దక్కడం పట్ల జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కర్నూలు: డిప్యూటీ సీఎం పదవి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తిని వరిచింది. ఇది జిల్లాకు దక్కిన అరుదైన అవకాశంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఒకటి 2014 వరకు గమనిస్తే ఐదుసార్లు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. వీరిలో ముగ్గురు తెలంగాణవారు. మరో ఇద్దరు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వంలో కర్నూలు జిల్లాను డిప్యూటీ సీఎం పదవి వరించింది. ఆ పదవిని చేపట్టిన పత్తికొండ శాసనసభ్యులు కేఈ కృష్ణమూర్తి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించినట్లయింది. 1956 నుంచి చరిత్రను చూసుకుంటే.. మొదట్లో కోవెలకుంట్లకు చెందిన బీవీ సుబ్బారెడ్డికి ఆ పదవి దక్కింది. ఆ తరువాత హైదరాబాద్కు చెందిన కేవీ రంగారెడ్డి(ఈయన పేరుపైనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది)కి, మెదక్ జిల్లాకు చెందిన సి.జగన్నాథరావుకు, కృష్ణా జిల్లాకు చెందిన కోనేరు రంగారావుకు, మొన్నటి ప్రభుత్వంలో దామోదర రాజనర్సింహకు డిప్యూటీ సీఎం అవకాశం వచ్చింది. ఇందులో కేవీ రంగారెడ్డి, సి.జగన్నాథరావు, దామోదర రాజనర్సింహ తెలంగాణ వారు. ప్రొటోకాల్లో ముఖ్యమంత్రి తరువాతి స్థానంలో ఉండే డిప్యూటీ సీఎం పదవి పరిపాలనాపరంగా చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం తీసుకునే కీలకమైన నిర్ణయాల్లో డిప్యూటీ సీఎం పాత్ర ఉంటుంది. అభినందనల వెల్లువ కేఈ కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి రావడంతో జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీశ్రేణులు, అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగితేలారు. ఆయన ప్రమాణస్వీకారాన్ని టీవీల్లో తిలకిస్తూ ఎంతో సంతోషించారు. జిల్లా నుంచి ఆయనకు మంత్రిపదవి దక్కడం పట్ల అభినందనలు తెలియజేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. కర్నూలు, న్యూస్లైన్: రాజకీయాల్లో కేఈ కృష్ణమూర్తి అంచెలంచెలుగా ఎదిగారు. ఈయన 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. కోట్ల కుటుంబానికి దీటుగా నిలబడటంతోపాటు వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచిన దివంగత కె.ఇ.మాదన్న నుంచి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్నారు. 1978లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1985లో టీడీపీ, 1989లో కాంగ్రెస్, 2009లో టీడీపీ నుంచి గెలుపొంది ప్రస్తుతం అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా మూడుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. మర్రిచెన్నారెడ్డి హయాంలో పార్లమెంటు కార్యదర్శిగా, 1980లోఅంజయ్య ప్రభుత్వంలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా, అలాగే జిల్లాపరిషత్ చైర్మన్గా, 1985 నుంచి 1988 మధ్యలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో భారీ తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. డోన్ నుంచి ఐదు పర్యాయాలు, పత్తికొండ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1999లో కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2013 జూన్ 3 నుంచి 2014 ఫిబ్రవరి 23 వరకు ప్రజాపద్దుల సంఘానికి(పీఏసీ) చైర్మన్గా పనిచేశారు. కేఈకి డిప్యూటీ సీఎం పదవి రావడంతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం దక్కింది. వెనుకబడిన కర్నూలు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రధాన బాధ్యత కేఈ పైన ఉంది. అలాగే జిల్లా టీడీపీలోనూ అందరినీ సమన్వయపరిచి.. పార్టీ వ్యవహారాలు చక్కదిద్దడం .. ఆయనకు ముళ్ల కిరీటమే. పెనుసవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది. -
క్యాబినెట్ ‘కారు’ ఎక్కేదెవరు?
మహమూద్ అలీ, నాయినికి చాన్స్! తనకూ అవకాశం ఇవ్వాలంటున్న పద్మారావు సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఎవరికి దక్కనుంది? నగర నేతల్లో ఎంతమందికి చాన్స్ ఉంటుంది? ప్రస్తుతం అందరిలో ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలివి. ఇటు నేతలు, అటు కార్యకర్తల్లో ఈ అంశమే చర్చనీయాంశమైంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాజధాని నగరానికి ప్రాధాన్యమివ్వాల్సిందే. ఈ నేపథ్యంలో నగర నేతలకు ముఖ్య బాధ్యతలు దక్కే అవకాశమే కనిపిస్తోంది. అందుకే కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో మొదటి అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు నగర నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి సభ్యులు మహమూద్ అలీతో పాటు మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిలకు రాష్ట్ర క్యాబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తే శానసమండలి సభ్యులు మహమూద్ అలీ పేరును పరిశీలనకు తీసుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా, కేసీఆర్కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ నాయిని నర్సింహారెడ్డికి సైతం రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అవకాశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాయిని నర్సింహారెడ్డి ప్రస్తుతం శాసనసభ - శాసనమండలిలో దేనిలో సభ్యులు కాకపోవటంతో ఆయన పదవిపై ఒకింత చర్చ జరుగుతోంది. ముందు క్యాబినెట్లోకి తీసుకుని తర్వాత ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన వారిలో పద్మారావు (సికింద్రాబాద్), కనకారెడ్డి (మల్కాజిగిరి) గూడెం మహిపాల్రెడ్డి (పటాన్చెరు)లు మాత్రమే విజయం సాధించారు. అయితే వీరిలో కనకారెడ్డి, మహిపాల్రెడ్డిలు తొలిసారిగా విజయం సాధించగా.. పద్మారావు రెండవ మారు శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. ఈయనకు రెండు మార్లు కార్పొరేటర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పద్మారావుకు క్యాబినెట్ బెర్త్ ఖాయమనే భావనను పార్టీ ముఖ్య నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నివాసం కిటకిట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న కేసీఆర్ నివాసం నా యకులు, కార్యకర్తలు, జనంతో కిటకిట లాడుతోంది. రోజంతా వేలాదిగా తరలివస్తున్న సందర్శకులతో బంజారాహిల్స్లోని నందీనగర్ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది. -
‘బలగం’ ఉన్నా బలహీనమే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:డిప్యూటీ సీఎం... ఇద్దరు మంత్రులు... ప్రభుత్వ విప్... ఒక ఎంపీ... నలుగురు ఎమ్మెల్యేలు... ఇద్దరు ఎమ్మెల్సీలు...ఇక రాములమ్మ చేరికతో అదనపు బలం ... రూ.వేల కోట్ల అభివృద్ధి పనులు .. వీటన్నింటినీ మించి 25 శాతం సంప్రదాయక ఓటింగ్తో పటిష్టమైన స్థితిలో ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ... నడిపించే నాయకుడు లేక మెతుకుసీమలో సతమతమవుతోంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీ ఆత్మరక్షణ దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు పక్కా ప్రణాళికలో సిద్దిపేట నుంచి దుబ్బాక మీదుగా గజ్వేల్ వరకు చాపకిందనీరులా పాకిన టీఆర్ఎస్ తాజాగా దూకుడు పెంచింది. ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంపై కర్చీఫ్ వేసి రిజర్వు చేసుకున్న హరీష్రావు పక్క నియోజకవర్గాల మీద దృష్టి సారించారు. మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజక వర్గాలపై ఆయన మంత్రాంగం చేస్తున్నారు. ఓ మోస్తరు స్థాయి ఉన్న దిగువ శ్రేణి నాయకుడు అయినా సరే పార్టీలో చేరే అవకాశం ఉందని తెలిస్తే చాలు నేరుగా హరీష్రావే ఆయన దగ్గర వాలిపోతున్నారు. వాళ్లను ఒప్పించి, మెప్పించి గులాబి ండువా కప్పేస్తున్నారు. ఎవరివారే యమునా తీరే టీఆర్ఎస్ నేతలకున్న కలుపుగోలుతనమే కాంగ్రెస్ పార్టీ నేతల్లో పూర్తిగా లోపించింది. దీంతో నాయకులు ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 8 స్థానాల్లో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నిజానికి తెలంగాణ సీఎం రేసులో ఉన్న రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి జిల్లా నేతలను నడిపించాల్సి ఉండగా, వాళ్లు సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఈ ఇద్దరు నేతల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బాబూమోహన్, మాణిక్యరావులు గట్టిపోటీ ఇస్తున్నారు. మరోవైపు డీసీసీ పదవి నామమాత్రమే కావడంతో భూపాల్రెడ్డి కూడా జిల్లా నేతలను శాసించలేని పరిస్థితి నెలకొంది. పటాన్చెరు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన, ప్రస్తుతం అభ్యర్థులతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆర్సీపురం మండలంలో భూపాల్రెడ్డికి మంచి పట్టుంది. కీలకమైన ఈ సమయంలో తన శక్తియుక్తులన్నీ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వెచ్చించాల్సి ఉండగా, ఆయన మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందీశ్వర్గౌడ్ గెలవడం ఇష్టం లేదనే భూపాల్రెడ్డి గుంభనంగా ఉంటున్నారనే సంకేతాలు కార్యకర్తలకు వెళ్లే ప్రమాదం ఉందని, ఇది క్రాస్ ఓటింగ్కు దారి తీస్తుందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మెదక్ నియోజకవర్గంలో రాములమ్మ పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి ప్రస్తుతానికి పార్టీ విధేయునిగానే ఉన్నప్పటికీ ఆయన రాములమ్మకు ఎంత మేరకు ఓట్లు వేయిస్తాడనేది అనుమానమే. మరోవైపు సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ర్టం వచ్చిందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకోలేకపోతున్నారు. పార్టీనేతలను ఏకతాటిపైకి తెచ్చే పెద్ద దిక్కులేక విలవిలలాడుతున్న కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్గాంధీ సభల మీదే గంపెడాశలు పెట్టుకున్నారు. అందువల్లే వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు జిల్లాలో నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.