divis laboratories
-
అంచనాలను మించిన దివీస్ లాభం
ముంబై: ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ నికరలాభం రూ.510 కోట్లుగా నమోదైంది. 2023–24 ఇదే త్రైమాసిక లాభం రూ.348 కోట్లతో పోలిస్తే ఇది 46% అధికం.మొత్తం ఆదాయం రూ.1,909 కోట్ల నుంచి 22.5% పెరిగి రూ.2,338 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం (పీబీటీ) 54% వృద్ధి చెంది రూ.469 కోట్ల నుంచి రూ.722 కోట్లకు చేరింది. మార్జిన్లు 25% నుంచి 31 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో విదేశీ మారక ద్రవ్య లాభం (ఫారెక్స్ గెయిన్) రూ.29 కోట్లుగా ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం (ఏప్రిల్–సెప్టెంబర్)లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,640 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.3,854 కోట్లుగా ఉంది. నికర లాభం రూ.704 కోట్ల నుంచి 33% అధికమై రూ.940 కోట్లకు చేరింది. -
హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు. -
ఎవరీ నీలిమ మోటపర్తి? ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Divis Laboratories Nilima Motaparti: భారతదేశంలో ఉన్న అత్యంత ధనిక మహిళలో ఒకరైన 'నీలిమ మోటపర్తి' (Nilima Motapatri) గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 'దివిస్ లాబొరేటరీస్' గురించి తప్పకుండా వినే ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ బాధ్యతలు చేపడుతూ వరుస లాభాల్లో పయనిస్తున్న నీలిమా గురించి ఇక్కడ తెలుసుకుందాం. దివిస్ లాబొరేటరీస్ సంస్థను స్థాపించిన మురళీ కృష్ణ దివి కుమార్తె నీలిమ మోటపర్తి. ఈమె గ్లాస్లో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో పూర్తి చేసి, ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన మెటీరియల్ సోర్సింగ్, ప్రొక్యూర్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి అన్ని కార్యకలాపాలను చూసుకుంటోంది. 2021లో ఈమె ఆదాయం సుమారు 51 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) నిజానికి దివిస్ లాబొరేటరీస్ స్థాపించిన మురళీ కృష్ణ దివి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. మురళీ కృష్ణ కుటుంబం ఒకప్పుడు తన తండ్రికి వచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతికింది. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు చూసిన మురళీ కృష్ణ తన 25 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లి ఫార్మసిస్ట్గా పనిచేశారు. అప్పట్లో తన వద్ద కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా గతంలో వెల్లడించినట్లు సమాచారం. దివిస్ లాబొరేటరీస్ ఆవిర్భావం.. అమెరికా వెళ్లిన తరువాత నిరంతర శ్రమతో కస్టపడి అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో దివీస్ లాబొరేటరీస్ 5.8 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనిక శాస్త్రవేత్తల్లో ఒకరిగా నిలిచారు. దివీస్ లేబొరేటరీస్ 1990లో దివీస్ రీసెర్చ్ సెంటర్గా స్థాపించారు, ఆ తరువాత క్రమంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. 1994 నాటికి దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్గా స్థిరపడింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) తండ్రి స్థాపించిన సంస్థలో నీలిమ మోటపత్రి 2012లో చేరి, అప్పటి నుంచి ఈ కంపెనీ అభివృద్ధికి దోహదపడుతోంది. ఉద్యోగంలో చేరకముందే ఈమెకు మెటీరియల్ రిక్వైర్మెంట్, ఫైనాన్సింగ్ అండ్ ఆసీకాంటింగ్ వంటి వాటిలో సుమారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది. మొత్తం మీద నీలిమా తండ్రికి తగ్గ తనయురాలిగా కంపెనీ బాధ్యతలు చేపట్టి విజయ మార్గంలో పయనిస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఇంటర్ ఫెయిల్, రూ.500తో అమెరికాకి పయనం.. కట్ చేస్తే 47 వేల కోట్లకు అధిపతి!
ఏదో సాధించాలనే తపన..ఏమీ సాధించలేదేనన్న నిరాశ.. ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ.. ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉన్నత శిఖరాల ఎత్తు ఎదగాల్సిన విద్యార్థులు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని,ఫెయిల్ అయ్యామని మరొకరు ఇలా.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతుంటుంటారు. అలాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆగి, తమను తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి. తిరిగి పచ్చగా కళకళలాడతాయని అంటున్నారు మురళి దివి. నాడు ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. చేతిలో రూ. 500తో అమెరికాకు వెళ్లారు. కట్ చేస్తే నేడు వేల కోట్ల అధిపతిగా ఎదిగారు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు దివిస్ లేబరేటరీస్ అధినేత దివి మురళి కృష్ణ ప్రసాద్. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? మురళి దివి ఎవరు? ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తనకు వచ్చే 10 వేల రూపాయల పెన్షన్తో 13 మంది పిల్లల్ని పోషించేవారు. అయినప్పటికీ తన కష్టాన్ని పిల్లలకు తెలియనీయకుండా పెంచారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని శ్రమించారు. కానీ మురళి దివికి ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఆ భయమే ఆయనను ఇంటర్మీడియట్లో రెండు సార్లు ఫెయిల్ అయ్యేలా చేసింది. వృద్దిలోకి వస్తారనుకున్న కొడుకు ఇలా ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పుడే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందనే సూక్తిని గట్టిగా నమ్మారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కుంగిపోలేదు. ప్రయత్నించారు. చివరికి విజయమే మురళి దివికి బానిసైంది. అందరూ సంపన్నులే.. కానీ తాను మాత్రం ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అప్పటికే మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న తన సోదరుడి వద్దకు పంపారు. అదే ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులో చేరారు. అంతర్జాతీయ యూనివర్శిటీ కావడంతో దేశ, విదేశీ విద్యార్ధులు అందులోనూ సంపన్నులు. కానీ తన కుటుంబ నేపథ్యం అందుకు విభిన్నం. ఉన్నత చదువుల కోసం నాన్న, తోబుట్టువులు చేసిన మేలు మరిచిపోలేదని ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎలాగైనా వారి కష్టానికి ప్రతిఫలంగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. రేయింబవళ్లు శ్రమించారు. అలా బ్యాచిలర్ డిగ్రీలో యూనివర్సిటీలోనే గోల్డ్ మెడలిస్ట్ సంపాదించారు. అదే యూనివర్సిటీలో బెస్ట్ స్డూడెంట్గా గోల్డెన్ అవార్డ్స్తో మాస్టర్స్ను పూర్తి చేశారు. జీతం రూ.250లే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. వార్నర్స్ హిందుస్థాన్ కంపెనీలో రూ. 250 జీతంతో కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో, అమెరికాలో ఫార్మసిస్ట్లకు మంచి డిమాండ్ ఉంది. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లు అమెరికా వీసా పొందడం సులభం. అలా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ కావడంతో వీసా దొరికింది. వెంటనే గ్రీన్ కార్డ్ సంపాదించారు. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! చలో అమెరికా కానీ వీసా ఆమోదం తర్వాత మురళికి అమెరికా వెళ్లడానికి 9 నెలలు పట్టింది. 1976-77 సమయంలో తన భార్య, కుమారుడితో కలిసి చేతిలో రూ.500లతో అమెరికాకు పయనమయ్యారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో సైంటిస్ట్గా పనిచేశారు. తర్వాత కాస్మోటిక్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్ సూపరింటెండెంట్ అయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతు ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా, డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. జీతం నెలకు రూ.నాలుగున్నర లక్షలకు పెరిగింది. జీవిత భాగస్వామి అంగీకారంతో అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మురళికి ఓ ఆలోచన వచ్చింది. నేను నా కుటుంబ సభ్యులకు, నన్ను కన్న నా దేశానికి దూరంగా ఉంటూ ఇక్కడే ఎందుకు పనిచేయాలి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. వెంటనే భారత్కు వచ్చేయాలని అనుకున్నారు. చివరికి జీవిత భాగస్వామి అంగీకారంతో మురళి భారత్కు వచ్చారు. చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే? డాక్టర్ అంజిరెడ్డితో పాటు తిరిగి వచ్చిన తర్వాత, ఏం చేయాలో తెలియదు. వ్యాపారం ప్రారంభించాలంటే అంత డబ్బు కూడా లేదు. అమెరికాలో సైంటిస్ట్గా సంపాదించిన అనుభవాన్నే ఆస్తిగా మరల్చుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకులు డాక్టర్ అంజి రెడ్డిని సంప్రదించారు. తాను భారత్లో ఓ కంపెనీని పెట్టాలని అనుకుంటున్నట్లు తన ఐడియాను వివరించారు. ఆ ఆలోచనకు అంజిరెడ్డి సైతం అకర్షితులయ్యారు. అతని సహకారంతో 'కెమినార్' అనే కంపెనీని కొనుగోలు చేశారు. దేశంలోని ప్రముఖ ఫార్మా తయారీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు భారీగా పెట్టారు. కానీ ప్రయాణం అంత సులభం కాదు. అయితే, ధైర్యం, 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' (బలవంతులదే మనుగడ) నినాదంతో ముందుకు సాగారు. చేసి చూపించారు. ఆ సమయంలో ప్రముఖ వ్యాపార వేత్తలలో ఒకరిగా నిలిచారు. దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ దేశంలోని డిమాండ్లను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్లను ప్రారంభించారు. ఆ అనుభవంతో, సొంతంగా కంపెనీ పెట్టాలనే కోరికతో 1990లో హైదరాబాద్లో ‘దివీస్ లేబొరేటరీస్’ ప్రారంభించారు. ఏఐపీఐలు, ఇంటర్మీడియట్ల తయారీకి, వ్యాపారానికి అనుగుణంగా అభివృద్ది చేయడం ప్రారంభించారు. అలా 1995లో మురళి దివి తెలంగాణలోని చౌటుప్పల్లోని తన తొలి తయారీ కేంద్రాన్ని, 2002లో విశాఖ సమీపంలో రెండో యూనిట్ ప్రారంభించారు. బిలియనీర్గా ఎదిగారు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, 2013లో మురళి బిలియనీర్ అయ్యారు. 2018-19లో అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్గా నిలిచారు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ భారీగా పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, మురళీ దివి నికర సంపద 5.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని 448వ ధనవంతులుగా నిలిచారు. చదవండి👉 యాపిల్ కంపెనీలో వందల కోట్ల మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
దివీస్ ల్యాబొరేటరీస్కు షాక్.. ఈ సారి తగ్గింది!
ఔషధ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 18.6 శాతం తగ్గి రూ.493 కోట్లు దక్కించుకుంది. ఈపీఎస్ 18.56 శాతం తగ్గి రూ.18.6 నమోదైంది. టర్నోవర్ 3.6 శాతం పెరిగి రూ.1,934 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్–సెప్టెంబర్లో టర్నోవర్ 7 శాతం పెరిగి రూ.4,277 కోట్లు, నికరలాభం 2.75 శాతం అధికమై రూ.1,195 కోట్లు దక్కించుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దివీస్ షేరు ధర బీఎస్ఈలో సోమవారం 8.85 శాతం తగ్గి రూ.3,413.70 వద్ద స్థిరపడింది. చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు! -
7 దిగ్గజ కంపెనీలకు అప్పులు అసలే లేవు, ఆదాయం మాత్రం లక్షల కోట్లలోనే!
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ దేశ ఆర్ధిక వృద్ది కోసం ఆర్బీఐ స్వల్ప కాలానికి తక్కువ వడ్డీ రేట్లను అమలు చేసింది. క్రమేపీ ఆ వడ్డీ రేట్లను పెంచింది. ఈ తరుణంలో ఆర్బీఐ అమలు చేసిన తక్కువ ఇంట్రస్ట్ రేట్లతో పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపార కార్యకలాపాల కోసం భారీ ఎత్తున రుణాలు తీసుకున్నాయి. అయితే రుణాలు తీసుకొని, అనుకున్న ఫలితాలు రాబట్టలేక, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా కొన్ని సంస్థలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీ-50లో నమోదైన మొత్తం 7దిగ్గజ కంపెనీలు సున్నా రుణం లేని సంస్థలుగా అవతరించాయి. ఈ ఏడు నిఫ్టీ 50 కంపెనీలు కలిపి రూ.31 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్ను కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఆ సంస్థల ఆర్ధిక స్థితి గతుల్ని పరిశీలిస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సున్నా రుణంతో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. 12లక్షల మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. ఆర్ధిక సంవత్సరం 2022లో 26బిలియన్లకు పైగా ఆదాయం గడించింది. 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర లాభంతో కొనసాగుతుంది. ఇన్ఫోసిస్ మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో టీసీఎస్తో పోటీ పడుతుంది. ఆర్ధిక సంవత్సరం 2022లో దాని ఆదాయం 16 బిలియన్లకు పైగా ఉండగా నికర లాభం దాదాపు 3 బిలియన్లుగా ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ రూ.5లక్షల కోట్లకు పైగా ఉంది. 14 విభాగాల్లో దాదాపూ 44 బ్రాండ్లతో మార్కెట్ను శాసిస్తున్న హెచ్యూఎల్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాని ఆదాయం దాదాపు 2.4 నుంచి 6.5 బిలియన్ డాలర్ల వృద్దిని సాధించింది. ఐటీసీ టుబాకో-టు-పేపర్ దిగ్గజం ఐటీసీ 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను కలిగి ఉంది. కాగితం, పొగాకు, హోటళ్లు, సాఫ్ట్వేర్తో పాటు ఇతర రంగాల్లో రాణిస్తుంది. కంపెనీ ఆర్ధిక సంవత్సరం 2022లో ఆదాయం 8.4 బిలియన్గా ఉంది. నికర లాభం దాదాపు 2 బిలియన్లకు చేరింది. మారుతీ సుజుకి ఇండియా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సున్నా రుణం లేని సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. టాటా మోటార్స్తో పోటీ పడుతూ 2.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో.. మారుతి సుజుకి ఆర్ధిక సంవత్సరం 11 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.దాని లాభం 497 మిలియన్లకు చేరుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ 1.08 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను కలిగి ఉంది. ఆర్ధిక సంవత్సరం ఆదాయం 10.6 బిలియన్లు కాగా, నికర ఆదాయం 193 మిలియన్లుగా ఉంది. దివీస్ లాబొరేటరీస్ రూ.96వేల కోట్ల మార్కెట్ క్యాప్తో ఫార్మా రంగం నుండి రుణ రహిత సంస్థగా దివిస్ లాబొరేటరీస్ అవతరించింది. జెనరిక్స్, న్యూట్రాస్యూటికల్ తయారీ కంపెనీ దివీస్ ఆదాయం1.2 బిలియన్లు కాగా నికర లాభం 378 మిలియన్లుగా ఉంది. చదవండి👉బీచ్లో ఎంజాయ్ చేసేందుకే..రూ.5లక్షల కోట్ల కంపెనీకి సీఈవో రాజీనామా! కానీ.. -
ఇంటర్ 2 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ.72వేల కోట్లకు అధిపతి
జీవితం అంటేనే సంతోషం, బాధ, గెలుపు, ఓటమి వీటన్నింటి కలయిక. ఈ రోజు మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య.. కొన్ని రోజుల తర్వాత చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే ఓడిపోయినప్పుడు.. కుంగిపోకూడదు. ధైర్యంగా ముందడుగు వేయాలి.. విజయం తప్పక వరిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచారు మురళి దివి. ఇంటర్ రెండు సార్లు ఫెయిలైన మురళి దివి.. నేడు 72వేలకు కోట్లకు అధిపతిగా నిలిచారు. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మురళి దివికి 12 మంది తోబుట్టువులున్నారు. మురళి తండ్రికి వచ్చే 10 వేల రూపాయల పెన్షనే వారికి జీవినాధారం. సరిపడా ఆదాయం లేనప్పటికి పిల్లల్ని చదువుకు దూరం చేయలేదు మురళి దివి తండ్రి. ఇంటర్కు వచ్చే వరకు కూడా కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మురళి పెద్దగా పట్టించుకోలేదు. (చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..!) మలుపు తిప్పిన సంఘటన ఇలా ఉండగా.. మురళి ఇంటర్ రెండు సార్లు ఫెయిలయ్యాడు. ఈ సంఘటన మురళి జీవితం మీద చాలా ప్రభావం చూపింది. తనను చదివించడం ఆర్థికంగా భారమైనప్పటికి తండ్రి అవేం పట్టించుకోలేదు. కానీ తాను మాత్రం రెండు సార్లు ఫెయిలయ్యాననే బాధ మురళిని పీడించసాగింది. ఆ తర్వాత నుంచి మురళి మరింత కష్టపడి చదివాడు.. అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. ఇంటర్లో ఫెయిలవ్వడం గురించి మురళి అంతర్జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘చదువు విషయంలో నేను చాలా నిజాయతీగా ఉండేవాడిని. చాలా కష్టపడేవాడిని. కానీ నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రెండు సార్లు ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు మా కుంటుంబ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి అర్థం అయ్యింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. బాగా చదివి.. మంచి ఉద్యోగం సాధించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని భావించాను. కష్టపడి చదివి.. అమెరికాలో ఉద్యోగం సాధించాను’’ అని తెలిపాడు. (చదవండి: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్) అమెరికా ప్రయాణం.. మురళి దివి తన అన్నల మాదిరిగానే కెమిస్ట్గా మారే మార్గంలో ఉన్నాడు. కానీ విధి రాత మరోలా ఉంది. ఈ క్రమంలో మురళి గ్రీన్ కార్డ్ పొంది 1976 లో అమెరికా వెళ్లాడు. ఫార్మసిస్ట్గా జీవితం ప్రారంభించాడు. అమెరికాలోని వివిధ కంపెనీలలో పని చేశాడు. చివరకు ఏడాదికి 65 వేల డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. కానీ ఇంటి మీద బెంగ, మాతృభూమి నుంచి వచ్చిన పిలుపు మురళీ దివిని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి.. అనే దాని గురించి ఏం ఆలోచించుకోలేదు మురళి. అప్పుడే అనగా 1984లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రారంభం అయ్యింది. దానిలో చేరాడు మురళి. ఆరేళ్ల తర్వాత రెడ్డీస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా దివిస్ లాబొరేటరీస్ని ప్రారంభించాడు. (చదవండి: ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే.. ఎందుకంటే!) బిలియనీర్గా ఎదిగాడు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, అనగా 2013లో మురళి బిలియనీర్ అయ్యాడు. 2018-19లో, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్గా నిలిచాడు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ గత 3 సంవత్సరాలలో 400% కంటే ఎక్కువ పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ-నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ప్రకారం, మురళీ దివి, అతడి కుటుంబం రూ .72,000 కోట్ల (9.9 బిలియన్ డాలర్లు) నికర సంపదతో ప్రపంచంలోని 384 వ ధనవంతులుగా నిలిచారు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు -
చంద్రబాబుతో ఉన్నప్పుడు సిద్ధాంతాలు ఏమయ్యాయి?
తుని రూరల్: ‘టీడీపీ అధినేత చంద్రబాబుతో మీరు ఐదేళ్లు పార్టనర్గా ఉన్నప్పుడే దివీస్ పరిశ్రమకు 560 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు మీరు చెబుతున్న సిద్ధాంతాలన్నీ అప్పుడేమయ్యాయి?’ అని పవన్ను తూర్పు గోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ఎస్.అన్నవరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. తొండంగి మండలంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దివీస్కు భూములు కట్టబెట్టిందే కాకుండా అన్ని అనుమతులనూ నాటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దివీస్కు వ్యతిరేకంగా గతంలో జరిగిన పోరాటానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. డబుల్ స్టాండ్ తీసుకునేది పవనేనని విమర్శించారు. సీఎం జగన్ ప్రజల పక్షాన పని చేస్తున్నారన్నారు. ప్రజలకు, రైతులకు, యువతకు నష్టం కలిగే పనులు చేయరని చెప్పారు. జీరో పొల్యూషన్తో ప్రకృతికి నష్టం వాటిల్లకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ విధానమన్నారు. -
‘దివీస్' యాజమాన్యంతో మంత్రి గౌతమ్రెడ్డి భేటీ
సాక్షి, అమరావతి: ప్రజల అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకూ 'దివీస్' ఒక్క ఇటుక కూడా కదపకూడదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనకు గల కారణాలపై 'దివీస్' యాజమాన్యంతో ఆయన చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. దివీస్ ఫార్మా పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. దివీస్ పరిశ్రమ స్థాపిస్తే వచ్చే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆ యాజమాన్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. (చదవండి: ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్) కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజాక్షేమం కోసం ప్రతిపాదనలు చెబుతూ ప్రభుత్వం దివీస్తో శనివారం చర్చలు జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ కు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నమీ, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎండీ వివేక్ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా పీసీబీ, పరిశ్రమల జనరల్, జోనల్ మేనేజర్లు హాజరయ్యారు. (చదవండి: సీఎం జగన్ లక్ష్యాన్ని సాధించారు’) దివీస్ యాజమాన్యం ముందుంచిన ప్రభుత్వ ప్రతిపాదనలు: ♦దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి ♦కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. మత్స్యకారులకు అవగాహన కలిగించి, వారి స్పష్టమైన అంగీకారం వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి. ♦దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగని పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలి. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి మంత్రి ఆదేశాలు ♦దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి ♦సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజహితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి ♦దివీస్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలందించడంలో ప్రభుత్వం తరపున 'నైపుణ్య' సహకారం, అవసరమైతే దివీస్ కు ప్రత్యేకంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ ప్రతిపాదనలకు దివీస్ యాజమాన్యం సానుకూలం.. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలకు సానుకూలమని దివీస్ పరిశ్రమ డైరెక్టర్ కిరణ్ దివి మంత్రికి వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయమందించేందుకు సిద్ధమన్నారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలిస్తామన్నారు. నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపైన పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని కిరణ్ దివి వెల్లడించారు. -
దివీస్ ల్యాబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
సాక్షి, తొండంగి: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం సంపాదిపేట దివీస్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం ఆకస్మికంగా వెయ్యిమంది ఉద్యమకారులు దివీస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్మాణం వైపు దూసుకువెళ్లారు. ఉద్యమకారులు ఫ్యాక్టరీ అక్కడ ఉన్నజనరేటర్ను తగులబెట్టి గోడలను కూల్చేశారు. ఒక్కసారిగా వందల మంది ఉద్యమకారులు లోపలకు చొచ్చుకు రావడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమం పెల్లుబికింది. వందల మంది ఉద్యమకారులను పోలీసులు నిర్బంధించారు. దీంతో సుమారుగా ఎనిమిది వందలు మంది దివీస్ గేటు వద్ద , బైఠాయించి, లోపల నిర్బంధించిన తమ వాళ్లను వదలకపోతే కదిలేది లేదంటూ బైఠాయించారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా దివీస్ ల్యాబరేటరీస్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక రైతులు, వామపక్షలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి. పరిశ్రమ మెయిన్ గేట్ ఎదురుగా నిరసన శిబిరం ఏర్పాటు చేసి తమ నిరసన తెలుపుతున్నారు. కాలుష్యకారక పరిశ్రమ నిర్మాణం చేపట్టవద్దంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది. -
జూబిలెంట్ నుంచి బిర్యానీ- దివీస్ కొత్త రికార్డ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు రికార్డుల బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సక్స్ 117 పాయింట్లు పెరిగి 46,784కు చేరింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు బలపడి 13,717 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. (బర్గర్కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం) జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఏకదమ్! పేరుతో బిర్యానీల బిజినెస్ను ప్రారంభించింది. తద్వారా విభిన్న రుచుల బిర్యానీలను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలియజేసింది. 20 రకాల బిర్యానీల నుంచి కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చని వివరించింది. ఇవి అందుబాటు ధరల్లో అంటే రూ. 99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. గుర్గావ్లోని రెస్టారెంట్లో వీటిని ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకన్ డోనట్స్ బ్రాండ్లతో రెస్టారెంట్లను నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్చేసి రూ. 2,885ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,873 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 12 శాతం లాభపడటం గమనార్హం! (పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్) దివీస్ ల్యాబొరేటరీస్ పటిష్ట పనితీరును చూపడం ద్వారా ఈ కేలండర్ ఏడాది(2020)లో ర్యాలీ బాటలో సాగుతున్న హైదరాబాద్ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్ మరోసారి జోరు చూపుతోంది. తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్చేసి రూ. 3,854ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 3,825 వద్ద ట్రేడవుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ తాజాగా రూ. లక్ష కోట్ల మార్క్ను తాకింది. వెరసి మార్కెట్ క్యాప్ ర్యాంకులో 30వ పొజిషన్కు చేరుకోవడంతోపాటు.. సన్ ఫార్మా తదుపరి నిలుస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2020లో ఇప్పటివరకూ దివీస్ ల్యాబ్స్ షేరు 109 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమామిడి గ్రామపరిసరాల్లో యూనిట్-3 నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఈ నెల మొదట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది. 12-18 నెలల్లోగా ఈ ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకాగలవని అంచనా వేస్తోంది. -
వహ్వా.. దివీస్ ల్యాబ్- అబాట్ ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. వారాంతాన ఈ రెండు కంపెనీలూ ఫలితాలు విడుదల చేయడంతో నేటి ట్రేడింగ్లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. దివీస్ ల్యాబ్ 15 శాతం అప్పర్ సర్క్యూట్ను సైతం తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ ఎన్ఎస్ఈలో తొలుత దివీస్ ల్యాబ్ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 3,293ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 14 శాతం జంప్చేసి రూ. 3,170 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. అబాట్ ఇండియా ఎన్ఎస్ఈలో తొలుత అబాట్ ఇండియా షేరు 7 శాతం దూసుకెళ్లింది. రూ. 17,350 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.4 శాతం జంప్చేసి రూ. 16,901 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. -
దివీస్ ల్యాబ్- అబాట్ ఇండియా- క్యూ1 భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. ఈ రెండు కంపెనీల ఫలితాలు తాజాగా వెల్లడికావడంతో సోమవారం ట్రేడింగ్లో అటు దివీస్ ల్యాబ్, ఇటు అబాట్ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇతర వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్ షేరు 2.3 శాతం బలపడి రూ. 2800 వద్ద ముగిసింది. అబాట్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో అబాట్ ఇండియా షేరు స్వల్పంగా 0.6 శాతం లాభపడి రూ. 16,254 వద్ద ముగిసింది. -
దివీస్లో ఇన్సైడర్ ట్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారన్న అభియోగంపై దివీస్ ల్యాబొరేటరీస్ సీఎఫ్వోతోపాటు ఇతరులకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ.96 లక్షలకుపైగా జరిమానా విధించింది. సీఎఫ్వో ఎల్.కిశోర్బాబు, ఆయన కుమారుడు, సన్నిహితులు 2017లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని సెబీ వెల్లడించింది. సీఎఫ్వోతోపాటు ప్రవీణ్ లింగమనేని, నగేశ్ లింగమనేని, శ్రీలక్ష్మి లింగమనేని, డి.శ్రీనివాస రావు, రాధిక ద్రోణవల్లి, గోపీచంద్ లింగమనేని, పుష్పలత దేవి ఇన్సైడర్లుగా సెబీ గుర్తించింది. వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని సెబి తన ఆదేశాల్లో తెలిపింది. విశాఖ యూనిట్–2పై ఉన్న ఇంపోర్ట్ అలర్ట్ను యూఎస్ఎఫ్డీఏ ఎత్తివేయనుందంటూ దివీస్ 2017 జూలై 10న మార్కెట్ సమయంలో ప్రకటించింది. స్టాక్స్పై ప్రభావం చూపే ఈ విషయాన్ని కిశోర్ బాబు ముందే లీక్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని సెబీ చెబుతోంది. జూలై 7–10 మధ్య జరిగిన ట్రేడింగ్పై సెబీ విచారణ జరిపింది. జూలై 7న దివీస్ షేరు ధర రూ.680 నమోదైంది. జూలై 10న ఇది రూ.734కి చేరింది. ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం షేర్ల కొనుగోళ్లకు కావాల్సిన ప్రి–క్లియరెన్స్ కోసం సీఎఫ్వో, ఆయన కుమారుడు ప్రవీణ్ లింగమనేని దరఖాస్తు చేయలేదని విచారణలో తేలింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను వీరు అతిక్రమించారని సెబీ విచారణలో తేలింది. ఈ ఎనిమిది మంది 30 రోజుల్లో స్పందించాలని సెబి ఆదేశించింది. ఈ మొత్తం మేరకు వీరి ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులను ఆదేశించింది. విచారణ పూర్తి అయ్యే వరకు వీరు ఆస్తులను విక్రయించరాదని స్పష్టం చేసింది. -
దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్జీటిని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. (ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా..) అలాగే ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు ఎన్జీటీ చౌటుప్పల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి జిల్లా కలెక్టర్ను చేర్చింది. చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరిస్తూ కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగష్టు 21కి వాయిదా వేసింది. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) -
దివీస్ షేర్కు మరోసారి నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మ దిగ్గజం దివీస్ లాబ్స్కు మరోసారి చిక్కులు తప్పలేదు. యూఎస్ఎఫ్డీఏ తాజా అబ్జరేషన్స్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో దివీస్ లేబ్స్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఈ నెలలో తనిఖీలు నిర్వహించిన తనిఖీల్లో ఆరు లోపాలను(అబ్జర్వేషన్స్) నమోదు చేసినట్లు వెల్లడికావడంతో దివీస్ షేర్ 9 శాతానికిపైగా నష్టపోయింది. మార్చి 21 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రా డే పతనాన్నినమోదు చేసింది. మంగళవారం నాటి ముగింపుతో గత 12నెలల్లో 28 శాతం పడిపోయింది. వైజాగ్లోని యూనిట్-2లో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన తుది ఏపీఐల ఇండివిడ్యుయల్ పరీక్షలలో దివీస్ విఫలమైనట్లు తెలుస్తోంది. తయారీ, పరికరాల పరిశుభ్రత వంటి అంశాలలోనూ లోపాలు గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా నివేదికలపై దివీస్ ఇంకా స్పందించలేదు. కాగా అమెరికా రెగ్యులేటరీ నుంచి ఆరు అబ్జర్వేషన్స్ తమకు అందాయని దివీస్ గతవారం తెలిపింది. ఇది సాధారణమేనని పేర్కొంది. -
దివీస్ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా కంపెనీ దివిస్ ల్యాబొరేటరీస్కు చెందిన యూనిట్–2లో యూఎస్ఎఫ్డీఏ సెప్టెంబరు 11–19 మధ్య తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆరు లోపాలను ఎఫ్డీఏ లేవనెత్తిందని కంపెనీ వెల్లడించింది. ఇవన్నీ కూడా విధానపరమైనవేనని, నిర్దేశిత సమయంలోగా లోపాలను సరిదిద్దుకుంటామని తెలిపింది. ఎఫ్డీఏ జారీ చేసిన ఫామ్–483 ప్రకారం ఏ కంపెనీ అయినా 15 రోజుల్లోగా లోపాలను సరిదిద్దుకోవాలి. ఎఫ్డీఏ తిరిగి విశ్లేషించి తగు నిర్ణయం తీసుకుంటుంది. విశాఖలోని ఈ యూనిట్ నుంచి ఔషధాల దిగుమతిని నిషేధిస్తూ 2017 మార్చిలో యూఎస్ఎఫ్డీఏ ఇంపోర్ట్ అలర్ట్ విధించింది. అలాగే మే నెలలో వార్నింగ్ లెటర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, బీఎస్ఈలో బుధవారం దివిస్ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 9.13 శాతం వృద్ధితో రూ.942.75 వద్ధ స్థిరపడింది. -
వారంలో పెళ్లి.. అంతలోనే అఘాయిత్యం
తగరపువలస: విశాఖ జిల్లా భీమిలి మండలం దివీస్ ల్యాబరేటరీ ఉద్యోగి సీహెచ్ వేణు(27) బుధవారం సాయంత్రం చెరకుపల్లి అవంతి కళాశాల సమీపంలో తుప్పుల్లో విగతజీవిగా కనిపించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇక్కడకు చేరుకున్న భీమిలి పోలీసులకు మృతదేహం పక్కన శీతల పానీయం, పురుగుమందు బాటిళ్లు కనిపించాయి. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో మంగళవారమే మృతుడు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా ఐపూర్ మండలం కొచ్చెర్లగా అతని జేబులో దొరికిన ఈఎస్ఐ గుర్తింపు కార్డు ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 14న వివాహం జరగాల్సి ఉండగా బలవన్మరణానికి పాల్పడటాన్ని బట్టి చూస్తే ప్రేమవ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దివిస్ ల్యాబ్స్కు అమెరికా వార్నింగ్
► లోపాలను సవరించకుంటే తీవ్ర పరిణామాలు: యూఎస్ఎఫ్డీఏ ► కొత్త ఉత్పత్తుల నమోదు నిలిపివేస్తాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ను యూఎస్ఎఫ్డీఏ హెచ్చరించింది. విశాఖపట్నం యూనిట్–2 ల్యాబ్లో ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తమై ఉన్న సమాచారం మార్పు, తొలగింపును అడ్డుకునే కనీస నియంత్రణలు లేవన్న విషయం తమ తనిఖీల్లో తేలినట్లు కంపెనీకి పంపిన వార్నింగ్ లెటర్లో ఎఫ్డీఏ స్పష్టం చేసింది. భద్రమైన, ప్రభావవంతమైన, నాణ్యతకు మద్ధతు తెలిపే ఖచ్చితమైన, సమగ్రమైన సమాచార వ్యవస్థ కంపెనీ వద్ద లేదని వెల్లడించింది. కంపెనీ అనుసరించిన తీరు అత్యుత్తమ తయారీ విధానానికి అనుగుణంగా లేదని, ప్లాంటులో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లలో కల్తీకి ఆస్కారం ఉందని ఆక్షేపించింది. పరీక్షా విధానం నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా సాంకేతికంగా పటిష్టంగా ఉందనడానికి ఆస్కారం లేదని తెలిపింది. తనిఖీల సమయంలో ఎఫ్డీఏ అధికారులకు కంపెనీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని, ఇది నిబంధనలను అతిక్రమించడమేనని తన లేఖలో వివరించింది. అడ్డుకట్ట వేస్తాం... సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈ మేరకు కంపెనీని యూఎస్ఎఫ్డీఏ ఆదేశించింది. ఔషధాల నాణ్యతపై లోపాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలపాలని సూచించింది. సమాచార సమగ్రత లోపించిన ఔషధాలతో రోగులపై ఎటువంటి ముప్పు ఉంటుందో కూడా తెలపాలని ఆదేశించింది. లోపాల సవరణకు కంపెనీ యాజమాన్యం చేపట్టబోయే వ్యూహం ఏమిటో వెల్లడించాలని తెలిపింది. లోపాల సవరణ పూర్తి అయి, నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని నిర్ధారించేంత వరకు కొత్త దరఖాస్తులు, సప్లిమెంట్ నమోదును ఎఫ్డీఏ నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. లోపాలను సవరించుకోనట్టయితే యూనిట్–2లో తయారైన ఉత్పత్తుల నమోదును అడ్డుకుంటామని హెచ్చరించింది. యూనిట్–2లో 2016 నవంబరు 29–డిసెంబరు 6 మధ్య యూఎస్ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. -
దివీస్కు మరోసారి అమెరికా షాక్
⇒ వైజాగ్ యూనిట్పై యూఎస్ఎఫ్డీఏ ఇంపోర్ట్ అలర్ట్ ⇒ ఒకేరోజు 20 శాతం పడిన షేరు ధర హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్కు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) షాకిచ్చింది. విశాఖపట్నంలోని తయారీ యూనిట్పై ఇంపోర్ట్ అలర్ట్ విధించింది. దీని ప్రకారం ఈ ప్లాంటులో తయారైన ఉత్పత్తులను యూఎస్ విపణికి ఎగుమతి చేయడానికి వీల్లేదు. కొన్ని ఔషధాలకు యూఎస్ఎఫ్డీఏ మినహాయింపు ఇచ్చినట్టు కంపెనీ బీఎస్ఈకి వెల్లడించింది. వీటిలో లెవెటిరాసెటమ్, గాబాపెంటిన్, లామోట్రిజిన్, కాపెసిటబిన్, నాప్రోక్సెన్, రాల్టెగ్రావిర్, అటోవాక్వోన్ తదితర 10 రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. నిషేధం ఉన్న ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఫార్మా రంగ నిపుణుడొకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూనిట్పైనే ఇంపోర్ట్ అలర్ట్ విధించడం కంపెనీకి ఊహించని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. వైజాగ్ యూనిట్ కీలకం.. కంపెనీకి హైదరాబాద్తోపాటు విశాఖపట్నంలో యూనిట్ ఉంది. దివీస్ విక్రయాల్లో ఈ యూనిట్ 60–65 శాతం సమకూరుస్తోందని తెలుస్తోంది. అలాగే యూఎస్ అమ్మకాల్లో 20 శాతం అందిస్తోంది. 2016 నవంబర్ 29–డిసెంబర్ 6 మధ్య వైజాగ్ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఎఫ్డీఏ పలు లోపాలను ఎత్తిచూపింది. ఎఫ్డీఏ లేవనెత్తిన లోపాలను సరిదిద్దేందుకు స్వతంత్ర నిపుణులతో కలసి పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, ఇంపోర్ట్ అలర్ట్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో దివీస్ షేరు ధర మంగళవారం 20 శాతం పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఒక్కో షేరు రూ.156 నష్టపోయి రూ.634.35 వద్ద ముగిసింది. -
నిర్బంధాలతో ఉద్యమం ఆగదు
దివీస్పై అఖిలపక్ష నాయకులు కాకినాడ సిటీ : తొండంగి మండలంలో నిర్మించతలపెట్టిన దివీస్ కంపెనీ విషయంలో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఉద్యమం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక సుందరయ్యభవన్లో అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆరు నెలలుగా తొండంగి మండలంలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ దౌర్జన్యంగా దివీస్ నిర్మాణం ఎందుకు సాగించాల్సి వస్తోందని, ప్రజలు ప్రశ్నించే చోటల్లా 144 సెక్షన్ విధించడం ఏమీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజలను వారి భూముల్లోకి వెళ్లనీయకుండా దౌర్జన్యంగా అడ్డగించడం దారుణమన్నారు. దివీస్ యాజమాన్యం దౌర్జన్యంగా ఆక్రమించి గోడ నిర్మిస్తోందని రైతులు రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోకుండా ఆక్రమణదారులవైపే ఎందుకు ఉండాల్సి వస్తుందో బహిరంగ పర్చాలన్నారు. డ్రోన్ కెమెరాలను ఉద్యమాలను అణచడానికి ఉపయోగించడం హాస్యాస్పదమన్నారు. ఆరు నెలలుగా పోలీస్ పికెట్ నడుపుతున్నా పాలకులు ఒక్కసారి కూడా ప్రాంత ప్రజల గోడు వినకపోవడంతో వారు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ నాగేశ్వరరావు, కేవీపీఎస్ నగర అధ్యక్షుడు మోతా కృష్ణమూర్తి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జి, ఐఎన్టీయూసీ నాయకులు రోకళ్ళ సత్తిరాజు, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు. 25కెకెడి151: అఖిలపక్ష నాయకుల సమావేశం -
దివీస్పై ఆగని పోరు
-
దివీస్పై ఆగని పోరు
బీచ్ రోడ్డుపై సీపీఎం, బాధిత గ్రామాల ప్రజల భారీ ర్యాలీ అణచివేతకు పోలీసుల వ్యూహం... ఆందోళనకారుల ప్రతిఘటన ప్రహరీ వద్ద బైఠాయించి నిరసన 85 మంది అరెస్టు పోలీసుల దమనకాండపై ఎమ్మెల్యే రాజా ఆగ్రహం ఓ రోజు ముందు నుంచే దివీస్ బాధిత గ్రామాల్లో పోలీసులు మోహరించారు. నిఘా కెమెరాలతో హడావుడి ... బూట్ల శబ్దాలు ... లాఠీల ఝళిపింపులు ... పోలీసు వ్యాన్ల హారన్లు ...ముందుకు వస్తే ఖబడ్దారంటూ హెచ్చరికలతో హోరెత్తించారు. బయటకు వస్తే చాలు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించి ఆందోళనపై ఉక్కుపాదం మోపి భయోత్పాతం సృష్టించారు. అయినా బాధితుల ఆగ్రహం ఆగలేదు ...కట్టలు తెంచుకొని రోడ్డెక్కింది. సేకరించిన భూముల దరిదాపుల్లోకి రానీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఛేదించుకొని దూసుకువచ్చి బైఠాయించారు. ఇంకానా ఇకపై చెల్లదంటూ పిడికిలి బిగించారు. తొండంగి : కోన ప్రాంతంలో రైతులు సాగులో ఉన్న భూములతోపాటు హైకోర్టు స్టేటస్కో భూముల్లోకి వెళ్లేందుకు మార్గం లేకుండా దివీస్ యాజమాన్యం ప్రహరీ నిర్మాణాలు చేపట్టడంతో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం బాధిత గ్రామాల ప్రజలు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ఉప్పెనలా ఎగిసిపడ్డారు. ఇప్పటివరకూ జరిగింది చాలు ఇకపై మీ ఆటలు సాగనివ్వమంటూ ఆగ్రహించారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల ప్రజలు కొంతకాలం నుంచి ఉద్యమిస్తున్నారు. దివీస్ను ల్యాబొరేటరీస్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములను ఖాళీ చేసేది లేదంటూ కొంత మంది రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్కో పొందారు. మరికొంత మంది ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం తీసుకోకుండా గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ప్రకారం భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో దివీస్ యాజమాన్యం బలవంతంగా ప్రహరీ నిర్మాణాన్ని ప్రారంభించింది. స్టేటస్కో, సాగు భూముల్లో ఏవిధంగా నిర్మాణాలు ప్రారంభిస్తారని బాధితులు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్వంలో రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు వారం రోజులపాటు కొత్తపాకల గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష ప్రారంభించిన రెండు రోజుల తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి భూములను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే విచారణ పూర్తయిందని, అక్రమ నిర్మాణాలు లేవని తెలిపారు. దీంతో అధికారులంతా దివీస్కు వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం జరగలేదని భావించడంతో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీఐటీయూ జిల్లా నాయకుడు వేణుగోపాల్, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కలిసి 23వ తేదీలోపు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే గురువారం భూముల్లోకి వెళ్తామని పిలుపునిచ్చారు. నడుం బిగించిన మహిళలు... దివీస్ ప్రాంతంలోకి వెళ్లే రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నప్పటికీ మహిళలు పోలీసులను లెక్కచేయకుండా పరుగులు పెడుతూ దివీస్ నిర్మించిన ప్రహరీ గోడ భూముల్లోకి ప్రవేశించారు. పంపాదిపేట ఐద్వా సంఘం అధ్యక్షురాలు అంగుళూరి నాగ కృష్ణవేణి, కొత్తపాకలకు చెందిన ఐద్వా సంఘం ప్రెసిడెంట్ అంగుళూరి సుశీల, అంగుళూరి బేబి, సత్యవతి, సంధ్య, వీరలక్షి్మలతోపాటు మరికొంత మంది ఆ ప్రహరీ వద్ద బైఠాయించారు. ‘మా భూముల్లోకి మార్గం కల్పించకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం అన్యాయమంటూ నినాదాలు చేశారు. గోడను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అక్కడే బైఠాయించిన మహిళలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వాహనంలోకి ఎక్కించారు. సొమ్మసిల్లిన మహిళలు... ఈడ్చుకువెళ్తున్న సమయంలో సంధ్య అనే మహిళ సొమ్మసిల్లిపోయింది. అయినా సరే పోలీసులు వ్యాన్ వద్దకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా వీరలక్ష్మి అనే మరో మహిళ పోలీసులను ప్రతిఘటించి వాగ్వాదానికి దిగారు. 108కు సమాచారం అందించి, ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేసింది. అయినా పోలీసులు లెక్కచేయకుండా మినీ వ్యాన్లో ఎక్కించి యు.కొత్తపల్లి పోలీస్స్టేçÙ¯ŒSకు తరలించారు. వ్యూహాత్మకంగా అడుగులు... పంపాదిపేట గ్రామంలో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్యను అరెస్టు చేయడం గ్రామ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో వారంతా సరుగుడు తోటలు వెంబడి కొత్తపాకల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారంతా ఒకేచోట ఉన్నారని పోలీసులకు సమాచారం అందడంతో కొత్తపాకల గ్రామ శివారు సరుగుడు తోటల వద్దకు పోలీసులంతా వెళ్లారు. ఇది తెలుసుకున్న సీపీఎం నాయకులు శేషుబాబ్జి, వేణుగోపాల్, బాధిత గ్రామాల ప్రజలంతా కొత్తపాకల గ్రామం నడిబొడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరి బీచ్ రోడ్డుపైకి వచ్చారు. కొత్తపాకల శివారులో ఉండిపోయిన పోలీసులు మెయిన్ సెంటర్కు వచ్చే సరికి ప్రజలంతా రోడ్డుపై పాదయాత్ర నిర్వహిం చారు. దివీస్ ప్రతిపాదిత ప్రాంతానికి ‘దివీస్ మాకొద్దంటూ’ నినాదాలు చేస్తూ తరలివెళ్లారు. కాలినడకను వెళ్తున్న వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్టు అయిన వారిపై కేసులు... బాధిత గ్రామాల ప్రజలను పోలీసులు అరెస్టు చేసి పలు కేసులు నమోదు చేశారు. అయితే డ్రోన్ కెమేరా, ఇతర వీడియో చిత్రీకరణ, ఫొటోల ఆధారంగా మరికొంత మందిపై కేసులు పెట్టేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. చుట్టుముట్టి నిర్బంధం.. దివీస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్య గురువారం ఉదయం టీ తాగేందుకు ఇంటి సమీపంలో ఉన్న హోటల్కు వస్తుండగా సుమారు రెండు వందల మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన మరో వ్యక్తిని కూడా జీపులో ఎక్కించి కిర్లంపూడి పోలీస్స్టేషన్కు తరలించారు. పంపాదిపేట ప్రధాన సెంటర్ కమ్యూనిటీ హాలు, ఇతర ప్రాంతాల్లో భారీగా పోలీసులు పహారా కాసి బయటకు వస్తే అరెస్టు చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. పోలీసుల మోహరింపు.. దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలోని భూముల్లోకి వెళ్తామని రైతులు ప్రకటించిన నేపథ్యంలో అడ్డుకునేందుకు పోలీసులు బుధవారం నుంచి తీర ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పంపాదిపేట, తాటియాకులపాలెం, నర్శిపేట, కొత్తపాకల తదితర ప్రాంతాలను పోలీసులు మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ను అమలు చేశారు. గుంపులుగా కనిపిస్తే కేసులు పెడతామని ఆటో ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రోన్ కెమేరాలతో నిఘా... ఉద్యమంపై పూర్తి స్థాయిలో నిఘా వేసేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. అడిషనల్ ఎస్పీ దామోధర్, పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, తుని, తుని రూరల్, ప్రత్తిపాడు సీఐలతోపాటు ఎస్సైలు పంపాదిపేట చేరుకున్నారు. అక్కడ గ్రామస్తుల కదలికలను గమనించేందుకు డ్రోన్ కెమేరాను ఆకాశంలోకి పంపి ఏరియల్ వ్యూ చిత్రీకరించారు. అయినప్పటికీ పోలీసుల కంటపడకుండా పంపాదిపేట ప్రజలు కొత్తపాకల గ్రామానికి చేరుకున్నారు. సీపీఎం, ఇతర నాయకుల అరెస్టు... ర్యాలీగా వెళ్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, సీఐటీయూ నాయకుడు ఎన్.వేణుగోపాల్, ఇతర నాయకులు సింహాచలం, అప్పారెడ్డి, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గంపల దండు, అంగుళూరి శ్రీను తదితరులతోపాటు మరో 85 మందిని పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లలో అన్నవరం పోలీస్స్టేషన్ కు తరలించారు. ఉద్యమ నాయకులను చొక్కాలు పట్టుకొని పోలీసులు లాక్కెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. -
తొండంగిలో మళ్లీ 144 సెక్షన్
కాకినాడ: తొండంగి మండలంలో పోలీసులు మళ్లీ 144 సెక్షన్ విధించారు. దివీస్ ఫ్యార్మాస్యూటికల్స్ కంపెనీకి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. గ్రామస్ధులు కంపెనీ స్ధాపనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కాగా, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు ముసలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివీస్ ఫ్యాక్టరీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీపీఎం నేతలతో పాటు మరో 200 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మళ్లీ ఉత్కంఠ
దివీస్ బాధిత గ్రామాల్లో ఈ నెల 28 వరకూ 144 సెక్షన్ అమలు నేడు భూముల్లోకి వెళ్లేందుకు రైతుల సన్నద్ధం సీపీఎం ఆధ్వర్యంలో రెఢీ పోలీసుల మోహరింపు... తొండంగి: కోన తీరంలో దివీస్ లేబరేటరీస్కు ప్రభుత్వం కేటాయించిన రైతుల భూముల్లోకి బాధిత గ్రామాల ప్రజలు వెళ్లేందుకు గురువారం ప్రయత్నించనున్న నేపథ్యంలో తీరప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దివీస్కు ప్రభుత్వం దానవాయిపేట, కోదాడ గ్రామల పంచాయతీల పరిధిలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు 671 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి విదితమే. సుమారు పది నెలల నుంచి రైతులు దివీస్ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు, విప్లవ సంఘాలు మద్దతు పలకడంతో పలు దఫాలుగా ఉద్యమంలో భాగంగా రోడ్షోలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. రైతుల స్వాధీనంలో ఉన్న భూముల్లోనూ, హైకోర్టు స్టేటస్కో ఇచ్చిన భూముల్లోనూ దివీస్ యాజమాన్యం ప్రహరీ గోడ, ఇతర నిర్మాణాలను చేపట్టడం ప్రారంభించింది. దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిరసిస్తూ బాధిత గ్రామాల రైతులు రెవెన్యూ, పోలీసు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులపాటు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సర్వే, విచారణలు చేపట్టి ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరగలేదని ప్రకటించడంతో ప్రభుత్వాధికారుల తీరుపై ఆ ప్రాంత ప్రజలు మరింత మండిపడుతున్నారు. దీంతో బాధిత గ్రామాల రైతులు సీపీఎం ఆధ్వర్యంలో గురువారం తమ భూముల్లోకి ప్రవేశించి సాగు చేసుకునేందుకు సన్నద్ధమవడంతో ప్రభుత్వం భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎనిమిది రోజులపాటు 144 సెక్షన్... కోన ప్రాంతంలో రైతులు దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలో తమ భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్న నేపధ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా తీరప్రాంతంలో 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్టు ఒంటిమామిడి పోలీస్స్టేన్ హెచ్సీ మాణిక్యం తెలిపారు. బాధిత గ్రామాల్లోనూ, బీచ్రోడ్డులోనూ సుమారు 300 మంది -
అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తా
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దివీస్ బాధిత రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు తొండంగి : దివీస్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తానని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకు, ప్రజలకు భరోసా ఇచ్చారు. సాగు భూముల్లో దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిం చకపోవడం దారుణమన్నారు. కొత్తపాకలు గ్రామంలో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే రాజా పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, నాయకులు కొయ్య శ్రీనుబాబు, పేకేటి సూరిబాబు, మద్దకూరి చిన్నబ్బులు తదితరులు సోమవారం మద్దతు పలికారు. దీక్షలో కూర్చున రైతులు, మహిళలు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దివీస్ యాజమాన్యం బలప్రయోగానికి దిగుతుందన్నారు. బాధిత రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజల ఆరోగ్యం గుర్తురాలేదా? ప్రజల ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో యనలమ ఫౌండేషన్ను స్థాపించామని చెబుతున్న ఆర్థిక మంత్రి యనమలకు కోన ప్రజలు, రైతుల ఆరోగ్యం గుర్తురాలేదా అని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. దీర్ఘకాలం ఈ ప్రాంత ప్రజల మద్దతుతో రాజకీయంగా ఎదిగిన యనమల ఇప్పుడా ఆ ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, నాయకులు మద్దుకూరి వెంకటరామయ్య చౌదరి, మేరుగు ఆనందహరి, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, పెరుమాళ్లలోవరాజు, కాలిన అప్పారావు, కొంజెర్ల వీరబ్బాయి, మేడిశెట్టి సుబ్బారావు, వెల్నాటి బుజ్జి, కందాబాబ్జి, చొక్కా కోదండం, చొక్కా రామచంద్రరావు, గాబురాజు, మేడిÔð ట్టి ఈశ్వరరావు, మేడిశెట్టి దారబాబు ఉన్నారు. రైతులను అడ్డుకున్న పోలీసులు దివీస్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు జరిగిన ప్రాంతానికి బాధిత రైతులు, ప్రైవేటు సర్వేయర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి తదితరులు వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత వాగ్వివాదం జరిగింది. దీంతో శాంతియుతంగా చేపట్టిన దీక్షల నేపథ్యంలో రైతులంతా చట్టపరంగానే పోరాటం చేస్తామంటూ దీక్షాబిరానికి చేరుకున్నారు. బాధిత రైతులు లేకుండా కేవలం గంటలోనే ఆదివారం అధికారులు సర్వే పూర్తి చేసి ఎటువంటి ఆక్రమణలు దివీస్ యాజమాన్యం నిర్మించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జి అన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకూ తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేఎస్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు కె.సింహాచలం, కొవిరి అప్పలరాజు, సీఐటీయూ మండల నాయకుడు బద్ది శ్రీను ఉన్నారు. -
కొనసాగుతున్న దివీస్ బాధితుల దీక్షలు
భగ్నం చేసేందుకు పోలీసుల యత్నాలు? తొండంగి : కోనప్రాంతంలో రైతులకు కోర్టు స్టేటస్కో ఇచ్చిన, రైతుల స్వాధీనంలో ఉన్న భూముల్లో దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దివీస్ వ్యతిరేకపోరాటకమిటీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. కొత్తపాకల గ్రామంలో ఏర్పాౖటెన దీక్షలో రెండో రోజు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మట్ల ముసలయ్య, గంపల దండు, సన్ని సత్యనారాయణ, తాటిపర్తి బాబూరావు, యనమల సత్తిబాబు, మారేటి లక్ష్మణరావు, కుక్కాసత్తిబాబు, పి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షా శిబిరానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వేణుగోపాల్, సీపీఎం నాయకులు వచ్చి మద్దతు పలికారు. తహసీల్దార్ టీవీ సూర్యనారాయణ, ఎస్సై బి.కృష్ణమాచారి తదితరులు దీక్షా స్థలికి వచ్చి విచారణ చేస్తామని దీక్ష విరమించాలని కోరారు. తమకు ఆమోదయోగ్యంగా ఉమ్మడిగా సర్వేయర్లను ఏర్పాటు చేసి విచారణ జరపాలని, రేపటికి వాయిదా వేయాలని సీపీఎం నాయకులతో పాటు పోరాట కమిటీ సభ్యులు కోరారు. అలా కుదరదంటూ గంట వ్యవధిలోనే విచారణను ముగించి అక్రమ నిర్మాణాలు లేవని అధికారులు తెలిపారని దివీస్ వ్యతిరేకపోరాట కమిటీ సభ్యులు వివరించారు. న్యాయం జరిగే వరకూ రిలే దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. శాంతియుతంగా చేపట్టి్టన తమ దీక్షలను భగ్నం చేసేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బాధిత రైతులు లేకుండా విచారణ ఎలా చేస్తారు? దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న రైతులు భూములకు కోర్టు స్టేటస్కో విధించినా అక్రమ నిర్మాణాలు జరిగాయని రైతులు ఫిర్యాదు చేస్తే, వారు లేకుండా అధికారులు ఏ విధంగా విచారణ చేశారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి జనవరి 21న తహసీల్దార్కు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పుడు రైతులు లేకుండా విచారణ చేయడం అన్యాయమన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేఎస్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు కె.సింహాచలం, కొవిరి అప్పలరాజు, సీఐటీయూ మండల నాయకుడు బద్ది శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
దివీస్ రద్దు వరకూ ఉద్యమించాలి
పౌరహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు తొండంగి : కోన ప్రాంతంలో కాలుష్య కారక దివీస్ ల్యాబొరేటరీస్ను ప్రభుత్వం రద్దు చేసేవరకూ బాధిత గ్రామాల ప్రజలు ఉధృతంగా ఉద్యమించాలని పౌరహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు అన్నారు. బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. దివీస్ రద్దు, అక్రమకేసుల ఎత్తివేత, తదితర డిమాండ్లతో కూడిన కరపత్రాలు విడుదల చేశారు. దివీస్ను వ్యతిరేకిస్తూ బాధిత గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బలప్రయోగానికి దిగడం విచారకరమన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేస్తుండడంతో చిన్న, సన్న కారు, పాడిరైతులు, వ్యవసాయ కూలీలు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులకు నష్టపోతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో 144 సెక్ష¯ŒSను ఆరునెలలుగా అమలు చేయడం, అక్రమకేసులు పెట్టారని, కోర్టులను ఆశ్రయించిన బాధిత రైతు భూముల్లోనూ తోటలను నరికించడం చట్టవిరుద్దమన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా బాధిత గ్రామాల ప్రజలు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దివీస్ను రద్దు చేయడంతోపాటు ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం జిల్లా వైస్ప్రెసిడెంట్ ఎ.బాబూరావు, కార్యదర్శి జె.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
లాఠీ దాష్టీకం
దివీస్ కోసం పోలీసుల అతి.. అట్టుడికిన కోన తీరం బందోబస్తుతో రైతుల భూముల్లో చెట్ల తొలగింపు కోర్టు స్టే ఉన్న, అమ్మని భూముల్లో పనులపై ప్రజల ఆగ్రహం గ్రామాల్లో మహిళలపై దౌర్జన్యం అడ్డుకున్న 100 మంది అరెస్టు బాధితులను విడిపించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తొండంగి : జీడిచెట్ల వద్ద పిక్కలు ఏరుకుంటూ, గొర్రెల మందలను కాచుకుంటూ జీవనం సాగించే కోనతీరంలోని అమాయక ప్రజలపై కాలుష్య దివీస్ పరిశ్రమ కోసం ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ స్థాపన కోసం కోనఫారెస్ట్ భూములు 670 ఎకరాలను కేటాయించింది. ఈ భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులు, బాధిత గ్రామాల ప్రజల కాలుష్య పరిశ్రమ స్థాపనను, భూముల కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసే పోరుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్), జనశక్తి, ఏపీ వ్యవసాయరైతు కూలీసంఘం, సీఐటీయూ, ఐద్వా మహిళాసంఘం తదితర సంఘాలు, పార్టీల మద్దతునిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు రైతులు ప్రభుత్వానికి అప్పగించని భూముల్లో బలవంతంగా చెట్లను తొలగించబోతుంటే బాధిత గ్రామాల ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా రెవెన్యూ అధికారులు భారీగా జేసీబీలు, కోత యంత్రాలతో చెట్లను తొలగించారు. విషయం తెలుసుకున్నతాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట తదితర గ్రామాలకు చెందిన వారంతా తమ భూముల్లోకి వెళ్లి చెట్లుతొలగిస్తున్న జేసీబీ, కోత యంత్రాలను నిలుపుదల చేయించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి అరెస్టు చేశారు. తాటియాకులపాలెం రైతు సన్ని సత్యనారాయణను పోలీసులు దారుణంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమారు 100 మందిని కోటనందూరు, అన్నవరం, ఒంటిమామిడి పోలీస్స్టేషన్కు తరలించారు. దివీస్ కోసం బలవంతపు భూసేకరణకు చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో కోన తీరప్రాంతంలో బాధిత గ్రామాల వద్ద సుమారు వెయ్యిమంది పోలీసులను మోహరించారు. మానవత్వాన్ని మరిచి.. పోలీసులు మానవత్వాన్ని మరచి బహిర్భూమికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలు, రోడ్డుకు సమీపంలో చదువుకుంటున్న విద్యార్థులు, యువతులు, బీచ్రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపై ధాషీ్టకాన్ని ప్రదర్శించారు. పంపాదిపేటలో బీచ్రోడ్డుకు ఆవల ఉన్న పశువుల మకాంలోకి, ఇళ్ల వద్దకు వెళ్తున్న మహిళలను అరెస్టు చేశారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ జీపుల్లో ఎక్కించారు. బాధితులకు అండగా ఎమ్మెల్యే రాజా అరెస్టుల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బాధిత ప్రజలకు అండగా నిలిచారు. అరెస్టు సంఘటనలు తెలిసిన వెంటనే ఆయన కొత్తపాకలు సమీపంలో దివీస్కు ప్రతిపాదిత భూములు వద్దకు వెళ్లారు. దీంతో బాధిత రైతులంతా అక్కడకు చేరుకున్నారు. హైకొర్టు స్టేటస్కో విధించిన భూముల్లోనూ పనులు నిర్వహించారని, అడ్డువచ్చిన ప్రతి ఒక్కరినీ కొట్టి అరెస్టు చేశారని రైతులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. దీంతో అక్కడ ఉన్న డీఎస్పీ రాజశేఖర్తో ఎమ్మెల్యే మాట్లాడారు. దివీస్కు ప్రతిపాదించిన భూముల్లో వాస్తవంగా రైతుల నుంచి కొనుగోలు చేసినది ఎంత, అమ్మని భూమి ఎంత ఉందో రెవెన్యూ అధికారులు గుర్తించి, అవసరమైతే సర్వే నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజా అన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలని డీఎస్పీని కోరారు. లేదంటే వారి తరఫున ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. అరెస్టయినవారిని విడిపించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అన్నవరం పోలీస్స్టేషన్కు 32 మందిని, కోటనందూరు 66 మందిని, ఒంటిమామిడిపోలీస్స్టేషన్కు ఇద్దరిని వాహనాల్లో తరలించారు. డీఎస్పీతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే రాజా వారిని అక్కడి నుంచి బయటకు పంపించారు. -
ప్రజల మధ్యే సభ నిర్వహించాలి
దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ తహసీల్దార్కు వినతిపత్రం తొండంగి : దివీస్ బాధిత గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారి మధ్యే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సభ నిర్వహించాలని దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. రెండు రోజుల క్రితం బాధిత గ్రామాలకు చెందిన కొంత మంది రైతులతో సమస్యలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ రమన్నారంటూ తొండంగి తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణ బాధిత గ్రామాల ప్రజలకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పంపాదిపేట, తాటియాకులపాలెం, కొత్తపాకలు, నర్శిపేట, ఒంటిమామిడి తదితర గ్రామాల ప్రజలు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మట్ల ముసలయ్య, గంపల దండు, మేరుగు ఆనందహరి, యనమల సత్తిబాబు, కుక్కా కొండ, కుక్కా సత్యనారాయణ, బద్ది బుజ్జి, తాటిపర్తి బాబూరావులతోపాటు మరికొంత మంది రైతులు బుధవారం తహసీల్దార్ను కలిశారు. రెవెన్యూ అధికారులు కోరిక మేరకు జిల్లా కలెక్టర్ను కలిసేందుకు బాధిత గ్రామాల ప్రజలమంతా కలిసి చర్చించుకున్నామన్నారు. కలెక్టర్ తమ సమస్యలను తెలుసుకునేందుకు నిర్ణయించుకుంటే బాధిత గ్రామంలో ఎక్కడైనా సభ ఏర్పాటు చేసుకోవచ్చని తహసీల్దార్కు వివరించారు. గతంలో పంపాదిపేటలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో కాలుష్య దివీస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమ వద్దన్న బాధిత గ్రామాల ప్రజలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. తర్వాత సుమారు 1200 మంది సంతకాలు చేసిన వినతిపత్రాలు కలెక్టర్కు ఇచ్చేందుకు వెళ్లినా పట్టించుకోలేదు. శాంతియుతంగా పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందిపెడుతుంటే స్పందించలేదు. మూడు నెలలుగా 144 సెక్ష¯ŒS అమలు చేసి, పోరాటానికి వచ్చిన నాయకులు, మహిళలపై పోలీసులు దాడి చేసినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. తమ భూములకు ప్రభుత్వం ఎన్ని లక్షలు పరిహారం ప్రకటించినా సరే కాలుష్య పరిశ్రమకు అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా తమతో చర్చించేందుకు రమ్మనడంపై ప్రజల్లో అనేక దురభిప్రాయాలు వస్తాయన్న కారణంగా జిల్లా కలెక్టర్ను కలిసే పరిస్థితి లేదన్నారు. అధికారులు ఎటువంటి చర్చ చేయదలచినా తమ ఉద్యమానికి మద్దతు పలికిన స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టిరాజా, ప్రజా సంఘాల నాయకులు, దివీస్ వ్యతిరేక పోరాటకమిటీ సభ్యుల సమక్షంలో బాధిత ప్రజల ముందే సభ నిర్వహించాలని తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ దివీస్ వ్యతిరేక పోరాటకమిటీ సభ్యుల వినతిపత్రాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయితే రైతులు, బాధిత ప్రజల అభిప్రాయాలను, అభ్యం తరాలను లిఖిత పూర్వకంగా కలెక్టర్కు నేరుగా తెలియజేయాలని దివీస్ వ్యతిరేకపోరాట కమిటీ సభ్యులకు సూచించారు. దీనిపై స్పందించిన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని కలెక్టర్కు తహసీల్దార్ వినతిప్రతం ద్వారా తెలిపాలని కోరారు. బాధిత గ్రామాల ప్రజలతో చర్చించుకున్న తర్వాతే కలెక్టర్ను కలవడంపై సమాచారమిస్తామని తహసీల్దార్కు వివరించారు. -
బలప్రయోగం చేస్తే ప్రాణత్యాగానికీ సిద్ధం
దివీస్ బాధిత గ్రామాల ప్రజల హెచ్చరిక కోన భూముల్లో చెట్లు తొలగింపునకు యత్నం యంత్రాలతో భూముల్లోకి ప్రవేశించిన అధికారులు సమైక్యంగా అడ్డుకున్న మూడు గ్రామాల ప్రజలు తొండంగి : దివీస్ ల్యాబొరేటరీస్ కోసం తమ భూముల్ని బలప్రయోగంతో లాక్కోజూస్తే ప్రాణత్యాగాలకైనా వెనుకాడబోమని బాధిత గ్రామాల ప్రజలు స్పష్టం చే శారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను నేడు కాలుష్య కారక పరిశ్రమకు ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటోందని ఆక్రోశించారు. బుధవారం మండలంలో ప్రభుత్వం దివీస్కు కేటాయించిన భూముల్లో చెట్ల తొలగింపునకు అధికారులు పోలీసు బందోబస్తుతో జేసీబీలు, కటింగ్ యంత్రాలు, ట్రాక్టర్లతో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం బాధిత గ్రామాల ప్రజలకు విషయం తెలియడంతో పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం గ్రామాలకు చెందిన సుమారు 400 మంది కలసికట్టుగా భూముల్లోకి వెళ్లారు. ప్రభుత్వానికి అమ్మని భూముల్లో, హైకోర్టు సేకరణను వ్యతిరేకించిన భూముల్లో పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. అధికారుల మాటలు విని వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని జనమంతా జేసీబీలు, కోత యంత్రాల సామగ్రి తెచ్చిన సిబ్బందిని హెచ్చరించారు. మరోసారి యంత్రాలతో భూముల్లోకి వస్తే ఊరుకోబోమన్నారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరచూ రైతుల భూముల్లోకి ప్రవేశించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదేవిధంగా చెట్లను తొలగించడంతో ఆందోళన చేశామన్నారు. ప్రభుత్వం తమ భూముల వ్యవహారంపై మొండి వైఖరి వీడాలని కోరారు. పనులు పరిశీలించేందుకు వెళ్లామంతే: తహసీల్దార్ గతంలో ప్రభుత్వం దివీస్కు భూములు అప్పగించిన నేపథ్యంలో ఆ సంస్థ అక్కడ ఏ పనులు చేస్తున్నదీ పరిశీలించేందుకు వెళ్లామని తహశీల్దార్ టి.వి.సూర్యనారాయణ తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన భూముల్లోకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. -
ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
దివీస్ భూముల విషయంలో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ''ఉమా.. నీకు సిగ్గు, లజ్జ ఉంటే ఇడుపులపాయ వెళ్దాం. అక్కడ ప్రతి అంగుళం వెతుక్కోండి. అక్కడ ఏమీ దొరక్కపోతే మీ నాయకుడితో క్షమాపణ చెప్పిస్తావా'' అని అడిగారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు వైఎసార్సీపీ ఎప్పుడూ అడ్డం రాదని, అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు కప్పం కట్టలేకనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదని పార్థసారథి అన్నారు. దివీస్ సంస్థ ఇచ్చే ముడుపులకు ఆశపడే పేదల భూములను వాళ్లకు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధపడ్డారని ఆరోపించారు. మంత్రి ఉమా మహేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోవాలని, అడ్డగోలుగా మాట్లాడకూడదని పార్థసారథి అన్నారు. -
ఆరోపణలు రుజువు చేసే దమ్ముందా!
-
85 రోజులుగా నరకాన్ని చూస్తున్నాం
-
85 రోజులుగా నరకాన్ని చూస్తున్నాం
వైఎస్ జగన్ వద్ద దివీస్ బాధితుల ఆవేదన సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘మంచినీరు ఇస్తున్నట్టు మభ్యపెట్టి ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మా అనుమతి లేకుండానే మా పొలాలు తీసుకుంటామంటున్నారు. 85 రోజులుగా పోలీసులతో మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. ఫ్యాక్టరీ వల్ల మా జీవితాలు సర్వనాశనమవుతాయి. పొలాలు తీసుకుంటే మేమెక్కడి పోవాలి. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీ పెట్టనీయం. మీ అండ మాకు కావాలి’’ అంటూ దివీస్ ప్రతిపాదిత గ్రామ ప్రజలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి వద్ద తమ కష్ట, నష్టాలు చెప్పుకొన్నారు. తుని నియోజకవర్గం తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ ప్రతిపాదిత గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన బహిరంగ సభకు ఆయన విచ్చేశారు. ఈ సభలో బాధితులు తమ ఇబ్బందులను వైఎస్ జగన్కు ఇలా వివరించారు. మంచినీరు కుళాయిలు పెట్టి మభ్యపెట్టారు ఈ మండలంలో 50 గ్రామాలు ఫ్యాక్టరీకి అతి దగ్గరలోనే ఉన్నాయి. మేమంతా సన్న, చిన్నకారు రైతులం. ఎన్టీఆర్ పేరుమీద మంచినీటి కుళాయిలు పెట్టి... ఆ తర్వాత ఫ్యాక్టరీ బోర్డులు పెట్టాక తెలిసింది. ఎండాకాలంలో కూడా ఇక్కడ తీరంలో మంచి వాతావరణం ఉంటుంది. ఇదంతా పాడవుతుందని ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తే మాపై కేసులు పెట్టారు. పిఠాపురం సీఐ ఆడపిల్లలని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు. – మట్ల ముసలయ్య, రైతు, పంపాదిపేట ప్రాణాలు పోయినా ఫ్యాక్టరీని అడ్డుకుంటాం దివీస్కు వ్యతిరేకంగా 82 రోజులుగా పోరాడుతున్నాం. 144 సెక్షన్ పెట్టి వేధిస్తున్నారండి. మాకు ఎమ్మెల్యేగారు అండగా ఉన్నారు. వామపక్షాల వాళ్లు, ఐద్వా వాళ్లు మాకు మద్దతుగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారండి. మా అనుమతి లేకుండానే మా పొలాలు తీసుకుంటారంట. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీని అడ్డుకుంటాం. – మంగులూరి సుశీల, కొత్తపాకల మహిళలపై కేసులు పెట్టి వేధిస్తున్నారండి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మా పొలాలు లాగేసుకున్నారండి. ఎకరానికి ఐదు లక్షలిస్తామంటున్నారండి. ఐదు లక్షలతో మా పిల్లల్ని ఎలా పెంచాలండి? ఫ్యాక్టరీ వల్ల మా సంతానానికి సంతానం పుట్టరండి. పొలం, డబ్బు లేకపోతే మళ్లీ సంపాయించుకోవచ్చు. సంతానం లేకపోతే ఎలా తెచ్చుకోగలమండి? మాకు ఏమీ వద్దండి. మా సంతతి సంతతిని కాపాడాలని కోరుతున్నామండి. – అంజాలపు రామకృష్ణవేణి, పంపాదిపేట ఎన్నికల ముందు ఏరువాక చేసి భూములిస్తామన్నడు నేను ఎకరం రైతునన్న. ఎన్నికల ముందు చంద్రబాబు ఇక్కడే ఏరువాక చేసి, మీ భూమి మీకిచ్చేస్తామన్నారు. ఎకరం రూ. 50 లక్షల విలువ చేసే భూములు వైఎస్ మూడు లక్షలకే తీసుకెళ్లి వాళ్ల కొడుకుకు కట్టబెడుతున్నారంటూ అబద్ధాలు చెప్పి ఎన్నికల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు వచ్చి మా పొలాలు లాగేసుకుంటున్నాడన్నా. పొద్దున సుప్రభాతం బదులు పోలీసుల సైర¯ŒS వింటున్నామన్నా. మాకు దీని నుంచి విముక్తి కల్పించన్నా. – బుచ్చిబాబు, పంపాదిపేట యనమల పట్టించుకోవడంలేదు నేను హెచరీస్ ఉద్యోగిని సారు. ఏడో తరగతి చదివాను. నెలకు ఎనిమిదివేలు జీతం వస్తుంది సారు. అక్షరం ముక్కలేని వాడుకు కూడా 20 వేలు కూడా వస్తుంది సారు. ప్రతి హెచరీలో 100 మంది పని చేస్తారు. నాకు ఎకరం పొలం ఉంది. 144 సెక్షన్ పెట్టడంతో చాలా దారుణంగా ఉంది సారు. ఇక్కడ 30 ఏళ్లు పాలించిన యనమల రామకృష్ణుడు మేము ఎలా ఉన్నామో కూడా చూడలేదు. – యనమల శ్రీను, తాటాకుల పాలెం ఇదంతా యనమల చేయించారండి కనీసం మాట్లాడుకోనీయకుండా పోలీసులు వేధిస్తున్నారండి. బయటూరోళ్లను తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి వారితో ఫ్యాక్టరీ కావాలని చెప్పించారండి. ఇదంతా యనమల రామకృష్ణుడు చేయించారండి. ఓ రోజు పోలీసులు వచ్చి నువ్వు సీఐ మీద తిరగబడ్డావంటూ జాకెట్ చించేసి జీపు దగ్గరకు తీసుకెళ్లారండి. నన్ను, మా ఆయన్ను స్టేషన్కు తీసుకెళ్లారండి. – బండ్లి మంగ, కొత్తపాకల భూములు తీసుకుని చెక్కులు వేస్తామంటున్నారండి ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నట్లు తెలపకుండానే మా భూములు తీసుకుంటామని, చెక్కులు మా అకౌంట్లో వేస్తామని కలెక్టర్గారు చెబుతున్నారండి. తుని సీఐ ఓ రౌడీలా ప్రవర్తిస్తున్నారండి. మాకు గాయాలైతే ఎమ్మెల్యే రాజా గారు అన్నవరం ఆస్పత్రిలో కట్లు కట్టిస్తుంటే యనమల కృష్ణుడు గుండాలతో కొట్టించాడండి. మా అమ్మకు చేయి విరిగింది. – అంగులూరి శ్రీను, కొత్తపాకల పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారు దివీస్కు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు పోరాడుతుంటే అధికారపార్టీ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి సహాయంతో పోరాటం చేస్తున్నాం. కలెక్టర్గారు దారుణంగా వ్యవహరిస్తున్నారండి. మేము వినతిపత్రం ఇస్తే ఫ్యాక్టరీ నిర్మించడానికి వారికి అనుమతి ఇచ్చేశామని చెబుతున్నారు. -అరుణ్కుమార్, మాజీ జెడ్పీటీసీ -
ప్రజల కోసం కేసులకై నా సిద్ధమే
- వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సవాల్ - దివీస్ రసాయన పరిశ్రమ బాధితులకు పరామర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ: తమ ప్రాంతంలో రసాయన పరిశ్రమ వద్దంటూ ఉద్యమిస్తున్న ప్రజలపై ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బాధితులకు అండగా నిలిచినవారిపై కేసులు పెట్టి వేధిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టించుకోవడానికై నా తాము సిద్ధమేనని తేల్చిచెప్పారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ రసాయన పరిశ్రమను వ్యతిరేకిస్తూ 85 రోజులుగా ఆందోళన చేస్తున్న తీర ప్రాంతంలోని 13 గ్రామాల ప్రజలకు ఆయన మద్దతుగా నిలిచారు. వైఎస్ జగన్ మంగళవారం తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ బాధితులను పరామర్శించారు. రసాయన పరిశ్రమ ఇక్కడ పెట్టకుండా చివరివరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దివీస్ పరిశ్రమ వద్దని గొంతెత్తిన ప్రతి ఒక్కరినీ పోలీసులు దారుణంగా హింసిస్తున్నారని బాధితులు కన్నీరు పెట్టుకోవడంతో జగన్ చలించిపోయారు. అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోందని నిలదీశారు. దానవాయిపేట పంచాయతీ నర్సిపేటలోజరిగిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనసమూహాన్ని ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.... ‘‘కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీ మనకు వద్దూ అంటూ గత 82 రోజులుగా ఉద్యమ బాట పట్టినా, ఈ పరిశ్రమ వల్ల వాటిల్లే నష్టాలను ఏకరువు పెట్టినా వినని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పైగా బాధితులకు తోడుగా వచ్చి ఎవరైనా అండగా నిలిస్తే... బాధితుల కష్టాలను వివరిస్తే పెట్టని కేసు లేదు. ఇక్కడి గ్రామాల్లో 82 రోజులుగా 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. బాధితులకు అండగా నిలిచినందుకు, వారి సమస్యలను ఎలుగెత్తి చాటినందుకు స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై 22 కేసులు పెట్టారు. ఇందులో 7 కేసులు హత్యయత్నం కేసులట! అసలు హత్యాయత్నం కేసులంటే వీళ్లకు(ప్రభుత్వ పెద్దలకు) తెలుసా? బాధితుల పక్షాన నిలిస్తే దారుణంగా వేధిస్తున్నారు. దివీస్ బాధిత ప్రజలకు తోడుగా నిలిచేందుకు వచ్చిన సీపీఎం సీనియర్ నేత పి.మధును పోలీసులు కొట్టి, వ్యాన్లోకి ఎక్కించారు. నన్ను దారుణంగా కొట్టారు, కొట్టి వేధించారు, ఇక్కడికొస్తే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన లేఖ రాస్తే పట్టించుకునే దిక్కు లేదు. మహిళలని కూడా చూడకుండా హింసించారు. పైగా కేసులు పెట్టి వేధించారు. ఈ ఫ్యాక్టరీని ఇక్కడి ప్రజలు ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? దానివల్ల వారి బతులు ఎలా ఛిన్నాభిన్నం అవుతాయో రాష్ట్రమంతటా తెలియజెప్పాలి. దాంతో చంద్రబాబు మనసు మారాలి. ఈ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్న యాజమాన్యం మనసు మార్చుకొని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లే పరిస్థితి రావాలి. చంద్రబాబు గూబ అదిరేలా, ఆయన మనసు మారేలా మనం పడుతున్న బాధలను, కష్టాలను గట్టిగా వినిపిద్దాం. ఇలాంటిది ఆసియాలోనే లేదు ఈ ప్రాంతం నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో దాదాపు 250 హ్యాచెరీలు(రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు) ఉన్నాయి. ఒక్కో హ్యాచెరీ దాదాపు 100 మందికి ఉపాధి కల్పిస్తోంది. అంటే 25,000 మంది వీటిలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఒకేచోట 250 హ్యాచెరీలు ఉన్న జోన్ దేశంలో, ఆసియా ఖండంలో ఎక్కడా లేదు. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల వల్ల దేశానికి ఏటా రూ.33,000 కోట్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. ఇందులో రొయ్యల(ఆక్వా కల్చర్) ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం రూ.23,000 కోట్లు. ఆక్వా కల్చర్తో మన రాష్ట్రానికి ఏటా వస్తున్న ఆదాయం రూ.14,000 కోట్లు. ఇక్కడ హ్యాచెరీల్లో రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తేనే వాటిని బయట చెరువుల్లో పెంచగలుగుతాం. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే రొయ్య పిల్లలో సగం సీడ్ ఈ ప్రాంతం నుంచే వస్తోందంటే దీని ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, ఈ రంగంలో పనిచేస్తున్న కూలీలకు మేలు జరగాలి, ఇక్కడున్న హ్యాచెరీల్ని కాపాడాలన్న యోచనను ప్రభుత్వం చేయాలి. 65 లక్షల లీటర్ల నీరంటే ఎంతో తెలుసా? రొయ్య పిల్లలు సున్నితమైన వాతావరణంలోనే బతుకుతారుు. సముద్రపు నీళ్ల ద్వారానే అవి జీవిస్తారుు. అందుకే సముద్రపు నీళ్లు ఉన్న చోటే హ్యాచెరీలను స్థాపిస్తారు. ఈ ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే సముద్రపు నీటిలోకి కలుషితమైన నీటిని పంపిస్తుంది. నిత్యం 65 లక్షల లీటర్ల మంచి నీటిని ఉపయోగించుకుంటుంది. 55 లక్షల లీటర్ల కలుషిత నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుంది. 65 లక్షల లీటర్ల నీరంటే ఎంతో తెలుసా? వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో ఒక రోజు ఉపయోగించుకునే నీరు 60 లక్షల లీటర్లు. అంటే ఒక మున్సిపాలిటీ ఉపయోగించుకునే నీటి కంటే ఎక్కువ నీటిని ఈ రసాయన పరిశ్రమ వాడుకుంటుంది. నిత్యం 55 లక్షల లీటర్ల కలుషిత నీరు సముద్రంలో కలిస్తే మత్స్య సంపద పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లే పరిస్థితి ఉండదు. హ్యాచరీలు మనుగడ సాగించలేవు. మత్స్యకారులు ఇప్పటికే సముద్రంలో 15 కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. కలుషిత నీరు అందులో కలిస్తే ఇంకా ఎంతదూరం వెళ్లాలో తెలియదు. ఇక్కడ హ్యాచెరీలు బతకాలంటే, అందులో 25 వేల మంది ఉద్యోగాలు నిలబడాలంటే, దేశానికి ఏటా రూ.23 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం రావాలంటే సముద్రపు నీళ్లు కావాలి. ఆ ఫ్యాక్టరీ మాత్రం కలుషిత నీటిని పంపించడానికే సముద్రపు నీరు కావాలనుకుంటోంది. ఇది ధర్మమేనా అని ప్రశ్నిస్తూ ఇక్కడి ప్రజలు 82 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. నిరసన తెలుపుతున్నారు. అది మేలో, కీడో ఆలోచించాలి ఫ్యాక్టరీ వస్తేనే ఉద్యోగాలు వస్తాయనే సంగతి అందరికీ తెలుసు. కానీ, ఒక ఫ్యాక్టరీ వల్ల 25,000 మంది ఉద్యోగాలు పోతున్నాయంటే దానివల్ల జరిగేది మేలో, కీడో అందరూ ఆలోచించాలి. ఇక్కడి నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఫార్మాసిటీ ఉంది. దివీస్ సంస్థకు సంబంధించిన ఇదే ఫార్మాస్యూటికల్ యూనిట్ను అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరేం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇష్టమొచ్చినట్లుగా రసాయన పరిశ్రమకు భూములిచ్చేస్తోంది. దివీస్కు ఇక్కడే భూములెందుకు ఇస్తున్నారంటే.. ఇక్కడ ఎకరా రూ.35 లక్షలు పలుకుతోంది. దివీస్కు మాత్రం ఎకరా కేవలం రూ.5 లక్షల చొప్పున దాదాపు 670 ఎకరాలను ధారాదత్తం చేస్తున్నారు. అతి తక్కువ ధరకు రైతుల నుంచి భూములు లాక్కొని దివీస్కు అప్పగిస్తున్నారు. ఆ భూముల వాస్తవ ధర రూ.250 కోట్లకు పైగానే ఉంటుంది. దివీస్కు వాటిని కేవలం రూ.30 కోట్లకే కట్టబెడుతున్నారు. మిగిలిన సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబు, దివీస్ కలిసి పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. రైతులు నష్టపోయే పరిస్థితి దాపురించింది. ఇదే దివీస్ కంపెనీ ఫార్మాసిటీలో యూనిట్ ఎందుకు పెట్టడం లేదంటే.. అక్కడ ఎకరాకు రూ.60 లక్షలో, రూ.70 లక్షలో చెల్లించాలి. అక్కడ కార్యకలాపాలు సాగించాలంటే నెలనెలా ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చులన్నీ తగ్గించుకునేందుకే ఇక్కడకొచ్చి భూములను అప్పనంగా కొట్టేస్తూ మన ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. స్వార్థంతో అమ్ముడుపోతున్నారు అధికారం ఉందనే ధీమాతో చంద్రబాబు నాయుడు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండున్నరేళ్లలో ఆయన ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారు. ఎవరు ఎలా నష్టపోరుునా ఫర్వాలేదు, నాకు వచ్చేది నాకొచ్చేస్తే చాలని ఆయన అనుకుంటున్నారు. వందలాది హ్యాచెరీలు మూతపడే దుస్థితి నెలకొన్నా కేవలం వ్యక్తిగత స్వార్థంతో అమ్ముడుపోతున్నారు. దివీస్ సంస్థకు ఇక్కడి నుంచే విజ్ఞప్తి చేస్తున్నా.. అయ్యా.. చంద్రబాబుతో మీకున్న లావాదేవీల సంగతి నాకు తెలియదు. కానీ, ఒక్కటే చెబుతున్నా. ఒక పరిశ్రమ వల్ల తమకు మేలు జరగుతుందని ప్రజలు భావిస్తేనే ఆ పరిశ్రమ దేదీప్యమానంగా వెలుగొందుతుంది. చంద్రబాబుతో మీకున్న వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా డీల్ కుదుర్చుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ధర్మం కాదు. మీరు ఫ్యాక్టరీ పెట్టి కలుషిత నీటిని సముద్రంలోకి వదిలితే ఇక్కడ గ్రామాలుండవు, మత్స్యసంపద ఉండదు, మత్స్యకారులు ఉండరు. హ్యాచెరీలు ఉండవు. దేశానికి భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతున్న ఈ వ్యవస్థను నాశనం చేయొద్దని దివీస్ యాజమాన్యాన్ని కోరుతున్నా. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ఫార్మాసిటీలో మీ పరిశ్రమ పెట్టుకోండి. అప్పుడు అందరమూ స్వాగతిస్తాం. దీనివల్ల రాష్ట్రానికి, మీకు మంచి జరుగుతుంది. చంద్రబాబు అండ ఉందనే మొండి వైఖరితో ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోం. కచ్చితంగా పోరాడుతాం. ఇక్కడున్న ప్రజలకు తోడుగా నిలుస్తాం. వారికి భరోసా ఇస్తాం. చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మహాఅరుుతే ఇంకో రెండేళ్లు. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మేమొచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీని ఇక్కడినుంచి తరలిస్తాం. కేసులకు సిద్ధమే... పోలీసు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వేసుకున్న యూనిఫామ్ను గౌరవించండి. నెత్తిన టోపీపై ఉన్న సింహాలను గౌరవించండి. కానీ, ఆ సింహాల వెనుక ఉన్న గుంటనక్కలు ఆడించినట్టల్లా ఆడకండి అని కోరుతున్నాం. మీ మనస్సాక్షి చెప్పినట్లుగా మీరు వినండి. ఇక్కడి బాధితులకు అండగా నిలవండి. ప్రజలకు అండగా ఉన్న ఎమ్మెల్యే రాజాపై ఇప్పటికే 22 కేసులు పెట్టారు. ఇంకో 22 కేసులు పెట్టించుకోవడానికై నా సిద్ధమే. అవసరమైతే రాజాతోపాటు నేను కూడా కేసులు పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. బాధితులకు అన్నిరకాలుగా తోడుగా ఉంటాం. మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం మీకు తోడుగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, వైఎస్సార్సీపీ ముఖ్యనేత బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పిఎసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బారుు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, గొల్ల బాబూరావు పాల్గొన్నారు. -
దానవాయిపేట బహిరంగ సభలో జగన్
-
రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు
-
నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటా
-
రోడ్డు రోలర్ బద్దలు కొట్టారంటూ కేసు
దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడినందుకు తమ మీద అర్థం పర్థం లేని కేసులన్నీ పెట్టారని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామస్తులు చెప్పారు. చివరకు గ్రామస్తులు కొందరు కలిసి రోడ్డు రోలర్ ఒకదాన్ని బద్దలు కొట్టారని కూడా కేసు పెట్టారని వాపోయారు. అసలు దాన్ని బద్దలుకొట్టడం సాధ్యమేనా అన్న చిన్న విషయాన్ని కూడా గమనించకుండా చేతికి వచ్చిన కేసులన్నీ పెట్టారన్న విషయాన్ని బాధితులు కుండ బద్దలుకొట్టి చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు అండగా నిర్వహించిన సభలో ఈ విషయాలు వెల్లడించారు. రోడ్డుమీద మట్టి ఎత్తుకెళ్లామట ఇక్కడంతా చిన్న, సన్నకారు రైతులే. మత్స్యకార కుటుంబాలు 36 ఉన్నాయి. మండలంలో 50 ఊళ్లు ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ పేరు మీద మంచినీటి పథకం అని ముందు మోసం చేశారు. కానీ బోర్డులు పెట్టాక అసలు విషయం తెలిసింది. దివీస్ అనగానే ఏంటా అని విచారించాం. మండువేసవిలో కూడా ఇక్కడి వాతావరణం సహజమైన ఏసీలా ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ వస్తే పిల్లలు పుట్టరని, పుట్టిన పిల్లలు యవ్వనంలో ఉండరని చెబుతున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని పిల్లాడితో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు, రోడ్డు మీద మట్టి ఎత్తుకెళ్లిపోయామని కేసు పెట్టారు. రోడ్డు రోలర్ను బద్దలుకొట్టామని అన్నారు. ఆడపిల్లలని కూడా చూడకుండా పిఠాపురం సీఐ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. -ముసలయ్య వాళ్లను రానిచ్చేది లేదు గత 82 రోజులుగా మేం పోరాడుతుంటే అక్రమంగా కేసులు పెట్టి మావాళ్లను జైళ్లలో పెట్టారు. మాకు మూడెకరాల భూమి ఉంది. దాన్ని బలవంతంగా లాక్కోవాలనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను రానిచ్చేది లేదు -సుశీల పిల్లలు లేకపోతే బతకడం ఎందుకు మమ్మల్ని భయపెట్టి, బలవంతంగా రెండెకరాలు లాక్కోవాలనుకుంటున్నారు. 5 లక్షలు ఇస్తామంటున్నారు. మా పిల్లలను ఎలా బతికించుకోవాలి? భూమి లేకపోతే అడుక్కుని తింటాం కానీ, పిల్లలే లేకపోతే ఎలా బతకాలి, ఎందుకోసం బతకాలి? ఏడాదికి 2 లక్షల ఆదాయం ఇచ్చే సర్వి తోటను బలవంతంగా నరికించేశారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ.. భూములు మాత్రం ఇవ్వం. కాకినాడ ఆస్పత్రిలో ఇక్కడివాళ్లు ఎంతమంది బాధలు పడుతున్నారో లెక్కలేదు. -కృష్ణవేణి సీపీఎం మధును కర్కశంగా కొట్టారు నేను ఒక ఎకరం రైతును. మా ఇంటి మీద మూడు జీపులతో పోలీసులు దాడి చేశారు. మీటింగులు పెడుతున్నావట, ఇల్లు కూల్చేస్తాం, జైల్లో పారేస్తాం అన్నారు. అయినా భయపడలేదు. మాజీ ఎంపీ మధును పోలీసులు కర్కశంగా కొడుతుంటే కళ్లల్లో నీళ్లు వచ్చాయి. చంద్రబాబు నిద్రలేస్తే అబద్ధం. రాజశేఖరరెడ్డి మా భూములు లాక్కున్నారని బాబు చెప్పారు, కానీ ఇప్పుడు ఈయనే లాక్కుంటున్నారు -బుజ్జిబాబు మా ఉద్యోగాలు పీకేస్తున్నారు హేచరీలో ఉద్యోగం చేస్తున్నాను. ఏడోతరగతి చదివి, నెలకు 8వేల రూపాయలు సంపాదిస్తున్నాను. అక్షరం ముక్క లేకపోయినా అనుభవం పెరిగే కొద్దీ 20 వేల వరకు వస్తుంది. మా హేచరీలో వందమంది పనిచేస్తారు. భూములు అమ్మకపోయినా లాగేసుకుంటాం అంటూ మామీద కేసులు పెడుతున్నారు. 144 సెక్షన్ అంటే దారుణంగా ఉంది. యనమల రామకృష్ణుడు ఎప్పుడూ మమ్మల్ని పట్టించుకోలేదు. దివీస్ వస్తే ఆ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడి వాళ్లకో ఉద్యోగాలు వస్తాయేమో గానీ, మా ఉద్యోగాలన్నీ పోతాయి. అందుకే అది వద్దనే కోరుకుంటున్నాం -యనమల శ్రీను ఆడవాళ్లని కూడా చూడకుండా... పోలీసులు ఒక్కసారిగా వచ్చి, సీఐని తిడుతున్నావంటూ దుస్తులు చించేసి జీపు దగ్గరకు లాక్కెళ్లారు. అసలు సీఐ మొఖమే నాకు తెలియదని చెప్పాను. మా అమ్మాయిని స్కూలు నుంచి తీసుకొద్దామని బయటకు వెళ్తే.. పోలీసులు ఒంటిమామిడి స్టేషన్కు తీసుకెళ్లిపోయారు. అప్పటికే మా ఆయనను అన్నవరం స్టేషన్లో పెట్టారు. కనీసం పిల్లలకు కడుపునిండా తిండిపెట్టే అవకాశం కూడా లేకుండా చేశారు. యనమల రామకృష్ణుడి తమ్ముడు పదవిలో లేకపోయినా ఆగడాలు చేస్తున్నాడు. బయటి నుంచి పదిమందిని తీసుకొచ్చి, దివీస్ కంపెనీ లేకపోతే చచ్చిపోతామని వాళ్లతో చెప్పించారు. అసలు వాళ్లు ఎవరో కూడా మాకు తెలియదు. ఇదంతా యనమల రామకృష్ణుడు చేసిన పని. -మంగ ఏం చేస్తారో తెలీదు.. ఫ్యాక్టరీ వద్దు మేం ఈ ఊరు వదిలి వెళ్లలేం, ఈ భూములు వదిలి వెళ్లలేం. మీరేం చేస్తారో తెలీదు, ఆ ఫ్యాక్టరీని మాత్రం రానివ్వద్దు. బలవంతంగా భూములు లాక్కుని, పోలీసులతో కొట్టిస్తున్నారు. మేం భూములు ఇచ్చేది లేదని చెప్పినా, భూములు లాక్కుని చెట్లు నరికేశారు. ఫ్యాక్టరీ రాకుండా మీరే ఆపాలి (అంటూ ఆమె తీవ్రంగా విలపించారు) -అమ్మాజీ -
నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటా
అవసరమైతే తాను కూడా వచ్చి ఇక్కడ కేసులు పెట్టించుకుంటానని, దివీస్ బాధిత ప్రజలందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దివీస్ ఫార్మా సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు స్థానిక ఎమ్మెల్యే మీద 22 కేసులు పెట్టారని, వాటిలో 7 హత్యాయత్నం కేసులని చెప్పారు. అసలు వీళ్లకు హత్యాయత్నం కేసులంటే ఏంటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ బాధితులను పలకరించేందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... దానవాయిపేట, చుట్టుపక్కల బాధిత గ్రామాలు గత 82 రోజులుగా ఈ ఫ్యాక్టరీ వద్దని చెబుతూ గట్టిగా ఉద్యమబాట పట్టినా, ఈ ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టాలు ఇవీ అని చెప్పినా వినని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పైగా మీకు తోడుగా ఎవరైనా ఉంటే, మీరు పడుతున్న బాధలను ప్రభుత్వానికి అర్థం కావాలని గట్టిగా నిలదీస్తే.. పెట్టని కేసు లేదు. 82 రోజులుగా ఈ గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. మీకు అండగా నిలబడినందుకు ఎమ్మెల్యే రాజా మీద 22 కేసులు పెట్టారు. వాటిలో ఏడు హత్యాయత్నం కేసులట. అసలు హత్యాయత్నం అంటే ఏంటో కూడా వీళ్లకు తెలుసో లేదో తెలియట్లేదు మీకు అండగా నిలబడేందుకు కమ్యూనిస్టు పార్టీ నేత మధు వచ్చారు. ఆయన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆయనను కొట్టుకుంటూ వ్యాన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇక్కడికొస్తే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు అన్నట్లు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదు ఆడవాళ్లని కూడా చూడకుండా కొట్టి, పైపెచ్చు కేసులు పెట్టారు ఈ ఫ్యాక్టరీని ఎందుకు వీళ్లంతగా వ్యతిరేకిస్తున్నారు, దీనివల్ల కాలుష్యం వీళ్ల జీవితాలను ఎంతగా చిన్నాభిన్నం చేస్తుందో రాష్ట్రం మొత్తానికి చెప్పాలి చంద్రబాబుకు మనసు మారాలి, ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్న యాజమాన్యం మనసు మార్చుకుని ఇక్కడినుంచి వెనక్కి వెళ్లాలి చంద్రబాబు గూబ అదిరేలా.. ఆయన మనసు మారేలా మనం పడుతున్న బాధలు ఆయనకు చెబుదాం హేచరీలలో 20-25 వేల మంది పనిచేస్తున్నారు. వీళ్లంతా వాటిమీద ఆధారపడి బతికే పరిస్థితి ఉంది. ఈవాళ ఒకే ప్రాంతంలో 250 హేచరీలు ఉన్నాయంటే.. ఇలాంటి ఆక్వాజోన్ బహుశా దేశంలోనే ఎక్కడైనా ఉందో లేదో. ఇంత పెద్ద ఉత్పత్తి ఇక్కడ జరుగుతోంది, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. దేశం మొత్తానికి మత్స్య ఉత్పత్తుల ఎగుమతి వల్ల 33వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం వస్తుంటే, అందులో రొయ్యల ద్వారా వచ్చే ఆదాయం 23వేల కోట్లు. ఇలాంటి చోట్ల ఉన్న హేచరీలలో తయారైన రొయ్య పిల్లలే అంత మొత్తాన్ని సంపాదిస్తున్నాయి. మొత్తం సీడ్లో సగం ఒక్క ఈ ప్రాంతం నుంచే వస్తోంది. 14 వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రాంతం నుంచే వస్తోందంటే.. ఇంత ప్రాధాన్యం గల రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి, వీటిని కాపాడాలని చూడాలి. సముద్రపు నీరు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే హేచరీలు పెట్టగలరు. కానీ ఈ ఫ్యాక్టరీకి సముద్రం నీరు అవసరం లేకపోగా, సముద్రం లోకి కలుషిత నీళ్లను ఈ ఫ్యాక్టరీ పంపుతుంది హేచరీలు బతకాలంటే, సముద్రపు నీరు కావాలి.. అదే ఈ ఫ్యాక్టరీకి మాత్రం తమ కలుషిత నీటిని పంపడానికి సముద్రపు నీరు కావాలి. ఇది సమంజసమేనా అని గత 82 రోజులుగా ఇక్కడివాళ్లంతా ధర్నాలు చేస్తున్నారు ఫ్యాక్టరీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని అందరికీ తెలుసు. కానీ, ఒక్క ఫ్యాక్టరీ వల్ల 20 వేల మందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందంటే దానివల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఫార్మాసిటీ ఉంది. దివీస్ ఫ్యాక్టరీని అక్కడకు తీసుకెళ్లి పెట్టుకోవచ్చు ఒక మునిసిపాలిటీకి తాగడానికి కావల్సిన 60 లక్షల లీటర్ల మంచి నీళ్లను ఈ ఫ్యాక్టరీ తీసుకుని, అందులో 55 లక్షల లీటర్ల కలుషిత నీళ్లను సముద్రంలోకి వదిలేస్తుంది అదే జరిగితే మత్స్యకారులు వేటకు పోయే పరిస్థితి ఉండదు ఇంతటి దారుణమైన పరిస్థితిలో మత్స్యకారుల బతుకులు అగమ్యగోచరంగా తయారవుతాయి హేచరీల మీద దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే ఉన్నాయి. వాళ్లంతా ఏమైపోతారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు ఇక్కడైతే దివీస్కు 5 లక్షలకే ఎకరా భూమిని ధారాదత్తం చేస్తున్నారు రైతుల దగ్గర భూములు లాక్కుని దివీస్కు అప్పగిస్తున్నారు. దాదాపు 250 కోట్ల విలువైన భూములను 30 కోట్లకే ఇచ్చేస్తున్నారు. మిగిలిన 200 కోట్లను చంద్రబాబు, దివీస్ పంచుకుంటున్నారు దివీస్ సంస్థ ఫార్మాసిటీకి వెళ్లి పెడితే, అక్కడ కాలుష్య నియంత్రణ ప్లాంటులు ఉన్నాయి. అక్కడైతే ఎకరా 50-70 లక్షలు కట్టాలి, ఈటీపీల మీద కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆలోచించి, ఇక్కడ మన ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మన ప్రాంతంలో ఫ్యాక్టరీ పెడుతున్నారు దీనిపై ప్రజలు, రైతులు పోరాటం చేసి, గట్టిగా అడుగుతున్నారు. ప్రభుత్వం ఉంది కదాని చంద్రబాబు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు ఇన్నేళ్లలో పెట్టిన పరిశ్రమలు కూడా ఏమీ లేవు పూర్తిగా అమ్ముడుపోయి, ఎవరికి నష్టం జరిగినా తనకు పర్వాలేదు, తనకు వచ్చేది వస్తే చాలన్నట్లు ఉన్నారు పరిశ్రమ వల్ల వేలాదిమందికి నష్టం జరుగుతున్నా, వందల కొద్దీ హేచరీలు మూతపడుతున్నా.. ఆయన పట్టించుకోరు చంద్రబాబుకు, దివీస్కు ఉన్న లావాదేవీలు ఏంటో మాకు తెలియదు గానీ, పరిశ్రమ ఇక్కడ పెడితే మాత్రం దానివల్ల అంతా నష్టమే గ్రామాలు పరిశ్రమను ఆశీర్వదిస్తేనే అది దేదీప్యమానంగా నడుస్తుంది చంద్రబాబుకు, మీకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మీ పొల్యూషన్ అంతా పైపులైన్లతో సముద్రంలోకి విడిచిపెడితే హేచరీలు ఉండవు, మత్స్యకారులు ఉండరు దేశం మొత్తానికి ఆక్వాహబ్గా 50 శాతం సీడ్ను అందిస్తున్న ఈ వ్యవస్థను నాశనం చేయొద్దని దివీస్ సంస్థను కోరుతున్నా దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోయి ఫార్మాసిటీలో మీ పరిశ్రమ పెట్టండి, అలా పెడితే అందరం స్వాగతిస్తాం దానివల్ల మీకు, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది అయినా వినకుండా దివీస్ ఇక్కడే ఫ్యాక్టరీ పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు కచ్చితంగా పోరాడతాం, ఇక్కడున్న ప్రజలకు తోడుగా నిలబడతాం చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండేళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. మేం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఇక్కడినుంచి తీసేస్తాం పోలీసు సోదరులను కోరుతున్నాం.. మీరు వేసుకున్న యూనిఫాంను, నెత్తిమీద ఉన్న సింహాలను గౌరవించండి. వాటి వెనకాల ఉన్న గుంటనక్కలు చెప్పినట్లు నడుచుకోవద్దని కోరుతున్నాం అవసరమైతే ఇంకో 22 కేసులు పెట్టించుకుంటాం... కావాలంటే రాజాతో పాటు నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మొత్తం మీకు అండగా ఉంటుంది. -
20వేల మంది రోడ్డున పడుతున్నా...
-
సర్కారే కాటేస్తోంది!
13 గ్రామాలు, 25 వేల జనాభాకు తీవ్ర నష్టం బాధితులతో నేడు వైఎస్ జగన్ ముఖాముఖి సాక్షి ప్రతినిధి, కాకినాడ: దివీస్ రసాయనాల పరిశ్రమ వల్ల 13 గ్రామాల్లో 25 వేల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా టీడీపీ ప్రభుత్వం ఆ పరిశ్రమకు కొమ్ముకాస్తుండటంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఎగిసిపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలోని తొండంగి మండలం దానవాయిపేట వద్ద దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పరిశ్రమను స్థాపిస్తున్నారు. ఇందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 20 వేల మంది రోడ్డున పడుతున్నా.. ఏటా రూ.16 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం నష్టపోతున్నా, గాలికొదిలేసిన సర్కారు.. స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. తీర ప్రాంతంలో సరుగుడు, జీడిమామిడి సాగు చేసేందుకు పేద రైతులకు పట్టాలుగా ఇచ్చిన దాదాపు 505 ఎకరాల భూమిని దివీస్ రసాయనాల పరిశ్రమ కోసం ప్రభుత్వం కేటాయించింది. భూ సేకరణ చట్టాన్ని సైతం ఉల్లంఘించి రూ.35 లక్షలకు పైబడి ఉన్న మార్కెట్ ధరను పక్కన పెట్టి, కేవలం రూ.5 లక్షలు రైతులకు పరిహారంగా ఇచ్చి పేదల పొట్టకొడుతోంది. ఎస్ఈజెడ్ పేరుతో సేకరించిన పదివేల ఎకరాల్లో సింహభాగం ఇప్పటికీ అదే ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్నా దానిని పక్కన పెట్టి కొత్తగా అతితక్కువ ధరకు భూములను సేకరించిన తీరుతోనే వివాదం రాజుకుంది. హేచరీల మనుగడ ప్రశ్నార్థకం... దివీస్ పరిశ్రమ వల్ల ఓ వైపు రైతాంగం తీవ్రంగా నష్టపోతే అదే ప్రాంతంలో దాదాపు 250కి పైగా ఉన్న హేచరీల మనుగడ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. దేశంలోనే రెండో అతిపెద్ద ఆక్వా జోన్గా ఉన్న ఈ ప్రాంతంలో దివీస్ వల్ల సముద్ర జలాలు కలుషితమై హేచరీలు మూతపడే పరిస్థితి ఉందని నిపుణులు అంటున్నారు. దేశంలోని ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలతోపాటు ఇతర జిల్లాలకు కూడా 60 శాతం రొయ్య పిల్లలు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్న పరిస్థితుల్లో దివీస్ వల్ల ఇక ఈ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బేనంటున్నారు. మరో వైపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 ఏళ్లుగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 20 వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. రసాయనాలతో ముప్పు దివీస్ పరిశ్రమకు వినియోగించే అనేక రకాల రసాయనాలు, వాటి ద్వారా వచ్చే వ్యర్థాలు, విడుదలయ్యే విషవాయువుల వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి కాలుష్యం వల్ల తీర గ్రామాల్లోని 10 వేల మందికిపైగా మత్స్యకారులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ కారణంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవలసిన ముప్పు ముంచుకొస్తోంది. ఎగిసిపడ్డ ఉద్యమం.. దివీస్ పరిశ్రమ వల్ల ఎదురయ్యే అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్తోపాటు వామపక్ష పార్టీల ఆందోళనతో ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం ఆందోళనకారులపై విరుచుకు పడుతోంది. ప్రజలకు భరోసాగా నిలిచిన నాయకులపై కేసులు పెట్టి, లాఠీలు ఝుళిపిస్తూ ఉక్కుపాదం మోపుతోంది. దాదాపు 80 రోజులుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజల గొంతునొక్కి.. పోలీసులు, ప్రైవేటు సైన్యం సహాయంతో కర్కశంగా వ్యవహరిస్తున్నా బాధితులు మాత్రం మొక్కవోని దీక్షతో కదంతొక్కుతున్నారు. బాధిత గ్రామాల్లో 4 వేల మం దికి పైగా పోలీసులు మోహరించి అన్ని రోడ్లలో చెక్ పోస్టు లు ఏర్పాటు చేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు అనేక మం ది వామపక్షాల నేతలు ప్రజల పక్షాన నిలబడి పోలీసుల దౌర్జన్యాలను, ప్రభుత్వ నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాపై 307తోపాటు 22 కేసులు నమోదు చేసింది. ఈ దివీస్ పరిశ్రమ వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు ఉండడం వల్లే ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు దానవాయిపేటలో వైఎస్ జగన్ పర్యటన సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం సందర్శించనున్నారు. దివీస్ పరిశ్రమ స్థాపన వల్ల నష్టపోనున్న బాధిత ప్రజలతో మధ్యాహ్నం తర్వాత ముఖాముఖి మాట్లాడతారని, బహిరంగ సభలో వారినుద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వేలాది మంది కడుపుకొట్టే అభివృద్ధి ఎందుకు? ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజం తొండంగి: ఆక్వా కల్చర్ ద్వారా అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యం లభించడానికి కారణమైన తీర ప్రాంత రైతులు, పరిసర గ్రామాల ప్రజలకు నష్టం చేకూర్చే కాలుష్య కంపెనీలతో చేసే అభివృద్ధి ఎందుకని వైఎస్సార్సీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఆక్వా హేచరీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సీఏఏ ప్రమాణాలకు అనుగుణంగా హేచరీల ద్వారా 60 శాతం నాణ్యమైన రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. ఇలాంటి చోట కాలుష్య దివీస్ పరిశ్రమను పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచక పరిస్ధితులను సృష్టిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ దత్తత తీసుకున్న దానవాయిపేట పంచాయతీలో చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ఫండ్ ఇచ్చిన కాంట్రాక్టర్లకు రూ.300 కోట్ల విలువైన భూమిని పాతిక కోట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తీరంలో పోలీసుల దమనకాండకు అంతు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఉద్యమానికి మద్దతు పలికిన వివిధ పార్టీల నేతలను పోలీసులు బూటుకాళ్లతో తన్నిస్తున్నారన్నారు. తాము అభివృద్ధికి అడ్డుపడమని, ప్రజలకు నష్టం చేకూర్చే కాలుష్య పరిశ్రమలకు వ్యతిరేకమన్నారు. -
వైఎస్ జగన్ తూ.గో.జిల్లా పర్యటన వాయిదా
-
వైఎస్ జగన్ తూర్పుగోదావరి పర్యటన వాయిదా
కాకినాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17న జిల్లాలోని తొండంగి దివీస్ ప్రభావిత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటించాల్సి ఉంది. కాగా అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ నెల 22 న ఆయా గ్రామాల్లో జగన్ పర్యటించి దివీస్ వ్యతిరేక ఉద్యమానికి మద్ధతు ఇవ్వనున్నారు. అదే విధంగా దివీస్ ఉద్యమంలో గాయపడ్డ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్టు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తెలిపారు. కాగా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతులు ఆ భూముల్లోకి ప్రవేశించి పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. దానవాయిపేట పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ప్రభుత్వం దివీస్ లేబొరేటరీస్కు 505 ఎకరాలు కేటాయించింది. ఇటీవల రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి కొంతమంది రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, గాలి, నీరు, నేల కలుషితమై తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు భూములిచ్చేది లేదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
దివీస్ వ్యతిరేకులపై దాడి
ఇద్దరు మహిళలకు గాయాలు పోలీస్స్టేషన్లో మాజీ జెడ్పీటీసీ దంపతులను నిర్బంధించే యత్నం తుని రూరల్ : ఇంటిపేరుతో దూషిస్తూ తమపై ముగ్గురు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని కత్తపాకలకు చెందిన అంగులూరి స్వర్ణ, అంగులూరి లోవతల్లి వాపోయారు. బుధవారం రాత్రి తుని ఏరియా ఆస్పత్రిలో బాధితులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టీడీపీకి చెందిన బత్తుల విజయ్కుమార్ తమ ఇళ్ల వద్దకు కారత్రో వచ్చి ఇంటి పేరుతో దూషిస్తుండగా నా భర్త లోవరాజు నిలదీశాడని లోవతల్లి తెలిపారు. నిలదీసిన నా భర్తపై దౌర్జన్యం చేస్తుండగా అడ్డుకున్న నన్నూ, మా తోటికోడలను కరత్రో దాడి చేశాడని విరించారు. ఈ దాడిలో బత్తుల విజయ్కుమార్తోపాటు గారా రాంబాబు, బత్తుల శ్రీను ఉన్నారన్నారు. దీనిపై ఒంటిమామిడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, వైద్యుం కోసం తుని ఏరియా ఆస్పత్రికి వచ్చామని లోవతల్లి, స్వర్ణ వివరించారు. కాగా ఇదే విషయంపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన తమపై ఒంటిమామిడి పోలీస్స్టేషన్లో టైపిస్టు, కానిస్టేబుల్ దౌర్జన్యం చేసి స్టేషన్లో కుర్చుండ బెట్టారని మాజీ జడ్పీటీసీ అంగులూరి అరుణ్కుమార్, అతని భార్య సుశీలరాణీ తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ఫిర్యాదు చేయగా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్టేషన్ నుంచి వదిలినట్టు అరుణ్కుమార్ వివరించారు. ఎస్సై కృష్ణమాచార్యులు సమక్షంలోనే ఈ సంఘటన జరిగినట్టు ఆయన తెలిపారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండడం, ఈనెల 17న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్జగన్మోçßæన్ రెడ్డి రాకకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఏర్పాట్లు చేస్తుండడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఈవిధంగా దాడులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఎటువంటి దాడులకు పాల్పడినా దివీస్ను ఏర్పాటు చేయబోనీయమని, అడ్డుకుంటామని పేర్కొన్నారు. కాగా స్వర్ణ, లోవతల్లి ఎడమ చేతులకు తీవ్రగాయాలవడంతో ప్రాధమిక చికిత్స చేసిన ఏరియా ఆస్పత్రి వైద్యులు ఎక్స్రే తీసిన తర్వాత పూర్తిస్థాయి వైద్యసేవలు అందించనున్నట్టు తెలిపారు. -
17న తూర్పుగోదావరిలో వైఎస్ జగన్ పర్యటన
కాకినాడ : ప్రతిపక్ష నేత, వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొండంగిలో ‘దివీస్’ వ్యతిరేక పోరాటానికి ఆయన ఈ సందర్భంగా మద్దతు తెలుపనున్నారు. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మంగళవారం వెల్లడించారు. దివీస్ ఉద్యమంలో గాయపడ్డ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతులు ఆ భూముల్లోకి ప్రవేశించి పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. దానవాయిపేట పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ప్రభుత్వం దివీస్ లేబొరేటరీస్కు 505 ఎకరాలు కేటాయించింది. ఇటీవల రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి కొంతమంది రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, గాలి, నీరు, నేల కలుషితమై తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు భూములిచ్చేది లేదంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా భూసేకరణకు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో స్థానికుల ఆందోళనలు, నిరసనలు ఉధృతం అయ్యాయి. దీంతో తొండంగి పరిసర ప్రాంత గ్రామాల్లో రెండున్నర నెలల క్రితం విధించిన 144వ సెక్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ దానవాయిపేటలో దివీస వ్యతికేక పోరాటకమిటీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సభలో పాల్గొనేందుకు వచ్చినవారిని పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసి, అరెస్ట్లు చేశారు. -
‘బాబు అరాచక పాలన సాగిస్తున్నారు’
కాకినాడ: ఏపీలో చంద్రబాబు అరాచక పాలనను సాగిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. కాకినాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న తమని అరెస్ట్ చేసిన సందర్భంగా పిడిగుద్దులు గుద్దిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివీస్కు వ్యతిరేకంగా మళ్లీ ఆ ప్రాంతంలో సభ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 15న సీపీఎం జాతీయ నేత రాఘవులు, 27న సీపీఎం ఎంపీల బృందం దివీస్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తుందని తెలిపారు. ఒక పక్క రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూతపడుతుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం కాలుష్య కారక పరిశ్రమలను తెచ్చి పెడుతుందని అన్నారు. టీడీపీ పాలనపై విసుగు చెందిన ప్రజలు.. గత ఆరు నెలలుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న చంద్రబాబు దాన్ని పక్కదారి పట్టించడం కోసమే విశాఖలో ప్రేమికుల రోజు జరిగే బీచ్ ఫెస్టివల్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. -
దానవాయిపేటలో ఉద్రిక్తత
తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న సీపీఎం సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేత మధుతో పాటు పలువురి అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులుకు, సీపీఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు పోలీసులపై ఇసుక చల్లడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. -
దివీస్కు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన
-
దివీస్ పరిశ్రమను తరలించాలి
కాకినాడ సిటీ : పర్యావరణానికి ముప్పు వాటిల్లేవిధంగా ఉన్న దివీస్ పరిశ్రమను తరలించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కోస్టల్ కారిడార్ మత్స్యకారుల సమావేశం జరిగింది. ముందుగా మధు మాట్లాడుతూ నవంబర్ 3న చలో దివిస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వామపక్షాలతో పాటు అన్ని రాజకీయపార్టీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దివిస్ పరిశ్రమ వలన వేలాది మంది మత్స్యకారులు రోడ్డున పడతారని, మరొకసారి ప్రజాభిసేకరణ జరగాలన్నారు. ఈ నెల 9న సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేష¯ŒS కల్పించాలని కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మధు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు నక్కా కిషోర్, నాయకులు తోకల ప్రసాద్, అంజిబాబు, మాదవస్వామి, సూరయ్య పాల్గొన్నారు. -
6వ తేదీలోగా కేసులు, 144 సెక్షన్ తొలగించాలి
బాధితుల తరఫున ఉద్యమిస్తాం బాధిత గ్రామాల్లో పర్యటించిన తుని ఎమ్మెల్యే రాజా తొండంగి : దివీస్ ల్యాబొరేటరీస్ ఏర్పాటును వ్యతిరేకించిన ఆ ప్రాంత మహిళలపై ప్రభుతం పెట్టిన అక్రమ కేసులను, ఇక్కడ విధించిన 144 సెక్షన్ నవంబర్ ఆరో తేదీలోగా ఎత్తివేయాలని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఎస్పీతో చర్చించామని, అవసరమైతే కలెక్టర్ను కూడా కలుస్తామని ఆయనన్నారు. దివీస్ ప్రతిపాదిత భూముల్లో రెవెన్యూ అధికారులు చెట్లను తొలగించిన నేపధ్యంలో అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాజా శనివారం పంపాదిపేట, కొత్తపాకలు గ్రామాల్లో పర్యటించారు.అక్కడి బాధిత రైతుల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాలుష్య పరిశ్రమ ఏర్పాటుకు తీరప్రాంత పేద రైతుల భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పోలీసులను చూసి ప్రజలు భయాందోళన చెందడమే గాకుండా శుభకార్యాలు చేసుకోవడానికి కూడా జంకుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలు సమావేశాలు కూడా నిర్వహించుకునే పరిస్థితి ఈగ్రామాల్లో ప్రస్తుతం లేదన్నారు. తమ భూముల్లోని పచ్చని చెట్లను అధికారులు అన్యాయంగా తొలగించారని అంతకుముందు రైతులు, మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు. -
దివీస్కు వ్యతిరేకంగా మహిళల పోరుబాటు
-
‘దివీస్’ అనుమతులు రద్దు చేయాలి
తుని : తీరప్రాంత ప్రజల జోవనోపాధికి హాని కలిగించే దివీస్ మందుల పరిశ్రమ మంజూరు చేసిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం రోడ్డులోని సాదీఖానాలో దివీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్), వ్యవసాయ కూలీ సంఘం, గిరిజన సంఘం, బాధిత గ్రామాలకు చెందిన పెద్దలు హాజరయ్యారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దువ్వా శేషు బాబ్జి మాట్లాడుతూ దానవాయిపేట పంచాయతీ పరిధిలో దివీస్ లాబొరిటీస్ నిర్మాణం చేపట్ట కూడదని హైకోర్టు స్టేటస్ కో జారీ చేసినా పట్టించుకోకుండా పనులు చేపడుతున్నారన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా కొనసాగిస్తున్న 144 సెక్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గం సభ్యుడు బుగతా బంగార్రావు, రాష్ట్ర రైతు కూలి సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దివీస్ పరిశ్రమను తరలించాలని ఈ నెలాఖరున సంతకాల సేరకణ చేపట్టి సీఎం, గవర్నర్లకు అందజేస్తామన్నారు. రెవెర్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. బాధిత గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మట్ల ముసలయ్య, తొండంగి మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీవిశ్వేశ్వరరావు ప్రజల కష్టాలను వివరించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేసుకట్ల సింహాచలం, రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి మాను లచ్చ బాబు, కె. జనార్దన్, రాపా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన సీపీఎం
కాకినాడ సిటీ : దివీస్ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివీస్ బాధిత గ్రామాల్లో ఒకటైన పంపాదిపేటలో ఈ నెల 6వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు సభ జరగకుండా అడ్డుకున్నారన్నారు. సెప్టెంబర్ 10l, 13, 22 తేదీల్లో ఏదో ఒకరోజు బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ను కోరామని, ఈ మూడు సందర్భాలలోను 144 సెక్షన్ అమలులో ఉన్నందున తాము బహిరంగసభకు అనుమతి ఇవ్వడంలేదని డీఎస్పీ తెలిపారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. -
యనమల ద్వయానికి ఘాతం
ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు దివీస్ భూ సేకరణపై హైకోర్టు స్టే టీడీపీకి మాజీ జెడ్పీటీసీ గుడ్బై జిల్లా ‘దేశం’లో చర్చనీయాంశమైన పరిణామాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : దివీస్ భూ సేకరణలో బుధవారం చోటుచేసుకున్న రెండు పరిణామాలతో తునిలో యనమల సోదర ద్వయానికి భంగపాటు ఎదురైంది. అధికారం చేతిలో ఉందని బరితెగించి పోలీసు బలప్రయోగంతో రైతుల నోళ్లు నొక్కే స్తూ దివీస్ రసాయన పరిశ్రమ యాజమాన్యం కొమ్ముకాస్తున్న వీరికి ఈ పరిణామాలు చెంపపెట్టు. తుని నియోజ కవర్గంలో యనమల సోదరుల అప్రజాస్వామిక వైఖరినీ, ధాష్టీకాన్నీ ‘సాక్షి’ అనేక కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దివీస్ పరిశ్రమకు అడ్డగోలుగా జరుపుతున్న భూ సేకరణను ఒకపక్క న్యాయస్థానం తప్పుపట్టగా, మరోవైపు మత్స్యకార నాయకుడు, మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశిఈశ్వరరావు టీడీపీకి గుడ్బై చెప్పారు. ఈ రెండు పరిణామాలు యనమల సోదరులకు తుని నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బే. బలవంతపు భూ సేకరణలో యనమల సోదరుల వ్యవహార శైలికి నిరసనగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పార్టీకి రాజీనామా చేయడం జిల్లా టీడీపీలో చర్చనీయాంశమైంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, అతనికి వరుసకు సోదరుడైన కృష్ణుడిని మూడు దశాబ్దాలపాటు అందలమెక్కిస్తే తమ గుండెలపై దివీస్ కుంపటి పెడుతున్నారని ఆ నియోజకవర్గంలో అట్టడుగు వర్గాలైన యాదవులు, మత్స్యకారులు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దివీస్ రసాయన పరిశ్రమకు 500 ఎకరాలు నిరుపేద రైతుల నుంచి బలవంతంగా లాగేసుకునేందుకు గడచిన నాలుగైదు నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలకు హైకోర్టు బుధవారం ముకుతాడు వేయడంతో సోదర ద్వయం కంగుతింది. జనంలో వ్యతిరేకత తొండంగి మండలం కొత్తపాకలు, పంపాదిపేట, శృంగవృక్షంపేట, తాటాకులపాలెం, ఒంటిమామిడి తదితర 13 గ్రామాల ప్రజలు దివీస్ బలవంతపు భూ సేకరణకు ప్రయత్నిస్తున్న తీరుపై ఇటీవల దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలో భారీ బహిరంగ సభ పెట్టి యనమల సోదరులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భూ సేకరణకు వ్యతిరేకంగా నాలుగైదు నెలలుగా జరుగుతున్న ఆందోళనలపై సోదరుల సిఫార్సులతో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించి గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించారు. 144 సెక్షన్ అమలు చేయడంతో ఆగకుండా అత్యవసర పరిస్థితిని తలపించేలా ప్రజల దైనందిన జీవనాన్ని కూడా నియంత్రించే పరిస్థితుల వెనుక యనమల సోదరుల పాత్రను స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. బీసీల్లోనూ ఈసడింపు 30 ఏళ్లు యనమల సోదరులు చెప్పినట్టే ఓట్లు వేస్తూ వచ్చినందుకు ఇప్పుడు సరైన గుణపాఠం చెప్పారంటూ దివీస్ బాధిత రైతులు మండిపడుతున్నారు. జీడితోటలు, కొబ్బరి తోటలు, సపోటా చెట్లు సాగుచేసుకుంటూ, 250 హేచరీల్లో పనిచేసుకుంటూ సుమారు 20వేల మంది బతుకు బండి లాగిస్తున్నారు. వారంతా అల్పాదాయ వర్గాలైన రైతులనే విషయాన్ని కూడా విస్మరించి బడా సంస్థలకు కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు యనమల సోదరులను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కాకినాడ ఎస్ఈజెడ్కు భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఇదే యనమల సోదరులు టీడీపీ అధికారంలోకి వచ్చాక దివీస్ కోసం 500 ఎకరాలు బలవంతపు భూ సేకరణకు కొమ్ముకాయడంతో అక్కడి బీసీ సామాజికవర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తునిలో పార్టీకి నష్టం ప్రాథమికంగా రూ.600 కోట్లతో ప్లాంట్ ప్రారంభించి భవిష్యత్లో దీనిని రూ.11వేల కోట్లతో విస్తరించాలనే ప్రయత్నాల్లో దివీస్ ఉంది. సేకరిస్తున్న 500 ఎకరాలలో 300 ఎకరాలు డి పట్టాభూములనే విషయం వారికి తెలియంది కాదంటున్నారు. సముద్రం ఒడ్డున ఇచ్చిన ఆ భూములను లాగేసుకోవాలనుకునే ప్రయత్నాలతో సొంత యాదవ సామాజికవర్గమే గుర్రుగా ఉంది. ఇటువంటి వ్యవహారశైలి కారణంగానే యనమల సోదరులకు రాజకీయంగా తునిలో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందని ఎదురుచూశామని, కానీ మార్పు కన్పించడం లేదని దివీస్కు వంత పాడటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. వారి వ్యవహార శైలితో పార్టీ తునిలో మరింత పతనమైపోతోందని జిల్లాలో టీడీపీ నేతల మధ్య చర్చ జరుగుతోంది. -
దివీస్ నిర్మాణం.. యథాతథ స్థితి కొనసాగించాలి
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న దివీస్ నిర్మాణంపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దివీస్ను నిర్మించొద్దంటూ గతకొంతకాలంగా అక్కడి స్థానికులు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దివీస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు కోర్టును ఆశ్రయించారు. దివీస్ పొల్యుషన్తో తాము తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్టు వారు కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన హైకోర్టు దివీస్ నిర్మాణం యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
దివీస్ కేసుల్లో నేతలకు బెయిల్
తొండంగి: కోన తీరప్రాంతంలో దివీస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ స్థాపనను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, సీపీఐ (ఎంఎల్) జనశక్తి పార్టీల నాయకులపై పోలీసులు పెట్టిన కేసుల్లో నలుగురికి మంగళవారం స్టేషన్ బెయిల్ మంజూరైంది. దివీస్ వ్యతిరేకిస్తున్న వారిపై అక్రమ కేసులు ఎత్తివేయడంతో పాటు కాలుష్య పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం.ఎల్.) లిబరేషన్ కేంద్రకమిటీæ సభ్యుడు బుగత బంగార్రాజు, జనశక్తి పార్టీ నాయకుడు కర్నాకుల వీరాంజేనేయులు తదితరుల ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి 43 మందిపై ఐపీసీ చట్ట సెక్షన్లు 143, 341, 353, 149 ప్రకారం పలు కేసులు నమోదు చేశారు. కాగా మంగళవారం బుగతా బంగార్రాజు, కర్నాకుల వీరాంజనేయులు, జనార్దన్, మానుకొండ లచ్చబాబులకు స్టేషన్ బెయిల్ మంజూరైంది. కేసులతో ఉద్యమాన్ని అణచి వేయలేరు బెయిల్పై వచ్చిన అనంతరం బంగార్రాజు, కర్నాకుల వీరాంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ కేసులతో ఉద్యమాన్ని అణచి వేయలేరన్నారు. అక్రమ కేసులకు బయపడేదిలేదని, దివీస్ను రద్దు చేసే వరకూ లిబరేషన్పార్టీలు, ఇతర కార్మిక సంఘాలు, వ్యవసాయకూలీ సంఘాల మద్దతుతో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న తమపైనా, బాధిత గ్రామాల ప్రజలపైన అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈనెల 19న ఇక్కడ జరుగుతున్న అన్యాయంపై తాము నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ను విజయవంతం చేయాలని వారు పిలుపు నిచ్చారు. -
దివీస్పై జనాగ్రహం
-
ఎగసిన ఉద్యమం
-
దివీస్పై జనాగ్రహం
నేతల అరెసై్టనా రోడ్డెక్కిన బాధిత గ్రామాల ప్రజలు పంపాదిపేట బీచ్రోడ్డుపై ఆందోళన దివీస్కు వ్యతిరేకంగా నినాదాలు ఆందోళనకారులపై పోలీసుల హుకుం పంపాదిపేటలో సభ జరగకుండా అడ్డుకున్న పోలీసులు సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్),ఐద్వా సంఘం మహిళలతో పాటు నేతల అరెస్టు తొండంగి / పిఠాపురం : కోన తీరంలో తలపెట్టిన దివీస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పంపాదిపేట బీచ్రోడ్డుపై బాధిత గ్రామాల ప్రజల ఆగ్రహం మరోసారి పెల్లుబికింది. కొద్ది రోజుల క్రితం దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోన తీర ప్రాంతంలో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన చే సిన సంగతి విదితమే. పంపాదిపేట వద్ద పోలీసుల అరెస్టు, లాఠీచార్జి సంఘటనల నేపధ్యంలో బాధిత గ్రామాల్లో పది రోజులపాటు విధించిన 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. బాధిత గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం పంపాదిపేటలో బహిరంగ సభ నిర్వహించేందుకు అఖిల పక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో మంగళవారం వివిధ పరిణామాలు చోటుచేసుకుని చివరకు బాధిత గ్రామాల ప్రజలు బీచ్రోడ్డుపై దివీస్కు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపించారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు... అఖిలపక్ష నేతలు ఇచ్చిన పిలుపు మేరకు సభ జరుగుతుందని భావించిన పోలీసులు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో సోమవారం రాత్రికే జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పోలీసులను ఒంటిమామిడి వద్దకు భారీ సంఖ్యలో తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నుంచే మండలంలోని నలువైపులా ప్రధాన రహదారుల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసి సభకు హాజరయ్యే వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. దీంతో తొండంగి ప్రధాన రహదారిలో ఏ.కొత్తపల్లి వద్ద, కృష్ణాపురం జంక్షన్ వద్ద, బీచ్రోడ్డులో తాటియాకులపాలెం, పెరుమాళ్లపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులను బందోబస్తు పెట్టారు. వచ్చీపోయేవాహనాలను తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ™ èlనిఖీల నేపధ్యంలో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఖాకీల దండుతో కోనప్రాంతం ఉలిక్కిపడింది. పంపాదిపేటలో నేతల బలవంతపు అరెస్టులు... దివీస్ వ్యతిరేకిత గ్రామాల ఆందోళనకు మద్దతుగా సభ నిర్వహించేందుకు పంపాదిపేట రామాలయం వద్దకు సీపీఎం, సీపీఐ (ఎం.ఎల్. లిబరేషన్), పి.వి.రావు మాలమహానాడు సంఘం, ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) నేతలతోపాటు బాధిత గ్రామాల ప్రజలు చేరుకున్నారు. అప్పటికే అడిషనల్ ఎస్పీ దామోదరం ఆధ్వర్యంలో అక్కడకు పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. రామాలయం వద్ద బహిరంగ సభ జరపడానికి అనుమతులు లేవని, సభ పెట్టడం కుదరదని డీఎస్పీ, సీఐలు చర్చలు జరిపారు. సభ నిర్వహణకు అనుమతి కోసం జిల్లా పోలీసులు అధికారులకు దరఖాస్తు చేశామని, తాము ఎటువంటి ఆందోళన చేయకుండా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సభను నిర్వహించుకుంటామని నేతలు వివరించారు. సుమారు గంట సేపు ఈచర్చలు, వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపధ్యంలో సభకు వచ్చిన ఐద్వా సంఘం మహిళా నేతలు, బాధిత గ్రామాల మహిళలు బైఠాయించి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘దివీస్ పరిశ్రమ తమకు వద్దంటూ’ ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, పి.వి.రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పండు అశోక్, సీపీఐ(ఎం.ఎల్.లిబరేషన్) జిల్లా కార్యదర్శి బుగతా బంగార్రాజు, సీపీఐ ఎంఎల్ తుని ఏరియా కోఆర్డినేటర్ శివకోటిరాజు, కె.జనార్ధన్, మాజీ జెడ్పీటీసీ అంగుళూరి అరుణ్కుమార్ తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల ఆందోళన తీవ్రతరం చేయడంతో మహిళలను జడపట్టుకుని లాగుతూ, వస్త్రాలను పట్టుకుని విచక్షణా రహితంగా లాగి వ్యానులోకి కుక్కారు. శాంతియుత వాతావరణంలో సభ నిర్వహించుకునేందుకు వస్తే పోలీసులు జులుం ప్రదర్శించి, దౌర్జన్యంగా తమను అదుపులోకి తీసుకున్నారంటూ ఉద్యమకారులు మండిపడ్డారు. ఈ సంఘటనలో ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్.రమణి, ఇతర సభ్యులు సుభాషిణి, ఇతర మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బండిపై వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శిపై దురుసుతనం సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ మహిళా కానిస్టబుల్ మధు చొక్కాను లాగడంతో స్కూటర్ అదుపు తప్పింది. కిందపడేలోగానే ఎలాగోలా బైక్ అదుపుచేసి నిలిపే లోపే మిగిలిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించారు. ఆయనతోపాటు సీపీఎం జిల్లా నాయకులు అప్పారెడ్డి, మరొకొంత మందిని అదుపులోకి తీసుకుని కాకినాడ పోలీసు స్టేషన్కు తరలించారు. పలువురి మందుస్తు అరెస్టులు... M సభకు హాజరయ్యేందుకు వస్తున్న పలువురిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. తునిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెటి ్టరాజాను, పెరుమాళ్లపురంలో సీఐటీయూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బీబీరాణి, ఏ.కొత్తపల్లిలో మాజీ ఎం.పీ హర్షకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. బీచ్రోడ్డుపై నిరసన గళాలు... పంపాదిపేట రామాలయం వద్ద బహిరంగ సభను జరగనివ్వకుండా పోలీసులు ముఖ్య నేతలను, మహిళా సంఘం నేతలతోపాటు ఇతర మహిళలను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇది జరిగిన గంటసేపటికి పాఠశాల భవనం సమీపంలో వీధుల్లో బాధిత గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. సీపీఎం అనుబంధ సం«స్ధ వ్యవసాయ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేపట్టిందని, ఇక్కడి రాజకీయ నాయకుల పోత్సాహంతోనే పరిశ్రమ ఏర్పాటు జరుతుందన్నారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా, హెచరీల్లో ఉపాధి పొందుతున్న యువతకు పత్నామ్నాయ ఉపాధి కల్పించకుండా అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారంతా పాదయాత్రగా సుమారు కిలోమీటరు వరకూ బీచ్రోడ్డు గుండా దివీస్ భూముల వరకూ వచ్చారు. అక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కాసేసు తోపులాట జరిగింది. నరసింహరావు కొంత అస్వస్ధతకు గురయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలంతా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈలోపుగా ఒంటిమామిడి, పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులను వ్యాన్లపై రప్పించి ఆందోళనకారులను చుట్టుముట్టారు. సుమారు మూడొందల మందికిపైగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. డీఎస్పీ రాజశేఖర్ ఆదేశాలతో నరసింహారావును పోలీసులు మోసుకుంటూ వాహనంలో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరో 20 మంది వరకూ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తీరంలో 144 సెక్షన్ను పోలీసులు కొనసాగిస్తున్నారు. మత్స్యకారుల నిరసన... శాంతియుతంగా పంపాదిపేటలో జరిగే బహిరంగ సభకు తమ మత్స్యకారులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ నర్సిపేటలో మత్స్యకారులు నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడు మేరుగు ఆనందహరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీలతోపాటు సుమారు రెండొందలమంది మత్స్యకారులు నిరసన తెలిపారు. అనంతరం కొందరి మత్స్యకారులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆందోళన చేస్తామని మత్స్యకార నాయకులు హెచ్చరించడంతో వారిని వదిలేశారు. -
దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా సీపీఎం పోరాటం
-
సీపీఎం నేతల అరెస్ట్
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పంపాజిపేట గ్రామం వద్ద నిర్మిస్తున్న దివీస్ ల్యాబొరేటరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు వెళుతున్న వామపక్షాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం బహిరంగసభకు వెళుతుండగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి. మధు, జిల్లా నేతలు, కార్యకర్తలను కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద పోలీసులు అరెస్టుచేసి అన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. తుని ఎమ్మెల్యే రాజా కూడా బహిరంగసభకు వెళుతున్నారని భావించిన వారు ఆయన కారును అడ్డుకున్నారు. అయితే తాను హైదరాబాద్ వెళుతున్నానని రాజా చెప్పడంతో రాజమండ్రి వరకూ పోలీసులు ఎస్కార్ట్గా వెళ్లి వదిలివచ్చారు. -
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
-
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
సీపీఎం బహిరంగ సభను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా సభకు మద్దతు తెలిపారన్న కారణాలతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పలువురు సీపీఎం నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దివీస్ భూసేకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ బహిరంగసభ నిర్వహించనుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ బహిరంగసభకు వైఎస్ఆర్ సీపీ, సీపీఐ, కొన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బహిరంగసభను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం పంపాదిపేట, తాటాకుపాలెం, కొత్తపాకుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. రైతులు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించారని సర్కారు చెబుతున్నా.. అందులో వాస్తవం లేదని, రైతులు ఈ భూసేకరణపై అయిష్టత చూపుతున్నారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. -
‘దివీస్’కు వ్యతిరేకంగా ఐక్యపోరాటం
రౌండ్టేబుల్ సమావేశంలోఅఖిలపక్ష నేతల తీర్మానం 6వ తేదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపు అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ అన్నవరం : తొండంగి మండలం పంపాదిపేట, కొత్తపాకలు గ్రామాల్లో దివీస్ ఔషధ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే దీనిని అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడతామని ప్రతినబూనారు. అన్నవరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) కేంద్ర కమిటీ నాయకులు బుగతా బంగార్రాజు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్టేబుల్ సమావేశానికి వైఎస్సార్సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుని నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ అరాచక పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. అమాయక ప్రజలను, రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనిని వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. దివీస్ పరిశ్రమ పెట్టే గ్రామాల్లో ప్రజలకన్నా పోలీసులే అధికంగా కనిపిస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దివీస్ పరిశ్రమ ఏర్పాటు కాకుండా అడ్డుకుని తీరతామని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ, ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా దివీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈ నెల ఆరో తేదీన పంపాదిపేటలో బహిరంగ సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. బాధిత గ్రామాల ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి టి.మధు మాట్లాడుతూ, బలవంతపు భూసేకరణను అడ్డుకుని తీరతామని అన్నారు. ఉద్యమకారులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు అధికారులు వంత పాడడం సరి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పాండురంగారావు మాట్లాడుతూ, కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు పి.నరసింహరావు, కార్యదర్శి అప్పారెడ్డి, జనశక్తి నాయకుడు కె.వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
దివీస్కు వ్యతిరేకంగా ఉద్యమం
-
దివీస్కు వ్యతిరేకంగా ఉద్యమం
-సీపీఎం నేతల అరెస్ట్ కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సీపీఎం మద్దతు తెలిపింది. దీంతో బుధవారం కొత్తపాకల వద్ద సీపీఎం ఏర్పాటు చేసిన సభను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. మధుతో పాటు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం నేత మధుతో పాటు 9 మందిని అన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. దివీస్కు వ్యతిరేకంగా నిర్వాసితులు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని , పోలీసులు చేసిన అరెస్టులు అన్యాయమని సీపీఎం నేతలు పేర్కొన్నారు. -
దివీస్ భూ సేకరణకు నిరసనగా 6న బహిరంగ సభ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తొండంగిలో అరెస్ట్ చేసి అన్నవరం పోలీస్స్టేషన్కు తరలించిన పోలీసులు అన్నవరం: దివీస్ పరిశ్రమ ఏర్పాటు కోసం బలవంతంగా భూసేకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ ఆరో తేదీన తొండంగి మండలం పంపాదిపేట లో రైతులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను పరామర్శించేందుకు మంగళవారం రాత్రి తొండంగి మండలం పంపాది పేట వెళ్లిన మధును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. బుధవారం ఆయనను తొండంగి నుంచి అన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలీసుల సహాయంతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వమని అన్నారు. ఆర్ధికశాఖామంత్రి యనమల రామకృష్ణుడి కనుసన్నల్లోనే భూసేకరణ జరుగుతోందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆరో తేదీన సభ నిర్వహించి తీరుతామని చెప్పారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కూడా రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారన్నారు. రైతులకు మద్దతు ఇవ్వాలని ఇతర ప్రజాసంఘాల వాళ్లను, రాజకీయపార్టీలను కూడా కోరుతున్నామన్నారు. సెజ్ భూముల్లో దివీస్ పెట్టుకోవచ్చు కదా... సెజ్ పేరుతో రైతుల వద్ద నుంచి సేకరించిన పది వేల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందని, దానిని ఎకరా రూ.80 లక్షలకు జీఎంఆర్ విక్రయిస్తోందని మధు గుర్తు చేశారు. ఆ భూముల్లో దివీస్ పరిశ్రమ పెట్టుకోవచ్చు కదా అని సూచించారు. పంపాదిపేట, తదితర గ్రామాల రైతుల భూములే అవసరమయ్యాయా అని ప్రశ్నించారు. సముద్ర తీరంలోని కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న 300 హేచరీలకు కూడా దివీస్ మందుల పరిశ్రమ వల్ల∙తీవ్ర నష్టం వాటిల్లుతుందని మధు అన్నారు. ముద్రగడ, పవన్ కల్యాణ్ కూడా మద్దతివ్వాలి... రైతుల ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా మద్దతివ్వాలని ఆయన కోరారు. సీపీఎం నేత మధు ను కలిసేందుకు పలువురు ప్రజాసంఘాల నాయకులు పోలీస్స్టేషన్కు వచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి. శేషు బాబ్జీ, అప్పారెడ్డి, మధు వెంట ఉన్నారు. తుని సీఐ బీ అప్పారావు , అన్నవరం ఎస్ఐ పార్ధసారధి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
చల్లారని ‘దివిస్’ సెగ
ఆందోళనల నేపథ్యంలో పలు గ్రామాల్లో 144 సెక్షన్ అమలు బాధిత గ్రామాల్లో పర్యటించిన వామపక్ష నేతల బృందం దళితుడిపై సీఐ దౌర్జన్యం చేశారంటూ కొత్తపాకల గ్రామస్తుల రిలే దీక్షలు ఉద్యమానికి మాలమహానాడు నేతల మద్దతు తీర ప్రాంతానికి నష్టదాయకంగా ఉందంటూ దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ దళితుడిని తుని రూరల్ సీఐ కులం పేరుతో దూషించి, కొట్టారని ఆరోపిస్తూ కొత్తపాకల గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, దీనికి మాల మహానాడు నేతలు మద్దతు పలకడంతో పరిస్థితి వేడెక్కుతోంది. ఆయా ఆందోళనల నేపథ్యంలో పలు గ్రామాల్లో పోలీసులు 144 సెక్ష¯Œæను విధించారు. తొండంగి : తీరప్రాంతంలో రైతులు, మత్స్యకారుల మనుగడ ప్రశ్నార్థమయ్యే దివీస్ పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి బుగతా బంగార్రాజు డిమాండ్ చేశారు. పంపాదిపేటలో పోలీసులు లాఠీచార్జి, ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బాధిత గ్రామాలను సీపీఐ ఏరియా కార్యదర్శి శివకోటి రాజు, సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) నాయకుడు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్ జనశక్తి) నాయకుడు కర్నాకుల వీరంజనేయులు, న్యూడెమోక్రసీ నేత వి.రామన్న, జనశక్తి నాయకుడు బి.రమేష్ తదితరులతో కలిసి కొత్తపాకల, తాటియాకులపాలెంల్లో సందర్శించారు. దళితుడిని కొట్టి, కులంపేరుతో దూషించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్తపాకల గ్రామంలో దళితులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. అనంతరం తాటియాకులపాలెంలో రైతులతో మాట్లాడారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా పోరాడుతామని స్పష్టం చేశారు. పోరాటంలో కేసులు సర్వసాధారణమని, అటువంటి వాటికి భయపడేదిలేదన్నారు. పరిశ్రమ వ్యతిరేకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, కొత్తపాకల గ్రామానికి చెందిన అప్పలరాజును కులంపేరుతో దూషించి కొట్టిన సీఐ చెన్నకేశవరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని దీక్షలు తొండంగి : పంపాదిపేటలో పోలీసులు లాఠీచార్జి సంఘటన సందర్భంగా కొత్తపాకల గ్రామానికి చెందిన దళితుడిని గాయపరిచి, కులంపేరుతో దూషించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుపై చర్యలు తీసుకోవాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బీఎన్ రాజు డిమాండ్ చేశారు. సోమవారం పంపాదిపేటలో జరిగిన సంఘటనలో కొత్తపాలకు చెందిన అప్పలరాజును కులంపేరుతో దూషించి, లాఠీతో కొట్టారని ఆరోపిస్తూ గ్రామస్తులు మంగళవారం నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు రాజు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితునిపై సీఐ దాడి చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై బుధవారం ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసి, దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. -
లాఠీ..చార్జ్
పంపాదిపేటవాసులపై విరుచుకుపడిన పోలీసులు ‘దివీస్’ పనులను అడ్డుకున్నవారి అరెస్టుకు యత్నం దొరికినవారిని దొరికినట్టు చితకబాదిన వైనం ప్రతిఘటించిన బాధిత ప్రజలు పలువురికి తీవ్ర గాయాలు సామాన్యులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు పాలకుల ఒత్తిడితో కర్కశత్వాన్ని ప్రదర్శించారు. తొండంగి మండలంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ ల్యాబొరేటరీస్ రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించిన పంపాదిపేట వాసులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీనిని ప్రతిఘటించిన గ్రామస్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ లాఠీచార్జిలో సుమారు పదిమంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు తుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత ప్రజలకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మద్దతు తెలిపారు. తుని/తొండంగి : ప్రజల మనోగతానికి భిన్నంగా ప్రభుత్వం మొండి పట్టుదలతో దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటుకు చేస్తున్న యత్నాలు.. తొండంగి మండలం కోన ప్రాంతంలో ఆరని చిచ్చు రగిలిస్తున్నాయి. పంపాదిపేట సమీపాన దివీస్ లేబ్స్ చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులను ఆ గ్రామంతో పాటు తాటియాకులపాలెం, కొత్తపాకలు గ్రామస్తులు ఆదివారం ప్రతిఘటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు మరో 23 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పంపాదిపేటలో ఉద్యమిస్తున్న వారిలో ప్రధానమైనవారిని లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేసేందుకు పోలీసులు సోమవారం ప్రయత్నించడం మరోమారు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు చేసిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. తొలుత తుని పట్టణ సీఐ అప్పారావు, రూరల్ సీఐ చెన్న కేశవరావు, తొండంగి, కోటనందూరు, తుని రూరల్ ఎస్సైలతోపాటు అధిక సంఖ్యలో పోలీసులు హఠాత్తుగా పంపాదిపేట చేరుకున్నారు. గ్రామంలో దొరికినవారిని దొరికినట్టు లాక్కొచ్చి జీపులు, వ్యానుల్లో ఎక్కించారు. దీనిని ప్రతిఘటించినవారిపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. మహిళలని కూడా చూడకుండా చితకబాదడంతో పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలో నేమాల లోవరాజు, మట్ల రామకృష్ణ, కుమ్మరి లక్ష్మి, తలపంటి మణితల్లి, మరికొందరిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. రోడ్డుపై బైఠాయించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీనికి ససేమిరా అన్న గ్రాస్తులు జీపులో ఎక్కించినవారిని తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పంపాదిపేట ప్రజలతో చర్చించారు. సమస్యను పక్కతోవ పట్టించేం దుకు పోలీసుల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని, సంయమనం పాటించాలని చెప్పారు. తమకు వివాదం పోలీసులతో కాదని, పరిశ్రమ యాజమాన్యానికి, పేద రైతులకు మధ్య వచ్చిన భూముల తగాదాను శాంతిభద్రతల సమస్యగా సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు శాంతించారు. దివీస్ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి పనులు జరిగినా ప్రతిఘటిస్తామని, పరిశ్రమ తరలిపోయేవరకూ ఊరుకునేది లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలతో కొట్టించడం అన్యాయమని బాధితులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. గాయపడినవారిని ఎమ్మెల్యే తన వాహనంలో తుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యొద్దు అమాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని పెద్దాపురం డీఎస్పీ రాజేశ్వరరావుకు ఎమ్మెల్యే రాజా సూచించారు. అక్రమ అరెస్టులకు పాల్పడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అది ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ తొండంగి మండల నాయకులు పేకేటి సూరిబాబు, మద్దుకూరి వెంకటరామయ్య చౌదరి, మేరుగు ఆనందహరి, యనమల వరహాలు, జిల్లా కమిటీ సభ్యుడు పేకేటి రాజేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బీఎన్ రాజు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ శివకోటి ప్రకాష్ తదితరులున్నారు. దళితులపై దాడులను సహించేది లేదు దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలపై పోలీసులు దాడి చేయడం అన్యాయమని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బీఎన్ రాజు అన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తే జిల్లావ్యాప్తంగా దళితులంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. లాఠీలతో కొట్టి లాక్కెళ్లారు పోలీసులు ఒక్కసారిగా గ్రామంలోకి వచ్చి దొరికినవారిని దొరికినట్టు లాక్కెళ్లారు. నా వీపుపై తీవ్ర గాయాలయ్యేలా కొట్టారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు కొట్టడం అన్యాయం. మమ్మల్ని ఏం చేసినా సరే పరిశ్రమను పెట్టనిచ్చేదిలేదు. – మచ్చర్ల మాణిక్యం, పంపాదిపేట దారుణం గ్రామంలో ఎప్పుడూ ఇంత దారుణం జరగలేదు. అంతమంది పోలీసులు వచ్చి గ్రామస్తులను లాక్కెళ్లారు. నన్ను కొట్టి లాక్కెళ్తుండగా మెడలో బంగారు వస్తువులు కూడా పోయాయి. ఏం నేరం చేశామని మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు? – మచ్చర్ల వెంకటలక్ష్మి, పంపాదిపేట -
పంపాదిపేటలో ఉద్రిక్తత
తొండంగి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన పంపాదిపేట వాసులను అరెస్ట్ చేయడానికి ఇవాళ పోలీసులు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. -
ఆగ్రహ జ్వాల
దివీస్ ల్యాబ్ పనులను అడ్డుకున్న రైతులు పాక ఏర్పాటుకు వేసిన స్తంభాల తొలగింపు తుని ఎమ్మెల్యే మద్దతు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్న దాడిశెట్టి రాజా రూ.350 కోట్లు మిగుల్చుకునేందుకే ఈ కుట్ర అని వెల్లడి సెజ్ ఖాళీ భూములకు బదులు రైతుల భూములు ఇవ్వడమేమిటని నిలదీత తొండంగి : తొండంగి మండలం కోన తీరప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ పనులను పరిసర గ్రామాల రైతులు అడ్డుకున్నారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు తమ భూములివ్వడానికి నిరాకరించారు. ఆ భూముల్లో బలవంతంగా పాకలు వేసేందుకు చేసిన యత్నాలను ఆదివారం అడ్డుకున్నారు. పాక వేసేందుకు ఏర్పాటు చేసిన స్తంభాలను తొలగించారు. ఆగ్రహంతో తాటాకులను దగ్ధం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి పనులనూ జరగనివ్వబోమని నినదించారు. వారికి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పూర్తి మద్దతు తెలిపారు. అంతకుముందు పంపాదిపేటలో జరిగిన సభలో బాధిత రైతులు, మహిళలు తమ సమస్యలను ఆయనకు వివరించారు. దివీస్ పరిశ్రమ ప్రతినిధులు తమ భూముల్లో పనులు ప్రారంభించారని తెలిపారు. దీంతో ఆ మూడు గ్రామాల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే రాజా, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, సీనియర్ నాయకులు పేకేటి సూరిబాబు, యనమల వరహాలు, జిల్లా కమిటీ సభ్యుడు పేకేటి రాజేష్, సొసైటీ డైరెక్టర్ అంబుజాలపు సత్యనారాయణ తదితరులు దివీస్ పనులు జరుగుతున్న భూములను పరిశీలించారు. అక్కడ చెట్టు నరుకుతున్న కూలీలతో ఎమ్మెల్యే చర్చించారు. పనులు నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా తాటియాకులపాలెం రైతు నేమాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తన భూమిలో బలవంతంగా పాకలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజాకు వివరించారు. దీనిపై ఆగ్రహించిన బాధిత రైతులు, మహిళలు పాక ఏర్పాటుకు వేసిన స్తంభాలను తొలగించారు. తాటాకులను, దూలాలను తగులబెట్టారు. కాలుష్య పరిశ్రమ తరలేవరకూ పోరాటం పంపాదిపేటలో జరిగిన సభలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, తీరప్రాంత రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని, కాలుష్య పరిశ్రమ తరలిపోయే వరకూ రైతుల పక్షాన పోరాడతానని భరోసా ఇచ్చారు. అమాయక రైతుల వద్ద భూములను అప్పనంగా కొట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. దివీస్ ల్యాబ్్సకు ఫలానా ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదన్నారు. కానీ చౌకగా భూములు ఇప్పించేందుకు ఈ పరిశ్రమ కుంపటిని ఈ ప్రాంత అధికార పార్టీ నేతలు తెచ్చిపెట్టారన్నారు. ‘‘సెజ్ పేరుతో యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో వేలాది ఎకరాలు సేకరించారు. ఖాళీగా ఉన్న ఆ భూములను దివీస్కు ఎందుకు కేటాయించలేదు? చిన్న, సన్నకారు రైతులకు చెందిన సుమారు 505 ఎకరాల కోన భూములను కేటాయించడం వారికి పూర్తిగా అన్యాయం చేయడమే. సెజ్లో ఎకరాకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల చొప్పున చెల్లించి భూములు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ దివీస్ యాజమాన్యం ఖర్చు చేయాలి. కానీ అలా చేయకుండా ఎకరా రూ.5 లక్షలకే లాక్కొని పేదలైన కోన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. పొరుగున ఉన్న విశాఖ జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటుకు జరిగిన చర్చల్లో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇప్పిస్తామని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రకటించారు. దీనికి అక్కడి రైతులు అంగీకరించకపోవడంతో రూ.24 లక్షలు ఇప్పిస్తానని చెప్పారు. అయినా భూములు ఇచ్చేందుకు రైతులు సమ్మతించలేదు. ఆ భూములకంటే సారవంతమైన కోన భూములను ఎకరాకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చి సేకరించాలని చూడడం పూర్తిగా అన్యాయం’’ అని ఎమ్మెల్యే వివరించారు. ఈ కాలుష్య పరిశ్రమవల్ల తరతరాల నుంచి ఇక్కడ జీవిస్తున్న ప్రజలు భూములను వదిలి పూర్తిగా వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తుందని, పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యంతో జన్మించే ప్రమాదం ఉంటుందని అన్నారు. గాలి, నీరు, నేల కలుషితమయ్యే పరిశ్రమలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటికే పలు కేసులు పెట్టారని.. అధికార బలంతో ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. -
దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వాకదారిపేటలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఏర్పాటు చేయనున్న దివిస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ.. గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తమ గోడు వినిపించుకోకుండా.. పరిశ్రమ నిర్మాణం చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆగ్రహించిన గ్రామస్థులు పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలంలో ఉన్న గుడిసెలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. -
దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన
-
దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వాకదారిపేటలో ఏర్పాటు చేయనున్న దివీస్ ల్యాబొరేటరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. గ్రామస్థులు ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. తమ గోడు వినకుండా.. పరిశ్రమ నిర్మాణం చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రామస్థులు హెచ్చరించారు. పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలంలో ఉన్న గుడిసెలకు కొందరు మహిళలు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మద్దతు తెలిపారు. దివీస్ ల్యాబొరేటరీ ఏర్పాటును నిలిపివేయాలని రాజా డిమాండ్ చేశారు. -
దివీస్ లేబోరేటరీస్ వద్ద ఆందోళన
భీమిలి: విశాఖ జిల్లా భీమిలి మండలం సిటీ నగర్లోని దివిస్ లేబొరేటరీస్ పరిశ్రమ ముందు కంచేరుపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. దివిస్ లేబోరేటరీస్ ఇక్కడ మూడో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో భీమిలి పంచాయతీ పరిధిలోని కంచేరుపాలెం గ్రామాన్ని ఖాళీ చేయాలని స్థానికులను కంపెనీ కోరుతోంది. ఒక్కో ఇంటికి పరిహారంగా రూ. 27 లక్షలు ఇస్తామని మధ్యవర్తులుగా టీడీపీ నాయకులను రంగంలోకి దింపింది. అయితే, తాము ఖాళీ చేసేది లేదంటూ గ్రామంలోని 200 కుటుంబాల వారు సోమవారం దివిస్ పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కంపెనీ వాహనాలను అడ్డుకున్నారు. కంపెనీకి చెందిన రెండు యూనిట్లతో ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయని, మూడో యూనిట్ వస్తే తాము ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు మండిపడ్డారు. -
సైక్లింగ్ చేస్తూ కుప్పకూలిన దివీస్ జీఎం
తగరపువలస, న్యూస్లైన్: సైక్లింగ్కు వెళ్లిన దివీస్ జీఎం గుండెపోటుతో మృతి చెందారు. పర్యావరణ అవగాహనలో భాగంగా చిప్పాడ దివీస్ లేబొరేటరీ యాజమాన్యం ఆదివారం విశాఖ నుంచి పూసపాటిరేగ వరకు సైక్లింగ్ కార్యక్రమం చేపట్టింది. కంపెనీ జనరల్ మేనేజర్ దివి సత్యచంద్ర(46) సహచరులు, సిబ్బందితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. గమ్యస్థానం పూసపాటిరేగ చేరుకొని విశ్రమించే క్రమంలో సత్యచంద్ర గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈయన కంపెనీ ప్రారంభం నుంచి చిప్పాడ యూనిట్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. -
సైక్లింగ్ చేస్తూ కుప్పకూలిన దివీస్ జీఎం
తగరపువలస, న్యూస్లైన్: సైక్లింగ్కు వెళ్లిన దివీస్ జీఎం గుండెపోటుతో మృతి చెందారు. పర్యావరణ అవగాహనలో భాగంగా చిప్పాడ దివీస్ లేబొరేటరీ యాజమాన్యం ఆదివారం విశాఖ నుంచి పూసపాటిరేగ వరకు సైక్లింగ్ కార్యక్రమం చేపట్టింది. కంపెనీ జనరల్ మేనేజర్ దివి సత్యచంద్ర(46) సహచరులు, సిబ్బందితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. గమ్యస్థానం పూసపాటిరేగ చేరుకొని విశ్రమించే క్రమంలో సత్యచంద్ర గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈయన కంపెనీ ప్రారంభం నుంచి చిప్పాడ యూనిట్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. -
సైక్లింగ్ చేస్తూ కుప్పకూలిన దివీస్ జీఎం
తగరపువలస, న్యూస్లైన్: సైక్లింగ్కు వెళ్లిన దివీస్ జీఎం గుండెపోటుతో మృతి చెందారు. పర్యావరణ అవగాహనలో భాగంగా చిప్పాడ దివీస్ లేబొరేటరీ యాజమాన్యం ఆదివారం విశాఖ నుంచి పూసపాటిరేగ వరకు సైక్లింగ్ కార్యక్రమం చేపట్టింది. కంపెనీ జనరల్ మేనేజర్ దివి సత్యచంద్ర(46) సహచరులు, సిబ్బందితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. గమ్యస్థానం పూసపాటిరేగ చేరుకొని విశ్రమించే క్రమంలో సత్యచంద్ర గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈయన కంపెనీ ప్రారంభం నుంచి చిప్పాడ యూనిట్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు.