Electrical works
-
కరెంటు మీటరులో ఏదైనా సమస్య ఉందా.. బహుశా మీక్కూడా ఇలా జరుగుతుందేమో..!?
సాక్షి, కరీంనగర్: విద్యుత్శాఖలో మీటర్ల దందా నడుస్తోంది. వినియోగదారులకు తెలియకుండానే మీటర్లను ఇతర ప్రాంతాలకు మార్చుతూ కనెక్షన్ ఇస్తూ లైన్మెన్లు మాయాజాలానికి పాల్పడుతున్నారు. ఇది తెలిసిన ఉన్నతాధికారులు మామూలుగా తీసుకుంటూ మెమోలతో సరిపెడుతున్నారు. ఇటీవల టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఆఫీసు పరిధిలోని చిగురుమామిడి సెక్షన్న్లో చోటు చేసుకున్న ఓ సంఘటన కరీంనగర్ రూరల్ డీఈకి వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిగురుమామిడి నివాసి అయిన సీహెచ్.రమేశ్కు చెందిన సర్వీసు నంబరు 3560ను అతని అనుమతి లేకుండానే అదే గ్రామంలో వేరొకచోట అమర్చారు. పంక్చర్ దుకాణానికి చెందిన కేటగిరి–2 మీటర్ను వేరే దుకాణంలో వినియోగదారుడి ప్రమేయం లేకుండా అమర్చడం వివాదాస్పదంగా మారింది. ఇది గమనించిన వినియోగదారుడు తన మీటర్ను ఇతరులకు ఎలా అమర్చారని లైన్మెన్పై కరీంనగర్ రూరల్ డీఈకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన డీఈ సదరు లైన్మెన్కు మెమోజారీ చేశారు. లైన్మెన్ సదరు వినియోగదారుడి మీటర్ను యధాస్థానంలో అమర్చేందుకు అంగీకరించాడు. ఇందుకుగాను అధికారులకు ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోవాలంటూ వినియోగదారుడి నుంచి సంతకం తీసుకుని, మీటర్ను మార్చకుండా రేపు..మాపు అంటూ జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ సర్వీసుపై బిల్లు బకాయి ఉందని, కేసు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి మీటర్ల దందా సర్కిల్ పరిధిలో అనేక చోట్ల కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. కరీంనగర్లో సైతం విద్యుత్ మీటర్లు ఒకచోట..ఇంటి నంబర్లు మరోచోట ఉన్నట్లు సమాచారం. కొంతమంది లైన్మెన్లు చేస్తున్న తప్పిదాలతో విద్యుత్ శాఖలోని సిబ్బందికి అపవాదు వస్తోందని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెమో జారీ చేశాం.. చిగురుమామిడికి చెందిన రమేశ్ బిల్లు కట్టకపోవడంతో లైన్మెన్ విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అయితే ఈ సర్వీసును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్ చేశాడని వినియోగదారుడు కరీంనగర్ రూరల్ డీఈకి ఫిర్యాదు చేశాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా సర్వీసు వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసినట్లు తేలింది. వినియోగదారుడి అనుమతి లేకుండా లైన్మెన్ సర్వీసును షిఫ్ట్ చేయడం తప్పుగా భావించి ఉన్నతాధికారుల సూచన మేరకు లైన్మెన్కు మెమో జారీ చేసి విచారణ చేపడుతున్నాం. అయినప్పటికీ లైన్మెన్, వినియోగదారుడు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. – ప్రకాశ్, ఏఈ, చిగురుమామిడి -
వీరి సంపాదన నెలకు రూ.90 వేలకుపైనే.. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలులోని మద్దూర్ నగర్కు చెందిన షఫీ 1997లో ఐటీఐ పూర్తి చేసి ఆ తర్వాత ఎలక్ట్రీషియన్గా స్థిరపడ్డాడు. అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పెద్ద ఆస్పత్రులకు ఎలక్ట్రికల్ వర్క్ కాంట్రాక్టుకు తీసుకుని బాగానే సంపాదిస్తున్నాడు. తనవద్ద ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న ఎంతోమంది కూడా సొంతంగా జీవనం సాగిస్తున్నారు. కానీ రెండు, మూడేళ్లుగా అతనికి ఎలక్ట్రీషియన్లు దొరకడం లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి మూడు బ్యాచ్లుగా పిలిపించుకుని వారితో పనిచేయిస్తున్నాడు. కారణం పనిచేసేవారు మన వద్ద క్రమంగా తగ్గిపోతుండటమే. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం! పట్టణీకరణ భారీగా పెరుగుతోంది. ఆస్పత్రులు, బ్యాంకులు, అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్తో పాటు నిర్మాణరంగంలో అభివృద్ధి జరుగుతోంది. కానీ వర్కర్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో భవన నిర్మాణ కార్మికులతో పాటు ఎలక్ట్రీషియన్లు, శానిటేషన్ వర్కర్లను(ఫిట్టర్లు) కూడా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ నుంచి తెప్పించుకుని పనులు చేస్తున్నారు. పై రెండు ఉదాహరణలు పరిశీలిస్తే ‘స్కిల్డ్ వర్కర్ల’ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కువ శాతం మంది విద్యార్థులు సూపర్ విజన్ జాబ్ల దిశగా అడుగులేస్తూ పని నేర్చుకునే ఐటీఐని పక్కన పడేస్తుండటం ఆందోళనకరం. గమనించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నియోజకవర్గానికో స్కిల్హబ్ ఏర్పాటు చేసి, వృత్తివిద్య పూర్తిచేసిన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా తీసుకుంది. టెక్నాలజీ విప్లవం వచ్చిన తర్వాత అధిక శాతం మంది స్మార్ట్ లైఫ్కు అలవాటుపడ్డారు. శారరీక శ్రమ లేని ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులు కూడా కోర్సులు ఎంపిక చేసుకుంటున్నారు. ‘మేం కష్టపడ్డాం. మా పిల్లలు అలా కాకూడదు. సుఖంగా బతకాలి’ అనే ధోరణితో తల్లిదండ్రులు వారి పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంబీఏ, ఎంసీఏ లాంటి చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఈ విభాగాల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడనివారు కొందరైతే, మంచి చదువులు అభ్యసించి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నవారి సంఖ్య ఎక్కువే. దీనికి కారణం బీటెక్, ఎంబీఏ, ఎంసీఏలు ‘సూపర్వైజింగ్’ ఉద్యోగాలు. దేశంలో ప్రభుత్వరంగం కంటే ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ప్రైవేటు కంపెనీలు ‘స్కిల్డ్ వర్కర్ల’నే రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఐటీఐ, డిప్లొమో చదివిన వారివైపు మక్కువ చూపుతున్నాయి. దీనికి కారణం ఈ విభాగాల్లోని వారు శారీరక శ్రమతో పనిచేయాలి. ఐటీఐలో 71.08 శాతం తక్కువ అడ్మిషన్లు ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెకానికల్ రంగాల్లో ఎక్కువగా ఐటీఐ చదివిన విద్యార్థులు ఉంటారు. కొంతకాలంగా ఐటీఐ చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికి కారణం ఈ చదువులు చదివితే వర్కర్లుగా పనిచేయాలి. ఇంజినీరింగ్ లాంటి చదువులు చదివితే కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగం చేయొచ్చనే దృక్పథం విద్యార్థుల్లో ఉండటమే. గత ఐదేళ్ల ఐటీఐ అడ్మిషన్లు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2018లో అందుబాటులో ఉన్న సీట్ల కంటే 23 శాతం తక్కువగా అడ్మిషన్లు నమోదైతే, 2019లో 28 శాతం, 2020లో 40.76 శాతం, 2021లో 39.76 శాతం తక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం 2022లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏకంగా 71.08 శాతం తక్కువగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలోని 17 ఐటీఐ కాలేజీల్లో 2012 సీట్లు ఉంటే కేవలం 713 మాత్రమే భర్తీ అయ్యాయి. నంద్యాల జిల్లాలో 21 కాలేజీల్లో 2,924 సీట్లు ఉంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 714 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే నంద్యాల జిల్లాలో 75.58 శాతం తక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయి. దీన్నిబట్టే ఐటీఐ చదువులపై విద్యార్థులు మక్కువ చూపడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే.. ఐటీఐ, డిప్లొమో చదువులు పూర్తి చేసిన స్కిల్డ్ వర్కర్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రులు, బ్యాంకులు, రియల్ ఎస్టేట్తో పాటు నిర్మాణరంగంలో స్కిల్డ్ వర్కర్ల అవసరం భారీగా ఉండబోతోంది. ఎన్ఎస్డీసీ(నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లోనే వచ్చే నాలుగేళ్లలో 41.41 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల అవసరం ఉండబోతోంది. అయితే ఏడాదికి 2.85 లక్షల మందే అందుబాటులో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా కియా, హుండాయి, మారుతి, హరీ మోటార్స్ లాంటి ఆటోమొబైల్తో పాటు అన్ని రంగాల్లో కూడా ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో నిపుణులైన వారికి ఉద్యోగ అవకాశాలున్నాయి. కారు, బైక్ మెకానిక్, నిర్మాణరంగంలో ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఇటీవల ఈ రంగాల్లో పని నేర్చుకునే ఆసక్తి తగ్గుతోంది. మెకానిక్ నుంచి ఎలక్ట్రికల్, ఫిట్టర్ల వరకూ అసిస్టెంట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎలక్ట్రిషియన్ ఒక ఇంటికి కరెంట్ పని చేస్తే 2–4 రోజుల్లో పూర్తవుతుంది. దీనికి రూ.15 వేల నుంచి రూ. 20 వేలు తీసుకుంటున్నారు. నెలలకు కనీసం 5 కొత్త ఇళ్లకు ఎలక్రికల్ పని చేస్తే రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. బైక్ మెకానిక్, ఫిట్టర్లు కూడా రోజూ కనీసం రూ.3వేలు తక్కువ లేకుండా సంపాదిస్తారు. అంటే వీరి సంపాదన కూడా నెలకు రూ.90 వేలకుపైనే. స్కిల్ డెవలప్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి విద్యార్థుల్లో వృతినైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. జిల్లాలో స్కిల్డెవలప్మెంట్ కాలేజీ నిర్మిస్తోంది. రెండు జిల్లాల్లో 14 నియోజకవర్గాల్లో స్కిల్హబ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 5 హబ్లు ఏర్పాటు చేశారు. పది, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు 45 రోజుల నుంచి 60 రోజులు పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చదువు మధ్యలోనే ఆపేసినవారు, నిరుద్యోగులు ఇక్కడ ‘స్కిల్’ మెరుగుపరుచుకుని ఉద్యోగం సంపాదించొచ్చు. నియోజకవర్గానికి ఒక స్కిల్హబ్ ఏర్పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్నూలు, ఎమ్మిగనూరులో రెండు సెంటర్లలో శిక్షణ ఇస్తున్నాం. డిగ్రీ, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వేర్వేరుగా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ తర్వాత వీరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. 24/7, వెబ్బ్లెండర్స్ లాంటి కంపెనీలతో సంప్రదింపులు జరిపాం. శిక్షణ పూర్తికాగానే ప్లేస్మెంట్లు ఇస్తాం. – శ్రీకాంత్రెడ్డి, జిల్లా మేనేజర్, స్కిల్డెవలప్మెంట్ -
Hyderabad Rains: సరిలేరు నీకెవ్వరూ!
సాక్షి, హైదరాబాద్: చలిగాలులు, చిటపట కురిసే వాన జల్లుల మధ్య ఎవరైనా గజగజ వణుకుతారు. ఇంటి పట్టున వెచ్చగా ఉండటమే మంచిదనుకుంటారు. కానీ.. ఈ విద్యుత్ సిబ్బంది మాత్రం తమ విధ్యుక్త ధర్మాన్ని తూచ తప్పకుండా నిర్వర్తించి ఔరా.. అనిపించారు. మంగళవారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్లలో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–7లో స్తంభంపై మంటలు వస్తున్నాయంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది రెయిన్కోట్లు ధరించి వర్షంలోనే స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేపట్టారు. జోరు వానలోనూ తమ కర్తవ్యాన్ని నిక్కచ్చిగా నిర్వర్తించిన సిబ్బందిని బస్తీవాసులు అభినందించారు. చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ? -
హమ్మ తొండా.. ఎంత పనిచేశావే!
వజ్రపుకొత్తూరు రూరల్: బుధవారం ఉదయం 8.30 గంటల సమయం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని 15 గ్రామాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండ వేడి ఓ వైపు.. ఉక్కపోత మరోవైపు.. వెంటనే పలువురు వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సమాచారమిచ్చారు. తమవైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోవడంతో.. ఐదుగురు లైన్మెన్లు, సచివాలయ విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగి లైన్లను తనిఖీ చేయడం ప్రారంభించారు. గంట సమయం గడిచినా సమస్య ఏంటనేది మాత్రం తేలలేదు. కిడిసింగి గ్రామం నుంచి మొదలైన వీరి అన్వేషణ డోకులపాడు వరకు సాగింది. చివరకు రెండున్నర గంటల తర్వాత డోకులపాడులోని చర్చి వద్దనున్న స్తంభంపైన అసలు విషయం బయటపడింది. తీగల మధ్య ఓ తొండ చిక్కుకుపోవడాన్ని గుర్తించిన సిబ్బంది.. దాన్ని తొలగించి సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయం తెలసుకున్న స్థానికులు ‘హమ్మ తొండా.. ఎంత పని చేశావే!’ అంటూ నవ్వుకున్నారు. -
మన్నవరంలో సోలార్ ఉపకరణాల తయారీ
సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలను నిజంచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్తో కలిసి 750 ఎకరాల్లో ఈ యూనిట్ ఏర్పాటుకు అంకురార్పణ చేయగా ఆయన మరణానంతరం అది అటకెక్కింది. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కార్ మన్నవరంలో సోలార్ వంటి పునరుత్పాదక విద్యుత్కు సంబంధించిన ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేస్తోంది. అలాగే, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పునరుత్పాదక ఇంధన ఉపకరణాల దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు మాన్యుఫాక్చరింగ్ జోన్స్ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు ఇష్టమైన రాష్ట్రాలు, భాగస్వామ్య కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లను పిలిచింది. వీటిలో.. ఇప్పటికే ఉన్న రెండు విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాలను (బ్రౌన్ఫీల్డ్) సోలార్ ఉపకరణాల యూనిట్లుగా మార్చడంతోపాటు వీటికి అదనంగా మరో గ్రీన్ఫీల్డ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో.. బ్రౌన్ఫీల్డ్ విభాగంలో మన్నవరాన్ని అభివృద్ధిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఒక్కొక్కటి రూ.1,000 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్లలో రూ.400 కోట్లు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ (సీఐఎఫ్), కామన్ టెస్టింగ్ ఫెసిలిటీ (సీటీఎఫ్)లకు గ్రాంట్ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కానీ, భాగస్వామ్య కంపెనీలుగానీ ముందుకు రావచ్చని, ఆసక్తి కలిగిన సంస్థలు మే 4లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరింది. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. ఇక మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రం కోసం నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి భూములను కేటాయించారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కానీ, ఒక్కసారిగా థర్మల్ విద్యుత్కు డిమాండ్ తగ్గడంతో ఈ కేంద్రం నామమాత్రంగా ఉండిపోయింది. అనంతరం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి మన్నవరంలో భారీ ఉపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటుచేసే నిమిత్తం కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపారు. అలాగే, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నవంబర్ 11, 2021లో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ను కలిసి పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీం కింద మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ ఏడాది జనవరిలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ప్రతిపాదిత మూడు విద్యుత్ ఉపకరణ తయారీ కేంద్రాల్లో ఒకటిగా మన్నవరాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం మూడు పునరుత్పాదక విద్యుత్ పరికరాల యూనిట్లను ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తుండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుందని ఏపీఐఐసీ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్కు కేటాయించారని.. దీన్ని ఏ విధంగా భాగస్వామ్య కంపెనీగా ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలించి బిడ్డింగ్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. -
విద్యుత్ సేవల్లో విఫలమైతే జరిమానా
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలు ఇక నుంచి మరింత జవాబుదారీతనంతో వ్యవహరించనున్నాయి. వినియోగదారులకు ఏమాత్రం అసౌకర్యం కలిగించినా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున బాధ్యతాయుతంగా మెలగనున్నాయి. వివరంగా చెప్పాలంటే తమ తప్పును ఒప్పుకుని మరీ వినియోగదారుడికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా చట్టానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఊపిరి పోసింది. విద్యుత్ వినియోగదారులకు బ్రహ్మాస్త్రం లాంటి ఈ సంస్కరణలను అధికారిక గెజిట్లో కూడా ప్రకటించినట్టు ఏపీఈఆర్సీ ఆదివారం మీడియాకు తెలిపింది. ఇది ఈ నెల 4వ తేదీ నుంచే అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది. మరో కీలక విషయం ఏమిటంటే దీనికి సంబంధించి సమగ్ర వివరాలతో నివేదికను ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. కనెక్షన్ తప్పుగా తొలగిస్తే.. నిజానికి విద్యుత్ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు గతంలోనే చట్టాలొచ్చినా విద్యుత్ సంస్థలు పెడచెవిన పెట్టడంతో పరిహారం కోరే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోందని ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని భావించిన కమిషన్ బలమైన చట్టాలకు పదును పెట్టినట్లు వెల్లడించింది. ► ఇక నుంచి విద్యుత్ సంస్థలకు సంబంధించి ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అందుబాటులో ఉండాలి. దీనివల్ల కరెంట్ పోతే తక్షణమే ఫిర్యాదు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ వ్యవస్థ ఇప్పటివరకూ సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదులున్నాయి. ► ఎవరైనా కొత్త కనెక్షన్, అదనపు లోడ్ కోరితే విద్యుత్ సంస్థలు తక్షణమే తగిన సమాచారం అందించాలి. నిర్ణీత గడువులోగా డిమాండ్ను నెరవేర్చాలి. ► సర్వీస్ కనెక్షన్ను తప్పుగా తొలగించినా, కనెక్షన్ తొలగించకుండా తిరిగి కనెక్షన్ చార్జీలు వసూలు చేసినా సర్వీసు వైఫల్యం కింద పరిగణించాలి. ఇది క్షమించరాని నేరంగా విద్యుత్ సంస్థలు గుర్తించి తక్షణమే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. ప్రతి మూడు నెలలకు నివేదిక.. విద్యుత్ సేవల్లో లోపం కారణంగా చెల్లించిన జరిమానా వివరాలను ఇక మీదట ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి స్వయంగా పరిశీలిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వివరాలను పంపాలని గెజిట్లో పేర్కొంది. వైఫల్యానికి కారణాలను కూడా కమిషన్కు వెల్లడించాలి. కారణాలు సహేతుకం కాదని భావిస్తే పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించే వీలుంది. విపత్తుల సమయంలోనూ.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సేవలకు అంతరాయాలు కలగడం సహజం. అయితే సేవల పునరుద్ధరణ ఏ తేదీన జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ పంపిణీ సంస్థలు బహిరంగ ప్రకటన జారీ చేయాలని కమిషన్ పేర్కొంది. చెప్పిన తేదీలోగా విద్యుత్ ఇవ్వకపోతే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. సేవలు కొనసాగించలేని స్థితిని సహేతుకమని కమిషన్ భావిస్తే పరిహారం చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. విప్లవాత్మక సంస్కరణలు.. ‘ఇవి విప్లవాత్మక సంస్కరణలు. డిస్కమ్లు సేవలపై మరింత దృష్టి పెడతాయని ఆశిస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవాలని డిస్కమ్లను ఆదేశించాం. పంపిణీ సంస్థల పనితీరు సమాచారాన్ని కమిషన్ సమీక్షించి వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టింది. మరింత మేలైన సేవలు అందించేందుకే ఈ ప్రయత్నం’’. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి,ఏపీఈఆర్సీ చైర్మన్ -
ఆ దీపాలన్నీ స్త్రీలవే.. ఆ దీపాలూ స్త్రీలే
తమిళనాడులో కరువు ఊరు అది. సరిగా భుక్తి లేదు. చేయడానికి స్త్రీలు చేయదగ్గ పని లేదు. భర్త ఎలక్ట్రీషియన్. నీ పనే నేను చేస్తాను అంది ధనలక్ష్మి. ‘కరెంటు పని నువ్వు చేయలేవు’ అన్నాడు భర్త. ఆమె వినలేదు. వెదురుపుల్లలతో కట్టిన బొమ్మలకు సీరియల్ సెట్లు అమర్చడం నేర్చుకుంది. జాతరలు, తిరునాళ్ళు, పండగలకు సీరియల్ సెట్ల వెదురుబొమ్మలు కావాలి. ఆ పనిలో విపరీతమైన నైపుణ్యం సంపాదించింది. మిగిలిన ఆడవాళ్లకు కూడా ఆ పని నేర్పించింది. నేడు ‘అరసర్కుళం’ అనే ఊరు సీరియల్సెట్ల బొమ్మలకు ప్రసిద్ధి. ఆ దీపాలన్నీ స్త్రీలవే. ఆ దీపాలూ స్త్రీలే. తమిళనాడు తిరునల్వేలి ప్రాంతంలోని ఎండను, కరువును భరించడం కష్టం. ఉన్నట్టుండి జలుబు చేసినట్టు కొన్ని మేఘాలు చీదుతాయి. వాటికి ఏమైనా పండితే పండినట్టు. అయినా ముక్కు కారితే పంటలు పండుతాయా? ‘మా ఊరి పేరు అరసర్కుళం. అది మారుమూల. పంటలు లేక చాలామంది వలస పోతుంటారు. ఉన్నవారికి పని ఉండదు. రోజూ పట్నానికి పోయి పని చేసుకురావడానికి బస్సులు కూడా తిరగవు’ అంటుంది ధనలక్ష్మి. ఆమె ఇప్పుడు ఆ ఊరిలోని ‘ధనలక్ష్మి వైరింగ్ వర్క్స్’కు అధిపతి. ఆమె దగ్గర 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆమె వల్ల ఉపాధి మార్గం తెలుసుకొని మరో 500 మంది జీవిక పొందుతున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. పదేళ్ల క్రితం కాదు. పదేళ్ల క్రితం... ధనలక్ష్మిది అరసర్కుళం ఊరే. అక్కడే పుట్టి పెరిగింది. ‘మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. కాని వానలు లేకపోతే ఏమిటి చేయడం. అదంతా ఉత్త మట్టిగడ్డే కదా’ అంటుంది. తండ్రి ఆమెకు ప్రాయం రాగానే అదే ఊళ్లో ఉన్న అశోక్ అనే ఎలక్ట్రీషియన్కు ఇచ్చి పెళ్లి చేశాడు. ముగ్గురు కూతుళ్లు పుట్టారు. ‘మా ఆయన ఎలక్ట్రీషియన్. ఏదైనా డెకరేషన్ వస్తే లైట్లు వేస్తాడు. కాని రెండు మూడు వేల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు’ అంటుంది ధనలక్ష్మి. తెలుగులో ప్రసిద్ధ రచయిత శ్రీరమణ ‘ధనలక్ష్మి’ అనే కథ రాశారు. అందులో ధనలక్ష్మి అనే ఇల్లాలు భర్తకు ఉన్న నిర్వహణాలోపాలను గ్రహించి తోడు నిలిచి అతడు వ్యాపారంలో వృద్ధిలోకి రావడానికి సహకరిస్తుంది. సరిగ్గా ఈ ధనలక్ష్మి కూడా భర్త అశోక్కు అలాగే అండగా నిలిచింది. ‘ఊళ్లో ఏ పనీ లేదు. నీ పనే నేను చేస్తా’ అందామె. అశోక్ ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పనంటే కరెంటుతో వ్యవహారం. అది ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం. అందుకే వద్దు అన్నాడు. ‘కాని నేను పట్టుపట్టాను. సాధించాను’ అంటుంది ధనలక్ష్మి. ఊళ్లో జాతర వస్తే... సరిగ్గా ఆ సమయంలోనే ఊళ్లో జాతర వచ్చింది. జాతరకు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సీరియల్ సెట్లతో వెలిగించిన అలంకరణలు చేస్తారు. వెదురుపుల్లతో దేవతల బొమ్మలు, పూలు, జంతువులు, పార్టీ గుర్తులు, రాజకీయ నాయకుల ముఖాలు కట్టి వాటికి సీరియల్లైట్లు అమర్చి వెలిగిస్తారు. వెదురుపుల్ల కట్టడంలో అశోక్ పని మంతుడు. కాని వాటికి సీరియల్లైట్లు బిగించడం శ్రమతో, నైపుణ్యంతో, ఓపికతో కూడిన పని. సీరియల్ సెట్లలో మధ్యలో ఒక లైట్ కాలిపోయినా మిగిలిన సెట్ వెలగదు. ఆ లైట్ను కొత్తది వేయాలి. లేదా వైర్ను జాయింట్ చేయాలి. ‘ఆ పనంతా నేను నేర్చుకుని మొదలెట్టాను’ అంటుంది ధనలక్ష్మి. భర్త వెదురు ఫ్రేమ్స్ కడితే ధనలక్ష్మి చకచకా సీరియల్ సెట్లు అమర్చేది. వెలిగిస్తే వెదురు కటౌట్ మిలమిలమని బ్రహ్మాండంగా వెలిగేది. అశోక్ ఆ జాతరలో లైట్లు వెలిగించి పేరు సంపాదించాడు. ధనలక్ష్మి హస్తవాసి మంచిదని నిరూపితం అయ్యింది. అందరు మహిళల కోసం తిరునల్వేలి జిల్లాలో ఆ మాటకొస్తే తమిళనాడులో ప్రతి ఊళ్లో ఏదో ఒక ఉత్సవం వేడుక జరుగుతూనే ఉంటాయి. వాటికి వెదురుపుల్లల సీరియల్సెట్ల కటౌట్స్ అవసరం. అవి తయారు చేసే కార్ఖానా పెడదామని ధనలక్ష్మి భర్తకు సూచించింది. ఊళ్లో ఉన్న ఒక ట్రస్టు సాయంతో లోన్ పొంది పని మొదలెట్టింది. భర్త మరికొందు మగపని వారు ఫ్రేమ్స్ తయారు చేస్తుంటే తను మరికొంతమంది మహిళలతో ఆ ఫ్రేమ్స్కు లైట్లు బిగించడం మొదలుపెట్టింది. ధనలక్ష్మి దగ్గరకు వస్తే రెడిమేడ్గా కావలిసిన కరెంటు బొమ్మలు దొరుకుతాయనే పేరు వచ్చింది. ఆ తర్వాత ధనలక్ష్మి చెన్నై నుంచి లైట్లు టోకున కొనుక్కొచ్చి సీరియల్ సెట్లను తయారు చేయడం కూడా ఆడవాళ్లకు నేర్చింది. సీరియల్ లైట్లు తామే తయారు చేసుకుని తామే కటౌట్స్కు అమర్చి మొత్తం కటౌట్ను అమ్మడం వల్ల వారికి లాభం బాగా రావడం మొదలెట్టింది. ‘ఇవాళ మా ఊరు పెద్ద సీరియల్ సెట్ల కేంద్రమే అయ్యింది’ అంటుంది ధనలక్ష్మి. తన వద్ద పనిచేస్తున్న మహిళలతో ధనలక్ష్మి ధనలక్ష్మి ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు పెళ్లయ్యింది. ఆమె కంప్యూటర్ ద్వారా కావలసిన బొమ్మలు తీసి తల్లికి ఇస్తోంది. అల్లుడు ఊళ్లు తిరిగి ఆర్డర్లు తెస్తున్నాడు. ధనలక్ష్మి ధైర్యం లక్ష్మిని తెచ్చింది. మూడు వెలుగులు ఆరు కాంతులుగా ఆమె జీవితం వెలుగుతోంది. ఆరు వందల మంది స్త్రీలూ వెలుగుతున్నారు. చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు కూడా వెలగొచ్చని వీరు చెబుతున్నారు – సాక్షి ఫ్యామిలీ -
లాక్డౌన్ నుంచి వీటికీ మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనుల్లో.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, టెలికం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు.. మొదలైనవి ఉన్నాయి. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్డౌన్ కాలంలో చేసుకోవచ్చు. -
మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ప్రారంభం
-
విజయవాడలో బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం
-
సీసీ కెమెరాలు అమర్చేందుకు వచ్చి..
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి మెళియాపుట్టి రహదారి సమీపంలో బొంగపోలమ్మ మోడరన్ రైస్ మిల్లులో గురువారం విద్యుదాఘాతానికి గురై గుమ్మడి అశోక్(36) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, మృతుడి తమ్ముడు ప్రశాంత్ తెలిపిన వివరాలు ప్రకారం... ఈ రైస్ మిల్లులో కొద్దిరోజుల క్రితం ధాన్యం బస్తాలు దొంగతనం జరిగింది. మరోసారి దొంగతనం జరగకుండా ఉండేందుకై మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఒడిశా రాష్ట్రం కాశీనగర్ సమీపంలోని బొత్తవ గ్రామానికి చెందిన గుమ్మడి అశోక్, అతని సోదరుడు ప్రశాంత్లు మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికై వచ్చారు. దీనిలో భాగంగా గురువారం మిల్లు పైకి ఎక్కి సీసీ కెమెరా వైర్లు బిగిస్తుండగా పక్కనుంచి వెళుతున్న 33 కేవీ విద్యుత్ తీగ అశోక్కు తగలటంతో ఒక్కసారిగా తుల్లిపోయాడు. సమీపంలోని గోడపై పడటంతో తలకు తీవ్రగాయం కాగా తన శరీరం కాలిపోయింది. అశోక్ను బతికించేందుకు తమ్ముడు ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అప్పటికే తన సోదరుడు మృతిచెందాడు. వెంటనే స్పందించిన మిల్లు సిబ్బంది మిల్లుపైకి వెళ్లి మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చారు. మృతుడికి షాక్ తగలగానే సమీపంలోని గోడపై పడడంతో తలకు తీవ్ర గాయమై, అధిక రక్తశ్రావం జరిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి చలించిపోయి కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య గౌరి, రెండేళ్ల కుమారుడు సాత్విక్ ఉన్నారు. అశోక్ మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కబళించిన కరెంట్ తీగ
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరెంట్ కాటుకు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ఇద్దరు బలయ్యారు. ఫ్యూజ్ వైరు సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్కు చెందిన పర్శరాములు రెండేళ్లుగా విలేజీ ఎలక్ట్రికల్ వర్కర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజ్ తెగిపోవడంతో సరిచేసేందుకు పైకి ఎక్కాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసి ఫ్యూజు సరిచేస్తున్నాడు. కొంతదూరంలోని మైనర్ ఫీడర్ తీగ ట్రాన్స్ఫార్మర్కు అనుసంధానించిన తీగకు తాకింది. దీంతో విద్యుత్ సరఫరా జరిగి పర్శరాములు ట్రాన్స్ఫార్మర్పైనే దుర్మరణం చెందాడు. గాలిపల్లిలో: ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో ట్రాన్స్ఫార్మర్కు రెండువైపులా విద్యుత్ లైన్లు ఉన్నాయి. అసిస్టెంట్ హెల్పర్ మిట్టపెల్లి తిరుపతిరెడ్డి (35) ఒకవైపు కరెంట్ సరఫరా బంద్ చేసి, ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి ఫ్యూజు వైరు సరిచేస్తుండగా, మరోవైపు కరెంటు సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. -
డబ్బులిస్తే అంతా ఓకే!
గ్రేటర్లో ఇటీవల బహుళ అంతస్తుల భవనాల్లో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి ఎక్కువగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల వల్లే జరుగుతున్నాయి. ఇందుకు కారణాలు అన్వేషిస్తే... చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ జనరల్(సీఈఐజీ) అధికారుల అవినీతి..నిర్లక్ష్యమనే ఆరోపణలు వెలువడుతున్నాయి. షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, అపార్ట్మెంట్లు వంటి పెద్ద పెద్ద భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే ముందు సీఈఐజీ అనుమతి తీసుకోవాలి. కేబుల్ లైన్లు, స్విచ్బోర్డులు, వైరింగ్, ప్లగ్గులు, ట్రాన్స్ఫార్మర్ లైన్ల వంటి పరికరాల నాణ్యతను పరిశీలించి..అన్నీ బాగున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతి ఇవ్వాలి. కానీ నగరంలో అలా జరగడం లేదు. సంబంధిత అధికారులకు లంచాలిస్తే ఎలాంటి తనిఖీలు లేకుండానే అనుమతులు జారీ చేస్తున్నారు. దీంతో ఆయా భవనాల్లో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుని కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా...వందలాది మంది ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. వాస్తవంగా పెద్ద భవనాల్లో ఎలాంటి విద్యుత్ పరికరాలు, వైర్లు వాడాలో స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. కానీ వీటిని ఎవ్వరూ పాటించడం లేదు. సాక్షి, సిటీబ్యూరో : అపార్ట్మెంట్లు, మాల్స్, ఫ్యాక్టరీలు వంటి పెద్దపెద్ద భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే ముందు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ జనరల్ (సీఈఐజీ)అనుమతి తప్పనిసరి. కేబుల్ లైన్లు, వైరింగ్, స్విచ్ బోర్డులు, ప్లగులు వంటి పరికరాల నాణ్యతను పరిశీలించి.. అన్ని సవ్యంగా ఉన్నాయని నిర్థారించుకున్న తర్వాత అనుమతి ఇవ్వాలి. కానీ కాస్త డబ్బులు ముట్టజెపితే చాలు సీఈఐజీ అధికారులు ఆయా కట్టడాలను, ఇందులోని విద్యుత్ పరికరాలను చూడకుండానే ధృవీకరణ పత్రం ఇచ్చేస్తున్నారు. అధికారుల అవినీతి దాహానికి విద్యుత్ ప్రమాదాల వల్ల రూ.కోట్ల రూపాల ఆస్తి బుగ్గిపాలవుతోంది. అనేక మంది అమాయకులు మృత్యు వాతప డుతున్నారు. ప్రస్తుతం నగరంలో సగానికిపైగా మాల్స్, అపార్టుమెంట్లలో విద్యుత్ వైరింగ్ నాశిరకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నగరంలోని పలు అపార్ట్మెంట్స్లో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఇదే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాసిరకం వైరింగ్తో ప్రమాదం రీసైకిల్డ్ కాపర్(వాడేసిన రాగి లోహం)తో తయారు చేసిన వైర్లతో చేసే వైరింగ్ చాలా నాసిరకంగా ఉంటుంది. ఇలాంటి వాటిపై ఇన్సులేషన్గా వాడే ప్లాస్టిక్ పదార్థం వేడికి వెంటనే కరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రతి సర్క్యూట్కు కనీసç లోడు మాత్రమే పడే విధంగా చూడాలి. స్వచ్ఛమైన కాపర్ ఐఎస్–694 ప్రమాణాలకు సరిపోయే ఎలక్ట్రికల్ వైర్లనే వాడాలి. ప్రతి గదిలో తప్పనిసరిగా ఎంసీబీ ఉండాలి. గీజర్స్, ఏసీ వంటి వాటికి ఓ విడి న్యూట్రల్తో స్వతంత్ర సర్క్యూట్ను మెయిన్బోర్డు నుంచి తీసుకెళ్లాలి. లైట్లోడ్(బల్బు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్స్)కు 1.5 ఎస్క్యూ ఎంఎం కాపర్ క్రాస్సెక్షనల్ వైరింగ్ను, మీడియం లోడు (టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, మ్యూజిక్ సిస్టం)కు 2.5 ఎస్క్యూ ఎంఎం కాపర్ సెక్షనల్ వైర్ను, హెవీలోడ్(ఏసీలు, గ్రీజర్స్, గ్రైడింగ్, వాషింగ్ మెషీన్స్)కు 4.0 ఎస్క్యూ ఎంఎం వైర్లను వాడాలి. ఎర్త్కు ఆకుపచ్చ, న్యూట్రల్కు నలుపు, లైవ్(కరెంట్ సరఫరా చేసే) దానికి పసుపు, నీలం రంగు వైర్ను వాడాలి. ఒక వేళ త్రీఫేజ్ వైరింగ్పై విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తే, సరఫరా భారం లైన్లపై సమానంగా ఉండేలా చూడాలి. డిమాం డ్కు సరిపడ్డ కేబుళ్లను వేయడంతో పాటు కేబుల్ కన్నా తక్కువ కెపాసిటీ గల ఫ్యూజ్లను ఏర్పాటు చేసుకోవాలి. కేబుల్ ఎంత పెద్దదైతే.. రెసిస్టెన్స్ అంత తక్కువ. దీనివల్ల ఉత్పత్తి అయ్యే వేడి వల్ల పెరిగే ఉష్ణోగ్రత నుంచి కాపాడుతుంది. ప్రతి బోర్డుపై మూడు పిన్నుల ప్లగ్గు విధిగా వాడటంతో పాటు వైర్ల మధ్య జాయింట్స్ తక్కువ ఉండేలా చూడాలి. ప్రతి 15 ఏళ్లకోసారి వైరింగ్ మార్చాలి. 10 కేవీఏ కన్నా ఎక్కువ లోడ్ ఉంటే ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. నగరంలో జరుగుతున్న నిర్మాణాలకు చాలావరకు ఈ స్థాయి ప్రమాణాలు పాటించడం లేదు. పైగా ఆయా ప్రమాణాలను పూర్తిస్థాయిలో సీఈఐజీ అధికారులు పరిశీలించనూ లేదు. దీంతో భవన నిర్మాణ దారులు కరెన్సీ నోట్లను ఎరవేసి అధికాలతో పనిచేయించుకుంటున్నారు. ఆనక ప్రమాదాలు జరిగితే సామాన్యులు మూల్యం చెల్లిస్తున్నారు. తనిఖీ చేయకుండానే అనుమతి గ్రేటర్ హైదరాబాద్లో 40 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఐదు లక్షలకు పైగా వాణిజ్య కనెక్షన్లు. చిన్న, భారీ, మధ్య తరహా పరిశ్రమలు మరో 45 వేలకు పైగా ఉన్నాయి. పది వేలకుపైగా అపార్ట్మెంట్లు ఉన్నాయి. దరఖాస్తు దారునికి సంబంధించిన అపార్ట్మెంట్స్, మాల్స్, కంపెనీలను సీఈఐజీ అధికారులు స్వయంగా సందర్శించి, ఆయా సంస్థల విద్యుత్ అవసరాలు, విద్యుత్ లైన్ల నిర్మాణం, సరఫరా కోసం వాడిన కేబుల్స్ సామర్థ్యం, ఎలక్ట్రీషియన్ అర్హతలు, అనుభవం, వంటి అంశాలను పూర్తిగా పరిశీలించాలి. అంతేకాదు అన్నీ సరిగా ఉన్నాయని తేలిన తర్వాతే కాంట్రాక్టర్లకు ఎ,బి,సి గ్రేడ్ లైసెన్స్ కూడా మంజూరు చేయాలి. కానీ సీఈఐజీ అధికారులు ఇవేవి పట్టించుకోకుండా డబ్బులు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇటీవల షేక్పేట్ ట్రాన్స్కో ఇంజినీర్ ఇదే పేరుతో ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఎవరికి వారు సొంతంగా కొంత మంది ఏజెంట్లను కూడా నియమించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
‘సిరిసిల్ల’పై విద్యుత్ పోటు!
సాక్షి, హైదరాబాద్: ‘సిరిసిల్ల గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (సెస్)’పై విద్యుత్ చార్జీల పిడుగు పడింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సెస్కు సరఫరా చేస్తున్న విద్యుత్ చార్జీలు ఒక్కసారిగా నాలుగున్నర రెట్లు పెరిగిపోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) మంగళవారం జారీ చేసిన 2018–19 విద్యుత్ టారిఫ్ ఉత్తర్వుల్లో.. గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో)ల విద్యుత్ చార్జీలను పెంచింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గృహాలు, చేనేత, పవర్లూమ్స్, వ్యవసాయం, పరిశ్రమల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న సెస్కు సరఫరా అవుతున్న బల్క్ విద్యుత్ ధర ఒక్కో యూనిట్కు రూ.1 నుంచి రూ.4.52కు పెరగనుంది. వచ్చే నెల 1 నుంచి ఈ టారిఫ్ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. పెరగని సాధారణ చార్జీలు గృహ, వాణిజ్య, పరిశ్రమలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ప్రస్తుతమున్న చార్జీలనే వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీలను యూనిట్కు రూ.6.40 నుంచి రూ.5.80కు తగ్గించింది. సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంతోనే..! ఈఆర్సీ పౌల్ట్రీ పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను యూనిట్కు రూ.4 నుంచి రూ.6కు పెంచింది. పౌల్ట్రీ పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్పై యూనిట్కు రూ.2 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని వచ్చే ఏడాది కొనసాగించే అంశంపై స్పష్టతివ్వకపోవడంతో చార్జీలు పెంచినట్లు ఈఆర్సీ తెలిపింది. ఏటా సెస్కు ఇస్తున్న విద్యుత్ రాయితీ కొనసాగింపు పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రెస్కో కేటగిరీ చార్జీలను పెంచినట్లు తెలుస్తోంది. ఓపెన్యాక్సెస్ విద్యుత్పై యూనిట్కు 0.52 పైసల చొప్పున అదనపు సర్చార్జీని.. హెచ్టీ కేటగిరీలో పరిశ్రమలపై రూ.1.30 నుంచి రూ.1.60 వరకు క్రాస్ సబ్సిడీ సర్చార్జీలను ఈఆర్సీ విధించింది. ఆదాయ లోటు రూ.956.67 కోట్లు డిస్కంలు తమ వార్షిక వ్యయం 2018–19లో రూ.35,714 కోట్లుగా ఉండనుందని.. ప్రస్తుత చార్జీలను అమలు చేస్తే రూ.9,700 కోట్లు లోటు ఏర్పడుతుందని గతంలో ఈఆర్సీకి ఇచ్చి న నివేదికలో తెలిపాయి. ఈఆర్సీ తాజాగా ఆదాయ లోటును గణించి రూ.5,940.47 కోట్ల కు తగ్గించింది. ఇక డిస్కంలకు రూ.4,984.30 కోట్లు సబ్సిడీగా ఇస్తామని ప్రభుత్వం ఈఆర్సీకి తెలిపింది. దీంతో డిస్కంల ఆదాయ లోటు రూ.956.67 కోట్లకు తగ్గనుంది. -
పెరిగిన ‘విద్యుత్’ వ్యయం!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యయం ఏటికేటికి పెరిగిపోతోంది. వచ్చే ఏడాది (2018–19) రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కోసం రూ.35,714 కోట్లు అవసరమని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా నివేదించాయి. ఇందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.27,903 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. శుక్రవారం 2018–19కి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్)ను డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. వచ్చేఏడాది రాష్ట్రంలో అమలు చేసే విద్యుత్ చార్జీల పట్టిక లేకుండా ఈ ప్రతిపాదనలు సమర్పించడంతో 2018–19లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరుగుతాయా లేక యథాతథంగా ఉంటాయా అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. గతేడాదిలాగే చార్జీల వివరాలను మరికొన్ని రోజుల తర్వాత ఈఆర్సీకి డిస్కంలు ప్రత్యేకంగా ప్రతిపాదించను న్నాయి. అప్పుడే చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. 2019లో జరిగే ఎన్నికల నేపథ్యం లో విద్యుత్ చార్జీలు పెంచొద్దని సీఎం కేసీఆర్ డిస్కంలను ఆదేశించినా.. డిస్కంలు చార్జీల అంశాన్ని సస్పెన్స్లో పెట్టడం గమనార్హం. యూనిట్కు రూ.6.42 వ్యయం.. డిస్కంలు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సగటున యూనిట్కు రూ.6.42 వ్యయం కానుంది. 2018–19 కోసం డిస్కంలు 67,573 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఒప్పందాల రూపంలో ముందస్తుగా సమీకరించి పెట్టుకోగా.. వాస్తవ విద్యుత్ డిమాండ్ 64,291 మిలియన్ యూనిట్లే ఉండనుంది. -
క్రమబద్ధీకరణకు ఓకే..
విద్యుత్ బోర్డుల ఆమోదం ప్రతిపాదనలు సీఎంకు..నేడు ఉత్తర్వులు! 20,903 మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులు ఇక రెగ్యులర్ హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20,903 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే ప్రతిపాదనలను విద్యుత్ సంస్థల బోర్డులు ఆమోదించాయి. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో), దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్)ల బోర్డులు శుక్రవారం విద్యుత్సౌధలో సమావేశమయ్యాయి. ట్రాన్స్కోలో 4,197 మంది, జెన్కోలో 2,914 మంది, టీఎస్ఎస్పీ డీసీఎల్లో 9,459 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో4,333 మందిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ వెంటనే ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపించాయి. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం లభించిన మరుక్షణమే విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలర్ ఉద్యోగులుగా విలీనం చేసుకుంటూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. మొత్తం 23,667 మంది విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 20,903 మంది అర్హులని దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీలు నిర్ధారించాయి. తెలంగాణ స్థానికత కాకపోవడం, వయో పరిమితి మీరిపోవడం, ఉద్యోగాన్ని మధ్యలో మానేయడం, సరైన సమాచారం లేకుండా దరఖాస్తు చేసుకోవడం తదితర కారణాలతో మిగిలిన వారి దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 20,903 మంది ఉద్యోగుల్లో నైపుణ్యం లేని ఉద్యోగులు 3,199 మంది, స్వల్ప నైపుణ్యం గల ఉద్యోగులు 2,476 మంది, నైపుణ్యం గల ఉద్యోగులు 13,864 మంది, ఉన్నత నైపుణ్యం గల ఉద్యోగులు 1,364 మంది ఉన్నారు. -
21,000 మంది విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
నేడు విద్యుత్ బోర్డుల నిర్ణయం.. ఆ వెంటనే ఉత్తర్వుల జారీ! సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 21 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. వారిని క్రమబద్ధీకరిస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నేడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ట్రాన్స్కో, విద్యుదుత్పత్తి సంస్థ జెన్కో, దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్) శుక్రవారం బోర్డు సమావేశం నిర్వహించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఆమోదించనున్నాయి. ఇందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతుండటంతో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విలీనం (అబ్జార్ప్షన్) పేరిట ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. క్రమబద్ధీకరణను బోర్డులు ఆమోదిస్తే, ఆ మేరకు శనివారమే విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాలు, మార్గదర్శకాలను విద్యుత్ సంస్థల బోర్డులు మే 29న సమావేశమై ఆమోదించాయి. నాలుగు విద్యుత్ సంస్థల్లో 23,667 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 21 వేల మందికి పైగా అర్హులని సిఫార్సు చేస్తూ అవి ఇటీవలే నివేదిక ఇచ్చాయి. ఏపీ విద్యుత్ సంస్థల్లో ప నిచేస్తున్న తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తెలంగాణలో క్రమబద్ధీకరణ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపైనా శుక్రవారం బోర్డులు నిర్ణయం తీసుకోనున్నాయి. 1000 ఏఈ పోస్టుల భర్తీపై కూడా ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లలో 1,000 మందికి పైగా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి ప్రకటన జారీ చేయడంపైనా విద్యుత్ సంస్థల బోర్డులు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నాయి. తర్వాత వారం రోజుల్లో నియామక నోటిఫికేషన్ రానుంది. విద్యుత్ సంస్థల్లో ఎన్నికలు వాయిదా వేయాలి కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. అధ్యక్షుడు కేవీ జాన్సన్ నేతృత్వంలోని బృందం గురువారం ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావుకు వినతిపత్రం సమర్పించింది. కార్మికులందరిని క్రమబద్ధీకరించి వారికీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశమివ్వాలని కోరగా సీఎండీ అంగీకరించారని అనంతరం నేతలు తెలిపారు. క్రమబద్ధీకరణకు సహకరించిన ఎంపీ కవిత, ట్రాన్స్కో, డిస్కంల సీఎండీలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రాణాలతో తిరిగి వెళ్తారనే నమ్మకం లేదు
మూడేళ్లలో 370 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మృతి: టఫ్ సాక్షి, హైదరాబాద్: ఉదయం ఇంటి నుంచి వెళ్లిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలతో తిరిగి ఇళ్లకు చేరుతారనే నమ్మకం వారి కుటుంబ సభ్యులకు లేదని తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టఫ్) ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్లలో సుమారు 370 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విధి నిర్వహణలో మృత్యువాత పడ్డారని పేర్కొంది. రెండేళ్ల పోరాటం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేసుకోవడానికి సిద్ధమైందని, అయితే కొందరు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని తెలిపింది. విద్యుత్ కార్మికులకు మద్దతుగా టఫ్ అధ్యక్షుడు పద్మారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్.కిరణ్, ప్రధాన కార్యదర్శి సాయిబాబ, సాయిలు, శ్రీధర్ తదితరులు శనివా రం ఇక్కడ విలేకరులతో మాట్లాడా రు. 23 వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ల చేతిలో దోపిడీకి గురవుతున్నారని తెలి పారు. జడ్చర్లలో ఓ కాంట్రాక్టర్ కార్మికులకు సంబంధించిన రూ.60 లక్షల పీఎఫ్ నిధులను స్వాహా చేశాడని, మూడేళ్లు గడుస్తున్నా అతడి నుంచి ఆ డబ్బు రికవరీ చేయలేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులంతా సబ్ స్టేషన్ ఆపరేటర్, జేఎల్ఎం లాంటి తక్కువ కేడర్ ఉద్యోగులేనని, అంద రూ ఐటీఐ, పదో తరగతి విద్యార్హతలు ఉన్న వారేనని తెలిపారు. వీరి విలీనంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నష్టం జరగదని తెలిపారు. -
వర్ద విలయం
ఊహించని రీతిలో వర్ద పెను ప్రళయ తాండవం చేసి వెళ్లింది. 192 కిమీ వేగంతో వీచిన గాలులు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగాయి. విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. వర్ద తీరం దాటినా ఈదురు గాలుల ప్రభావం మరీ ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. సాక్షి, చెన్నై : డిసెంబరు నెల అంటే చాలు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం వాసుల్ని వణికి పోతున్నారు. గత ఏడాది వర్షం ఈశాన్య రుతు పవనాలతో పెను ప్రళయాన్ని చవి చూస్తే, ఈ ఏడాది వర్దరూపంలో కొన్ని గంటల పాటుగా ఊపిరి బిగ పెట్టుకుని ఉత్కంఠగా కలాన్ని గడపాల్సిన పరిస్థితి.వర్ద్ద తుపాన్ రూపంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలకు ముప్పు తప్పదన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. పెను ›ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. తీర వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం వేకువ జాము నుంచి చిరుజల్లులతో మొదలైన వర్షం క్రమంగా తీవ్ర రూపం దాల్చడం మొదలెట్టింది. దీంతో సరిగ్గా పన్నెండున్నర ఒంటి గంట సమయంలో ఎక్కడిక్కకడ వాహనాల రాకపోకల్ని నిలిపి వేశారు. జనం రోడ్ల మీదకు రాకుండా ఇళ్లకు పరిమితం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. చెన్నైలో ప్రధాన రోడ్లన్నీ మూత పడ్డట్టుగా నిర్మానుష్యం అయ్యాయి. ఎలక్ట్రిక్ రైళ్ల సేవల్ని నిలుపుదల చేశారు. చెన్నై నుంచి సూలూరు పేట వైపుగా వెళ్లే రైళ్లను రేణిగుంట వైపుగా దారి మళ్లించారు. క్రమంగా వర్షం తీవ్రత పెరగడంతో ఒంటి గంట సమయంలో చెన్నై విమానాశ్రయాన్ని సైతం మూసి వేస్తూ చర్యలు తీసుకున్నారు. నాలుగు గంటల ప్రళయం సరిగ్గా ఒంటి గంట సమయంలో వర్షం తీవ్రతతో పాటుగా ఈదురు గాలుల ప్రభావం పెరిగింది. ఎదురుగా ఎవ్వరున్నారో అన్నది కూడా తెలియని రీతిలో గాలుల బీభత్సం, వర్షం జోరు వెరసి జనం గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశాయి. వర్ద చెన్నై హార్బర్ సమీపంలోకి దూసుకు వస్తున్న కొద్ది గాలుల తీవ్రత తాండవం చేసింది. ఎక్కడిక్కడ హోర్డింగ్లు, వృక్షాలు, చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, తీగలు అనేక చోట్ల విరిగి పడ్డాయి. మూడు, నాలుగు అంతస్తుల్లోని డాబా లాంటి గృహాలకు వేసిన రేకులు గాల్లో ఎగిరాయి. ఇళ్ల మీదున్న ప్లాస్టిక్ వాటార్ ట్యాంక్లు గాల్లో ఎగిరాయి. అనేక చోట్ల హోర్డింగ్లు, పెట్రోల్ బంకుల షెడ్డులు గాలిలో తేలియాడాయి. మూడున్నర నాలుగు గంటల సమయంలో అయితే, తీవ్రత మరింత జఠిలం కావడంతో అర చేతిలో ప్రాణాల్ని పెట్టుకుని జనం బిక్కు బిక్కు మంటూ ఇళ్లల్లో గడిపారు. ఏమి జరుగుతుందో, ఎలాంటి ప్రళయాన్ని మళ్లీ ఎదుర్కొనాలో, మళ్లీ వరదలు వస్తాయో అన్నంత ఉత్కంఠతో కాలం గడిపినా, ఐదున్నర , ఆరు గంటలకు గాలి భీబత్సం, వర్షం విలయం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయినా, గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో మళ్లీ వర్షం వస్తుందేమోనన్న ఆంధోళన తప్పలేదు.ఏ రోడ్డు చూసినా : చెన్నై మహానగరంలో ఏరోడ్డులో చూసినా విరిగిన చెట్టు కొమ్మలు , నేల కొరిగిన చెట్లే, రోడ్డుకు ఇరు వైపులా అనేక చోట్ల ఉండే దుకాణాల బోర్డులు, వివిధ సంస్థల బోర్డులన్నీ రోడ్ల మీద వచ్చి పడ్డాయి. దుకాణాలన్నీ ముందుగానే మూత పడటంతో ప్రాణ, వ్యక్తిగత ఆస్తినష్టాల నుంచి ఆయా యజమానులు బయట పడ్డారు. సముద్ర తీరం వెంబడి ఉన్న ఎన్నూరు, తిరువొత్తియూరు, పట్టినంబాక్కం, హార్బర్ పరిసరాల్లో అయితే, అలల తాకిడికి అడ్డుగా వేసిన రాళ్లు పెద్ద ఎత్తున రోడ్డ మీదకు వచ్చి పడ్డాయి. చెన్నై సైదా పేట నుంచి కోట్టూరు పురం వరకు రోడ్డుకు ఇరు వైపులా ఆహ్లాదకరంగా ఉ ండే చెట్లు ఇప్పుడు కానరాలేదు. అవన్నీ నేలకొరిగాయి. చెన్నైలో 224 రోడ్లను తాత్కాళికంగా మూసి వేశారు. దీన్ని బట్టి చూస్తే, ఇతర జిల్లాల్లో, శివారుల్లో పరిస్థితి ఏ మేరకు ఉంటుందో అన్న ఆందోళన తప్పదు. ఏ రోడ్లులో చూసినా ఏదో ఒక కారు లేదా ఆటో, మోటారు సైకిల్ చెట్ల శిథిలాల కింద నుజ్జు నుజ్జు కాక తప్పలేదు. ఇక, సముద్ర తీరాల్లోని వందలాది రేకుల ఇళ్ల పైకప్పులు గాల్లోకి ఎగరడంతో అక్కడి బాధితులను అధికార వర్గాలు ఆగమేఘాలపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుడిసె వాసుల వేతలు వర్ణణాతీతం. అనేక చోట్ల అధికారులు హెచ్చరించినా, ఖాతరు చేయని వాళ్లు , చివరకు గాలి వాన భీబత్సంలో చిక్కుకుని తల్లడిల్లక తప్పలేదు. యుద్ద ప్రాతిపదికన: ఆయా ప్రాంతాల్లో యువత, స్థానికులు స్వచ్చందంగా ముందుకు కదిలారు. రోడ్ల మీద పడ్డ కొమ్మల్ని తొలగించే పనిలో పడ్డారు. అయితే, అతి పెద్ద చెట్లను తొలగించేందుకు కష్టతరంగా మారాయి. అర్థరాత్రిలోపు వీటిని తొలగించేందుకు తగ్గట్టుగా ఇతర ప్రాంతాల నుంచి ఆగమేఘాలపై సిబ్బందిని రప్పించి ఉన్నారు. చెన్నై విమానాశ్రయం రన్ వేల్లోకి నీళ్లు చేరడం, కొన్ని చోట్ల దెబ్బ తినడం వెరసి విమానాల సేవలన్నీ అర్థరాత్రి వరకు రద్దు అయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈదురుగాలులలకు, వర్షం తోడవడంతో ఆందోళన తప్పడం లేదు. వర్ష బీభత్సంలో నలుగురు మరణించినట్లు సమాచారం. ఆగమేఘాలపై పునరుద్ధరణ చర్యల అనంతరం అర్థరాత్రి తర్వాత సేవలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇక, చెన్నైలో తెగి పడ్డ విద్యుత్ తీగలను యుద్ద ప్రాతిపదికన సరి చేసే పనిలో సిబ్బంది నిమగ్నం అయ్యారు. అర్థరాత్రిలోపు చెన్నై నగరానికి, మంగళవారం సాయంత్రంలోపు చెన్నై శివారుల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని ఆ శాఖ మంత్రి తంగమణి తెలిపారు. అంత వరకు అందకారంలో మునగాల్సిన పరిíస్థితి. ఇక, యుద్ద ప్రాతిపకన సాగుతున్న చర్యల్లో జాతీయ విపత్తుల నివారణ బందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏ మేరకు నష్టం తీవ్ర అన్నది ఉంటుందో మంగళారం నాటికి తేలే అవకాశాలు ఉన్నాయి. ఇక, అధికారుల్ని సీఎం పన్నీరు సెల్వం అప్రమత్తం చేస్తూ, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యల్లో సిబ్బంది ఉన్నారని ప్రజలు సహకరించాలని కోరారు. రాజ్నాథ్ ఆరా : చెన్నై తీరాన్ని వార్ధా సమీపించినానంతరం కేంద్ర హోం శాఖ మంత్రి తమిళనాడు సీఎఎం పన్నీరు సెల్వంతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో కేంద్రం సహకారం అందిస్తుందని పన్నీరుకు ఆయన హామీ ఇచ్చారు. 22 ఏళ్ల అనంతరం : ప్రళయాలన్నీ చెన్నైను డిసెంబరు నెలలోనే వెంటాడుతున్నాయి. గతంలో అనేక తుఫాన్లు వచ్చినా, వాటి ప్రభావం తక్కువే. 1994లో వచ్చిన తుఫాన్ వంద కి.మీ వేగంతో చెన్నై వైపుగా దూసుకొచ్చి ప్రళయాన్ని సష్టించింది. తదుపరి గత ఏడాది వర్షాలతో వరద విలయం. ఈ ఏడాది గతంలో ఎ న్నడూ లేని రీతిలో తాండవం. వర్షం తీవ్ర కన్నా, గాలి ప్రభావం మరీ ఎక్కువగా ఉండటంతో జనం విల విలలాడాల్సి వచ్చింది. 192 కి.మీ వేగంతో గాలులు దూసుకొచ్చినట్టుగా వాతావరణ కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇక, మీనంబాక్కంలో నాలుగు గంటల పాటుగా అత్యధికంగా 18 సె.మీ వర్షం పడింది. -
నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తాం
⇒ తెలుగు రాష్ట్రాల విద్యుత్ వివాదంపై షీలాబిడే కమిటీ సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి మరో నెల రోజుల్లో పరిష్కారం చూపుతామని షీలాబిడే కమిటీ శుక్రవారం తెలిపింది. ఆస్తులు, ఉద్యోగుల విభజనకు సంబంధించి తుది నివేదికలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులను కమిటీ ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల అప్పులు, ఉద్యోగుల విభజన సమస్యగా మారింది. రెండు రాష్ట్రాల అధికారులు పరస్పర విరుద్ధ వాదనలు విన్పిస్తూ వస్తున్నారు. ఉద్యోగుల విభజన విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణా విద్యుత్ సంస్థలు 1252 మంది ఉద్యోగులను తొలగించాయి. మరోవైపు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు స్వచ్ఛందంగా రిలీవ్ అయి, తెలంగాణ సంస్థల్లో చేరారు. ఉద్యోగుల ఆస్తుల విభజన కోసం నియమించిన షీలా బిడే కమిటీ అనేక పర్యాయాలు చర్చలు జరిపింది. స్థానికత మార్గదర్శకాలు రూపొందించే ప్రక్రియలో రెండు రాష్ట్రాల అధికారులు ఏకతాటిపైకి రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశం కొంత సానుకూలంగా ఉన్నట్టు ఇరుపక్షాల అధికారులు చెబుతున్నారు. జనవరిలో నిర్ణయం వెల్లడి 2014 జనవరి ఒకటవ తేదీ నాటికి విద్యుత్ సంస్థల ఆడిట్ బ్యాలెన్స షీట్స్ను పరిగణలోనికి తీసుకోవాలని, దీని ఆధారంగా ఆస్తుల విభజన చేయాలని కమిటీ సూచించింది. రెండు రాష్ట్రాలు వీటిని అందించాలని పేర్కొంది. దీనిపై ఏపీ, తెలంగాణ సమగ్ర వివరాలతో ముసాయిదాలను రూపొందించాలని తెలిపింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోగా వాస్తవ పరిస్థితిని వివరించాలని కోరింది. ఉద్యోగుల విభజన చేపట్టడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఆర్థిక పరిస్థితిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని రెండు రాష్ట్రాలు తమ నివేదికల్లో పేర్కొనాలని తెలిపింది. ఇరు పక్షాలు ఈ నివేదికలపై చర్చించుకుని డిసెంబర్ 30లోగా తమ అభ్యంతరాలు తెలపాలని కమిటీ సూచించింది. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని జనవరి మొదటి వారంలో రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని షీలాబిడే కమిటీ పేర్కొంది. కమిటీ సమావేశానికి ఏపీ తరపున ట్రాన్సకో సీఎండీ విజయానంద్, జేఎండీ దినేష్ పరుచూరి, జెన్కో డెరైక్టర్ (ఫైనాన్స) ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. -
పిడుగుపాటుకు కాలిపోయిన పరికరాలు
హత్నూర: మండలంలోని దౌల్తాబాద్లో గురువారం రాత్రి పిడుగుపాటుకు ఒక్కసారిగా ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్లు, ఎలక్ట్రికల్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ఒక్కసారిగా వర్షం, పిడుగుపాటుతో ఇళ్లలోని టీవీ, ఫ్రిజ్లు కాలిపోయి పొగలు వచ్చాయి. గ్రామంలో సుమారు 80శాతం ఎలక్ట్రికల్ పరికరాలు చెడిపోయినట్లు వారు తెలిపారు. -
అంధకారంలో వందకుపైగా గ్రామాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన గాలుల ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆదిలాబాద్లో కలెక్టరేట్ ప్రధాన ద్వారం, జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద భారీ వృక్షాలు నేలకొరి గారుు. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాలకు విద్యుత్ సరఫరా చేసే లైన్ తెగిపోరుుంది. దీంతో జైనథ్ మండలంలో సుమారు 55 గ్రామాలు, బేల మండలంలో 65 గ్రామాలు, ఆదిలాబాద్ మండలంలో 70కిపైగా గ్రామా ల్లో అంధకారం నెలకొంది. తాంసి, తలమడుగు మండలాల్లో కూడా కొంత నష్టం వాటిల్లింది. విద్యుత్ సిబ్బంది, అధికారులు ఆదివారం ఉదయం నుంచే పునరుద్ధరణ పనులు చేపట్టారు. జిల్లాలోని నార్నూర్ మండలంలో శనివారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలులకు 17 ఎకరాల్లో అరటితోటకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన 50 లక్షల రూపాయల విలువైన పంట నేలకొరిగింది. మెదక్ జిల్లాలో మహిళ దుర్మరణం జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారంరాత్రి ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. మన్నాపూర్లో ఓ ఇంటిపై ఉన్న కర్ర తలపై పడడంతో అమీనాబీ(35) అనే గృహిణి మరణించింది. ఏసప్ప, సిద్ధప్ప ఇళ్లపై భారీ మర్రి వృక్షం కూలడంతో వారి ఇళ్లు దెబ్బతిన్నాయి. నిద్రలో నుంచి తేరుకున్నవారు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. -
రేణిగుంట ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో అగ్నిప్రమాదం
తిరుపతి: రేణిగుంట ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ వైర్లకు సంబంధించిన ఓ కార్మాగారంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సంఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మేత కోసం వస్తే.. కాటేసిన తీగలు
♦ 29 ఆవులు మృత్యువాత వైర్లు తెగిపడటంతో విద్యుదాఘాతం ♦ కరువు వేళ బతికించుకుందామని వస్తే.. బలైన వైనం ♦ అంతర్గాం, ఇబ్రహీంపూర్లో ఘటనలు పిడుగుపాటుకు ♦ మరో రెండు ఎడ్లు మృతి దుఃఖసాగరంలో బాధిత రైతులు ♦ ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు పరిహారమిస్తామన్న ట్రాన్స్కో ఎస్ఈ ఘోరం జరిగిపోయింది... పూడ్చలేని నష్టం ఏర్పడింది... యమపాశాలుగా మారిన విద్యుత్ తీగలకు అభం శుభం తెలియని 29మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. అస్తవ్యస్త తీగలు తెగిపడుతున్నాయి. ఫలితంగా విలువైన పశుసంపదకు తీవ్రనష్టం చేకూరుతుంది. తాజాగా జిల్లాలో రెండు చోట్ల విద్యుత్ తీగలు తెగి పడడంతో 29 ఆవులు, పిడుగు పడడంతో మరోచోట రెండు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలతో రైతాంగం దుఃఖసాగరంలో మునిగింది. కరువుతో పశువులను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతుంటే విద్యుత్ తీగలు వాటిని వెంటాడుతున్నాయి. కల్హేర్/న్యాల్కల్: కరెంటు కాటుకు వేర్వేరు చోట్ల 29 మూగజీవాలు నేలకొరిగాయి. పిడుగుపాటుకు ఇంకోచోట రెండు పశువులు ప్రాణా లు విడిచాయి. అకాల వర్షాల కారణంగా వీచిన ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడడంతో పాడి పశువులు మృత్యువాత పడ్డాయి. రెండేళ్లుగా కరువు కాటకాలతో అష్టకష్టా లు పడుతున్న రైతన్నను తాజా ఘటనలు కోలుకోలేని దెబ్బతీశాయి. గ్రాసం, నీటికోసం కల్హేర్ మండలం అంతర్ గాంకు వలస వచ్చిన పశువులను విద్యుత్ వైరు రూపంలో మృత్యువు కబళించింది. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న పశువుల మందపై 11కేవీ విద్యుత్ వైరు తెగిపడడంతో 23 మూగజీవాలు అక్కడికక్కడే ప్రాణాలు వది లాయి. కంగ్టి మండలానికి చెందిన ధూంసింగ్, గోవిం ద్, రమేష్ అనే రైతులు తమ కుటుంబాలతో కలిసి దాదాపు 300 పశువులను తీసుకుని వలస వచ్చారు. పగలంతా పశువులను మేపి రాత్రి పూట ఓ పొలం వద్ద పశువులను కట్టి ఉంచగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా సోమవారం మధ్యాహ్నం న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్లోనూ విద్యుత్ వైరు తెగిపడడంతో ఆరు ఆవులు మరణించాయి. ఇక్కడా 11కేవీ విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో తీగ లు తెగి పశువులపై పడడంతో విద్యుదాఘాతం తో కన్నుమూశాయి. హత్నూర మండలం చింతల్చెరువు శివారులో ఆదివారం రాత్రి పిడుగుపడడంతో రెండు ఎడ్లు మరణించాయి. ఇలా పెద్ద సంఖ్యలో పశువులు మృతి చెందడం తో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈనెల ఒకటిన పెళ్లిబృందం లారీని విద్యుత్ తీగలు తగల డంతో విద్యుదాఘాతానికి గురై ఏడుగురు మరణించిన విషయం తెల్సిందే. ఈ ఘటనను మరచిపోకముందే 31 పశువులు మృత్యువాత పడడం అందరిని కలిచివేసింది. బోరున విలపించిన రైతులు... పశువులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడడం తో కల్హేర్ మండలం అంతర్గాం, న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కంగ్టి మండలానికి చెందిన ధూంసింగ్, గోవింద్, రమేష్, ఇబ్రహీంపూర్కు చెందిన రైతులు నాగమ్మ, దేవేందర్, మానిక్, పి.దేవేందర్ కన్నీరుమున్నీరయ్యారు. ఓవైపు కరువు కాటేస్తే మరోవైపు పశువులను పోగొట్టుకున్నామంటూ తల్లడిల్లిపోయారు. అంతర్గాంలోనే ఖననం... మరణించిన పశువులకు అంతర్గాంలోనే వెట ర్నరీ వైద్యులు సయ్యద్ ముస్తాక్, నేతాజీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అక్కడే జేసీబీతో పెద్ద గోతి తవ్వి వాటిని ఒకేచోట ఖననం చేశారు. ఖననం సందర్భంగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతులే కాకుండా స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోరున విలపించారు. బతికించుకుందామని వస్తే... కరువు కారణంగా పశువులను బతికించుకునేందుకు కల్హేర్ వైపు వస్తే ఇలా జరిగిందంటూ కంగ్టి మండలం ముకుంద్నాయక్ తండాకు చెందిన ధూంసింగ్, సాధు తండాకు చెందిన గోవింద్, గాజుల్పాడుకు చెందిన రమేష్ కుటుంబీకులు వాపోయారు. నీటి జాడలున్నాయని పశువులను తీసుకుని వారం రోజుల క్రితం ఇటువైపు వస్తే ఈ దుర్ఘటన జరిగిందంటూ బోరుమన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. గిరిజనులకు తప్పిన ప్రమాదం అంతర్గాం ఘటనలో గిరిజన రైతులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రైతులు ధూంసింగ్, గోవింద్ కుటుంబీకులు రామారావు, అశోక్, సుభాష్, కాలు, రమేష్, శివ, రాహుల్ తమ పశువుల మంద పక్కనే నిద్రించారు. వైరు తెగి పశువుల మీద పడిన సమయంలో వీరంతా పక్కనే నిద్రలో ఉన్నారు. పశువుల అరుపులకు వీరు లేచేసరికి ఘోరం జరిగిపోయింది. మరణించిన పశువుల విలువ దాదాపు రూ.10 లక్షలకుపైగా ఉంటుందని అంచన. ట్రాన్స్కో అధికారుల నిలదీత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే 23 పశువులు మృతి చెందాయని అంతర్గాం వాసులు ట్రాన్స్కో అధికారులను నిలదీశారు. ట్రాన్స్కో ఎస్ఈ సదాశివరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఒక్కో పశువుకు రూ.40వేల చొప్పు న వారం రోజుల్లో పరిహారాన్ని అందజేస్తామని ఎస్ఈ ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పశుసంవర్థక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, ఖేడ్ సీఐ సైదానాయక్, ఆర్ఐ ఎండీ ఖాలీద్, వీఆర్ఓ సాయిలు, నాయకులు కృష్ణమూర్తి, రాంసింగ్, గుండు మోహన్, మహిపాల్రెడ్డి తదితరులు సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. పరిహారమిస్తామన్న తహసీల్దార్... న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ ఘటనలో బాధిత రైతులకు పరిహారమిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ్సింగ్, హద్నూర్ ఎస్ఐ సుభాష్, పశువైద్యాధికారి అజింక్య, ట్రాన్స్కో ఏఈ రవీందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో ఆవుకు రూ.40 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షల మేర పరిహారం వచ్చేలా కలెక్టర్కు నివేదిక పంపుతామని తహసీల్దార్ బాధిత రైతులకు హామీ ఇచ్చారు. విద్యుత్ అధికారులపై కేసు కల్హేర్: అంతర్గాం ఘటన నేపథ్యంలో ట్రాన్స్కో అధికారులపై కేసు నమోదు చేశామని సిర్గాపూర్ ఎస్హెచ్ఓ రవీందర్ సోమవారం తెలిపారు. నారాయణఖేడ్ సీఐ సైదానాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ వైరు తెగిపడడంతో 22 ఆవులు, ఓ గేదె మరణించిందని ఎస్హెచ్ఓ రవీందర్ వెల్లడించారు. ట్రాన్స్కో అధికారులను బాధ్యులు చేస్తూ కేసు నమోదు చేశామన్నారు. ట్రాన్స్కో అధికారులు, లైన్మన్పై విచారణ జరుపుతామన్నారు. పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి హత్నూర: చింతల్చెరువు శివారులో ఆదివా రం రాత్రి పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి చెందాయి. ఫత్త్తే హైమద్ అనే రైతుకు చెందిన రెండు ఎడ్లు గ్రామ శివారులోని పొలం వద్ద ఆదివారం రాత్రి కట్టేశాడు. ఉరుములతో కూ డిన వర్షంతోపాటు పిడుగుపడడంతో రెండు ఎడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతుతు పరిస్థితిని చూసి బోరున విలపిం చారు. లక్ష రూపాయల విలువల గల రెండు ఎడ్లు మృతిచెందడంతో తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు. మేపడానికి తోలుకొస్తే.. తీవ్ర కరువుతో కంగ్టి మండలంలో గ్రాసం, నీరు దొరుకుతలేదు. పశువుల తిప్పలు చూడలేక నీళ్లు, గ్రాసం కోసం కల్హేర్ మండలం అంతర్గాం వైపు వచ్చాం. గ్రాసం ఎక్కడ దొరికితే అక్కడికి పశువుల మందతో వలస పోతుంటాం. కరెంట్ షాక్ తగిలి 23 పశువులు చనిపోయినయి. పశువులు లేకపోతే మేం రోడ్డున పడినట్టే. - ధూంసింగ్, బాధిత రైతు -
నీ అంతుచూస్తా..
నడిరోడ్డుపై ఉన్న కారును అడ్డుతీయమన్న కానిస్టేబుల్పై వీరంగం, స్థంభించిన ట్రాఫిక్ నెల్లూరు(క్రైమ్) : ఓ వ్యక్తి తన కారును నడిరోడ్డుపై నిలిపి పండ్లు కొంటున్న తరుణంలో ట్రాఫిక్ స్థంభించింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది కారును రోడ్డుపక్కగా పెట్టమని కోరినందుకు కారు డ్రైవర్తో పాటు అందులో ఉన్న వారు కానిస్టేబుల్పై వీరంగం చేశారు. ‘నీకెంత ధైర్యం రా.. నా కారునే ఆపుతావా.. నీ అంతుచూస్తా.. ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా’ అంటూ దౌర్జన్యానికి పూనుకున్నారు. ఈసంఘటన సోమవారం రాత్రి ఏసీ కూరగాయలమార్కెట్ సమీపంలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. సౌత్ట్రాఫిక్ కానిస్టేబుల్ సందీప్ కూరగాయల మార్కెట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. సింహపురి ఎలక్ట్రికల్స్ షాపు ఎదురుగా ఓ వ్యక్తి కారును నడిరోడ్డుపై ఆపాడు. అందులో ఉన్న మహిళలు పండ్లు కొంటుండగా ట్రాఫిక్ స్థంభించింది. ఈవిషయాన్ని గమనించిన సందీప్ ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోంది, అక్కడ నుంచి కారు తీయాలని డ్రైవర్కు సూచించాడు. అయినా అతడిని పట్టించుకోకపోవడంతో దగ్గరకు వెళ్లి కారును తీయమని గద్దించాడు. దీంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ కానిస్టేబుల్పై తిరగబడ్డాడు. ఇంతలో కారులో వచ్చిన మహిళ కానిస్టేబుల్ వద్దకు వచ్చి ఎంత ధైర్యముంటే నా డ్రైవర్నే తిడుతావా అంటూ కానిస్టేబుల్ను నానా దుర్భాషలాడింది. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్థంభించింది. కూరగాయల వ్యాపారులు, మార్కెట్కు వచ్చిన నగర వాసులు అక్కడకు చేరుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా శాంతించని సదరు మహిళ వారిని ఏకవచనంతో సంబోధించి నానా దుర్భాషలాడింది. అంతేకాకుండా సదరు కానిస్టేబుల్ను నీ అంతుచూస్తా? అంటూ తన బందువులకు ఫోనుచేసి అక్కడకు పిలిపించింది. దీంతో కానిస్టేబుల్ సైతం తన సహచరులను పిలిపించుకుని వివాదం విషయాన్ని ట్రాఫిక్ డీఎస్పీ రామారావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకొనేలోపే కారుడ్రైవర్ కారువేగాన్ని పెంచి కానిస్టేబుల్స్ను తోసుకుంటూ అక్కడ నుంచి వె ళ్లిపోయారు. తమను నానా దుర్భాషలాడారని, ఇలాగైతే తాము ఉద్యోగం చేయలేమని బాధితుడితోపాటు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది డీఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన విషయాన్ని బాధితుడు నేరుగా జిల్లా ఎస్పీ విశాల్గున్నీ దృష్టికి తీసుకెళ్లాడు. తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరాడు. ఇది ఇలా ఉంటే జరిగిన ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా, ఫొటోగ్రాఫర్లపై మహిళ, ఆమె తరపువారు తీవ్ర పదజాలంతో దూషించారు. -
ఆర్టీసీ బస్సుకు తగిలిన విద్యుత్ తీగలు
సెస్ ఎన్నికల సిబ్బందికి త్రుటిలో తప్పిన ప్రమాదం బస్సులో నుంచి కిందకు దూకిన ఎన్నికల సిబ్బంది సంఘటన స్థలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళన సెస్ ఎండీ నాంపల్లి గుట్టను నిలదీత సిరిసిల్ల రూరల్ : సెస్ ఎన్నికల సిబ్బంది త్రుటిలో విద్యుత్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెస్ ఎన్నికల రూట్ అధికారుల నిర్లక్ష్యంతో సిరిసిల్ల మండలం పెద్దూరు శివారులో 50 మంది ఎన్నికల సిబ్బంది ప్రయాణం చేస్తున్న ఆర్టీసీ బస్సుకు శనివారం సాయంత్రం విద్యుత్ వైర్లు తగిలి మంటలు లేచాయి. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో బతుకు జీవుడా అంటూ అందరూ కిందకు దూకారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విద్యుత్ సిబ్బంది సాయంతో బస్సును సురక్షితంగా బయటకు తీయించారు. విషయం తెలుసుకున్న సెస్ ఎండీ నాంపల్లిగుట్ట సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంతలో తేరుకున్న ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగారు. సెస్ అధికారుల తీరును నిరసించారు. ఎన్నికల రూట్ మ్యాప్ను సెట్ చేసిన అధికారుల తీరును ఎండగట్టారు. ‘మా ప్రాణాలు పోతే..ఎవరు బాధ్యత వహిస్తారు’ అని సెస్ ఎండీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సిబ్బంది తమతో నిర్లక్ష్యంగా మాట్లాడారని, వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్య తీసుకుంటామని, ఎన్నికల విధులకు హాజరు కావాలని నాంపల్లిగుట్ట కోరడంతో శాంతించారు. ప్రమాదంపై సిరిసిల్ల పోలీసులు విచారణ జరుపుతున్నారు. సిరిసిల్ల పట్టణంలో.. సిరిసిల్ల : పట్టణం నడిబొడ్డున శనివారం మధ్యాహ్నం త్రుటిలో భారీ విద్యుత్ ప్రమాదం తప్పింది. శివనగర్ జెడ్పీ హైస్కూల్ ఎదుట కామారెడ్డి ప్రధాన రహదారిలో విద్యుత్ వైరు తెగి కిందపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పుడు కామారెడ్డి డిపో బస్సు సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట వైపు వెళ్తోంది. రెండు క్షణాలు ముందుగా విద్యుత్ తీగ తెగి ఉంటే బస్సుపై పడి భారీ ప్రమా దం జరిగేది. విద్యుత్ తీగలతో మంట లు చెలరేగడంతో స్థానిక యువకులు కర్రల సాయంతో వైర్లను తొలగించారు. అదే ప్రాంతంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు సాగుతుండడంతో ఒకే వైపు నుంచి బస్సులు, వాహనాల రాకపోకలు సాగుతూ రద్దీగా ఉంది. ఇలాంటి సమయంలో విద్యుత్ తీగలు తెగిపడి మంటలు రేగడంతో స్థానికులు ఆందోళనకుగురయ్యారు. రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేసి తెగిన విద్యుత్ తీగను సరిచేశారు. -
రైల్వేట్రాక్పై తెగిపడ్డ విద్యుత్ తీగలు
ప్రకాశం (కంభం) : ప్రకాశం జిల్లా కంభం మండలం సూరేపల్లి గ్రామంలోని రైల్వే ట్రాక్పై సోమవారం సాయంత్రం విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో అటువైపు వెళ్తున్న రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నుంచి డోన్ వెళ్తున్న రైలు గంట నుంచి అక్కడే నిలిచిపోయింది. కాసేపట్లో అదే మార్గంలో రానున్న కాచిగూడ-గుంటూరు రైలుకు కూడా అంతరాయం కలుగనుంది. రైల్వేట్రాక్పై పడ్డ విద్యుత్ వైర్లను తొలగించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డు ఎదుట కరెంటు షాక్ తగిలి ఓవ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీపై కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తూ కరెంటు తీగలు తెగి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. -
పెరిగిన ‘కృష్ణపట్నం’ వ్యయం
రూ.5 వేల కోట్లకుపైగా అదనం తప్పుబట్టిన కాగ్ హైదరాబాద్: ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు ఖర్చుపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వివరణ కోరినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యయా న్ని పెంచారన్న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించిన నేపథ్యంలో ఏపీఈఆర్సీ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరణ ఇచ్చేందుకు ఏపీ జెన్కో మల్లగుల్లాలు పడుతోంది. వాస్తవానికి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్స్ మెగావాట్కు రూ. 5.5 కోట్లకు మించి వ్యయం కాకూడదు. కానీ కృష్ణపట్నం ప్రాజెక్టులో ఇందుకు విరుద్ధంగా ఖర్చు పెట్టారు.మెగావాట్కు రూ.8 కోట్ల వ్యయం చేశారు. ఇలా ప్రాజెక్టు వ్యయం రూ.12,850 కోట్లకు చేరినట్టు సమాచారం. అనుమతి తీసుకున్నారా? అనూహ్యంగా ప్రాజెక్టు వ్యయం పెరిగినప్పుడు విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఎందుకు పాటించలేదని ఏపీఈఆర్సీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఏపీ జెన్కో ఎండీ చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టును రూ. 10,450 కోట్లతో ప్రతిపాదించారు. 2011లో దీని వ్యయం ఏకంగా 12 వేల కోట్లకు చేరింది. గత ఏడాది మార్చి వరకూ రూ. 10,780 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఏడాది ఇంకా ఆడిట్ పూర్తి కాలేదు. పాత లెక్కల ప్రకారం లెక్కిస్తే ఇప్పుడది 12,850 కోట్లకుపైగానే ఉండే వీలుంది. కాగ్ తాజా నివేదికలో దీన్నే ప్రస్తావించింది. మెగావాట్కు ఏకంగా 3.3 కోట్ల మేర ఎక్కువ ఖర్చు చేశారు. ఈ లెక్కన 1,600 మెగావాట్లకు రూ.5,200 కోట్లు ఎక్కువగా వెచ్చించినట్టు తెలుస్తోంది. దీనికి నిర్ధిష్టమైన కారణాలు చూపాలని ఏపీఈఆర్సీ కోరుతోంది. ఏకంగా రూ 5వేల కోట్లకుపైగా ప్రాజెక్టు వ్యయం పెరగడాన్ని కాగ్ ఆక్షేపించింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యుత్ ఉద్యోగి మృతి
లింగాల : లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని లీలావతి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమ సమీపాన ఉన్న ఊట బాబిలో ప్రొద్దుటూరు వాసి మృతదేహం బయట పడింది. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యు.ఓంకార్ అచ్యుతానందరెడ్డి(37) ముద్దనూరులోని ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ సబ్స్టేషన్లో అసిస్టెంటు లైన్మెన్గా పని చేసేవాడు. ఈయన లింగాల మండలం అక్కులగారిపల్లెకు చెందిన ఓబుళమ్మను 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈయనకు చిన్ని(3), వేణుగోపాల్రెడ్డి(5) అనే కుమారులు ఉన్నారు. ఆయన భార్య, పిల్లలతో కలిసి అత్తగారింటికి గత ఆదివారం వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీకి వెళుతున్నానని ముద్దనూరు వెళ్లారని, మంగళవారం ప్రొద్దుటూరులో ఉన్నారని.. తాను అక్కులగారిపల్లెకు రాలేనని భార్యకు ఫోన్ చేసినట్లు సమాచారం. డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి.. ఆ తర్వాత భార్యకు గానీ, ఆయన తల్లిదండ్రులకు కానీ ఫోన్ చేయలేదు. అత్తారింటికి వెళ్లారని ఆయన తల్లిదండ్రులు.. డ్యూటీలో ఉన్నారని భార్య భావించారు. అయితే ఆయన సోమవారం శవమై బావిలో కనిపించారు. 5 రోజుల క్రితమే ఆయన బావిలో పడ్డారని, సోమవారం మృతదేహం నుంచి దుర్గంధం వాసన వస్తుంటే పక్క తోట రైతు ప్రభాకర్రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పాడుబడ్డ ఊట బావిలోకి దిగేందుకు వీలులేక భారీ పొక్లెయిన్ను తెప్పించి సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని వెలికితీశారు. ఆయన జేబులో ఉన్న ఐడీ కార్డులను పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఓంకార్ అచ్చుతానందరెడ్డి మద్యం సేవించి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వచ్చి పొరపాటున బావిలో పడ్డారా..లేక ఎవరైనా హత్య చేసి బావిలో పడవేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతిగా మద్యం సేవించి రోడ్డు వెంట నడుచుకుంటూ నాలుగు రోజుల క్రితం కనిపించారని ఇక్కడ ప్రజలు ఎస్ఐ తిమ్మారెడ్డికి తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఏదిఏమైనా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, దర్యాప్తు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్వో లూక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగాలడగం.. ఇస్తాం!
చక్కనిఆలోచన.. ప్రజలకు ఉపయోగపడే సేవలతో ఇపుడు స్టార్టప్లు అదరగొట్టేస్తున్నాయి. అందుకే వీటికి వినియోగదారుల ఆదరణతో పాటు ఇన్వెస్టర్ల విశ్వాసమూ పెరుగుతోంది. ఇలాంటి స్టార్టప్లను వెతికి... పాఠకులకు పరిచయం చేస్తోంది ‘సాక్షి స్టార్టప్స్ డైరీ’. దీనికి స్పందిస్తూ... ‘‘మేమూ స్టార్టప్స్ సేవలందిస్తున్నాం’’ అంటూ స్టార్టప్స్ఎట్దిరేట్సాక్షి.కామ్కు పెద్ద సంఖ్యలో ఈ-మెయిల్స్ వస్తున్నాయి. వాటిలో ఎంపిక చేసిన కొన్ని స్టార్టప్స్ ఈ వారం మీకోసం... - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్ ఆన్లైన్లో కరెంట్! ఆన్లైన్లో షాపింగ్ చేయడం.. సినిమా టికెట్లు కొనడం... ఇంతేనా! అదే అన్లైన్లో విద్యుత్ ఉపకరణాలనూ కొనుగోలు చేసే సేవలు ఆరంభించాలనుకున్నారు ఇద్దరు మిత్రులు. రూ.3 కోట్ల పెట్టుబడులతో దేశంలో తొలిసారిగా ఎలక్ట్రికల్ వస్తువుల సమాచారం, కొనుగోళ్లు, రాయితీల కోసం ఎలక్ట్రికల్స్.కామ్ సంస్థను ప్రారంభించారు చిన్ననాటి మిత్రులైన అజయ్, విజయ్... దీన్లో స్విచ్చుల నుంచి సబ్ స్టేషన్ల వరకు ఇండస్ట్రియల్, డొమెస్టిక్ రెండు విభాగాలకు అవసరమైన దాదాపు లక్షకు పైగా విద్యుత్ ఉపకరణాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్స్.కామ్.. హావెల్స్, యాంకర్, సఫారియా, రాకో, సూర్య, స్నైడర్, రిచెమ్ వంటి సుమారు 256 జాతీయ, అంతర్జాతీయ ఎంఎన్సీ కంపెనీలకు చానల్ పార్టనర్గా కొనసాగుతోంది. అల్ట్రాటెక్, బీహెచ్ఈఎల్, హానెస్టీ ట్రేడర్, ఐటీడీ, అక్యురేట్ ఇంజనీర్స్, భారత్ పెట్రోలియం, గోద్రెజ్, షాపూర్జీ పల్లోంజీ వంటి సుమారు 40 వరకు కంపెనీలు దీనికి కస్టమర్లు. అయితే ఈ విద్యుత్ ఉపకరణాలు బయటి మార్కెట్లోనూ దొరుకుతాయి కదా... అలాంటప్పుడు ఎలక్ట్రికల్స్.కామ్తో ఉపయోగమేంటనే సందేహం రావచ్చు. కానీ పారిశ్రామిక రంగాలు పెద్ద మొత్తంలో విద్యుత్ ఉపకరణాలను కొనుగోలు చేయాలంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరో, డీలర్ల దగ్గరో కొనాలి. దీనికి సమయం, డబ్బు రెండూ ఎక్కువే. ఎలక్ట్రికల్స్.కామ్తో అయితే ఒక్క రోజులోనే వస్తువులను కొనడంతో పాటు మార్కెట్ రేటు కంటే 20-30% తక్కువకే పొందవచ్చు. ‘వస్తువుల డెలివరీ కోసం ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాం. రూ.500 కంటే ఎక్కువ.. 500 కిలోల బరువుండే వస్తువుల వరకు డెలివరీ చార్జీలను కంపెనీనే భరిస్తుంది. పెట్టుబడులొస్తున్నాయి కానీ ఈక్విటీ రూపంలో వస్తేనే తీసుకుంటాం’ అని వ్యవస్థాపకులు చెప్పారు. ఇంట్లో ల్యాప్టాప్ మర్చిపోయారా? పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఆర్డరిస్తే ఇంటికి తెచ్చే సంస్థలున్నాయని మనకు తెలుసు. కానీ, ఇంట్లో మర్చిపోయిన ల్యాప్ట్యాప్ను, ఆఫీసు ఫైళ్లనూ చెప్పిన చోటుకు తీసుకొచ్చే సంస్థ ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రూ.20 లక్షల పెట్టుబడితో వీడెలివరీ.ఇన్ పేరుతో శ్రీనివాస్, కృష్ణ చైతన్య రెడ్డి కల సి ఇలాంటి సేవలనే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్, చెన్నై నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే విశాఖపట్నంలో కూడా ప్రారంభించనున్నారు. ఎన్నారైలు తమ కుటుంబ సభ్యులకు మందులు, బహుమతులు వంటివి పంపించేందుకు వీడెలివరీని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇందులో వాటిని ఎక్కడ కొనాలో.. ఎక్కడ డెలివరీ చేయాలో కూడా కస్టమరే చెబుతారు. కంపెనీ కేవలం మధ్యవర్తి మాత్రమే. ప్రస్తుతం రోజుకు 60-80 వరకు ఆర్డర్లొస్తున్నాయి. మొదటి 5 కి.మీ.లకు రూ.75.. ఆ తర్వాత ప్రతి కి.మీ.కు రూ.10 చొప్పున చార్జీ ఉంటుంది. ‘‘ఫ్లిప్కార్ట్ సంస్థ రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. కానీ, రూ.6 కోట్ల నిధుల కోసం చూస్తున్నాం. వెంచర్స్ కేపలిస్ట్లతో మాట్లాడుతున్నాం. త్వరలోనే నిధులు సమీకరించి కంపెనీ సేవలను మరింత విస్తరిస్తాం’’ అని వివరించారు శ్రీనివాస్. దహన సంస్కారాలకూ వెబ్సైట్.. షాపింగ్కో.. సినిమాలకో కాదు దహన సంస్కారాలకూ ఆన్లైన్ సేవలున్నాయండోయ్. అది కూడా హైదరాబాద్లో. రూ.50 వేల పెట్టుబడితో నగరంలో ఠీఠీఠీ.్చట్టఛ్చీడట్ఛటఠిజీఠ్ఛిట.ఛిౌఝ ను ప్రారంభించాడు ఖమ్మంకు చెందిన సుధాకర్. చనిపోయిన వ్యక్తి కుటుంబంలో అందరూ బాధల్లో ఉంటారు. ఇలాంటి సమయంలో దహన సంస్కారాలకు కావాల్సినవి(శవ పేటిక, డప్పుళ్లు, వాహనం, ఫ్రీజర్ బాక్స్, పూజ సామగ్రి.. వంటివి) ఎక్కడ దొరుకుతాయో తెలియవు. ఒకవేళ తెలిసినా అవసరం మనది కాబట్టి ఎంత అడిగినా ఇవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటి చిక్కుల్లేకుండా అన్ని మతాలకు చెందిన దహన కార్యక్రమాలకు సంబంధించిన సామగ్రిని ఉచితంగానే ఆర్డర్ చేయవచ్చిక్కడ. ఇందుకోసం నగరంలోని సుమారు 20 మంది సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ. కంపెనీకి ఫోన్ చేసిన గంటలోపు ఆర్డరిచ్చిన వస్తువులను ఇంటికి తెచ్చిస్తారు. ఇతర మెట్రో నగరాలకు ఈ సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని, నిధుల సమీకరణకు హైదరాబాద్ ఏంజిల్స్తో చర్చించామని, త్వరలోనే కొత్త మొత్తాన్ని సేకరించి సంస్థ సేవలను ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకూ విస్తరిస్తామని చెప్పారు సుధాకర్. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు
వరంగల్ : వరంగల్ జిల్లా సమీపంలోని ఎల్గూర్ రంగంపేట వద్ద బుధవారం ఉదయం రైల్వే విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్గూర్ రంగంపేట వద్ద విద్యుత్ వైర్లు తెగిన విషయం తెలిసిన వెంటనే సమీప రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. విజయవాడ సికింద్రాబాద్, పలాస, బల్లార్ష వైపు వెళ్లే రైళ్లను ఆపేశారు. 2 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కె. సముద్రంలో తమిళనాడు, గుండ్రామడుగులో శాతవాహన , నెక్కొండలో సింహపురి ఎక్స్ప్రెస్, మహబూబాబాద్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లను నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది విద్యుత్ వైర్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. -
షార్ట్ సర్క్యూట్ తో్ లారీ దగ్ధం
అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మల్లాయగూడెం గ్రామం వద్ద కరెంటు తీగలు తగిలి ఓ లారీ దగ్ధమయ్యింది ఈ ప్రమాదంలో లారీలో ఉన్న అలంకరణ సామగ్రి అంతా కాలి బూడిదైపోయింది. ఈ అలంకరణ సామగ్రిని వినాయకపురం తిరునాళ్లకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. ఎంత నష్టం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. -
గాంధీహిల్కు మహర్దశ
మార్చిలో రూ.40లక్షలతో అభివృద్ధి పనులు రూ.కోటితో ప్లానిటోరియానికి మరమ్మతులు ఎలక్ట్రికల్ వైరింగ్కు మరో రూ.40 లక్షలు ఏపీటీడీసీ ఆధ్వర్యంలో పనులు గాంధీహిల్ అభివృద్ధి పనులు వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. రూ.40లక్షలతో జరిగే సివిల్ వర్క్స్ టెండర్ను గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్ అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. సివిల్ వర్క్లో భాగం కొండపైన ఉన్న రైల్ట్రాక్, ప్లానిటోరియానికి మరమ్మతులు, పక్కనే రిటైనింగ్ వాల్ నిర్మాణం, పెయింటింగ్స్ చేపడతారు. - సాక్షి, విజయవాడ రూ.3 కోట్లు కేటాయింపు సెంట్రల్ టూరిజం డెవలప్మెంట్ స్కీమ్ కింద గాంధీహిల్ అభివృద్ధికి గత యూపీఏ ప్రభుత్వాన్ని రూ.5 కోట్లు కోరగా, రూ.3 కోట్లు కేటాయించింది. ఇందులో తొలివిడతగా రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. వీటి లో రూ.40 లక్షలు సివిల్ వర్కులకు, మరో రూ.40లక్షలు ఎలక్ట్రికల్ వర్కులకు, రూ.కోటి ప్లానిటోరియంకు కేటాయించారు. రూ.40లక్షలతో విద్యుత్ పనులు సివిల్ వర్క్స్తో పాటే రూ.40లక్షలతో విద్యుత్ పనులకు టెండర్లు పిలిచారు. నాలుగైదు రోజుల్లో టెండర్లు ఖరారుచేసి వచ్చే నెలలో పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్లానిటోరియానికి ఆధునిక విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు కొండపైకి వెళ్లే మార్గంలోనూ, కొండ పై భాగంలోనూ విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. ఇందుకోసం కొత్త వైరింగ్ వేయనున్నారు. రూ.1.20 కోట్లతో అభివృద్ధి ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ.1.20 కోట్లు మంజూరు కాగానే, గాంధీహిల్పై పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు, ఫుడ్కోర్టు, ల్యాడ్ స్కేపింగ్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే, కొండపై గ్రీనరీని పెంచేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సహాయం తీసుకోనున్నారు. ప్లానిటోరియానికి అత్యాధునిక పరికరాలు గాంధీహిల్పై ఉన్న ప్లానిటోరియం పరికరాలు మూడు దశాబ్దాల కిందట ఏర్పాటుచేసినవి. వాటిని మార్పుచేసి హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియంలో ఉపయోగిస్తున్న యంత్రాలు, పరికరాలను తెప్పించాలని ఏపీటీడీసీ అధికారులు నిర్ణయించారు. రూ.కోటి విలువచేసే ఈ పరికరాలు ఏర్పాటుచేసే బాధ్యతను బిర్లా పానిటోరియానికే అప్పగించినట్లు తెలిసింది. రెండు నెలల్లో ఈ పరికరాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈలోగా ప్లానిటోరియ మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. ఈ పరికరాలు కూడా వస్తే సరికొత్త ప్లానిటోరియం సాక్షాత్కరిస్తుంది. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
విజయనగరం(వేపాడ): విజయనగరం జిల్లా వేపాడ మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందాడు. వివరాలు.... వేపాడ గ్రామానికి చెందిన పి.మహ్మద్(26) ఎలక్ట్రిక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం మహ్మద్ మృతదేహం గ్రామంలోని ఓ ఇంటి వద్ద కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కట్టుకున్నోడే.. కడతేర్చాడు..
తాళి కట్టిన చేతులతోనే ఊపిరి తీసిన భర్త కరెంట్షాక్తో చనిపోరుుందని నమ్మించబోరుున నిందితుడు పెళ్లయిన తొమ్మిది నెలలకే దారుణం కేసముద్రం : కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడయ్యూడు. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసి, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త తాళికట్టిన చేతులతోనే గొంతు నులిమి భార్యను కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని కల్వల గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై రంజిత్రావు తెలిపిన ప్రకారం. గ్రామానికి చెందిన చిదిరాల సంతోష్కు మానుకోట మండలం నడివాడకు చెందిన అతడి సొంత అక్క విజయ కూతురు మౌనిక(18)తో 9 నెలల క్రితం వివాహమైంది. సంతోష్ హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. అతడు పెళ్లరుున నెలకే హైదరాబాద్కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయూడు. దీంతో మౌనిక అప్పట్లోనే పుట్టింటికి వచ్చింది. కూతురి పరిస్థితి చూడలేక ఆమె తండ్రి నాగన్న మనోవేదనకు గురయ్యూడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. బావ మరణవార్త తెలుసుకున్న సంతోష్ నడివాడ కు చేరుకున్నాడు. అక్కడ బంధువులంతా అతడిని మందలించడంతో తాను ఇక నుంచి మౌనికను మంచిగానే చూసుకుంటానని చెప్పాడు. పెద్దమనుషులు సంతోష్ పేరిట ఉన్న ఆస్తిని మౌనిక పేరున రాసివ్వాలని నిబంధన పెట్టడంతో సరేనని తనకున్న ఆస్తిని రాసిచ్చాడు. ఆ తర్వాత భార్యను కల్వల గ్రామానికి తీసుకెళ్లిన సంతోష్ అయిష్టంతోనే సంసార జీవితం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ‘నాతో సరిగ్గా ఉండడం లేదు.. నువ్వు మళ్లీ మరో మహిళతో సంబంధాన్ని సాగిస్తున్నావా’ అని మౌనిక ప్రశ్నించడంతో ఆగ్రహం చెందిన సంతోష్ ఆమె గొంతు నులుముతూ గోడకు నెట్టాడు. గొంతును గట్టిగా నులిమి హతమార్చాడు. తనపై కేసవుతుందనే భయంతో కరెంటు షాక్తో చనిపోయినట్లుగా ట్యూబ్లైట్ పగులగొట్టి, తర్వాత విద్యుత్ తీగలు వేలాడదీసి ప్రమాదంగా చిత్రించాడు. తర్వాత బయటికి వచ్చి అతడు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారంతా ఆమెను మానుకోటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అప్పటికే మృతిచెందిన విషయం తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం మృతురాలి తల్లి, సోదరుడు మునీందర్తోపాటు బంధువులు చేరుకుని సంతోష్ను నిలదీయగా పారిపోయూడు. ఎస్సై రంజిత్రావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా భార్యను గొంతు పిసికి హత్యచేసిన సంతోష్ను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బొమ్మనబోయిన అనసూర్య డిమాండ్ చేశారు. -
షార్ట్సర్క్యూట్తో చెరుకుతోట దగ్ధం
గండేడ్: వేలాడుతున్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో షార్ట్సర్క్యూట్ ఏర్పడి ఐదెకరాల చెరుకుతోట దగ్ధమైంది. రూ. 5 లక్షల ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన మం డల పరిధిలోని రెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జి. బాల్రెడ్డి ఐదెకరాల పొలంలో చెరుకు పంట సాగుచేస్తున్నాడు. చెరుకు తోట పైనుంచి విద్యుత్ తీగలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గురువారం ఉదయం ఈదురుగాలులకు విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి షార్ట్సర్క్యూట్ ఏర్పడింది. నిప్పురవ్వలు కిందపడడంతో కోసేందుకు సిద్ధంగా ఉన్న చెరుకుపంటకు మంటలు వ్యాపించాయి. విషయం గమనించిన పొరుగు రైతు లు బాల్రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మహబూబ్నగర్ నుంచి వచ్చేసరికి ఆలస్యం జరిగింది. అప్పటికే గ్రామానికి చెందిన యువకులు, మహ్మదాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే పంట 80 శాతం పూర్తిగా కాలిపోయింది. చేతికి అందివచ్చిన పంట బుగ్గిపాలైందని రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని పలుమార్లు ట్రాన్స్కో అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తినష్టం జరిగిందని రైతు బాల్రెడ్డి తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
కాటేసిన విద్యుత్ తీగలు
అంతవరకు తోటి పిల్లలతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ సరదాగా గడిపిన ఆ బాలుడ్ని మృత్యువు విద్యుత్ తీగల రూపంలో కాటేసింది. అవి తగిలీ తగలడమే పెద్దశబ్దంతో క్షణాల్లో మంటు వ్యాపించాయి. ఆ మంటలో చిక్కుకున్న బాలుడ్ని అతికష్టమ్మీద స్థానికులు బయటకు తెచ్చినా సకాలంలో ఆస్పత్రికి తరలించేందుకు వాహన సౌకర్యం లేకపోవడంతో సుమారు గంటన్నర పాటు మృత్యువుతో పారాడి చివరకు ప్రాణాలు విడిచాడు. చీడికాడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల అగ్రహారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చీడి కాడ: అడవుల అగ్రహారానికి చెందిన దాలిబోయిన రవితేజ (11) గ్రామంలోని యూపీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. నిరుపేదలైన రవితేజ తల్లిదండ్రులు చిలుకు, నాగేశ్వరిలు ఉపాధి కోసం మద్రాస్కు వలసవెళ్లారు. దీంతో రవితేజ వృద్ధురాలైన నాయనమ్మ సన్నెమ్మ వద్ద గ్రామంలోనే ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన రవితేజ ఐదు గంటల సమయంలో తోటి పిల్లలతో రామాలయం ఎదుట షటిల్ ఆడుతున్నాడు. షటిల్ కాక్ పక్కనే ఉన్న కమ్యూనిటీ భవనం శ్లాబ్పై పడింది. అదే శ్లాబ్ను అనుకుని ఎల్టీ లైన్ విద్యుత్ తీగలున్నాయి. కాక్ తెచ్చేందుకు శ్లాబ్ ఎక్కిన రవితేజ వాటిని తాకడంతో ఒక్కసారిగా మంటల చేలరేగాయి. హాహాకారాలు చేస్తున్న అతడిని చూసి వైఎస్సార్ సీపీ నాయకుడు గంటా మత్స్యరాజు పరుగున ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం మంటల్లో చిక్కుకున్న రవితేజను కిందికి దించారు. అప్పటికే ఆ బాలుడి పొత్తికడుపు కాలిపోయి పేగులు మొత్తం బయటకొచ్చాయి. కుడి కాలు ముడుకు నుంచి దిగువకు చర్మం మొత్తం కాలి ఎముకలు మిగిలాయి. మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలుడ్ని ఆస్పత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేయగా ఏ వాహనమూ అందుబాటులో లేదని సమాధానం చెప్పారని సర్పంచ్ నానాజీ తెలిపారు. ప్రవేటు వాహనంలో తరలించేందుకు ప్రయత్నించగా రవితేజ పరిస్థితిని చూసి వాహన యజమానులెవరూ ముందుకు రాలేదు. దీంతో సాయంత్రం 5.30 నుంచి 7గంటల వరకు రవితేజ తనను ఆస్పత్రికి తీసుకువెళ్లండంటూ రోదించి.. రోదించి చివరకు కన్నుమూశాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తన కళ్లల్లో పెట్టుకుని చూసిన మనుమడు మృతి చెందాడాన్ని జీర్ణించుకోలేని నాయనమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
థ్యాంక్యూ..మీరిక వెళ్లొచ్చు
సొంత ప్రాంతాలకు కరెంట్ కార్మికులు వెనక్కి పంపుతున్న ఈపీడీసీఎల్ దాదాపుగా విద్యుత్ పనులు పూర్తి వ్యవసాయ కనెక్షన్లకు మరికొన్నాళ్లు ఎమర్జన్సీ రిస్టోరేషన్ సిస్టం తొలగింపు హుద్హుద్ తుపానుకు ఛిన్నాభిన్నమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పొరుగు రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కార్మికులు తరలి వచ్చారు. రేయింబవళ్లు పని చేశారు. అనుకున్నదాని కన్నా ముందుగానే పనులు పూర్తి చేశారు. విద్యుత్ వ్యవస్థ సాధారణ స్థితికి రావడంతో అధికారులు వారిని ఆయా ప్రాంతాలకు పంపించేస్తున్నారు. విశాఖపట్నం సిటీ: విద్యుత్ పునరుద్ధరణ కోసం నెల రోజులుగా పనిచేస్తున్న కార్మికులను వారివారి ప్రాంతాలకు పంపిస్తున్నారు. నాలుగు రోజుల్లోనే వేలాది మందిని తరలించారు. అక్కడక్కడా పనులున్నా తాము చేసేసుకుంటామంటూ ఈపీడీసీఎల్ ఇంజినీర్లు చెప్పడంతో వారంతా సొంత ప్రాంతాలకు బయల్దేరుతున్నారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 11.15 లక్షల సర్వీసులకు విద్యుత్ సరఫరాను సాధారణ పరిస్థితికి తీసుకురావడంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఊపిరితీసుకుంటోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో 19534 సర్వీసుల్లో 13495 సర్వీసులకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దాదాపు 7763 కనెక్షన్లకు ఇప్పట్లో విద్యుత్ సరఫరాను ఇవ్వలేమని ఆయా మండలాల్లోని విద్యుత్ ఇంజినీర్లు తేల్చేశారు. ఆయా సర్వీసులకు విద్యుత్ అందించాలంటే పొలాల్లోకి క్రేన్లు, జేసీబీ వంటి వాహనాలతో వెళ్లాలని కానీ రైతులు అందుకు అనుమతి ఇవ్వడం లేదని ఈపీడీసీఎల్కు నివేదించారు. పొలాల్లో పంట పాడవుతాదనే ఉద్దేశంతోనే రైతులు రానీయడం లేదని రైతులు చెబుతున్నట్టు తెలిపారు. దీంతో రాయలసీమ, ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులను పంపించేస్తున్నారు. ఈ నెల 6వతేదీ వరకూ మాత్రమే వారు చేసిన సేవలకు డబుల్ జీతాలను చెల్లించారు. 7వ తేదీ నుంచి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రోజువారీ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. జిల్లాకు చెందిన విద్యుత్ కార్మికులు మినహా ఇతరులు ఎవరు చేసినా చెల్లింపులు ఆపేయాలని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్జైన్ ఆదేశాలు జారీ చేశారు. స్తంభాలు కూడా తొలగింపు : హుద్హుద్ తుపాను గాలులకు ఒడిశాకు వెళ్లే గ్రిడ్కు చెందిన భారీ విద్యుత్ టవర్లు పెందుర్తి, కశింకోట, గరివిడి మార్గాల్లో పడిపోయిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో ఎమర్జన్సీ రెస్టోరేషన్ సిస్టం(ఇఆర్ఎస్) టవర్లు ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి విద్యుత్ను పునరుద్ధరించారు. కశింకోటలో మూడు,పెందుర్తి-గరివిడి మధ్య నాలుగు, పెందుర్తి-స్టీల్ప్లాంట్ మధ్య ఒకటి చొప్పున అప్పట్లో భారీ టవర్లను నిర్మించి విద్యుత్ను అందించారు. వాటి స్థానంలో కొత్త టవర్లను నిర్మించడంతో వాటిని తొలగించే పనిలో విద్యుత్ ఇంజినీర్లు పడ్డారు. మళ్లీ అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వాటిని వినియోగించుకునేందుకు వాటిని తొలగించి భద్రపరిచారు. జిల్లాలో ఇప్పటి వరకూ 40 వేలకు పైగా విద్యుత్ స్తంభాలను నిలబెట్టారు. రాయలసీమలోని ఎస్పీడీసీఎల్, తెలంగాణా, చెన్నై, ఒడిశా రాష్ట్రాల నుంచి ఈపీడీసీఎల్కు 70 వేల విద్యుత్ స్తంభాలు చేరుకున్నాయి. వాటిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 55 వేల నుంచి 58 వేల స్తంభాలను పాతినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఏజెన్సీ గ్రిడ్కు మరికొన్నాళ్లు జిల్లాలోని ఏజెన్సీ గుండా విశాఖకు వచ్చే విద్యుత్ గ్రిడ్ లైన్ మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో అప్పర్సీలేరు నుంచి విశాఖకు రావాల్సిన పలు మెగావాట్ల విద్యుత్ సామర్లకోట మీదుగా వస్తోంది. నేరుగా విశాఖకు రావాలంటే మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయి. -
ట్రాన్స్కోకు ‘ఫోరం’ షాక్
సంగారెడ్డి క్రైం : విద్యుత్ పనులు సకాలంలో చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ట్రాన్స్కోకు జిల్లా వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్కు చెందిన కూస వీరారెడ్డి కుటుంబంతో సిద్దిపేటలో నివాసముంటున్నాడు. తన పొలంలో కరెంట్ తీగలు ప్రమాదకరంగా మారిందని, వాటికి మరమ్మతులు చేపట్టాలని సిద్దిపేటలోని ట్రాన్స్కో శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2011 జూన్ 18న పొలంలో బోరు మోటారు స్విచ్ ఆన్ చేయబోయిన వీరారెడ్డి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తన భర్తకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, తనకు నష్టపరిహారం చెల్లించాలని మృతుడి భార్య కూస పద్మ ట్రాన్స్కో శాఖపై వినియోగదారుల ఫోరాన్ని 2013 ఫిబ్రవరి 8వ తేదీన ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం బాధితురాలికి రూ. 5 లక్షల నగదుతో పాటు రూ. 2వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు పాటిల్ విఠల్రావు ఆదేశాలు జారీ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీపై..... ఇన్సూరెన్స్ కిస్తీలు చెల్లించినప్పటికీ పాలసీని రద్దు చేసిన బజాజ్ అలయంజ్ ఇన్సూరెన్స్ కంపెనీపై జిల్లా వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. జహీరాబాద్ మండలం బూచినెల్లి గ్రామానికి చెందిన బ్యాగరి మల్లమ్మ సంగారెడ్డిలోని బజాజ్ అలయంజ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సంగారెడ్డిలో 2009 అక్టోబర్ 10న సంవత్సరానికి రూ. 10 వేలు చొప్పున రెండేళ్లకు కలిపి మొత్తం రూ. 20 వేలు చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకుంది. మూడో ప్రీమియం రూ. 10 వేలు ఏజెంట్కు చెల్లించింది. కాగా 2013 అక్టోబర్ 12వ తేదీన పాలసీ రద్దు అయినట్లు కంపెనీ నుంచి ఆమెకు లేఖ ద్వారా సమాచారం అందించారు. తాను ఏజెంట్ ద్వారా రూ. 10 వేలు చెల్లించినప్పటికీ పాలసీ ఎలా రద్దు చేస్తారని ఆమె జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం బాధితురాలికి రూ. 30 వేలు నష్టపరిహారంతో పాటు 9 శాతం వడ్డీ, రూ. 5 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు పాటిల్ విఠల్రావు ఆదేశాలు జారీ చేశారు. -
ఐడియా.. అదిరిందయా!
సిద్దిపేట రూరల్: విద్యుత్ వృథాను అరికట్టేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతోంది పొన్నాల గ్రామ పంచాయతీ. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల చొరవతో వీధి దీపాలకు ఆటోమేటిక్ సిస్టం ఏర్పాటు చేసి కరెంటును ఆదా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత ఉంది.. విద్యుత్ వృథా చేయకండి.. మరో మూడేళ్ల వరకు కరెంటు కష్టాలు తప్పవని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు నిత్యం ఏదో ఒక చోట ప్రకటనలు చేస్తున్నారు. దీంతో గృహావసరాల్లో విద్యుత్ వృథా తగ్గినా పంచాయతీల్లోని వీధి దీపాలు మాత్రం ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. మండలంలోని ఏ గ్రామంలో చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. రాత్రంతా వెలిగిన లైట్లను బంద్ చే యాల్సి ఉన్నా పలు చోట్ల సిబ్బంది నిర్లక్ష్యం అది సాధ్యపడటం లేదు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని కంకణం కట్టుకుంది పొన్నాల గ్రామపంచాయతీ. ఈ సమయంలో గ్రామ సర్పంచ్ మదిలో ఓ ఆలోచన మెరిసింది. తెల్లారగానే వీధి దీపాలు వాటంతట అవే ఆరిపోయేలా ఏదైనా ఏర్పాటు చేయాలనుకుంది. పొన్నాలతో పాటు మదిర గ్రామాలైన బట్రామ్పల్లి, కిష్టాసాగర్, గాంధీనగర్లలో కలిపి పంచాయతీ పరిధిలో 150 వీధి దీపాలు వెలుగుతాయి. వీటిలో పది నుంచి పన్నెండు వీధి దీపాలకు ఒక టైమర్ మిషన్తో అనుసంధానం చేశారు. రాత్రి 6నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా అందుతుంది. ఉదయం 6 దాటగానే కంప్యూటర్తో అనుసంధానం చేసిన టైమర్ మిషన్ ద్వారా వీధి దీపాలు ఆటోమేటిక్గా ఆరిపోతాయి. వీధి దీపాల నియంత్రణ పూర్తిగా కంప్యూటర్ ద్వారా ఏర్పాటు చేయడం వల్ల కరెంటు వృథా తప్పిందని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు చెబుతున్నారు. అన్ని పంచాయతీల వారు ఇదే పద్ధతిని అవలంబిస్తే విద్యుత్ వృథాను అరికట్టవచ్చని సూచిస్తున్నారు. విద్యుత్ ఆదా చేయడమే లక్ష్యం పెరుగుతున్న విద్యుత్ బిల్లులను నియంత్రించడంతో పాటు విద్యుత్ వృథాను అరికట్టడానికి ఈ ప్రయోగాన్ని ప్రారంభించాం. గతంలో గ్రామ పంచాయతీ విద్యుత్ సిబ్బంది వీధి దీపాలను సంపూర్ణంగా నియంత్రించలేక పోయారు. దీని వల్ల అప్పుడప్పుడు పగటి పూట కూడా వీధి దీపాలు వెలిగిన సందర్భాలు ఉన్నాయి. - తుపాలకుల ఎల్లమ్మబాల్రంగం, సర్పంచ్ -
పాను ప్రాంతాల్లో వెలుగులు నింపేందుకు..
తిరుపతి రూరల్: హుదూద్ తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించి పలు జిల్లా ల్లో అంధకారం నింపింది. ఈ నేపథ్యం లో తుపాను ప్రభావిత జిల్లాల్లో వెలుగులు నింపేందుకు డిస్కం నడుం బిగిం చింది. డిస్కం పరిధిలోని 8 జిల్లాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తుపా ను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు తరలివెళ్లారు. డిస్కం సీఎండీ హెచ్వై దొర ఆధ్వర్యంలో వీరు పనిచేయనున్నారు. 8 జిల్లాల నుంచి 2500 మంది ఆపరేషన్, మెయిన్టెనెన్స్ సిబ్బంది ఇప్పటికే బస్సుల ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపినట్లు డిస్కం సీఎండీ హెచ్వై దొర తెలిపారు. డిస్కం డెరైక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్ రాంసింగ్, డెరైక్టర్ ఆఫ్ హెచ్ఆర్ డి.నాగేశ్వరరాజులు సహా య పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆది వారం సాయంత్రం తిరుపతి సర్కిల్ నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో 270 మంది జెఎల్ఎంలు, ఏఎల్ఎంలు, లైన్ ఇన్స్పెక్టర్లు, ఏఇలు, ఏడీఇలు ఆపరేషన్, మెయిన్టెనెన్స్ సిబ్బంది 8 బస్సుల్లో వైజాగ్కు తరలి వెళ్లారు. ఎస్ఇ సుబ్బరాజు పచ్చజెండాను ఊపి బస్సులను పంపారు. వారం రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న సబ్స్టేషన్ను వీరు మరమత్తులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే చీఫ్ ఇంజనీర్ అనంత్కుమార్ వైజాగ్లో ఉండి పర్యవేక్షిస్తున్నారని ఆయన వివరించారు. -
మొదలైన కోతలు
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం మరింత జఠిలం కానుంది. రోజుకు మూడు వేల మెగావాట్ల మేరకు కొరత ఏర్పడుతున్నది. దీన్ని అధిగమించలేని పరిస్థితి నెలకొనడంతో విద్యుత్ బోర్డు వర్గాలు కలవరంలో పడ్డాయి. కోతల మోతకు సిద్ధమయ్యాయి. పవన విద్యుత్ మళ్లీ పుంజుకుంటుండడంతో చేయూతనిచ్చేనా అన్న ఉత్కంఠ నెలకొంది. సాక్షి, చెన్నై:రాష్ట్రంలో అవసరాలకు భిన్నంగా విద్యుత్ ఉత్పత్తి ఉన్న విషయం తెలిసిందే. రోజుకు 13 వేల మెగావాట్ల వరకు విద్యుత్ అవసరం ఉండడంతో కొరతను అధిగమించేందుకు విద్యుత్ బోర్డు, ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నారుు. ప్రైవేటు సంస్థల నుంచి మూడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు లక్ష్యంగా ఒప్పందాలు కుదిరినా, పవర్ గ్రిడ్ల ఏర్పాటులో నెలకొన్న జాప్యంతో ఆ విద్యుత్ రాష్ట్రానికి చేరడానికి మరికొంత కాలం పట్టే అవకాశాలున్నాయి. గత నెలాఖరు నుంచి విద్యుత్ సంక్షోభం క్రమంగా పెరుగుతోంది. దీంతో పరిశ్రమలకు 20 శాతం మేరకు కోతల ఆంక్షలు విధించారు. గ్రామాల్లో నాలుగు గంటలు, పట్టణాలు, నగరాల్లో రెండు గంటల అధికారిక, అనధికారిక కోతలు అమల్లోకి వచ్చారుు. ఈ నేపథ్యంలో జయలలితకు శిక్ష నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడితప్పింది. ఆ ప్రభావం విద్యుత్ బోర్డు మీద కూడా పడింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సగానికి సగం తగ్గడం, రాష్ర్ట ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నెలకొన్న సాంకేతిక లోపాలు వెరసి సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్ఎల్సీ నుంచి 1,120 మెగావాట్లు, వళ్లూరు నుంచి 715 మెగావాట్లు, కల్పాకం నుంచి 330, కైకా నుంచి 230, రామగుండం నుంచి 640, సింహాద్రి నుంచి 270, తాల్సర్ నుంచి 500 చొప్పున 3,800 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందాల్సి ఉంది. పాలనను పక్కన పెట్టి అమ్మ (జయలలిత)కు బెయిల్ ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం కావడంతో ఈ వాటాలో కోత ఏర్పడిందని చెప్పవచ్చు. ఎన్ఎల్సీ సమ్మెతో అక్కడి నుంచి విద్యుత్ సక్రమంగా సరఫరా కావడం లేదు. మూడు వేల మెగావాట్ల కొరత: కేంద్రం వాటాలో కొత పడడం, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు వెరసి రాష్ట్రంలో మూడు వేల మెగావాట్ల వరకు కొరత ఏర్పడింది. కేంద్ర వాటాగా ప్రస్తుతం రామగుండం నుంచి 500, వళ్లూరు నుంచి 1000, కల్పాకం నుంచి 200, ఎన్ఎల్సీ నుంచి 200 మెగావాట్లు మాత్రమే రాష్ట్రానికి అందుతోంది. మిగిలిన 1900 మెగావాట్ల సరఫరా ఆగడంతో విద్యుత్ బోర్డు వర్గాల్లో కలవరం బయలుదేరింది. దీనికితోడు రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో తలెత్తిన సాంకేతిక లోపంతో 1000 మెగావాట్లకు పైగా ఉత్పత్తి ఆగింది. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 4060 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఉత్పత్తి మూడు వేల మెగావాట్ల మాత్రమే అవుతోంది. తూత్తుకుడి, ఉత్తర చెన్నై ఉత్పత్తి కేంద్రాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడంతో అధికారుల్లో కలవరం రెట్టింపు అవుతోంది. ఇక కూడంకులం నుంచి రాష్ట్రానికి వాటాగా అందాల్సిన 500 మెగావాట్ల విద్యుత్ రాలేదు. దీంతో చెన్నై మినహా ఇతర నగరాలు, పట్టణాల్లోనూ కోత మోతకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. చెన్నైలో మాత్రం గంట పాటు కోతల్ని విధించే పనిలో పడ్డారు. పవన విద్యుత్ ఆదుకునేనా కేంద్రం, థర్మల్ విద్యుత్ కేంద్రాల రూపంలో మూడు వేల మెగావాట్ల మేరకు కొరత ఏర్పడ్డా, పవన విద్యుత్ ఆదుకునేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. మూడు రోజుల క్రితం వరకు పవన విద్యుత్ ఉత్పత్తి సున్న శాతంగా నమోదైంది. రాష్ట్రంలోని కన్యాకుమారి, తిరునల్వేలి, విరుదునగర్, తేని, కోయంబత్తూరు జిల్లాల్లోని పవన విద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు ఏడు వేల మెగావాట్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. గాలుల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడంతో ఉత్పత్తి తగ్గింది. నైరుతి రుతు పవనాల సీజన్ ముగిసిన నాటి నుంచి ఇరవై రోజులుగా పవన విద్యుత్ చతికిలబడింది. సున్న శాతంగా ఉన్న పవన విద్యుత్ శుక్రవారం పుంజుకుని 1700 మెగావాట్ల ఉత్పత్తి జరగడం కాస్త ఊరటనిచ్చింది. గాలుల ప్రభావం మరింత పెరిగిన పక్షంలో ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుందన్న భావనలో అధికార వర్గాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో గాలుల తీవ్ర అధికంగా ఉన్నా ఏ మేరకు పవన విద్యుత్ ఆదుకుంటుందోనన్న దానిపై వేచి చూడాల్సిందే. -
యమపాశాలు
విద్యుత్ తీగలు తెగిపడి షాక్కు గురై ఇద్దరి మృతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు మృతులిద్దరూ మేనత్త, మేనల్లుడు జంక్షన్లో ఘోర ప్రమాదం విద్యుత్ తీగలు యమపాశాలై రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. చెట్టుకొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో స్తంభం కూలిపోయింది. తీగలు తెగి ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై పడటంతో అతడిని కాపాడేందుకు తల్లి, మేనత్త యత్నించారు. ఈ ఘటనలో బాలుడితోపాటు అతడి మేనత్త మరణించారు. తల్లి షాక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పొందుతోంది. హనుమాన్జంక్షన్లో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. హనుమాన్జంక్షన్ : విద్యుత్ తీగలు తెగిపడటంతో షాక్కు గురై బాలుడు, అతడి మేనత్త మృతిచెందారు. జంక్షన్లో బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బాలుడి తల్లి కూడా షాక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలిలా ఉన్నాయి... స్థానిక కె.ఎస్.టాకీస్ ప్రాంతంలో సరిపల్లి రాజు కుటుంబం నివాసం ఉంటోంది. రాజు పంచాయతీ వాటర్వర్క్స్లో కాంట్రాక్టు ఉద్యోగి. అతడి ఇంటి సమీపంలో ఉన్న చెట్టు కొమ్మ బుధవారం విరిగి విద్యుత్ తీగలపై పడింది. దీంతో బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభం విరిగి కింద పడిపోయింది. తీగలు తెగి రాజు ఇంటి బయట ఆడుకుంటున్న అతడి కుమారుడు అఖిల్బాబు(2)పై పడ్డాయి. సమీపంలో దుస్తులు ఉతుకుతున్న బాలుడి మేనత్త కాటి రాజ్యలక్ష్మి(28), తల్లి దేవమాత విద్యుత్ తీగల్లో చిక్కుకున్న అఖిల్ను కాపాడేందుకు యత్నించి, షాక్కు గురయ్యారు. దీనిని చూసిన రాజు కుటుంబసభ్యులు, స్థానికులు కూడా వారిని రక్షించేందుకు యత్నించారు. స్థానికంగా ఉంటున్న కానిస్టేబుల్ రవి వారిని అడ్డుకున్నారు. మరికొందరు విద్యుత్షాక్కు గురవకుండా అప్రమత్తం చేసి పెనుముప్పును నివారించాడు. షాక్కు గురైన ముగ్గురిని స్థానికులు హుటాహుటిన స్థాని కంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. వైద్యులు పరీక్షించి అఖిల్, రాజ్యలక్ష్మి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దేవమాతకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. జంక్షన్ సీఐ వై.వి.రమ ణ, ఎస్సై బి.ప్రభాకరరావు, ఏఎస్సై కె.వి.పాండురంగారావు, విద్యుత్శాఖ ఏడీఈ డి.జగన్మోహనరావు, ఏఈ జె.ఎస్.నాగభూషణం ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడటం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఆ కుటుంబంలోని మిగతావారు రోదిస్తుండటం స్థానికులను కలచి వేసింది. కొన్ని నెలల కిందట కుమారుడిని ప్రసవించిన రాజ్యలక్ష్మిని సారెతో ఏలూరులోని అత్తారింటికి గురువారం పంపించేందుకు కుటుంబసభ్యులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఫోన్లో భర్తకు సంతోషంగా చెప్పిన రాజ్యలక్ష్మి.. బుధవారం నాటి దుర్ఘటనలో అకాల మరణం చెం దింది. ఆమెకు పసికందుతోపాటు మరో కుమార్తె ఉన్నారు. తల్లి మరణించిందన్న విషయం గ్రహించలేని నెలల పసికందు ఘటనాస్థలికి వచ్చిన వారిని అమాయకంగా చూస్తుండటం స్థాని కులను ఆవేదనకు గురిచేసింది. గన్నవరం ఎమ్మెల్యే వి.వంశీమోహన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు తదితర నేతలు మృతుల కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. న్యాయం కోసం ఆందోళన ఈ ఘటనకు సంబంధించి న్యాయం చేయాలంటూ రెండు మృతదేహాలతో సరిపల్లి రాజు కుటుంబసభ్యులు, గ్రామస్తులు విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులు దుట్టా శివన్నారాయణ, దయాల విజయనాయుడు, కైలే అనిల్కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, సర్పంచ్ కాకాని అరుణ, ఉప సర్పంచ్ కాకాని వెంకటేశ్వరరావు(బాబు), స్రవంతి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్, టీడీపీ నాయకులు దయాల రాజేశ్వరరావు తదితర నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వంశీమోహన్ అక్కడకు వచ్చి విద్యుత్ ఏడీఈ జగన్మోహనహనరావు, తహశీల్ధార్ గోపాలకృష్ణ, సీఐ వై.వి.రమణతో చర్చలు జరిపారు. రాజ్యలక్ష్మి కుటుంబానికి రూ.2 లక్షలు, అఖిల్ కుటుంబానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లిందుకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నుండి మౌఖికంగా హామీ లభించింది. దీంతో ఎమ్మెల్యే సూచనల మేరకు వారు అందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తరాలు మారినామారని తలరాత
మడికట్టు (చేవెళ్లరూరల్): తరాలు మారినా.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎంతమంది పాలకులు వచ్చినా ఆ గ్రామస్తుల తలరాత మాత్రం మారడం లేదు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ రాత మారేనా అని ఎదురు చూస్తున్నారు. మండలంలోని తంగడపల్లికి మడికట్టు అనుబంధ గ్రామంగా ఉంది. ఇక్కడి జనాభా దాదాపు 500కుపైనే. 350 మంది ఓటర్లున్నారు. ఏళ్లతరబడి గ్రామంలో సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. ఎన్నికల సమయంలోనో, ఏదైనా ప్రారంభోత్సవాల సందర్భంలో మాత్రమే నాయకులు, అధికారులు దర్శనమిస్తారని.. స్థానిక సమస్యల గురించి పట్టించుకునేవారే లేరని గ్రామస్తులు వాపోతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రధాన సమస్యలివీ.. గ్రామం మొత్తానికి ఒకేఒక బోరు మోటార్ ఉంది. దీంతోనే గ్రామానికి నీటి సరఫరా అవుతోంది. సింగిల్ ఫేజ్ మోటార్లు ఉన్నప్పటికీ నీళ్లు లేక పనిచేయటం లేదు. గ్రామానికి ఏడాది క్రితం బీటీ రోడ్డు వేశారు. ఆరునెలలు తిరక్కుండానే అది గుంతలమయంగా మారింది. వర్షం పడితే గుంతల్లో నీళ్లు నిలిచి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. గ్రామానికి వచ్చే ఒకేఒక బస్కు సైతం అంతరాయం తప్పడం లేదు. గుంతలను చూసి డ్రైవర్లు ఈ ఊరికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. గ్రామంలో ఇళ్లను తాకే ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామానికి విద్యుత్ను సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆన్ ఆఫ్ లేక సింగిల్ఫేజ్ కనెక్షన్తోనే సరఫరా అవుతోంది. ఏళ్ల కిత్రం ఒక్క మురుగు కాలువను నిర్మించారు. గ్రామంలో ఇళ్లు విస్తరిస్తున్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలను నిర్మించడం లేదు. ఉన్న ఒక్క కాలువను కూ డా శుభ్రం చేసేవారులేక పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇళ్ల మధ్యే మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఇక అంతర్గత రహదారులు లేవు. మట్టి రోడ్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. సర్పంచ్ తంగడ్పల్లిలో ఉండటంతో ఇక్కడి ప్రజల సమస్యలు తెలియటంలేదు. -
గాలి.. వాన...
సాక్షి, ఖమ్మం: జిల్లాలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షం పడింది. గాలివానతో కొత్తగూడెం అతలాకుతలమైంది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లుకూలి విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో రాత్రి వరకు పట్టణమంతా అంధకారంలోనే ఉంది. ప్రధానంగా కేటీపీఎస్ నుంచి సీతరామపట్నం వచ్చే విద్యుత్ లైన్ ట్రిప్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిం ది. అలాగే లక్ష్మీదేవిపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్పై పిడుగు పడి రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరాఫర లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొత్తగూడెం మండలంలోని రామవరం, రుద్రంపూర్, ధన్బాద్, ఎస్సీబినగర్, ప్రశాంతినగర్, 4 ఇంక్లైన్, గౌతంపూర్, వెంకటేష్ఖని, పెనుబల్లి, గరిమెళ్లపాడు, త్రీ ఇంక్లైన్, చుంచుపల్లి, సుజాతనగర్, అనిశెట్టిపల్లి, కారుకొండ, హేమచంద్రాపురం, సర్వారం, సింగభూపాలెం, సీతారాంపురం, రేగళ్ల, మైలారం, బంగారుచెలక, లక్ష్మిదేవిపల్లి, చాతకొండ పెనగడప పంచాయతీల్లో కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ స్తంభాల తీగలు తెగిపడ్డాయి. గాలివానతో కొత్తగూడెం పట్టణం, మండలంలో ట్రాన్స్కోకు భారీ నష్టం వాటిల్లింది. పాల్వంచలో భారీ వర్షంతో జాతీయ రహదారిపై పాత పాల్వంచ సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై పడింది. దీంతో సుమారు 4 గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటరు మేరకు వాహనాలు నిలిచిపోయాయి. మున్సిపల్, పోలీసు అధికారుల చొరువతో సిబ్బంది చెట్టును తొలగించడంతో ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఖమ్మం నగరంలో సాయంత్రం కురిసిన వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. గాలి దుమారంతో రాత్రి 7 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బయ్యారం మండలం జగ్గూతండలో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైరా, కొణిజర్ల, మధిర, చింతకాని మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పలు గ్రామాల్లోన్ని వీదులన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలన్నీ అంధకారంగా మారాయి. -
జిల్లాలో గాలివాన బీభత్సం
న్యూస్లైన్ నెట్వర్క్: జిల్లాలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని చర్ల, కూనవరం, చింతూరు, గుండాల, టేకులపల్లి మండలాల్లో గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చర్ల మండలంలో గాలిదుమారం.... చర్ల: చర్ల మండలంలో శనివారం సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలిదుమారం కారణంగా పలు గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరి గాయి. పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్లు విరిగి పడ్డాయి. దీంతో తీగలు తెగడంతో పాటు, స్తంభాలు విరిగిపోయాయి. మండలంలోని రాళ్లగూడెంలో ఓ తాటి చెట్టుపై పిడుగుపడి భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. దేవరాపల్లి, కుదునూరు, ఆర్ కొత్తగూడెం, సత్యనారాయణపురం, కలివేరు, గాంధీనగరం తదితర గ్రామాల్లో పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. దేవరాపల్లిలో 11కేవీ విద్యుత్ లైన్కు సంబంధించిన స్తంభాలు విరిగిపోగా, గొమ్ముగూడెంలో ఎల్టీ లైన్కు సంబంధించిన స్తంభం విరిగి పోయింది. చినమిడిసిలేరు, ఆంజనేయపురం, కలివేరు గ్రామాల్లో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు, తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లింగాపురం, గొంపల్లి, విజయకాలనీ, గుంపెన్నగూడెం తదితర గ్రామాలలో సైతం విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరా నిలిచిపోయింది. మండలంలోని సత్యనారాయణపురం, చర్ల విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని అన్నీ 11 కేవీ విద్యుత్ ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో మండలం మొత్తం అంధకారం నెలకొంది. చర్ల మండలంతో పాటు వెంకటాపురం వాజేడు మండలాలలకు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్లో కూడా పలు చోట్లు చెట్లు తీగలపై పడడంతో ఆ రెండు మండలాల్లో సైతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గుండాలలో భారీ వర్షం... గుండాల: గుండాల మండలంలో శనివారం రాత్రి గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలువాగులు, వంకల్లో స్వల్పంగా నీటి మట్టం పెరిగింది. ఈ వర్షానికి మల్లన్నవాగు, కిన్నెరసాని, జలేరు, దున్నపోతులవాగు, ఏడుమెలికల వాగుల్లో నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతర్గత రోడ్లు బురదతో నిండిపోయాయి. ఇల్లెందు - గుండాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జిల వద్ద రోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గాలిదుమారానికి పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. నిన్నమొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఊపిరిపీల్చుకున్నారు. కూనవరంలో గాలి దుమారం... కూనవరం: మండలంలో శనివారం రాత్రి ఒక్కసారిగా భారీగా గాలి దుమారం రావడంతో జనజీవనం అతలాకుతలం అయింది. మండలంలోని పల్లురు గ్రామంలో వందేళ్లనాటి భారీ వృక్షం ఒక పక్కనే ఉన్న సవలం భద్రమ్మ ఇంటిపై కూలింది. ఇంట్లోని వారంతా సమీప గ్రామంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరుకావడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసం అయింది. టేకులబోరు సమీపంలో ఓ చెట్టు రహదారిపై విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మర్రిగూడెం-పల్లూరు గ్రామాల మధ్య విద్యుత్ స్తంభం విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. గాలివాన కారణంగా మండలం కేంద్రంలోని పళ్ల పైకప్పులు లేచిపోయాయి. సుమారు గంటన్నర పాటు వీచిన గాలిన వాన బీభత్సం కారణంగా అనేక చోట్లు చెట్లు విరిగి పడడంతో రాకపోకలు స్తంభించాయి. టేకులపల్లిలో వర్షం టేకులపల్లి: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రెయినేజీల్లో మురుగునీరు బయటకు వచ్చింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఈ వర్షంతో సేదతీరారు. మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారం కారణంగా మండలంలోని ముత్యాలంపాడు, బొమ్మనపల్లి పంచాయతీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చింతూరులో... చింతూరు: మండలంలో శనివారం సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. చింతూరు, మోతుగూడెం రహదారిలో ఎర్రంపేట నుంచి లక్కవరం జంక్షన్ వరకు సుమారు 20 చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. చింతూరు, వీఆర్పురం రహదారిలో కూడా చింతూరు, చూటూరుల నడుమ పలుచోట్ల చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు చింతూరులోని శబరిఒడ్డులో పిసిని సోమరాజుకు చెందిన ఇంటిపై మామిడిచెట్టు కూలడంతో ఇల్లు కుప్పకూలింది. ఈదురు గాలుల ధాటికి పెదశీతనపల్లిలో వంజం పాపారావుకు చెందిన రేకుల ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గాలిదుమారం కారణంగా పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో మండలం లోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
సుడిగాలి శివాలు
విశాఖలో పిడుగుపాటుకు ఇద్దరు, షెడ్ కూలి ఒకరు గాయాలపాలు నేలకొరిగిన చెట్లు.. తెగిపడ్డ విద్యుత్ వైర్లు నిలిచిన విద్యుత్ సరఫరా.. అంధకారంలో నగరం సాక్షి, విశాఖపట్నం : వాన కురిసి ఊరట లభిస్తుందని ఆశ పడితే, పెనుగాలి హడలెత్తించింది. మండే ఎండ నుంచి కాస్త సేద తీరుదామనుకుంటే సుడిగాలి చెలరేగి కలవరపెట్టింది. గురువా రం సాయంత్రం నగరంలో, శివారు ప్రాంతాల్లో హోరుగాలుల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమయింది. రో జంతా ఎండ భయపెడితే, సాయంత్రానికి మబ్బులు కమ్మి సాంత్వన లభించింది. అంతలోనే ఈదురుగాలుల బీభత్సంతో నగరం చిరుగుటాకులా వణికిపోయింది. ఈ గాలుల ప్ర తాపానికి పలు చోట్ల చెట్లు నేలకొరిగా యి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. పద్మనాభం, మధురవాడ, భీమిలి, సాగర్నగర్, హెచ్బీకాలనీ, వాల్తేరు తదితర ప్రాంతాల్లో 40కిపైగా విద్యుత్ స్తంభా లు నేలకొరిగాయి. సాగర్నగర్, హెచ్బీ కాలనీతోపాటు ఐదు చోట్ల ట్రాన్స్ఫార్మర్ల పీఠాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలపై చెట్లు కూలడంతో.. కార్లు, ఆటోలు భారీగా ధ్వంసమయ్యాయి. ఉష్ణోగ్రతలే కారణం ఈదురు గాలుల బీభత్సానికి ఉష్ణోగ్రతల్లో పెరుగుదలే కారణమని వాతావరణ నిఫుణులు చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గాలులు వేడెక్కి తేలికై పైకి వెళ్లడం.. అక్కడ చల్లబడి నేలకుదిగే సమయంలో జరిగిన చర్య ల వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు పేర్కొన్నారు. గురువారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.6 డిగ్రీలుగా నమోదయింది. ఈ వేసవిలో ఈ స్థాయి ఉష్ణోగ్రత నగరంలో ఇదే ప్రథమమని వా తావరణ నిఫుణులు చెప్తున్నారు. ఉష్ణోగ్రతల వల్ల సాయంత్రం క్యూములోనింబస్ మేఘాలు ఓ చోట చేరి.. వీటి కి గాలి తోడైతే.. బీభత్సం తప్పదంటున్నారు. రానున్న రెండు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని పేర్కొన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
ఎక్కడికక్కడ రోడ్లపై విరిగిపడిన చెట్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం లోతట్టు ప్రాంతాలు జలమయం యలమంచిలి/యలమంచిలి రూరల్, న్యూస్లైన్: ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పెద్దఎత్తున గాలులు వీచా యి. పలుచోట్ల చెట్లు విరిగి తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భవనంపై ఏర్పా టు చేసిన ప్లెక్సీ గాలికి ఎగిరి 33/11కేవీ విద్యుత్ వైర్లపై పడడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శేషుగెడ్డ వద్ద రెండువిద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాం తాలు జలమయమయ్యాయి. ఎల్ఐసీ కార్యాలయం రోడ్డు, మండల కార్యాలయం రోడ్డు, ధర్మవరం రోడ్లు వర్షం నీటితో నిండిపోయాయి. గురువారం వారపు సంత కావడంతో వ్యాపారులు, వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మామిడికాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు. పాడేరులో భారీ వర్షం పాడేరు : ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అంతటా చల్లబడింది. పాడేరుఘాట్లో సుమారు 2 గంటలపాటు భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. తాటిపర్తి వద్ద భారీ వృక్షం కూలడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు: మండలంలో ఈదురుగాలులకు చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంపదారిలో ఒక చెట్టు, కాకరపాడు మెయిన్రోడ్డులో మరో చెట్టుపడిపోయాయి. ఈ కారణంగా కాకరపాడు నుంచి కొయ్యూరు రావలసిన వాహనాలకు అంతరాయం ఏర్పడింది. రాంబిల్లి: మండలంలో సుమారు 40 నిమిషాల పాటు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు నేలకొరిగా యి. సుమారు గంటన్నరపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దిమిలి, నారాయణపురం, కట్టుబోలు ప్రాంతాల్లో భారీగా, రాంబిల్లి పరిసర గ్రామాల్లో తేలికపాటి వర్షం పడింది. ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. రబీ వరి నూర్పిళ్లకు ఆటంకం ఏర్పడింది. -
ఉడుత తెచ్చిన తంటా!
స్తంభంపై విద్యుత్ తీగలపైకి ఎక్కిన ఉడుత షార్ట్ సర్క్యూట్తో తెగిపడిన తీగ విద్యుదాఘాతంతో కింద ఉన్న పాకల్లోని 91 జీవాల మృత్యువాత శామీర్పేట్ మండలం కేశవరంలో ఘటన శామీర్పేట్, న్యూస్లైన్: ఓ ఉడుత 91 జీవాల మృతికి కారణమైంది. విద్యుత్ స్తంభంపై రెండు తీగలపైకి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. కింద ఉన్న పాకలపై కరెంట్ తీగ పడడంతో షార్ట్సర్క్యూట్ ఏర్పడి 91 జీవాలు(మేకలు, గొర్రెలు) మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కేశవరంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాయాదులు బొమ్మలపల్లి శ్రీశైలం, యాదయ్య, ఐలయ్యలు జీవాలను సాకుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరు గ్రామ సమీపంలోని బండారిగుట్ట వద్ద పక్కపక్కనే మూడు పాకలు ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం కేశవరం- లక్ష్మాపూర్ మధ్య ఉన్న 33/11 కేవీ కెపాసిటీ విద్యుత్ తీగలపై ఓ ఉడుత ఎక్కింది. రెండు(ఎర్త్, ఫేజ్) తీగలను అది తాకడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో కరెంట్ తీగ తెగి బొమ్మలపల్లి శ్రీశైలం పాకపై పడిపోయింది. మంటలు చెలరేగడంతో గొర్రెలు, మేకలు పరుగెత్తి ఇనుప ఫెన్సింగ్ను తాకాయి. దీంతో పాకల్లో ఉన్న బొమ్మలపల్లి శ్రీశైలానికి చెందిన 61, బొమ్మలపల్లి యాదయ్యకు చెందిన 24, ఐలయ్యకు చెందిన మూడు 6.. మొత్తం 91 జీవాలు మృత్యువాతపడ్డాయి. కాగా ప్రమాదంలో మరో 30 జీవాలు క్షేమంగా బయటపడ్డాయి. స్థానికుల సమాచారంతో విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపి వేశారు. కష్టపడి పోషించుకుంటున్న జీవాలు మృతిచెందడంతో వాటి యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు. ట్రాన్స్కో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఒక్కోజీవానికి తమ శాఖ తరఫున రూ. 2 వేలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. పరామర్శించిన ఎమ్మెల్యే.. జీవాల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఎల్లార్, పలు పార్టీల నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం కేఎల్లార్ విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ తీగలు ఉన్నచోట్ల కాపరులు పాకలు ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు ైధె ర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన ఉడుత కూడా మృతిచెందింది. -
మళ్లీ కోతలు!
రాష్ట్రానికి మళ్లీ విద్యుత్ గండం వచ్చి పడింది. రోజుకు రెండు వేల మెగావాట్ల కొరత ఏర్పడడంతో గ్రామాల్లో కోతలకు పని పెట్టారు. నగరాల్లో రెండు గంటలు, గ్రామాల్లో 8 గంటల మేరకు కోతల వాత పెట్టే పనిలో విద్యుత్ బోర్డు పడింది. ప్లస్ టూ, పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఈ కోతలు ఆటంకంగా మారాయి. ఎన్నికల వేళ ఈ కోతలు ఎక్కడ తమ ఓట్లకు గండి కొడతాయేమోనన్న బెంగ అధికార పక్షంలో నెలకొంది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్ వాడకం పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రజలు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని, ఎదుర్కొంటూ వచ్చారు. విద్యుత్ గండం నుంచి బయట పడేందుకు అధికార యంత్రాంగం నానా తంటాలు పడింది. ఎట్టకేలకు గత ఏడాది చివర్లో రాష్ట్ర ప్రభుతానికి ఊరట కలిగించే రీతిలో కొత్త ప్రాజెక్టులు చేయూతనిచ్చాయి. దీంతో క్రమంగా విద్యుత్ కోతల సమయం తగ్గుముఖం పట్టింది. చెన్నై, మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు, తిరునల్వేలి తదితర నగరాల్లో పూర్తిగా కోతలు ఎత్తి వేశారు. గ్రామాల్లో ఏదో ఒక సమయంలో రోజుకు గంటో, అరగంటో విద్యుత్ సరఫరా ఆగేది. రాష్ట్ర వ్యాప్తంగా నెలలో ఒక రోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తూ వచ్చారు. దీంతో విద్యుత్ కోతలకు రాష్ట్రంలో మంగళం పాడినట్టేనన్న ధీమా అటు అధికారుల్లో, ఇటు పాలకుల్లో పెరిగింది. అయితే, మూడు రోజులుగా ఉన్నట్టుండి రాష్ట్రంలో మళ్లీ కోతలు అమల్లోకి వచ్చాయి. గండం: ఇది వరకు రోజుకు రాష్ట్రంలో 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండేది. ఉత్పత్తి ఆ దరిదాపుల్లోకి చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రస్తుతం విద్యుత్ వాడకం ఉన్నట్టుండి పెరిగింది. ఇందుకు కారణం వేసవి సమీపించడమే. అగ్ని నక్షత్రానికి ముందే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఏసీలు, ఫ్యాన్ల, ఎరుుర్ కూలర్ల వాడకం పెరిగింది. అలాగే, శీతల పానీయాల తయారీ నిమిత్తం అందుకు తగ్గ ఉపకరణాల వాడకం పెరిగింది. ఇవన్నీ వెరసి విద్యుత్ బోర్డు నెత్తి మీద గండాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అదే సమయంలో కొన్ని ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, పవన విద్యుత్ చతికిల బడటం వెరసి రాష్ట్ర ప్రజల నెత్తిన కోతల గుది బండను మోపారు. మళ్లీ కోతలు : వారం రోజులుగా రాష్ట్రంలో రోజుకు 13 వేలకు పైగా మెగావాట్ల విద్యుత్ అవసరం ఏర్పడింది. అయితే, ఉత్పత్తి మాత్రం 11 వేలు మాత్రమే ఉండటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. రోజుకు రెండు వేల మెగావాట్లకు పైగా కొరత నెలకొనడంతో కోతలకు పని పెట్టారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేసే పనిలో పడ్డారు. చెన్నై, మదురై తదితర నగరాల్లో గంట వరకు, గ్రామాల్లో 8 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో కోతలు తమను ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చెన్నై నగరంలో గంట, శివారుల్లో నాలుగు గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్లస్టూ పరీక్షలు ముగింపు దశకు చేరాయి. మరి కొద్ది రోజుల్లో పదోతరగతి పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో కోతలు అమలు చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రాత్రుల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం ఓ వైపు, దోమల మోత మరో వైపు వెరసి విద్యార్థులను, ప్రజలు అష్టకష్టాలకు గురి చేస్తున్నాయి. గుబులు : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ర్టంలో విద్యుత్ గండం నెలకొనడంతో అధికార పక్షంలో గుబులు పట్టుకుంటోంది. అన్ని స్థానాల కైవశం లక్ష్యంగా ముందుకెళుతున్న వేళ విద్యుత్ కోతల రూపంలో ఎక్కడ ఓట్లకు గండి పడుతుందోనన్న ఆందోళన నెలకొంది. రాష్ర్టంలో హఠాత్తుగా అమల్లోకి వచ్చిన కోతలను డీఎంకే ప్రధాన అస్త్రంగా చేసుకుంది. రెండు రోజులుగా తన ప్రచార ప్రసంగం అంతా విద్యుత్ కోతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించే పనిలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పడ్డారు. అదే సమయంలో ప్రచారాలకు వెళ్లే అధికార పక్షం అభ్యర్థులకు పలు చోట్ల కోతల రూపంలో నిరసనలు ఎదురవుతున్నారుు. దీంతో ఈ గండం నుంచి గట్టెక్కే రీతిలో అధికారులకు అధికార పక్షం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై విద్యుత్ బోర్డు అధికారి ఒకరు పేర్కొంటూ, తాత్కాలికంగానే విద్యుత్ సంక్షోభం నెలకొందన్నారు. ఉత్తర చెన్నై, మెట్టూరు, తూత్తుకుడి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని, మరి కొద్ది రోజుల్లో ఉత్పత్తి మళ్లీ యథాస్థితికి చేరుకుంటుందన్నారు. చతికిల బడిన పవన విద్యుత్ మరో వారంలో పుంజుకోవడం ఖాయం అని, అంత వరకు కోతలు భరించాల్సిందేనని పేర్కొనడం గమనార్హం. -
రెండేళ్లుగా అంధకారం
పాడేరు, న్యూస్లైన్: విద్యుత్ పంపిణీ సంస్థ, ఏపీ అటవీ అభివృద్ధి సంస్థలు ఆదివాసీ గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలపై ఈ రెండు శాఖలకు కనీసం కనీకరం లేకుండా పోయింది. రెండేళ్లుగా మూడు గ్రామాల ప్రజల్ని చీకట్లోకి నెట్టేశాయి. కాఫీ తోటల వెంబడి రోడ్డులో విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడమే ఇక్కడి గిరిజనులకు శాపమైంది. మోదాపల్లి పంచాయతీలోని కాంగెడ్డ, కారిబంద, వనుగుపల్లి పంచాయతీలోని తియ్యగెడ్డ గ్రామాలకు 12 ఏళ్ల క్రితం విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఘాట్ రోడ్డులోని మందులపాక జంక్షన్ నుంచి అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన కాఫీ తోటల మీదుగా విద్యుత్ లైన్ను ఏర్పాటు చేసి ఈ గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించారు. చీకటి పడితే బయటకురాలేని పరిస్థితిలో ఉండే ఆ గ్రామాల ప్రజలకు విద్యుత్ సరఫరా ఎంతో మేలు చేసింది. తమ కాఫీ తోటల మీదుగా విద్యుత్ లైన్ వేశారని, తద్వారా కాఫీ తోటలకు తీవ్ర నష్టం జరుగుతోందని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేతకు అనేక ప్రయత్నాలు చేశారు. ఎప్పటికప్పుడు విద్యుత్లైన్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాల్సిన విద్యుత్ సంస్థ కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించింది. దీంతో నాలుగేళ్ల క్రితం అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన కాఫీ తోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో ఆదివాసీలకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ అటవీ అభివృద్ధి సంస్థ ఈ విద్యుత్ లైన్పై కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఈ లైన్లోని విద్యుత్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడికక్కడ కట్ చేసి పట్టుకుపోవడంతో ఈ మూడు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ విద్యుత్ వైర్లను అటవీ అభివృద్ధి సంస్థ అధికారులే కట్ చేయించి ఉంటారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా కరెంట్ సరఫరా నిలిచిపోయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రెండు శాఖల అధికారులు కావాలనే తమ గ్రామాలకు విద్యుత్ సరఫరా అడ్డుకుంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రాత్రి వేళల్లో అడవి జంతువులు, విషసర్పాల సంచారం అధికంగా ఉంది. తామంతా అనేక సార్లు విద్యుత్ సంస్థ అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని గిరిజను లు వాపోతున్నారు. ఐటీడీఏ పీవో స్పందించి తమ మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు. -
ఉసురు తీసిన విద్యుత్
కొలిమిగుండ్ల, న్యూస్లైన్ : పని చేస్తున్న చోటే మృత్యువు పొంచి ఉందని, అది ఆమెను కబలిస్తుందని ఎవరికి తెలుసు. ఆ ప్రాంతం మీదుగా మరోచోటుకు వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి తెగిపోవడం, సమీప ధోబీఘాట్లో బట్టలుతుకుతున్న ఓ మహిళ వాటికి బలి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. మృత్యువొడి చేరేందుకేనన్నట్టు ధోబిఘాట్లోని మిగతా వారంతా భోజనం చేసి సేద తీరుతుండగా ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది. కాసేపటికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చాకలి నడిపి నాగన్న భార్య రంగమ్మ (45) కులవృత్తి ద్వారా జీవనం సాగిస్తోంది. రోజులాగే ఆదివారం కూడా బట్టలుతికేందుకు స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలోని ధోబి ఘాట్కు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో అందరూ భోజనం చేసి సేదతీరుతుండగా రంగమ్మ అప్పుడే బట్టలుతికేందుకు ధోబీఘాట్లోకి దిగింది. ఇంతలో గ్రామ పొలాల్లో కొనుగోలు చేసిన శనగ పొట్టును జమ్మలమడుగు తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ పాఠశాల సమీపానికి చేరగానే విద్యుత్ తీగలు తగిలి తెగిపడ్డాయి. సరిగ్గా తీగల కిందే ధోబీఘాట్లో రంగమ్మ ఉండడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తీగలకు విద్యుత్ సరఫరా ఉండడంతో స్థానికులు అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు. మరోవైపు ట్రాక్టర్లో ఉన్నోళ్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. తర్వాత విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపేయడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే తల్లి రంగమ్మ గిలాగిలా కొట్టుకుంటూ మరణించడాన్ని తట్టుకోలేక ఆమె కూతురు ఆర్తనాదాలు చేసింది. ఎస్ఐ రాజ్కుమార్ సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు తప్పిన ముప్పు.. తీగలు తెగిపడిన సమయంలో స్కూల్ బయట విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు అటు వెళ్లకుండా హెచ్ఎం సుంకన్న జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. తీగలు కిందుగా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా ఒక నిండు ప్రాణం బలై పోయిందని గ్రామస్తులు ఆవేదన చెందారు. రజకులందరూ పనిలో ఉన్నా, తరగతుల విరామ సమయంలో ఘటన జరిగి ఉన్నా ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
=దిగొచ్చిన యాజమాన్యం =ఉదయం విఫలమైన చర్చలు =సాయంత్రం సమ్మెలోకి ఉద్యోగులు =ఎట్టకేలకు బదిలీల నిలుపుదల =కారుణ్య ఉద్యోగుల డిస్మిషన్ వెనక్కి =విద్యుత్ భవన్లో ఉత్కంఠ వరంగల్, న్యూస్లైన్ : బదిలీలు, కారుణ్య ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వుల వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. శనివారం ఉదయం సాగిన చర్చల్లో హెచ్ఆర్డీ డెరైక్టర్, ఉన్నతాధికారులు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో నిర్లక్ష్యంగా మాట్లాడడంతో జేఏసీ ఆధ్వర్యంలో మెరుపు సమ్మెకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డిప్లొమా ఇంజనీర్ అసోసియేషన్, తెలంగాణ ఇంజనీర్స అసోసియేషన్, 327 అసోషియేషన్, బీసీ ఉద్యోగుల సంఘం, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు హాజరయ్యారు. ముందుగా మూడు ప్రధాన అంశాలను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఇటీవల కంప్యూటర్ విద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేదనే కారణంగా కారుణ్య నియామకం కింద ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం, సాధారణ బదిలీల నిషేధ సమయంలో ఏఈల బదిలీలు, ఎల్టీసీ బిల్లుల అంశంలో అర్హులను కూడా బాధ్యులుగా చర్యలు తీసుకున్న విషయంపై హెచ్ఆర్డీ డెరైక్టర్ జాన్ ప్రకాష్రావుతో చర్చలకు దిగారు. తొలగింపు ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, బదిలీలు నిలిపివేయాలని, ఎల్టీసీ బిల్లులో అర్హుల పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ.. వీటిపై హెచ్ఆర్డీ డెరైక్టర్ సమాధానమివ్వలేదు. అంతేగాక జేఏసీ నేతలతో నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ మధ్యాహ్నం జేఏసీ కన్వీనర్ ఎండీ యూనస్ మెరుపు సమ్మె నోటీసు ఇచ్చారు. సీఎండీ లేకపోవడంతో ఆయన ఛాంబర్లో నోటీసు అందజేశారు. సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి హెచ్ఆర్డీ డెరైక్టర్తో సమావేశం కాగా చర్చలు విఫలం కావడంతో సాయంత్రం ఐదు గంటల నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి మెరుపు సమ్మెకు దిగారు. సుమారు మూడు గంటల పాటు ఆందోళన కొనసాగింది. దీంతో పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. దిగొచ్చిన అధికారులు.. కార్పొరేట్ కార్యాలయంలో నినాదాలు హోరెత్తడంతో వివాదం పెద్దగా మారుతున్న సమయంలో అధికారులు దిగొచ్చారు. హెచ్ఆర్డీ డెరైక్టర్తోపాటు పలువురు డెరైక్టర్లు సీఎండీని సంప్రదించారు. అనంతరం జేఏసీ కన్వీనర్ ఎండీ యూనస్తో హెచ్ఆర్డీ డెరైక్టర్, సీనియర్ అధికారులు చర్చించారు. ముందుగా ఏఈల బదిలీలను నిలిపివేస్తున్నామని, కారుణ్య ఉద్యోగుల తొలగింపు ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. లేఖ పూర్వకంగా ఇవ్వాలని పట్టుబడటంతో అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఎల్టీసీలో అర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించే అంశంతోపాటు కారుణ్య ఉద్యోగులపై తీసుకునే చర్యలపై ఈనెల 31న సీఎండీ కార్తికేయ మిశ్రాతో చర్చలుంటాయని హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలు, సభ్యులు, యూనియన్ల నేతలు, సభ్యులు ఆందోళనను విరమించారు. ధర్నాకు జేఏసీలో భాగస్వాములుగా ఉన్న ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్, 1104 ఉద్యోగుల సంఘం దూరంగా ఉన్నాయి. ఆందోళనలో ఈ యూనియన్లు పాల్గొనలేదు. ఆందోళనలో డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకుడు నార్ల సుబ్రమణేశ్వర్రావు, తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్రెడ్డి, జేఏసీ సభ్యులు, పలు యూనియన్ల నేతలు రవీందర్, రాజేందర్, ఆనందం, శ్రీరాం నాయక్, శ్రీధర్, వాలూ నాయక్, ఇంద్రసేనా, మధుసూదన్తోపాటు పలువురు పాల్గొన్నారు. -
కరెంటు పిడుగు
సాక్షి, గుంటూరు: తెనాలికి చెందిన మోహనరావు 150 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నాడు. నెలవారీకరెంటు బిల్లు రూ.382.50 వస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సర్కారు పెంచుతున్న కరెంటు చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకు రూ.611.50 బిల్లు చెల్లించాలి. పొరపాటున ఒక్క యూనిట్ అదనంగా వాడుకున్నాడనుకుందాం అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ.927 రానుంది. ఒక్క యూనిట్ పెరిగినందున అదనంగా రూ.316 బిల్లు వస్తుందన్న మాట. మోహనరావుకు ఇప్పుడొస్తున్న బిల్లుకు మూడు రెట్లు పెరగనుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధికి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి ముక్కు పిండి వసూలు చేయనున్నారు. ప్రస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ.1.45, 2.60, 3.60 వంతున లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్ ఈ శ్లాబ్ల పరిధిలోనే రేటు రూ.3.10, 3.75, రూ.5.38 వంతున పెంచనున్నారు. 150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ పెరిగినా, 151-200 శ్లాబ్లోని యూనిట్ రేటు రూ.6.32 వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తారు. వినియోగదారుడి కళ్లు బైర్లు కమ్మేలా వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లు వసూలు చేయనున్నారు. ఈమేరకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలనకు అనుమతి వస్తే వినియోగదారుల గుండె గు‘బిల్లు’ మనాల్సిందే. సేవలు హీనం... బాదుడు ఘనం.. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని చెబుతున్న డిస్కంలు ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయడం లేదు. నాలుగేళ్ల నుంచి ఏ యేటికాయేడు విద్యుత్ చార్జీల బాదుడు మాత్రం ఘనంగా ఉంది. గృహ వినియోగదారులకు వంద యూనిట్లకు ఉన్న శ్లాబును 50 యూనిట్లకు కుదించి మరీ బిల్లు మోత మోగించనున్నారు. ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణలో వినియోగదారులు, రాజకీయపార్టీలు ఆందోళనలు ఉధృతం చేస్తే తప్ప ఈ బాదుడు నుంచి ఉపశమనం కలగదు. బాదుడు అమలైతే.. ఏడాదికి రూ.360 కోట్లు భారంఈ బాదుడు అమలైతే ఎస్పీడీసీఎల్ పరిధిలోని గుంటూరు సర్కిల్లో ఏటా వినియోగదారులపై రూ.360 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం గుంటూరు సర్కిల్ నుంచి విద్యుత్ బిల్లుల డిమాండ్ ఏటా రూ.1,980 కోట్లు వరకు ఉంది. చార్జీల పెంపుతో ఈ డిమాండ్ రూ.2,340 కోట్లు కానుంది. -
కరెంట్ షాక్
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వినియోగదారుల నడ్డి విరిచేలా చార్జీల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైంది. బిల్లుల మోత మోగించనుంది. ఇన్నాళ్లూ అంతంతమాత్రంగా విద్యుత్ను వినియోగించే పేదలకు మినహాయింపునిచ్చిన ప్రభుత్వం ఈసారి వారినీ విడిచిపెట్టట్లేదు. పెంచిన చార్జీల ప్రతిపాదనల్ని బుధవారం విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఖరారు చేయాల్సి ఉందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) అధికారులు చెప్తున్నారు. తాజా ప్రతిపాదనలతో జిల్లాపై ఏకంగా నెలకు రూ.25 కోట్ల మేర భారం పడనున్నట్టు సమాచారం. రూ.25 కోట్లు భారం? జిల్లాలో సుమారు 12.55 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో 10 లక్షల 84 వేల 932 గృహ వినియోగదారులు, లక్షా 21 వేల 449 వాణిజ్యం, 5,041 పరిశ్రమలు, 974 హెచ్టీ, 376 కుటీర పరిశ్రమలు, 23,439 వ్యవసాయ, 10,549 వీధిలైట్లు, 2,068 ప్రజా నీటి సరఫరా పథకాలు, 6,603 సాధారణ(దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు తదితర) వినియోగ కనెక్షన్లున్నాయి. వీటిద్వారా ప్రస్తుతం సగటున నెలకు రూ.250 కోట్లు వరకు విద్యుత్ బిల్లుల డిమాండ్ ఉంది. తాజా పెంపుతో జిల్లాపై సుమారు 25 కోట్లు వరకు భారం పడనున్నట్టు అంచనా. ఈ భారం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జనాలపై పడనుంది. ఇప్పటికే సర్దుబాటు చార్జీలతో బెంబేలెత్తుతున్న ప్రజలు, మరింత భారం మోసేందుకు సిద్ధంకాక తప్పనిపరిస్థితి. కేటగిరీల వారీ భారం జిల్లాలోని ఎల్టీ కేటగిరీ వినియోగదారుల నుంచి సగటున సుమారు రూ.70 కోట్లు విద్యుత్ చార్జీలు వసూలవుతున్నాయి. ఈ డిమాండ్ రూ.83 కోట్లు వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఇందులో గృహ వినియోగం రూ.40 కోట్లు నుంచి రూ.47 కోట్లు, వాణిజ్య కేటగిరీలో రూ.20.5 కోట్లు నుంచి రూ.24.5 కోట్లు, పరిశ్రమలు, ఇతర కేటగిరీలో రూ.కోటి వరకు పెరగొచ్చు. హెచ్టీ కేటగిరీలో నెలకు సగటున రూ.180 కోట్లు వరకు విద్యుత్ బిల్లుల డిమాండ్ ఉంది. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ఈ కేటగిరీలో మరో రూ.12 కోట్లు పెరిగి డిమాండ్ రూ.192 కోట్లుకు చేరుకుంటుందని అంచనా. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో.. దానిపై ఎలాంటి ఆదాయం వచ్చే అవకాశాల్లేవు. ఇప్పటి వరకు లోయర్ కేటగిరీ గృహ వినియోగదారులపై పెద్దగా భారం మోపలేదు. ప్రస్తుత ప్రతిపాదనలు యూనిట్కు 55 పైసలు అమలు చేస్తే గృహ వినియోగ కేటగిరీలో భారం వీరిపైనే అధికంగా ఉండే అవకాశాలుంటాయని అధికారులు చెప్తున్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
జహీరాబాద్/జహీరాబాద్ టౌన్, న్యూస్లైన్: ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మంగళవారం మధ్యాహ్నం కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు కూలి పనులకు వెళ్లిన మావూరి అడివన్న(36) తెగిపడిన విద్యుత్ తీగకు తగులుకుని అక్కడికక్కడే దుర్మరణం చెండాడు. ఈ సంఘటన మండలంలోని రంజోల్ గ్రామ పరిధిలోని బాబానగర్లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ నాగయ్య, గ్రామ ప్రజలు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని రంజోల్ గ్రామానికి చెందిన అడివన్న వ్యవసాయ కూలి. పంటలకు పురుగుల మందును పిచికారీ చేసే పనులకు ఎక్కువగా వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం గ్రామంలోని విఠల్ అనే కౌలురైతు పొలంలో కందిపంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. పంటకు మందును పిచికారీ చేస్తున్న క్రమంలో అడివన్న నేలపై పడిఉన్న విద్యుత్ తీగలను గమనించక వాటికి తాకాడు. వెంటనే విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. ఇది గమనించిన కౌలురైతు విఠల్ వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరాను నిలిపి వేయించారు. సంఘటనా స్థలాన్ని ట్రాన్స్కో డీఈ అబ్దుల్ కరీం, ఏఈ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ నాగయ్యలు సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుని బంధువులు, రైతు సంఘం నాయకుడు ఎంజి రాములుయాదవ్ ట్రాన్స్కో అధికారులను నిలదీశారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని భార్య అమృతమ్మ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ట్రాన్స్కో అధికారులపై కేసు నమోదు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం మూలంగానే అడివన్న మరణించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాన్స్కో అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగయ్య పేర్కొన్నారు. డీఈ అబ్దుల్ కరీం, ఏడీఈ తులసీరాం, ఏఈ శ్రీనివాస్, లైన్మెన్ మోహన్లపై 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. తీగలు తెగిపడి రెండేళ్లయినా సరిచేయలేదు వ్యవసాయ పొలానికి వెళ్లే విద్యుత్ తీగ రెండు సంవత్సరాల క్రితమే తెగిపోయి నేలపై పడిందని కౌలు రైతు విఠల్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. మౌలానే అనే రైతుకు చెందిన వ్యవసాయ బావికి కోసం ఈ విద్యుత్ తీగలు అమర్చారని, అయితే ఆ బావి గత రెండు సంవత్సరాల కాలంగా నిరుపయోగంగా మారడంతో విద్యుత్ సరఫరా అవసరం లేకపోయిందన్నారు. అందువల్లే ఇన్నిరోజులైనా కిందపడిపోయిన విద్యుత్ తీగలను సరిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ట్రాన్స్కో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణం పోయిందని కౌలు రైతు విఠల్ ఆరోపించారు. మాకెవరూ చెప్పలేదు విద్యుత్ తీగ తెగిపడిన విషయమై ఎవరు తమకు ఫిర్యాదు చేయలేదని ఏడీఈ తులసీరాం పేర్కొన్నారు. ఎక్కడైనా తీగలు తెగిపడినట్లు ఫిర్యాదు వస్తే వెంటనే సరిచేయించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదు అంది ఉంటే వెంటనే సరిచేయించే వారమన్నారు. తీగలు తెగిపడిన విషయమై ఫిర్యాదు వస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం విద్యుత్షాక్కు గురై మరణించిన అడివన్న కుటుంబాన్ని తమ శాఖ తరఫున ఆదుకుంటామని ట్రాన్స్కో డీఈ కరీం పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులకు ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. రూ. లక్ష పరిహారాన్ని అందిస్తామని, కుటుంబంలో ఒకరికి గ్రామంలోని సబ్స్టేషన్లో ఆపరేటర్గా ఉద్యోగం ఇస్తామని తెలిపారు. కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయి మృతుడు అడివన్నకు భార్య అమృతమ్మ, కుమార్తెలు మమత, విజయలక్ష్మి, కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్లు ఉన్నారు. పెద్ద కుమార్తె మమత వివాహం కాగా, మిగతా వారు చదువుకుంటున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన వారు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడికి భూమి లేక పోవడంతో కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి కష్టంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబ సభ్యులకు ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. -
పెన్నానదిలో కార్మికుడి గల్లంతు
చెన్నూరు, న్యూస్లైన్: చెన్నూరు సమీపంలోని గ్రీన్కో ఎనర్జీ పవర్ప్లాంట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాంట్కు సంబంధించిన కార్మికుడు ఒకరు విధి నిర్వహణలో పెన్నానదిలో గల్లంతు కావడంపై బంధువులు, స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్ జీఎం, షిఫ్ట్ ఇంజినీర్ సహా సెక్యూరిటీ సిబ్బందిపైనా వారు దాడి చేశారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారలేదు. జీఎం కారుతో పాటు ప్లాంట్కు సంబంధించిన ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎందుకంటే... చెన్నూరు మండలం దౌలతాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి పైన పేర్కొన్న ప్లాంట్లో టర్బైన్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ప్లాంట్కు చెందిన రెండు నీటి మోటార ్లకు సంబంధించిన విద్యుత్ తీగలు తెగి రెండు నెలలుగా పని చేయడం లేదు. దీంతో ఆదివారం సాయంత్రం ప్లాంట్ జీఎం హనుమంతరావు ఆదేశం మేరకు మహేశ్వరరెడ్డి సహా సుబ్బారెడ్డి, గంగాప్రసాద్, సుబ్బారెడ్డి అనే నలుగురిని షిఫ్ట్ ఇంజినీర్ సుబ్రమణ్యం వారిని నదిలోకి దింపారు. నది మధ్యలోకి వెళ్లగానే మహేశ్వరరెడ్డి జారి లోపలికి పడిపోయారు. దీంతో భయాందోళనకు గురైన మిగిలిన ముగ్గురూ వెనుదిరిగి వచ్చారు. వంతెన బీమ్ పట్టుకుని కొద్దిసేపు ఆగిన మహేశ్వరరెడ్డి చాలా సేపు పట్టుకోలేక నీటి వేగానికి కొట్టుకెళ్లిపోయారు. ఆ తరువాత అతను గల్లంతయ్యాడు. జీఎం, షిఫ్ట్ ఇంజినీర్, సెక్యురిటీపై దాడి విషయం తెలుసుకొన్న మహేశ్వర్రెడ్డి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున పెన్నానది వద్దకు చేరుకున్నారు. ‘మీ నిర్లక్ష్యం వల్లే మా బిడ్డ నీటిలో మునిగిపోయాడంటూ’ వారు రోదించారు. నదిలో గల్లంతైన విషయం తెలిసినా తమకు ఎందుకు సమాచారం అందించలేదని మండిపడ్డారు. ఒక మనిషి నీటిలో మునిగిపోతే కనీసం గాలింపు చర్యలైనా చేపట్టరా అంటూ నిలదీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నదిలోకి ఎలా దింపారంటూ దాడికి దిగారు. ఇందుకు బాధ్యుడైన జీఎం కారును ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డు వేణుగోపాల్రెడ్డిపైనా దాడి చేశారు. ఫర్నీచర్ను పడేసి పనికి రాకుండా చేసేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజగోపాల్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు వర్గాల వారితోనూ చర్చించి పరిస్థితిని చక్కదిద్దారు. -
తీరప్రాంత విద్యుత్ కష్టాలకు చెక్!
సాక్షి, విశాఖపట్నం :పై-లీన్ తుపానుతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తుపాను వచ్చిన ప్రతిసారీ తీరప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంపై దృష్టి సారించింది. భవిష్యత్లో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుకాగల పనులకు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపించింది. ఐదు జిల్లాలు.. 20 ప్రాంతాలు జాతీయ తుపాను విపత్తు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివిధ విభాగాలను హెచ్చరించింది. భవిష్యత్లో తుపానులు సంభవిస్తే తట్టుకునేలా తీర ప్రాంతాల్లో నిర్మాణాలు, వివిధ వ్యవస్థలు ఆధునికీకరించుకోవాల్సిందిగా సూచించింది. ప్రపంచ బ్యాంకుకు చెందిన ఆర్థిక వ్యవ హారాల విభాగం అడాప్ట్బుల్ ప్రోగ్రాం లోన్ కింద నిధులు మంజూరుకు అంగీకరించింది. రాష్ట్రానికి రూ.1,496.71 కోట్లు ప్రతిపాదించగా.. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ.1,198.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.298.27 కోట్లు భరించనున్నాయి. ఇందులో భాగంగా ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 20 పట్టణ/మండల కేంద్రాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఒక్కో ప్రాంతంలో రూ.2.50 కోట్ల వ్యయంతో 33/11 కేవీ భూగర్భ విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి తీర ప్రాంతాలకు 151 కిలోమీటర్ల మేర భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. డీపీఆర్ తర్వాత పనులు ఢిల్లీలో ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఈపీడీసీఎల్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఓ జాతీయ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు కేం ద్రం సన్నద్ధమైనట్టు అధికారులు చెప్తున్నారు. పై-లీన్ తుపాను అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడుతూ చాలా దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ విద్యుత్ లైన్ల వ్యవస్థ అందుబాటులో ఉందని, ఇక్కడ కూడా ఆ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రానికి నివేదిస్తామన్నారు. -
విద్యుత్శాఖకు ‘పై-లీన్’ నష్టం రూ.72 కోట్లు: సీఎండీ
సోంపేట, న్యూస్లైన్: పై-లీన్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ శాఖకు సుమారు 72 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సీఎండీ ఎం.శేషగిరిబాబు చెప్పారు. బుధవారం సోంపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి డివిజన్ల పరిధిలో విద్యుత్ వ్యవస్థకు తీవ్రనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. భారీ గాలులకు వేలాది స్తంభాలు నేలకొరిగాయన్నారు. 126 కిలోమీటర్ల 33 కేవీ లైన్, 456 కిలోమీటర్ల 11 కేవీ లైన్, 2,348 కిలోమీటర్ల పరిధిలో ఎల్టీ లైన్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు వివరించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2057 గ్రామాల్లోని నీటి పథకాలకు విద్యుత్ సమస్య తలెత్తగా వారికిలో 1962 గ్రామాల్లోని రక్షిత పథకాలకు సరఫరాను పునరుద్ధరించామన్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా సమస్యను పరిష్కరిస్తామి చెప్పారు. 40 సంవత్సరాలుగా ఉన్న విద్యుత్ వ్యవస్థ తుఫాన్ పడిన కారణంగా నాశనమైందన్నారు. 200 మంది అధికారులు, 1000 మంది సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారన్నారు. రెండు జిల్లాల పరిధిలోని నాలుగు డివిజన్లలో 8,19,556 సర్వీసులకు విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. వీటిలో 7,84,735 సర్వీసులకు సరఫరాను పునరుద్ధరించామన్నారు. ఆయన వెంట విద్యుత్ అధికారులు కేఎస్ఆర్ మూర్తి, డి. రమేష్, డివిజనల్ ఇంజినీర్ ప్రతాప్, సోంపేట మండల విద్యుత్ శాఖాధికారి కోటేశ్వరరావు ఉన్నారు. -
తుపాను బాధిత ప్రాంతాల్లో నత్తనడకన సహాయ చర్యలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పై-లీన్ తుపాను తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో బాధితులు అల్లాడిపోతున్నారు. తుపాను తీరం దాటి ఆరు రోజులవుతున్నా వందకు పైగా గ్రామాలు ఇప్పటికీ చీకట్లో మగ్గుతున్నాయి. చాలా గ్రామాలకు నేటికీ తాగునీరు అందడం లేదు. వ్యాధులు ప్రబలే అవకాశం పలు చోట్ల చెట్లు విరిగిపోవడం, పశువులు చనిపోవడం, వ్యర్థ పదార్థాలు బయట ఉండటంతో వ్యాధు లు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరికి పూట గడవడం కూడా కష్టంగా ఉంది. కుటుంబానికి పది కేజీల చొప్పున బియ్యం ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ కొన్ని చోట్ల బియ్యం బస్తాలు తీసుకు వ చ్చి పక్కన పడేశారు. దీన్నిబట్టి అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందని వైద్యసేవలు తీర ప్రాంతంలోని 11 మండలాల్లోనూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యాల వల్ల చాలా గ్రామాలకు ఇప్పటికీ తాగునీరు అందటం లేదు. పారిశుధ్య, వైద్యసేవలు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణ జరగలేదు, ఇక సర్వేల పేరిట బృందాలు రావ టం తప్ప తక్షణ సహాయ చర్యలు తీసుకోవటం లేదు. దీంతో బాధిత గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి పథకాలు నడవడం లేదు. 47 తాగునీటి పథకాలకుగాను 15 పథకాల పునరుద్ధరణ జరగలేదు. 887 తీరప్రాంత గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా ఇప్పటికీ 108 గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. 448 గ్రామాల్లో తాగునీటి వసతులు దెబ్బతినగా వంద గ్రామాలకు ఇంకా తాగునీరు అందటం లేదు. 380 ఇళ్లు పూర్తిగాను, 862 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని బాధితులు వాపోతున్నా రు. అలాగే ఆహార పంటలు 7783 హెక్టార్లు, ఉద్యాన పం టలు 5140 హెక్టార్లతో దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. నష్టం మరింత అధికంగా ఉంటుందని, పొలాల నుంచి నీరు బయటకు వెళితే పూర్తి పరిస్థితి తెలుస్తుందని బాధిత రైతులు చెబుతున్నారు. సర్వే బృందాలు పాతలెక్కలతో సరిపెట్టేసేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ఉద్దానంలో 3219 హెక్టార్లలో కొబ్బరి పంటకు నష్టం వాటిల్లినట్టు ఆధికారులు లెక్కలు వేశారు. అయితే వంగిన, విరిగిన, పొట్టలు దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిగణనలోకి తీసుకొలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా పరిస్థితి ఇలా ఉంది. కవిటి మండలంలో తాగునీరు సరఫరా కావ టం లేదు, గురువారం సాయంత్రం పనులు చేపట్టారు. 28 పంచాయతీలకు విద్యుత్ సరఫరా లేదు. ఇప్పటికీ పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. బాధితుల పునరావాసానికి సామగ్రి అందజేయలేదు. మండల కేంద్రం కంచిలి మినహా మిగిలిన 30 పంచాయితీల్లో విద్యుత్ సరఫరా లేదు. తాగునీరు అందటం లేదు. పారిశుద్ధ్య చర్యలు లేవు. ఇచ్ఛాపురం మండలంలో 50 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. మందస మండలంలో 30 పంచాయతీలు ఉండగా కేవలం 4 పంచాయీతీల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పారిశుద్ధ్య పనులు గురువారం ప్రారంభించారు. సోంపేట, పోలాకి తదితర తీర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. -
అట్టుడికిన జిల్లా
టీనోట్ నేపథ్యంలో ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది. గురువారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కదంతొక్కారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులు వందలాది మంది జిల్లా పరిషత్ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ కృష్ణదేవరాయల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్విహార్ సెంటర్లో మానవహారం నిర్మించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు, మునిసిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్లో ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించి పట్టణ బంద్ పాటించారు. ఆదోనిలో సమైక్య రాష్ట్ర పరిక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పాతబస్టాండ్ కూడలి వద్ద పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో చేనేత మహిళలు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద విద్యార్థులు ఉపవాస దీక్ష చేపట్టారు. నంద్యాల మండలం శివపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రైతులు దీక్ష చేశారు. 300 తప్పెట్లతో మాదిగపేట వాసులు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్శాఖ, నీటి పారుదల శాఖ ఆద్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హొళగుందలో ఉపాధ్యాయులు శ్రమదానం చేశారు. ప్యాపిలి, వెల్దుర్తిలో జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆత్మకూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించి నిరసన వ్యక్తం చేశారు. సత్వరమే మంత్రి తమ పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ వద్ద కూర్చొని నిరసన తెలిపారు. వెలుగోడులో పొట్టి శ్రీరాములు సెంటర్లో సింహగర్జన సదస్సు నిర్వహించారు. బనగానపల్లెలో సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం బస్తాలు మెస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో రోడ్డుపై వ్యాయామం నిర్వహించారు. కొలిమిగుండ్ల మండలంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై భజన చేశారు. పత్తికొండలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు రాస్తారోకో చేపట్టారు. - న్యూస్లైన్, కర్నూలు(కలెక్టరేట్) -
బ్రేక్డౌన్ల మరమ్మతుల్లో విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, తిరుపతి: 72 గంటల సమ్మె ప్రభావంతో ఎస్పీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో మరమ్మతులకు గురైన విద్యుత్ సబ్ స్టేషన్లు, ఫీడర్లను డిస్కం సిబ్బంది ఆగమేఘాలపై పునరుద్ధరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మూడు రోజులు సమ్మె చేసిన విషయం విదితమే. ఈ రోజుల్లో ఆరు జిల్లాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. 33 కేవీ ఫీడర్లు కడప జిల్లాలో 2, ప్రకాశం 2, గుంటూరు 5, కృష్ణా 1, తిరుపతి 4, నెల్లూరు 2 మరమ్మతులకు గురయ్యాయి. సరఫరా నిలిచిపోయింది. 11 కేవీ ఫీడర్లు 50కి పైగా బ్రేక్ డౌన్ అయ్యాయి. ఆదివారం ఉదయం విధుల్లో చేరిన విద్యుత్ సిబ్బంది వీటన్నింటిని సోమవారం ఉదయానికల్లా పునరుద్ధరించారు. నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేసి, గ్రామాలకు విద్యుత్ను పునరుద్ధరించారు. విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల పునరుద్ధరణ గాలీవానకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను కూడా పునరుద్ధరించారు. మూడు రోజుల సమ్మె ప్రభావంతో అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టారు. బిల్లింగ్ చెల్లింపులు సోమవారం మొదలయ్యాయి. సెప్టెంబరు నెల బిల్లింగ్ తయారీ పనులు కూడా ప్రారంభించారు. మరమ్మతులు పూర్తి : సీఎండీ హెచ్వై.దొర ఆరు జిల్లాల్లో విద్యుత్ ఫీడర్లు, సబ్ స్టేషన్ల బ్రేక్డౌన్లు ఆదివారం రాత్రికే పూర్తి చేశాం. డిస్కం పరిధిలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వర్షానికి దెబ్బతిన్న విద్యుత్ లైన్లను మంగళవారం పరిశీలించి నష్టంపై ఒక అంచనాకు రానున్నాం. విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించి ఫిర్యాదులూ రావడం లేదు. -
మూడు రోజుల్లో 90 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, మచిలీపట్నం : కరెంటోళ్ల మూడు రోజుల సమ్మె అటు పాలకులు, ఇటు ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్ర కలకలమే రేపింది. ప్రజలు, పరిశ్రమలపై తక్షణ ప్రభావం చూపిన ఈ సమ్మెతో పాలకుల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన విద్యుత్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె ప్రభావం వల్ల జిల్లాలో 120కి పైగా బ్రేక్డౌన్స్ (కరెంట్ సరఫరాలో అంతరాయాలు) ఏర్పడినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రైవేటు, కాంట్రాక్ట్ సిబ్బందితో సరిచేయించి సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఆదివారం ఉదయం ఆరు గంటలతో సమ్మె విరమించే అవకాశం ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. సమ్మెలో మూడు వేల మంది.. జిల్లాలోని ప్రతి సబ్స్టేషన్లో ఒక కాంట్రాక్ట్ ఎన్ఎంఆర్ మినహా అంతా విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. గురువారం నుంచి 72 గంటలపాటు సమ్మెకు దిగారు. కృష్ణా జిల్లా సర్కిల్ (ఏపీఎస్పీడీసీఎల్)లోని విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని 176 సబ్స్టేషన్లలో సుమారు మూడు వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. డివిజనల్ ఇంజనీర్ నుంచి గ్రామంలో సిబ్బంది వరకు అన్ని స్థాయిల్లోను విధులను బహిష్కరించడంతో మెరుపు సమ్మె విజయవంతమైంది. 90 గ్రామాల్లో ఎఫెక్ట్.. సమ్మె కారణంగా దాదాపు 90 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయవాడతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తొలి రోజున సుమారు 30 ప్రాంతాల్లో బ్రేక్డౌన్స్ వచ్చాయి. రెండో రోజు శుక్రవారం మరో 50 బ్రేక్డౌన్స్ ఏర్పడ్డాయి. మూడో రోజు శనివారం మరో 40కి పైగా బ్రేక్డౌన్స్ వచ్చినట్టు సమాచారం. ఏపీఎస్పీడీసీఎల్ కృష్ణా జిల్లా సర్కిల్ పరిధిలో శనివారం సాయంత్రం నాటికి 120 బ్రేక్డౌన్స్ వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నారు. ఇంకా లెక్కల్లోకి రానివి మరిన్నో ఉంటాయని అంచనా. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో బ్రేక్డౌన్స్ ఏర్పడినప్పుడు సరఫరా పునరుద్ధరణలో జాప్యం కారణంగా 90 గ్రామాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురైనట్టు సమాచారం. సానుకూలంగా స్పందించకుంటే నిరవధిక సమ్మె రాష్ట్ర విభజన యోచన విరమించుకోవాలనే ప్రధాన డిమాండ్తో తాము సమ్మెకు దిగామని, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు దిగుతామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ సత్యానందం శనివారం సాక్షికి చెప్పారు. ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతోనే తమ నిర్ణయాన్ని మార్చుకుని కేవలం మూడు రోజులే సమ్మె చేశామన్నారు. తమకు బాసటగా నిలిచిన జిల్లా ప్రజలకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ కె.రామచంద్రరావు, కన్వీనర్ ఎం.వెంకటేశ్వరరావుతోపాటు జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. -
కరెంటు పోతే.. ఇక అంతే!
సాక్షి, రాజమండ్రి : కరెంట్ పోయిందా? అయితే రావడం కష్టమే.. ఇంటి సర్వీసు వైరు ఊడిపోయిందా? ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ను వెతుక్కోవలసిందే.. ఎందుకంటే బుధవారం అర్థరాత్రి నుంచి విద్యుత్తు ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకూ వర్క్టు రూల్ ద్వారా నిరసన తెలిపిన ఉద్యోగులు ఇప్పుడిక ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు. బుధవారం అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు ఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్తు ఉద్యోగులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి విశాఖపట్నంలోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగుల జేఏసీ సమావేశమై రాష్ట్రనాయకులతో సమాలోచన జరిపింది. సమ్మెకు అన్ని విభాగాల సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ అత్యవసర సేవలు నిలిచిపోతే ప్రజలు ఇబ్బంది పడతారనే అంశంపై చర్చించింది. అధిక శాతం ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్లడంద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సమావేశం సూచించినట్టు తెలుస్తోంది. దీంతో సమ్మెకు సిద్ధమని ఉద్యోగ సంఘాల జేఏసీ రాత్రి తన నిర్ణయాన్ని ప్రకటించింది. జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన 3000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2200 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా 800 మంది కాంట్రాక్టు సిబ్బంది. ప్రస్తుతానికి రెగ్యులర్ సిబ్బంది అందరూ సమ్మె బాట పట్టనున్నారు. ప్రజలకు కష్టకాలం విద్యుత్తు ఉద్యోగుల సమ్మెతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలున్నా యి. విద్యుత్తు సరఫరాలో సమస్యలు వస్తే పునరుద్ధరణ కష్టమవుతుంది. తాగునీటి సరఫరా కూడా ఇబ్బందుల్లో పడుతుంది. పురపాలక సిబ్బంది కూడా సమ్మెలో ఉండడం తో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకూ అవ కాశం లేదు. గృహ విద్యుత్ కనెక్షన్లు పాడైతే బాగుచేసే వారే ఉండరు. సాంకేతిక లోపాలను పరిష్కరించే సిబ్బంది కూడా సమ్మెలో ఉంటారు. ఆస్పత్రుల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే మందుల శీతలీకరణ సమస్యలో పడుతుంది. జనరేటర్నే నమ్ముకోవలసి ఉంటుంది. 80 శాతం ఆస్పత్రుల్లో జనరేటర్ నిర్వహణకు నిధులు లేని పరిస్థితులు ఉన్నా యి. కాగా బుధవారం తమ డిపార్టమెంట్ సిమ్ కార్డులను హ్యాండోవర్ చేయాలని విద్యుత్ సిబ్బంది నిర్ణయంచారు.