greater noida
-
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ప్లాంట్ల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీలో ఉన్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ప్లాంట్లలో త్రీ–వీలర్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఆంపియర్, ఈలీ, గ్రీవ్స్, ఈల్ట్రా బ్రాండ్స్లో ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలను విక్రయిస్తున్న ఈ సంస్థకు తెలంగాణలోని తూప్రాన్, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, తమిళనాడులోని రాణిపేట్ వద్ద తయారీ కేంద్రాలు ఉన్నాయి. గ్రేటర్ నోయిడా ప్లాంట్లో త్రిచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 21,514 యూనిట్ల నుంచి 45,896 యూనిట్లకు, తూప్రాన్ ప్లాంట్లో 13,538 నుంచి 34,800 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ‘విస్తరిస్తున్న మార్కెట్కు అనుగుణంగా అదనంగా ఉత్పత్తి చేయడానికి, అలాగే కొత్త మోడళ్ల తయారీని కూడా ఈ విస్తరణ అనుమతిస్తుంది’ అని కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్లో పేర్కొంది.ఐపీవో ద్వారా వచ్చే నిధులతో..గ్రీవ్స్ ఎలక్ట్రిక్ గ్రేటర్ నోయిడాలో ఫెసిలిటీ విస్తరణ కోసం రూ.20 కోట్లు, తూప్రాన్ ప్లాంటుకు రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత ఐపీవో ద్వారా వచ్చే నికర ఆదాయం నుండి ఈ పెట్టుబడులకు నిధులు సమకూర్చనున్నారు. రాణిపేట్ ప్లాంట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, గ్రేటర్ నోయిడా కేంద్రంలో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను, తూప్రాన్ ఫెసిలిటీలో ఎలక్ట్రిక్తోపాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ త్రీ–వీలర్లను సంస్థ తయారు చేస్తోంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థలు బెస్ట్వే ఏజెన్సీస్ గ్రేటర్ నోయిడా కేంద్రాన్ని, ఎంఎల్ఆర్ ఆటో తూప్రాన్ ప్లాంట్ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వార్షికంగా 4.80 లక్షల ద్విచక్ర వాహనాల సామర్థ్యం కలిగిన రాణిపేట ప్లాంట్లో తయారీ సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో కంపెనీకి ప్రస్తుతానికి లేదు.త్రీ–వీలర్ల వాటా 28 శాతం..2023–24లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొత్తం ఆదాయంలో త్రీ–వీలర్ల వాటా 28 శాతం కైవసం చేసుకుంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 13,470 యూనిట్ల త్రిచక్ర వాహనాలను విక్రయించింది. 2022–23లో ఈ సంఖ్య 6,870 యూనిట్లు. ఆంపియర్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ టూ–వీలర్ వ్యాపారం దాదాపు 68 శాతం వాటాతో ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆంపియర్ ద్విచక్ర వాహనాల అమ్మకాల పరిమాణం 2022–23లో 1.09 లక్షల యూనిట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 47,820 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరుకు చెందిన గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ కంపెనీయే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్..రాణి పేటలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనుంది. ఇది 4,00,000 యూనిట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిపాదిత నూతన కేంద్రాన్ని 2026 మే నెలలో ప్రారంభించనునన్నారు. 2026 జూలైలో వాణిజ్యపరంగా ఉత్పత్తి కార్యకలాపాలను మొదలు పెట్టాలని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ భావిస్తోంది. ఈల్ట్రా బ్రాండ్ పోర్ట్ఫోలియో ప్రస్తుతం రూ.3.80 లక్షల నుండి ప్రారంభం. ప్యాసింజర్స్ లేదా వస్తువులను రవాణా చేయగల రెండు మీడియం స్పీడ్ త్రీ–వీలర్ మోడళ్లను విక్రయిస్తోంది. డీజిల్, సీఎన్జీ త్రీ–వీలర్లు గ్రీవ్స్ బ్రాండ్ ద్వారా రూ.2.90 లక్షల ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్ కింద నాలుగు మోడళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రిక్షా బ్రాండ్ ఈలీ కింద మూడు మోడళ్లు కొలువుదీరాయి. ధరల శ్రేణి రూ.1.30 లక్షల నుండి ప్రారంభం. -
Noida: బాంక్వెట్ హాల్లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి
లక్నో: గ్రేటర్ నోయిడాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడా సెక్టార్-74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం పదిహేను అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని చెప్పారు. అగ్ని ప్రమాదంలో పర్మీందర్ అనే ఎలక్ట్రీషియన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.‘బాంక్వెట్ హాల్ ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉంది. తెల్లవారుజామున 3:30 గంటలకు, నోయిడా సెక్టార్ 74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్లో మంటలు చెలరేగినట్లు మాకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న 15 నిమిషాల్లోనే 15 ఫైర్ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కోట్ల విలువైన బాంక్వెట్ హాల్ అగ్నికి ఆహుతైంది’ అని నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ తెలిపారు.#WATCH | UP | Lotus Grandeur banquet hall located in Noida's sector 74 was gutted in a fire which broke out late last night. The banquet hall was currently under renovation. As per Police, one person died in the incident. pic.twitter.com/R4pEti1MdB— ANI (@ANI) October 30, 2024 -
భారీగా డ్రగ్స్ పట్టివేత.. తిహార్ జైలు వార్డెన్తో సహా నలుగురి అరెస్ట్
లక్నో:ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.ఈ ల్యాబ్లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్సీబీ తెలిపింది. ల్యాబ్లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. -
గర్ల్ఫ్రెండ్ను డ్రైవ్కు తీసుకెళ్లేందుకు.. కొత్త కారును దొంగిలించి..
గర్ల్ఫ్రెండ్ను బయటకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి దొంగతనం చేసే వారిని చూశాం. అదీ కాదంటే లవర్కు నచ్చిన గిఫ్ట్ను, డ్రెస్ను కొనేందుకు తెలిసిన వాళ్ల క్రెడిట్ కార్డు వాడటం లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవారిని కూడా చూశాం. కానీ ఓ ముగ్గురు యువకులు తమలోని ఒకరి ప్రియురాలి కోరికు తీర్చడానికి మాత్రం వెరైటీగా పెద్ద కారునే దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో వెలుగుచచూసింది.ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు తన స్నేహితుడి లవర్ను కొత్త కారులో లాంగ్డ్రైవ్కు తీసుకెళ్లడంలో సాయం చేయాలనుకున్నారు. అయితే ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ వేశారు. షోరూమ్ నుంచి కొత్త కారును దొంగిలించేందుకు మగ్గురు స్నేహితులు శ్రేయ్, అనికేత్ నగర్, దీపాంశు భాటీ కలిసి స్కెచ్ వేశారు.गर्लफ्रेंड को घूमने के लिए तीन स्टूडेंट ने लूट ली वेन्यू कारमामले में तीन आरोपियों को पुलिस ने किया गिरफ्तारपुलिस ने लूटी हुई गाड़ी को भी कर लिया है बरामद @noidapolice @CP_Noida #Greaternoida pic.twitter.com/4hT8TjjpFt— PRIYA RANA (@priyarana3101) October 11, 2024సెప్టెంబర్ 26న గ్రేటర్ నోయిడాలోని కార్ బజార్లో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూని టెస్ట్ డ్రైవ్ చేయమని ఇద్దరు అడిగారు. వారు హెల్మెట్లు ధరించి, ఎగ్జిట్ గేట్ పక్కన నిలబడి ఉండగా, డ్రైవింగ్ చేస్తున్న కారు డీలర్ పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీయడంతో ఇద్దరూ కారులో ఎక్కారు. వారిలో ఒకరు డ్రైవర్ సీటు పక్కన కూర్చోగా, మరొకరు వెనుక కూర్చొని న్నారు.అనంతరం కారు డీలర్ను హ్యుందాయ్ వెన్యూ నుంచి బయటకు నెట్టివేసి వేగంగా వెళ్లిపోయారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100కి పైగా సీసీటీవీల నుంచి ఫుటేజీని పరిశీలించి,నిందితులను కనిపెట్టారు. అయితే ఈ ఘటన గత నెలలో జరిగిప్పటికీ.. కేసు విచారణలో దొంగతనానికి గల కారణం తాజాగా వెలుగుచూసింది. -
కలుషిత ఆహారం.. 200 మంది విద్యార్థులు అనారోగ్యంపాలు!
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో గల ఒక హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న సుమారు 200 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్యన్ రెసిడెన్సీ అండ్ లాయిడ్స్ హాస్టల్ విద్యార్థులు కలుషిత ఆహారం తిన్న కారణంగా అనారోగ్యం పాలయ్యారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా హాస్టల్లో తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకునిపై బాధిత విద్యార్థులు పోలీసుల ఎదుట తీవ్ర ఆరోపణలు చేశారు. మార్చి 8వ తేదీ సాయంత్రం హాస్టల్లో ఆహారం తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని నాలెడ్జ్ పార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే బాధిత విద్యార్థులందరినీ సమీపంలోని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు వివరించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. -
ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
నోయిడా: వేలాది మంది రైతుల ర్యాలీ, నిరసన హోరుతో ఢిల్లీ శివార్లు గురువారం దద్దరిల్లాయి. ఉత్తర ప్రదేశ్లోని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీలో పార్లమెంట్ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. పార్లమెంట్ దిశగా దూసుకెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని రైతులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. భూములు తీసుకొని అభివృద్ధి చేసిన ప్లాట్లలో పది శాతం రెసిడెన్షయల్ ప్లాట్లు తమకు ఇవ్వాలని లేదా వాటికి సమానమైన పరిహారం చెల్లించాలని 2019 నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటం ఉధృతం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ వరకు ర్యాలీ తలపెట్టారు. దాదాపు 100 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. గురువారం మధ్యాహ్నం మహామాయ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. చిల్లా సరిహద్దు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్థానికంగా 144 సెక్షన్ విధించారు. నిరసకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది. దీంతో నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ రహదారితోపాటు పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
రాముడి పాటపాడి మరోసారి వార్తల్లోకి సీమా హైదర్
ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రఘుపూర్లో నివసిస్తున్న ఈ మహిళా.. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముస్లిం మహిళ అయిన సీమా.. హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్ చాలీసా పఠించడం నెట్టింట్లో వైరల్గా మారింది. సచిన్-సీమా నివసించే రబూపురాలో ఇటీవల రాముడి భజన ఏర్పాటు చేశారు. రాముడి కీర్తనలు, హానుమాన్ పాటలు పాడారు. ఈ సందర్భంగా సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్ ఆయేంగే’ అనే పాటను ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో చక్కగా పాట పాడారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Jist (@jist.news) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుమతి లభించిన వెంటనే తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి రామదర్శనం కోసం వెళతానని తెలిపారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్ మహిళలను గౌరవించే దేశమని అన్నారు. తను ఇప్పుడు పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు. ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు. కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుస్తోంది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్లో ఉంటున్నారు. -
లిఫ్ట్లోకి కుక్క.. మహిళతో రిటైర్డ్ ఐఏఎస్ డిష్యుం డిష్యుం
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మహిళ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి పెంపుడు కుక్కను తీసుకురావడంతో దాని మాజమాని, మరో నివాసితుడికి వాగ్వాదం జరిగింది. ఇరువురు విచక్షణ మరిచి తగువులాడుకున్నారు. ఏకంగా చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రధేశ్లోని గ్రేటర్ నోయిడాలోవెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. నోయిడాలోని 108 సెక్టర్ పార్క్ లారేట్ సొసైటీలోని ఓ అపార్ట్మెట్లోని ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఆ కుక్కను ఇటీవల అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి తీసుకెళ్లింది. అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అందుకు అంగీకరించలేదు. కుక్క విషయంతో రిటైర్డ్ అధికారి, మహిళ మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్లో కుక్కను తీసుకొచ్చిన ఫోటోను తీస్తుండగా మహిళ అతని ఫోన్ లాక్కుంది. వెంటనే సదరు అధికారి కూడా మహిళ ఫోన్ లాక్కున్నాడు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. చెంపదెబ్బల వర్షం ఈ గొడవలో వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కూడా వ్యక్తిని అడ్డుకొని దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మహిళ తనపై జరిగిన దాడి విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన కూడా గొడవలోకి ప్రవేశించాడు. ఇతర నివాసితులు లిఫ్ట్లోకి రాకుండా మహిళ అడ్డుకోవడంతో ఆమె భర్త వ్యక్తిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు. చివరికి అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని ఇద్దరిని వీడదీయడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇరువర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత Fight Over taking a Dog 🐕 inside Lift (Obviously in Noida). First Retired IAS Officer beat 👊 a Women Then her Husband beat 👊 that IAS Officer Dog 🐕 Enjoyed Both 🤗😅#UttarPradesh #NationalUnityDay #SardarVallabhbhaiPatel #राष्ट्रीय_एकता #SardarPatelJayanti… pic.twitter.com/H1J18BEEVO — Dr Jain (@DrJain21) October 31, 2023 పెరుగుతున్న గొడవలు పెంపుడు కుక్కులను లిఫ్ట్లలోకి తీసుకెళ్లవచ్చా అనే విషయంపై దేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానులు, అపార్ట్మెంట్ నివాసితుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలపై గొడవలు పెరుగుతున్నాయి. నోయిడాలోని అనేక అపార్ట్మెంట్లు పెంపుడు కుక్కలను లిఫ్ట్లోకి తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అయితే వాటి మాజమానులు మాత్రం అలాంటి ఆదేశాలు చట్టబద్దమైనవి కావని వాదిస్తున్నారు.. గతేడాది సైతం అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల చిన్నారిని కరిచినందుకు పెంపుడు కుక్క మాజమానికి గ్రేటర్నోయిడా అడ్మినిస్ట్రేషన్ రూ. 10 వేల జరిమానా విధించింది. -
ఘోర ప్రమాదం.. చిన్నారి సహా అయిదుగురు మృత్యువాత
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకంఉది. యమునా ఎక్స్ప్రెస్వే వద్ద మారుతి వ్యాన్ అదుపుతప్పి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా అయిదుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు మైనర్లు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం శనివారం ఉదయం 1 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం సమయంలో వ్యానులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ‘గగన్యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. కోయలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమ్ అటవీ ప్రాంతంలో ఉదయం 8 గంటలకు ఛత్తీస్గఢ్ పోలీస్ విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్.. నక్సల్ ఏరివేత ఆపరేషన్ చేపట్టినట్లు బస్తర్ రేంజ్ ఐడీ సుందర్రాజ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసుల కదలికలను గుర్తించిన మావోయిస్టులు ఎదురు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో ఐఎన్ఎస్ఏ రైఫిల్, 12 బోర్ రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. -
లిఫ్టు కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కూలిన ఘటనలో క్షతగాత్రులైన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శుక్రవారం ఉదయం 14వ ఫ్లోర్ నుంచి లిఫ్టు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన అయిదుగురిలో నలుగురు శనివారం చనిపోయారు. మరొకరు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా యూపీ, బిహార్లకు చెందిన వలస కార్మికులు. -
లిఫ్ట్ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కుప్పకూలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ సొసైటీలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కార్మికులతో బయలుదేరి వెళ్తూ 14వ ఫ్లోర్ నుంచి అకస్మాత్తుగా జారు కుంటూ వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దీంతో లిఫ్టులోని నలుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధి తులంతా యూపీ, బిహార్లకు చెందిన వలసకార్మికులని పోలీసులు తెలిపారు. -
రణ్వీర్ సింగ్ రీల్ లగ్జరీ బంగ్లా: రియల్ ఓనర్ ఎవరో తెలిస్తే షాకవుతారు
Rocky RandhawaParadise: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ,స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ హిట్టాక్ సొంతం చేసుకుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ మూవీలో ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ లాంటి బి-టౌన్కు చెందిన ప్రముఖులు నటించిన సంగతి తెలిసిందే. అయితే చిత్రం విడుదలైనప్పటి నుంచి రణ్వీర్ సింగ్ పాత్ర నివసించిన లగ్జరీ బంగ్లా హాట్ టాపిక్గా నిలిచింది. ‘రాకీ రంధావా పారడైజ్’ గా సినిమాలో చూపించిన సుందరమైన 'రాకీ రాంధావా' భవనంలోని అద్బుతమైన షాట్లు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండానే ఈ భవనంలోని దృశ్యాలు మంత్రముగ్దులను చేశాయి. షెహజాదా మూవీ చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగిందట. విలాసవంతమైన భవనం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిఅందమైన భవనం లండన్లో ఉందని కొందరు , స్విట్జర్లాండ్లో ఉందని సినీ ప్రియులు ఊహాగానాలు చేశారు. కానీ ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. ఇంతకీ ఈ భవనం ఎవరిది, ఇందులో విశేషాలేంటి తెలుసుకుందా రండి! గౌర్ మల్బరీ మాన్షన్స్ స్వర్గధామంగా చిత్రీకరించిన ‘రాకీ రంధావా’ అసలు పేరు ది గౌర్ మల్బరీ మాన్షన్స్ ఇదిగ్రేటర్ నోయిడా సెక్టార్-1లో ఉంది. దాదాపు 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు ఈ ఐకానిక్, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ భవనాన్ని కూడా పోలి ఉంటుందని కూడా అంచనా. ఫర్నీచర్, కళాఖండాలు, అలంకార వస్తువులు, ఫ్లోరింగ్, షాన్డిలియర్లు, కిటికీలు, మిర్రర్.. ఒకటేమిటి సర్వం పచ్చదనానికి మారు పేరుగా ఉన్నాయి. గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,ఎండీ మనోజ్ గౌర్ బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త, గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ సొంతంఈ గౌర్ మల్బరీ మాన్షన్స్ . రియల్ ఎస్టేట్ దిగ్గజం మనోజ్ క్రెడాయ్ నేషనల్ చైర్మన్ మరియు క్రెడాయ్ (NCR) అధ్యక్షుడు కూడా. గత 28 సంవత్సరాలుగా, గౌర్స్ గ్రూప్కు లీడ్ చేస్తున్న మనోజ్ అనేక ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తిచేశారు. డెలివరీ నుంచి నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్ల నాణ్యతతోపాటు అందుబాటులో ధరల్లో గృహాలను అందిస్తూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మాత్రమేకాదు మనోజ్ గౌర్ కూడా పర్యావరణ పద్ధతులను పాటించడంలోనూ దిట్ట. సోలార్ పవర్ ప్లాంట్లో రూ.80 కోట్లు పెట్టుబడులున్నాయి.. -
షాకింగ్ వీడియో.. వరద నీటిలో ముగినిపోయిన వందలాది కార్లు
దేశ వ్యాప్తంగా వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు. కుండపోత వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. రహదారులు, కాలనీలు ఇలా ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ముందుకు కదలడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతోసహా ఉత్తర భారత దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. యమునా ఉప నది అయిన హిండన్ నది నీటిమట్టం పెరగడంతో గ్రేటర్ నోయిడా మునిపోయింది. ఓ బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసిన దాదాపు 200కు పైగా కార్లు నీట మునిగాయి. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో వరస క్రమంలో పార్క్ చేసిన తెలుపు రంగు కార్ల పైకప్పుల వరకు వరద నీరు కప్పేసి ఉండటం కనిపిస్తోంది. హిండన్లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారిని తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి. నోయిడా, ఢిల్లీ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో ఈరోజు తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి యమునా నది ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) మించి ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 205.4 మీటర్ల స్థాయిలో ఉంది. -
పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్
ముంబై: పబ్జీ పరిచయంతో భారత్ వచ్చి ప్రియుడిని కలుసుకున్న పాకిస్తాన్ మహిళ సీమ హైదర్ తిరిగి పాకిస్తాన్ చేరుకోకుంటే 26/11 ముంబై దాడుల తరహాలో మళ్ళీ మారణకాండకు పాల్పడాల్సి ఉంటుందని ముంబై కంట్రోల్ రూముకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించారు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలతో సహా నోయిడా చేరుకున్న ఆమెపై నోయిడా పోలీసులు అక్రమ చొరబాటు కేసు, ఆశ్రయమిచ్చిన ప్రియుడిపై మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు వీరిద్దరికి బెయిల్ ఇవ్వడంతో కథ సుఖాంతమైందని అనుకుంటున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ మళ్ళీ వివాదాస్పదమైంది. అయితే ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి ఆమెకు సంబంధించినవారు ఎవరో ఈ కాల్ చేసి ఉంటారని.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని యూపీ పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. -
మహిళని ఎత్తి అవతలకు విసిరేసిన బౌన్సర్లు..
గ్రేటర్ నోయిడా: బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నోయిడాలో నిర్వహించిన "దివ్య దర్బార్"కు భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో బ్యారికేడ్లు దాటుకుని వచ్చిన మహిళను అక్కడి బౌన్సర్లు ఎత్తి అవతల పారేశారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో అక్కడే ఉండి చోద్యం చూస్తోన్న ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తూ నోయిడా పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాదిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి విశేష ఆదరణ ఉంది. ఆయన ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే భక్తులు అశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. అలాగే నోయిడాలో నిర్వహించిన దివ్యదర్బార్ కార్యక్రమానికి కూడా సభాప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంత జనం పోగయ్యారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంలో దారుణంగా విఫలమవడంతో తొక్కిసలాట కూడా జరిగింది. సగం కార్యక్రమం పూర్తైనా అప్పటికింకా భక్తులు సభాస్థలికి వస్తుండడంతో వారిని ఇంటికి వెళ్లి లైవ్ లో కార్యక్రమాన్ని చూడవలసిందిగా వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ధీరేంద్ర కృష్ణ ప్రవచనాలు చెబుతున్న సమయంలో ఒక మహిళ బ్యారికేడ్లు దాటుకుని స్టేజి వద్దకు దూసుకుని వెళ్లగా అక్కడ ఉన్న వాలంటీర్లు ఆమెను అలానే ఎత్తి జనంలోకి విసిరేశారు. అక్కడే ఉన్న ఎస్సై రామ శంకర్ వారిని వారించకుండా నిల్చుని చూస్తుండడం వీడియోలో రికార్డయ్యింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో సదరు ఎస్సై ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నోయిడా పోలీసు శాఖ. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన వాలంటీర్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. धीरेंद्र शास्त्री के दरबार मे धीरेंद्र शास्त्री के बाउंसरों ने कूड़े की तरह लड़की को उठाकर बैरिकेडिंग के पार फेंका#GreaterNoida #BageshwarDhamSarkar #DhirendraKrishnaShastri #TIME8 pic.twitter.com/I71daxELpU — TIME8 (@TIME8News) July 13, 2023 ఇది కూడా చదవండి: సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. -
షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు.. థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశారు
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాలక్సీ ప్లాజా షాపింగ్ కాంప్లెక్స్ మూడో అంతస్తులో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పలువురు భవనంపై నుంచి అమాంతం కిందకు దూకేశారు. సమాచారం అందుకన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎంతమంది గాయపడ్డారు, ఎలాంటి ప్రాణనష్టం జరిగిందనే విషయం తెలియరాలేదు. అయితే కాంప్లెక్స్లో ఎలక్ట్రీకల్ షార్ట్ సర్కిట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. షాపింగ్ కంప్లెక్స్లో నుంచి పొగ వెలువడటం, మూడో అంతస్తు కటికీ వద్ద ఇద్దరు వ్యక్తులు వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాసేపటికి మంటలు, పొగలు పెరగడంతో అక్కడి నుంచి కిందకు దూకేయడం వీడియోలో కనిపిస్తుంది. చదవండి: Patna: లాఠీ ప్రయోగం.. బీజేపీ ఆందోళన ఉద్రిక్తం #GreaterNoida : ग्रेटर नोएडा वेस्ट के गैलेक्सी प्लाजा में लगी आग, लोग शीशा तोड़ कूदकर जान बचाते नज़र आए, सूचना मिलते ही फायर बिग्रेड मोके पर पहुँची।@noidapolice pic.twitter.com/wWxHqd4xpQ — YAGYESH KUMAR JOURNALIST (@Bunty_0143) July 13, 2023 -
కార్మికుడికి రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టమంటూ నోటీసులు..?
లక్నో: నిరుద్యోగి ఆయిన ఒక కార్మికుడి కంపెనీ టర్నోవర్ రూ.2. 5 కోట్లు దాటింది కానీ అతడు టాక్స్ కట్టడం లేదంటూ అతడికి నోటీసులు పంపించింది ఆదాయపు పన్ను శాఖ. రోజుకి రూ. 300 సంపాదించుకునే కూలీని, అంత మొత్తాన్ని ఎక్కడ నుండి తెచ్చి కట్టాలని వాపోతున్నాడు ఆ కార్మికుడు. బులంద్ షహర్ కు చెందిన 22 ఏళ్ల దేవేంద్ర కుమార్ కు చాలా కాలంగా ఉద్యోగం లేదు. ఏవో కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు కానీ అక్కడ ఎక్కువకాలం స్థిరంగా లేడు. ప్రస్తుతానికైతే అతడు నరౌరాలో ఒక టౌన్ షిప్ ప్రాజెక్టులో దినవారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి రెండు వ్యాపారాలున్నాయని, వాటి నుంచి అతడు ఏడాదికి రూ.2.5 కోట్లు ఆదాయం పొందుతున్నాడని తెలుపుతూ జీఎస్టీ నోటీసులు జారీ చేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. నిందితుడు దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం నోయిడాలో నేనొక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్యాకర్ గా పని చేసేవాడిని. అక్కడి కాంట్రాక్టర్లు నాకు జీతం ఇవ్వడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వమని కోరారు. మార్చి 13, 16న అల్లాగే ఏప్రిల్ 4న రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ నుండి, అలీగఢ్ ఆదాయపు పన్ను కార్యాలయం నుండి ఘజియాబాద్ లోని మా ఇంటికి నోటీసులు వచ్చాయి. జేకే ట్రేడర్స్ అనే నా కంపెనీ టర్నోవర్ రూ.136.60 లక్షలని, అలాగే సర్వశ్రీ జేకె ట్రేడర్స్ అనే నా మరో కంపెనీ టర్నోవర్ 116.24 లక్షలని రెండిటికీ కలిపి మొత్తం రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టాల్సి ఉందని నోటీసుల్లో ఉంది. జీఎస్టీ నెంబర్ ఆధారంగా చూస్తే అది జితేందర్ సిసోడియా అనే వ్యక్తి పేరు మీద ఉందని.. మా పాత కంపెనీ యజమాని, జితేందర్ ఇద్దరూ కలిసి ఏదైనా మతలబు చేసి ఉంటారని ఆరోపించాడు. ఏమి చెయ్యాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించానని.. బులంద్ షహర్, నోయిడా, ఘజియాబాద్ తిరిగి తిరిగి చివరకు గౌతమ్ బుద్ధా జిల్లాలోని సెక్టార్-63 పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశానని ఇంతవరకు దానికే రూ.40000 ఖర్చు చేశానని భోరుమన్నాడు. ఇది కూడా చదవండి: పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే.. -
బాలీవుడ్ సినిమాను తలపిస్తోన్న పబ్జీ ప్రేమకథ..
గ్రేటర్ నోయిడా: పబ్జీ ప్రేమికుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ అనుకోని విధంగా ఇరకాటంలో పడింది. ప్రియుడిని కలుసుకుంది అంతలోనే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతలో సౌదీ నుండి ఆమె భర్త తన భార్యను వెనక్కు పంపించమని వేడుకుంటూ మోదీ ప్రభుత్వాన్ని వీడియో ద్వారా వేడుకున్నాడు. ఇదిలా ఉండగా బెయిలుపై బయటకు వచ్చిన ఆ పాకిస్తానీ మహిళ తానెక్కడికీ వెళ్ళబోయేది లేదని.. ఇప్పుడు నాది భారత దేశమని తెగేసి చెప్పింది. ఫస్ట్ హాఫ్.. భారతీయ యువకుడితో పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కు పబ్జీ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమను గెలిపించుకోవడానికి సీమా అడ్డంకులన్నిటినీ జయించి తన నలుగురి పిల్లలతో కలిసి భారత్ కు ఉడాయించింది. దీనికోసం పాకిస్తాన్ లో తన ప్లాటును 12 లక్షలకు అమ్మేసి పిల్లలకూ తనకూ ఫ్లైట్ టిక్కెట్లు తీసుకుని మొదట దుబాయ్ వెళ్లి అక్కడ నుండి నేపాల్, ఢిల్లీ మీదుగా నోయిడా చేరుకుంది. ఇంటర్వెల్.. భారత్ చేరి తన ప్రియుడు సచిన్ మీనాను కలిసింది కానీ అక్రమంగా భారత దేశంలోకి చొరబడినందుకు ఆమెపైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు నోయిడా పోలీసులు. వారిని జెవార్ న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి వారిద్దరికి బెయిల్ మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పకుండా రావాలని సూచించారు. ప్రీ క్లైమాక్స్.. ఇదిలా ఉండగా సౌదీలో ఉంటోన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ తన భార్యను ఎలాగైనా తిరిగి పాకిస్తాన్ పంపించలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో సందేశం పంపాడు. క్లైమాక్స్.. బెయిలుపై వచ్చిన సీమా దీనిపై స్పందిస్తూ.. నా భర్త హిందువు కాబట్టి నేను కూడా హిందువునే.. ఇప్పుడు నేను భారతీయురాలిని. నాకు నా భర్తను కలవాలని లేదు. పాకిస్తాన్ కు వెళ్తే నా ప్రాణానికే ప్రమాదమని చెప్పింది. నేను నా పిల్లలతో ఇక్కడే ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోబోతున్నట్లు కూడా తెలిపింది సీమా హైదర్. ఇది కూడా చదవండి: 3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే.. -
పబ్జీ ప్రేమ.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో ఇండియాకు.. చివరికి!
స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్లు పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ గేమ్లకు అడిక్ట్ అవుతున్నారు. చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మరిచిపోయి అందులో లీనమవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. భారత్లో పబ్జీ వంటి గేమ్లను నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయిన పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్ను డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారు. తాజాగా పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. పబ్జీలో పరిచమైన యువకుడి కోసం ఓ మహిళ తన పిల్లలతో కలిసి భర్తను వదిలేసి వచ్చింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రయాణమైంది. ఈ వింత ఘటన నోయిడాలో చేసుకుంది. నోయిడాకు చెందిన యువకుడు సచిన్కు పాకిస్థాన్కు చెందిన మహిళ సీమా గులామ్ హైదర్తో పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే మహిళకు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. పబ్జీలో సీమా, సచిన్ రోజు చాటింగ్ చేసుకునేవారు. ఇలా వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను విడిచిపెట్టేందుకు సిద్ధంమైంది. ఈ క్రమంలో గత నెల నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో ఉత్తర ప్రదేశ్ చేరుకుంది. అటు నుంచి బస్లో గ్రేటర్ నోయిడాకు వచ్చి తన ప్రియుడిని కలుసుకుంది. మహిళ, తన పిల్లలతో కలిసి సదరు యువకుడు రబుపెర ప్రాంతంలో అద్దె ఇంట్లో జీవించడం ప్రారంభించారు. అయితే పాకిస్తాన్ మహిళ నోయిడా అక్రమంగా నివసిస్తుందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సీమా సంగతి పోలీసులకు పసిగట్టారన్న విషయం తెలుసుకున్న సచిన్ ఆమెతోపాటు పారిపోయాడు. ఎట్టకేలకు నోయిడా అక్రమంగా నివసిస్తున్న సీమా, తన పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన నోయిడా యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మహిళ, నలుగురు పిల్లలు, నోయిడా యువకుడి పోలీస్ కస్టడీలో ఉన్నట్లు నోయిడా డీసీపీ సాద్ మియా ఖాన్ పేర్కొన్నారు. ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు. మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారని, తమకు కోర్టు వివాహం జరిగిందని, నలుగురు పిల్లలున్నారని చెప్పినట్లు వారు నివసించిన అపార్ట్మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు తెలిపాడు. సదరు మహిళ పాకిస్తాన్కు చెందినామెలా కనిపించలేదని, ఆమె సల్వార్ సూట్, చీరలుధరించేదని యజమాని పోలీసులకు చెప్పాడు. -
లండన్లో ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు.. థర్డ్ అటెంప్ట్లో ఫస్ట్ ర్యాంక్
దేశ వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన ఇషితా కిషోర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్తో మెరిశారు. గరిమ లోహియా, ఎన్ ఉమా హారతి. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. తొలి 25 ర్యాంకర్లలో 14 మంది మహిళలే ఉండటం విశేషం. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని.. ఇషితా కిషోర్ ఎయిర్ఫోర్స్ బాల్ భారతి పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇంటర్లో కామర్స్ విభాగంతో 97 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. 2017లో ఢిల్లీ యూనివర్సిటీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల నుంచి ఎకనామిక్స్ హానర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ తరువాత లండన్లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలో రిస్క్ అనలిస్ట్గా చేరారు. కానీ ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. రెండేళ్ల తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ప్రీపెర్ అయ్యేందుకు 2019లో తన ఉద్యోగాన్ని వదిలేసింది. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. మూడో ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంక్ సివిల్స్ మీద ఆసక్తితో చేసిన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్షలో ఇషితా ఉత్తీర్ణత సాధించలేదు. అయినా నిరాశ పడకుండా రెండోసారి ప్రయత్నించారు. ఈసారి కూడా ప్రిలిమ్స్ దాటలేకపోయారు. గతేడాది మూడోసారి సివిల్స్ పరీక్ష రాశారు. అయితే ఈసారి ప్రిలిమ్స్ గట్టెక్కడంతో తనపై తనకు నమ్మకం పెరిగింది. దీంతో మరింత కష్టపడి చదివి మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సైనిక కుటుంబ నేపథ్యం 26 ఏళ్ల ఇషితా తండ్రి సంజయ్ కిషోర్ ఇండియన్ ఎయిర్ఫోర్స్లో అధికారిగా పనిచేస్తున్నారు. సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో దేశానికి సేవ చేయాలనే ఆలోచన ఆమెలో బలంగా నాటుకుంది. ‘నా కుటుంబాన్ని చూసిన ప్రతిసారీ ఈ దేశం కోసం ఏదైనా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను పెరిగిన వాతావరణం అలాంటింది. అందుకే సివిల్స్ సర్వీసెస్లో చేరాను’ అని ఇషితా తెలిపారు.. కాగా ఇషితా తల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సోదరుడు న్యాయవాది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ను ఎంచుకున్న కిషోర్ ఉత్తర ప్రదేశ్ కేడర్ను తొలి ప్రాధాన్యతగా సెలెక్ట్ చేసుకుంది. ఇషితా జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణి కూడా. ఆమె పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ను తన ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకొని సివిల్స్కు అర్హత సాధించారు. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో విజేతలు వీళ్లే దేశానికి సేవ చేయాలని.. తన విజయంపై ఇషిత మాట్లాడుతూ.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావడం చాలా పెద్ద విషయమని, మొదటి ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశానికి సేవ చేయడానికి తనకు అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా దేశానికి సేవ చేయాలన్న తన కల నిజమైందని పేర్కొన్నారు. మహిళా సాధికారికత, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పింది. యూపీఎస్సీ పరీక్షలో ఈసారి తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం ఉంది కానీ ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేకపోయానని తెలిపింది. సివిల్స్ కొట్టేందుకు ఎంతో కష్టపడ్డానని, రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు చదువుకునేదాన్ని అని తెలిపింది. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సానుకూల మనస్తత్వం, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఈ అత్యుత్తమ విజయం వెనక, తనను నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులు, స్నేహితులు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Ishita Kishore, who has secured 1st rank in UPSC 2022 exam, says, "One has to be disciplined and sincere to be able to achieve this." pic.twitter.com/YKziDcuZJz — ANI (@ANI) May 23, 2023 మెరిసిన తెలుగు తేజం 2022 సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజం ఉమా హారతి మెరిశారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన ఉమా హారతి జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. ఉమా హారతి తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. తాను ఐదో ప్రయత్నంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. కుటుంబ ప్రోత్సాహంతోనే ఉత్తమ్ ర్యాంకు సాధించానని వెల్లడించారు. విధుల్లో చేరిన తర్వాత విద్యా, వైద్యం, మహిళ సాధికారత కోసం కృషి చేస్తానని తెలిపారు సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. -
‘ఆమె నా జీవితాన్ని తలకిందులు చేసింది, అందుకే..’
సమస్యలు లేని మనిషంటూ ఉండడు. కానీ, అనుజ్ సింగ్ మాత్రం తన సమస్యలను మోయలేని భారంగా భావించాడు. చిన్నవయసు నుంచి కాలేజీ రోజుల దాకా ఎదురైన పరిస్థితులతో మానసికంగా కుంగిపోయాడతను. ఆ టైంలోనే స్నేహ చౌరాసియా పరిచయం అయ్యింది. ఆమె ప్రేమలో జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుందని ఫీలయ్యాడతను. కానీ, అది అతనికి ఎంతో కాలం దక్కలేదు. ఆఖరికి.. ఆ ప్రేమ వెనుక మోసం దాగుందని గుర్తించి మాజీ ప్రేయసిని చంపడంతోనూ పాటు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకున్నాడా యువకుడు. గురువారం(మే 18) గ్రేటర్ నోయిడా(యూపీ) పరిధిలోని శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్న స్నేహ చౌరాసియాను.. అదే సెక్షన్కు చెందిన అనుజ్ సింగ్ కసితీరా పిస్టోల్తో కాల్చి చంపాడు. ఆపై హస్టల్ గదికి చేరుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. అఘాయిత్యానికి పాల్పడే ముందు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోను అనుజ్ జీమెయిల్ అకౌంట్ నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అందులో స్నేహ చౌరాసియా తన జీవితాన్ని ఎలా మార్చేసింది, తన మనసును ఎంత క్షోభ పెట్టిందనేది 23 నిమిషాలపాటు మాట్లాడాడతను. వీడియోలో ఏముందంటే.. ‘‘నా పేరు అనుజ్. నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరినీ బాధపెట్టలేదు. ఒకప్పుడు నా జీవితం అల్లకల్లోలంగా ఉండేది. మానసికంగా కుమిలిపోయేవాడిని. జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు చవిచూశా. నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని. నా గతంలో జరిగినవే అందుకు కారణం. నా సోదరిని ఆమె భర్త తగలబెట్టి చంపేశాడు. మా మామయ్య ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆడవాళ్ల వంక చూడకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. ఆమె పరిచయం నాలో సంతోషాన్ని నింపింది.. నాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఆమె లవ్ ప్రపోజ్ను అంగీకరించా. ఇద్దరం ఏడాదిన్నరకాలం ఎంతో ఆనందంగా గడిపాం. హఠాత్తుగా ఒకరోజు తాను మానసికంగా కుమిలిపోయానని, కాబట్టి తనకు దూరంగా ఉండమని బ్రేకప్ చెప్పేసింది స్నేహ. అది నమ్మి ఆమె సంతోషం కోసం దూరంగా ఉన్నా. కానీ, కాలేజీలో పని చేసే ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తర్వాతే తెలిసింది. ఆమె వల్ల నా జీవితం తలకిందులు అయ్యింది. నాకు ఎంతో టైం లేదు. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నా. చేసిందానికి ఆమె ప్రతిఫలం అనుభవించాల్సిందే. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా.. స్నేహ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అనుజ్ ఆ వీడియోలో చెప్పాడు. హస్టల్ సీసీటీవీ ఫుటేజీలు, ఆమె సెల్ఫోన్ ఛాటింగ్లను పరిశీలిస్తే.. స్నేహ అఫైర్ నిజమో కాదో తెలుస్తుందని చెప్పాడతను. ‘‘తన(స్నేహ) ప్రవర్తన మీద మొదటి నుంచి అనుమానాలు ఉండేవి. ఫోన్ను ఇచ్చేది కాదు. వాట్సాప్ ఛాటింగ్ నేను చూస్తానని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. గట్టిగా అడిగితే.. నమ్మకం లేదా? అనేది. కానీ, ఒకానొక టైం వచ్చేసరికి విడిపోదామని చెప్పేసింది. బాధేసినా.. తను బాగుండాలని సరేనన్నా. కానీ, స్నేహ చేసిన మోసం నన్ను గుండెల్లోతుగా బాధించింది. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా. స్నేహ తల్లిదండ్రులకు నా క్షమాపణలు.. మీ కన్నకూతురు బతకడానికి అర్హురాలు కాదు. మొన్న నన్ను.. ఇవాళో రేపో ఆ వ్యక్తిని, ఆపై మరొకరిని.. మోసం చేస్తుందని నా నమ్మకం. అలాంటి అమ్మాయికి బతికే హక్కు కూడా లేదు అంటూ వీడియోలో అనుజ్ మాట్లాడాడు. మధ్యాహ్నం 1గం.30ని. సమయంలో క్యాంపస్లోనే స్నేహ చౌరాసియాను నాటు తుపాకీతో కాల్చి చంపాడు అనుజ్ సింగ్. అయితే ఘటనకు ముందు వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతేకాదు యూనివర్సిటీ డైనింగ్ హాల్ వద్ద ఇద్దరూ కౌగిలించుకుని కూడా కనిపించినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాతే తనతో తెచ్చిన పిస్టోల్ను బయటకు తీసి.. స్నేహను కసితీరా కాల్చి చంపాడు అనుజ్. ఆపై హస్టల్ గదికి వెళ్లి తనను తాను కాల్చుకుని అక్కడిక్కడే చనిపోయాడు. అది వీడియోగా వైరల్ అయ్యింది కూడా. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. ఇప్పటిదాకా స్నేహ తల్లిదండ్రులు ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అలాగే క్యాంప్లో విచారణ కోసం వెళ్లిన పోలీసులను.. స్నేహ స్నేహితురాళ్ల మౌనం సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో.. అనుజ్కు దేశీవాళీ తుపాకీ ఎలా వచ్చింది? దానిని క్యాంపస్లోకి ఎలా తీసుకొచ్చాడు అనే కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు!
కొందరు విదేశీయులు అద్దెకు ఇంటిని తీసుకున్న అందులో ల్యాబరేటరీని ఏర్పరుచుకుని డ్రగ్స్ తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. ఈ దాడిలో నిందితులతో పాటు కోట్ల విలువైన మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సమాచారం మేరకు గ్రేటర్ నోయిడాలోని ఓ భవనంపై పోలీసులు దాడి చేశారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేశామని, అంతర్జాతీయ మార్కెట్లో రూ.200 కోట్ల విలువైన 46 కిలోల మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నట్లు గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. తొమ్మిది మంది విదేశీయులు గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ తీటా 2లో ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. పోలీసులుకు సమాచారం అందడంతో ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు సుమారు 100 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ముడిసరుకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ముడిసరుకులో మిథైల్ ఆల్కహాల్, హైపో ఫాస్ఫారిక్ యాసిడ్, హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్, అయోడిన్ క్రిస్టల్స్, అమ్మోనియా, ఎఫిడ్రిన్, అసిటోన్, సల్ఫర్, కాపర్ సాల్ట్ ఉన్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిని అనుదుమ్ ఇమ్మాన్యుయేల్, అజోకు ఉబాకా, డేనియల్ అజుహ్, లెవి ఉజోచుక్వ్, జాకబ్ ఎమెఫీలే, కోఫీ, చిడి ఇజియాగ్వా (ఎనిమిది మంది నైజీరియాకు చెందినవారు), డ్రామెమండ్ (సెనెగల్కు చెందినవారు)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రెండు మూడు రోజులకు ఒక పోలీసు మృతి.. ఐదేళ్లలో 821 మంది -
ఆటో ఎక్స్పో 2023: ఎలక్ట్రిక్ వాహనాలే హైలైట్, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి
గ్రేటర్ నోయిడా: భారత్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో 2023 బుధవారం ప్రారంభమైంది. 2022లో జరగాల్సిన ఈ కార్యక్రమం కోవిడ్–19 కారణంగా వాయిదాపడింది. ఈసారి షోలో ఎలక్ట్రిక్ వాహనాలు హైలైట్. 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి ఎక్స్పోలో తళుక్కుమంటున్నాయి. వీటిలో మారుతీ 5 డోర్ జిమ్మీ, నెక్స్ట్ జనరేషన్ కియా కార్నివల్, ఎంజీ ఎయిర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, హ్యుందాయ్ అయానిక్–5 ఉన్నాయి. జనవరి 18 వరకు ప్రదర్శన ఉంటుంది. సుజుకీ ఈవీఎక్స్ 550 కిలోమీటర్లు వాహన తయారీ దిగ్గజం జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మధ్యస్థాయి ఎస్యూవీ ‘ఈవీఎక్స్’ తొలిసారిగా అంతర్జాతీయంగా దర్శనమిచ్చింది. 2025లో ఈ కారు మార్కెట్లో అడుగుపెట్టనుంది. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్తో 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ డైరెక్టర్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ వెల్లడించారు. మొత్తం 16 వాహనాలను మారుతీ ప్రదర్శిస్తోంది. వీటిలో వేగన్–ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్, బ్రెజ్జా ఎస్–సీఎన్జీ, గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వంటివి ఉన్నాయి. హ్యుందాయ్: అయానిక్–5 ఈవీ ప్రపంచంలో తొలిసారిగా ఆవిష్కరించింది. పరిచయ ఆఫర్లో ధర తొలి 500 మంది కస్టమర్లకు రూ.44.95 లక్షలు. 72.6 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 217 హెచ్పీ ఎలక్ట్రిక్ మోటార్ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 631 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయానిక్–6 ఎలక్ట్రిక్ సెడాన్ సైతం కొలువుదీరింది. 53, 77 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్లో లభిస్తుంది. ఎంజీ: హెక్టర్, హెక్టర్ ప్లస్ ఫేస్లిఫ్ట్ కొలువుదీరాయి. ఆల్ ఎలక్ట్రిక్ మిఫా 9 ఎంపీవీ తొలిసారిగా భారత్లో తళుక్కుమన్నది. దీనిలో 90 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. 440 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎంజీ–4 హ్యాచ్బ్యాక్, ఎంజీ 5 ఎలక్ట్రిక్ స్టేషన్ వేగన్ (ఎస్టేట్), ఈఎంజీ6 హైబ్రిడ్ సెడాన్ సైతం ప్రదర్శనలో ఉంది. బీవైడీ: సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ను ఆవిష్కరించింది. 2023 చివరి త్రైమాసికంలో రానుంది. లెక్సస్: ఎల్ఎం 300హెచ్ ఎంపీవీ (టయోటా వెల్ఫైర్) భారత్లో అడుగుపెట్టింది. హైబ్రిడ్ పవర్ట్రెయిన్తో రూపుదిద్దుకుంది. 150 హెచ్పీ, 2.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ ఏర్పాటు ఉంది. కొత్త ఆర్ఎక్స్ ఎస్యూవీ భారత్లో ప్రవేశించింది. ఎల్ఎఫ్–30, ఎల్ఎఫ్–జడ్ ఈవీ కాన్సెప్ట్ మోడళ్లు ఉన్నాయి. టయోటా: ల్యాండ్ క్రూజ్ ఎల్సీ 300 ఎస్యూవీ కొత్త రూపులో చమక్కుమంటోంది. బీజడ్4ఎక్స్ భారత్లో అడుగుపెట్టింది. 71.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. 450 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. టాటా: అందరినీ ఆశ్చర్యంలో పడేస్తూ హ్యారియర్ ఈవీ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. 2024లో మార్కెట్లోకి రానుంది. డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ ఉంది. 2025లో రంగ ప్రవేశం చేయనున్న సియర్రా ఈవీ కాన్సెప్ట్ సైతం మెరిసింది. చదవండి: ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా -
Crime News: గొంతుకోసి.. వేడినూనెతో ముఖం కాల్చేసి..
క్రైమ్: దృశ్యం సినిమాలో రాంబాబు పాత్ర పెద్దగా చదువుకోదు. కేవలం.. తాను సంపాదించుకున్న సినిమా నాలెడ్జ్తోనే వరుణ్ మిస్సింగ్(మర్డర్) కేసు నుంచి కుటుంబాన్ని రక్షించుకుంటూ వస్తాడు. అయితే నిజజీవితంలోనూ సినిమాలు, టీవీ సీరియళ్లు.. నేరాలకు స్ఫూర్తిగా నిలవడం తరచూ చూస్తుంటాం. తాజాగా.. గ్రేటర్ నోయిడాలో బయటపడ్డ ఉదంతం విస్మయాన్ని కలిగిస్తోంది. పాయల్.. గ్రేటర్ నోయిడాకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని బధ్పురా గ్రామవాసి. తల్లిదండ్రుల గారాల బిడ్డగా పెరిగింది. పెళ్లీడూ వచ్చాక.. సంబంధాలు వెతకడం ప్రారంభించారు ఆమె తల్లిదండ్రులు. అయితే తాను అజయ్ను ప్రేమించిన విషయాన్ని చెప్పడానికి ఆమె తటపటాయిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కమ్మేసింది. వ్యాపారంలో నష్టాలు పూడ్చుకునేందుకు పాయల్ తండ్రి బోలెడంత అప్పులు చేశాడు. ఆ భారం కొండంత కావడంతో.. భరించలేకపోయాడు. భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన పాయల్కు.. అజయ్ ఆదరణ లభించింది. కానీ, కన్నవాళ్లు లేకపోవడంతో కుమిలిపోయింది పాయల్. ఆ బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. ఇంట్లోనే పాయల్ నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుందనే వార్త స్థానికంగా విషాదం నింపింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహానికి బంధువుల అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కూడా సూసైడ్ కేసుగా క్లోజ్ చేశారు. పాయల్ దూరమైందన్న బాధతో దేశాలు పట్టుకుపోయాడు అజయ్. కట్ చేస్తే.. అదే ఏరియాలో ఓ యువతి మిస్సింగ్ కంప్లయింట్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎంత వెతికినా ఆమె జాడను కనిపెట్టలేకపోయారు పోలీసులు. దీంతో గౌర్ సిటీ ఏరియాలో ఆమె పని చేసే మాల్ దగ్గర నుంచి విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. బధ్పురాకు చెందిన అజయ్, మిస్సింగ్ యువతికి మంచి స్నేహితుడని తేలింది. దీంతో.. పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. పాయల్ కోసమే తాను అదంతా చేశానని, పాయల్ బతికే ఉందన్న షాకింగ్ విషయాన్ని బయటపెడ్డాడు. తండ్రి చేసిన అప్పుల నుంచి తప్పించుకునేందుకు మరో వ్యక్తిని చంపి.. తన ప్లేస్లో ఆ శవాన్ని ఉంచి.. చనిపోయినట్లు నాటకం ఆడినట్లు ఒప్పుకుందామె. తాను చూసిన ఓ టీవీ షో స్ఫూర్తితోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపింది పాయల్. ఇందుకోసం ముందుగా అజయ్.. పాయల్ ఫిజిక్తో సరిపోలిన మాల్లో పని చేసే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ఆమెను నమ్మించి..ఓరోజు పాయల్ ఇంటికి తీసుకొచ్చాడు. గొంతు కోసి, ముఖం ఎవరూ గుర్తుపట్టకుండా వేడి నూనె, యాసిడ్ పోసి.. ఆపై బాడీకి నిప్పటించారు ఆ లవ్బర్డ్స్. ప్లాన్ ప్రకారం ముందుగా పాయల్, కొన్నిరోజుల గ్యాప్లో అజయ్.. ఇద్దరూ ఆ ఊరిని విడిచిపెట్టారు. బాధితురాలు కనిపించడం లేదన్న ఫిర్యాదుతో ఈ మొత్తం నేరం బయటపడింది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. వాళ్ల నుంచి ఓ రివాల్వర్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: బలవంతంగా కామాంధుల చెంతకు.. ఆపై.. -
ఎన్నారైను టెన్షన్ పెట్టిన నాలుగు గంటలు
ఢిల్లీ: ఏమరపాటులో చేసే పని.. ఒక్కోసారి తీవ్రపరిణామాలకు దారి తీస్తుంటుంది. తన కూతురి పెళ్లి కోసం నగలతో వచ్చిన ఓ ఎన్నారైకి అలాంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లో టెన్షన్.. టెన్షన్గా గడిపాడు ఆ పెద్దయాన. నిఖిలేష్ సిన్హా(50).. లండన్ నుంచి తన కూతురి వివాహం కోసం వచ్చారు. గ్రేటర్ నోయిడాలో ఓ హోటల్లో బస చేసిన ఆయన.. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఊరికి వెళ్లేందుకు లగేజీతో ఓ క్యాబ్ బుక్ చేసుకుని బయల్దేరారు. అయితే.. తీరా గమ్యస్థానం చేరుకున్నాక ఆయన ఓ బ్యాగ్ను క్యాబ్లోనే మరిచిపోయి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాతే ఆయన తలపట్టుకున్నారు. ఆ బ్యాగులో సుమారు కోటి రూపాయల విలువ చేసే నగలు ఉన్నాయట. దీంతో ఆలస్యం చేయకుండా ఆయన బిస్రాఖ్ పోలీసులను ఆశ్రయించాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఆ క్యాబ్ నిర్వహణ కార్యాలయానికి వెళ్లి.. నాలుగు గంటల్లో ఆ క్యాబ్ ఉన్న లొకేషన్ గుర్తించారు. తీరా.. ఘజియాబాద్ లాల్ కౌన్ వద్ద క్యాబ్ను పోలీసులు పట్టుకున్నారు. అయితే.. ఆ పెద్దాయన క్యాబ్లో బ్యాగ్ మరిచిపోయిన విషయం తనకు తెలియదని డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. దీంతో నేరుగా క్యాబ్, డ్రైవర్తో సహా స్టేషన్కి చేరుకున్న పోలీసులు.. నిఖిలేష్ ముందే ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి నగలను అప్పగించారు. పోలీసుల త్వరగతిన స్పందన ఎన్నారై నిఖిలేష్ సంతోషం వ్యక్తం చేసి.. క్యాబ్ డ్రైవర్పై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది. ఇదీ చదవండి: మీరు దళితులు.. మీకు ఏం అమ్మం! -
దారుణం.. స్నేహితుడిని చంపి డ్రైనేజీలో పడేసిన విద్యార్థులు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అత్యంత దారుణంగా హత్య చేసి డ్రైనేజీలో పడేశారు తోటి విద్యార్థులు. గాల్గోటియాస్ ప్రైవేటు యూనివర్సిటీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి మృతదేహం గ్రేటర్ నోయిడాలోని ఇన్స్టిట్యూట్కు సమీపంలోని డ్రైనేజీలో లభించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని హత్య చేసిన వారిలో ఐదుగురు విద్యార్థులను గుర్తించినట్లు చెప్పారు. మృతుడు యశశ్వి రాజ్గా గుర్తించినట్లు చెప్పారు పోలీసులు. మరోవైపు.. ఐదుగురు విద్యార్థులు గొడవ పెట్టుకుని యశశ్విని దారుణంగా కొట్టి చంపేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. కాంగ్రెస్ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై -
భారత్లో అడుగుపెట్టనున్న మోటో జీపీ.. మెగా ఈవెంట్ ఎప్పుడంటే?
ఫార్ములా రేసింగ్ను ఇష్టపడే భారత అభిమానులకు శుభవార్త. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించే మోటో జీపీ బైక్ రేసింగ్ వరల్డ్ చాంపియన్షిప్ తొలిసారి ఇండియాకు రాబోతుంది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్ను ''గ్రాండ్ పిక్స్ ఆఫ్ భారత్'' పేరుతో మన దేశంలో నిర్వహించనున్నారు. అందుకోసం గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఫెయిర్స్ట్రీట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్నా స్పోర్ట్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. మోటార్సైకిల్ రేసును ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని భారత ప్రేక్షకులకు అందించేందుకు డోర్నా స్పోర్ట్స్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనికోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. అంతేకాదు ఇంటర్నేషనల్ లెవల్ మోటో జీపీ రైడర్లను ఇండియాలో తయారు చేసే దిశగా కృషి చేస్తోంది. మోటో జీపీనే కాదు.. మోటో ఈని కూడా ఇండియాకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకముందు భారత్లో తొలిసారి జరిగిన ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రికి కూడా నోయిడాలో ఉన్న ఈ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూటే ఆతిథ్యమిచ్చింది. అయితే ఒక సీజన్తోనే ఎఫ్1 ఇండియన్ గ్రాండ్ ప్రిని ముగించింది. ఇప్పుడు మోటో జీపీ రాక రేసింగ్ ప్రియులకు ఆనందాన్నిస్తోంది. చదవండి: తీవ్రంగా గాయపడిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ -
గ్రేటర్ నోయిడా: ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి
లక్నో: అపార్ట్మెంట్లోని 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. డిసెంబర్ 12 జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్లోని పానిపట్లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతి తన స్నేహితుడిని కలవడానికి నోయిడాలోని ఎన్నారై సిటీ సొసైటీకి వచ్చింది. రాత్రి పడుకున్న తరువాత బాలిక వాష్రూమ్ వెళ్లడానికి లేచింది. ఆ తరువాత ఏమైందో ఏమో గానీ అపార్ట్మెంట్లోని 7వ అంతస్తు కిటికి నుంచి ఒక్కసారిగా కిందపడిపయింది. దీంతో తీవ్రంగా గాయాలపాలైంది దీనిని చూసిన స్థానికులు యువతిని రక్షించేందుకు పరుగులు పెట్టగా.. ప్రమాదం సమయంలో యువతి నగ్నంగా(వివస్త్రగా) ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతిని ఆసుపత్రికి తరలించారు. కింద పడిపోవడంతో యువతి మెడ విరిగిపోయిందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. పస్తుతం యువతి కోమాలోకి వెళ్లిందని తెలిపారు. కాగా యువతి నిద్రమత్తులో అకస్మాత్తుగా కిటికీలోంచి కింద పడిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు అయినప్పటికీ యువతి ప్రమాదవశాత్తు కిందపడిపోయిందా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరగపుతున్నారు. యువతి కోమాలోకి వెళ్లిపోవడంతో ఆమె నుంచి ఎలాంటి వివరాలు సేకరించలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్పృహలోకి రాగానే నిజానిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. రోవైపు బాధిత యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. చదవండి: కుమార్తె నిశ్చితార్థం రద్దు.. తండ్రి ఆత్మహత్య! అదే విధంగా యువతి స్నేహితుడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే యువతి తనను కలిసేందుకు తరుచూ అపార్ట్మెంట్కు వస్తుంటుందని ఆమె స్నేహితుడు పోలీసులకు తెలిపారు. ఘటన జరిగిన రోజు ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. రాత్రి పడుకున్న తరువాత మద్యం మత్తులో ఉన్న బాలిక బాత్రూమ్ వైపు వెళ్లిందని తెలిపాడు. మద్యం మత్తులో ఆమె కిటికీ నుంచి కిందపడి ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి.. -
షాకింగ్.. రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన స్విగ్గీ ఏజెంట్
గ్రేటర్ నోయిడా(లక్నో): స్విగ్గీకి చెందిన డెలివరీ ఏజెంట్ ఆర్డర్ సిద్ధం చేయడంలో ఆలస్యమైందని ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఓ రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి డెలివరీ ఏజెంట్ని గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘స్విగ్గీ ఏజెంట్ చికెన్ బిర్యానీ, పూరీ సబ్జీ ఆర్డర్ సేకరించడానికి ఓ రెస్టారెంట్కు వెళ్లాడు. బిర్యానీ సిద్ధంగా ఉన్నప్పటికీ రెస్టారెంట్లో పనిచేసే ఓ వ్యక్తి ఆర్డర్కు మరికొంత సమయం పడుతుందన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చదవండి: స్విగ్గీ న్యూ డెసిషన్... ఇవి కూడా డెలివరీ చేస్తుందట ఈ క్రమంలో రెస్టారెంట్ ఉద్యోగిని డెలివరీ ఏజెంట్ అసభ్యంగా దూషించాడు. కాగా రెస్టారెంట్ యజమాని సునీల్ అగర్వాల్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. అయితే డెలివరీ ఏజెంట్ అతని స్నేహితుడి సహాయంతో అతని తలపై కాల్చాడు’’ అని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ ఉద్యోగి, ఇతర సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. హత్యకు గురైన వ్యక్తిని సునీల్ అగర్వాల్గా గుర్తించారు. అతడు మిత్రా అనే నివాస సముదాయం లోపల ఓ రెస్టారెంట్ కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్ -
‘ఫ్రీడం 251’ మోహిత్ గోయల్ మళ్లీ అరెస్ట్
నాలుగేళ్ల క్రితం డెడ్ చీప్గా స్మార్ట్ఫోన్ అందిస్తానంటూ ప్రకటన చేసిన మోహిత్ గోయల్ గుర్తున్నాడా? దేశం మొత్తం కుదిపేసిన ‘ఫ్రీడం 251 ఫోన్’ స్కాం ప్రధాన నిందితుడైన ఈ మోహిత్ను ఇప్పుడు పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని 41 లక్షలకు ముంచడంతో పాటు చంపేందుకు ప్రయత్నించిన నేరారోపణలపై గ్రేటర్ నోయిడా పోలీసులు మోహిత్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గోయల్తో పాటు మరో ఐదుగురిపైనా 41 లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీల మోసంపై ఇందిరాపురం చెందిన వికాస్ మిట్టల్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం గ్రేటర్ నోయిడాలోని గోయోల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రై ఫ్రూట్స్ అమ్మకాలకు సంబంధించిన వ్యహారంలో మోసం చేయడమే కాకుండా.. డబ్బుల గురించి నిలదీస్తే చంపేస్తానని వికాస్ను చెదిరించాడు గోయల్. అంతేకాదు కారుతో ఢీ కొట్టి చంపేందుకు ప్రయత్నించాడని వికాస్ ఆరోపిస్తున్నాడు. దీంతో వికాస్ ఫిర్యాదు మేరకు మోహిత్ గోయల్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మోసం, దోపిడీ, చంపేస్తానని బెదిరించడం, గాయపర్చడం.. ఇలా పలు నేరాలకుగానూ ఐపీసీ సెక్షన్లతో మోహిత్పై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే 2017లో రింగింగ్ బెల్ అనే కంపెనీ ద్వారా ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్ల అమ్మకం ప్రకటన ద్వారా సంచలనానికి తెరలేపిన మోహిత్.. భారీ స్కామ్తో వార్తల్లోకి ఎక్కి అరెస్టైన విషయం తెలిసిందే. ఆపై దుబాయ్ డ్రై ఫఫ్రూట్స్ అండ్ స్పైసిస్ పేరుతో ఓ ఆఫీస్ తెరిచి.. సుమారు 200 కోట్ల స్కాంకు పాల్పడ్డాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ డ్రై ఫ్రూట్స్ వ్యవహారంలో పలు రాష్ట్రాల నుంచి అతనిపై 35 కేసులు నమోదు అయ్యాయి. చదవండి: సిండికేట్ బ్యాంక్లో మోసం కేసులో సీబీఐ చార్జ్షీట్ -
భారత్కు ఈయూ చేయూత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉధృతితో అల్లాడిపోతున్న భారత్కు విదేశాలు బాసటగా నిలుస్తున్నాయి. అత్యవసర ప్రాణాధార ఔషధాలను, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలను పంపిస్తున్నాయి. ఇటలీ సోమవారం ఒక నిపుణుల బృందాన్ని, వైద్య పరికరాలను భారత్కు పంపింది. ఇక యునైటెడ్ కింగ్డమ్(యూకే) నాలుగో దశ సాయం అందించింది. ఇందులో 60 వెంటిలేటర్లు, ఇతర పరికరాలు ఉన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను కూడా అందించింది. ఈ ప్లాంట్ ద్వారా ఒక ఆసుపత్రికి అవసరమైన ప్రాణ వాయువును ఉత్పత్తి చేయొచ్చు. దీన్ని గ్రేటర్ నోయిడాలోని ఐటీబీపీ ఆసుపత్రిలో నెలకొల్పనున్నారు. ఇటలీ నుంచి వచ్చిన బృందానికి ఇండియాలోని ఆ దేశ రాయబారి విన్సెంజో డి లూకా స్వాగతం పలికారు. ఇక యూరోపియన్ యూనియన్(ఈయూ) అదనంగా అత్యవసర వైద్య సాయాన్ని భారత్కు అందిస్తామని ప్రకటించింది. తన సభ్యదేశాలైన డెన్మార్క్, స్పెయిన్, నెదర్లాండ్స్ నుంచి సాయాన్ని భారత్కు అందిస్తామంది. కరోనాపై పోరాటంలో భారత్ వెంట నిలుస్తామని డి లూకా చెప్పారు. ఈ వైరస్ ప్రపంచానికే ఒక సవాలు అని అన్నారు. అందరం కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. భారత్కు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. భారత్కు అండగా నిలుస్తున్న యూకేకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. డెన్మార్క్ నుంచి 53 వెంటిలేటర్లు, స్పెయిన్ నుంచి 119 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 145 వెంటిలేటర్లు పంపుతున్నట్లు ఈయూ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక నెదర్లాండ్స్ నుంచి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 30 వేల డెమ్డెసివిర్ వయల్స్, 449 వెంటిలేటర్లు పంపిస్తామని పేర్కొంది. జర్మనీ కూడా 15 వేల యాంటీ వైరల్ డ్రగ్స్ వయల్స్ పంపింది. అలాగే 516 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసింది. -
దంపతుల దారుణ హత్య కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : గ్రెటర్ నోయిడాలో జంట హత్యలు కేసు స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. చెర్రి కౌంటీ సొసైటీ తొమ్మిదో అంతస్తులో నివాసం ఉంటున్న కిరాణా షాప్ యజమాని అతని భార్య రక్తపు మడుగులో కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన బుధవారం బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మృతులు వినయ్ గుప్త(50), నేహా గుప్తలుగా గుర్తించారు. కొన్ని నెలలుగా కిరాణా షాప్ నడుపుతూ ఈ ప్లాట్లో ఉంటున్నారని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లవ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, హత్య వెనుకాల దంపతులకు తెలిసిన వారి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్, స్పేషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఫోరెన్సిక్, సర్వేలైన్స్ విభాగం అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారని, డాగ్ స్వ్కాడ్ సేవలు కూడా తీసుకుంటున్నామని ఏసీపీ అన్నారు. అడిషనల్ కమిషనర్ కుమార్ విలేకరులతో మట్లాడుతూ.. ‘దోపిడి చేసే ఉద్ధేషంతో ఈ హత్యకు పాల్పడినట్లు కనిపించడంలేదు. ఇంట్లోని వస్తువులు ఎక్కడాకూడా చెల్లాచెదురుగా పడిలేవు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినట్టు ఏ విధమైన ఆనవాలు కనిపించలేదు. వీరికి తెలిసిన వారే ఇంటిలోని బలమైన వస్తువులను ఉపయోగించి హతమార్చి ఉంటారని భావిస్తున్నామ’న్నారు. -
అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు
గ్రేటర్ నోయిడా(ఉత్తరప్రదేశ్): బిస్రఖ్ గ్రామంలో రావణుడి ఆలయం వద్ద కొంతమంది భక్తులు అయోధ్య రామ మందిరానికి చెందిన భూమి పూజను జరుపుకున్నారు. పురాణాల ప్రకారం రావణుడు బిస్రఖ్ గ్రామంలో జన్మించాడని చెబుతారు. అందుకే ఈ గ్రామంలో రాక్షస రాజైన రావణుడికి ఒక ఆలయాన్ని నిర్మించారు. రామాలయ భూమి పూజ కోసం దాదాపు 200లకు పైగా ప్రదేశాల నుంచి ఆలయ నిర్మాణం కోసం మట్టిని పంపిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం కోసం ఈ రావణుడి ఆలయం నుంచి కూడా మట్టిని పంపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి అశోకానంద్ మహారాజ్ మాట్లాడుతూ.. ‘500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాములవారు తన ఇంటికి వెళ్ళబోతున్నాడు. రావణ గ్రామమైన బిస్రఖ్ నివాసులమైన మాకు ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మా దేవుడైన రాముడు స్వదేశానికి తిరిగి రావడానికి మేము రావణుడి ఆలయంలో మతపరమైన వేడుకలు నిర్వహించాము. రాముడు లేకుండా రావణుడు అసంపూర్ణం. ఎందుకంటే రాముడే రావణుడికి మోక్షం ప్రసాదించాడు’ అని తెలిపారు. (జగమంతా రామమయం) గ్రామవాసులు రావణుడిని ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు వేడుకలు జరుపుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు అశోకానంద్ సమాధానమిస్తూ.. ‘హిందూ మతం వైవిధ్యమైనది. దేవుని పట్ల భయం హిందూ మతంలో ఒక భావన కాదు, ఇదంతా కర్మ సిద్ధాంతం. భగవంతుడు ప్రతిచోటా, అన్ని జీవులలో, ప్రాణములేని వాటిలో, మంచిలో, చెడులో, మనందరిలో ఉన్నాడు. రావణుడు శివుని భక్తుడు. ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేయడం ప్రారంభించే వరకు చెడ్డ వ్యక్తి కాదు. రావణుడు చాలా శక్తిమంతుడు. తనకు మోక్షాన్ని ప్రసాదించగలిగే ఒకే ఒక వ్యక్తి రాముడని ఆయనకు తెలుసు. అందుకే రాముడితో వైరం పెట్టుకున్నాడు’ అని తెలిపారు. చదవండి: నూతన శకానికి నాందీ క్షణం -
‘పని 24 గంటలు.. జీతం 12 గంటలకే’
లక్నో: గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ వాసులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలు.. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని సూపర్టెక్ ఎకోజోన్ కాంప్లెక్స్లో ఓ వ్యక్తికి సోమవారం కరోనా పాజిటీవ్గా తెలీంది. దాంతో పోలీసులు ఆ కాంప్లెక్స్ను సీల్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు, అపార్ట్మెంట్ వాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కరోనా బయటపడిన ఇంటిని మాత్రమే సీల్ చేయాల్సిందిగా అపార్ట్మెంట్ వాసులు పోలీసులను కోరారు. తాము పని చేస్తున్న కంపెనీలు తిరిగి తెరిచారని.. ఆఫీసులకు వెళ్లకతప్పదని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ('రథయాత్ర 'ఏమవుతుందో ఏమో...!) అపార్ట్మెంట్వాసులకు నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ‘మీకు ముందు మేము ఉన్నాం. మేం మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం. ఇది ప్రభుత్వ ఉద్యోగం. మేం 24 గంటలు పని చేస్తున్నాం.. కానీ మాకు 12 గంటలకే జీతం ఇస్తారు. అయినా మేం ప్రజల కోసం పని చేస్తున్నాం. ఒక వేళ మీరు గొడప పడాలనుకుంటే రండి’ అంటూ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల మాటలతో జనాలు శాంతించారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ పూర్తిగా సీల్ చేయబడింది. -
కరోనా పాజిటివ్... ఆగిపోయిన కంపెనీ పనులు
గ్రేటర్ నోయిడా: మార్చి నుంచే లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ కరోనా వైరస్ కారణంగా ఎక్కడికక్కడ అన్ని మూతబడ్డాయి. అయితే మే 9 నుంచి కేంద్రప్రభుత్వం కొన్ని కంపెనీలకు తక్కువ మంది సిబ్బందితో వాటి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి అనుమతినిచ్చింది. దీంతో కొన్ని కంపెనీలు తమ పనులను ప్రారంభించాయి.వాటిలో ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం ఒప్పొ కూడా ఉంది. అయితే గ్రేటర్ నోయిడాలోని ఒప్పో కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది సిబ్బందికి ఆదివారం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కంపెనీలో పనులన్నింటిని ఆపేశారు. లాక్డౌన్ కారణంగా ఆపేసిన పనులను ఒప్పో మే 9 నుంచి ప్రారంభించింది. (ఐదుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్) ఈ విషయం గురించి ఒప్పో ప్రతినిధులు మాట్లాడుతూ మాకు మా ఉద్యోగులు, సమాజ భద్రతే ముఖ్యం. గ్రేటర్ నోయిడాలో ఉన్న మా కంపెనీ కార్యకలాపాలన్నింటిని మేం ప్రస్తుతం నిలిపేశాం. అదేవిధంగా అక్కడ పనిచేస్తోన్న 3000 మందికి పైగా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయిస్తున్నాం అని తెలిపారు. అయితే వారికి ఏ ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తున్నారో మాత్రం సంస్థ తెలుపలేదు. ఇక ఇప్పటి వరకు భారతదేశంలో 96,169 కేసులు నమోదు కాగా, 36,823 మంది కోలుకున్నారు. ఆదివారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా గరిష్టంగా 5000లకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. (లాక్డౌన్ 4.0: కొత్త నిబంధనలు ఇవే!) -
కరోనా రోగిపై లైంగిక వేధింపులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్తో గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిని లైంగికంగా వేధించిన ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన 20 ఏళ్ల మహిళ కోవిడ్-19తో బాధపడుతూ శ్రద్ధ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. ఆ మహిళను ఆస్పత్రికి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు, స్టోర్ ఉద్యోగి లైంగికంగా వేధింపులకు గురిచేశారని ఆస్పత్రి నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితులు లవ్కుశ్, ప్రవీణ్లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకున్న వీరిని విధుల నుంచి తొలగించామని కోవిడ్-19 సేవలు అందిస్తున్న ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. చదవండి : రెండు నెలల్లో మహమ్మారి విజృంభణ -
విషాదం : టోల్ప్లాజాను తొందరగా దాటాలనే ప్రయత్నంలో
నోయిడా : ఉత్తర్ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా టోల్ప్లాజా వద్ద శనివారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. అందరికంటే ముందు టోల్ కట్టాలన్న ట్రక్కు డ్రైవర్ తాపత్రయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొంది. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో నోయిడా టోల్ప్లాజా వద్దకు రెండు ట్రక్కులు ఏకకాలంలో వచ్చాయి. అయితే ఎవరి ట్రక్కు ముందు వెళ్లాలనే విషయంపై ఇరు డ్రైవర్ల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీయడానికి ప్రయత్నించగా మరో ట్రక్కు డ్రైవర్ దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఇది పట్టించుకోకుండా సదరు ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని అలాగే ముందుకు తీయడంతో మరో డ్రైవర్ పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడిక్కడే మరణించాడు. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవిలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సీసీటీవి ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో మరణించిన ట్రక్కు డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు గుడ్బై
గ్రేటర్ నోయిడా: ప్రపంచదేశాలన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ)కి ఇక గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీడు భూముల్ని సాగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి కూడా ఆయన వివరించారు. ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి (యూఎన్సీసీడీ) కాప్14 సదస్సుకి ఈ సారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ సదస్సులో 200 దేశాలకు చెందిన ప్రతినిధులనుద్దేశించి సోమవారం ప్రధాని ప్రసంగించారు. ఒకసారి మాత్రమే వినియోగించాల్సిన ప్లాస్టిక్ను వచ్చే కొద్ది సంవత్సరాల్లో భారత్లో పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని చెప్పారు. ‘ప్లాస్టిక్ వినియోగం పెరిగే కొద్దీ పచ్చని భూములు కూడా ఎడారులుగా మారిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు మన భూముల్ని ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వెలువడే కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎటుచూసినా కుప్పులు తెప్పలుగా పేర్కొంటున్న ప్లాస్టిక్ భూముల్ని నాశనం చేసి వ్యవసాయాన్ని దెబ్బ తీస్తోంది‘‘ అని మోదీ చెప్పారు. ప్రపంచదేశాలన్నీ కూడా ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భూముల క్షీణతపై ఆందోళన పర్యావరణంలో వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని ప్రధాని అన్నారు. వాతావరణం వేడెక్కడంతో కాలం కాని కాలంలో వర్షాలు కురవడం, తుపాన్లు ముంచెత్తడం, సముద్ర మట్టాలు పెరిగిపోవడం వంటి వాటితో భూముల్ని కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భూమిలో సారాన్ని పెంచాలంటే, వ్యవసాయానికి అనుగుణంగా వాటిని మార్చాలంటే నీటి సరఫరాలో పక్కా వ్యూహాలను అనుసరించాలి. బీడు భూములకి నీటి వసతిని కల్పించాల్సిన అవసరం ఉంది‘ అని మోదీ అన్నారు. 2015–17 మధ్య కాలంలో భారత్లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 8 లక్షల హెక్టార్లకు పెరిగిందని వెల్లడించారు. 2030 నాటికి 2.1 కోట్ల హెక్టార్ల నుంచి 2.6 కోట్ల హెక్టార్ల భూముల్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూముల్ని పునరుద్ధరించడానికి రిమోట్ సెన్సింగ్, స్పేస్ టెక్నాలజీని వినియోగిస్తోందన్నారు. ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఈ సదస్సు ఈనెల 2 నుంచి 13 వ తేదీ వరకు జరగనుంది. -
ఆసక్తికర ప్రేమకథ
న్యూఢిల్లీ: సినిమాకు ఏమాత్రం తీసిపోని ప్రేమకథ ఇది. రౌడీకి, మహిళా కానిస్టేబుల్ మధ్య కోర్టు ప్రాంగణంలో చిగురించి ప్రేమ చివరకు పెళ్లితో సుఖాంతమైంది. ఈ ప్రేమ పెళ్లి గ్రేటర్ నోయిడాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. 30 ఏళ్ల రాహుల్ థాస్రానా 2014, మే 8న వ్యాపారి మన్మోహన్ గోయల్ హత్య కేసులో అరెస్టయ్యాడు. అప్పటికే అతడిపై డజనుకుపైగా కేసులు ఉన్నాయి. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పాయల్తో రాహుల్కు సూరజ్పూర్ కోర్టులో పరిచయం ఏర్పడింది. విచారణ కోసం కోర్టుకు వచ్చినప్పుడల్లా వీరిద్దరూ కలుసుకునేవారు. జైలు నుంచి విడుదలైన వెంటనే వీరిద్దరూ పెళ్లిచేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రాహుల్ నేరచరిత్ర నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో రహస్య ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు. పాయల్ మాత్రమే అప్పుడప్పుడు తన అత్తగారింటికి వచ్చి వెళుతోంది. పెళ్లైన తర్వాత రాహుల్ ఎవరికీ కనబడలేదు. పెళ్లి చేసుకునే నాటికి గౌతమ్బుద్ధ పీఎస్లో పాయల్ పనిచేస్తోంది. గ్యాంగ్స్టర్ను ఆమె పెళ్లి చేసుకున్న విషయం తమకు తెలియదని, నిజంగా అలా చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ రణ్విజయ్ సింగ్ తెలిపారు. ఆటో డ్రైవర్గా పనిచేసిన రాహుల్ డబ్బు, హోదాతో పాటు పాపులర్ కావాలన్న కోరికతో 2008లో అనిల్ దుజానా గ్యాంగ్లో చేరాడు. ‘గోయల్ కేసులో జైలు శిక్ష అనుభవించిన తర్వాత రాహుల్ గ్యాంగ్స్టర్గా మారిపోయాడు. 2016, మే నెలలో పంచాయతీ ఎన్నికల్లో తన తల్లికి ఓటు వేయకపోతే చంపేస్తానని గ్రామస్తులను బెదిరించడంతో అతడు తమ గమనంలోకి వచ్చాడ’ని రణ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో మాబుపురా ప్రాంతంలో నాటకీయ పరిణామాల నేపథ్యంలో అతడు బుల్లెట్ గాయాలకు గురయ్యాడు. -
ఫ్లాట్ బాధితుల నోటా బాట..
సాక్షి, సెంట్రల్డెస్క్ : సాధారణంగా ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి ఓటెయ్యాలని నిర్ణయించుకుంటారు.అయితే, ఉత్తరప్రదేశ్లోని గౌతమ్బుద్ధనగర్ లోక్సభ నియోజకవర్గంలో వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ‘నోటా’కు ఓటెయ్యాలని నిర్ణయించుకున్నారు. వారంతా నోయిడా ఫ్లాట్ కొనుగోలు బాధితులు. నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో ఫ్లాట్ల కొనుగోలుకు వేల మంది సొమ్ము కట్టారు. పదేళ్లయినా ఫ్లాట్లు అప్పగించకపోవడం, ఏ రాజకీయ నాయకుడు తమ సమస్యను పట్టించుకోకపోవడంతో ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. బాధితులు ఏర్పాటు చేసుకున్న ‘నోయిడా ఎక్స్టెన్షన్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ మెంబర్స్ అసోసియేషన్ (నెఫోమా) ఆధ్వర్యంలో ‘నో హోం నో వోట్’ ప్రచారం చేపట్టారు. ఈ సంఘంలో 20 నుంచి 25 వేల మంది సభ్యులున్నారు. వీరితో సంబంధాలున్న వారు మరో లక్ష మంది ఉన్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలు గౌతమ్ బుద్ధనగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో కొత్తగా 5 లక్షల మంది ఓట్లు నమోదు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఫ్లాట్ బాధితులున్నారు. రుద్ర ప్రాజెక్ట్స్లో వీళ్లు ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. 2015 నాటికే ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పిన ఆ సంస్థ ఇంత వరకు అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయిందని, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాలు వచ్చినా తమ కష్టం మాత్రం తీరలేదని నెఫోమా అధ్యక్షుడు అనూఖాన్ ఆరోపించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం
నోయిడా : ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఓ బస్సు, లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 30 మంది వరకూ గాయపడ్డారు. యమునా ఎక్స్ప్రెస్ వేపై రబూపుర వద్ద శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
‘విద్యార్థులకు విలువలు బోధించండి’
గ్రేటర్ నోయిడా: బోధనను కేవలం జ్ఞానాన్ని అందించడానికి మాత్రమే పరిమితం చేయకుండా విలువల గురించి కూడా విద్యార్థులకు తెలియజెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గ్రేటర్ నోయిడాలోని కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం క్యాంపులో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం హోంమంత్రి ప్రసంగించారు. జీవితంలో ఏ దశలోనైనా విలువలకు కట్టుబడి బతకడం విద్యార్థులకు నేర్పాలని టీచర్లను కోరారు. ‘పుస్తకాల్లోని పాఠాలను చెప్పడంతోనే సరిపోదు. పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలకు కట్టుబడి జీవించడం గురించి తెలియజెప్పాలి. వాటి గొప్పతనాన్ని చాటాలి. మెరుగైన సమాజం కోరుకునే ప్రతి ఒక్కరూ నైతిక విలువలకు కట్టుబడి బతకాల్సిందే. ఇతరులు బతికేలా మార్పు తీసుకురావాల్సిందే. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంద’ని రాజ్నాథ్ పేర్కొన్నారు. -
నడుస్తున్న కారులో మంటలు : టెకీ మృతి
నోయిడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న పవన్ (45) కారులో చెలరేగిన మంటల్లో చిక్కుకొని మరణించారు. రాత్రి షిప్ట్ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. దీంతో మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరాల్సిన ఆయన కారునుంచి బయటకు రాలేక ప్రాణాలు విడిచారు. మంగళవారం తెల్లవారు ఝామున ఈ విషాదం చోటు చేసుకుంది. అప్పటివరకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ ఇకలేరన్నవార్తను, కుటుంబ సభ్యులు. సన్నిహితులు నమ్మలేకపోతున్నారు. గ్రేటర్ నోయిడా పొలీసు ఉన్నతాధికారి నిశాంత్ శర్మ అందించిన సమాచారం ప్రకారం హిమాచల్ ప్రదేశ్లోని అంబాకు చెందిన పవన్ ఒక ప్రయివేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. సోమవారం నైట్షిప్ట్ అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా పవన్ ప్రయాణిస్తున్న ఫోర్డ్ ఐకాన్ కారులో మంటలంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. అయితే కారు నెంబరు ఆధారంగా మృతుడిని గుర్తించిన అధికారులు బంధువులకు సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్, బ్లోవర్ సమస్యలు ప్రమాదానికి కారణం కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని నిశాంత్ శర్మ చెప్పారు. ఉదయం 5గంటల వరకు క్రిస్మస్ స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు అందించినట్టు తెలుస్తోందనీ, అయితే అకస్మాత్తుగా మంటలంటుకోవడంతో వాహనం నుండి బయటికి రాలేక పవన్ చనిపోయారని మరో పోలీసు అధికారి రామ్పాల్ తోమార్ చెప్పారు. -
‘నాన్న నేను కిడ్నాప్ అయ్యా.. 5 లక్షలు పంపు’
నోయిడా : ‘నాన్న నేను కిడ్నాప్ అయ్యా.. 5 నిమిషాల్లో వచ్చి 5 లక్షలిచ్చి నన్ను కాపాడు’ అని ఓ 11 ఏళ్ల బాలుడు ఫోన్లో తన తండ్రితో ఏడుస్తూ అన్నాడు. కొడుకు మాటలతో కంగారుపడిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించగా అసలు బండారం బయట పడింది. ఆ కిడ్నాపర్ తన కొడుకేనని, అతనే ఈ డ్రామా ఆడాడని తెలుసుకుని ఆ తండ్రి అవాక్కయ్యాడు. ఈ సినిమాటిక్ కిడ్నాపింగ్ ఉత్తరప్రదేశ్, నోయిడాలోని చిహ్జార్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలుడి తండ్రికి కిరాణపు షాప్ ఉంది. అయితే ఆ కుర్రాడు తరుచు షాపులోని గళ్లాపెట్టె నుంచి డబ్బులు తీస్తుండటంతో అతని తల్లితండ్రులు మందలించారు. అలాగే సోమవారం ఉదయం కూడా షాపులోని రూ.100 దొంగలించాడంతో ఆ అబ్బాయి బాబాయ్ గట్టిగా మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలుడు స్కూల్ అనంతరం గ్రేటర్ నోయిడాలోని బిస్రాక్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి సమయాన్ని ఆస్వాదించాడు. ఇంతలో అతనికో ఉపాయం తట్టింది. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి మొబైల్ అడిగి ఇంటికి ఫోన్ చేశాడు. తను కిడ్నాప్ అయ్యానని, వెంటనే వచ్చి 5 లక్షలిచ్చి కాపాడాలని తండ్రికి చెప్పాడు. అతను పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మొబైల్ వ్యక్తిని పట్టుకోగా అసలు వ్యవహారం తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి కేసునమోదు చేయలేదని, ఆ బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని అఖిలేష్ అనే పోలీస్ అధికారి పేర్కొన్నారు. -
శార్ధా యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
విద్యార్థుల ఘర్షణ: యూనివర్సిటీలో టెన్షన్
న్యూఢిల్లీ: భారత్, అఫ్ఘానిస్తాన్ విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఓ యూనిర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణల్లో కశ్మీర్కు చెందిన ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శార్ధా యూనివర్సిటీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శార్ధా యూనివర్సిటీలో సోమవారం నాడు ముగ్గురు అఫ్ఘానిస్తాన్ విద్యార్థులు ఓ భారత విద్యార్థిని చితకబాదిన దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచారు. అంతేకాకుండా రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన భారత విద్యార్థులు కొంతమంది అఫ్ఘాన్ విద్యార్థులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. యూనివర్సిటీలో హింసను ప్రేరేపించేలా ఉన్న దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచినందుకు యూనివర్సిటీ అధికారులు ముగ్గురు అఫ్ఘాన్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో భాగంగా.. గురువారం నాడు కశ్మీర్ యువకుడిని అఫ్ఘాన్కు చెందిన విద్యార్థిగా భావించిన భారత విద్యార్థులు అతనిపై దాడికి దిగారు. ఈ దాడిలో అతడికి తీవ్రంగా గాయాలయినట్టు తెలుస్తోంది. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యూనివర్సిటీ వెలుపల బలగాలను మోహరించిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న 350 మంది విద్యార్ధులపై కేసు నమోదు చేశారు. యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అధికారులు ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేశారు. ఆదివారం వరకు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. -
కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 30 మంది
గ్రేటర్ నోయిడా : నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో భవనంపై పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోమారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాలోని సాహ్ బెరి గ్రామంలో మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలి పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవనంపై పడింది. దీంతో నాలుగంతస్తుల భవనం కూడా కుప్పకూలి అందులో నివాసముంటున్న18 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. నాణ్యతాపరమైన లోపాల వల్లే భవనం కుప్పకూలి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. -
ప్రియుడిని భయంకరంగా చంపింది.. కానీ!
నోయిడా: ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేసి.. ఆపై దారుణహత్య చేసిన కేసులో ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంగానే కక్ష పెంచుకుని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ధన్కౌర్ స్టేషన్ ఆఫీసర్ ఫర్మూద్ అలీ పండీర్ కథనం మేరకు.. సోనమ్ అలియాస్ సోను(23), జితేంద్ర(37)లు ధన్కౌర్లోని లోడిపూర గ్రామానికి చెందినవారు. వివాహితుడైన జితేంద్రకు కొన్ని నెలల కిందట సోనమ్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వివాహేతర సంబంధాల అనంతరం ఇటీవల వీరిమధ్య మనస్పర్థలొచ్చాయి. అప్పటినుంచీ తనకు డబ్బు ఇవ్వాలని లేనిపక్షంలో మన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు నీ భార్యకు పంపిస్తానంటూ జితేంద్రను సోనమ్ బెదిరించేది. డబ్బులిచ్చే ప్రసక్తే లేదని జితేంద్ర చెప్పడంతో ప్రియుడి హత్యకు ప్లాన్ చేసింది. పథకం ప్రకారం ఫోన్ చేసి బిలాస్పూర్ ఏరియాకు రావాలని జితేంద్రను కోరింది. జితేంద్ర అక్కడకు రాగానే అంతకుముందే మంచం కోళ్లతో సిద్ధంగా ఉన్న సోనమ్.. అతడి తలపై పలుమార్లు కొట్టగానే స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికే జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం తన స్కూటర్పై సోనియా వెళ్లిపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జితేంద్రను ఎవరో హత్య చేశారని అతడి తమ్ముడు హతీమ్ సింగ్ ధన్కౌర్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. సోనియాపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదుచేసిన పోలీసులు సోనియాను అదుపులోకి తీసుకుని విచారించగా.. జితేంద్రను హత్యచేసినట్లు అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన మంచం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం పోలీసులు వివరించారు. -
క్యాబ్లో యువతిపై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ : క్యాబ్ బుక్ చేసుకున్న యువతిపై ఆ క్యాబ్ డ్రైవర్తో పాటు, తోటి ప్రయాణికుడు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. బాధిత మహిళ సెక్టార్ 126 నుంచి నోయిడాకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే అంతకుముందే ఆ కారులో వేరే ప్రయాణికుడు ఉండటంతో ఆమె అందులో వెళ్లేందుకు నిరాకరించారు. అతడు దగ్గర్లోనో దిగిపోతాడు అని డ్రైవర్ చెప్పడంతో నమ్మి ఆమె క్యాబ్ ఎక్కింది. అయితే ఇదే అదనుగా భావించిన క్యాబ్ డ్రైవర్ కారును జర్చా అటవీ ప్రాంతానికి తరలించాడు. ఆమెకు బలవంతంగా మద్యం పట్టించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అత్యాచారంతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
నోయిడా గ్యాంగ్ రేప్ కేసులో మలుపు
సాక్షి, : గ్రేటర్ నోయిడాలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికపై సమీప బంధువు, స్నేహితులే అత్యాచారం చేశారని వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిసింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆరోపించిన బాలికకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమైంది. బాలికపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు ఏవీ లభించలేదని డాక్టర్లు తెలిపారు. దాంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం... ఈ నెల 18న స్కూల్కి వెళ్లిన బాలిక తిరిగి వచ్చే క్రమంలో స్కూల్బస్ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆ సమయంలో అదే దారిలో కారులో వస్తున్న ముగ్గురు అబ్బాయిలు ఆమెను ఇంటి వద్ద దించుతామని కారులో ఎక్కించుకున్నారు. అనంతరం కదులుతున్న కారులోనే తనపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక తెలిపింది. స్పృహ కోల్పోయిన తనను గల్గోటియా కళాశాల సమీపంలో వదిలి వెళ్లారని తెలిపింది. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో కాలేజీ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ ముగ్గురు నిందితుల్లో ఒకరు తన సమీప బంధువని, మరొకరు తన క్లాస్మేట్ కాగా, మూడో వ్యక్తి తెలియదని చెప్పింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాండ్ టురిస్మోతో సచిన్
-
వావ్.. షో!
కార్ల పండుగ మొదలైంది. 14వ ఆటోఎక్స్పో గురువారం మధ్యాహ్నం గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో అధికారికంగా ప్రారంభమౌతుంది. అయితే మీడియా, కార్పొరేట్ ప్రతినిధులకు బుధవారం నుంచి అనుమతించారు. ప్రజలకు 914 వరకు అందుబాటులో ఉంటుంది.వాహన విడిభాగాల తయారీ కంపెనీల సంఘం(ఏసీఎంఏ), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), వాహన తయారీ కంపెనీల సంఘం (సియామ్) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈసారి షోలో కంపెనీలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పర్యావరణ అనుకూల టెకాల్నజీలకు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. దేశీ, విదేశీ కంపెనీలు వాటి ప్రొడక్టులను, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించాయి. మారుతీ సుజుకీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కాన్సెప్ట్ కాంపాక్ట్ కారు ఆవిష్కరించింది. దీని పేరు కాన్సెప్ట్ ప్యూచర్ ఎస్. ఇందులో ఎస్యూవీ ప్రత్యేకతలు ఉండటం విశేషం. కంపెనీ అలాగే ఈవీ కాన్సెప్ట్ ‘సర్వైవర్’ కారును కూడా ప్రదర్శించింది. ‘2020 నాటికి బీఎస్–6 ప్రమాణాలకు అనువైన ప్రొడక్టులను తయారుచేస్తాం. 2020లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. వీటిని దేశీయంగానే రూపొందిస్తాం’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ తెలిపారు. హోండా: జపాన్కు చెందిన హోండా కంపెనీ మూడు కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఆల్ న్యూ అమేజ్, సీఆర్–వీ, సివిక్ సెడాన్ అనేవి ఇందులో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఆరు మోడళ్లను భారత్ మార్కెట్లోకి తెస్తామని కంపెనీ ప్రెసిడెంట్ టకహిరో హచిగో తెలిపారు. కంపెనీ అలాగే పలు ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. రెనో: ఫ్రాన్స్ కంపెనీ రెనో.. రెండు ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వెహకల్స్ను ఆవిష్కరించింది. ట్రెజోర్, జోయి ఇ–స్పోర్ట్ అనేవి వీటి పేర్లు. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి స్పష్టమైన పాలసీ కోసం ఎదురుచూస్తున్నాం. దీని ఆధారంగా భవిష్యత్ వ్యూహాలు ఉంటాయి’ అని రెనో ఇండియా పేర్కొంది. కంపెనీ అలాగే ఫార్ములా వన్ కారు ‘ఆర్.ఎస్.17’, క్విడ్ సూపర్ హీరో ఎడిషన్ను ప్రదర్శనకు ఉంచింది. హ్యుందాయ్: దక్షిణ కొరియాకు వాహన కంపెనీ తన ప్రీమియం కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ ‘ఎలైట్ ఐ20’లో కొత్త వెర్షన్ను తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.5.34–రూ.9.15 లక్షలు. మూడేళ్లలో భారత్లో రూ.6,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వెహికల్ను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇక తన పాపులర్ మోడల్ శాంట్రోను ఈ ఏడాది దీపావళీకి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముంది. సుజుకీ మోటార్సైకిల్: సుజుకీ మోటార్సైకిల్ ఇండియా తాజాగా 125 సీసీ స్కూటర్ బర్గ్మాన్ స్ట్రీట్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. అలాగే సబ్–1,000 సీసీ విభాగంలో జీఎస్ఎక్స్–ఎస్750 బైక్ను ప్రదర్శించింది. క్రూయిజర్ బైక్ ఇన్ట్రూడర్లో కొత్త వేరియంట్ను ఆవిష్కరించింది. కంపెనీ దాదాపు స్కూటర్, మోటార్సైకిల్, బిగ్ బైక్ సెగ్మెంట్లలో మొత్తంగా 17 మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. హీరో మోటొకార్ప్: 200 సీసీ అడ్వెంచర్ మోటార్సైకిల్ ‘ఎక్స్పల్స్’ను, రెండు కొత్త 125 సీసీ స్కూటర్లను ఆవిష్కరించింది. పియా జియో: ఇటలీకి చెందిన పియాజియో 125 సీసీ బైక్ ‘అప్రిలియా ఎస్ఆర్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.65,310 (ఎక్స్షోరూమ్ పుణే). కంపెనీ అలాగే వెస్పా స్కూటర్లను, ఇ–స్కూటర్ ఎలెట్రికాను ప్రదర్శనకు ఉంచింది. హోండా మోటార్సైకిల్: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా 160 సీసీ బైక్ ఎక్స్–బ్లేడ్ను ఆవిష్కరించింది. అలాగే దాదాపు 10 మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. టీవీఎస్ మోటార్: టీవీఎస్ మోటార్ తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ‘క్రియానో’, 220 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ బైక్ ‘జెప్పెలిన్’ను ఆవిష్కరించింది. అలాగే అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ బైక్ను ప్రదర్శనకు ఉంచింది. యమహా: యమహా ఇండియా స్పోర్ట్స్ బైక్ వైజెడ్ఎఫ్–ఆర్15లో కొత్త వెర్షన్ను ఆవిష్కరించింది. ధర రూ.1.25 లక్షలు . టాటా మోటార్స్: టాటా మోటార్స్ కంపెనీ లగ్జరీ ఎస్యూవీ, ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగాల్లో వరుసగా హెచ్5ఎక్స్, 45ఎక్స్ అనే రెండు కాన్సెప్ట్ వెహికల్స్ను ఆవిష్కరించింది. వీటితోపాటు ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. కవాసకి: కవాసకి ఇండియా రెండు కొత్త బైక్స్ నింజా హెచ్2 ఎస్ఎక్స్ స్టాండర్డ్, నింజా హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ స్పెషల్ ఎడిషన్ను ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.21.8 లక్షలు. ఎస్ఎంఎల్ ఇసుజు: ఎస్ఎంఎల్ ఇసుజు తాజాగా కార్గో విభాగంలో మూడు మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. సామ్రాట్ జీఎస్ హెచ్డీ 19, సర్టాజ్ జీఎస్ సీఎన్జీ, సామ్రాట్ జీఎస్ ట్రిప్పర్ అనేవి వీటి పేర్లు. మెర్సిడెస్ బెంజ్!: జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ తాజాగా మేబ్యాక్ ఎస్650ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.2.73 కోట్లు. అలాగే కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ ఈక్యూతోపాటు దాదాపు 13 ప్రొడక్టులను ప్రదర్శనకు ఉంచింది. అశోక్ లేలాండ్: తొలి ఎలక్ట్రిక్ బస్సు సర్క్యూట్–ఎస్ను ఆవిష్కరించింది. వచ్చే 3–6 నెలల్లో అందుబాటులోకి రావొచ్చు. టయోటా: టయోటా కిర్లోస్కర్ మోటార్ ‘యారిస్’ సెడాన్ కారును ఆవిష్కరించింది. ఎఫ్సీవీ ప్లస్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది. జేబీఎం: ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సు సరీస్ ‘ఎకో లైఫ్’ను ఆవిష్కరించింది. వీటి ధర రూ.2–3 కోట్ల మధ్యలో ఉండొచ్చు. మహీంద్రా: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆరు కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనాలను ఆవిష్కరించింది. కియా మోటార్స్: దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఎస్పీ కాన్సెప్ట్ ఎస్యూవీని ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్లాంటులో తయారు చేయనుంది. భారత్లో కంపెనీ తొలి వాహనం ఇదే. బీఎండబ్ల్యూ: హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఐ8 రోడ్స్టర్, ఎలక్ట్రిక్ వెహికల్ ఐ3ఎస్లను ప్రదర్శనకు ఉంచింది. -
ఆటో ఎక్స్పో 2018 ప్రీ ఈవెంట్
-
అమ్మాయి అని కూడా చూడకుండా పోకిరీల బరితెగింపు
సాక్షి, నోయిడా : గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. కొందరు యువకులు ఇద్దరు యువకులతోపాటు ఓ యువతిపై కూడా దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా వారిని బెదిరిస్తూ చావు దెబ్బలు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో వివాదాస్పద వైరల్ వీడియోగా మారింది. వివరాల్లోకి వెళితే గౌతమ్బుద్ధనగర్లో ఇద్దరు యువకులు, బ్యాగ్తో ఉన్న ఓ యువతి రోడ్డుపక్కన వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని సమీపించారు. వచ్చి రాగానే వారిపై కర్రలు, చెరుకు గడెలతో చావబాదారు. గౌతమ్బుద్ధనగర్ శివారు ప్రాంతంలో ఉన్న ఓ ఫాంహౌస్ వద్ద దాడికి సంబంధించిన వీడియోను షూట్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనవరి 1న ఈ ఘటన చోటుచేసుకోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు తాము ఫాంహౌస్కు వెళుతుండగా మధ్యలో అడ్డుకున్న ఇద్దరు దుండగులు తమ దగ్గరకి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టారని, కొట్టారని పోలీసులకు వివరించారు. తమతో ఉన్న అమ్మాయిని కూడా వేధించి ఆమెను కూడా చావు దెబ్బలు కొట్టారని వాపోయారు. కాగా, పుటేజిలోని దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
బాక్సర్ దారుణ హత్య
నోయిడా : హర్యానాకు చెందిన మాజీ బాక్సర్ జితేందర్ మన్ శుక్రవారం అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. జెటా సెక్టార్లోని ఏవీజే హైట్స్ అపార్ట్మెంట్లో తన ఇంటిలో శవమై కనిపించాడు. జితేందర్ను కలవాడినికి ప్రీతం అనే స్నేహితుడు జితేందర్ ప్లాట్ వెళ్లాడు. ఎంతసేపటికి తలపుతట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ప్రీతం పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై ఎస్పీ సునీత్ మట్లాడుతూ జితేందర్ శరీరంపై పలు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక జితేందర్ విషయానికి వస్తే జూనియర్ బాక్సింగ్లో భారత్ తరపున ఉబ్జెకిస్తాన్, క్యూబా, ఫ్రాన్స్, రష్యాలతో పాటు పలు అంతర్జాతీయ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. గాయాల కారణంగా గత ఏడు నెలల క్రితం బాక్సింగ్కు వీడ్కొలు పలికి జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. -
ఒళ్లు గగుర్పొడిచేలా యాక్సిడెంట్
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఒళ్లు గగుర్పొడిచే స్థాయిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకెళ్లే ఎక్స్ప్రెస్ వేలో ఓ స్విప్ట్ డిజైర్ కారు, లాంబోర్గిని కారు చేసిన పొరపాటు కారణంగా ఎలాంటి తప్పు లేకపోయినా వెనుకాలే వస్తున్న మరో కారు ప్రమాదానికి గురికావడమే కాకుండా అమాంతం గాల్లోకి లేచి వెళ్లి పక్కనే ఉన్న అడవిలోకి పల్టీలు కొట్టుకుంటూ పడిపోయింది. దీంతో ఆ కారులోని వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన స్విప్ట్ డిజైర్ కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. లాంబోర్గిని కారు డ్రైవర్ ఇంకా దొరకలేదు. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వేలో సరిగ్గా ఢిల్లీకి సమీపంలోని నోయిడా సెక్టార్ 135 వద్ద వాహనాలు వేగంగా దూసుకెళుతున్న సమయంలో తన మార్గంలో వెళుతున్న ఓ స్విప్ట్ డిజైర్ కారు లాంబోర్గిని కారును అనూహ్యంగా అతి సమీపంలో నుంచి ఓవర్ టేక్ చేసింది. దీంతో లాంబోర్గిని కారు డ్రైవర్ తాను వెళ్లే లైన్లో నుంచి పూర్తిగా ఎడమపక్కన లైన్లోకి తన కారును పోనిచ్చాడు. దీంతో ఆ మార్గంలో వీరి వాహనాలకు సమాన వేగంలో వస్తున్న మారుతీ ఎకో వాహనం అమాంతం లాంబోర్గికి తాకి పల్టీ కొట్టి గాల్లోకి లేచి రోడ్డుపక్కనే ఉన్న ఫారెస్ట్లో పడిపోయింది. ఫలితంగా అందులో ఉన్న 20ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ భయానక వీడియో ఎక్స్ప్రెస్ వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. -
బెడ్రూమ్లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్!
గ్రేటర్ నోయిడా: ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేశాడు. యువతి వేగంగా స్పందించి అలారమ్ ఆన్ చేయడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలి.. గ్రేటర్ నోయిడాలోని ఏవీజే హైట్స్ వద్ద 11 భవనాలు ఉన్నాయి. 1800 ఫ్లాట్స్ ఉండగా, వాటిలో ఓవరాల్గా 1100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 25 ఏళ్ల యువతి ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తూ ఇక్కడి ఫ్లాట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఫ్లాట్కి వెళ్లిన తర్వాత డోర్ లాక్ చేయడం మరిచిపోయి నిద్రపోయింది. ఆమె కదలికలు గమనించిన సెక్యూరిటీ గార్డ్ రాజ్ కుమార్ చుట్టుపక్కల ఫ్లాట్ల డోర్లు లాక్ చేశాడు. ఆపై రాజ్ కుమార్ యువతి ఫ్లాట్లోకి ప్రవేశించి అన్ని తలుపులకు గడియ పెట్టాడు. బెడ్రూమ్లో వెళ్లి నిద్రిస్తున్న యువతిని రేప్ చేసేందుకు సిద్ధపడ్డాడు. ఇంతలో అలికిడి విని లేచిన యువతి నగ్నంగా మారుతున్న సెక్యూరిటీ గార్డ్ ను చూసి షాక్ కు గురైంది. పారిపోయేందుకు యత్నించగా ఆమెను గట్టిగా పట్టుకుని బెడ్ మీదకు లాక్కున్నాడు. అతడి భారి నుంచి తప్పించుకుని వెంటనే ఫ్లాట్ అలారమ్ ను మోగించింది. కిటికీ తెరచి నన్ను కాపాడండి.. అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఏం చేయాలో అర్థంకాని రాజ్ కుమార్ వెనక వైపు డోర్ తెరుచుకుని పరారయ్యాడు. గత మే31న అల్మారా లాక్ ప్రాబ్లం ఉందని సెక్యూరిటీ గార్డ్ సాయం కోరింది. ఆ రోజు నుంచి ఆమె కదలికల్ని గమనించిన రాజ్ కుమార్ యువతిపై ఆశ పెంచుకుని ఈ అఘాయిత్యానికి యత్నించాడని పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. -
ఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోయిడాలో జెవెర్ లో ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇది రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది. గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లభించిందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు శనివారం ప్రకటించారు. తద్వారా తదుపరి 10-15 సంవత్సరాల్లో సంవత్సరానికి 30-50 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించనున్నామని చెప్పారు. 3వేల హెక్టార్లలో దీన్ని నిర్మించనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రాంతంలో తొలిదశలో 1000 హెక్టార్లలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ .20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు.పబ్లిక్ అండ్ ప్రయివేట్ పార్టనర్షిప్తో (పీపీపీ) తో దీన్ని నిర్మించనున్న ఈ విమానాశ్రయాన్ని అయిదేళ్లలో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మరోవైపు దేశీయ, అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో కార్పోరేట్ హబ్ గా జెవెర్ విమానాశ్రయం నిలవనుందని ఉత్తర ప్రదేశ్ మంత్రి ఎస్ సింగ్ పేర్కొన్నారు. -
దేశ రాజధాని సమీపంలో దారుణం
గ్రేటర్ నోయిడా: దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతం బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ సమీపంలో దారుణం జరిగింది. ఓ దుండగుడు ప్రైవేట్ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని (21)ని ఇటీవల కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కారులో లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు దన్కౌర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అర్జున్ అనే యువకుడు యూనివర్శిటీ గేట్ వద్ద తనను కిడ్నాప్ చేసి బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ దగ్గరకు తీసుకెళ్లి కారులో దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ అరుణ్ సింగ్ చెప్పారు. -
మాల్లో దాడి.. భారత రాయబారికి సమన్లు!
అబుజా/న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో తమ దేశస్తులపై జరిగిన దాడిని నైజీరియా తీవ్రంగా ఖండించింది. నైజీరియన్ విద్యార్థులపై దాడి నేపథ్యంలో తమ దేశంలోని భారత రాయాబారిని పిలిపించుకొని నిరసనను తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని నైజీరియా ప్రభుత్వం కోరింది. నైజీరియా విదేశాంగ మంత్రిత్వశాఖ శాశ్వత కార్యదర్శి ఒలుషోలా ఎనికనోలైయే బుధవారం దేశంలోని భారత హైకమిషనర్ నాగభూషణరెడ్డితో భేటీ ఈ దాడి అంశం చర్చించారు. ఈ దాడిపై భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదో వెల్లడించాలని కోరారు. సోమవారం గ్రేటర్ నోయిడాలో ఉన్న ఓ షాపింగ్ మాల్లో ఆఫ్రికన్లపై ఓ మూక విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మనీశ్ కారి అనే పన్నెండో తరగతి విద్యార్థి డ్రగ్స్ అధికంగా తీసుకొని చనిపోవడంతో స్థానికులు ఆగ్రహం చెందారు. ఓ షాపింగ్ మాల్ వద్ద కనిపించిన నైజీరియన్లపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వెంటనే స్పందించిన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్.. యూపీ సీఎం యోగికి ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. -
ఆఫ్రికా యువతిపై క్యాబ్ డ్రైవర్ దాడి
న్యూఢిల్లీ: నైజీరియా విద్యార్థులపై దాడి ఘటనను మరువకముందే ఆఫ్రికా యువతిపై గ్రేటర్ నోయిడాలో దాడి చోటుచేసుకుంది. ఆఫ్రికా విద్యార్థిని బుధవారం ఉదయం 4:30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి నోయిడాలోని పార్క్ ఏరియాకు క్యాబ్లో చేరుకుంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ క్యాబ్ డ్రైవర్ ఆ విద్యార్థినితో గొడవకుదిగాడు. ఈ క్రమంలో యువతిని కిందికి లాగి పడేసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధిత విద్యార్థిని ఏ దేశానికి చెందిన యువతి అన్నది తెలియరాలేదు. స్థానికుల సమచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడ్డ వారి కోసం దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఏఎస్పీ అభినందన్ తెలిపారు. సోమవారం రాత్రి నలుగురు నైజీరియా విద్యార్థులపై నోయిడాలో కొందరు దాడికి పాల్పడటంతోపాటు, షాపింగ్ మాల్లో ఇద్దరిని తీవ్రంగా కొట్టి గాయపరిచిన విషయం విదితమే. ఈ ఘటనలపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ దాడి కేసులో పలువురిపై కేసు నమోదు చేశారు. -
‘అది విద్వేష దాడి కాదు’
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఆఫ్రికన్లపై దాడి దురదృష్టకరమని విదేశాంగ శాఖ పేర్కొంది. విదేశీయుల భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. నైజీరియా హైకమిషనర్ తో విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ మాట్లాడారని వెల్లడించింది. నైజీరియా పౌరుల రక్షణకు స్థానిక అధికారులు తీసుకుంటున్న చర్యలను వివరించారని విదేశాంగ శాఖ తెలిపింది. నైజీరియన్లపై జరిగింది విద్వేష దాడి కాదని గౌతమ్ బుద్ధ నగర్ డీఎం ఎన్పీ సింగ్ చెప్పారు. యువకుడి మరణానికి నైజీరియన్లు కారకులైయ్యారని కొంతమంది వదంతులు ప్రచారం చేయడంతో ఈ దాడి జరిగిందని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని, వీరిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దాడి నేపథ్యంలో పలువురు నైజీరియా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. మరోవైపు కాస్నా పోలీస్ స్టేషన్ వెలుపల గ్రేటర్ నోయిడా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
రాడ్లు, ఇటుకలతో దాడి: ఎందుకు కొట్టారో తెలియదు!!
-
రాడ్లు, ఇటుకలతో దాడి: ఎందుకు కొట్టారో తెలియదు!!
న్యూఢిల్లీ: 'మమ్మల్ని ఎందుకు కొడుతున్నారో కూడా మాకు తెలియదు. అల్లరి మూక మమ్మల్ని చుట్టుముట్టి.. ఇనుపరాడ్లు, ఇటుకలు, కత్తులతో దాడి చేసింది. మమ్మల్ని కాపాడండి, సాయం చేయండి అని చుట్టూ ఉన్నవారిని దీనంగా అర్థించాం. కానీ ఎవరూ పోలీసులకు ఫోన్ కూడా చేయలేదు. కనీసం మా కాలేజీ వాళ్లు మాకు సాయం చేయలేదు'.. గ్రేటర్ నోయిడాలో మూక దాడిలో తీవ్రంగా గాయపడ్డ నైజీరియన్ జాతీయుడి ఆవేదన ఇది. సోమవారం ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఓ షాపింగ్ మాల్లో ఆఫ్రికన్లపై తీవ్ర అమానుషంగా ఓ మూక విరుచుకుపడిన సంగతి తెలిసిందే. జాతివివక్షను తలపించేలా సాగిన ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఘటనలో గాయపడిన నైజీరియా జాతీయుడు తాజాగా మీడియాతో మాట్లాడారు. 'ఒక్కరంటే ఒక్కరు కూడా మాకు సాయంగా ముందుకురాలేదు. గతంలోనూ మా చుట్టుపక్కల ఉండేవారు మీరు మా దేశంలో ఉండొద్దు అంటూ మాట్లాడేవారు. ఇలాంటివారిని చూసి నేను ఏం మాట్లాడాలి' అని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడాలో మనీశ్ కారి అనే పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి డ్రగ్స్ అధికంగా తీసుకోవడంతో స్థానికులు ఆగ్రహం చెందారు. ఈ ఘటనలో ఆ విద్యార్థి ఉండే అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నైజీరియన్పై షాపింగ్ మాల్ లో దాడి జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై స్పందించాల్సిందిగా యూపీ సీఎం యోగికి ఫోన్ చేసినట్టు విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. -
‘సత్వరమే స్పందించండి’ యోగికి సుష్మా ఫోన్
గ్రేటర్ నోయిడా: దాడికి గురైన ఆఫ్రికన్ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తగిన భరోసా ఇచ్చారని, విద్యార్థులపై దాడి ఘటన విషయంలో నిష్పక్షపాతమైన, సానుకూలమైన, న్యాయబద్ధమైన విచారణ జరిపిస్తామని చెప్పారని అన్నారు. మనీశ్ కారి అనే పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి చనిపోయిన నేపథ్యంలో గ్రేటర్ నోయిడాలో ఆందోళన జరిగింది. అది కాస్త భీభత్సంగా మారి అక్కడ ఉంటున్న నైజీరియాకు చెందిన విద్యార్థులపై ఓ గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో బెంబేలెత్తిపోయిన నైజీరియా విద్యార్థులు సుష్మాస్వరాజ్కు ట్వీట్ చేశారు. నోయిడాలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని సత్వరమే స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో యోగికి సుష్మా ఈ విషయాన్ని చెప్పారు. డ్రగ్స్ బారిన పడే మనీశ్ చనిపోయాడని, అందుకు నైజీరియన్లే కారణం అని వారిపై దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నైజీరియన్లు ఆస్పత్రి పాలయ్యారు. -
సీఎం యోగిపై ఫేస్ బుక్ పోస్ట్.. అరెస్ట్
నోయిడా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఫేస్ బుక్ లో అభ్యంతర సమాచారం పోస్టు చేసిన 22 ఏళ్ల యువకుడిని గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ యువ వాహిని సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు రహత్ ఖాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దంకౌర్ ప్రాంతంలో జన సువిధ కేంద్రం(ప్రజా వినియోగ కేంద్రం) నడుపుతున్న రహత్ మార్ఫింగ్ చేసిన సీఎం యోగి ఫొటోలను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. అతడిపై ఐటీ చట్టంలోని 66ఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తన కుమారుడు అమాయకుడని, అతడిని కుట్రపూరితంగా ఇరికించారని రహత్ ఖాన్ తల్లి మున్నీ అన్నారు. ఇదంతా ల్యాండ్ మాఫియా కుట్ర అని ఆరోపించారు. తన కుమారుడి ఫేస్ బుక్ పాస్ వర్డ్ దొగిలించి, సీఎం యోగిపై అభ్యంతకర సమాచారం పోస్టు చేశారని తెలిపారు. హిందూ యువ వాహిని సంస్థను సీఎం యోగి స్థాపించడం గమనార్హం. కాగా, సీఎం యోగిపై అభ్యంతర ఫొటోలు పోస్టు చేశారనే ఆరోపణలతో కర్ణాటకలో ప్రభ ఎన్ బైలహొంగల అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
382 ప్లాట్లు, విల్లాలు సీజ్
గ్రేటర్ నోయిడా: ది గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ అథారిటీ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 382 ఫ్లాట్లను, విల్లాలను సీజ్ చేసే చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆ చర్యను ప్రారంభించి 30 విల్లాలను స్వాధీనం చేసుకుంది. అథారిటీ పేర్కొన్న ఏ నిబంధనలు కూడా కాంట్రాక్టర్లు పాటించని నేపథ్యంలో ఈ చర్యలకు దిగింది. గ్రేటర్ నోయిడాలోని సూపర్టెక్ సీజార్ స్యూట్స్ ప్రాంతాల్లో కొంతమంది బిల్డర్లు భారీగా విల్లాలను, ప్లాట్లను నిర్మిస్తున్నారు. అయితే, వీటిల్లో భద్రత పరమైనవి, ప్లాట్లకు ఉండాల్సిన ఖాళీ స్థలాలు, పార్కింగ్ ప్లేస్లు, నివాసానికి అనుకూలంగా ఉండే పరిమాణంవంటి విషయాలను పూర్తిగా పక్కకు పెట్టి నిర్మిస్తున్నారు. లే అవుట్లో జీఎన్ఐడీఏకు ఎలాంటి ప్లాన్లు వివరించారో వాటికి పూర్తి భిన్నంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కేసు ఇప్పటికే కోర్టులో ఉంది. అయితే, దీనిపై రేపు తుది ప్రకటన రావాల్సి ఉంది. అయితే, అలహాబాద్ కోర్టు మాత్రం ఆ ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని, వెంటనే నిబంధనలు అతిక్రమించిన ప్లాట్ల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం అథారిటీ తరుపున వెళ్లి విచారించగా నిబంధనలు పాటించని 382 ప్లాట్లు విల్లాలు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటిని సీజ్ చేసే చర్యలు కొనసాగుతున్నాయి. -
ఆదిలోనే అవాంతరం!
రెండుసార్లు ఆగిన ఫ్లడ్లైట్లు * దులీప్ ట్రోఫీ ‘పింక్బాల్’ మ్యాచ్ * తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం గ్రేటర్ నోయిడా: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా పింక్ బంతితో తొలిసారి నిర్వహించిన డే అండ్ నైట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు మొదటి రోజే అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇండియా రెడ్, ఇండియా గ్రీన్ జట్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో మంగళవారం రెండు సార్లు ఫ్లడ్ లైట్లు ఆరిపోయాయి. దాంతో గంటకు పైగా ఆటకు అంతరాయం కలిగింది. ఇండియా గ్రీన్ ఇన్నింగ్స్ సందర్భంగా మూడు ఓవర్ల తర్వాత డిన్నర్బ్రేక్ సమయంలో లైట్లు ఆగడంతో 17 నిమిషాలు ఆట ఆలస్యమైంది. ఆ తర్వాత 9.3 ఓవర్ల తర్వాత మళ్లీ చీకటి కమ్మేసింది. దాంతో లైట్లను పునరుద్ధరించేందుకు దాదాపు గంట సమయం పట్టింది. పింక్బాల్తో తొలి మ్యాచ్ను పేరున్న స్టేడియంలో కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించడంతో బోర్డుకు భంగపాటు ఎదురైంది. ఈ గ్రౌండ్లో ఇదే తొలి డే అండ్ నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో పింక్ బంతి పేస్ బౌలర్లకు బాగా సహకరించింది. ఒక్క రోజులోనే మొత్తం 17 వికెట్లు పడ్డాయి. గ్రీన్ ఆటగాడు సందీప్ శర్మ (4/62) చెలరేగడంతో ఇండియా రెడ్ తమ తొలి ఇన్నింగ్స్లో 48.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. ముకుంద్ (77) రాణించగా, యువరాజ్ (4) సహా అంతా విఫలమయ్యారు. అనంతరం గ్రీన్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేయగలిగింది. రైనా (35)దే అత్యధిక స్కోరు. ప్రస్తుతం గ్రీన్ మరో 45 పరుగులు వెనుకబడి ఉంది. నాథూ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
అందరూ చూస్తుండగా కిడ్నాప్
నోయిడా: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో పట్టపగలే జరిగిన కిడ్నాప్ సంచలనం రేపింది. గ్రేటర్ నోయిడాలో ఈ నెల 14న ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని కొంత మంది దుండగులు పట్టపగలు కిడ్నాప్ చేశారు. అందరూ చూస్తుండగా అతడిని లాక్కెళ్లి కారులో పరారయ్యారు. అక్కడున్న వారిలో ఎవరూ కూడా కిడ్నాపర్లను ప్రతిఘటించలేదు. కళ్లెదుటే ఒక వ్యక్తిని దుండగులు లాక్కెళుతున్నా చూస్తుండి పోయారేగానీ, ఒక్కరూ అడ్డుచెప్పలేదు. కిడ్నాప్ అయిన వ్యక్తి తర్వాత రోజు శవపై కనిపించాడు. అతడిని కిడ్నాప్ చేస్తుండగా తీసిన వీడియోను ఇంటర్నెట్ లో పెట్టడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగివుంటుందని అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు వెల్లడి కాలేదు. -
సినిమాలో మాదిరిగానే ఎస్ఐపై కాల్పులు
నోయిడా: కరడు గట్టిన నేరస్తులను అరెస్టు చేసేందుకు పోలీసుల బృందంతో వెళ్లిన సబ్ ఇన్ స్పెక్టర్ను దారుణంగా కాల్పులు జరిపి చంపిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ హత్యకు పాల్పడినవారు అనంతరం పారిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం సోమవారం వేకువ జామున గ్రేటర్ నోయిడాలోని దాద్రిలోగల నయి అబాది ఏరియాలో కరడు గట్టిన నేరస్తులు, పలు దొంగతనాల కేసులు ఉన్న ఫక్రాన్, జావేద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసేందుకు అక్తర్ ఖాన్(40) అనే ఎస్ఐ వెళ్లాడు. వారు ఉంటున్న ఇంటిపై రైడింగ్కు దిగారు. అనుమానితుల ఇంట్లోకి తొలుత ఎస్సై ఖాన్ ప్రవేశించాడు. అతడు అలా అడుగుపెట్టాడో లేదో సినిమాలో చూపించినట్లుగా అతడిపై వరుసకాల్పులు జరిపారు. తొలిబుల్లెట్ అతడి మెడలోకి దిగడంతోనే ఆయన కుప్పకూలిపోయాడు. అంతలోనే బయట ఉన్న మిగితా పోలీసులు ఎదురు కాల్పులు జరిపినా.. నేరస్తులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఎస్సై ఖాన్ ను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఆయుధాల దొంగతనం, హత్యలు, దోపిడీల వంటి కేసుల్లో కాల్పులు జరిపిన వారిపై అభియోగాలు ఉన్నాయి. చనిపోయిన ఎస్ఐకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆ పాఠశాలలో జెండా ఎగురవేయొద్దంటూ..
డంకావూర్(గ్రేటర్ నోయిడా): గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ గ్రేటర్ నోయిడాలోని డంకావూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ముస్లిం బాలికల పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసేందుకు కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాల ఉత్తరప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ గుర్తింపును అక్టోబర్ 2011లో పొందింది. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం పాఠశాల అధికారులు జెండా ఎగురవేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే, అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు జెండా ఎగురవేయడానికి వీల్లేదంటూ, ఏర్పాట్లు వదిలేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈవివాదం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో ఆ పాఠశాలలో తమ మతానికి విరుద్ధమైన బోధనలు చేస్తున్నారని స్కూల్ యాజమాన్యంపై ఆరోపించారు. అయితే, ఏదేమైనా జెండ వందనం అడ్డుకోవడానికి వీల్లేదంటూ, అలా చేస్తే చాలా కఠిన శిక్షలు ఎదుర్కొంటారని హెచ్చరించి వెనక్కి పంపారు. -
సఫిపుర్ హెలీపోర్టు ఏర్పాటుకు సన్నాహాలు
2017 కల్లా అందుబాటులోకి గ్రేటర్ నోయిడా: గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న సఫిపుర్ ప్రాంతంలో హెలీపోర్టుని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు జరుగుతున్నాయి. గ్రేటర్ నోయిడా పారిశ్రామిక అభివృద్ధి అథారిటీకి చెందిన కన్సల్టెంట్ ‘రైట్స్’ సంస్థ ఫిజిబిలిటీ నివేదికను అందజేసింది. ఈ హెలీపోర్టుని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వే పక్కన సఫిపుర్ వద్ద 22 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి రూ. 50 కోట్లు వ్యయం కావొచ్చని అంచనా. జెవర్ వద్ద అంతర్జాతీయ విమానశ్రయం నిర్మించాలనే ప్రతిపాదనను రద్దు చేసిన తర్వాత ఈ హెలీపోర్టు ప్రాజెక్టుని చేపట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ 2013లో జెవర్ ప్రాజెక్టుకి సమ్మతి తెలిపారు. ఆ ప్రాంతంలో శబ్ద కాలుష్యం తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తుందని రిపోర్టులు రావడంతో దానిని సఫిపుర్కి మార్చారు. కాగా, సఫిపుర్ ప్రాజెక్టు పనులు జూన్ నుంచి మొదలు కావొచ్చని సమాచారం. ఇది 2017 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిని మెడికల్ వంటి ఎమర్జెన్సీ సేవలతో పాటు పర్యాటక అవసరాలకు వినియోగిస్తారు. ‘ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను డీజీసీఏకు అనుమతి కోసం అందజేశామ’న్నారు. -
నోయిడా మెట్రో ప్రాజెక్టుకు రూ. 870 కోట్లు
నోయిడా: నోయిడా, గ్రేటర్ నోయిడాకి సంబంధించి 2015-16 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను నోయిడా మెట్రో రైల్ కంపెనీ(ఎన్ఎమ్ఆర్సీ) ప్రవేశపెట్టింది. దేశ రాజధాని నగరంలో జరిగిన బోర్డు సమావేశంలో నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాజెక్టుల కోసం రూ. 870 కోట్లను ఎన్ఎమ్ఆర్సీ కేటాయించింది. అలాగే నోయిడా, గ్రేటర్ నోయిడా అథారిటీలతో క్యాష్ ఇన్ఫ్యూషన్, ఈక్విటీ షేరింగ్ అగ్రిమెంట్ కోసం జరిగిన ఒప్పందానికి కూడా ఆమోదం లభించింది. తద్వారా డిస్కౌంట్ ధరకే కొత్త షేర్లను కొనుక్కునేందుకు షేర్ హోల్డర్లకు అవకాశం లభిస్తుంది. ఎన్ఎమ్ఆర్సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జీపీ సింగ్ మాట్లాడుతూ నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో నిర్మాణ పనులకు మొత్తం రూ. 5,500 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 2017 నాటికి పూర్తి కావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రాజెక్టు పురోగతిని సమీక్షించినట్లు సమాచారం. అంతేకాకుండా మెట్రో డిపోకి సంబంధించిన టెండర్లును కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జంట నగరాల్లోని మెట్రో లింకులను కలుపుతూ ఏర్పాటు చేయాల్సిన రవాణా సౌకర్యాలపైనా చర్చించారు. మొత్తం 13 మార్గాల్లో 400 బస్సులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో బస్సులను అందించే సంస్థను అతి త్వరలోనే నిర్ణయిస్తాం. ఆ యాజమాన్యమే మెట్రో బస్సులను కూడా నడిపిస్తారు’ అని రంజన్ తెలిపారు. ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) వ్యవస్థను ఆమోదించారు. ఈ వ్యవస్థను ప్రవేశపెడితే ప్రయాణికులకు ఒక స్మార్ట్ కార్డు ఇస్తారు. దీనితో మెట్రో రైలుతోపాటు బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. ఈ కార్డుని ఉపయోగించి ప్రయాణికులు నగరం మొత్తం సులభంగా ప్రయాణింవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. అలాగే ఉద్యోగుల నియామకం, క్రమశిక్షణ నియమాలు, భత్యం తదితర వాటికి అవలంభించాల్సిన విధానాలకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది. -
బీఎండబ్ల్యూ.. ఎం4 కూపే
గ్రేటర్ నోయిడా: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కొత్త కారు, ఎం4 కూపేను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 1.21 కోట్లని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్సర్ చెప్పారు. దీంతో పాటు ఎం3 సెడాన్లో కొత్త వేరియంట్ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టామని చెప్పారు. ఎం3 సెడాన్లో ఇది ఫిప్త్ జనరేషన్ మోడల్ అని, ధర రూ.1.19 కోట్లని (ఈ రెండు కార్ల ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. కొత్తగా అభివృద్ధి చేసిన 6 సిలిండర్ల ఇంజిన్తో ఈ కార్లను రూపొదించామని, పూర్తిగా తయారైన కార్ల రూపంలో వీటిని దిగుమతి చేసుకుని విక్రయిస్తామని తెలిపారు. త్వరలోనే హైబ్రిడ్ కారు ఐ8ను కూడా భారత మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 37గా ఉన్న డీలర్షిప్లను వచ్చే ఏడాది చివరి కల్లా 50కు పెంచనున్నామని ఆయన వివరించారు. -
ఆరు లేన్ల రహదారి అందుబాటులోకి
గ్రేటర్ నోయిడా: భూసేకరణ వివాదం కారణంగా నాలుగేళ్లుగా ఆగిపోయిన ఆరు లేన్ల రహదారి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, ఘజియాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని పొడవు 28 కిలోమీటర్లు. వెడల్పు 130 మీటర్లు. దీనిని రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించారు. గ్రేటర్ నోయిడా మాస్టర్ ప్లాన్-2021లో భాగంగా దీనిని పూర్తిచేశారు. ఇది నగరంలోని జెటా సెక్టార్ వద్ద ప్రారంభమవుతుంది. ఇందువల్ల గ్రేటర్ నోయిడా-ఘజియాబాద్ మధ్య ప్రయాణ సమయం 30 నిమిషాల మేర తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తికి ముందు ఈ రెండు నగరాల ప్రయాణికులు ఎటైడా- చోర్పులా మార్గంలో తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేవారు. భవిష్యత్తులో విస్తరణ: యమునా ఎక్స్ప్రెస్వే అథారిటీ భవిష్యత్తులో ఈ మార్గాన్ని 41 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. గ్రేటర్ నోయిడా నుంచి జేవార్ పట్టణందాకా దీనిని పొడిగించనుంది. దీంతోపాటు ఈ రహదారికి ఇరువైపులా వాణిజ్య సముదాయాలను నిర్మించనుంది. దీంతోపాటు ఓ బస్సు కారిడార్ను కూడా నిర్మించనుంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నాం. ఇందులోభాగంగా మోనో రైల్ లాంటి లైట్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎల్ఆర్టీఎస్)ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాం. ఇందువల్ల ఈ మార్గంలోని నగరాల మధ్య కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు సులువుగా చేరుకోగలుగుతారు. -
నగరంలో సైక్లింగ్ కారిడార్లు
గ్రేటర్ నోయిడా: నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రధాన రోడ్లపై ప్రత్యేక సైక్లింగ్ కారిడార్ను నిర్మించాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గత నెలలో అధికారులకు సూచించారు. ఈ మేరకు అధికారులు, వివిధ టౌన్షిపుల అథారిటీలు స్పందించాయి. ఇందులో భాగంగా సమారు 15 కిమీటర్ల సైక్లింగ్ కారిడార్ను తన టౌన్షిప్లో నిర్మించడానికి యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ అథారిటీ(వైఈఐడీఏ) ముందుకొచ్చింది. ఈ మేరకు డిజైనర్లను ఆహ్వానించింది. 50 కి.మీటర్ల సైకిల్ కారిడార్ నిర్మాణానికి నోయిడా అధికారులు గతవారమే డిజైనర్లను నియమించారు. సైక్లింగ్ ట్రాక్లు, స్టాండ్లు, షెల్టర్ ఏర్పాటుపై అవసరమైన ప్రతిపాదనలను (ఆర్ఈపీ) రూపొందించి అందజేయాలని వైఈఐడీఏ బుధవారం కన్సల్టెంట్లలకు సూచించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అర్హతలను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేస్తామని చెప్పింది. సైక్లింగ్ ట్రాక్ 20 కి.మీటర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. తొలి దశలో15 కి.మీటర్ల వైఈఐడీఏలోని ప్రధాన మార్గాల్లో సైక్లింగ్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. వైఈఐడీఏ నూతన టౌన్షిప్ 50 చదరపు కిలోమీటర్లు విస్తరించి పట్టణీకరణ చెందింది. ఒకసారి అర్బనైజేషన్ పూర్తి అయితే, అది క్రమంగా 200 చదరపు కిలో మీటర్లు విస్తరిస్తుందని అధికారి తెలిపారు.తొలి దశలో 18-20 సెక్టార్లలోని రోడ్డు మార్గంలోని పాదచారులు, సైక్లిస్టులకు ఇబ్బంది కలగకుండా ఈ కారిడార్ను ఏర్పాటు చేస్తారు. ఈ సైకిల్ ట్రాక్ 2.5 మీటర్ల పొడవు నిర్మస్తారు. దీనివల్ల రోడ్లపై, పాదచారులు, సైకిలిస్టులకు ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందని సంబంధిత అధికారులు అన్నారు. రెండో దశలో రోడ్లపై గుర్తించిన ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్లను నిర్మిస్తారు. ఇది క్రమంగా అన్నిరోడ్లపై కూడా సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈనెల 14వ తేదీన సమావేశమై నిర్ణయిస్తామని చెప్పారు. 20వ తేదీన సాయంత్ర మూడు గంటలకు సాంకేతిక బిడ్లను ప్రారంభిస్తామని, కొన్నిరోజుల్లో ఆర్థిక పరమైన అంశాలను పూర్తిచేస్తామని చెప్పారు. -
కుక్కలు వస్తే చిక్కులు
గ్రేటర్ నోయిడా: శునకాలకు అనుమతి లేదంటూ పార్కుల్లో ప్రత్యేకంగా బోర్డులు అమర్చినా యజ మానులు ఖాతరు చేయకుండా వాటిని తీసుకురావడం గుర్గావ్ పార్కుల్లో సర్వసాధారణమే. అయితే వీటి సంచారం వల్ల కాలనీ పార్కులు తీవ్రంగా దెబ్బతింటున్నట్టు గుర్తించిన నోయిడాలోని బెటా-1 సెక్టార్ నివాసుల సంక్షేమ సంఘం (ఆర్డబ్ల్యూఏ) పెంపుడు జంతువుల సంచారంపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కాలనీ పార్కుల్లోకి కుక్కలను తీసుకువస్తే ఇక నుంచి రూ.21 వేల జరిమానా వేస్తామని హెచ్చరించింది. జంతువులను తీసుకురాకూడదని ఎన్నిసార్లు చెప్పి నా యజమానులు వినడం లేదని, గ్రేటర్ నోయిడా ప్రాధికార సంస్థ కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్డబ్ల్యూఏ వివరణ ఇచ్చింది. ‘బెటా సెక్టార్లో దాదాపు 1,800 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ ఎనిమిది పార్కులు ఉన్నాయి. చాలా మం దికి ఒకటి కంటే ఎక్కువ కుక్కలు ఉన్నాయి. వీటిని తీసుకురాకూడదని ఎంత చెప్పినా యజమానులు చెవికెక్కించుకోవడం లేదు. పార్కులను అందరి సౌకర్యం కోసం నిర్మించారు. పెంపుడు జంతువుల వల్ల అవి తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ విష యం గురించి గ్రేటర్ నోయిడా మున్సిపాలిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేదు’ అని ఆర్డబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శి హరీందర్ భట్టి వివరించారు. కుక్కలను తీసుకువస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ప్రతి పార్కులో రెండు బోర్డులు పెడతామని తెలిపారు. పెంపుడు జంతువుల తీసుకురావడాన్ని ప్రోత్సహించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. బెటా ఆర్డబ్ల్యూఏ మాదిరిగానే మిగతా సంఘాలు కూడా ఇదే బాటను అనుసరించాలని భావిస్తున్నాయి. కుక్కల యజమానులు మాత్రం ఆర్డబ్ల్యూఏ నిర్ణయంపై మండిపడుతున్నారు. గ్రేటర్ నోయిడా మున్సిపాలిటీ మాత్రం ఈ విషయంపై ఏమీ చెప్పడం లేదు. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జంతు సంక్షేమ సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం హౌసింగ్ సొసైటీలు పెంపుడు జంతువుల సంచారంపై నిషేధం విధించడం కుదరదు. జరిమానాలు విధించడం కూడా చట్టవిరుద్ధమే. పార్కుల్లోకి జంతువులను తీసుకురావడానికి నిర్దేశిత సమయాన్ని సూచించవచ్చు. -
నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై దేశంలోనే పొడవైన ఎఫ్ఓబీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజధానికి అత్యంత చేరువలో ఉన్న నోయిడా సిగలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. దేశంలోనే అత్యంత పొడవైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై రూపుదిద్దుకోనుంది. ఈ బ్రిడ్జి పొడవు 160 కి.మీ ఉండనుంది. దీని నిర్మాణం కోసం రూపొందించిన అంచనాను ఐఐటీ-ఢిల్లీకి పంపారు. మూడు నాలుగు నెలల వ్యవధిలో పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. దీని నిర్మాణానికి ఏడాది కాలం పడుతుందని భావిస్తున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వే కారణంగా ఓవైపు నుంచి మరో వైపునకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకోసం ఐదు మినీ అండర్పాస్లను నిర్మించినప్పటికీ అంతదూరం నడవలేక ఎక్స్ప్రెస్వే డివైడర్ను దూకి వెళ్లేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందువల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ స్థానికులు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఎక్స్ప్రెస్వేపై మొత్తం ఆరు ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలంటూ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఫారసు చేసింది. వీటిలో ఎమిటీ యూని వర్సిటీకి ఎదుట ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇప్పటికే నిర్మిం చారు. మిగతా ఐదింటిని నిర్మించాల్సి ఉంది. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను సెక్ట్టార్126 / 127 డివైడింగ్ రోడ్కు, సెక్టార్ 97కు మధ్య నిర్మిస్తారు. -
గౌతమ్బుద్ధ్నగర్ ఎన్నికల చిత్రం కర్షకులే నిర్ణేతలు..!
సాక్షి, న్యూఢిల్లీ: నోయిడా, గ్రేటర్ నోయిడా వంటి పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలను తనలో కలుపుకున్న గౌతమ్ బుద్ధ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది రైతులే. బహుముఖ పోటీ నెలకొన్న ఈ నియోజకవర్గం ఓటర్లలో 70-80 శాతం రైతులు, గ్రామీణులు కావడమే ఇందుకు కారణం. ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న భూములకు రైతులు అధిక నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తుండడంతో.. ఇదే ఈ నియోజకవర్గం ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారింది. నష్టపరిహారాన్ని ఆరు రెట్లు పెంచాలని, కొత్తగా సేకరించే భూమి కోసం కొత్త విధానాన్ని రూపొందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడాలు ఆధునిక హంగులను సమకూర్చుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని వారు అంటున్నారు. రైతుల మద్దతుపైనే తమ విజయం ఆధారపడి ఉందని గుర్తించిన ప్రధాన రాజకీయ పార్టీలు రైతుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఉద్దేశమని అంటున్నాయి. అయితే రాజకీయ పార్టీలు ఇస్తోన్న ఈ హామీకి ఏమాత్రం పొంతనలేని రీతిలో నోయిడా, గ్రేటర్ నోయిడా వాసుల సమస్యలు ఉన్నాయి. అపార్ట్మెంట్లు, సువిశాలమైన రోడ్లు, మాల్స్, ఎఫ్1 సర్క్యూట్ వంటి అంతర్జాతీయ హంగులున్న ఈ ప్రాంతంలో విద్యుత్తు కొరత ప్రధాన సమస్యగా ఉంది. అభ్యర్థులు వీరే... మొత్తం 17.34 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో వృత్తి రీత్యా వైద్యుడైన డాక్టర్ మేహ ష్ శర్మకు బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ రమేష్ చంద్ర తోమర్ను, సమాజ్వాదీ పార్టీ నరేంద్రసింగ్ భాటీని భట్ను నిలబెట్టాయి. ఈ ముగ్గురు అభ్యర్థులు 2009 ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన సురేంద్ర సింగ్ నాగర్ చేతిలో ఓడిపోయారు. ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ గుజ్జర్ సామాజికవర్గానికి చెందిన సతీష్ అవానాను అభ్యర్థిగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నోయిడాకు చెందిన వ్యాపారవేత్త కేపీ సింగ్ను నిలబెట్టింది. -
ముగిసిన ఆటో ఎక్స్పో
గ్రేటర్ నోయిడా: నగరంలో వారం క్రితం ప్రారంభమైన 12వ ఆటోఎక్స్పో మంగళవారం ముగిసింది. ఈ షో కార్ల పరిశ్రమకు మళ్లీ మంచిరోజులు వస్తాయని, విక్రయాలు బాగా పెరుగుతాయని ఆశలు క్రమేపీ చిగురిస్తున్నాయి. కాగా ఈ షోలో మొత్తం ఆవిష్కరణలు చోటుచేసుకోగా, అందులో 26 అంతర్జాతీయ మోడల్ కార్లు ఉన్నాయి. మొత్తం 5.6 లక్షలమంది సందర్శకులు ఈ షోను తిలకించారు. చివరిరోజైన మంగళవారం దాదాపు 90 వేలమంది సందర్శకులు తరలివచ్చారు. కాగా 11వ ఆటో ఎక్స్పో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన సంగతి విదితమే. ఈ విషయమై మారుతి సుజికీ ఇండియా సంస్థ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మనోహర్ భట్ మాట్లాడుతూ గత 11వ ఆటో ఎక్స్పో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్వహించిన షోని మొత్తం ఏడు లక్షలమంది సందర్శించారన్నారు. విక్రయాలు తగ్గుముఖం పడుతున్న సమయంలోనే ఈ షో జరిగిందన్నారు. ఇదొక సానుకూల సంకేతమన్నారు. సందర్శకు నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇదే విషయమై సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) డిప్యూటీ జనరల్ మాట్లాడుతూ సందర్శకులనుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇదిలాఉంచితే జర్మనీకి చెందిన విలాసవంతమైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ కార్ల వద్ద సోమవారం సందర్శకులు అత్యధిక సంఖ్యలో కనిపించిన సంగతి విదితమే. దాదాపు 50 మీటర్ల మేర క్యూలలో సందర్శకులు నిల్చుని వాహనాలను సందర్శించారు.