horse riding
-
హార్ట్స్.. రైడింగ్..
గుర్రపు స్వారీ నేర్చుకోవడం అనేది నగరంలో ఒక నయా ట్రెండ్గా మారుతోంది. విద్యార్థి దశ నుంచే గుర్రమెక్కాలని టీనేజర్స్ తహతహలాడుతున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల అభిరుచి, ఆసక్తులను గమనించి ఆ మేరకు ప్రోత్సహిస్తున్నారు. నగరంలోని కొంత మంది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు ఏకంగా గుర్రాన్ని కొనుగోలు చేసుకుని, ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించుకుంటున్నారు. పిల్లలకు గుర్రపు స్వారీలో మెళకువలు నేరి్పస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరికొంత మంది మాత్రం శిక్షణా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలో గుర్రపు స్వారీ శిక్షణా కేందాల సంఖ్య పెరుగుతోంది. పూర్తి స్థాయి శిక్షణ పొందిన ఇండియన్, బ్రిటిష్ బ్రీడ్ గుర్రాలకు స్థానికంగా గిరాకీ ఏర్పడింది. నగరానికి చెందిన పలువురు ఔత్సాహికులు బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, జోథ్పూర్ తదితర ప్రాంతాల నుంచి రూ.లక్షలు వెచి్చంచి గుర్రాలను కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఫాం హౌస్లు, ఖాళీ ప్రదేశాల్లో ప్రత్యేకించి ఇసుకతో కూడిన మెత్తని నేలలను శిక్షణా కేంద్రాలుగా తయారు చేస్తున్నారు. శిక్షణ తీసుకునే వారు ప్రమాదవశాత్తూ కిందపడినా దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుర్రం ఎక్కడం ఎలా, కుడి, ఎడమ ఎటు వైపు తిప్పాలంటే ఎలాంటి సంకేతాలు ఇవ్వాలి, గుర్రాన్ని ఆపడానికి ఏం చేయాలనే విషయాలు శిక్షకులు ముందుగానే పిల్లలకు బోధిస్తున్నారు. ఏడు వేల నుంచి.. హార్స్ రైడింగ్ అనుకున్నంత సులువైనదేమీ కాదు. ఇందుకు చాలా ఏకాగ్రత, దృష్టికేంద్రీకరణ ఉండాలి. ముఖ్యంగా గుర్రంపై కూర్చోవడమే ఓ పెద్ద సవాలుగా ఉంటుంది. కూర్చున్నాక అది ఎటు వెళుతుందనేదీ ముందుగానే పసిగట్టాల, మన దారిలోకి తెచ్చుకోగల నైపుణ్యాన్ని సాధించాలి. చాలా మంది పిల్లలు నెల నుంచి రెండు నెలల్లో అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతున్నారని శిక్షకులు చెబుతున్నారు. కాగా శిక్షణకు గానూ పెద్దవాళ్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, పిల్లలకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ ఫీజు తీసుకుంటున్నారు. రిచ్మ్యాన్ గేమ్.. గుర్రపు స్వారీ అనేది రిచ్మ్యాన్ గేమ్. సామాన్యులకు గుర్రం కొనుగోలుచేయడం, పోషించడం, శిక్షణకు అవసరమైన విధంగా తీర్చిదిద్దడం, అనారోగ్య సమస్యలు వచి్చనప్పుడు దాన్ని బాగోగులు.. ఇలా అన్నీ ఖర్చుతో కూడుకున్న పనులే. ఆరోగ్యంగా ఉన్న గుర్రానికి నెలకు కనీసం రూ.25 వేలు, ఆపైనే వెచి్చంచాల్సి ఉంటుంది. జంతువులను మచి్చక చేసుకోవడం, వాటితో స్నేహంచేయడం, జాగ్రత్తగా చూసుకోవడంలో ఎంతో సంతృప్తినిస్తుందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. జంతువుల నుంచి కొత్తవిషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని ట్రైనర్స్ పేర్కొంటున్నారు.వారాంతంలో రైడ్స్..నగరంలోని కొన్ని క్లబ్లు వారాంతంలో ప్రత్యేకంగా హార్స్ రైడ్స్ నిర్వహిస్తున్నాయి. ప్రశాంతమైన ప్రకృతిలో గుర్రపు స్వారీ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలుసుకుని, హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. గండిపేట్, ఎల్బీ నగర్, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి హార్స్ రైడింగ్ కనిపిస్తోంది.ఇదో హాబీలా..పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన గుర్రాలను మాత్రమే గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు వచ్చేవారికి ఇస్తాం. మొత్తం 25 గుర్రాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసు్కలు ఎక్కువ మంది శిక్షణ తీసుకోడానికి వస్తున్నారు. ఉత్తర భారత దేశంలో గుర్రపు స్వారీకి ఎక్కువ డిమండ్ ఉంది. హైదరాబాద్లో ఇటీవల కాలంలోనే ఆ ట్రెండ్ మొదలైంది. ఇదొక హాబీలా మారిపోయింది. డిల్లీ, జైపూర్, జోథ్పూర్, ముంబయి, గుజరాత్ తదితర ప్రాంతాల్లో గుర్రపు క్రీడల పోటీలకు వెళుతుంటాం. – సయ్యద్ మాజ్, ట్రైనర్, క్రాస్ కంట్రీ క్లబ్ హైదరాబాద్నవాబుల కాలం నుంచే హైదరాబాద్లో గుర్రపు స్వారీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడదే క్రేజ్గా మారుతోంది. నగరంలో రాత్రి పూట పలువురు గుర్రాలపై సంచరిస్తున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి. అయితే వారికి తిరిగేందుకు వాహనాలు అందుబాటులో లేక ఇలా వస్తున్నారనుకుంటే పొరపాటే.. అందరిలోకీ ప్రత్యేకంగా ఉండాలనే దృష్టితో కొందరు.. గుర్రపు స్వారీపై మక్కువతో మరికొందరు ఇలా చేస్తున్నామంటున్నారు. స్వారీ చాలా నేరి్పస్తుంది.. కరోనా లాక్డౌన్ సమయంలో గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. శరీరంలోని కండరాల అమరిక, ఆత్మస్థైర్యం, పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కంట్రోల్, జంతువుల పట్ల గౌరవం, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం, క్లాస్, మీటింగ్, ఓపెన్ ప్లేస్ ఎక్కడైనా మాట్లాడగలిగే వాక్చాతుర్యం, ఇలా అన్నీ కలిపి ఒక ప్యాకేజీలా వచ్చాయి. నేర్చుకునేందుకు పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన గుర్రం కొనుగోలు చేసుకున్నాం. దాన్ని నిర్వహణ కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వారాంతాల్లో రైడ్స్కి వెళుతుంటాం. ఆ గుర్రమే మనకు అన్నీ నేరి్పస్తుంది. – ఇషాన్ శర్మ, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, మణికొండ -
Horse Riding.. సాహసపు.. సవారీ..!
గుర్రపు సవారీ అనేదీ ఆటవిడుపు, సాహస క్రీడ, ప్రస్తుతం నగరంలో ఇదే ట్రెండ్గా మారుతోంది. యువతతో పాటు చిన్నపిల్లలు సైతం గుర్రపు సవారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై సవారీ చేస్తుంటే చూసి ముచ్చటపడుతుంటారు. యువతకు, వారి తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఈ కోవలోనే నాగోలు డివిజన్ పరిధి రాక్టౌన్ కాలనీలో నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్ గత కొన్నేళ్లుగా గుర్రపు స్వారీలో అనేక మందికి శిక్షణ ఇస్తూ మన్ననలను పొందుతోంది. – మన్సూరాబాద్మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి సాహసపు సవారీ సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన చిన్నారులకు మంచి ఫలితాలనిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, అశ్వాన్ని దూకించడం ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యలతో మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయి. అనేక మంది విదేశీయులు కూడ నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారు.సహసక్రీడతో జర జాగ్రత్త..గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రమాదాలు సంభవించినా కూడా రైడర్కు ప్రమాదం జరగకుండా శిక్షకులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుక నేలల్లో శిక్షణ ఇస్తుంటారు.ఎంపిక చేసిన గుర్రాలతో శిక్షణ..మా శిక్షణా కేంద్రంలో మొత్తం 13 గుర్రాలున్నాయి. పదేళ్ల పాటు సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా చికిత్స కోసం వచ్చే పిల్లల సేవలకు వినియోగిస్తాము. చిన్నపిల్లలతో మంచిగా మసలేందుకు, రౌతు తీరుని గమనించేందుకు గుర్రాలకు ముందే శిక్షణ ఇస్తాము. పిల్లల వైకల్యానికి అనుగుణంగా ఏ గుర్రంతో స్వారీ చేయాలనేది నిర్ణయించి శిక్షణ ప్రారంభిస్తాము. ప్రతి నెలా రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులతో గుర్రాలకు నాడలను వేయిస్తాం. – నవీన్చౌదరీ, హార్స్ రైడింగ్ శిక్షకుడుమానసిక రుగ్మతలకు..చిన్నారుల్లో వివిధ మానసిక రుగ్మతలను నయం చేసేందుకు వివిధ వైద్య విధానాల్లో లొంగని వాటికి అరుదైన చికిత్సా విధానం హార్స్ రైడింగ్ అని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. మా పాపను గత కొన్ని నెలలుగా గుర్రపుస్వారీకి తీసుకొస్తున్నాను. గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. తనంతట తానుగా పనులు చేసుకుంటుంది. మెదడు, శారీరక ప్రక్రియ మెరుగ్గా అనిపిస్తుంది. మానసికంగా దృఢంగా తయారవుతుంది. – ఎన్.అపర్ణఇవి చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది? -
కత్తిలాంటి చూపు కోసం... యుద్ధకళ నేర్చుకున్న మను భాకర్
యుద్ధంలో గెలవాలంటే దేహం ఒక ఆయుధంగా మారాలి . దృష్టి, ఆలోచన ఆయుధంగా మారాలి. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ గురి నిలవడానికి ప్రత్యర్థులను గెలవడానికి ‘థాంగ్ తా’ను నేర్చుకుంది. కేరళ కలరిపట్టులాగా మణిపూర్కు చెందిన ఈ యుద్ధకళ మనసును లగ్నం చేసి దేహాన్ని ఉద్యుక్తం చేయడంతో సాయం చేస్తుంది.‘ఒలింపిక్స్లో పతకం సాధించడం పెద్ద లక్ష్యం. ఇందుకోసం అన్ని విధాలా సిద్ధం కావాలి. ఇది ఎవరిమీదో ఆధారపడే విషయం కాదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను స్త్రీని కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. అందుకే నేను షూటర్గా గట్టిగా నిలవడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో థాంగ్ తా నేర్చుకోవడం ఒకటి’ అంది మను భాకర్.పారిస్ ఒలింపిక్స్లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా షూటర్గా, ఒకే సీజన్లో రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే గెలుపు అంత సులభంగా రాదు. ప్రపంచ వేదికపై ప్రత్యర్థులతో తలపడాలంటే ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రాక్టీస్లో, వేదిక బయట ఎంత గొప్పగా రాణించినా సరిగ్గా నిర్దిష్ట క్షణంలో తొణకక బెణకక పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యం. ఇందుకు కఠోర సాధన అవసరం.యోగా, గుర్రపు స్వారీ, థాంగ్ తాషూటర్గా రాణించడానికి శరీరం, మనసు రాటుదేలి ఉండేందుకు మను భాకర్ సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శ్రమ చేసింది.యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే గుర్రపు స్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. గురి వైపు తుపాకీ పేల్చడం అంటే గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరకెత్తించడమే. ప్రాణం ఉన్న అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని తుపాకీ అదుపులోకి వస్తుంది. అయితే ఇవి మాత్రమే చాలవు అనుకుంది మను భాకర్. అందుకే థాంగ్ తా నేర్చుకుంది. గురువుకు లోబడిమను భాకర్ కోచ్ జస్పాల్ రాణ. మనలో ఎంత ప్రతిభ ఉన్నా గురు ముఖతా నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చాలామంది శిష్యులు ఆ పని సంపూర్ణంగా చేయలేరు. ‘థాంగ్ తా’లో మొదట నేర్పేది శిష్యుడు తన అహాన్ని వీడి గురువుకు లోబడటమే. కత్తి, బల్లెం, డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం అనుకునేలా ఉండాలి. క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం ఈ కళలో ముఖ్యం. షూటింగ్ సాధనలో గురువు దగ్గర క్రమశిక్షణ తో, నిజాయితీతో, నేర్పే విద్యను గౌరవిస్తూ నేర్చుకోవడంలో మను భాకర్కు థాంగ్ తా ఉపయోగపడింది.తెగలను కాపాడుకునేందుకు... మణిపూర్ తెగల యుద్ధకళ ‘హ్యుయెన్ లల్లాంగ్’. ఇందులో కత్తి, బరిసెలతో చేసేది థాంగ్ తా. ఆయుధాలు లేకుండా చేసేది సరిత్ సరక్. బయట తెగలు వచ్చి స్వీయ తెగలను రూపుమాపకుండా ఉండేందుకు పూర్వం మణిపూర్లో ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకుని సిద్ధంగా ఉండేవాడు. స్త్రీలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. చెక్క కత్తి, డాలుతో ఈ యుద్ధక్రీడను సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. ‘ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారు ఈ యుద్ధ కళలో’ అంటారు మణిపూర్ గురువులు. మను భాకర్ గెలవడానికి ఆమెలోని వినమ్రత కూడా ఒక కారణం కావచ్చు. -
రైడర్ ప్రియాంక
ఓ వైపు వృత్తి.. మరోవైపు హాబీ.. చాలా మంది ఈ రెంటిలో ఏదో ఒక్కదానికే ప్రాధాన్యం ఇస్తారు. అతికొద్దిమంది మాత్రమే ఈ రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతారు.. అలా రెంటిలోనూ గుర్తింపు తెచ్చుకోడం అంత సులువేం కాదు.. అందునా ఓ మహిళ ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం చెప్పుగోదగ్గ విషయం.. పైగా అతి కష్టతరమైన గుర్రపు స్వారీలో రాణించడమంటే ఎంతో గుండె ధైర్యం కూడా ఉండాలి.. అలా గుర్రపు స్వారీలో రాణిస్తూనే.. ఎనీ్టపీసీలో మేనేజర్గా బిజీగా ఉంటూ.. మరోవైపు రచయిత్రిగానూ రాణిస్తున్నారు.. నగరానికి చెందిన ప్రియాంక భుయాన్. పలువురికి రోల్మోడల్గా నిలుస్తున్న ఆమె అనుభవాలు సాక్షితో పంచుకున్నారు... ఆ వివరాలు మీకోసం.. మహిళలంటే వంటింటికే పరిమితం అనే అపోహలను చెరిపేస్తూ.. అన్నింటిలోనూ పోటీకి సిద్ధమని నిరూపిస్తున్నారు నేటి మహిళలు.. కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఆటల్లోనూ ముందడుగేస్తున్నారు. ఎంత కష్టమైనా.. ఎదురు నిలిచి.. గెలిచి చూపిస్తున్నారు.. అంతటితో ఆగకుండా మరోవైపు కుటుంబ బాధ్యతలను భారంగా కాకుండా ఎంతో నిబద్ధతతో చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు ఎనీ్టపీసీలో మేనేజర్గా పనిచేస్తున్న ప్రియాంక భుయాన్. గుర్రపు స్వారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ.. నలుగురికీ రోల్మోడల్గా నిలుస్తున్నారు. చిన్నన్నాటి కల.. అస్సాంలోని గువహటిలో జన్మించాను. అక్కడే నా బాల్యం గడిచింది. మూడేళ్లు వయసప్పుడు అమ్మ ఇచ్చిన ఓ గ్రీటింగ్ కార్డులో తొలిసారిగా గుర్రం బొమ్మ చూశాను. అప్పటి నుంచి గుర్రాలంటే పిచ్చి. కాస్త పెరిగాక గుర్రపు స్వారీపై ఆసక్తి పెరిగింది. కానీ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. గుర్రాన్ని దగ్గరి నుంచి చూడటమే విశేషం. కానీ ఇప్పుడు గుర్రం స్వారీ చేస్తూ పోటీల్లో పాల్గొనడం, పతకాలు సాధించడం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నో ఆటంకాలు... వృత్తిలో భాగంగా 2020లో రాయ్పూర్ బదిలీ అయ్యాను. కుటుంబం నుంచి దూరంగా ఉండటంతో ఒంటరిగా ఫీలయ్యేదాన్ని. అప్పుడే హార్స్ రైడింగ్ కలకు చేరువవ్వాలని నిర్ణయించుకున్నా.. అయితే మొదట్లో ఎవరేం అనుకుంటారో అని కాస్త భయపడ్డా. పైగా మహిళలకు ఈ రంగంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా ధైర్యం చేసి∙ట్రైనింగ్సెంటర్లో చేరాను. ట్రైనింగ్సెంటర్కు వెళ్లి గుర్రాలను చూడగానే ఎగిరి గంతేశాను. అయితే ప్రాక్టీస్ సమయంలో కింద పడి గాయాలయ్యాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకెళ్లాను. ఢిల్లీలో జరిగిన పోటీలో కాంస్య పతకం గెలుచుకున్నా.ఆ బాండింగ్ ప్రత్యేకం.. హార్స్ రైడింగ్ నేర్చుకోవడమే కాదు.. గుర్రంతో మంచి అనుబంధం ఉండాలి. ఎంత బాండింగ్ ఉంటే అంత అద్భుతంగా రాణించగలుగు తాం. ఒక్కోసారి గుర్రాలు మనకు సహకరించవు. దీనివల్ల గాయాలు కావొచ్చు. ప్రాణాలు కూడా పోవచ్చు. ముందస్తు జాగ్రత్తలతో పాటు గుర్రంతో స్నేహం చేయాలి. కుదిరితే సొంత గుర్రం కొనుక్కోవడం మంచిది.ధర ఎక్కువే..గుర్రాల్లో చాలారకాలుంటాయి. స్వారీలకు వేడి రక్తం ఉన్న విదేశీ గుర్రాలను వాడుతుంటారు. వాటిని దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కోదాని ఖరీదు రూ.30 నుంచి రూ. 40 లక్షలు ఉంటుంది. దీనికి పన్ను అదనం. దేశవాళీ గుర్రాలు అయితే కాస్త తక్కువ ధరకు దొరుకుతాయి. కానీ అనుకున్నన్ని సాహసాలు, మిరాకిల్స్ కష్టం. నేనూ ఓ గుర్రాన్ని కొనుక్కున్నా. కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని నెలలకే క్యాన్సర్తో మరణించింది. గుర్రాన్ని పెంచడమూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.రాయడమూ ఇష్టమే..గుర్రపు స్వారీతో పాటు పుస్తకాలు రాయడమూ హాబీ. ఇప్పటివరకూ మూడు పుస్తకాలు రాశాను. వాటికి పాఠకుల నుంచి స్పందన వచి్చంది. కురుక్షేత్రంలో మహిళల గురించి ప్రపంచానికి పరిచయం చేయాలని నా తపన. అందుకే వీలు చిక్కినప్పుడల్లా పుస్తకాలు రాస్తుంటాను. -
'నా జీవితమంతా సాహసాలే'.. ఆ సినిమా కోసం మరో డేరింగ్ చేస్తోన్న హీరోయిన్!
భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. ఆ తర్వాత బింబిసారతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. గతేడాది విరూపాక్ష, డెవిల్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా ధనుశ్ సరసన సార్ చిత్రంలోనూ మెరిసింది. వరుసగా అవకాశాలతో సూపర్ హిట్స్ కొడుతోంది. తాజాగా ఈ బింబిసార ఫేమ్ యంగ్ హీరో నిఖిల్ చిత్రంలో నటిస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభు చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా సంయుక్త పోస్ట్ చేసిన ఓ ఫోటోలు నెట్టింట వైరల్గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. తాజాగా ఈ కేరళ భామ గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. అంతే కాకుండా సుదీర్ఘమైన సందేశం కూడా రాసుకొచ్చింది. ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపింది. నా జీవితమంతా ఎల్లప్పుడూ సాహసాలతోనే కొనసాగుతోందని.. తాను ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండేందుకు ఇష్టపడనని వెల్లడించింది. జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతానని తెలిపింది. నా నెక్ట్స్ మూవీ స్వయంభూ కోసమే ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నానని రాసుకొచ్చింది ముద్దుగుమ్మ. సంయుక్త ట్వీట్లో రాస్తూ.. 'ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నా. నా జీవితమంతా సాహసాలతోనే నడుస్తోంది. కంఫర్ట్ జోన్లో ఉండిపోవడాన్ని ఇష్టపడను. నా కొత్త సినిమా స్వయంభు కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. ఇది నాకు కొత్త మానసిక అనుభూతిని కలిగిలిస్తోంది. ఇది నాకు లభించిన అదృష్టం కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక, సుసంపన్నమైన ప్రయాణం. గుర్రంతో సామరస్యంగా ఉంటూ.. గుర్రం మనసును దగ్గర నుంచి పరిశీలించడం.. మేమంతా ఒక టీమ్గా కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నా జీవితంలో ఎదురైన ప్రతి ఓటమిని ఒక మెట్టుగా మలచుకుంటున్నా. అలాంటివేమీ నా జీవితంలో అడ్డంకి కాదు.' అంటూ పోస్ట్ చేసింది. 2024 embarked with a lot of learning about myself and about many things that makes life what it truly is. I have always been game for adventures in life. I never had a comfort zone because I always pushed myself to explore newer experiences 💫 As an actor, I am blessed to be… pic.twitter.com/lcW1nhNnY7 — Samyuktha (@iamsamyuktha_) February 10, 2024 -
గుర్రపు స్వారీ చేస్తున్న సమంత..దాని కోసమేనా ?
-
గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. దాని కోసమేనా?
చల్ చల్ గుర్రం.. చలాకీ గుర్రం అంటూ గుర్రపు స్వారీ చేస్తున్నారు హీరోయిన్ సమంత. మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఏడాది పాటు ఆమె సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారామె. తాజాగా గుర్రపు స్వారీ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. (చదవండి: పదకొండేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ని..పోల్చితే నచ్చదు: శ్రుతీహాసన్) తన కెరీర్లో భాగంగానే ఆమె గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే క్యాప్షన్లో ఆమె హీలింగ్ అనే పదం కూడా వాడటంతో మయోసైటిస్ వ్యాధి నివారణ చికిత్సలో భాగంగా ఈ స్వారీ చేస్తున్నారేమో అంటున్నారు నెటిజన్లు. కాగా సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ విడుదలకి సిద్ధంగా ఉంది. -
గుడుగుడుమనీ గుర్రమెక్కి నేనొత్త పా నేనొత్త పా
ఫుడ్ డెలివరీ బాయ్ అనగానే బైక్ మీద సర్రున దూసుకుపోయే కుర్రాళ్ల దృశ్యమే కళ్లముందు ఉంటుంది. గుర్రం మీద వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే దృశ్యం ఊహకు కూడా అందదు. ట్రక్కు డైవర్ల సమ్మె, పెట్రోల్ బంక్ల ముందు ‘నో స్టాక్’లు కనిపిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో హైదరాబాద్లో జొమాటో బాయ్ ఒకరు హార్స్ రైడింగ్ చేస్తూ ఫుడ్ డెలివరీ చేశాడు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది. ‘దిస్ ఈజ్ అన్బిలీవబుల్... ఇట్స్ జస్ట్ సూపర్బ్’ ‘అలనాటి రవాణా వ్యవ్యస్థను గుర్తుతెస్తోంది. కాలుష్య నివారణకు ఇది తిరుగులేని మార్గం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
హైదరాబాద్ : గుర్రపు స్వారీ అదరహో.. (ఫొటోలు)
-
గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!
మెగా తనయుడు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జంటగా కనిపించనుంది. ఇకపోతే చిన్నప్పట్నుంచి రామ్ చరణ్కు హార్స్ రైడింగ్ ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. అంతే కాకుండా మగధీర చిత్రంలో గుర్రపు స్వారీ అభిమానులను కట్టిపడేసింది. ఆ సీన్స్ అభిమానులను ఇప్పటికీ మర్చిపోలేరు. ఇసుకలో కురుకుపోయిన రామ్ చరణ్ను గుర్రం కాపాడే సీన్ ఎమోషనల్గా టచ్ చేసింది. (ఇది చదవండి: రవితేజ ఫ్యాన్స్కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు) అయితే గతంలో ఉపయోగించిన మగధీర సినిమాలోని గుర్రం పేరు బాద్షా. అప్పట్లో సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుర్రాన్ని ఇంటికి తెచ్చుకుని ‘కాజల్’ అని పేరు పెట్టుకున్నారు చెర్రీ. వీలు చిక్కినప్పుడల్లా అలా గుర్రంపై సరదాగా రైడింగ్ చేసేవారు మన గ్లోబల్ స్టార్. మగధీర గుర్రంతో పాటు ఆయన దగ్గర మరిన్నీ హార్సెస్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరో గుర్రాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెర్రీ తన ఇన్స్టాలో పంచుకున్నారు. 'బ్లేజ్.. మై న్యూ ఫ్రెండ్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసమేనా అన్నా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఫోటో చూస్తుంటే అచ్చం మగధీరలోని గుర్రమే అభిమానులకు గుర్తుకు వస్తోంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
మగధీర గుర్రాన్ని మించిన గుర్రమిది
-
చల్ చల్ గుర్రం!
పిఠాపురం: గుర్రపు స్వారీ అనేది ఆటవిడుపు, సాహస క్రీడ. ప్రస్తుతం ఇది ట్రెండ్గా మారింది. యువతతో పాటు చిన్న పిల్లలు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై స్వారీ చేస్తుంటే.. చూసి ముచ్చటపడుతున్నారు. యువత, చిన్నారుల తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 100 మంది 250 గుర్రాల వరకూ పెంచుతున్నారంటే.. గుర్రపు స్వారీపై యువత ఆసక్తి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాలు వెలిశాయి. గతంలో గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఓ మోస్తరు పట్టణాల్లోనూ శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. వేసవి కావడంతో యువతతో పాటు చిన్నారులు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి మేలు గుర్రపు స్వారీ అనేది పలు మానసిక, శారీరక సమస్యలకు సంజీవనిలా పనిచేస్తుంది. పోలియో, పక్షవాతం, మెదడు, వెన్నెముక సమస్యలు, వినికిడి లోపాలు, భావవ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడం వంటి వాటికి చక్కటి చికిత్సగా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన పిల్లలకు మంచి ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, ఆశ్వాన్ని దూమికించడం, ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యల వల్ల మెదడుకి, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుందని.. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయని చెబుతున్నారు. గుర్రపు స్వారీకి అనువైన ప్రాంతంగా తీరం గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే ఎలాంటి ప్రమాదాలు జరిగినా రైడర్కు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుల నేలల్లోనే నేర్పాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ఇసుకను తెచ్చి వేస్తుంటారు. అలాంటి పరిస్థితి లేకుండా తీర ప్రాంతాల్లో ఉన్న ఇసుక మేటలు గుర్రపు స్వారీలకు అనుకూలంగా ఉండటంతో కాకినాడ తీరం ప్రాంతంలో ఉన్న ఇసుక నేలల్లో గత నెల రోజులుగా గుర్రపు స్వారీ శిక్షణ ఇస్తున్నాము. రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున నేర్పుతున్నాము. – కె.అనిల్రెడ్డి, గర్రపు స్వారీ శిక్షకుడు, కాకినాడ చాలా సరదాగా ఉంది.. మా నాన్న ఆడుకునేందుకు నాకు గుర్రపు బొమ్మ కొనిచ్చాడు. ఇది వద్దు.. నిజంగా గుర్రం మీద స్వారీ చేయాలని అడిగేవాడిని. అది ఇప్పుడు నిజమైంది. గుర్రంపై సవారీ చేయడం చాలా సరదాగా ఉంది. ముందు భయమేసినా రానురాను అలవాటైపోయింది. ఇప్పుడు ఏ భయం లేకుండా గుర్రంపై స్వారీ చేస్తున్నా. – ఆరుష్వర్మ, కాకినాడ చిన్ననాటి కల నేరవేరిందిలా.. ఎప్పటి నుంచో గుర్రపు స్వారీ చేయాలన్న కోరిక ఉండేది. శిక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటి వరకూ కుదరలేదు. కాకినాడ తీరంలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆ కోరిక ఇలా తీరింది. గుర్రపు స్వారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. శిక్షణ పొందిన గుర్రాలు కావడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా నేర్చుకుంటున్నాను. – అభిషేక్, కాకినాడ -
గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. ఫోటో వైరల్
సమంత ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకొని తిరిగి షూటింగ్స్లో పాల్గొంటుంది. చివరగా యశోద సినిమాతో అలరించిన సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సమంత విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాతో పాటు సిటాడెల్ అనే వెబ్సిరీస్లో నటిస్తుంది. ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డికే ‘సీటాడెల్’ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ కోసం సామ్ ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకొని ఇలా కనిపించడం సంతోషంగా ఉందని కామెంటస్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
హనీమూన్లో విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ నవ వరుడు
ముంబై: పెళ్లి అనంతరం భార్యతో హనీమూన్కు వెళ్లిన నవ వరుడు గుర్రపు స్వారీ చేస్తూ కందపడి ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని మాథెరాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఇంతియాజ్ షేక్. వయసు 23 ఏళ్లు. ఇటీవలే వివాహమైంది. ఈ జంట మరో జంటతో కలిసి హనీమూన్కు వెళ్లింది. నలుగురు సన్ అండ్ షేడ్ హోటళ్లో దిగారు . అయితే సరదాగా గుర్రపు స్వారీ చేసేందుకు నలుగురూ నాలుగు గుర్రాలపై హోటల్ నుంచి బయల్దేరారు. 70 మీటర్ల దూరం వెళ్లాక ఇంతియాజ్ గుర్రం ఒక్కసారిగా వేగంగా పరుగెత్తింది. దీంతో దానిపై నియంత్రణ కోల్పోయి ఇంతియాజ్ కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. సృహ కోల్పోయాడు. ఇంతియాజ్ను మొదట మాథెరాన్ మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించే బీజే హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉల్లాస్నగర్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. తలకు తీవ్ర గాయాల వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. ఇదే తొలిసారి.. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు జరగలేదని పోలీసులు తెలిపారు. గుర్రంపై నుంచి పడి పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి కానీ, ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే తొలిసారి అని చెప్పారు. అయితే గుర్రం వేగంగా ప్రయాణించడం వల్లే అతను కిందపడిపోయాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం నిర్ధరించుకోవాల్సి ఉందని పోలుసుల పేర్కొన్నారు. మరోవైపు గుర్రపు స్వారీ చేసే పర్యటకులకు కచ్చితంగా హెల్మెట్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అలా జరగడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది పర్యటకులు హెల్మెట్ ఇచ్చినా ధరించడం లేదని పేర్కొన్నారు. గుర్రాలు సమకూర్చిన వారి తప్పు ఉందని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు.. -
కల చెదిరింది.. ప్రాణం తీసిన గుర్రపు పందెం
న్యూజిలాండ్కు చెందిన 26 ఏళ్ల మేఘన్ టేలర్ గుర్రపు పందెంలో ప్రాణాలు కోల్పోయింది. యంగ్ జాకీ రైడర్గా పేరు పొందిన మేఘన్ టేలర్ కాంటర్బరిలోని యాష్బర్టన్ రేస్వే వద్ద గురువారం జరిగిన హార్స్ రేసులో పాల్గొంది. రేసు మధ్యలో దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది. రేస్ జరుగుతున్న సమయంలో మరొక జాకీ రైడర్తో జరిగిన క్లాష్లో మేఘన్ టేలర్ కిందపడిపోయింది. అయితే వేగంగా పరిగెత్తుతున్న గుర్రంపై నుంచి కిందపడడంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించేలోపే మేఘన్ టేలర్ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు మేఘన్ టేలర్ రెడ్ ఆర్కిడ్ హార్స్తో రెండో స్థానంలో ఉంది. అయితే ఆమె వెనకాలే మరో ముగ్గరు జాకీ రైడర్స్ ఒకే పార్శ్వంలో రావడమే ప్రమాదానికి కారణమైంది. మేఘన్తో పాటు మిగతా ముగ్గురు కూడా కింద పడినప్పటికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక మేఘన్ టేలర్ జాకీ రైడర్గా 2019లో తన కెరీర్ను ప్రారంభించింది. యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత న్యూజిలాండ్లో పలుమార్లు హార్స్ రేసింగ్లో పాల్గొంది. -
Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి..
ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. హర్షవర్ధన్ రావు... యూఎస్లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న ఆదిలాబాద్ కుర్రాడు. తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడినప్పుడు పిల్లలు అక్కడే చదువుకుంటారు... అందులో కొత్త, వింత ఏమీ ఉండకపోవచ్చు. అయితే హర్ష ఒక విజేత. అతడి తల్లి నీనారావు అతడి మార్గదర్శి. కొడుకును తీర్చిదిద్దడం కోసం ఆమె తన కెరీర్ను వదులుకున్నారు. ఇప్పుడు హర్ష చదువు, ఆటపాటలు, హార్స్రైడింగ్ వంటి నైపుణ్యాల్లో ఆరితేరాడు. నేషనల్ లెవెల్ హార్స్ రైడింగ్ చాంపియన్షిప్ గెలుచుకున్నాడు. సానుభూతి చూపులతో సాంత్వన పొంది, అంతటితో తృప్తి పడి ఉంటే ఈ రోజు తన కొడుకును విజేతగా చూపించగలిగేవారు కాదు నీనారావు. ఈ ప్రయత్నంలో ఆమె టాప్ 100 హెల్త్ కేర్ లీడర్స్ కేటగిరీలో చేరారు. ఈ సందర్భంగా సాక్షితో ఆమె పంచుకున్న వివరాలు. నా దిశ మారింది! ‘‘మాది మహారాష్ట్ర, మా వారిది మంచిర్యాల. అలా తెలుగింటి కోడలి నయ్యాను. నా జీవితాన్ని రెండు వేర్వేరు పార్శ్వాలుగా చూడాలి. తొలి పార్శ్వం పూర్తిగా అకడమిక్ గా సాగింది. పీహెచ్డీ పూర్తి చేసి ఎకనమిక్స్, హిస్టరీ, నేచురల్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ విధానాలు, పర్యావరణ నిర్వహణ వంటి అంశాల మీద అనేక పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద సమర్పించాను. యూఎస్లో నివసిస్తున్న నేటివ్ అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్ జాతులు, మనదేశంలో నాగాలాండ్, అండమాన్, ఇతర ఆదివాసీ జాతుల మీద పరిశోధనలు నిర్వహించాను. మా అబ్బాయి హర్షవర్ధన్ స్పెషల్ నీడ్స్ కిడ్ అని తెలిసిన తరవాత నా పంథా పూర్తిగా మారిపోయింది. మేము గుర్తించడం కూడా ఆలస్యంగానే జరిగింది. ఆ తర్వాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తనకు పన్నెండేళ్లు నిండినప్పుడు మేము యూఎస్కి తీసుకెళ్లిపోయాం. ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉందని చెప్పారు అక్కడి డాక్టర్లు. అంటే తన మనసులో అనుకున్న విషయాన్ని సంభాషణ ద్వారా వ్యక్తీకరించడంలో తగినంత చురుగ్గా లేకపోవడం అనవచ్చు. హర్ష చాలా తెలివైన పిల్లాడు, తన సమస్యను అధిగమించడానికి తల్లిదండ్రులుగా మా వంతు సపోర్టునివ్వాలి. అందుకోసం ఆటిజమ్తో సంబంధం ఉన్న అనేక సంస్థలు, నిపుణులను సంప్రదించాను. తనను ది బెస్ట్ కిడ్గా తయారు చేసుకోగలిగాను. యూఎస్లో హైస్కూల్లో ఆనర్స్ చేసి అండర్ గ్రాడ్యుయేషన్లో చేరాడు. హార్స్ రైడింగ్లో చురుగ్గా ఉన్నాడు. ఇంకో విషయం... మా అబ్బాయి యూఎస్లో చదివినప్పటికీ ఇంగ్లిష్తోపాటు తెలుగు చదవడం రాయడం కూడా బాగా నేర్చుకున్నాడు. నేను ఇంతగా శ్రమించడానికి ఆర్థిక వెసులుబాటు ఉంది. అలాగే భర్త, ఇతర కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. ఐదువందల మందిలో ఒక బిడ్డ ఇలా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలో నాలాంటి తల్లులు ఇంకా ఉన్నారు. అయితే వాళ్లందరికీ నాకు ఉన్న వెసులుబాటు ఉండకపోవచ్చు. అందుకే హర్ష కోసం యూఎస్, యూకే, ఇండియాలోని నిపుణుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ క్రోడీకరిస్తూ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల కోసం ఒక నియమావళిని రూపొందించాను. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేని పేదవాళ్లకు మార్గిక సేవాసంస్థ నుంచి సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా ప్రత్యేక సేవలందించాం. పేరెంట్స్తోపాటు స్పెషల్ ఎడ్యుకేటర్స్కి శిక్షణనిచ్చాం. వాళ్లు పిల్లలకు ఫోన్ ద్వారా రోజుకో టాస్క్ ఇస్తూ రోజంతా ఒక వ్యాపకంలో మునిగేలా చేశారు. అలాగే సైకాలజిస్ట్లు, కౌన్సిలర్లకు కూడా థియరిటికల్గా ట్రైనింగ్ ఇస్తున్నాం. సానుభూతి వద్దు! ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లులకు నేను చెప్పేది ఒక్కటే. పిల్లలు పుట్టిన తర్వాత నెలలు గడిచే కొద్దీ మెడ నిలపాల్సిన సమయానికి మెడ నిలపకపోవడం, కూర్చోవాల్సిన సమయానికి కూర్చోకపోవడం, మాట్లాడాల్సిన వయసుకి మాట్లాడకపోవడం వంటి తేడాని గుర్తించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఎవరూ ఇలాంటి స్థితిని కోరు కోరు. కానీ ఎదురైన తర్వాత ఎదుర్కోవడం ఒక్కటే మన ముందున్న ఆప్షన్. మానసికంగా కుంగిపోవద్దు. దేనినీ దాచవద్దు. పిల్లలను సమాజానికి చూపించకుండా ఇంట్లో ఉంచే ప్రయత్నం చేయవద్దు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచాలి. పిల్లల మూడ్ని బట్టి ఆ సమయంలో వారిని ఎలా డీల్ చేయాలనే విషయంలో శిక్షణ తీసుకోవాలి. ఆ అవగాహనతో మెలగాలి. వారిలో తప్పనిసరిగా ప్రత్యేకమైన కళ ఏదో ఉండి తీరుతుంది. దానిని గ్రహించండి. దానిని సాధన చేయించండి. నేను ఓ చాంపియన్కి తల్లినయ్యాను. మీ బిడ్డ ఐన్స్టీన్ కావచ్చు... మీరు ఐన్స్టీన్ తల్లి కావచ్చు’’ అన్నారు నీనారావు. సింపతీ కోరుకోవద్దని తల్లులకు చెబుతూనే, ‘ప్రత్యేకమైన పిల్లల పట్ల, ఆ తల్లిదండ్రుల పట్ల సానుభూతి చూపించడం మానేయండి. దానికి బదులు ప్రోత్స హించండి’ అని సమాజానికి హితవు చేశారామె. ప్రత్యేక చిత్రకారులు స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్లో కొందరు చక్కగా పాటలు పాడేవాళ్లున్నారు. మరొకరు చక్కగా బొమ్మలు వేస్తారు. మరొకరు మంచి కవితలు రాస్తారు. వాళ్లలోని సృజనాత్మకతను బయటకు తీయడం మన బాధ్యత. పిల్లలు వేసిన బొమ్మలు, కవితలతో ఓ పుస్తకం ప్రచురించాం. మేఘన తల్లి ఇద్దరమ్మాయిలున్న సింగిల్ పేరెంట్. ఆ అమ్మాయి వేసిన బొమ్మ చూడండి. చెట్టుకొమ్మకు కట్టిన ఊయల, ఆ ఊయలలో తల్లి రూపం ఉంది. ఊయల లోపల పాపాయి ఉంది. పన్నెండేళ్ల అమ్మాయి మాతృత్వాన్ని ఎంత అద్భుతంగా చిత్రించిందో చూడండి. మరో అమ్మాయి సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుని చక్కటి నినాదాలతో బొమ్మలు వేసింది. తమ మేధను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మాధ్యమాన్ని ఎంచుకున్నట్లే వీరు కూడా. – డాక్టర్ నీనారావు, ఫౌండర్, మార్గిక స్వచ్ఛంద సంస్థ – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
విశాఖలో ఇక గుర్రం స్వారీ
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖ నగర వాసులకు ఇక ఎంచక్కా గుర్రపు స్వారీ చేసే అవకాశం వచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్.. వాల్తేర్ ఆధ్వర్యంలో వాల్తేర్ రైల్వే ఫుట్ బాల్ స్టేడియం(పాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్)లో హార్స్ రైడింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశ రైల్వే స్పోర్ట్స్ చరిత్రలోనే ఇలాంటి సదుపాయాన్ని మొదటిగా తామే అందుబాటులోకి తెచ్చినట్టు వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్కుమార్ సత్పతి తెలిపారు. వాల్తేర్ డివిజన్ ఇప్పటికే స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ వంటి పలు ప్రత్యేక క్రీడాంశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి ఇప్పుడు హార్స్ రైడింగ్ కూడా తోడవడంతో రైల్వే ఉద్యోగులు, నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు గుర్రపు స్వారీ చేయాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కల నెరవేరింది. రైల్వే ఉద్యోగులు, అధికారులు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు నగరవాసులు కూడా రుసుము చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలకు 98124 89786, 98485 92625 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్టు తేజ్ హార్స్ రైడింగ్ స్కూల్ నిర్వాహకుడు షరీఫ్ చెప్పారు. సాధారణంగా పదేళ్ల వయస్సు నుంచి ఎవరైనా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవచ్చని, ఆసక్తి, ఆరోగ్యవంతులైన పిల్లలైతే ఆరేళ్ల నుంచే శిక్షణ తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఇక్కడ 8 గుర్రాలను శిక్షణ కోసం సిద్ధం చేసినట్టు తెలిపారు. రోజూ అరగంట పాటు శిక్షణ ఉంటుందని కోచ్ అబ్బాస్ చెప్పారు. ఇదీ చదవండి: సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి.. ఏపీని ఆదుకోవాలి: వైజాగ్ బహిరంగ సభలో సీఎం జగన్ -
మునుగోడు బైపోల్.. గుర్రంపై వీరభోగ వసంతరాయుడు
ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కొందరు మందీమార్బలంతో వస్తే.. మరికొందరు.. ఇదిగో ఇలా వినూత్నంగా హాజరవుతారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం కుమ్మరిగూడెంకు చెందిన డాక్టర్ వీరభోగ వసంతరాయుడు వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్లో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. శుక్రవారం చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేయడం అందరినీ ఆకర్షించింది. ఇదీ చదవండి: తాటిచెట్టుపై 6 గంటలు తలకిందులుగా.. -
క్యాసినో,ఆన్లైన్ గేమింగ్పై భారీ జీఎస్టీ.. ఎంతంటే!
గేమింగ్ ఇండస్ట్రీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం చివరిలో ఆన్లైన్ గేమింగ్పై ఎంత జీఎస్టీ విధించాలనే అంశంపై ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు,మహారాష్ట్ర ఆర్థిక మంత్రులు,తెలంగాణకు చెందిన రెవెన్యూ అధికారులు ఆన్లైన్ గేమింగ్పై ట్యాక్స్ విధింపును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ మంత్రుల బృందానికి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా నాయకత్వం వహించనున్నారు. దేశంలో బెట్టింగ్, జూదంతో పాటు సరిసమానంగా ఆన్లైన్ గేమింగ్పై పన్ను విధించాలని మంత్రుల ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనల మేరకు 28 శాతం గేమింగ్పై జీఎస్టీ పడనుంది. జీఎస్టీ ఖరారు ఎప్పుడంటే ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీని ఖరారు చేయడానికి ఆర్ధిక మంత్రుల బృందం జూలై 23న బెంగళూరులో భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ప్రతిపాదనను ఫెడరల్ జీఎస్టి కౌన్సిల్ పరిశీలిస్తుంది. దీంతో పాటు ఆన్లైన్ గేమ్లో పెట్టే బెట్టింగ్పై 28 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదనను కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలిస్తుంది. క్యాసినోల విషయంలో, ఎంట్రీ పాయింట్ వద్ద చెల్లించిన మొత్తంపై ట్యాక్స్ విధించాలని నిర్ణయించబడింది. ప్రతిసారి కాకుండా చిప్స్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఈ జీఎస్టీ ఉండనుంది. హార్స్ రైడింగ్లో పందెం మొత్తంపై 28 శాతం జిఎస్టి విధించే ప్రస్తుత పద్ధతి కొనసాగుతుందని ప్రతిపాదించబడింది. -
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
Vaani Kapoor Reveals Her Horse Riding Experience: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ వాణీ కపూర్. నాని నటించిన 'ఆహా కల్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు కమర్షియల్ మూవీస్తోపాటు మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం 'షంషేరా'. రణ్బీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో సోనా అనే పాత్రలో అలరించనుంది వాణీ కపూర్. అయితే ఈ పాత్ర కోసం వాణీ కపూర్ స్పెషల్గా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపింది. గుర్రపు స్వారీ నేర్చుకున్న అనుభవాలను 'షంషేరా' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఇది నాకెంతో ఛాలేంజింగ్ పాత్ర. దీనికోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నా. నా దృష్టిలో గుర్రాలు అత్యంత అందమైన జంతువులు. వాటికి ప్రేమ భాష మాత్రమే తెలుసు. స్వారీ నేర్చుకోవడానికి ముందు వాటితో సన్నిహితంగా ఉండటం, స్నేహం చేయడం, ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడం అవసరం. లేకపోతే అవి మనల్ని విసిరేస్తాయి. అందుకే శిక్షణ సమయంలో నేను వాటికోసం ఆహారం తీసుకొచ్చేదాన్ని. అలా వాటిని మచ్చిక చేసుకుని స్వారీ నేర్చుకున్నా.' అని తెలిపింది వాణీ కపూర్. కాగా కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన 'షంషేరా' చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Meet Sona ✨ Watch how Sona's character came to life.. pic.twitter.com/loe1mbEgUR Shamshera releasing in Hindi, Tamil & Telugu. Celebrate #Shamshera with #YRF50 only at a theatre near you on 22nd July. #RanbirKapoor @duttsanjay @RonitBoseRoy @saurabhshukla_s @karanmalhotra21 @yrf — Vaani Kapoor (@Vaaniofficial) July 9, 2022 -
Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు..
చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మనం ఏం చేసినా అది మనకు తప్పక తిరిగి వస్తుందని భావిస్తుంటారు. ఎవరికైనా మంచి చేసినా లేదా హాని తలపెట్టినా దాని ఫలితం తప్పక అనుభవిస్తామని గట్టిగా నమ్ముతారు. అచ్చం ఇలాగే కొంత మంది తాము చేసిన ఘనకార్యానికి తక్షణ కర్మను ఎదుర్కొన్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్లో మార్చి 28న షేర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో అయిదుగురు వ్యక్తులు దున్నపోతు మీద కూర్చొని రోడ్డు మీద సవారీ చేస్తున్నారు. వీళ్లు రోడ్డుపై బైక్పై, గుర్రం మీద వెళుతున్న మరికొంతమందితో పోటీపడి రైడ్ చేస్తున్నారు. పక్కన వెళుతున్న వారు హారన్లు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తుండటంతో.. దున్నపోతు కూడా వేగంగా వెళ్లాలని దాని మీద ఉన్న వ్యక్తులు దున్నపోతును రెండు దెబ్బలు వేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. చదవండి: భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే.. దెబ్బలు తిన్న దున్నపోతు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కుడివైపుకు తిరిగింది. బండి చక్రాలలో ఒకటి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బండి మీదున్న అయిదుగురు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జంతువులను చిత్ర హింసలు పెడితే తగిన శిక్ష అనుభవిస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు ఇది. కర్మ తిరిగి పొందారు’ అని కామెంట్లు చేశారు. Karma 🙏 (Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO — Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022 -
Anitha Rao: మహిళా ట్రెక్కర్గా.. హార్స్ రైడింగ్, పెయింటింగ్లోనూ.. హ్యాట్సాఫ్!
మురళీనగర్: విశాఖపట్నానికి చెందిన దేవనబోయిన అనితారావు (53)కు సాహసమే ఊపిరి. ఐదు పదులు దాటినా ఆమె పర్వతారోహణ, బైక్ రైడింగ్తో సత్తా చాటుకుంటున్నారు. సాహసయాత్రికురాలిగా, బైక్ రైడర్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. తండ్రి కల్నల్ అర్జునరావు మిలట్రీలో పనిచేశారు. దీంతో ఆమెలోనూ సాహస గుణం అలవడింది. ప్రస్తుతం బీచ్రోడ్డులోని కిర్లంపూడి లేఅవుట్లో బాలాజీ టవర్స్లో ఉంటున్నారు. ఆమె భర్త కమాండర్ వి.రామకృష్ణ నేవీలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తూ యువతకు ఆదర్శగా నిలుస్తున్నారు. మహిళా ట్రెక్కర్గా.. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె ఎంఏ సైకాలజీ చేశారు. నేవీ ఆస్పత్రిలో కొంత కాలం సైకాలజిస్టుగా కౌన్సెలింగ్ సెక్షన్లో పని చేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉంటూనే పెయింటింగ్లో స్పెషల్ కోర్సు చేస్తూ రెగ్యులర్ విద్యార్థిగా విద్యాభ్యాసం చేస్తున్నారు.. 2004నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నారు. దేశంలోని 50కి పైగా పర్వత ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. విశాఖ యూత్ హాస్టల్ తరుఫున బృందాలకు టీమ్ లీడర్గా వ్యవహరిస్తూ అనేక ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. కాశ్మీరులోని సోనామార్గ్లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యుట్లో 2015లో మౌంట్ ఇంజినీరింగు కోర్సు చేసిన ఆమెకు పర్వతారోహణపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఏడాది మే/జూన్ నెలల్లో హిమాలయపర్వతాలకు వెళ్తారు. మౌంటినీరింగులో భాగంగా క్యాంప్ లీడరుగా లడక్లో 21రోజుల పాటు అనేక ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. అత్యధిక పీక్పాయింటుగా అయిన ఒడిశాలోని ఈస్ట్రన్ ఘాట్స్లోని మహేంద్రగిరిని ఆమె అవలీలగా అధిరోహించారు. హార్స్ రైడింగ్లో.. అనితారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్స్ రైడింగులోనూ మంచి ప్రవేశం ఉంది. న్యూఢిల్లీలో 1986లో జరిగిన జాతీయ స్థాయి హార్స్ రైడింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ఆమె నిర్వహించిన మోటారు బైక్ యాత్ర లిమ్కా బుక్ఆఫ్ రికార్డులో నమోదయ్యింది. 2009లో ఢిల్లీ నుంచి హిమాలయపర్వతాల్లో 3000 కిలోమీటర్లు యాత్ర చేశారు. 2011లో మనాలి నుంచి బైక్ యాత్ర చేశారు. దీనికి క్యాంపు లీడరుగా వ్యవహరించారు. ఈ రెండూ లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్లో నమోదయినట్లు ఆమె చెప్పారు. గుజరాత్ నుంచి కేరళ వరకు 3000 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. పెయింటింగ్లోనూ.. పెయింటింగ్లో ఆమె దిట్ట. పెన్సిల్ స్కెచింగ్, వాటర్ కలర్ పెయింగ్స్ వేస్తారు. విశాఖ మ్యూజియంలో, హవామహల్లో నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. -
గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఎమ్మెల్యే వినూత్న ఆలోచన చేశారు. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్ మంగళవారం గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఆమె మాట్లాడుతూ... ప్రతి మహిళలోనూ దుర్గా, జాన్సీరాణీ ఉందన్నారు. ధైర్యంతో మహిళలు ప్రతి సవాల్ను ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని, తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విద్యను అందించాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. చదవండి: ఒక్కరాత్రిలో.. ఆమె జీవితమే మారిపోయింది! #WATCH Congress MLA Amba Prasad rides a horse to Jharkhand Assembly on #InternationalWomensDay2022 There is Durga, Jhansi ki Rani in every woman, she should face every challenge with strength. Parents must educate their daughters as women are doing well in every field,she says. pic.twitter.com/dUAT2kX2BD — ANI (@ANI) March 8, 2022 -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్రపు స్వారీ.. వీడియో వైరల్
సాక్షి, మహబూబ్నగర్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్రంపై స్వారీ చేశారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఆర్బన్ ఎకో పార్క్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీ అకాడమీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం కాసేపు సరాదాగా గుర్రపు స్వారీ చేశారు. దీనికి చెందిన వీడియోను ఆయన తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా KCR ఎకో పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీ అకాడమీని ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/gtASkTSLTQ — V Srinivas Goud (@VSrinivasGoud) February 3, 2022 -
ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే..
బండి ఆత్మకూరు: గుర్రంపై ప్రయాణించడమంటే అదో కిక్కు..దానికి కాసింత ధైర్యం ఉండాలి.. కొన్ని మెలకువలు తెలిసి ఉండాలి. గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన అన్నెం చిన్న వెంకటరెడ్డి ఈ విద్యలో ఆరితేరారు. గుర్రంపై వెనక్కి కూర్చొని కూడా ఈయన స్వారీ చేయగలరు. తండ్రి నుంచి మెలకువలు నేర్చుకుని.. వృద్ధాప్యంలో సైతం అందరినీ ఆశ్చర్య పరుస్తూ చల్చల్ గుర్రం అంటూ దౌడు తీస్తున్నారు. చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి తండ్రే ఆదర్శం.. పూర్వం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు గుర్రాలను వినియోగించేవారు. యుద్ధాల కోసం రాజులు వీటిని ప్రత్యేకంగా పోషించేవారు. మోటారు వాహనాలు రావడంతో క్రమంగా అశ్వాలను వినియోగించేవారు తగ్గారు. గుర్రుపు స్వారీ తెలిసిన వారు కూడా చాలా అరుదుగా ఉన్నారు. అయితే చిన్న వెంకటరెడ్డి తన తండ్రి బాల వెంకటరెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రం మీదనే వెళ్తున్నారు. ఈయన 15 ఏళ్ల వయసులో స్వారీ నేర్చుకుని.. ప్రస్తుతం 71 ఏళ్ల ముదిమిలో అంతే ఉత్సాహంగా అశ్వంపై దౌడు తీస్తున్నారు. జిల్లాలో 100 కిలోమీటర్ల దూరం వరకు గుర్రం పైనే వెళ్తున్నారు. తన గుర్రానికి తెలివి ఎక్కువని, ఎవరైనా తాగుబోతులు దారికి అడ్డంగా వచ్చినా, చిన్నారులు రోడ్డుపై నిల్చున్నా వారి మీదకు వెళ్లదని, వేగాన్ని అదుపు చేసుకుంటుందని చిన్న వెంకట రెడ్డి తెలిపారు. చదవండి: ప్రకృతి అందాల ఖిల్లా.. నల్లమల ఐదు గుర్రాల మార్పు.. వ్యవసాయం చేసే చిన్న వెంకటరెడ్డి ఇప్పటి వరకు ఐదు గుర్రాలను మార్చారు. నందికొట్కూరులో రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దౌడుకు ఆడ గుర్రాలు బాగుంటాయని చెప్పారు. ఎక్కువగా గుర్రపు స్వారీ చేసేవారు పంచకల్యాణిని ఇష్టపడతారని, దాని నుదురు, కాళ్లు, తోక భాగాలు తెలుపు వన్నె కలిగి ఉంటాయన్నారు. ఆ తరువాత స్థానం దేవమణి గుర్రానిదని, దీనికి నుదుటన సుడి ఉంటుందని వివరించారు. గుర్రానికి 101 సుడులు ఉంటాయని, అవి ఉంటే ప్రదేశాన్ని బట్టి వాటి ధర ఉంటుందని చెప్పారు. అలుపు లేకుండా.. ఎంత దూరమైనా ఏ మాత్రం అలుపు లేకుండా గుర్రం మీద వెళ్లవచ్చని వెంకటరెడ్డి తెలిపారు. తన గుర్రంపై ఇద్దరు కూర్చున్నా సాఫీగా వెళుతుందన్నారు. ఆహారంగా పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి కూడా ఇస్తానని తెలిపారు. జొన్నపిండి వేసి నీళ్లు తాపితే సరిపోతుందన్నారు. ఇంతకు మించి గుర్రానికి ఎటువంటి ఖర్చు లేదన్నారు. ఎంత బురద ఉన్నా, మోకాలిలోతుకు పైగా నీళ్లు ఉన్నా.. గుర్రంపై ప్రయాణానికి ఇబ్బంది లేదన్నారు. అశ్వానికి ఆరోగ్య సమస్యలు వస్తే స్థానిక పశువైద్యుని వద్ద చూపిస్తానన్నారు. సహజంగా గుర్రం 15 నుంచి 20 సంవత్సరాల వరకు జీవిస్తుందని చెప్పారు. -
పెట్రోల్ సంక్షోభానికి చక్కటి పరిష్కారం!
బ్రిటన్: అసలే మనదేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిపోతున్నాయి. మొన్నమెన్నటి వరకూ కరోనా మహమ్మారి కారణంగా చాలామంది జీవనోపాధి లేక, వ్యాపాలరాలు సజావుగా సాగక ప్రజలు అల్లాడిపోతుంటే ఈ పెరుగతున్న ధరలు ప్రజల పాలిట శాపంలా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారయ్యింది. మనం పెట్రోల్ కొనడానికి భయపడుతుంటే అందుకు విరుధంగా బ్రిటన్లో ఉంది. అక్కడ పెట్రోల్ దొరకడమే కష్టంగా ఉంది. (చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు షాక్.. ఆ కంటెంట్ ఉంటే నిషేధమే..!) అంతేకాదు అక్కడి ప్రజలు పెట్రోల్ సంక్షోభంతో అల్లాడిపోతున్నారు. ఈ మేరకు పెట్రోల్ బంక్ల వద్ద జనం పెద్ద ఎత్తున్న బారుల తీరి ఉంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవలసిన అవసరం లేదు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం పై నిరసనలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది నిరసన కారులు నీళ్ల బాటిళ్లతో పెట్రోల్ బంక్లను నింపడం, దాడి కచేయడం వంటి పలురకాల పనులతో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో గస్ లీ డాల్ఫిన్ అనే వ్యక్తి గుర్రంపై స్వారీ చేసుకుంటూ పెట్రోట్ బంక్ దగ్గరకు వచ్చి అటూ ఇటూ వచ్చి పచార్లు చేశాడు. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఒకింత ఆశ్చర్యంతో మాకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదు అన్నట్టుగా అతని వంక విస్మయంతో చూస్తున్నారు. మన పూర్వీకులు ఏవిధంగా అయితే ప్రయాణం చేయటానికీ గుర్రాలు, ఎద్దులు, ఒంటెలు ఉపయోగించేవారో ఆ విధంగా సదరు వ్యక్తి గుర్రపు స్వారితో పెట్రోల్ సంక్షోభానికీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పలు నెటిజన్లు నీ గర్రం హార్స్ పవర్ ఎంత అంటూ చమత్కారంగా ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి మిలియన్స్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టేనా!) -
గుర్రపు బండిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్బంద్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీభవన్ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండి ఎక్కి వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, సీతక్క ఇందులో పాల్గొన్నారు. అయితే అసెంబ్లీ ముందుకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపుబండిలో అసెంబ్లీలోనికి వెళ్లేందుకు వీల్లేదనడంతో కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాలకు ఎలా హాజరు కావాలన్నది తమ ఇష్టమని, తమను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో భట్టి సహా నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రాంగోపాల్పేట పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ కారణంగా సోమవారం జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనలేకపోయారు. స్పీకర్, చైర్మన్ సమాధానం చెప్పాలి: భట్టి పోలీస్స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది సభ్యుల ఇష్టమని, తాము అసెంబ్లీకి హాజరు కాకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని భట్టి అన్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా వెళ్లినా తమను అరెస్టు చేసిన విధానంపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కుల తీర్మానం ఇస్తాం: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ ఆమోదిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్న దానిపై వివరణ ఇవ్వాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. సభకు హాజరుకానివ్వకుండా తమ హక్కులను కాలరాసినందుకు అసెంబ్లీలో, మండలిలో హక్కుల తీర్మానం పెడతామని చెప్పారు. శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎలా రావాలన్న దానిపై నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో స్పీకర్, చైర్మన్లు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని జగ్గారెడ్డి విమర్శించారు. సీతక్క మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే, ప్రజలతో కలిసి పోరాడాల్సిన కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు. -
Viral Video : చీరకట్టులో గుర్రపు స్వారీ
వెబ్డెస్క్: ఒడిషాకు చెందిన మోనాలీసా ఇప్పుడు యూట్యూబ్ సంచలనంగా మారింది. యూట్యూబర్గా ఆమె చేస్తున్న వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తున్నాయి. వెబ్ దునియాలో దుమ్మురేపుతున్నాయి. ఇంతగా ఆమె వీడియోలు సంచనలం కావడానికి కారణం, అందులోని ప్రత్యేకతలు ఏంటో ఓ సారి చూద్దాం.. యూట్యూబర్ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మంది సొంత ఛానళ్లు స్టార్ చేసి వీడియోలు చేస్తున్నారు. అయితే ఇందులో యూనిక్ పాయింట్ ఉన్న ఛానళ్లే నిలదొక్కుకుంటున్నాయి. మోనాలీసా వీడియోల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సంప్రదాయం. అవును సంప్రదాయ దుస్తుల్లో ఆల్మెస్ట్ అడ్వెంచరస్ పనులు చేస్తూ.. వాటిని తన యూట్యూబ్లో పెడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఒడిషా సంప్రదయా పద్దతిలో చీర కట్టి , బొట్టు పెట్టి సాధారణ మహిళలా కనిపిస్తూ... ఆమె రూపొందిస్తున్న వీడియోల్లోని కొత్తదనం ఆకట్టుకుంటోంది. దీంతో మామూలు గృహిణి స్థాయి నుంచి యూట్యూబ్ స్టార్గా ఆమె ఎదిగింది. సంప్రదాయ సాధికారత ఒడిషాలోని జాజ్పూర్ జిల్లా జాహర్ మోనాలీసా సొంతూరు. ఆమె భర్త బద్రి నారాయణ్ భద్ర క్రియేటివ్ వర్కర్. భర్త ప్రోత్సాహంతో సొంత యూట్యూబ్ ఛానల్ని 2016లో ప్రారంభించింది. సంప్రదాయ చీరకట్టులో గుర్రపుస్వారీ చేస్తూ ఆమె అప్లోడ్ చేసిన వీడియోకు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. ఆమె గుర్రపు స్వారీ వీడియోను మహిళా సాధికారతకు చిహ్నాలైన ? లక్ష్మీబాయి, రాణి రుద్రమ, రజియా సుల్తానాలను గుర్తుకు తెచ్చింది. క్లాసిక్ అడ్వెంచర్ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది మోనాలీసా. ముఖ్యంగా సంప్రదాయ చీరకట్టులోనే ఆమె చేసిన ట్రాక్టర్తో పొలం దున్నే వీడియో, ట్రక్ డ్రైవింగ్, బుల్లెట్ డ్రైవింగ్, వోల్వో బస్ డ్రైవింగ్ వీడియోలు లక్షల కొద్ది వ్యూస్ సాధించాయి. క్లాసిక్ ప్లస్ అడ్వెంచర్ ఫ్యూజన్గా నెటిజన్లకు తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె ఛానల్కి 22 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉండగా నెలకు రూ. 1.5 లక్షలు సంపాదిస్త్నుట్లు సమాచారం. వివక్ష రూపుమాపాలనే - మోనాలీసా మహిళలపై సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపాలన్నదే నా లక్క్ష్యం. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తారని చెప్పాలనుకున్నాను. సంప్రదాయబద్ధంగా ఉంటూనే గుర్రపుస్వారీ చేయడంతో పాటు వివిధ వాహనాలను డ్రైవ్ చేయోచ్చని నిరూపించాను. నా ప్రయత్నాలకు నా భర్త సహకారం తోడవటంతో యూట్యూబర్గా మారాను. -
ఫీల్డింగ్లోనే కాదు.. గుర్రపుస్వారీతోను ఇరగదీశాడు
ముంబై: టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్కు పెట్టింది పేరు. మైదానంలో పాదరసంలా కదులుతూ ఎన్నోసార్లు అద్భుతమైన క్యాచ్లు, రనౌట్లు చేశాడు. గతేడాది ఆసీస్తో జరిగిన సిరీస్లో అనూహ్యంగా గాయపడిన జడేజా ఆసీస్తో పాటు ఇంగ్లండ్ సిరీస్కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే తరపున బరిలోకి దిగిన జడ్డూ తన పవరేంటో రుచి చూపించాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 131 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఆరు వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక్క ఓవర్లోనే ఐదు సిక్సులు. ఒక ఫోర్ సహా మొత్తం 37 పరుగులు పిండుకొని చరిత్ర సృష్టించాడు. అంతేగాక సీఎస్కే ఆడిన మ్యాచ్ల్లో కొన్నిసార్లు తన మెరుపు ఫీల్డింగ్ కనబరిచాడు. అయితే లీగ్కు కరోనా సెగ తగలడంతో బీసీసీఐ అనూహ్యంగా ఐపీఎల్ 14వ సీజన్ను రద్దు చేసింది. దీంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్నారు. తాజాగా జడేజా తనకు ఇష్టమైన గుర్రపు స్వారీతో సరదాగా గడిపాడు. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన జడ్డూ.. '' నా రైడింగ్ స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకుంటున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం జడేజా వీడియో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. ఇక జడేజా త్వరలో జరగబోయే ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు సన్నద్ధమవుతున్నాడు. ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన జట్టులో జడేజా చోటు సంపాదించాడు. టెస్టు చాంపియన్షిప్ అనంతరం ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్లోనూ జడేజా ఆడనున్నాడు. ఇక టీమిండియా జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనుంది. తాజాగా బుధవారం జట్టు మొత్తం 14 రోజుల పాటు కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్లో ఉండనుంది. అనంతరం ఇంగ్లండ్కు వెళ్లిన తర్వాత మరో 10రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. ఇక జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా టీమిండియా, కివీస్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్నాయి. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: రిస్క్ తగ్గించుకుంటే మంచిది.. లేకుంటే కష్టమే 'ఆ నెంబర్ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు' View this post on Instagram A post shared by Ravindra jadeja (@ravindra.jadeja) -
వైరల్ : మోడ్రన్ పెళ్లికూతురు
భోపాల్ : ఉత్తరాది పెళ్లి వేడకల్లో సాధారణంగా పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగుతూ మండపానికి చేరుకుంటాడు. అది అక్కడి సాంప్రదాయం కూడానూ. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం ఇందుకు భిన్నంగా పెళ్లి కుమార్తె స్వయంగా గుర్రపు స్వారీ చేస్తూ మండపానికి వచ్చింది. అది కూడా పెళ్లిదుస్తుల్లో కాకుండా మోడ్రన్ దుస్తుల్లో వచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే యువతి వలేచా ఫ్యామిలీలోనే ఏకైక కూతురు. దీంతో చిన్పప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన ఆమె తల్లిదండ్రులు గుర్రంపై స్వారీ చేయాలన్న తమ కూతురి కోరికను కూడా సంతోషంగా నెరవేర్చారు. (ఫోటో గ్రాఫర్ ఓవరాక్షన్.. వరుడి రియాక్షన్: వైరల్) అంతేకాకుండా సమాజంలో ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, అబ్బాయిలకు సరిసమానంగా అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కూతురిపై అపారమైన ప్రేమతో పాటు ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన వలేచా పేరెంట్స్ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక పెళ్లిరోజు గుర్రపు స్వారీ చేసుకుంటూ రావాలన్న తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని వధువు దీపా వలేచా పేర్కొంది. కుటుంబసభ్యుల వల్లే తన కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. (మాధురీ దీక్షిత్ను ఫిదా చేసిన యువతి ) -
బైక్, వ్యాన్ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!
సాధారణంగా ఈ కామర్స్ నుంచి వచ్చే డెలివరీలు బైక్లపై తీసుకొచ్చి కస్టమర్లకు అందిస్తారు ఏజెంట్లు. ఒక వేళ ఆన్లైన్లో బుక్ చేసిన వస్తువు పెద్దదైతే వ్యాన్లో తీసుకొస్తారు. ఇది అందరు ఏజెంట్లు చేసే పనే. అయితే తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన ఓ కశ్మిర్ ఏజెంట్ మాత్రం వెరైటీగా ఆర్డర్లు డెలివరీ చేసి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశాడు. బైక్, వ్యాన్ కాకుండా గుర్రంపై వెళ్లి పార్సిల్ అందజేశాడు. శీతాకాలం కారణంగా జమ్ముకశ్మీర్లో మంచు విపరీతంగా కురుస్తుంది. రహదాలన్నీ మంచుతో కప్పబడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కస్టమర్లకు సమయానికి పార్సిల్ని అందించాలని భావించిన ఓ అమేజాన్ ఏజెంట్కు ఓ చక్కటి ఉపాయం వచ్చింది. రహదారులపై వాహనాలు నడిచేందుకు ఇబ్బందిగా ఉండడంతో గుర్రంపై స్వారీ చేస్తూ... కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాడు. ఫొటో జర్నలిస్ట్ ఉమర్ గనీ ఈ వీడియోను తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. అమేజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ తెలివిని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. కాగా, తనకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టమని అందుకే ఇలా గుర్రంపై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేస్తున్నానని సదరు ఏజెంట్ చెబుతున్నాడు. అలాగే కొందరు అత్యవసరాల కోసం ఆర్డర్లు చేస్తారని, వారికి ఇబ్బంది కలగకుండా ఈ మార్గంలో వెళ్లి సమయానికి వారికి ఆర్డర్లను అందిస్తున్నానని చెప్పారు. Amazon delivery innovation 🐎#Srinagar #Kashmir #snow pic.twitter.com/oeGIBajeQN — Umar Ganie (@UmarGanie1) January 12, 2021 -
యంగ్ టాలెంట్ విభిన్న ఆకాశం
కాసేపు కేఫ్లో పాప్ మ్యూజిక్తో కచేరీ ఇస్తుంది. ఇంకాసేపు ఓ ప్రసిద్ధ బ్రాండ్ కోసం మోడలింగ్ చేస్తుంది. ఆ తర్వాత కిక్ బాక్సింగ్తో దడదడలాడిస్తుంది. థియేటర్ ఆర్టిస్టుగా వేదికపై అదరగొడుతుంది. గుర్రపు స్వారీలో గాలితో పోటీపడుతుంది. తాను కన్న కలలను కళాత్మకంగా మలచుకుని పంతొమ్మిదేళ్ల వయసులో విభిన్న రంగాల్లో రాణిస్తున్న సంజన ఆకాశం హైదరాబాద్లో ఎల్ఎల్బి చేస్తోంది. ఒకేరంగంలో ప్రతిభ చూపితేనే సరైన అవకాశాలు వస్తాయనుకునేవారి ఆలోచనలకు సంజన కళ్లెం వేస్తోంది. విభిన్నరంగాల్లో ప్రతిభను చూపుతూ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న సంజన ఇన్ని కళలను ఎలా సుసాధ్యం చేసుకుంటున్నదో వివరించింది. ‘‘జీవితం ‘కళ’వంతంగా గడవాలంటే ఎక్కడా బోర్ అనిపించకూడదు. మెదడు చురుగ్గా ఉండాలంటే నచ్చిన వాటిని ఇష్టంగా ఎంచుకుంటూనే, నచ్చని వాటితోనూ పోటీ పడాలి. అప్పుడే విజయతీరాలను చేరుకోవచ్చు. నాలో నటి ఉందనే విషయం మూడేళ్ల క్రితం వరకు తెలియదు. ‘మూడేళ్ల క్రితం సమాహార థియేటర్ వర్క్షాప్ చూసినప్పుడు నేనూ వారితో కలిసి పని చేయాలనుకున్నాను. సమాహార థియేటర్ వర్క్షాప్లో పాల్గొని, నటన నేర్చుకున్నాను. ‘పంచ్లైడ్’ అనే బిహారీ హిందీ నాటకంలో చేశాను. ఛాలెంజింగ్గా అనిపించే అందులోని స్త్రీ పాత్ర నన్ను మరిన్ని నాటకరంగ పాత్రల్లో ఒదిగిపోయేలా చేసింది. అప్పటికప్పుడు లైవ్లో ప్రదర్శన ఉంటుంది. ఎంతో నేర్చుకోవచ్చు. ప్రజెంటేషన్, పంక్చువాలిటీ.. అన్నీ థియేటర్ నేర్పిస్తుంది. హుషారు నింపిన పాప్ అండ్ రాక్ ఆరవ తరగతి నుంచి పాప్ అండ్ రాక్ సాంగ్స్ పాడుతూ వచ్చాను. లండన్ ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ టీమ్ మెంబర్స్తోనూ కలిసి వర్క్ చేశాను. ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆల్బమ్స్ విడుదల చేస్తున్నాను. లాక్డౌన్ ముందు వరకు రాక్ అండ్ పాప్ బ్యాండ్స్తో కలిసి షోలు చేసేదాన్ని. లాక్డౌన్ సమయం నా కళల సాధనకు మరింత ఉపయోగపడింది. ప్రొఫెషనల్ వీడియోలు చేయడం, ఆ¯Œ లై¯Œ లో పోస్ట్ చేయడం ద్వారా సోషల్మీడియా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాను. భయం పోగొట్టిన ర్యాంప్వాక్ ‘వేదవస్త్రం’ అనే బ్రాండ్ ఫ్యాబ్రిక్కు మోడలింగ్ చేస్తున్నాను. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. తను బొటిక్ నడుపుతుంది. తను డిజైన్ చేసిన డ్రెస్సులు అమ్మ నా మీద ప్రయోగించేది. అలా మోడలింగ్ వైపు వచ్చాను. ర్యాంప్వ్యాక్ బాగా ఇష్టం. మొదట్లో నలుగురిలోకి వెళ్లాలంటే కొంచెం బెరుకుగా ఉండేది. మోడలింగ్తో ఇప్పుడా భయం పోయింది. సాహసాల స్వారీ కళల నుండి అడ్వంచర్స్ వైపు దృష్టి మొదట్లో టీవీ ప్రోగ్రాముల్లో చూసినప్పుడు మళ్లింది. అమ్మానాన్న అనుమతితో హార్స్రైడింగ్ నేర్చుకున్నాను. అక్కడి ట్రెయినర్ మంచి లాయర్ కూడా. ఆమెలా నేనూ అడ్వకేట్గా రాణించాలనుకున్నాను. అందుకే, లా చదువుతున్నాను. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అవసరమనుకున్నాను. అంతేకాదు, ఆత్మవిశ్వాసానికీ కిక్బాక్సింగ్ బాగా పనిచేస్తుంది. అందుకే, కిక్బాక్సింగ్లో శిక్షణ తీసుకున్నాను. నా వయసువారికి కిక్బాక్సింగ్లో శిక్షణ ఇస్తున్నాను. అటు కళలు .. ఇటు చదువూ థియేటర్ రిహార్సల్స్ ఉన్నప్పుడల్లా, బ్రేక్ టైమ్లో చదువుకోవడానికి స్కూల్ బుక్స్ తీసుకువెళ్లేదాన్ని. అలా ఇటు చదువు, అటు కళలను రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగాను. 14 ఏళ్ల వయసు నుంచి నా గొంతును కాపాడుకోవాలనే ధ్యాస పెరిగింది. దీంతో ఐస్క్రీమ్లు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం మానేశాను. స్కూల్ చదువులో అంతగా రాణించేదాన్ని కాదు. కళలపై ఇంట్రస్ట్ చూపేదాన్ని. దీంతో మా నాన్న రఘునాథ్ నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. అమ్మ భార్గవి నాకు మేకప్ నేర్పించింది. మేకప్ క్లాసులకు కూడా తీసుకెళ్లేది. దీంతో సహనం అబ్బింది’ అని వివరించింది సంజన. మిగతావన్నీ ప్యాషన్. ‘లా’ నా ప్రొఫెషన్ అని వివరించిన సంజన ఇప్పుడు ఎంబీబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన తండ్రి రఘునాథ్ ఆకాశం, తల్లి భార్గవి లు తాను కళల్లో రాణించడానికి ఎంతో సహకారం అందించారని తెలిపిన సంజన తాను పఠించే మంత్రాల గురించి తెలిపింది. మొదటిది చొరవ. రెండవది కఠోర శ్రమ. మూడవది స్థిరత్వం. నాల్గవది సహనం. ఎవరైనా సరే కోరుకున్నది సాధించాలనుకునే వారందరికీ ఇవి మంత్రాల్లా పనిచేస్తాయి. – నిర్మలారెడ్డి -
స్కూబా టెస్ట్ పాసయ్యా!
కొత్త విషయాలు నేర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తున్నారు ప్రణీతా సుభాష్. ఇటీవలే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఇప్పుడు స్కూబా డైవింగ్లో సర్టిఫికేట్ పొందారు. కొన్ని రోజులుగా మాల్డీవుల్లో విహార యాత్రలో ఉన్నారు ప్రణీత. బీచ్ను ఆస్వాదిస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారామె. స్కూబా డైవింగ్ కూడా చేస్తూ కనిపించారు. అయితే స్కూబా డైవింగ్ను సరదాగా కాదు... సీరియస్గా చేయాలనుకున్నారు. అందుకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకుని స్కూబా డైవింగ్లో సర్టిఫికెట్ కూడా పొందారామె. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించి, స్కూబా డైవ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. -
ఇక స్వారీ షురూ!
‘ఈ పాత్ర చేయడం నీవల్ల అవుతుందా?’ అని సవాల్ విసిరే పాత్ర వచ్చినప్పుడు ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి వెనకాడని నటీనటులు ఉంటారు. తాజాగా త్రిష అలాంటి సవాల్నే స్వీకరించారు. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవడం త్రిష ముందు ఉన్న పెద్ద సవాల్. మణితర్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలోని రాణి కుందవై పాత్ర కోసమే ఆమె హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. చెన్నైలోని ఓ హార్స్ రైడింగ్ స్కూల్లో గత నెల 26 నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఐదు రోజుల్లో ‘ఇంట్రో టు హార్స్ బ్యాక్ రైడింగ్’ కోర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత స్వారీ చేయడానికి ఫౌండేషన్ కోర్స్ మొదలుపెట్టారు. ఈ నెల 3 నుంచి 14 వరకూ ఈ కోర్స్ని కూడా విజయవంతంగా పూర్తి చేశారామె. ‘సర్టిఫికెట్ కూడా వచ్చేసింది’ అని ఆనందం వ్యక్తం చేశారు త్రిష. ఇక ఈ సినిమా విశేషాలకు వస్తే.. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులు త్రిషను మరచిపోయి తెర మీద కుందవైనే చూస్తున్నట్లుగా భావించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్ తదితరులు నటిస్తున్నారు. -
చల్ చల్ గుర్రం... చలాకీ గుర్రం
గుర్రం చలాకీదే. గుర్రపు స్వారీ కూడా చలాకీయే. రేసులో చురుకుగా ఉంటే రేసుగుర్రం అవ్వొచు. ఇటీవలే కొందరు కథానాయికలు... గుర్రపు స్వారీ మీద శ్రద్ధ పెట్టారు. ఒకరేమో శరీరాన్ని మరింత ఫిట్గా ఉంచుకోవడం కోసం. మరొకరు తన పాత్రను హిట్ చేయడం కోసం. ఆ విశేషాలు. యువరాణి పాత్రకోసం... ఇటీవల తన కొత్త ఫ్రెండ్ బూని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు త్రిష. బూ అంటే ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న గుర్రం పేరు. త్వరలో చేయబోయే పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు త్రిష. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో నటించనున్నారు త్రిష. ఈ పాత్ర కోసమే ఈ గుర్రపు స్వారీ అని తెలిసింది. మరింత ఫిట్గా... లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఉపయోగిస్తే ప్రణీతా సుభాష్ ఫిట్నెస్ మీద మరింత దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. ‘‘మా ట్రైనర్ నేనేదో సినిమాలో పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నానని అనుకున్నారు. కానీ అదేం కాదని చెప్పాను. హార్స్ రైడింగ్ వల్ల నా ఫిట్నెస్ మరింత మెరుగుపరుచుకోవచ్చు అనుకున్నాను. అందుకే నేర్చుకుంటున్నానని చెప్పాను. నిజంగానే దీని వల్ల నా శరీరం మరింత చురుకుగా ఉంది. ఇదో సరికొత్త అనుభవం’’ అన్నారు ప్రణీత. పదును పెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్కు గుర్రపు స్వారీ వచ్చు. గతంలోనే ఆమె ఈ స్వారీ నేర్చుకున్నారు. అయితే తాజాగా తన ప్రతిభకు మరింత పదును పెడుతున్నారు. లాక్డౌన్లో మళ్లీ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ‘మన భవిష్యత్తు మన దినచర్యలోనే తెలిసిపోతుంది’ అంటూ ఆ ఫోటోలు షేర్ చేశారామె. -
రవీంద్ర జడేజా పోస్ట్ వైరల్
-
ఇక సిద్దం: రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కత్తిసాము, కర్రసాముతో పాటు గుర్రపు స్వారీలో ఎంతటి నిష్ణాతుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీలు చిక్కినప్పుడల్లా ఈ విద్యలను ప్రదర్శిస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ సర్కు ఆనందం కలిగితే మైదానంలో బ్యాట్తోనే కత్తిసాము చేస్తుండటం ఇదివరకు ఎన్నో సార్లుచూశాం. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జడ్డూ తన ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టిపెడుతూనే ఈ మూడింటిపై ఓ లుక్కేస్తున్నాడు. (కరోనా భయం లేదు: స్టేడియానికి 30,000 మంది) ఇప్పటికే ఇంట్లో కత్తిసాము చేసిన వీడియోలను, తన ఫామ్ హౌస్లో గుర్రపు స్వారీ చేసిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను జడేజా ఇన ఇన్స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతడు తీసుకున్న కొత్త గుర్రాన్ని మచ్చిక చేసుకుంటూ స్వారీకి సిద్దం చేస్తున్నాడు. ఈ సందర్భంగా గుర్రపు స్వారీకి సిద్దం అన్నట్లు ఓ కామెంట్ జతచేశాడు. ఇక గుర్రపు స్వారీ చేయడం తన ఆల్టైమ్ ఫేవరేట్ అంటూ గతంలో రవీంద్ర జడేజా పేర్కొన్న విషయం తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న మాజీ క్రికెటర్) -
గుర్రపు స్వారీ చేసిన ఎమ్మెల్యే కొడుకు
సాక్షి, బెంగళూరు : "ఊరందరిదీ ఓ దారైతే ఉలిపికట్టది ఓ దారి" అనే సామెత ఇప్పుడు చెప్పుకునే వ్యక్తికి సరిగ్గా సూటవుతుంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దు, చీటికీమాటికీ వాహనాలు బయటకు తీయొద్దు అంటూ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వమే తనది అనుకున్నాడో లేక తననెవరూ ఏమీ చేయలేరనుకున్నాడో ఏమో కానీ ఓ ఎమ్మెల్యే కుమారుడు అధికారుల మాటలను పెడచెవిన పెట్టాడు. ఈ నిబంధనలన్నీ సాధారణ జనాలకే కానీ, నాబోటి వాళ్లకు కాదని నిరూపిస్తూ నడిరోడ్డుపై గుర్రం స్వారీ చేశాడు. (నిఖిల్ పెళ్లిపై నివేదిక ఇవ్వండి) వివరాల్లోకి వెళితే కర్ణాటక అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్ కొడుకు భువన్ కుమార్ అటు కరోనాను, ఇటు లాక్డౌన్ను ఏమాత్రం లెక్క చేయకుండా మైసూర్ ఊటీ జాతీయ రహదారిపై గుర్రం స్వారీ చేస్తూ కనిపించాడు. స్వారీ చేస్తున్న సమయంలో ముఖానికి కనీసం మాస్కు కూడా ధరించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యే తనయుడి హంగామా చూసిన జనాలు మండిపడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన అతడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (నోట్లో బాటిల్ మెడలో పాము) -
'కరోనా వెళ్లిపోయాకా ఇద్దరం కలిసి హార్స్ రైడ్ చేద్దాం'
కరోనా వైరస్ బారీన పడి ప్రపంచం అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఆ తాకిడి క్రీడలపై కూడా పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఎప్పుడు బిజీ షెడ్యూల్తో తీరిక తేకుండా గడిపే టీమిండియా ఆటగాళ్లు కరోనా పుణ్యమాని తమకు నచ్చిన పని చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా తనకు ఎంతో ఇష్టమైన హార్స్ రైడింగ్తో రోజులను ఎంజాయ్ చేస్తున్నాడు. జడేజాకు హార్స్ రైడింగ్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీరిక సమయాలలో హార్స్ రైడింగ్లో తన నైపుణ్యతను ప్రదర్శించి ఆ వీడియోనూ ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటాడు. తాజాగా జడ్డూ తన ఇన్స్టాగ్రామ్లో గుర్రాలతో గడిపిన మూమెంట్స్ను షేర్ చేసుకున్నాడు.' నా గురించి తెలుసుకోవటానికి నా గుర్రాలు ఎంతగానో సహయపడుతున్నాయి' అంటూ కాప్షన్ జత చేశాడు. అయితే జడ్డూ పెట్టిన పోస్ట్కు భారత ఓపెనర్ శిఖర్ ధవన్ స్పందించాడు. ' జడ్డూ బాయ్... దేశం కరోనా వైరస్ నుంచి బయటపడ్డాక మనిద్దరం కలిసి జాలీగా హార్స్ రైడింగ్ చేద్దామంటూ' ఫన్నీ పోస్టు షేర్ చేశాడు. కాగా ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ భారత్లో కూడా విజృంబిస్తోంది. ఇప్పటివరకు 4వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 110 దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నియమించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగుస్తుందా లేదా అనేది సందేహంగానే మిగిలింది. కాగా మార్చి 31నుంచి జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 కరోనా ఎఫెక్ట్తో వాయిదా పడింది. (లాక్డౌన్: వీరంతా ఏం చేస్తున్నారో చూశారా?) (‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’) -
రెండు దశాబ్దాల తర్వాత...
న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) ఈవెంట్లో భారత హార్స్ రైడర్ ఫౌద్ మీర్జా అర్హత సాధించాడు. ఈక్వె్రస్టియన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఫౌద్ మీర్జా టోక్యో ఒలింపిక్స్కు అధికారికంగా బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ కోసం 2019 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య కాలంలో కనబరిచిన ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారు. ఫౌద్ మీర్జాకంటే ముందు భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఒలింపిక్స్ ఈక్వె్రస్టియన్ ఈవెంట్లో పాల్గొన్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఇంతియాజ్ అనీస్... 1996 అట్లాంటా ఒలింపిక్స్లో ఐజే లాంబా భారత్ తరఫున ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో బరిలోకి దిగారు. -
‘కిమ్’ కర్తవ్యం?
సియోల్: కొరియన్లకు పవిత్రమైన స్థలం ఉత్తరకొరియాలోని అత్యంత ఎత్తయిన మంచుకొండల మధ్య శ్వేతవర్ణపు అశ్వంపై రాచరికపు ఠీవీని ఒలకబోస్తోన్న ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ చిత్రాలు మీడియాలో హఠాత్తుగా దర్శనమిచ్చాయి. ఆ దేశపు కీలక నిర్ణయాల సమయంలో గతంలో కూడా కిమ్ ఇలాగే చేయడంతో ఈ చిత్రాల వెనుక మతలబేమిటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గోధుమ రంగు పొడవాటి కోటులో మంచుకొండల మధ్య కిమ్ పోజిచ్చిన స్థలం, ఆయన స్వారీ చేస్తోన్న తెల్లటి గుర్రం కిమ్ కుటుంబ రాచరికపు అధికారదర్పాన్ని ప్రదర్శిస్తున్నాయి. 2,750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచుకొండల ప్రాంతానికి కిమ్ రావడం ఇది తొలిసారి కాదు. గతంలో దేశ రాజకీయాలను మలుపుతిప్పే అరుదైన నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ఈ స్థలాన్ని సందర్శించే అలవాటు కిమ్కి ఉంది. మౌంట్ పీక్టూ కిమ్ జాంగ్ ఉన్ తండ్రి నివాస స్థలమే కాకుండా ఉత్తర కొరియా విప్లవంలో ఈ స్థలానికి చారిత్రక ప్రాధాన్యత సైతం ఉన్నట్టు బుధవారం విడుదల చేసిన కెసీఎన్ఏ రిపోర్టు వెల్లడించింది. దక్షిణ కొరియాతో దౌత్య సంబం«ధాలపై ప్రకటన చేయడానికి కొన్ని వారాల ముందు 2017లో నూతన సంవత్సరం సందర్భంగా మౌంట్ పీక్టూని కిమ్ సందర్శించారు. ఆ సందర్భంగా దక్షిణకొరియాతో దౌత్యసంబంధాలకు సంబంధించిన అంశాలను సూచనప్రాయంగా చెప్పారు. అలాగే 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ ఇన్తో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించిన బటన్ ఎప్పుడూ తన టేబుల్పైన సిద్ధంగా ఉంటుందని కిమ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సుదూర లక్ష్యాలను చేరే క్షిపణులను, అణ్వాయుధ పరీక్షలను తలపెట్టబోమన్న కిమ్ వాగ్దానాన్ని ఆయన పునరాలోచించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికాతో ఉత్తరకొరియా చర్చలు ప్రస్తుతం ప్రతిష్టంభనలో ఉన్నవిషయం తెలిసిందే. -
కిమ్ గుర్రపు స్వారీ, కొత్త ఆపరేషన్ కోసమేనా?
సియోల్ : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త ఆపరేషన్కు తెర తీసినట్లు కొరియన్ వార్తాసంస్త బుధవారం వెల్లడించింది. కొరియాలోని అత్యంత ప్రమాదకర పర్వతమైన 'మౌంట్ పయేక్టు'లో కిమ్ సాహోసోపేతమైన గుర్రపు స్వారీ చేశారు. మంచుతో కప్పబడిన పయేక్టు ప్రాంతంలో కిమ్ తెల్లటి గుర్రంపై షికారు చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా కిమ్ వంశస్తులు ఈ పర్వతాన్ని ఎంతో ఆధ్యాత్మికమైన ప్రదేశంగా చూస్తారు. ప్రమాదకరమైన పర్వతంగా పేరు పొందిన పయేక్టులో కిమ్ ధైర్యంగా గుర్రపు స్వారీనీ ఆస్వాదించినట్లు ఆయన సహాయకులు తెలిపారు. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కిమ్ ఇలాంటి సాహసయాత్రలు చేస్తారని సహాయకులు తెలిపారు. గతంలో అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించడానికి ముందు కిమ్ పయేక్టు పర్వతాన్ని సందర్శించారు. 2018లో దక్షిణ కొరియాతో జరిగిన చారిత్రక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు మూన్-జే-ఇన్ను పయేక్టు పర్వత శిఖరానికి తీసుకెళ్లారు. మరి ఈసారి కిమ్ దేనిపై ప్రకటన చేస్తారో అనేది తెలియాల్సి ఉంది. ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ధైర్యంగా నిలబడాలనే ఉద్దేశంలో అధ్యక్షుడు కిమ్ ఇలాంటి సంకేతాలు ఇచ్చారని ఉత్తర కొరియాకు చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
గుర్రపుస్వారీ.. కత్తిసాము
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారు మనసులు దోచుకున్న పాయల్ రాజ్పుత్ ప్రస్తుతం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకుంటున్నారు. ఇదంతా ఆమె లీడ్రోల్లో రూపొందనున్న ‘అరుంధతి 2’ సినిమా కోసం. శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై కోటి తూముల ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా కోటి తూముల మాట్లాడుతూ– ‘‘చారిత్రాత్మక, యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. పెద్ద బడ్జెట్తో, భారీ గ్రాఫికల్ చిత్రంగా రూపొందనుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ పనులు హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందులో పాయల్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్కి చెందిన ప్రముఖ తారలు నటిస్తారు. కథాంశంలో భాగంగా పాయల్ గుర్రపుస్వారీ, కత్తిసాము శిక్షణ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద తీసుకుంటోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం’’ అన్నారు. -
ప్రభాస్ గుర్రం.. పరుగు తీస్తే పతకమే
సంధించిన బాణంలా దూసుకుపోతుంది. పరుగుల వేట ప్రారంభిస్తే పతకాలు కొల్లగొట్టి తీరుతుంది. అభినందనల నీరాజనాన్ని అందుకుంటుంది. ఆ పంచకల్యాణి కోసం జన సందోహం తరలి వస్తుంది. గుర్రాలంటే అమితాసక్తి ఉండేవారు కొందరు.. గుర్రాలను సాకుతూ పోటీల్లో విజేతగా నిలిచేవారు ఇంకొందరు. రెండో కోవకు చెందుతాడు అలమండ సంతకు చెందిన పి.శ్రీనివాసరాజు పోటీకెళ్తే బహుమతి ఖాయం చిన్నప్పటి నుంచి గుర్రాలంటే మక్కువ ఉన్న శ్రీనివాసరాజు.. వాటిని కొనుగోలు చేసి పెంచడం ప్రారంభించాడు. గుర్రాల స్వారీ కూడా నేర్చుకున్నాడు. గ్రామాల్లో జాతరలు, తీర్థాలు జరిగితే గుర్రాపు పందాలు నిర్వహిస్తున్నాడు. ఏ పందాలకు వెళ్లినా అతని గుర్రాలు మొదటి, ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. గుర్రాలపై మక్కువతోనే రాజస్థాన్, కర్ణాటక, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లి గుర్రాలను కొని పెంచుతున్నాడు. ప్రస్తుతం శ్రీనివాసరాజు వద్ద 5 గుర్రాలున్నాయి. బాహుబలి గుర్రం కొనుగోలు బాహుబలి చిత్రంలో ప్రభాస్ స్వారీ చేసిన గుర్రాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. ప్రస్తుతం బాహుబలి గుర్రం కూడా అతని వద్దే ఉంది. ఒక్కొక్క గుర్రాన్ని రూ.లక్ష నుంచి రూ.లక్ష 50 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరలు, తీర్థ మహోత్సవాలు, గ్రామదేవత ఉత్సవాలకు గుర్రాపు పందాలపై ఆసక్తి పెరిగింది. దీంతో గుర్రపు పందాలను తిలకించడానికి భారీగా వస్తున్నారు. శ్రీనివాసరాజు గుర్రాలు ఏ పోటీలకు వెళ్లినా ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలుస్తున్నాయి. అతని గుర్రాలు సుమారు 30 పోటీల్లో పాల్గొని విశాఖ, తూర్పుగోదావరి, విజయగనరం జిల్లాల్లో జరిగిన గుర్రపు పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం శ్రీనివాసరాజు వద్ద రాణి, చెర్రీ, బాహుబలి, విజిలి, బుల్లెట్రాజా పేర్లున్న గుర్రాలున్నాయి. గుర్రాలకు రోజూ ఉదయం, సాయంత్రం స్వారీపై తర్ఫీదు ఇస్తాడు. రోజు తప్పించి రోజు ఈత కొట్టిస్తాడు. ఎండాకాలంలో రోజూ చల్లని నీటితో స్నానం చేయిస్తాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ వినియోగించిన గుర్రం గుర్రాల ఆహారం రోజూ గుర్రాలకు క్యారెట్, బీట్రూట్, నల్ల ఉలవలు, నువ్వులతో తయారుచేసిన అరిసెలు, కర్జూరం, తాటిబెల్లం, గోధుమలు, పచ్చగడ్డివి పెడతాడు. వాటితోపాటు కాల్షియం టానిక్ ఇస్తాడు. ప్రత్యేక గుర్రపు వైద్య నిపుణుడితో ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తాడు. – జామి (శృంగవరపుకోట) బాల్యం నుంచి మక్కువ చిన్నప్పటి నుంచి గుర్రాలంటే చాలా మక్కువ. ప్రస్తుతం నావద్ద అయిదు గుర్రాలున్నాయి. ఇటీవలే బాహుబలి చిత్రంలో ఉపయోగించిన గుర్రాన్ని కొనుగోలు చేశాను. వీటి పెంపకానికి అధిక వ్యయం అవుతుంది. ఒక్కొక్క గుర్రానికి నెలకు సుమారు రూ.8వేలు అవుతుంది. నా అభిరుచి పదిమందికి ఆనందాన్నివ్వడం సంతోషంగా ఉంది. – పి.శ్రీనివాసరాజుఅలమండ సంత గుర్రపు స్వారీలో నాకు సుమారు 15 ఏళ్ల అనుభవం ఉంది. గుర్రపుస్వారీలపై శిక్షణ కూడా ఇస్తాను. అనేక పందాలకు వెళ్లాను. స్వారీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్రపు స్వారిలో కళ్లెం అతి ప్రధానమైనది. వాహనాలకు గేర్లు మాదిరిగానే కళ్లెం పనిచేస్తుంది.– బద్రీనాథ్, గుర్రపుస్వారి శిక్షకుడు -
వచ్చాడయ్యో సామీ.. గుర్రమెక్కి!
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. అందరిలా సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయడంలో కొత్తదనం ఏముందని అనుకున్నాడో ఏమో ఉత్తరప్రదేశ్లో బాజా భజంత్రీలతో పెళ్లి దుస్తులు వేసుకొని గుర్రమెక్కాడు ఓ అభ్యర్థి. బ్యాండు మేళం.. పెళ్లి ఊరేగింపూ.. దానికి ముందు దుమ్మురేపుతోన్న కుర్రకారు డాన్సులు.. ఇంత హంగామాతో యూపీలోని షాజహాన్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళుతోన్న సంయుక్త్ వికాస్ పార్టీ అభ్యర్థి వైద్ రాజ్ కిషన్ని అధికారులు అడ్డుకున్నారు. సిటీలో అమలులో ఉన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పెళ్లి ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ అభ్యర్థి వెళుతుండడంతో అధికారులు అడ్డగించి గుర్రం నుంచి దింపేశారు. ‘ఏమిటీ వేషం?’ అని అడిగితే, ఈ రోజు తన పెళ్లి రోజు కావడం వల్ల పెళ్లి దుస్తులైన షేర్వాణీ,తలపాగా ధరించి, గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వెళ్లానని చెప్పారు. ఈ ఊరేగింపుని సదర్బజార్లో అడ్డుకున్న అధికారులు మధ్యలోనే గుర్రం దించేయడంతో, సదరు అభ్యర్థి కలెక్టరేట్కి నడిచి వెళ్లి, నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయితే కిషన్ ఇలా సరికొత్తగానామినేషన్ దాఖలు చేయడం ఇదే కొత్త కాదనీ, 2017లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఈయన గారు ఇలాగే ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే, అప్పుడు చావు ఊరేగింపు మాదిరిగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారట. -
వారెవ్వా.. గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి!
తిరువనంతపురం: ఒకప్పుడు ఆడవారు ఇంటినుంచి అడుగు బయట పెట్టడమే పాపంగా భావించేది సమాజం. కాని ప్రస్తుతం.. కాలం మారింది. తాము ఏ విషయంలోనూ పురుషులకంటే తక్కువ కాదని.. అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూనే ఉన్నారు నేటితరం మహిళలు. పరీక్షకు ఆలస్యమవుతుండటంతో.. పరీక్ష రాయకుంటే సంవత్సరమంతా పడ్డ కష్టం వృథా అవుతుందని భావించిన ఓ బాలిక ఏకంగా గుర్రపు స్వారీ చేసుకుంటూ పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కేరళలోని త్రిశూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్రిశూరు జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రానికి ఒక బాలిక స్కూలు బ్యాగును భుజాన వేసుకుని గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లడం చూపరులను ఆశ్చర్యపరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలికను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్లో చూసిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్ర ట్విటర్ వేదికగా బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘త్రిశూర్లో ఆమె ఎవరికన్న తెలుసా? నాకు ఆమె ఫోటో కావాలి. నా మోబైల్ స్క్రీన్ సేవర్గా ఆమె స్వారీ చేసిన గుర్రం ఫోటోను పెట్టుకుంటా. ఆమె నా దృష్టిలో హీరో. ఆమెను చూస్తే బాలికల విద్య మరింత దూసుకెళుతుందన్న ఆశ కలుగుతోంది’ అని ట్వీట్ చేశాడు. ‘బాలికల విద్య అద్భుతంగా ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమైన ఈ వీడియో వైరల్ కావల్సిన అవసరం ఉంది’ అని మరో ట్వీట్లో ఆనంద్ మహింద్ర పేర్కొన్నారు. -
గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి..
-
గుర్రపు స్వారీపై ముచ్చటపడ్డ గబ్బర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల అనంతరం విశ్రాంతి లభించడంతో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ముచ్చట పడ్డాడు. అనుకున్నదే తడువుగా గుర్రపు స్వారీలోని మెళకువలు తెలుసుకున్నాడు. దీనిలో భాగంగా గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించిన గబ్బర్.. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. తాను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో ధావన్ బ్యాటింగ్లో మెరిసిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో రెండు మ్యాచ్లే జరగ్గా, ధావన్ మొత్తం 117 పరుగులు సాధించాడు. తొలి టీ20లో 76 పరుగులు సాధించిన ధావన్.. మూడో టీ20లో 41 పరుగులు సాధించాడు. కాగా, ఆసీస్తో వన్డే సిరీస్లో ఆకట్టులేకోపోయాడు. మూడు మ్యాచ్ల్లో 18.33 సగటుతో 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇక న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో ధావన్ గాడిలో పడ్డాడు. దాదాపు 47.00 సగటుతో 188 పరుగులు సాధించాడు. ఆ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా ధావన్ నిలిచాడు. త్వరలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో భారత క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి 24వ తేదీన ఇరు దేశాల మధ్య సిరీస్ ఆరంభం కానుంది. ఇందులో రెండు టీ20ల సిరీస్తో పాటు, ఐదు వన్డేల సిరీస్ జరుగనుంది. Jatt Shaunkiyaa tey Shaunk poore karda. #horsebackriding #horseriding #learninghorseriding #tuesdaythoughts #TuesdayMotivation pic.twitter.com/bbGiRmM3ku — Shikhar Dhawan (@SDhawan25) 19 February 2019 -
న్యూ ఇయర్.... న్యూ లెర్నింగ్స్
... అంటున్నారు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ చిత్రం ‘పానిపట్’. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతీసనన్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ వేశారు టీమ్. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నారు అర్జున్. ‘‘గతేడాది డిసెంబర్ చాలా సంతోషంగా గడిచింది. ‘పానిపట్’ సినిమా షూటింగ్లో మళ్లీ పాల్గొంటున్నాను. ఇప్పుడీ సినిమా కోసం గుర్రపుస్వారీని మరింత బాగా నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అర్జున్ కపూర్. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక అర్జున్ కపూర్ వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్తో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. -
బెట్టింగ్లో ఓటమి.. గుండెపోటుతో మృతి
సాక్షి, గుంటూరు(పెదకాకాని) : గుంటూరులో పెదకాకాని రోడ్డులోని హెచ్ఆర్సీ క్లబ్లో విషాదం చోటు చేసుకుంది. గుర్రపు పందేల నిర్వహణ క్లబ్లో బెట్టింగ్ ఆడేందుకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి పెదకాకాని వెళ్లే రోడ్డులో గత కొన్నేళ్లుగా గుర్రపు పందేలు (హార్స్ రేసింగ్ క్లబ్) ఆడుకునే సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రతిరోజూ లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ప్రధాన నగరాలలో నిర్వహించే గుర్రాల పందేలు ఈ క్లబ్లో ఏర్పాటు చేసిన డిస్ప్లేపై కనిపిస్తుంటాయి. తమ డబ్బులను కాయిన్లుగా మార్చుకుని పందేలు కాసుకుంటూ ఉంటారు. తెనాలి తాలూకా చినరావూరు గ్రామానికి చెందిన శ్రీదర్ అలియాస్ రమేష్ గుర్రుపు పందేంలో రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. ఘటనా స్థలానికి పెదకాకాని ఎస్ఐ కె. ఆరోగ్యరాజు సిబ్బందితో చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
స్లో అండ్ స్టడీ
ఉదయాన్నే ఖాళీ ప్లేస్లో రౌండ్స్ కొడుతున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషీ. రన్నింగ్ రౌండ్సా? డ్రైవింగ్ రౌండ్సా? అంటే.. రెండూ కాదు.. గుర్రంపై రౌండ్స్ వేస్తున్నారు. తాజాగా ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ‘‘ఉదయాన్నే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. స్లో అండ్ స్టడీగా నేర్చుకుని ఆ నెక్ట్స్ స్పీడ్ పెంచుతా’’ అని పేర్కొన్నారు హ్యూమా. సడన్గా ఆమె గుర్రపు స్వారీ ఎందుకు నేర్చుకుంటున్నారు? అంటే ‘సైరా’ చిత్రం కోసమనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మిస్తోన్న సినిమా ‘సైరా’. నయనతార కథానాయిక. అమితాబ్, తమన్నా, విజయ్సేతుపతి, సుదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హ్యూమాను సంప్రదించారట. అందుకే క్యారెక్టర్ కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారని టాక్. -
ఛీ.. జీవితం! ఏంది భయ్యా ఇది..
బెంగళూరు: ‘‘ఉద్యోగవేటలో భాగంగా ఎనిమిదేళ్ల కిందట సిటీకి వచ్చాను. మంచి ఉద్యోగమైతే దొరికిందిగానీ, జీవితం నానాటికీ నరకప్రాయంగా తయారైంది. అందుకు మొదటి కారణం ట్రాఫిక్ ఇబ్బందులైతే, రెండోది సాఫ్ట్వేర్ రంగంలో సాగుతోన్న శ్రమదోపిడి. చాలా విసుగెత్తిపోయా. ఏందీ జీవితం? అనిపించేది. అందుకే నిరసనగా గుర్రం మీద ఆఫీసుకొచ్చా. లైఫ్లో ఇంకెప్పుడూ మల్టీనేషన్ కంపెనీలో పనిచేయను...’’ అంటోన్న ఈ టెకీ.. తన వెరైటీ నిరసనతో సోషల్ మీడియా నయా సంచలనంగా మారాడు. పేరు రూపేశ్ కుమార్ వర్మ. బెంగళూరులో ఓ పేరుమోసిన కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ట్రాఫిక్ రద్దీని నిరసిస్తూ ఇలా గుర్రం మీద ఆఫీసుకొచ్చాడు. మరి సంస్థ ఊరుకుందా? గుర్రానికి పార్కింగ్ ప్లేస్ కల్పించిందా? అని అడగొద్దు! లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మనోడిలా వెరైటీ చర్యకుదిగాడు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు నానాటికీ పెరిగిపోతున్నాయని, పరాష్కార మార్గాలను వెదకడంలో వెనుకబడ్డామని ఆవేదన చెందుతోన్న రూపేశ్.. తానీ పనిచేసింది సెన్సెషన్ కోసం కాదని, అయినాసరే పాపులర్ అయిపోవడంతో థ్రిల్ అయ్యానని చెప్పాడు. అతి త్వరలోనే సొంత కంపెనీని ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. తద్వారా దేశంలో నెలకొన్ని సమస్యలు కొన్నింటికైనా పరిష్కారాలు చూపగలననే దీమా వ్యక్తంచేశాడు. ఆటోడ్రైవర్లు, ట్రక్కుడ్రైవర్లకు సైతం యూనియన్లు ఉండగా, సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం సంఘటితం కాకపోవడం శోచనీయమని, ఎంఎన్సీల్లో పనిచేసే భారత టెకీలు.. లైక్మైండెడ్ ఫ్రెండ్స్తో కలిసి స్టార్టప్స్ ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలా ఉద్యోగం చివరిరోజు అశ్వంపై వచ్చిన రూపేశ్ సొంతకంపెనీ పెట్టి పేరు సాధించకముందే సెలబ్రిటీ అయిపోయాడు! -
గుర్రపు స్వారీ...రెడీ
హీరోలకు దీటుగా తాము స్టంట్స్ చేయగలమని నిరూపిస్తున్నారు కొందరు కథానాయికలు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్. ఆమె తన తాజా చిత్రం ‘పానిపట్’ కోసం గుర్రపు స్వారీ సాధన చేస్తున్నారు. అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతీసనన్, కబీర్ బేడి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పానిపట్’. 17వ శతాబ్దంలో జరిగిన మూడో పానిపట్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని బీటౌన్ టాక్. ‘‘హార్స్ రైడింగ్ (గుర్రపు స్వారీ) సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సారి ‘పానిపట్’ సినిమా కోసం సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కృతీసనన్. మహేశ్బాబు హీరోగా నటించిన ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య హీరోగా చేసిన ‘దోచేయ్’ చిత్రాలతో తెలుగు తెరపై మెరిశారు ఈ బ్యూటీ. -
గుర్రంపై ఊరేగాడని..
భిల్వారా : పెళ్లిరోజు గుర్రంపై ఊరేగాడని దళితుడిపై గ్రామస్తులు ప్రతాపం చూపారు. అగ్రవర్ణాలకే పరిమితమైన ఈ సంప్రదాయాన్ని హైజాక్ చేశాడంటూ దళితుడిని బలవంతంగా గుర్రంపై నుంచి కిందకు దించి దారుణంగా కొట్టారు. రాజస్థాన్ రాజధాని జైపూర్కు 250 కిమీ దూరంలోని భిల్వారా జిల్లా గోవర్థనపుర గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికొడుకుపై గ్రామస్తుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు తాము ప్రయత్నించినా పెద్దసంఖ్యలో చేరుకున్న అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయని పోలీసులు తెలిపారు. దళిత యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. పెళ్లి సందర్భంగా ఊరేగింపు నిర్వహించే దళిత పెళ్లికుమారులను అడ్డుకోవడం, వారిపై దాడిచేయడం వంటి ఘటనలు ఉత్తరాది రాష్ట్రాల్లో తరచూ చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఈ ఏడాది మార్చిలో ఓ దళితుడిని గుర్రంపై ఊరేగినందుకు అగ్రవర్ణాలకు చెందిన కొందరు హతమార్చిన ఘటన కలకలం రేపింది. -
మాచవరం మగధీర
రాయవరం (మండపేట) : రాజకుమారుడు గుర్రంపై స్వారీ చేస్తాడని అవ్వాతాతలు కథల్లో చెబుతుంటారు. ఆ మాటలు వింటుంటేనే పిల్లలకు ఎంతో ఉత్తేజం కలుగుతుంది. తామూ గుర్రమెక్కి దౌడు తీస్తున్నట్టు ఊహించుకుంటారు. అలాగే సినిమాల్లో తెరమీద హీరోహీరోయిన్లు గుర్రపు స్వారీ చేస్తుంటే..వారి స్థానంలో తామే స్వారీ చేస్తున్నట్టు భావించి, థ్రిల్లవుతుంటారు. అలాంటిది ఓ పిలగాడు.. ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే గుర్రపు స్వారీ చేస్తూ.. ఎందరికో కలగా ఉండే సరదాను నిత్యకృత్యంగా ఆస్వాదించాడు. ఒకనాటి ఆ బాలుడే రాయవరం మండలం మాచవరానికి చెందిన అంగర శ్రీధర్. ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే.. మాచవరంలో గుర్రపు స్వారీకి కొవ్వూరి వెంకటరెడ్డి(డాబారెడ్డి) పేరు పొందారు. ఆయన చిన్నప్పటి నుంచే గుర్రాలను పెంచడం హాబీగా చేసుకున్నారు. ఆ ఊరికే చెందిన శ్రీధర్ ఆయనను చూసి ఎనిమిదేళ్ల వయస్సు నుంచే గుర్రాలపై స్వారీ చేయడాన్ని అలవాటు చేసుకున్నాడు. గుర్రపు స్వారీపై ఉన్న ఆసక్తితో దాంతో పాటు గత 10 సంవత్సరాలుగా గుర్రాన్ని నియంత్రించడం, దానికి శిక్షణ ఇవ్వడం నేర్చుకున్నాడు. ఇప్పుడు గుర్రాలకు శిక్షణ ఇవ్వడాన్నే ప్రవృత్తిగా స్వీకరించాడు. తనకు అప్పగించిన గుర్రాలను దౌడు తీయించడం, సంజ్ఞల ద్వారా వాటితో కాళ్లు పైకి లేపించడం, సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేయించడం వంటి శిక్షణ ఇస్తున్నాడు. ఇంతవరకూ 15 గుర్రాలకు శిక్షణ.. ఇప్పటి వరకు 15 గుర్రాలకు శిక్షణ ఇచ్చానని శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపాడు. రాజమహేంద్రవరం, కైకవోలు, పెద్దాపురం తదితర గ్రామాల నుంచి గుర్రాలను శిక్షణ నిమిత్తం తెచ్చారని, గుర్రాలపై ఉన్న మమకారంతో ఎటువంటి ఫీజు తీసుకోకుండానే శిక్షణ ఇస్తున్నానని తెలిపాడు. చిన్న వయస్సు నుంచే గుర్రాన్ని నియంత్రించడం, స్వారీ చేయడం వలన ఎటువంటి గుర్రాన్నైనా లొంగదీసుకునే చాకచక్యం, శక్తి అలవాటయ్యాయన్నాడు. తాను ప్రత్యేకించి మూడు గుర్రాలను సాకుతున్నానన్నాడు. -
సన్నీ గుర్రపు స్వారీ.. హల్చల్..!
సాక్షి, చెన్నై: శృంగార తారల్లో నటి సన్నీలియోన్ ప్రత్యేకం అని చెప్పకతప్పదు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ నటనతో తన సత్తా చాటుకుంటోంది. ఈ శృంగార తార ఒక చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తోంది. దీనికి వీరమదేవి అని పేరును ఖరారు చేశారు. హీరో భరత్ నటించిన పొట్టు చిత్రాన్ని తెరకెక్కించిన వీసి.వడివుడయాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమా తమిళంలో తెరకెక్కడం. సన్నీలియోన్ వీరనారిగా నటిస్తున్న ఈ చిత్రం ఆదివారం చెన్నైలో ప్రారంభమైంది. సన్నీ కత్తి పట్టి గుర్రంపై స్వారీ చేసే సన్నివేశాన్ని దర్శకుడు తొలి షాట్గా చిత్రీకరించారు. ఆమె గుర్రంపై స్వారీ చేస్తుంటే ఆమె వెనుక పాతిక మంది గుర్రాలపై వెంటపడే సన్నివేశాలను సూట్ చేశారు. ఆమె చారిత్రక కథా చిత్రంలో నటించడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిత్ర యూనిట్ మాత్రం వాటిని లెక్క చేయకుండా వీరమదేవి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. మరి చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత విడుదల సమయంలో ఎలాంటి సమస్యలను ఈ వీరమదేవి ఎదుర్కొనవలసి వస్తుందో వేచి చూడాలి. పైగా వీరమదేవి చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
మేం చేస్తాం ఇవ్వండి
ఓర్పు, నేర్పు మహిళలకే అధికం. మగవాళ్లది భుజ బలం అనుకుంటే, మగువలది మనోబలం. కొత్త పని, కష్టమైన పని చేయడానికి మగువ ముందొక దారి వేస్తే, ఆ తర్వాత పురుషుడు ఆ దారిలో పయనించిన సందర్భాలు చరిత్రలో అనేకం కనిపిస్తాయి. 1930లలో యు.ఎస్.లో మారుమూల కొండప్రాంతాల వారికి పుస్తకాలు అందుబాటులో ఉండేవి కాదు. పుస్తకం ఉన్న ఇల్లంటే గొప్ప. స్కూళ్లలో కూడా అంతే. గ్రంథాలయం ఉంటే అది గొప్ప స్కూలు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు... ఈ కొండ ప్రాంతాల వారికి పుస్తకాలు సరఫరా చెయ్యడం ఎలా అని చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసి, ఆలోచనలు జరిపారు. మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంతా అన్నారు కానీ.. ఆ కొండల్లోకి, గుట్టల్లోకి, మంచు ప్రదేశాల్లోకి వాహనాలు వెళ్లలేవు. ‘సరే అయితే, గుర్రాలపై పంపిద్దాం’ అన్నారు రూజ్వెల్ట్! చదువుకునే వాళ్ల సంఖ్య తగ్గితే అమెరికా అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ఆందోళన. గుర్రాలైతే సిద్ధంగా ఉన్నాయి. పుస్తకాలూ సిద్ధంగా ఉన్నాయి. మరి గుర్రాలను స్వారీ చేసేవారెవరు? పుస్తకాలను రవాణా చేసేవారెవరు? మొదటైతే మగవాళ్లెవరూ ముందుకు రాలేదు. మగువలే ఉత్సాహంగా వచ్చి ‘మేం చేస్తాం’ అన్నారు! ప్రెసిడెంట్కి సంతోషం వేసింది. గుర్రాలపై స్వారీ చేస్తూ పుస్తకాలు మోసుకెళ్లడం. పాఠశాలలకు ఇవ్వడం. ఇళ్లకు మామూలు పుస్తకాలను చేరవేయడం, వాళ్లు చదివిన పుస్తకాలను తిరిగి తీసుకోవడం, ఎవరైనా పెద్దవాళ్లు చదివి వినిపించ మని కోరితే వారితో కొద్దిసేపు కూర్చొని పుస్తక పఠనం చేయడం.. ఈ బాధ్యతలనన్నింటినీ మహిళలు చక్కగా నిర్వర్తించారు. ‘బుక్ ఉమెన్’ అని వాళ్లకు పేరు. కొండపైన ఉండే కాలనీల్లోకి బుక్ ఉమెన్ వస్తున్నారంటే పండుగ వచ్చినట్లే ఉండేది. 1943 వరకు ఈ గుర్రపు గ్రంథాలయాలు నిరాటంకంగా నడిచాయి. నడవడం కాదు, మహిళలు నడిపించారు. ఆ తర్వాత నిధుల్లేక ఆగిపోయాయి. మహిళలకు అప్పగించిన పని ఏదైనా నిధుల్లేక ఆగిపోవల్సిందే కానీ, నిబద్ధత లేక ఆగిపోయింది ఒక్కటీ కనిపించదు. చరిత్రను తిరగేసి చూడండి. వర్తమానాన్నీ తరచి చూడండి. ఎక్కడా కనిపించదు. దేశాలను ప్రభుత్వాలు నడుపుతాయి. ప్రభుత్వాలను పథకాలు నడుపుతాయి. పథకాలు మహిళలు నడిపితేనే ఫలవంతం అవుతాయి. -
ఏపీలో హైదరాబాద్ రేస్ క్లబ్కు అనుమతి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హైదరాబాద్ రేస్ క్లబ్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కర్నూలులో రేస్ కోర్స్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ రేస్ క్లబ్ ద్వారా గుర్రపు పందేలు, బెట్టింగులు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా హైదరాబాద్ రేస్ క్లబ్ ఆధ్వర్యంలోనే రెండు రాష్ట్రాలోన్లూ ప్రస్తుతం బెట్టింగ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ రేస్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు కూడా. -
సీరియల్ కోసం స్వారీ!
ఫ్రమ్ సిల్వర్ స్క్రీన్ టు స్మాల్ స్క్రీన్కి వెళ్లినంత మాత్రాన తారలు తక్కువైపోరు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఇవాళ టీవీ లేని ఇల్లు ఉందా? చెప్పండి. బిగ్ బి నుంచి మన చిన్న ఎన్టీఆర్ వరకూ ఫామ్లో ఉన్న స్టార్స్ అందరూ టీవీ షోస్ చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ బ్యూటీ సంజన స్మాల్ స్క్రీన్కు అరంగేట్రం చేయనున్నారు. బుజ్జిగాడు మేడిన్ చెన్నై, సత్యమేవ జయతే, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ‘స్వర్ణ ఖడ్గం’ అనే సీరియల్లో నటించనున్నారు. ‘‘ఇండియన్ ఎపిక్ ‘బాహుబలి’ని నిర్మించిన ‘ఆర్కా మీడియా’ సంస్థ ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ సీరియల్ను నిర్మించనున్నారు. టెలివిజన్ టాప్ డైరెక్టర్ యాతా సత్యనారాయణగారు దర్శకుడు. ‘బాహుబలి’కి పని చేసిన వీఎఫ్ఎక్స్ మరియు సీజీ టీమ్ ఈ సీరియల్కు పని చేస్తున్నారు. ‘‘ఇది పీరియాడిక్ సీరియల్ కాబట్టి గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. హీరోయిన్ సెంట్రిక్ సీరియల్. 100కు పైగా ఎపిసోడ్లు ఉన్న ఈ మెగా సీరియల్లో నేను నా డ్రీమ్ రోల్ చేస్తున్నా’’ అని ‘సాక్షి’తో సంజన చెప్పారు. -
ఐఫోన్ X కొన్న ఆనందంలో విచిత్రమైన ఆలోచన
-
ఐఫోన్ X కొన్న ఆనందంలో...
థానే : వార్తల్లో నిలిచేందుకు కొందరు విచిత్రమైన స్టంట్లు చేస్తున్నారు. థానేకు చెందిన పల్లివల్ అనే యువకుడు కూడా అదే దారిని ఎంచుకున్నాడు. గుర్రం మీద బ్యాండ్ మేళంతో ఊరంతా ఊరేగాడు. అయితే అతని చేష్టలకు కారణం లేకపోలేదు. ఐఫోన్ X సొంతం చేసుకోబోతున్న ఆనందమే అతనితో ఆ పని చేయించింది. నైపదా ప్రాంతానికి చెందిన పల్లివల్ ఐ ఫోన్ Xకు ఆర్డర్ ఇచ్చాడు. శుక్రవారం సాయంత్రం దానిని డెలివరీ చేస్తామని షో రూం వాళ్లు చెప్పారు. దీంతో బ్రాండ్ న్యూ ఫోన్ తన చేతికి దక్కుతుందన్న ఆనందంలో విచిత్రమైన ఆలోచన చేశాడు. గుర్రంపై ఐ లవ్ ఐఫోన్ ఎక్స్ అనే బ్యానర్ పట్టుకుని గుర్రం మీద ముందు వెళ్తుంటే.. వెనకాల బాండ్ పార్టీ అతని అనుసరిస్తూ వచ్చింది. అలా హరినివాస్ సర్కిల్లోని షోరూం దాకా ర్యాలీ సాగింది. ఆ హడావుడి చూసి పెళ్లి సందడి అనుకున్నంత వారంతా ఫోన్ కోసమని తెలియగానే వార్నీ యేషాలో అనుకున్నారు. గుర్రం మీద ఉన్న పల్లివల్కు స్టోర్ ఓనర్ అశిష్ థక్కర్ స్వయంగా ఫోన్ అందించి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆపిల్ కంపెనీ ఐఫోన్ 10వ సిరీస్లో భాగంగా వచ్చిన ఫోన్ ప్రారంభ ధర రూ. 89,000 వేల నుంచి గరిష్ఠ ధర రూ. 1,02,000 దాకా పలుకుతోంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా హ్యాపీనెస్ అంటూ ఆ ఫోన్ ఫోటోతో ఓ ట్వీట్ చేయటం విశేషం. Happiness!! #iPhoneX pic.twitter.com/r2cFknpOeU — Abhishek Bachchan (@juniorbachchan) November 4, 2017 ఐఫోన్ X కొన్న ఆనందంలో విచిత్రమైన ఆలోచన -
ప్రాణం తీసిన గుర్రపు స్వారీ సరదా
హైదరాబాద్: గుర్రపు స్వారీ సరదా పాత బస్తీలో ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. బైకుపై వెళుతున్న వారిపై గుర్రం దాడి చేయడంతో హమీద్ షా ఖాన్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. ఖజామ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యులు మైలార్ దేవరపల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో హార్స్ రైడర్ సొహైల్, గుర్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడిరోడ్డుపై హార్స్ రైడింగ్ పోటీలు నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల తరపువారు ఆరోపించారు. మరికొంత యువకులు కూడా హార్స్ రైడింగ్ పందాల్లో పాల్గొన్నారని తెలిపారు. పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు. -
ప్రాణం తీసిన గుర్రపు స్వారీ సరదా
-
కష్టంలోనూ కారుణ్యం!
• ప్రవక్త జీవితం అందులో గొప్పధీశాలి అయిన సురాఖ బిన్ మాలిక్ జూషమ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ఆ ఖ్యాతి తనకే దక్కాలని, వంద ఒంటెల భారీబహుమానాన్ని తానే కొట్టేయాలని తన శక్తిసామర్ధ్యాలన్నిటినీ ఉపయోగించాడు. మెరుపుతీగలాంటి అశ్వాన్ని అధిరోహించి తీరప్రాంతం వైపు దౌడుతీయించాడు. గుర్రపుస్వారీలో ఆరితేరిన సురాఖ ఆరోజెందుకో ఎదురుదెబ్బలు తిన్నాడు. మనసు కీడుశంకించింది. కాని తనకు తానే ధైర్యం చెప్పుకొని పట్టుదలతో ముందుకుసాగాడు. ప్రవక్తవారి ప్రయాణం ఒకరాత్రి, రెండుపగళ్ళు అవిశ్రాంతంగా, నిరాటంకంగా, నిశ్చింతగా సాగింది. తరువాతి రోజు మధ్యాహ్నం వేళ ఎండతీవ్రంగా ఉండడంతో వారు ఓచోట నీడలో ఆగి భోజనాలు ముగించుకొని విశ్రాంతికి ఉపక్రమించారు. అంతలో దక్షిణం వైపునుండి మెరుపువేగంతో ఓ అశ్వధారి రావడాన్ని గమనించిన హ.అబూబక్ర్. ’దైవప్రవక్తా! ఇక మనం దొరికిపోయినట్లే’ అన్నారు కంగారుగా.. కాని ముహమ్మద్ ప్రవక్తముఖంలో ఎలాంటి ఆందోళనా లేదు. ’అబూబక్ర్! కంగారుపడకు. మనకు తోడుగా దేవుడున్నాడు’. అన్నారు ప్రశాంత వదనంతో! శతృవు దగ్గరవుతున్నకొద్దీ డెక్కల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. దుమ్ము ధూళి రేణువులు ఎగిరిపడుతున్నాయి. అశ్వం మరికాస్త దగ్గరయిందో లేదో అకస్మాత్తుగా ఒక్క పల్టీకొట్టింది. అశ్వం ముందరి కాళ్ళు మోకాళ్ళవరకు కూరుకుపొయ్యాయి. ఆ ఊపుకు అశ్వధారి కూడా బోర్లా పడిపోయాడు. ఊబిలో దిగబడినట్లు దిగబడిన గుర్రపుకాళ్ళు ఎంతగింజుకున్నా బయటికి రావడం లేదు. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న సురాఖ కూడా శక్తినంతా కూడదీసుకున్నా పైకి లేవలేక పోతున్నాడు. ఈ దెబ్బతో అతని ధైర్యం జావగారిపోయింది. ఉదయం నుండి తగిలిన ఎదురు దెబ్బలను గురించి ఆలోచిస్తే, అన్నీ అపశకునాలే గోచరించాయి. ఏనాడూ ఓటమి ఎరుగని వాడికి ఈ పరిణామంతో జ్ఞానోదయమైంది. బహుశా తను చేస్తున్నపని దేవునికి ఇష్టంలేదేమో అన్నఆలోచన వచ్చింది. ఓటమిని అంగీకరిస్తూ రెండుచేతులు పైకెత్తి ప్రవక్తను, ఆయన అనుచరులతో ‘అయ్యా.. నేను సురాఖాను. మాలిక్ బిన్ జూషమ్ కొడుకును. నేను మీకు ఎలాంటి హానీ తలపెట్టను. నన్నునమ్మండి. నేను మీతో మాట్లాడాలి’. అని వేడుకున్నాడు. ఆసమయంలో ఎవరైనా ఏంచేస్తారు? తనను చంపడానికి కరవాలం చేతపట్టుకొని బుసలు కొడుతూవచ్చిన శత్రువు కత్తివేటుదూరంలో, దాడిచేయలేని నిస్సహాయ స్థితిలో చతికిల పడి ఉంటే అలాగే వదిలేస్తారా? కత్తికో కండగా చీల్చి కాకులకూ గద్దలకూ వేయరూ..? కాని కారుణ్యమూరి ్తముహమ్మద్ ప్రవక్త(స) శత్రువును కరుణించారు. అతని కోసం ప్రార్థించారు. అప్పుడు ఊబిలో కూరుకుపోయిన గుర్రం పైకి లేచింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
అశ్వ రాజసం
అశ్వం.. శక్తికి, వేగానికి ప్రతీక. కదనరంగంలో అయినా.. రేసు మైదానంలో అయినా దానికదే సాటి. వింటిని విడిచిన బాణంలా దూసుకుపోతుంది. ఈ గుర్రాలు కూడా అంతే.. పైగా వీటికి విద్యార్థుల వేగం తోడైంది. మరి ఊరుకుంటాయా? ఏమో గుర్రం ఎగురవచ్చు.. అన్నట్టు ఎగురుతూ దూకుడు ప్రదర్శించాయి. విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాల ఫుట్బాల్ గ్రౌండ్స్లో బుధవారం గుర్రపు స్వారీ ప్రదర్శన జరిగింది. 2017, జనవరిలో ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో లయోల విద్యార్థులు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయోల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఏపీ కిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సాహస ప్రవృత్తిని వెలికితీసేందుకు గుర్రపు స్వారీ ఎంతో దోహదపడుతుందన్నారు. మానసిక దృఢత్వాన్ని కలిగిస్తుందని చెప్పారు. మరో అతిథి, మూడో అశ్వకదళ కమాండింగ్ అధికారి కర్నల్ ఎస్.ఎల్ బఘేల్ మాట్లాడుతూ గుర్రపుస్వారీ విన్యాసం విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడమే కాకుండా వారిమీద నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. అనంతరం ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు ఎన్సీసీ మొమొంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీజీ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ రెక్స్ ఏంజిలో, డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ మెల్కియెర్, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, అశ్వికదళ ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ సురేష్బాబు, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ వి.చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ (గుణదల) -
గుర్రపుస్వారీలో మిల్కీ బ్యూటీ
గుర్రపు స్వారీ, కత్తిసాములు చేయడానికి కథానాయకులే రిస్క్ తీసుకుంటారనేవారు. అది ఇంతకు ముందు. ఇప్పుడు కథానాయికలు రిస్క్కు రెడీ అంటున్నారు. నటి అనుష్క రుద్రమదేవి చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తిసాము వంటి విద్యల్లో శిక్షణ పొంది నటించారు. దీంతో ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు అబ్బుర పరచాయి. ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా అలాంటి సాహసాలకు సిద్ధమవుతున్నారు. బాహుబలి చిత్రంలో పోరాట యోధురాలిగా,ప్రభాస్ ప్రియురాలిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి ఆ చిత్ర విజయంలో పెద్ద క్రెడిట్ కొట్టేసిన తమన్నా తాజాగా బాహుబలి-2లోనూ అంతగా పేరు తెచ్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారట. బాహుబలికి సీక్వెల్లో తమన్నాకు శత్రువులపై కత్తి దూసే పోరు సన్నివేశాలు చోటు చేసుకుంటాయట. ఆ సన్నివేశాలు సహజంగా ఉండడం కోసం అమ్మడు గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతున్నారు. ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న స్టంట్ కళాకారుడు జిత్తువర్మ వద్ద గుర్రపు స్వారీలో శిక్షణ పొందుతున్నారట. దీని గురించి తమన్నా తెలుపుతూ జూలైనుంచి బాహుబలి-2 చిత్రం కోసం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందన్నారు. అందులో తాను గుర్రంపై వేగంగా స్వారీ చేస్తూ పోరాడే దృశ్యాలు చోటుకున్నాయన్నారు. ఆ సన్నివేశాలు యథార్థంగా ఉండాలన్న భావనతో గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.అంతే కాదు కత్తిసాము పోరాటాల కోసం హాలీవుడ్ స్టంట్ శిక్షకుడు లీ రానున్నారని ఆయన నేతృత్వంలో ఆయన అసిస్టెంట్స్ నుంచి కత్తిసాములో శిక్షణ పొందనున్నట్లు చెప్పారు. బాహుబలి-2 చిత్ర పోరాట సన్నివేశాల్లో డమ్మీ కత్తులను ఉపయోగించినా సహజత్వంగా ఉండాలని బరువైన కత్తులతోనే శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. మొత్తం మీద బాహుబలి-2లో మిక్కీబ్యూటీ అదిరిపోయే వార్ సన్నివేశాలను చూడవచ్చునన్నమాట. -
ఒకవైపు స్వారీ.. మరోవైపు ఫైట్!
పాత్ర డిమాండ్ చేసిన మేరకు స్టార్స్ తమ శరీరాకృతినీ, శారీరక భాషనూ మార్చుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే బరువు పెరగడం, తగ్గడం కోసం ఫిజికల్ వర్కవుట్స్ చేస్తుంటారు. కత్తిసాము, గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు రామ్చరణ్ అలాంటి పని మీదే ఉన్నారు. తమిళ చిత్రం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ ‘ధ్రువ’లో ఆయన నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నా రు. ప్రస్తుతం వెయిట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సైక్లింగ్ చేస్తున్నారు. అలాగే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ చరణ్కి గుర్రపు స్వారీ తెలుసు కదా..మళ్లీ ఎందుకు నేర్చుకుంటున్నట్లు అనుకుంటున్నారా? ఈ చిత్రంలో గుర్రపు స్వారీ చేస్తూ, ఫైట్ చేసే సీన్స్ ఉన్నాయట. దాని కోసం శిక్షణ తీసుకుంటున్నారు. ఇది ఆషామాషీ ట్రైనింగ్ కాదని రామ్చరణ్ సన్నిహితులు పేర్కొన్నారు. అయినప్పటికీ చరణ్ వెనకాడకుండా శిక్షణ తీసుకుంటున్నాడని తెలిపారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
మంత్రిగారు.. గుర్రమె‘క్కారు’!
కల్హేర్: ఖేడ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్రావు సోమవారం బీబీపేటలో గుర్రం ఎక్కి స్వారీ చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు అయితే.. మంత్రి గుర్రం ఎక్కారంటూ పలువురు సరదాగా చర్చించుకున్నారు. -
ఇవి చాలా కాస్ట్ గురూ!
ఆటలు శరీరానికి, మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కానీ కొన్ని ఆటలు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తాయి. ఆడీఆడీ.. అలసిపోవటం వల్ల కాదు. ఆ ఆటల శిక్షణకు.. రిస్క్కు.. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు పెట్టే ఖర్చును చూసి.. ఖాళీ అయ్యే జేబును చూసి..! అలాంటివి కూడా ఉన్నాయా? అనేకదా మీ సందేహం! ఉన్నాయండోయ్. అవేంటో తెలుసుకుందాం. ఈక్వెస్ట్రియన్ గుర్రంపై కూర్చొని స్వారీచేసే ఆట ఇది. అంటే మన గుర్రపు పందేల్లాగా. కాస్ట్లియస్ట్ స్పోర్ట్గా పేరుగాంచింది. ఈ ఆటలో పాల్గొనేందుకు గుర్రాలకు శిక్షణ ఇవ్వటం, వాటిని మేపటం, ఒక చోట నుంచి మరొక చోటుకు తరలించటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఒక్కొక్క గుర్రం ధర సుమారుగా రెండు లక్షల డాలర్లు ఉంటుందంట! అందుకే అతి కొద్ది మంది మాత్రేమ ఈ ఆటలో శిక్షణ తీసుకుంటారు. హాట్ ఎయిర్ బెలూన్ రేసింగ్ యూరప్, అమెరకాల్లో హాట్ ఎయిర్ బెలూన్ రేసింగ్ చాలా ప్రసిద్ధి చెందిన ఆట. అక్కడ నిర్వహించే హాట్ ఎయిర్ బెలూన్ పండుగల్లో కూడా వందలాది బెలూన్స్ను ఎగరవేసి ఫెస్టివల్స్ను ఘనంగా జరుపుకుంటారు. ఒక గంట హట్ ఎయిర్ బెలూన్ రెయిడ్కు గంటకు సుమారు మూడు వందల డాలర్లు చెల్లించాలట. ఒక హాట్ ఎయిర్ బెలూన్ ఖరీదు సుమారుగా 20వేల డాలర్లు ఉంటుంది. దీనిని నడిపేందుకు అవసరమైన శిక్షణకు 1250 నుంచి 3000 డాలర్ల వరకు ఉంటుంది. స్కైజంపింగ్ స్కైజంపింగ్ గేమ్ ఖరీదైనది, ప్రమాదకరమైనది. ఈ ఆటకు కావాల్సిన పరికరాలు 2500 డాలర్లు ఉంటాయి. ఈ ఆటకు తర్ఫీదు పొందేందుకు సంవత్సరానికి లక్ష డాలర్ల వరకు ఖర్చవుతాయి. పెద్దపెద్ద స్పాన్సరు ఉంటే గాని ఈ ఆటకు సరైన శిక్షణ తీసుకోవటం వీలు పడదు. ప్రమాదకరమైంది కాబట్టి బీమా కూడా చెల్లించాల్సి ఉంటుంది. సెయిలింగ్ ఖరీదైన ఆటల్లో సెయిలింగ్ కూడా ఒకటి. శిక్షణకు చాలా ఖర్చవుతుంది. సెయిలింగ్కు ఉపయోగించే ఒక బోటు ఖరీదు సుమారుగా 100 మిలియన్ డాలర్లు ఉంటుందట. అంతే కాకుండా అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేసిన బోటు కేవలం ఆట జరిగినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. మిగిలిన సమయాల్లో వినియోగపడదు. బోటుకు మరమ్మత్తులు, ఇతర ఖర్చులతో దీన్ని నిర్వహణ ఖర్చు బోలెండత అవుతుంది. కార్పొరేట్ స్పాన్సర్లు ఉంటేనే ఈ ఆటలో శిక్షణ తీసుకోవటం సాధ్యపడుతుంది. బాబ్స్లెడ్డింగ్ ఎఫ్ వన్ రేసింగ్లాగా ఇది కూడా చాలా ఖరీదైన ఆట. ఈ ఆట శిక్షణకు, వివిధ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు కార్పొరేట్ స్పాన్సర్లు అవసరం. ఒక్కొక్క బాబ్స్లెడ్ ఖరీదు సుమారు 25,000 వేల డాలర్ల వరకు ఉంటుంది. ఒక బాబ్స్లెడ్ రన్ను నిర్వహించాలంటే మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఇది జట్టుగా ఆడాల్సిన క్రీడ. నలుగురు కలసి ఆడుతారు. కాబట్టి ఖర్చు నాలుగు రెట్లు అవుతుంది. ఫార్ములా 1 రేసింగ్ విదేశాల్లో బాగా క్రేజ్ ఉన్న ఆటల్లో ఫార్ములా వన్ రేసింగ్ ఒకటి. మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ లభిస్తోంది. ఫార్ములా వన్ రేసింగ్కు ఉపయోగించే కారు ఖరీదు చాలా ఎక్కువ. మామూలు వాహనాలకు ఉపయోగించే టైర్లకు బదులు ప్రత్యేకమైన టైర్లు ఈ రేస్ కార్లకు ఉపయోగిస్తారు. ఒక సారి రేస్లో పాల్గొనాలంటే ఒక క్రీడాకారుడు సుమారు రెండు లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు ఈ ఆటలో పాల్గొనే క్రీడాకారులకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తుంటాయి. అందుకే ఈ ఆటను ఆడటం కంటే చూడటమే సో బెటరు! పోలో ఖరీదైన ఆటల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆటకు మంచి శ్రేష్టమైన గుర్రం అవసరం. దానికి శిక్షణ ఇచ్చేందుకు, చూసుకునేందుకు కూడా మనుషులు కావాలి. వారికి జీతాలు ఇవ్వాలి. ఇలా ఎటు చూసినా ఈ ఆట వల్ల ఖర్చు తడిసి మోపుడవుతుంది. టోర్నమెంట్లో పాల్గొనాలంటే కూడా పెద్దమొత్తంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ ఆటకు కూడా స్పాన్సర్లు లేకుంటే శిక్షణ తీసుకోవటం, పెద్దపెద్ద టోర్నమెంట్లలో పాల్గొనటం కత్తిమీద సామే. వింగ్సూటింగ్ ప్రత్యేకంగా తయారుచేసిన ఒకరకమైనసూట్ను ధరించి గాల్లో ఎగిరే క్రీడే.. వింగ్సూటింగ్. ఈ వింగ్సూట్ ఖరీదు 2,500 డాలర్లు ఉంటుంది. ఒక సంవత్సరానికి అద్దెకు తీసుకుంటే 30 వేల డాలర్ల ఖర్చవుతుంది. శిక్షణ తీసుకోవాలంటే ఒక విమానాన్ని అద్దెకు తీసుకోవాలి. పెలైట్కు డబ్బు చెల్లించాలి. స్కైడైవింగ్ ఎలా చేయాలో నిపుణుల ద్వారా ప్రత్యేక తర్ఫీదు పొందాలి. వారికి కూడా ఫీజు చెల్లించాలి. ఇలా..ఈ ఆట శిక్షణకు చాలా ఖర్చవుతుంది. ఇది ప్రమాదకరమైన క్రీడ కాబట్టి కచ్చితంగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. -
గుర్రం కూడా లవ్లో పడిపోయిందేమో!
కథానాయిక సమంతకు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తొలి చిత్రం ‘ఏ మాయ చేశావే’తోనే తిరుగులేని హీరోయిన్ అయిపోయారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారామె. ఆ సంగతలా ఉంచితే... సమంత అందచందాలకు కుర్రాళ్లే కాదు... గుర్రం కూడా ఫ్లాట్ అవుతుందా? విచిత్రంగా ఉంది కదూ...! అసలు విషయంలోకి వద్దాం. విక్రమ్, సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘10 ఎన్రదుకుళ్ల’. ఈ చిత్రంలో ఓ సన్నివేశం కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవాలని దర్శకుడు విజయ్ మిల్టన్ సమంతకు సూచించారు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆమె నేర్చుకోలేకపోయారు. కట్ చేస్తే... ఆ సీన్ చిత్రీకరించే రోజు రానే వచ్చింది. దాంతో ప్రాక్టీస్ చేయకుండానే సమంత సీన్ చేయాల్సి వచ్చింది. పైగా, ఏ గుర్రం మీద అయితే సమంత స్వారీ చేయాలో.. అది ఒక్క ట్రైనర్ తప్ప ఎవరు ఎక్కినా ఊరుకోదట. ఒక్క తన్ను తంతుందట. కానీ, ఆ గుర్రం బాగుండటంతో విజయ్ మిల్టన్ దాన్నే ఫిక్స్ చేశారు. అయితే అది మొండి గుర్రం అని సమంతకు చెప్పలేదు. అసలే ఈ బ్యూటీకి గుర్రాలంటే భయం.. ఇక మొండి గుర్రం అని చెబితే షూటింగ్ చేయరని దర్శకుడు కావాలనే ఆ విషయాన్ని చెప్పలేదు. సమంత గుర్రం ఎక్కుతున్నప్పుడు ఏం జరుగుతుందోనని డెరైక్టర్, ట్రైనర్ భయం భయంగా చూడటం మొదలుపెట్టారు. కానీ, ఆ గుర్రం మొరాయించకపోవడం విశేషం. దాంతో ఆశ్చర్యపోవడం దర్శకుడు, ట్రైనర్ వంతు అయ్యింది. సో.. సమంత అందం చూడగానే గుర్రం కూడా లవ్లో పడిపోయిందేమో! -
ఆరేళ్ల మగధీరుడు..
హైదరాబాద్: చల్చల్ గుర్రం చలాకి గుర్రం అంటూ ఆడుకోవాల్సిన వయసులో ఈ బుడతడు అసలుసిసలైన గుర్రాన్ని దౌడు తీయిస్తున్నాడు. చిన్న వయసులోనే గుర్రపు స్వారీ నేర్చుకుని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లికి చెందిన లక్ష్మయ్య కుమారుడు అనంత్ నాగ్ ఆరేళ్ల వయసులోనే గుర్రపు స్వారీలో ఆరితేరాడు. స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అనంత్ నాగ్కు చిన్నప్పటి నుంచి గుర్రాలు అంటే అమితమైన ఇష్టం.. దాన్ని గుర్తించిన తండ్రి వేసవి సెలవుల్లో గుర్రపు స్వారీలో శిక్షణ ఇప్పించారు. దీంతో ఇలా గుర్రంపై దౌడుతీస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తూ, చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు. -
హర్ట్... నాట్ రిటైర్డ్!
చూస్తుంటే అభిషేక్కపూర్ ‘డ్రీమ్’ ప్రాజెక్ట్ ‘ఫితూర్’ క్యూటీ కత్రినాకు ఓ పీడ‘కల’గా మిగిలిపోయేట్టుంది. గత నెలలో ఈ సినిమా సెట్స్పై గాయపడిన ఈ స్వీటీ... తాజాగా మరోసారి ‘హర్ట్’ అయింది. చిత్రానికి కీలకమైన హార్స్ రైడింగ్ సన్నివేశంలో అమ్మడు పట్టు తప్పి పడిపోయింది. మెడ, వెన్ను భాగంలో గాయాలయ్యాయి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ సీన్తో స్పాట్లో ఉన్నవారంతా షాకయ్యారు. అంతలోనే తేరుకున్న కత్రినా... మళ్లీ గుర్రం ఎక్కి స్వారీ చేసింది. ఓ రోజు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినా.. షూటింగ్కు ప్యాకప్ చెప్పకుండా తనలోని ప్రొఫెషనలిజాన్ని మరోసారి చూపింది. ఇదిలావుంటే... షూటింగ్లతో బిజీగా గడిపేసిన కత్రినా, ఆమె స్టార్ లవర్ రణబీర్ కపూర్ సమ్మర్ హాలిడేస్ను పూర్తిస్థాయిలో ఆస్వాదించేందుకు మాల్దీవ్స్ చెక్కేశారన్నది ఓ ఆంగ్ల పత్రిక కథనం! -
జీవితాంతం ఇలాగే కొనసాగించాలని ఉంది!
గ్లామర్ తారలు.. సాహసనారీమణులుగా సాక్షాత్కరించడం తెలుగు తెరకు కొత్తేం కాదు. ఒకప్పుడు విజయశాంతి ఫైటింగులు మొదలుపెట్టగానే.. మిగతా భామలు కూడా అదే బాట పట్టి తెరపై సాహసాలు చేసేశారు. ఇప్పుడు మళ్లీ తెలుగు తెరపై అదే ట్రెండ్ మొదలైంది. ‘అరుంధతి’తో అనుష్క ఈ ట్రెండ్కి శ్రీకారం చుట్టి, రుద్రమదేవి, బాహుబలి సినిమాల కోసం యుద్ధ విద్యలు ప్రత్యేకంగా అభ్యసించి మరీ షూటింగుల్లో పాల్గొంటుంటే... ఆమెనే అనుసరిస్తూ ‘బాహుబలి’లో కీలక పాత్ర పోషిస్తున్న తమన్నా కూడా యుద్ధ విద్యలు అభ్యసించారు. నయనతార కూడా ఈ మధ్య తాను నటించనున్న ఓ తమిళ చిత్రం కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్న విషయం విదితమే. ఇప్పుడు ఆ జాబితాలోకి సమంత కూడా చేరారు. సమంత.. కొత్తగా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. విక్రమ్ సరసన నటిస్తున్న తమిళ చిత్రంలోనూ, బన్నీకి జోడీగా నటిస్తున్న త్రివిక్రమ్ సినిమాలోనూ హార్స్ రైడింగ్ నేపథ్యంలో సన్నివేశాలున్నాయట. సమంత గుర్రపుస్వారీ నేర్చుకోవడానికి కారణం అదే. ‘‘హార్స్ రైడింగ్ భలే మజాగా ఉంది. ప్రతి రోజూ ఉదయమే గుర్రపు స్వారీ చేస్తున్నాను. దాన్ని ఇలాగే జీవితాంతం కొనసాగించాలని ఉంది’’ అంటూ తన సామాజిక మాధ్యమం ద్వారా సమంత స్వయంగా వెల్లడించారు. -
ఛల్ ఛల్ గుర్రం... కలలో గుర్రం!
స్వప్నలిపి గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు, గుర్రంతో కలిసి ఈత కొడుతున్నట్లు, గుర్రం పరుగెడుతున్నట్లు...ఇలా రకరకాలుగా మీ కలలో గుర్రం ఎప్పుడైనా కనిపించిందా? అలా కనిపించడం వెనకాల ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం... గుర్రం అనేది హుందాతనానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతీక.కలలో గుర్రం కనిపించడం అనేది విస్తృత పరిధిలో సానుకూల ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా స్వాతంత్య్రం, అధికారం, లైంగిన స్వేచ్ఛ తదితర భావాలకు కలలో గుర్రం ప్రతీకగా నిలుస్తుంది. వివిధ సందర్భాలు, సన్నివేశాలను బట్టి కూడా కలల అర్థాలు మారుతుంటాయి. శ్వేత గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే... మీరు ఆర్థికంగా, మానసికంగా ఆనందంగా ఉన్నారని, కుటుంబ బంధాలు గట్టిగా ఉన్నాయని అర్థం. భూమి మీద ఏ వస్తువునైనా తాకి ఉన్నట్టుండి ఆ శ్వేత గుర్రం పడబోయినట్లు కల వస్తే... మీ సుఖసంతోషాల పట్ల మీ శత్రువులో, మిత్ర శత్రువులో ఈర్ష్యాద్వేషాలతో ఉన్నారనేది ఒక అర్థం. రెండోది... సజావుగా సాగుతున్న మీ జీవితంలోకి ఊహించని మార్పు ఏదో వచ్చి, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు రెండో అర్థం. నల్లగుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా కల వస్తే... ఆర్థిక పరంగా మీరు ఉన్నతస్థితిలో, ఏ లోటు లేని స్థితిలో ఉన్నా... మానసికంగా మాత్రం ఎక్కడో అసంతృప్తితో ఉండడాన్ని లేదా జీవనోత్సాహం తగ్గడాన్ని సూచిస్తుంది. వర్తమాన జీవితంలో ప్రతికూల ప్రభావం చూపే గత చేదు జ్ఞాపకాలను కూడా ఈ కల ప్రతిబింబిస్తుంది. గుర్రాలు పోట్లాడుకుంటున్నట్లుగా కల వస్తే... మీ సన్నిహితులతోనో, స్నేహితులతోనో విభేదాల వల్ల కలిగే మానసిక అశాంతిని సూచిస్తుంది. పరుగెడుతున్న గుర్రం వెనకాల పరుగెత్తి దాన్ని అందుకొని సవారీ చేయాలనుకునే కల వస్తే... మీరు లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, రిస్క్ చేస్తున్నారని అర్థం. నీటిలో మీతో పాటు గుర్రం ఈత కొడుతున్నట్లు కల వస్తే... మీరు కోరుకున్నవి నిజమైనట్లు అర్థం. ఇదే కల ఒక వాప్యారస్థుడికి వస్తే వ్యాపారంలో భారీ లాభం గడించబోతున్నట్లు, లేదా గడించినట్లు అర్థం. -
సాహసానికి సై!
ఇప్పటివరకూ అభినయం, అందం... ఈ రెండిటికే ప్రాధాన్యమిస్తూ దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ల దృష్టి ఇప్పుడు సాహసాల మీదకు మళ్లింది. ఇప్పటికే అనుష్క ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల కోసం గుర్రపుస్వారీ, యుద్ధవిద్యలు నేర్చుకొని తెరపై వీరత్వాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నారు. తమన్నా కూడా... ‘బాహుబలి’ కోసం యుద్ధ విద్యలు అభ్యసించారు. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. ఆమె కూడా యాక్షన్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగానే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారామె. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోనున్నారట. తమిళంలో ‘జయం’రవితో ఆమె నటిస్తున్న ‘తని ఒరువన్’ సినిమాలో నయన డైనమిక్ పోలీస్ అధికారిగా నటిస్తు న్నారు. ఈ కసరత్తులన్నీ ఆ పాత్ర కోసమే. అంతేకాక... మాజీ పోలీస్ అధికారి కిరణ్బేడీతో సహా పలువురు మహిళా పోలీసుల్ని స్టడీ చేస్తున్నారట నయన. -
అడవిలో మృగరాజులా..
ఈ బెడ్ వ్యూ చూశారా? ప్రకృతి మధ్య పడక .. పోలే.. అదిరిపోలే.. కనుచూపు మేరకు పచ్చటి అడవి.. రాత్రి పడుకున్నాక.. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే.. కొంచెం దూరంలో ఏనుగులు, ఖడ్గమృగాలు, చీతాలు వంటివి కనిపించినా కనిపిం చొచ్చు. ఈ వినూత్న అనుభవాన్ని పొందాలంటే కెన్యాలోని లాయ్కిపియా కంట్రీలోని లోయిసబా రిసార్ట్కు వెళ్లాల్సిందే. అక్కడి ప్రత్యేకత ఈ స్టార్ బెడ్! ఇక్కడ భూమికి అంతెత్తులో కలపతో చేసిన గుడిసెల్లాంటివి ఉంటాయి. అయితే.. తాము చేసిన ప్రత్యేక రక్షణ చర్యల వల్ల అడవి జంతువులు వంటివి వీటిలోకి ప్రవేశించలేవని రిసార్ట్ మేనేజర్ ఫియోనా చెబుతున్నారు. దగ్గర్లోని డ్యామ్ వద్దకు ఏనుగులు, నీటి ఏనుగులు వంటివి వస్తుంటాయని, గుడిసె బాల్కనీలోంచి చూస్తే.. ఒక్కోసారి కిందనే అడవి కుక్కల వంటివి తచ్చాడుతూ కనిపిస్తాయని అంటున్నారు. ఇదొక్కటే కాదు.. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ట్రెక్కింగ్, హార్స్ రైడింగ్ వంటి ఏర్పాట్లూ ఉన్నాయి. ఒక్క రోజు బస చేయాలంటే రూ.20 వేలు చెల్లించాలి.