huge discounts
-
ఐఫోన్ చవగ్గా కావాలా?
మీకు ఐఫోన్ అంటే ఇష్టమా? చవగ్గా తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. యాపిల్ తాజా మోడళ్ల ఐఫోన్ కొనుగోలు చేయలేని ఐఫోన్ (iPhone) ప్రియుల కోసం ముఖేష్ అంబానీకి చెందిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) ఓ మంచి డీల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ తగ్గింపును అందిస్తోంది.యాపిల్ 2022లో లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ ఐఫోన్ 14 ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్లో అందుబాటులో ఉంది. దీని అసలు రిటైల్ ధర రూ. 54,900 కాగా రిలయన్స్ డిజిటల్ దీనిపై రూ.6,500 తగ్గింపు అందిస్తోంది. ఫ్లాట్ రూ. 6,500 తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్ల ద్వారా ఐఫోన్ 14 రూ. 47,400 లకే పొందవచ్చు. హెచ్ఎస్బీసీ (HSBC) క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 2,000 వరకు అదనంగా 5% తగ్గింపును పొందవచ్చు. దీంతో తుది ధర రూ. 46,400కి తగ్గుతుంది. అంటే మొత్తంగా రూ. 8,500 తగ్గింపు.ఐఫోన్ 14 ఫీచర్లు2022 అక్టోబర్లో రూ. 79,900 బేస్ ధరతో యాపిల్ ఐఫోన్ 14 లాంచ్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో ముఖ్యంగా సేల్ ఈవెంట్ల సమయంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లలో ఐఫోన్ 14 ఒకటి. ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. వెనుకవైపు 12MP డ్యూయల్-కెమెరా, సెల్ఫీ ప్రియుల కోసం డ్రాప్ నాచ్ 12MP ఫ్రంట్ షూటర్ కెమరా ఇందులో ఉన్నాయి.ఇదిలా ఉండగా యాపిల్కు చెందిన తాజా సిరీస్ ఐఫోన్ 16 (iPhone 16). గత ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 16 సిరీస్ను యాపిల్ భారత్లో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 20 నుంచి విక్రయాలు ప్రారంభం కాగా ఊహించినట్లుగానే ఐఫోన్ 16 సిరీస్కు భారత్లో భారీ స్పందన లభించింది. మొదటి రోజే రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. బేస్ మోడల్కు ఐఫోన్ 16 ధరలు రూ.79,900 కాగా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 144,900 వరకు ఉంది. -
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్లో భారీ డిస్కౌంట్స్ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్లో భారీ డిస్కౌంట్స్ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయిన నెక్సన్.ఈవీ, టియాగో.ఈవీ మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. బ్యాటరీ వ్యయాలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. నెక్సన్.ఈవీ ధర రూ.1.2 లక్షల వరకు తగ్గింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.14.49 లక్షలు ఉంది. టియాగో.ఈవీ ధర రూ.70,000 వరకు తగ్గడంతో ఈ మోడల్ రూ.7.99 లక్షల నుంచి లభిస్తోంది. బ్యాటరీ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని పంచ్.ఈవీ ధర నిర్ణయించడంతో తాజాగా ఎటువంటి సవరణ చేయలేదని టాటా మోటార్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ 8 శాతం వృద్ధి చెందింది. అయితే ఈవీ విభాగం 90 శాతం దూసుకెళ్లడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే 2024 జనవరిలో ఈవీ విభాగం ఏకంగా 100%పెరగడం విశేషం. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో భారత్లో 70%పైగా వాటాతో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రస్థానంలో నిలిచింది. -
TS: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై చలాన్ల మొత్తంలో 80 శాతం రాయితీ ఇచ్చింది. అలాగే కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్ల మొత్తంలో 60 శాతం రాయితీని, ఆర్టీసీ డ్రైవర్లకు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీని ప్రకటించింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో రాయితీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంగీకరించడంతో పోలీస్ అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. https://echallan. tspolice.gov.in/publicview/ వెబ్సైట్లో వాహనదారులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్ చలాన్ల విలువ రూ. 800 కోట్లు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఈ–చలాన్లు పెండింగ్లో ఉండగా వాటి విలువ సుమారు రూ. 800 కోట్ల వరకు ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. భారీ రాయితీలు కల్పించడం వల్ల పెండింగ్లో ఉన్న చలాన్లను వాహనదారులు చెల్లిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 30న తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో మెగా జాతీయ లోక్ అదాలత్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై ఇదే తరహాలో ఇచ్చిన డిస్కౌంట్ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు సద్వినియోగం చేసుకోగా జిల్లాల్లోని వాహదారులకు ఈ అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన లేక ఆశించినట్లు వినియోగించుకోలేకపోయారని అధికారులు తెలిపారు. అప్పట్లో సుమారు రూ. 350 కోట్ల మేరకు రాయితీలను ఉపయోగించుకొని వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. రాయితీలు ఇలా.. ద్విచక్ర వాహనాలు,ఆటోలు 80% కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు 60% ఆర్టీసీ డ్రైవర్లు,తోపుడు బండ్లకు..90% -
ఫ్లిప్కార్ట్లో మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి మళ్లీ సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart). మార్చి 11 నుంచి మార్చి 15 వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ను నిర్వహించనుంది. ప్లస్ మెంబర్స్కు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఒక రోజు ముందుగా అంటే మార్చి 10నే అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై కొన్ని డిస్కాంట్ ఆఫర్లను ఫ్లిప్కార్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, నథింగ్ ఫోన్, గూగుల్ పిక్సెల్ తదితర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వీటికి అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉంటాయి. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్పై హైజీనిక్ పానీపూరి వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లపై అత్యధిక డిస్కౌంట్లు ఉండనున్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం.. ఐఫోన్ 14ను రూ.60,009 నుంచి 69,999 లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 14 ప్లస్ కూడా రూ.80 వేల లోపు లభిస్తుంది. రూ.79,999 ధర ఉన్న ఐఫోన్ 14ను ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే రూ.71,999 అందిస్తుండగా బిగ్ సేవింగ్ డేస్ సేల్లో మరింత తగ్గుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లను కూడా కలుపుకుంటే మీకు ఆ ఫోన్ రూ.60 వేల కంటే తక్కువకే వచ్చేస్తుంది. ఇక ఈ మధ్యనే లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.59,999. అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో దీన్ని రూ.50 వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా తక్కువ ధరకు లభించనుంది. అయితే కచ్చితంగా ఎంత అన్నది ఇప్పుడే తెలియదు. ఇదీ చదవండి: Campa Cola: రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్ అలాగే నథంగ్ ఫోన్(1)పై కూడా పెద్ద తగ్గింపే ఉండనుంది. ప్రస్తుతం రూ.27,999 ఉన్న 128 జీబీ వేయియంట్ ఈ సేల్లో బ్యాంకు ఆఫర్లు కూడా కలిపి రూ. 25 వేలకే లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్పై కచ్చితమైన డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించలేదు. ఇంకా మరికొన్ని ఖరీదైన ఫోన్లపై భారీ తగ్గింపులు పొందాలంటే మార్చి 11 వరకూ ఆగాల్సిందే. -
తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!
హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పండుగ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి వాటిని అందిస్తోంది. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! పాత ద్విచక్రవాహనాల ఎక్స్చేంజ్పై భారీగా.. ప్రస్తుతం ఓలా ఎస్1 వేరియంట్పై రూ.2వేలు, ఎస్1 ప్రో వేరియంట్పై రూ.4 వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇక పాత పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 45 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా రూ.6,999 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఓలా కమ్యూనిటీ సభ్యులకు ఓలా కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్, ఎక్సెంటెడ్ వారంటీస్పై 50 శాతం తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లన్నీ మార్చి 8 నుంచి 12 వరకే. ఓలా హోలీ ఆఫర్ల ద్వారా కస్టమర్ల పండుగ ఆనందం మరింత పెరుగుతుందని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సూల్ ఖండేల్వాలా పేర్కొన్నారు. ఓలా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఓలా కేర్ సర్వీసుల్లో ఓలా కేర్, ఓలా కేర్ ప్లస్ అని రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ సర్వీర్, థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్, పంచర్ అసిస్ట్ వంటి సేవలు లభిస్తాయి. ఇక ఓలా కేర్ ప్లస్ విషయానికి వస్తే.. యాన్వల్ కాంప్రెహెన్సిల్ డయాగ్నస్టిక్, ఫ్రీ అంబులెన్స్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్ అండ్ డ్రాప్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. కాగా డీ2సీ(డైరెక్ట్ టు కస్టమర్) సేవలను విస్తరించే పనిలో ఉన్న ఓలా మార్చి 2023 నాటికి అన్ని ప్రధాన నగరాల్లో 500 కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను తెరుస్తోంది. -
ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!
తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే. రూ.80 వేల విలువైన ఐఫోన్ 14ను రూ.14 వేలకే అందిస్తోంది యాపిల్. ఐఫోన్ 14ను ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్లతో యాపిల్ గతేడాది విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.79,999. యాపిల్ స్టోర్ ఎప్పుడో గానీ డిస్కౌంట్లు ఇవ్వదు. కానీ ఐఫోన్ 14పై మాత్రం భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. మొదటి పాత ఫోన్ ఎక్సేంజ్, రెండోది బ్యాంక్ ఆఫర్. వీటిని ఉపయోగించుకుని చాలా తక్కువ ధరకే ఐఫోన్14 కొనుక్కోవచ్చు. అది ఎలాగో చూడండి... అన్ని రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను వినియోగించుకుంటే యాపిల్ స్టోర్లో ఐఫోన్ 14 రూ.14,170 లభిస్తోంది. రూ.79,990 ఉండే ఈ ఫోన్ను యాపిల్ ప్రాథమిక ఆఫర్తో రూ.58,730కు ఉంచింది. ఆ తర్వాత పనిచేసే కండీషన్లో ఉన్న మీ పాత ఫోన్ను ఎక్సేంజ్ చేసుకుంటే గరిష్ట మొత్తంలో ఆఫర్ లభిస్తుంది. ఇక్కడ బయటకు కనిపించని ఒక సీక్రెట్ ఏంటంటే.. పైకి ఎంతో ఆసక్తికరంగా కనిపించే ఈ ఆఫర్ లో కొన్ని లిటిగేషన్ లు కూడా ఉన్నాయి. పాత ఫోన్ అనగానే మనం వాడే ఫోన్ తీసుకెళ్తే దానికి అంతగా విలువ కట్టరు. యాపిల్ ఫోన్లను ప్రతీసారి అప్ డేట్ చేసుకునే కస్టమర్లు కొందరు ఉంటారు. కొత్త మోడల్ వచ్చిన ప్రతీసారి వారు తమ వద్ద ఉన్న మోడల్ ను ఇచ్చి కొత్తది తీసుకుంటారు. అలాగే ఐఫోన్ 14 విషయంలోనూ ఇలాంటి షరతే వర్తిస్తుంది. మీ దగ్గర మంచి కండీషన్ లో ఉన్న ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13 మోడల్ ఉంటే.. దానికి గరిష్టంగా కట్టే విలువ దాదాపు రూ.35 వేలు. ఇక హెచ్డీఎఫ్సీ కార్డ్లతో చెల్లింపులు చేస్తే రూ.7వేలకు పైగా డిస్కౌంట్ వస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే రూ.14,170కే ఐఫోన్ 14 మీ సొంతం అవుతుంది. పైకి సులభంగా అనిపించినా.. షరతులన్నీ చూసుకుంటే.. లాభమా? నష్టమా? వినియోగదారులే నిర్ణయించుకోవాలి. (ఇదీ చదవండి: హైడ్రోజన్తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి) -
శుభవార్త..పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన మహీంద్రా...!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏప్రిల్ నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను మహీంద్రా విడుదల చేసింది. ఎంపిక చేసిన కార్లపై ఈ నెలలో కస్టమర్లు గరిష్టంగా రూ. 81,500 వరకు ఆదా చేసుకోవచ్చును. అయితే ఆఫ్ రోడ్ కార్ థార్, బొలెరో నియో, ఎక్స్యూవీ700 వంటి కార్లపై ఎలాంటి తగ్గింపు లేదు. కాగా ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి. పలు కార్లపై మహీంద్రా అందిస్తోన్న తగ్గింపులు ఇవే..! మహీంద్రా KUV100 NXT మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 20,000 వరకు మొత్తంగా రూ. 61, 055 వరకు కొనుగోలుదారులు ఆదా చేసుకోవచ్చును. దీని ధర రూ.6.15 లక్షల నుంచి రూ.7.81 లక్షల వరకు ఉంది మహీంద్రా బొలెరో మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు ఎక్సేఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్ బోనస్ రూ. 3000, అదనంగా మరో రూ. 6 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. దీని ధరను రూ.8.99 లక్షల నుండి రూ.9.99 లక్షల వరకు ఉండనుంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు ఎక్సేఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్ బోనస్ రూ. 4000, అదనంగా మరో రూ. 15 వేల వరకు, ఇలా మొత్తంగా రూ. 34 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. మహీంద్రా స్కార్పియోను రూ. 13.18 లక్షల నుంచి రూ. 18.14 లక్షల వరకు విక్రయిస్తోంది. మహీంద్రా XUV300 మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,003 వరకు నగదు తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపుతో పాటు అదనంగా రూ. 10 వేల వరకు నగదు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 8.16 లక్షల నుంచి రూ. 13.67 లక్షల వరకు ఉంది. మహీంద్రా అల్టురాస్ మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై కంపెనీ ఏకంగా రూ. 81,500 భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది. అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైనఅదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. మహీంద్రా తన పూర్తి-పరిమాణ SUVని రూ. 28.84 లక్షల నుంచి రూ. 31.84 లక్షల వరకు విక్రయిస్తోంది. మహీంద్రా మరాజ్జో మహీంద్రా మరాజో ఎస్యూవీ బేస్ M2 ట్రిమ్పై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా ఈ ఎమ్పివి ధరను రూ. 12.8 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు నిర్ణయించింది. చదవండి: గుడ్న్యూస్...పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్...! -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్...స్మార్ట్ఫోన్స్,ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలుదారుల కోసం బిగ్ సేవింగ్ డేస్ సేల్ - 2022ను ప్రకటించింది. ఈ సేల్ ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, ఆఫర్స్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు 12 గంటల ముందుగానే బిగ్ సేవింగ్ డేస్ సేవింగ్స్లో పాల్గొనే అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ కల్పిస్తోంది. ఈ సేల్ భాగంగా ఐసీఐసీఐ బ్యాంకుతో కొనుగోలుచేసే ఉత్పత్తులపై 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఇక పలు స్మార్ట్ఫోన్స్ కొనుగోలుపై భారీ తగ్గింపును ప్రకటించింది ఫ్లిప్కార్ట్. శాంసంగ్, రెడ్మీ, షావోమీ, రియల్మీ, మోటరోలా, ఇన్ఫీనిక్స్ కంపెనీల స్మార్ట్ఫోన్స్ కొనుగోలుపై తగ్గింపు వర్తించనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్-2022లో పలు మొబైల్ ఫోన్స్పై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న డీల్స్.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లలోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ సేల్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ఫోన్ రూ. 15, 999కు లభించనుంది. దీని లిస్టెడ్ ధర రూ. 22, 999. ఇదిలా ఉండగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో ఈఎంఐలో కొనుగోలుచేస్తే అదనంగా రూ. 1,000 తగ్గింపున పొందవచ్చును. రెడ్మీ నోట్ 10టీ 5జీ భారత్లో అత్యంత సరసమైన 5G స్మార్ట్ఫోన్లలో రెడ్మీ నోట్ 10టీ 5జీ కూడా ఒకటి. ఈ స్మార్ట్ఫోన్ రూ. 13,999 కు రానుంది. దీని అసలు ధర రూ.16,999. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే...రూ. 1000 వరకు తక్షణ తగ్గింపు కూడా రానుంది. ఈ స్మార్ట్ఫోన్పై ఎక్సేఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ ధర రూ. 19,499 కు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 25,999. పోకో ఎం4 ప్రో 5జీ పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. రూ. 12, 999 అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 16,999 గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్పై ఎక్సేఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ ధర రూ. 19,999కు రానుంది. దీని అసలు ధర రూ. 27, 999. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ రూ. 24,999కు రిటైల్ అవుతోంది. చదవండి: ఫ్లిప్కార్ట్ బంపరాఫర్..! రూ. 60 వేల విలువైన ఐఫోన్ రూ.15 వేలకే..ఇంకా మరెన్నో ఆఫర్స్ -
గుడ్న్యూస్...పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్...!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏప్రిల్ నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను టాటా మోటార్స్ విడుదల చేసింది. Tiago , Tigor , Harrier , Safari వంటి టాటా కార్లపై ఈ నెలలో కస్టమర్లు రూ. 65,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే టాటా మోటార్స్కు చెందిన నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలపై ఎలాంటి ఆఫర్లు లేవు. కాగా ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి. టాటా మోటార్స్ ఆయా కార్లపై అందిస్తోన్న ఆఫర్స్..! ► టాటా మోటార్స్ ఇటీవలే టాటా హారియర్ కొత్త ఎడిషన్ కాజిరంగాను తీసుకొచ్చింది. అయితే ఈ ప్రత్యేక ఎడిషన్పై ఎలాంటి తగ్గింపు ఆఫర్స్ లేవు. హారియర్ అన్ని వేరియంట్లపై రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో సహా గరిష్టంగా రూ. 65,000 వరకు తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. ► టాటా సఫారీ అన్ని మోడళ్లలో రూ. 45,000 వరకు ప్రయోజనాలతో రానుంది. ఈ కారుపై కార్పోరేట్ తగ్గింపు లభించదు. ► టాటా టిగోర్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్బాక్స్తో పనిచేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్పై రూ.21,500 వరకు తగ్గింపుతో అందించబడుతోంది. దాంతో పాటు అదనంగా రూ. 10,000 తగ్గింపు కూడా అందిస్తుంది. టాటా టిగోర్ అన్నీ వేరియంట్లపై రూ. 11,500 కార్పొరేట్ తగ్గింపు లభిస్తాయి. ► టాటా టియాగో కొనుగోలుపై రూ. 31,500 వరకు తగ్గింపును టాటా మోటార్స్ అందిస్తోంది. ఇందులో అన్ని వేరియంట్లకు రూ. 11,500 కార్పొరేట్ తగ్గింపు లభించనుంది. అయితే, సీఎన్జీ వేరియంట్స్పై ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ లేవు. ► టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్పై రూ. 6,000, డీజిల్ నెక్సాన్పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపులను అందిస్తోంది టాటా మోటార్స్. చదవండి: బంపరాఫర్..! కారు కొనుగోలుపై ఏకంగా రూ. లక్షకు పైగా తగ్గింపు..! -
ఫ్లిప్కార్ట్ బంపరాఫర్..! రూ. 60 వేల విలువైన ఐఫోన్ రూ.15 వేలకే..ఇంకా మరెన్నో ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ యాపిల్, శాంసంగ్, గూగుల్, రెడ్మీ వంటి సెకండ్ హ్యాండ్ లేదా రిఫర్బిష్డ్ (Refurbished) స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ రిఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్స్ అతి తక్కువ ధరలకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రిఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేసినట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు కొత్త మొబైల్స్ ధీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. తక్కువ ధరలో ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న పలు రిఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్స్ ఇవే.. యాపిల్ ఐఫోన్ 6ఎస్ రిఫర్బిష్డ్ గోల్డ్ కలర్ ఐఫోన్ 6ఎఎస్ 64జీబీ వేరియెంట్ కేవలం రూ. 10,899కు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్ఫోన్ ధర రూ.49,999 అయితే, ఈ సేల్లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 7 రిఫర్బిష్డ్ యాపిల్ ఐఫోన్ 7 రూ. 14,529 ధరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 59, 999గా ఉంది. గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ 64జిబి ర్యామ్ గల రిఫర్బ్రిష్డ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ రూ. 13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డి+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పిక్సెల్ 3ఏ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ రూ. 10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. చదవండి: హెచ్చరిక..! మీ స్మార్ట్ఫోన్ నుంచి ఈ యాప్స్ను వెంటనే డిలీట్ చేయండి..లేకపోతే..! -
రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు
న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) రెండు మిలియన్ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్కు చెందిన ట్రేడరు విటోల్ ద్వారా రష్యన్ ఉరల్స్ క్రూడాయిల్ను హెచ్పీసీఎల్ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్పీఎల్) కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఉక్రెయిన్ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్ బ్యారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ క్రూడాయిల్కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్లలో సెటిల్మెంట్.. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది. 2020 నుంచే ఒప్పందాలు.. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లో చమురుకు డిమాండ్ 8% అప్ ఈ ఏడాది 5.15 మిలియన్ బీపీడీకి చేరొచ్చని ఒపెక్ అంచనా న్యూఢిల్లీ: మహమ్మారి ప్రభావాల నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది చమురుకు డిమాండ్ 8.2 శాతం మేర పెరగనుంది. రోజుకు 5.15 మిలియన్ బ్యారెళ్లకు (బీపీడీ) చేరనుంది. ఆయిల్ మార్కెట్ నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ ఈ విషయాలు వెల్లడించింది. భారత్లో 2020లో చమురు డిమాండ్ రోజుకు 4.51 మిలియన్ బ్యారెళ్లుగా (బీపీడీ) ఉండగా.. 2021లో 5.61 శాతం పెరిగి 4.76 మిలియన్ బీపీడీకి చేరింది. కరోనా పూర్వం 2018లో ఆయిల్ డిమాండ్ 4.98 మిలియన్ బీపీడీగా, 2019లో 4.99 మిలియన్ బీపీడీగా నమోదైంది. ‘2022లో ఆర్థిక వృద్ధి పటిష్టంగా 7.2 శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్ను వేగంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నందున ఆయిల్కు డిమాండ్ మెరుగుపడవచ్చని భావిస్తున్నాం‘ అని ఒపెక్ నివేదిక పేర్కొంది. డీజిల్, నాఫ్తాకు పరిశ్రమల తోడ్పాటు.. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు, రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం మెరుగుపడుతుండటంతో డీజిల్, ఎల్పీజీ, నాఫ్తాకు డిమాండ్ పెరగగలదని నివేదిక వివరించింది. -
అమెజాన్ బంపరాఫర్..! పలు ఉత్పత్తులపై 60 శాతం తగ్గింపు..!
హోలీ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త 'హోలీ షాపింగ్ స్టోర్' సేల్ను కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్లో భాగంగా కెమెరా, హెడ్ఫోన్స్, స్పీకర్స్, వెయిరబుల్స్, ఇంకా మరెన్నో వాటర్ఫ్రూఫ్ గాడ్జెట్స్పై కొనుగోలుదారులకు 60 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ కార్డులపై అతి తక్కువ ధరలకు ఈఎంఐ ఆప్షన్ను కూడా అందిస్తోంది అమెజాన్. ఈ ఆఫర్ కొన్ని రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. పలు ఉత్పత్తులపై అమెజాన్ అందిస్తోన్న బెస్ట్ ఆఫర్స్..! హెడ్ఫోన్స్ నాయిస్ బడ్స్ వీఎస్103 ఇయర్ బడ్స్ను కేవలం రూ. 1,499కు పొందవచ్చును. బోట్ ఎయిర్డోప్స్ 441 టీడబ్ల్యూఎస్ను రూ. 1,999కు లభించనుంది. స్పీకర్లు జేబీఎల్ గో2 వైర్లేస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్ రూ. 2,184 ధరకు రానుంది. బోట్ స్టోన్ గ్రెనేడ్ స్పీకర్ రూ. 1,499కు లభించనుంది. బోట్ స్టోన్ మార్వెల్ ఎడిషన్ స్పీకర్ రూ. 1,299కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. స్మార్ట్వాచ్ boAt Xtend స్మార్ట్వాచ్ ఈ సేల్లో రూ. 2,999కు రానుంది. Noise ColorFit Pulse Grand స్మార్ట్వాచ్ రూ. 2,699కు లభించనుంది. కెమెరా GoPro HERO10 బ్లాక్ కెమెరా కొనుగోలుదారులకు రూ. 50 వేలకే లభించనుంది. Insta360 ONE R ట్విన్ ఎడిషన్ కెమెరా 5.7K రిజల్యూషన్తో వీడియోల, చిత్రాలను షూట్ చేస్తుంది. H.265 ఎన్కోడింగ్, అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ , AI-ఆధారిత అల్గారిథమ్తో రానుంది. ఇది రూ. 40,499కు అందుబాటులో ఉండనుంది. చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్లాక్! -
అమెజాన్ బంపరాఫర్..! టీవీ, స్మార్ట్ఫోన్స్పై 55 శాతం మేర తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్టీవీలు, స్మార్ట్ఫోన్స్పై భారీ తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులకోసం అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేల్ లైవ్లో ఉంది. ఈ సేల్ మార్చి 14తో ముగియనుంది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ భాగంగా వన్ప్లస్, శాంసంగ్, షావోమీ, రియల్మీ, ఒప్పో, టెక్నో, వంటి స్మార్ట్ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్టీవీ, స్మార్ట్ఫోన్స్ను హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇక స్మార్ట్టీవీలపై ఏకంగా 55 శాతం మేర తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ఇక మొబైల్ యాక్సెసరీస్పై 70 శాతం మేర, వైర్లెస్ హెడ్ఫోన్స్పై 60 శాతం డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఇక ప్రైమ్ మెంబర్స్కు ఏకంగా రూ.20 వేల వరకు బెనిఫిట్స్ రానున్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్: స్మార్ట్ఫోన్స్పై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus 9R(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్ఫోన్పై 15 శాతం తగ్గింపుతో రూ.33,999కు రానుంది. OnePlus 9 Pro(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్ఫోన్పై 12 శాతం తగ్గింపుతో రూ. 56,999 కోనుగోలుచేయవచ్చును. ► OnePlus 9(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్ఫోన్పై 14 శాతం తగ్గింపుతో రూ.42,999. అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్పై ఎలాంటి తగ్గింపు లేనప్పటికీ, స్మార్ట్ఫోన్స్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 16,550 రానుంది. దీంతో ఈ హ్యాండ్సెట్ను రూ. 26,449కే కోనుగోలు చేయవచ్చును. ► Realme Narzo 50A (4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ రూ. 1500 తగ్గింపుతో రూ.11,499కు రానుంది. ► Samsung Galaxy M52 5G 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్పై రూ. 10 వేల తగ్గింపుతో 24,999కు రానుంది. ► Redmi 9A Sport స్మార్ట్ఫోన్పై రూ. 1500 తగ్గింపుతో రూ. 6,999కు రానుంది. Redmi Note 11 స్మార్ట్ఫోన్పై 25శాతం తగ్గింపుతో రూ. 13,499కు రానుంది. ► Tecno Spark 8 Pro స్మార్ట్ఫోన్పై రూ.3500 తగ్గింపుతో రూ. 9999కు రానుంది. Tecno Camon 17 స్మార్ట్ఫోన్పై రూ . 2,000 తగ్గింపుతో రూ. 13,999కు అందుబాటులో ఉంది . అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్: టీవీ మోడళ్లపై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus (32-అంగుళాల) Y-సిరీస్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీను రూ.15,999.కి కొనుగోలు చేయవచ్చు. ► Redmi TV (32-అంగుళాల నుంచి 55-అంగుళాల) స్మార్ట్టీవీలు తగ్గింపు ధరలలో రానున్నాయి. ► Samsung 43-అంగుళాల క్రిస్టల్ 4K సిరీస్ అల్ట్రా HD స్మార్ట్ LED TV రూ. 36,990 లభించనుంది. చదవండి: అమెజాన్ బంపరాఫర్..! ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! -
టాటా మోటార్స్ బంపరాఫర్.. ఈ కార్లపై భారీ తగ్గింపు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. టాటా మోటార్స్ మార్చి నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను విడుదల చేసింది. Tiago , Tigor , Nexon , Harrier , Safari, Altroz వంటి కార్లపై భారీ తగ్గింపును టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి. టాటా హారియర్ టాటా మోటార్స్ అందిస్తోన్న ప్రసిద్ధ ఎస్యూవీల్లో టాటా హారియర్ ఒకటి. ఈ కారు కొనుగోలుపై రూ. 85,000 వరకు విస్తృతమైన తగ్గింపును టాటా అందిస్తోంది . 2021 టాటా హారియర్ మోడల్పై రూ. 60,000 తగ్గింపు రానుంది. ఇందులో రూ. 20,000 నగదు ప్రయోజనాలు లభించనున్నాయి. ఇక 2022 మోడల్పై రూ. 40,000 ఎక్స్చేంజ్ ప్రయోజనాలు కొనుగోలుదారులకు అందిస్తోంది. ఈ రెండు మోడళ్లకు రూ. 25,000 వరకు కార్పొరేట్ తగ్గింపు కూడా వస్తోంది. టాటా హారియర్ ధర రూ. 14.49 నుంచి రూ. 21.70 లక్షలుగా ఉంది (ఎక్స్-షోరూమ్ ధర ). టాటా సఫారి 2021 టాటా సఫారి మోడల్పై రూ. 60,000 వరకు తగ్గింపు రానుంది. టాటా సఫారి 2022 మోడల్పై రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ కారుపై ఎలాంటి కార్పోరేట్ తగ్గింపు రావడం లేదు. టాటా సఫారీ ధర రూ. 14.99 నుంచి రూ. 23.29 లక్షలు గా ఉంది. (ఎక్స్-షోరూమ్). టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్పై కొనుగోలుదారులు రూ. 10,000 వరకు తగ్గింపును పొందవచ్చు. టర్బో పెట్రోల్ వేరియంట్పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు. సాధారణ పెట్రోల్ ఇంజన్ రూ. 7,500 తగ్గింపు రానుంది. మారుతి సుజుకి బాలెనో లేదా హ్యుందాయ్ ఐ20 పోటీగా ఈ కారు నిలుస్తోంది. టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షలుగా ఉంది. (ఎక్స్-షోరూమ్ ధర). టాటా టిగోర్ టాటా మోటార్స్ స్టైలిష్ సెడాన్ టిగోర్ రూ. 35,000 తగ్గింపుతో రానుంది. 2021, 2022 టాటా టిగోర్ మోడల్స్పై వరుసగా రూ. 25,000, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ కారుపై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు కూడా రానుంది. టాటా టిగోర్ ధర రూ. 5.79 నుంచి రూ. 8.41 లక్షలు గా ఉంది (ఎక్స్-షోరూమ్ ధర). టాటా టియాగో టాటా టియాగో కొనుగోలుపై రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటార్స్ . ఇందులో 2021 మోడల్పై రూ. 25వేల వరకు, 2022 మోడల్పై రూ. 20వేల వరకు తగ్గింపు ఉంటుంది.ఈ కారుపై రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు కూడా వర్తిస్తుంది. టాటా టియాగో కారు ధర రూ. 5.19 నుంచి రూ. 7.64 లక్షలుగా ఉంది. (ఎక్స్-షోరూమ్ ధర). టాటా నెక్సాన్ పెట్రోల్/డీజిల్ వేరియంట్ల టాటా నెక్సాన్ రూ. 25,000 వరకు తగ్గింపును పొందుతుంది. 2021 డీజిల్ మోడల్పై కొనుగోలుదారులు రూ. 15,000 తగ్గింపును పొందుతారు. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్పై రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తుంది. కాగా డీజిల్ వేరియంట్పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు రానుంది. టాటా నెక్సాన్ ధర రూ. 7.39 నుంచి రూ. 13.73 లక్షలు గా ఉంది. (ఎక్స్-షోరూమ్ ధర). గమనిక: కార్లపై లభించే తగ్గింపులు, పలు ఆఫర్స్ వివిధ రాష్ట్రాలలో మారుతూ ఉంటాయి. చదవండి: ఎలక్ట్రిక్ మైక్రోబస్ను లాంచ్ చేయనున్న ఫోక్స్వ్యాగన్..! -
క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తాజాగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. హోళీ సందర్భంగా పలు కార్లపై మహీంద్రా భారీ తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా ఆయా మోడల్స్పై ఏకంగా రూ.3.02 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఆయా మోడల్స్పై మహీంద్రా అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! మహీంద్రా KUV100 NXT మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 20,000 వరకు కొనుగోలుదారులకు లభించనుంది. మహీంద్రా XUV300 మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు విలువైన ఉచిత యాక్సెసరీలను అందిస్తోంది. ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియో కారు కొనుగోలుపై ఎటువంటి నగదు తగ్గింపును అందించడం లేదు. అయితే కొనుగోలుదారులు రూ. 15,000 పైగా విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చు. ఈ కారు కొనుగోలుపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15,000 కూడా అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా అల్టురాస్ మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై ఏకంగా రూ. 2.2 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది .దాంతో పాటుగా రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది.అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చును. మహీంద్రా మరాజ్జో మహీంద్రా మరాజో ఎస్యూవీ బేస్ M2 ట్రిమ్పై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, ఇతర ట్రిమ్ వేరియంట్స్పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. వీటితో పాటుగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: సరికొత్త హంగులతో విడుదలైన ఎంజీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు..! -
త్వరపడండి..! మొబైల్, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ జనవరి 7న ప్రారంభమవ్వగా...జనవరి 10 తో ముగియనుంది. సేల్లో భాగంగా పలు స్మార్ట్ఫోన్, టీవీ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్టీవీలపై 48 శాతం వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై 10 శాతం తగ్గింపుతో గరిష్టంగా రూ. 1,000 వరకు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అదనంగా ఆర్నెల్ల స్క్రీన్ రిప్లేస్మెంట్, మూడు నెలల నోకాస్ట్ ఈఎంఐతో పాటుగా రూ. 20 వేల వరకు క్యాష్ బెనిషిట్స్ను పొందవచ్చును. ఈ సేల్ ముగిసిన వెంటనే అమెజాన్ ప్రీమియం ఫోన్ పార్టీ ఈవెంట్ జనవరి 12 మొదలుపెట్టనుంది. ఈ సమయంలో కస్టమర్లు తక్కువ ధరకే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ.5వేల వరకు కూపన్ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..! మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్లో అమెజాన్ అందిస్తోన్న పలు ఆఫర్స్..! ► Mi 11X స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 23,499కు లభించనుంది. Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ఫోన్ను రూ. 19,999కు రానుంది. వీటిపై క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ► Redmi 9A స్మార్ట్ఫోన్ 7,199 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. దీనిపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా రానుంది. ► Samsung Galaxy S20 FE 5G స్మార్ట్ఫోన్ను 46 శాతం తగ్గింపుతో రూ. 39,990కి కొనుగోలు చేయవచ్చు. ► OnePlus 9R స్మార్ట్ఫోన్ రూ. 33,999, వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ 36,999 మరియు వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్ రూ. 54,999 కు రానుంది. ► iQOO Z5ని రూ.21,990కి మరియు iQOO 7 స్మార్ట్ఫోన్ను రూ.27,990కి కొనుగోలు చేయవచ్చు. ► Realme Narzo 50A, Samsung Galaxy M52 5G, OnePlus Nord 2 5G స్మార్ట్ఫోన్లపై రూ. 5,000 వరకు డిస్కౌంట్ కూపన్స్ను అమెజాన్ అందిస్తోంది. ► AmazonBasics 50-అంగుళాల 4K TV 40 శాతం డిస్కౌంట్తో రూ. 32,999కు రానుంది. ► Sony 50-inch 4K UHD Google స్మార్ట్టీవీ 30 శాతం డిస్కౌంట్తో రూ. 77, 990కు లభించనుంది. ► iFFalcon 43-inch 4K UHD స్మార్ట్టీవీ ఏకంగా 48 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ► Redmi TV 32 అంగుళాల HD Smart TVని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ► Mi 40inch Horizon FHD TVని రూ.6000 తగ్గింపుతో రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు. చదవండి: బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! -
బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఆయా ఎస్యూవీ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఆయా మోడళ్లపై సుమారు రూ. 82 వేల వరకు కార్పోరేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, ఎక్సేచేంజ్ బోనస్ను కొనుగోలుదారులకు అందించనుంది. ఈ ఆఫర్ 2022 జనవరి 31 వరకు అందుబాటులో ఉండనుంది. అల్టురాస్, స్కార్పియో, మొరాజో, ఎక్స్యూవీ300, మహీంద్రా కేయూవీ100 ఎన్ఎక్స్టీ, వాహనాలపై ఈ తగ్గింపు వర్తించనుంది. మహీంద్రా ఆయా మోడల్స్పై అందిస్తోన్న ఆఫర్స్..! మహీంద్రా Alturas SUV మహీంద్రా అల్టురాస్ ఎస్యూవీపై గరిష్టంగా రూ. 81, 500 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్బోనస్ రూ. 50,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 11, 500, సుమారు రూ. 20 వేల వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చును. మహీంద్రా కేయూవీ100 నెక్స్ట్ మహీంద్రా కేయూవీ100 నెక్స్ట్పై గరిష్టంగా రూ. 61, 055 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్బోనస్ రూ.20,000 వరకు, కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 3, 000, క్యాష్ డిస్కౌంట్ రూ. 38, 055 కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియోపై గరిష్టంగా రూ. 29, 000 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్ఆఫర్ రూ.10,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 4, 000, సుమారు రూ. 15 వేల వరకు ఇతర ప్రయోజనాలు కొనుగోలుదారులకు లభిస్తాయి. మహీంద్రా మొరాజో మహీంద్రా మొరాజో గరిష్టంగా రూ. 40,200 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్ఆఫర్ రూ.15,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 5,200,క్యాష్ బెనిఫిట్ రూ. 20, 000 కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా ఎక్స్యూవీ300 మహీంద్రా ఎక్స్యూవీ300 గరిష్టంగా రూ. 69, 002 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్ఆఫర్ రూ.25,000 వరకు, కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 4, 500, క్యాష్ బెనిఫిట్స్ రూ. 30,002 వరకు అందబాటులో ఉండనున్నాయి. ► వీటితోపాటుగా మహీంద్రా బోలెరో ఎస్యూవీ కొనుగోలుపై రూ. 13,000; సబ్కాంపాక్ట్ ఎస్యూవీపై రూ. 10, 000 వరకు క్యాష్ బెనిఫిట్స్ను అందిస్తోంది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..! -
న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ పలు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ మోడల్ లైనప్లో అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ కార్లపై లాభదాయకమైన డీల్లను కొనుగోలుదారులకు అందిస్తోంది. ఈ డీల్స్లో భాగంగా నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, ఎఫ్ఓసీ ఉపకరణాలు, కార్పొరేట్ బోనస్లను హోండా అందిస్తోంది. ఆయా కార్లపై హోండా అందిస్తోన్న ఆఫర్స్..! హోండా అమేజ్ డిసెంబర్ 2021లో హోండా కార్లలో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా హోండా అమేజ్ నిలిచింది. న్యూ ఇయర్ ఆఫర్లో భాగంగా రూ. 15,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. ఇందులో కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000గా ఉంది. హోండా సిటీ 5 జనరేషన్ జపనీస్ కార్మేకర్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ హోండా సిటీ మోడల్పై ఏకంగా రూ. 35,596 తగ్గింపుతో రానుంది. క్యాష్ బెనిఫిట్ రూ. 10,000. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, లాయల్టీ బోనస్ రూ. 5,000 కొనుగోలుదారులు పొందవచ్చు. ఎఫ్ఓసీ యాక్సెసరీస్పై సుమారు రూ. 10, 596 ప్రయోజనాలను హోండా అందిస్తోంది. హోండా సిటీ 4 జనరేషన్ హోండా సిటీ 4 జనరేషన్ కారుపై సుమారు రూ. 20వేల వరకు తగ్గింపును హోండా అందిస్తోంది. లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 7,000, హోండా సిటీ కొనుగోలుపై 8,000 కార్పొరేట్ తగ్గింపు రానుంది. హోండా డబ్ల్యూఆర్-వీ ఈ కారు కొనుగోలుపై ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10, 000, లాయల్టీ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ బెనిఫిట్లను రూ. 4,000 అందిస్తోంది. హోండా జాజ్ హోండా జాజ్ కొనుగోలుపై రూ. 33,147 వరకు నగదు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది, ఇందులో క్యాష్ బెనిఫిట్స్ రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, లాయల్టీ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ తగ్గింపు రూ. 4000 వరకు లభిస్తాయి. ఎఫ్ఓసీ యాక్సెరీస్పై రూ. 12,147 మేర ప్రయోజనాలను హోండా అందిస్తోంది. చదవండి: దుమ్ము లేపుతున్న ఈవీ అమ్మకాలు.ఈ ఒక్క ఏడాదిలో 15 ఏళ్ల రికార్డు బద్ధలయ్యేనా? -
యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై భారీ క్యాష్బ్యాక్..!
ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ దిగ్గజం విజయ్ సేల్స్ సరికొత్త ఆఫర్తో ముందుకొచ్చింది. యాపిల్ డేస్ సేల్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను విజయ్ సేల్స్ ప్రకటించింది. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. విజయ్ సేల్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైల్ స్టోర్స్లో ఆఫర్స్ లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లపై రూ. 10 వేల వరకు క్యాష్ బ్యాక్ను కొనుగోలుదారులకు సొంతం చేసుకోవచ్చును. విజయ్ సేల్ ఆఫర్లో అందిస్తోన్న మోడల్స్ ఇవే..! ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 , ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్స్తో పాటుగా మాక్ బుక్ ఎయిర్ (ఎమ్1), మ్యాక్బుక్ ప్రో (ఎమ్1), మ్యాక్బుక్ ప్రో (ఎమ్1 ప్రో) వాటితో పాటుగా ఐప్యాడ్ (2021), ఐప్యాడ్ ఎయిర్ 2020)పై కూడా తగ్గింపు ధరలు అందిస్తోంది. ఎయిర్పాడ్స్(3వ తరం), ఎయిర్పాడ్స్ ప్రో, ఎయిర్ పాడ్ మ్యాక్స్, హోమ్ పాడ్ మినీపై వర్తించనున్నాయి. ఆయా ఐఫోన్లపై రూ. 5000 వేల వరకు క్యాష్బ్యాక్, మ్యాక్ బుక్స్పై రూ. 10 వేల క్యాష్బ్యాక్, ఐపాడ్స్పై రూ. 4 వేల వరకు, యాపిల్ వాచ్స్పై రూ. 3 వేల వరకు, మ్యాగ్సేఫ్పై రూ. 2 వేల వరకు క్యాష్బ్యాక్ను విజయ్ సేల్ అందిస్తోంది. విజయ్ సేల్స్లో ఆయా మోడల్స్ ధరల వివరాలు చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..! -
ఇయర్ ఎండ్ సేల్: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..!
ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీదారు సోనీ ఇయర్ ఎండ్ సేల్ను గురువారం (డిసెంబర్ 16) నుంచి ప్రారంభించింది. ఈ సేల్లో భాగంగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, టీవీలపై భారీ ఆఫర్లను సోనీ ప్రకటించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్ 2022 జనవరి 3 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ఆఫ్లైన్, పలు ఎలక్ట్రానిక్ స్టోర్స్, సోనీ ఆన్లైన్ స్టోర్స్తో పాటుగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా పలు బ్రావియా టీవీలపై 30 శాతం మేర తగ్గింపు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను , రెండేళ్ల వారంటీని కొనుగోలుదారులకు సోనీ అందిస్తోంది. వీటితో పాటుగా వైర్లెస్ ఇయర్బడ్స్, హెడ్ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్పై 60 శాతం మేర తగ్గింపును ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా సోనీ అందిస్తోన్న పలు ఆఫర్లు..! ►Sony Bravia XR-65A8OJ టీవీ కొనుగోలుదారులకు రూ. 2,65,990 కే రానుంది. దీని రిటైల్ ధర రూ. 3,39,900. Sony Bravia KD-55X8OJ మోడల్ టీవీ ధర రూ. 87,390కు రానుంది. దీని అసలు ధర రూ. 1,09,900 గా ఉంది. ►సోనీ WH-1000XM4 హెడ్ఫోన్స్ను కొనుగోలుదారులు రూ. 24,990 కే సొంతం చేసుకోవచ్చును. దీని అసలు ధర రూ. 29,990. సోనీ WH-H910N హెడ్ఫోన్స్పై ఏకంగా 60 శాతం తగ్గింపుతో రూ. 9,990కు రానుంది. దీని అసలు ధర రూ. 24,990 ►సోనీ WH-CH710N హెడ్ఫోన్స్ ధర రూ. 7,990కు, సోనీ WH-XB900N ధర రూ. 9,990 కే కొనుగోలుదారులకు లభ్యమవుతోంది. ►సోనీ వైర్లెస్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్పై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది, సోనీ WF-1000XM3 టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ రూ. 9,990 ధరకు, సోనీ WF-SP800N TWS ఇయర్బడ్స్ ధర రూ. 10,990కు, సోనీ WF-XB700 ధర రూ. 6,990 కు రానున్నాయి. ►సోనీ SRS-XB13 వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్పై రూ. 3,590 కు రానుంది. కంపెనీ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్లపై కూడా తగ్గింపులను అందిస్తోంది, సోనీ WH-CH510 , WI-XB400 మోడల్స్ వరుసగా రూ. 2,990, రూ. 2,790 కే రానుంది. చదవండి: ఏసర్ ల్యాప్ట్యాప్స్పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! -
ఏసర్ ల్యాప్ట్యాప్స్పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!
తైవాన్కు చెందిన ప్రముఖ ల్యాప్ట్యాప్ తయారీదారు ఏసర్ భారత్లో ఇయర్ ఎండ్ సేల్ను ప్రారంభించింది. ‘లూట్ అవర్ స్టోర్ సేల్’ పేరుతో గేమింగ్ ల్యాప్టాప్స్, ఉపకరణాలపై, కంప్యూటర్ గాడ్జెట్స్పై ఏసర్ భారీ ఆఫర్లను ప్రకటించింది. గేమింగ్ ల్యాప్ట్యాప్స్పై సుమారు రూ. 40 వేల వరకు, గేమింగ్ ఉపకరణాలపై 67శాతం మేర తగ్గింపును ఏసర్ ప్రకటించింది. ఈ సేల్ ఏసర్ అధికారిక వెబ్సైట్లో డిసెంబర్ 16-17 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: వారం రోజుల పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్ఫోన్..! సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైన ఐబీఎమ్, శాంసంగ్ ఏసర్ ల్యాప్ట్యాప్స్ రూ. 23,990 నుంచి తక్కువ ధరలోనే ప్రారంభంకానున్నాయి. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ, బ్రాండ్ వారంటీని ఏసర్ అందిస్తుంది. ఏసర్ మానిటర్స్ రూ. 7,690 నుంచే ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన మోడళ్లపై రెండు సంవత్సరాల వారంటీ, ఒక ఏడాది పాటు యాక్సిడెంటర్ డ్యామేజ్ ప్రొటెక్షన్ను కొనుగోలుదారులు పొందవచ్చును. ఈ సేల్లో భాగంగా ఏసర్ నైట్రో హెడ్సెట్స్, బ్యాక్ప్యాక్స్, అడాప్టర్స్పై 67 శాతం వరకు తగ్గింపును ఏసర్ అందించనుంది. దాంతో పాటుగా ఎక్సేచేంజ్ ఆఫర్లను కూడా ఏసర్ అందిస్తోంది. ఏసర్ ట్యాబ్ కొనుగోలుపై రూ. 2,999 విలువైన ఏసర్ నైట్రో హెడ్ఫోన్స్ను కొనుగోలుదారులు ఉచితంగా పొందవచ్చును. ఈ టాబ్లెట్ ధర రూ. 11,999. చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..! -
నిస్సాన్ బంపర్ ఆఫర్..! కారు కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. కాగా ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ కూడా ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2021 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. నిస్సాన్ అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్ను కూడా పొందవచ్చును. కిక్స్ ఫీచర్స్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రోల్ ఇంజన్తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్పీతో 254 ఎన్ఎమ్ టార్క్ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్పీతో 142 ఎన్ఎం టార్క్ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది. చదవండి: రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్ బైక్..! ఎగబడుతున్న జనాలు..! -
వన్ప్లస్ స్మార్ట్ఫోన్స్ కొనుగోలుపై రూ. 13 వేల వరకు భారీ తగ్గింపు..!
Oneplus 9 Pro, Oneplus 9. Oneplus Nord CE 5G Discounts Up To 13000: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వన్ప్లస్ స్మార్ట్ఫోన్స్ కొనుగోలుపై భారీ తగ్గింపును ప్రకటించింది. వన్ప్లస్ 9 ప్రో, వన్ప్లస్ 9, వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్ఫోన్స్ కొనుగోలుపై ఈ తగ్గింపు వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డ్సుతో వన్ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తే రూ. 8000 తక్షణ తగ్గింపు రానుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్ఫోన్పై రూ. 1500 డిస్కౌంట్ రానుంది. వీటితో పాటుగా కొనుగోలుదారులకు రూ. 5000 అమెజాన్ కూపన్ను కూడా అందిస్తోంది. ఈ కూపన్ వన్ప్లస్ 9 ప్రో, వన్ప్లస్ 9, వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై రానుంది. ఈ ఆఫర్లు వన్ప్లస్ అధికారిక వెబ్సైట్లో కూడా లభించనున్నాయి. వన్ప్లస్ 9 ప్రో డీల్ వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై రూ. 5,000 తక్షణ తగ్గింపు అమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అమెజాన్ అందిస్తోన్న కూపన్ కోడ్ రూ. 5,000తో మొత్తంగా రూ. 10 వేల తగ్గింపు రానుంది. వన్ప్లస్ 9 డీల్ వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై రూ. 8,000 తక్షణ తగ్గింపు అమెజాన్ అందిస్తోంది.అంతేకాకుండా తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. అమెజాన్ అందిస్తోన్న కూపన్ కోడ్ రూ. 5,000తో మొత్తంగా రూ. 13 వేల తగ్గింపు రానుంది వన్ప్లస్ నార్డ్ సీఈ 5G డీల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వన్ప్లస్ స్మార్ట్ఫోన్లలో వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీపై అమెజాన్ రూ. 1,500 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై మూడు నెలల నో-కాస్ట్ సౌకర్యం ఉంది. చదవండి: The Best Smartphones Of 2021: ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్ఫోన్స్ ఇవే..! -
పేటీఎం బంపర్ ఆఫర్..! విమాన టికెట్లపై 50 శాతం వరకు తగ్గింపు..!
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. విమాన టికెట్ల బుకింగ్పై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది. పేటీఎం యాప్తో విమాన టికెట్ల బుకింగ్పై 15 నుంచి 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ సాయుధ దళాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు, సీనియర్ సీటిజన్లకు అందుబాటులో ఉండనుంది. వీటిపై వర్తిస్తాయి..! పేటీఎం అందిస్తోన్న ఆఫర్స్ ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్, ఎయిర్ఎసియా సర్వీసులపై తగ్గింపు ధరలు వర్తిస్తాయి. కాలేజ్ విద్యార్థులు 10 కిలోల వరకు ఎక్స్ట్రా బ్యాగేజ్ను తీసుకునే సౌకర్యాన్ని కూడా పొందవచ్చును. చదవండి: పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్..! ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.... “ ట్రావెల్ టికెటింగ్ మాకు చాలా ముఖ్యమైన సెగ్మెంట్. ట్రావెలింగ్ విషయంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను రిజర్వ్ చేయడానికి సులభతరమైన అనుభూతిని వారికి అందిస్తున్నామని అన్నారు. పేటీఎం ప్రముఖ మేజర్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కస్టమర్లు ఫ్లైట్ టికెట్లను, ఇంటర్సిటీ బస్సులను, రైల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి పేటీఎం వీలు కల్పిస్తోంది. కొద్ది రోజుల క్రితం విమాన ప్రయాణాలపై ఈఎంఐ సౌకర్యాన్ని కూడా పేటీఎం ప్రారంభించింది. చదవండి: Paytm: 50 కోట్ల మంది టార్గెట్ -
ఐఫోన్ 12 ప్రో కొనుగోలుపై రూ. 25 వేల వరకు తగ్గింపు..!
ఐఫోన్ లవర్స్కు గుడ్న్యూస్..! ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్ 12 ప్రో కొనుగోలు ఏకంగా రూ. 25,000 భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. డిస్కౌంట్ అన్ని స్టోరేజ్ వేరియంట్లపై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. అంటే వినియోగదారులు తమ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఐఫోన్ 12 ప్రో ధరను మరింత దిగిరానుంది. అమెజాన్లో రూ 1,19,000 ఖరీదైన ఐఫోన్ 12 ప్రొ 128జీబీ రూ 95,900కే రానుంది. దీంతో పాటుగా రూ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ 14,900 తగ్గింపు వర్తించనుంది. ఐఫోన్ 12 ప్రో ఫీచర్స్..! 6.1 ఇంచ్ సిరామిక్ షీల్డ్ కోటెడ్ సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లే ఏ14 బయోనిక్ చిప్ 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా 4 కె డాల్బీ విజన్ హెచ్డిఆర్ రికార్డింగ్ 4x ఆప్టికల్ జూమ్ రేంజ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా చదవండి: మరోసేల్, రెండు రోజులు మాత్రమే..స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు..! -
బ్లాక్ ఫ్రైడే సేల్: షావోమీ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
Xiaomi Black Friday Sale Starts Goes On Till November 30: అమెరికాలో థ్యాంక్స్గీవింగ్తో సాగే భారీ డిస్కౌంట్ల బ్లాక్ ఫ్రైడ్ సేల్ ఇప్పుడు భారత్లోని పలు కంపెనీలు మొదలుపెట్టాయి. అందులో ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ కూడా చేరింది. షావోమీ బ్లాక్ ఫ్రైడ్సేల్ను ప్రకటించగా, ఈ సేల్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవ్వగా నవంబర్ 30తో ముగియనుంది. బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా టీవీలు, ల్యాప్టాప్స్, ఆడియో, లైఫ్స్టైల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును షావోమీ ప్రకటించింది. చదవండి: ఇండియా కుబేరుడు.. 2 సార్లు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు కొనుగోలుదారులకు షావోమీ అధికారిక వెబ్సైట్తో పాటుగా..పలు ఈ కామర్స్ వెబ్సైట్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం తగ్గింపు రానుంది. అంతేకాకండా పలు షావోమీ ఉత్పత్తుల కొనుగోలుపై 5 వేల వరకు క్యాష్బ్యాక్ను కూడా షావోమీ అందించనుంది. బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా పలు ఉత్పతులపై షోవోమీ అందిస్తోన్న ఆఫర్లు ►ఎమ్ఐ 11ఎక్స్ స్మార్ట్ఫోన్పై సుమారు రూ. 4 వేల తగ్గింపు. ►రెడ్మీ బుక్ 15 ల్యాప్టాప్ కొనుగోలుదారులకు రూ. 35,499కే లభించనుంది. ►ఎమ్ఐ టీవీ 4సీ 43ఇంచ్, ఎమ్ఐ టీవీ 4ఏ 43ఇంచ్ హరిజోన్ ఎడిషన్, రెడ్మీ స్మార్ట్టీవీ 43 ఇంచ్ స్మార్ట్టీవీల కొనుగోలుపై రూ. 2000 వరకు డిస్కౌంట్. ►ఎమ్ఐ స్మార్ట్బ్యాండ్ 5 కొనుగోలుదారులకు రూ. 2270కు లభించనుంది. ►ఎమ్ఐ వాచ్ రివాల్వ్ క్రోమ్, ఎయిర్ పూరిఫైయర్ 3 ఉత్పత్తులపై 2 వేల తగ్గింపు.మరిన్ని ఆఫర్లను షావోమీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చును. చదవండి: స్మార్ట్ఫోన్లకు ఎండ్కార్డ్...! వాటి స్థానంలో పవర్ఫుల్..! -
స్మార్ట్ఫోన్ కొనుగోళ్లపై అమెజాన్ బంపర్ ఆఫర్..! ఏకంగా 40 శాతం...!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ను ప్రకటించింది. ‘ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ ’పేరుతో పలు స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్లను లాంచ్ చేసింది. ఈ సేల్లో భాగంగా షావోమీ, శాంసంగ్, వన్ప్లస్తో పాటు ఇతర స్మార్ట్ఫోన్లపై, మొబైల్ ఉపకరణాలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. ఈ సేల్ నవంబర్ 24 నుంచి ప్రారంభమై నవంబర్ 28తో ముగియనుంది. చదవండి: షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో, వివో..! ‘ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్’లో పలు స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్స్లో కొన్ని...! ►షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ: 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 26,999 ఉండగా ఈ సేల్లో భాగంగా రూ. 19999కే కొనుగోలుదారులకు లభించనుంది. ►శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ: 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 39,990 ఉండగా ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్లో భాగంగా రూ. 38, 740కు రానుంది. ►వన్ప్లస్ 9ప్రో: ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 54,999 లభించనుంది. అంతేకాకుండా అమెజాన్ కూపన్ను కూడా పొందవచ్చును. ►ఐక్యూ జెడ్5 5జీ: 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 20,615కే కొనుగోలుదారులకు లభించనుంది. ►ఐక్యూ జెడ్3 5జీ: ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 17,865 కే లభించనుంది. ►షావోమీ ఎమ్ఐ 11ఎక్స్ 5జీ: ఎక్స్చేంజ్ ఆఫర్, ఎస్బీఐ కార్డుతో ఈ స్మార్ట్ఫోన్ రూ. 21,749 కే రానుంది. ►శాంసంగ్ గెలాక్సీ ఎమ్12: బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ లిస్ట్లో ఈ స్మార్ట్ఫోన్ రూ. 10,349కు కొనుగోలుదారులకు లభించనుంది. చదవండి: ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం! త్వరలో ప్రభుత్వ రంగంలో? -
రియల్మీ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనంజా సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో భాగంగా పలు రియల్మీ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది ఫ్లిప్కార్ట్. రియల్మీ జీటీ నియో2 స్మార్ట్ఫోన్పై సుమారు రూ. 4000 వరకు డిస్కౌంట్ను ప్రకటించింది. దీంతో రియల్మీ జీటీ నియో 2 స్మార్ట్ఫోన్ రూ. 27,999కే లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 31,999. చదవండి: మీరు ఉద్యోగస్తులా..! ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే భారీగా ట్యాక్స్ బెన్ఫిట్స్ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ఫోన్పై కూడా రూ. 4 వేల వరకు తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు రూ.21999కే లభించనుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్గా నిలుస్తోన్న రియల్మీ సీ20 స్మార్ట్ఫోన్పై ఎప్పటిలాగనే రూ. 500 తగ్గింపుతో రూ.6999కు లభించనుంది. రియల్మీ 8ఎస్ 5జీ స్మార్ట్ఫోన్పై రూ. 1500 తగ్గింపుతో రూ. 18499కే కొనుగోలుదారులకు లభించనుంది. రియల్మీ నార్జో 50ఏ స్మార్ట్ఫోన్ రూ.1000 డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 10499కు రానుంది. చదవండి: టెలికాం కంపెనీలే లక్ష్యంగా..నోకియా బిగ్ స్కెచ్..! -
మిలిటరీ-గ్రేడ్ రేంజ్లో నోకియా స్మార్ట్ఫోన్..! కొనుగోలుపై ఇయర్బడ్స్ ఉచితం..!
హెచ్ఎమ్డీ గ్లోబల్ భారత మార్కెట్లలోకి నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్ఫోన్ను అక్టోబర్ 18న లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నోకియా ఎక్స్ ఆర్20 స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూలైలో భారత్ మినహా మిగతా దేశాల్లో నోకియా ఎక్స్ఆర్20ను హెచ్ఎమ్డీ లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్ఫోన్ను అత్యంత టఫెస్ట్ స్మార్ట్ఫోన్గా అభివర్ణించింది. ఈ స్మార్ట్ఫోన్ ఐపీ68 రేటింగ్తో రావడంతో సుమారు ఒక గంట లోపు నీటిలో ఉన్నకూడా పనిచేసే సామర్ద్యం నోకియా ఎక్స్ఆర్20 సొంతం. గ్రానైట్,అల్ట్రా బ్లూకలర్ వేరియంట్స్తో ఈ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలుదారులకు లభించనుంది. నోకియా ఎక్స్ఆర్20 6జీబీ+128 జీబీ ఇంటర్నల్ వేరియంట్ స్మార్ట్ఫోన్ ధర రూ. 46,990. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై నోకియా పవర్ బడ్స్ లైట్ ఇయర్బడ్స్ కొనుగోలుదారులకు ఉచితంగా లభించనున్నాయి. అంతేకాకుండా ఒక ఏడాదిపాటు స్క్రీన్ ప్రొటెక్షన్ను కూడా నోకియా అందిస్తోంది. నోకియా XR20 ఫీచర్స్ 6.67-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 చిప్సెట్ 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 48+13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4,630 mAh బ్యాటరీ 18 W వైర్డ్ ఛార్జింగ్ 5G సపోర్ట్ NavIC ఇండియన్ జీపీఎస్ సపోర్ట్ యూఎస్బీ టైప్-సి చార్జింగ్ చదవండి: క్లియర్ట్రిప్లో వాటాలను కొనుగోలుచేసిన అదానీ..! -
పోకో సిరీస్ స్మార్ట్ఫోన్లపై రూ. 7000 వరకు భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ బిగ్ దీవాళి సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్ దీవాళి సేల్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు జరగనుంది. ఈ సేల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ పోకో పలు స్మార్ట్ఫోన్ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. సుమారు రూ. 7000 వరకు భారీ తగ్గింపును కొనుగోలుదారులకు అందించనుంది. పోకో ఎక్స్ 3ప్రో, పోకో ఎమ్2 ప్రో, పోకో సీ3 ఇతర మోడళ్లపై కూడా డిస్కౌంట్ను పోకో అందిస్తోంది. కొన్ని స్మార్ట్ఫోన్ మోడళ్లపై డిస్కౌంట్లను చివరిసారిగా అందిస్తామని పోకో ఒక ప్రకటనలో పేర్కొంది. వీటితో పాటుగా పలు బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోలుపై ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ను అందిస్తోంది ►బిగ్ దీవాళి సేల్లో భాగంగా పోకో ఎక్స్3 ప్రో మోడల్పై సుమారు రూ. 7,000 డిస్కౌంట్ను అందిస్తోంది. దీంతో 6జీబీ ర్యామ్ వేరియంట్ పోకో ఎక్స్3 ప్రో ధర రూ. 16,999 కే రానుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.23,999. 8జీబీ ర్యామ్ పోకో ఎక్స్3 ప్రో ధర రూ. 18,999 గా ఉండనుంది. ►పోకో ఎమ్2ప్రో (4జీబీర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్)పై సుమారు రూ. 6000 తగ్గింపుతో కొనుగోలుదారులకు రూ. 10799 అందుబాటులో ఉండనుంది. 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 11,749కు లభించనుంది. ►బడ్జెట్ ఫోన్లలో పోకో సీ3 మోడల్పై 3జీబీర్యామ్+32 ఇంటర్నల్స్టోరేజ్ వేరియంట్పై రూ. 3000 తగ్గింపుతో రూ. 6,749కే కొనుగోలుదారులకు లభించనుంది. ►పోకో ఎమ్3, పోకో ఎమ్3 ప్రో స్మార్ట్ఫోన్స్ కొనుగోలుదారులకు వరుసగా రూ. 9899, రూ. 13249కు లభిస్తాయి. ►పోకో సీ31 రూ. 7,649కి రిటైల్ చేయగా, పోకో ఎఫ్3 జీటీ రూ. 23749కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: షావోమీ దీవాళి విత్ ఎమ్ఐ సేల్..! 5 లక్షల నగదు గెల్చుకునే అవకాశం..! -
షావోమీ దీవాళి విత్ ఎమ్ఐ సేల్..! 5 లక్షల నగదు గెల్చుకునే అవకాశం..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ ‘దీవాళీ విత్ ఎమ్ఐ సేల్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్లైన్ ఎక్స్కూజివ్ సేల్ను కూడా షావోమీ ప్రకటించింది. దీవాళీ విత్ ఎమ్ఐ సేల్ భాగంగా షావోమి స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర గ్యాడ్జెట్స్పై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్స్ నవంబరు 6 వరకు అందుబాటులో ఉండనున్నాయి. సేల్లో భాగంగా ప్రతి రోజు 64 మంది లక్కీ విన్నర్లకు రూ. 1000 నుంచి 5 లక్షల వరకు క్యాష్ప్రైజ్ను అందిస్తోంది. లక్కీ విన్నర్లకు లక్కీ డ్రా ద్వారా ఓ సెడాన్ కారు, సూపర్ బైక్స్ ను కూడా షావోమీ అందించనుంది. చదవండి: సౌండ్కోర్ నుంచి సరికొత్త వాటర్ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..! స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్..! దీవాళి విత్ ఎమ్ఐ సేల్లో భాగంగా ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్ఫోన్స్పై గరిష్టంగా రూ.3 వేల వరకు డిస్కౌంట్ను కొనుగోలుదారులు పొందవచ్చును. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ. 2000 వరకు క్యాష్బ్యాక్ను అందిస్తోంది. దీవాళి విత్ ఎమ్ఐ సేల్లో భాగంగా రెడ్ మీ నోట్ 10 సిరీస్, రెడ్ మీ 9 సిరీస్ లాంటి మోడళ్లపై రూ.1000ల వరకు డిస్కౌంట్ను షావోమీ అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ కొనుగోలుపై 3 వేల వరకు క్యాష్ బ్యాక్ను షావోమీ అందిస్తోంది. స్మార్ట్టీవీలపై షావోమీ అందిస్తోన్న ఆఫర్స్..! పలు స్మార్ట్టీవీ మోడళ్లపై షావోమీ భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ సేల్లో రెడ్ మీ స్మార్ట్ టీవీ ఎక్స్ మోడల్ పై రూ.3000 నుంచి రూ.5000 వరకు డిస్కౌంట్ను అందిస్తోంది. 32 అంగుళాల,55 అంగుళాల సైజ్లో గల ఎంఐ టీవీలపై రూ.1000నుంచి రూ.3000వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై రూ.3500 ఈఎమ్ఐ ఆపర్లను అందిస్తోంది. చదవండి: టైటాన్ డబుల్ ధమాకా..! -
ఎస్బీఐ ఖాతాదారులకు ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్...!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ దీవాళీ సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు జరగనుంది. బిగ్ దీవాళీ సేల్లో భాగంగా ఎస్బీఐ డిబెట్ కార్డు హోల్డర్లకు ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. బిగ్ దివాళీ సేల్ సందర్భంగా పలు ఉత్పత్తులను ఎస్బీఐ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. చదవండి: Nykaa: రూ. 850 కోట్లను సొంతం చేసుకోనున్న నైకా టాప్ ఉద్యోగులు..! ఎస్బీఐ డెబిట్ కార్డ్ వినియోగదారులకు రియల్ మీ సీ11, రియల్మీ సీ21వై, శాంసంగ్ ఎఫ్12, పోకో జీ3 ఎఫ్టీ, రియల్మీ నార్జో 50ఏ, మోటోరోలా జీ60, ఒప్పో రోనో 6 5జీ వంటి స్మార్ట్ఫోన్ కొనుగోలుపై మరింత తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందించనుంది. బిగ్ దీపావళి డేస్ సేల్ సందర్భంగా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుపై 80 శాతం వరకు తగ్గింపును అందించనున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. డెస్క్టాప్ల కొనుగోలుపై 30 శాతం వరకు,పవర్ బ్యాంక్లపై 75 శాతం వరకు తగ్గింపు , హెడ్ఫోన్, స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. గృహోపకరణాల విషయానికి వస్తే...టీవీలపై 75 శాతం వరకు, మైక్రోవేవ్ ఓవెన్లపై 45 శాతం వరకు తగ్గింపు , ఎయిర్ కండీషనర్లపై 55 శాతం వరకు తగ్గింపు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభించిన జియో-బీపీ -
ప్రైమ్ యూజర్లకు బంపర్ఆఫర్ ప్రకటించిన అమెజాన్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైంది. తాజాగా ప్రైమ్ యూజర్లకు అమెజాన్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ప్రైమ్ యూజర్లకు ‘ అడ్వాన్టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్’ పేరిట సరికొత్త ప్రోగ్రాంను లాంచ్ చేసింది. చదవండి:75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ...! అడ్వాన్టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్ ప్రోగ్రాం సహాయంతో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ప్రైమ్ సభ్యులకు నో కాస్ట్ ఈఏమ్ఐలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కేవలం స్మార్ట్ఫోన్లకే వర్తించనుంది. దాంతో పాటుగా స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై అదనంగా కస్టమర్లు ఆరు నెలల ఉచిత స్క్రీన్ రిప్లేస్మెంట్ ప్రయోజనాలను కూడా పొందవచ్చును. హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారుల కోసం మరిన్నీ ప్రత్యేక ఆఫర్లను కూడా అందించనుంది. అమెజాన్ అందిస్తోన్న 'అడ్వాంటేజ్ - జస్ట్ ఫర్ ప్రైమ్' ప్రోగ్రామ్ కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ఫోన్లైన సామ్సంగ్ గెలాక్సీ M52 5జీ , ఐక్యూ జెడ్5, షావోమీ 11 లైట్ 5G ఎన్ఈ, ఒప్పో ఏ55 నో కాస్ట్ ఈఎమ్ఐలను అందిస్తోంది. నెల రోజుల పాటు జరిగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ల్యాప్టాప్లు , స్మార్ట్ టీవీలు , మొబైల్ ఫోన్లు , ఎయిర్ ప్యూరిఫైయర్లు , గృహోపకరణాలు , వంటగది ఉపకరణాలు మరిన్నింటిపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది . చదవండి: అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్...! -
స్మార్ట్ఫోన్స్, టీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించిన వన్ప్లస్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ కొనుగోలుదారులకు దీపావళి సేల్ను ప్రకటించింది. స్మార్ట్ఫోన్స్, టీవీల కొనుగోలుపై భారీ డీల్స్ను, ఆఫర్లను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. వన్ప్లస్ తన అధికారిక వెబ్సైట్లో దీపావళి సేల్ను నిర్వహిస్తోంది. వన్ప్లస్ 9 ప్రో , వన్ప్లస్ 9 ఆర్తో సహా , వన్ప్లస్ 9 శ్రేణిపై భారీ తగ్గింపును అందిస్తోంది. అదనంగా, వన్ప్లస్ నార్డ్ సిరీస్పై కూడా డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లను ప్రకటించింది. తొమ్మిది నెలల వరకు నోకాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యాన్నికూడా వన్ప్లస్ అందించనుంది. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్జున్వాలా..అతని తర్వాతే..! వన్ప్లస్ 9ఆర్, వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్లపై రూ. 3000 తగ్గింపును ప్రకటించింది. దీంతో వన్ప్లస్ 9ఆర్ ధర రూ. 36,999, కాగా వన్ప్లస్ 9 రూ. 46,999 అందుబాటులో ఉంది. వన్ప్లస్ 9 ప్రోపై 4వేల తగ్గింపుతో రూ. 60,999 లభించనుంది. అమెజాన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో సుమారు 7 వేల తగ్గింపు ధరను అందిస్తోంది. అక్టోబర్ 4 నుంచి వన్ప్లస్ ఇండియా అధికారిక వెబ్సైట్లో ఎస్బీఐ కార్డులపై కూడా 7 వేల తగ్గింపు వర్తించనుంది. వన్ప్లస్ స్మార్ట్టీవీ వై, యూ సిరీస్ శ్రేణి టీవీలపై 15 శాతం తగ్గింపును ప్రకటించింది. వన్ప్లస్ వై సిరీస్ 32-అంగుళాల టీవీ కొనుగోలుదారులకు రూ. 15,999కు లభించనుంది. అంతేకాకుండా అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై తక్షణ తగ్గింపు రూ. 2000 ను అందించనుంది. వన్ప్లస్ యూ సిరీస్ 50-అంగుళాల స్మార్ట్టీవీ రూ. 43,999 లభిస్తోంది. ఐసీఐసీఐ కార్డులపై అదనంగా రూ. 3 వేల తక్షణ తగ్గింపు రానుంది. చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ బ్రాండ్ టీవీలు..! -
భారీ డిస్కౌంట్లతో పండుగకు వస్తున్న షావోమీ..! రూ.75 వేల వరకు తగ్గింపు..!
ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ దీపావళి సందర్భంగా ‘సెలబ్రెట్ దీపావళి విత్ ఎమ్ఐ’ సేల్ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ సేల్కు సంబంధించిన డిస్కౌంట్లను, ఆఫర్లను షావోమీ తన వెబ్సైట్లో టీజ్ చేసింది. ఈ సేల్ భాగంగా స్మార్ట్ఫోన్స్, స్మార్ట్టీవీలను, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సేల్లో పాల్గొనే కస్టమర్లకు ముందుగానే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రీబుకింగ్స్ చేసుకోనే సౌకర్యాన్ని షావోమీ కల్పిస్తోంది. చదవండి: జియో ఫోన్ లాంచ్కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! పలు షావోమీ ఉత్పత్తులపై సుమారు రూ. 5,000 నుంచి రూ. 75,000 వరకు డిస్కౌంట్లను షావోమీ అందించనుంది. దీపావళి విత్ మి సేల్ రివార్డ్ మి ఇన్స్టంట్ కూపన్ల ద్వారా రూ. 5,000 వరకు తగ్గింపును షావోమీ ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొనుగోలు చేసే సమయంలో 10 శాతం తక్షణ డిస్కౌంట్ను కూడా పొందవచ్చును. షావోమి అందిస్తోన్న ఆఫర్ల విషయానికొస్తే, దీపావళి విత్ ఎమ్ఐ సేల్లో షావోమీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎమ్ఐ బాక్స్ 4కే అలాగే దాని ఐవోటీ పరికరాలపై ధర తగ్గింపు ఉంటుంది. షావోమి అందిస్తోన్న పలు ఆఫర్లు...! రెడ్మీ 9ఏ 2జీబీ ర్యామ్+32ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 6,799 అందిస్తోంది. దీని అసలు ధర రూ .8,499. షావోమి ఎమ్ఐ 11 ఎక్స్ స్మార్ట్ఫోన్ను భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు షావోమీ తన వెబ్సైట్లో టీజ్ చేసింది. 75-అంగుళాల ఎమ్ఐ క్యూఎల్ఈడీ టీవీపై సుమారు రూ .75,000 తగ్గింపు న అందించనుంది. దీని అసలు ధర రూ. 1,99,999. 50-అంగుళాల ఎమ్ఐ టీవీ 5ఎక్స్ మోడల్పై రూ. 20,000 తగ్గింపును సేల్ సమయంలో పొందవచ్చు. 40-అంగుళాల ఎమ్ఐటీవీ 4ఏ రూ. 8,000 తగ్గింపును ప్రకటించనుంది. చదవండి: వన్ప్లస్ 9, వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...! -
వన్ప్లస్ 9, వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అక్టోబర్ 3 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు సంబంధించిన ఆఫర్లను, క్యాష్బ్యాక్ అమెజాన్ తన అధికారిక వెబ్సైట్లో టీజ్ చేస్తోంది. తాజాగా వన్ప్లస్ 9, 9 ప్రో మోడళ్లపై కొనుగోలుదారులకు భారీ తగ్గింపుతో అమెజాన్ అందించనుంది. అందుకు సంబంధించిన ఆఫర్ను అమెజాన్ తాజాగా టీజ్ చేసింది. చదవండి: జియో ఫోన్ లాంచ్కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! వన్ప్లస్ 9 ప్రో సుమారు 50 వేల కంటే తక్కువ ధరలో, వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ 40 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలుదారులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో లభించనుంది. వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్ లాంచింగ్ ధర రూ. 64,999 కాగా, వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ లాంచింగ్ ధర రూ. 54,999 గా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్ప్లస్ 9, 9 ప్రో వేరియంట్లపై వరుసగా పదివేలు, 15 వేల డిస్కౌంట్లను అమెజాన్ అందించనుంది. 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12జీబీ, 256జీబీ వేరియంట్లలో వన్ప్లస్ 9 ప్రో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వన్ప్లస్ 9 వేరియంట్ 8జీబీ, 12 జీబీ ర్యామ్స్తో కూడా లభించనున్నాయి. చదవండి: ఒక్కసారిగా పేలిన ఫోన్ ఛార్జర్...! స్పందించిన కంపెనీ...! -
రెనాల్ట్ కార్ల కొనుగోలుపై రూ.80 వేల వరకు బంపర్ ఆఫర్స్..!
ఫ్రాన్స్కు చెందిన మల్టీనేషనల్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. రెనాల్ట్ శ్రేణిలోని కార్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్స్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన మోడల్ లైనప్లో పలు ప్రయోజనాలను ప్రకటించింది. రెనాల్ట్ సుమారు రూ 80 వేల వరకు క్యాష్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను అందించనుంది. చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! రెనాల్ట్ అందిస్తోన్న ఆఫర్లు ఆయా మోడల్, ప్రాంతాల్లో మారుతూ ఉంటాయి. ‘బై నౌ, పే ఇన్ 2022’ అనే సరికొత్త స్కీమ్తో రెనాల్ట్ ముందుకొచ్చింది. ఈ స్కీమ్ సెలక్టెడ్ కార్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ స్కీమ్లో భాగంగా తొలి ఆర్నెల్ల సమయంలో ఈఎమ్ఐ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే కారు కొన్న వెంటనే ఈఎమ్ఐ చెల్లించనక్కర్లేదు. రెనాల్ట్ తన RELi.VE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద సుమారు రూ. 10 వేల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ క్విడ్ , ట్రైబర్ లేదా డస్టర్పై వర్తిస్తుంది. రెనాల్ట్ క్విడ్ క్విడ్ హ్యాచ్బ్యాక్ సేల్లో రూ.40 వేల వరకు గరిష్ట ప్రయోజనాలతో అమ్మకానికి ఉంది. ఈ ఆఫర్లలో పదివేల వరకు క్యాష్ డిస్కౌంట్, 20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, పదివేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ ట్రైబర్ ఎమ్పీవీపై రెనాల్ట్ విభిన్న ప్రయోజనాలను అందిస్తోంది. రెనో 2020 మోడల్ ట్రైబర్పై కొనుగోలుదారులు సుమారు రూ. 60 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో రూ. 25 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. 2021 మోడల్ ఇయర్ ట్రైబర్ కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ. 50 వేల వరకు ప్రయోజనాలను పొందుతారు. వీటిలో రూ. 15 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ కొనుగోలుపై సుమారు రూ. 80 వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. వీటిలో రూ. 30 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. ఈ మూడు మోడళ్లకు ‘ఇప్పుడు కొనండి 2022లో చెల్లించండి’ స్కీమ్ వర్తించనుంది. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్తో 482 కి.మీ ప్రయాణం..! -
బ్లాక్బస్టర్ డీల్స్తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలోనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను జరపనుంది. గ్రేట్ఇండియన్ ఫెస్టివల్ సేల్ను అమెజాన్ తన అధికారిక వెబ్సైట్లో టీజ్ చేసింది. ఈ సేల్ తేదీలను అమెజాన్ ఇంకా ఖరారు చేయలేదు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ను ప్రకటించిన కొన్ని రోజులకే అమెజాన్ ప్రకటించడం విశేషం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదటి వారంలో ఈ సేల్ను అమెజాన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: Forbes Billionaires 2021: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ..? అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ 24 గంటలకు ముందే ఈ సేల్లో పాల్గొనవచ్చును. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లపై 30 శాతం, ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు, ఫ్యాషన్పై సుమారు 40 శాతం నుంచి 80 శాతం మేర ఆఫర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ను అందించనుంది. ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోలు అదనంగా రూ. 300 క్యాష్బ్యాక్ను అందించనుంది. ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ ఆఫర్ను అందించనుంది. ఫైర్ టీవీ స్టిక్, ఎకో డివైజెస్, కిండెల్ లాంటి అమెజాన్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందించనుంది. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్తో 482 కి.మీ ప్రయాణం..! -
వచ్చేస్తోంది.. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు...!
Flipkart Big Billion Days Sale 2021: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ ఏడాది జూన్ 13-16 తేదీల్లో బిగ్ సేవింగ్ డేస్ను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్కు సంబంధించిన టీజర్ను ఫ్లిప్కార్ట్ తన వెబ్సైట్లో ప్రదర్శించింది. ప్రతి ఏడాది మాదిరిగానే, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్,బ్యూటీ, మరిన్నింటితో సహా అనేక రకాల ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించనుంది. చదవండి: జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..! బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లకు అదనపు డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ అందించనుంది. అంతేకాకుండా కొనుగోలు చేసిన వస్తువులపై పేటీఎం క్యాష్బ్యాక్ను కూడా అందించనుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ అందించే ఆఫర్లను, డిస్కౌంట్లను వెబ్సైట్లో ఉంచింది. భారీ తగ్గింపు...ఆఫర్లు..! ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ టీజర్లో భాగంగా సౌండ్ బార్లు, బోట్ కంపెనీ ఉత్పత్తులపై సుమారు 80 శాతం వరకు, స్మార్ట్వాచ్లపై సుమారు 70 శాతం వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. డిజో బ్రాండెడ్ వైర్లెస్ హెడ్సెట్ పై 60 శాతం వరకు, ఇంటెల్ ల్యాప్టాప్ 40 శాతం వరకు తగ్గింపును అందించనుంది. ల్యాప్టాప్లు, హెల్త్ కేర్ డివైజెస్ , స్మార్ట్ వేరబుల్స్, హెడ్ఫోన్లు, స్పీకర్లతో సహా ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీలపై కొనుగోలుదారులు 80% వరకు తగ్గింపును ఆశించవచ్చును. టీవీలపై 70% వరకు తగ్గింపును, రిఫ్రిజిరేటర్లపై 50% వరకు గృహోపకరణాలపై 70% వరకు తగ్గింపును అందించనుంది. బిగ్బిలియన్డేస్లో భాగంగా ప్రతిరోజు 12, 8 గంటలకు సాయంత్రం 4 గంటలకు రష్ ఆవర్స్ పేరిట ఫ్లాఫ్ సేల్స్ను ప్రకటించింది. కాగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల చివరలో లేదా అక్టోబర్ నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు...!
iPhone 12 Series: సెప్టెంబర్ 14న ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయడానికి ఆపిల్ సన్నాద్ధం అవుతోంది. ఐఫోన్-13 ను లాంచ్ చేస్తున్న నేపథ్యంలో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్ఫోన్లపై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది.ఫ్లిప్కార్ట్ పలు ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై సుమారు రూ. 12 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 12 మినీ 64జీబీ, 128జీబీ వెర్షన్లు వరుసగా రూ .59,999, రూ. 64,999 లకు అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు వేరియంట్ల అసలు ధరలు వరుసగా రూ .69,900 , రూ .74,900గా ఉంది. 256జీబీ వేరియంట్ ధర రూ .74,999 అందుబాటులో ఉంది. ప్లిప్కార్ట్ సుమారు 22 శాతం మేర డిస్కౌంట్లను అందిస్తోంది. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! ఆపిల్ ఐఫోన్ 12 మోడల్ 64 జీబీ వేరియంట్పై సుమారు రూ. 12 వేల తగ్గింపుతో రూ. 66,999 అందించనుంది. 128జీబీ వేరియంట్ రూ. 12901 తగ్గింపుతో రూ .71,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్-12 256జీబీ వేరియంట్ రూ. 81,999 కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! ఐఫోన్ 12 ప్రో 128జీబీ వేరియంట్ రూ. 1,15,900, 256జీబీ వేరియంట్ ధర రూ .1,25,900. 512జీబీ వేరియంట్ ధర రూ .1,45,900కు లభించనుంది. అంతేకాకుండా ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్పై కూడా ఫ్లిప్కార్ట్ తగ్గింపును ప్రకటించింది. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లు వరుసగా రూ. 1,25,900, రూ .1,35,900 , రూ .1,55,900 కు లభించనున్నాయి. చదవండి: Xiaomi: ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేసిన షావోమీ..! -
అమెజాన్ మరో సేల్..! ఈసారి ల్యాప్ట్యాప్, టీవీలపై భారీ తగ్గింపు...!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకోసం మరో సేల్ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఇండియా 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 22 నుంచి ఆగస్టు 24 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. గ్రాండ్ గేమింగ్ సేల్స్లో భాగంగా ల్యాప్టాప్స్, టీవీలు డెస్క్టాప్లు, మానిటర్లు, అధునాతన హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్ కార్డులు, లెనోవో, ఏసర్, ఆసూస్, ఎల్జీ, హెచ్పీ, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ టీవీలకు ఆఫర్లు, డీల్స్ను అమెజాన్ తన కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..! డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్ మరిన్ని కంపెనీల ఉత్పత్తులపై సుమారు 30 శాతం మేర తగ్గింపును ప్రకటించాయి. అధిక ర్యామ్, అధిక రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీలపై కూడా 30 శాతం తగ్గింపును అమెజాన్ తన కస్టమర్లకు అందిస్తోంది. అదనంగా కొనుగోలుదారలు ఎంచుకున్న మోడళ్లపై తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్సేఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చును. పలు ల్యాప్టాప్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు హెచ్పీ కంపెనీకి చెందిన విక్టస్ 15.6-అంగుళాల ఎఫ్హెచ్డీ గేమింగ్ ల్యాప్టాప్ రూ. 66,990 కి అందుబాటులో ఉంది. ఏసర్ కంపెనీకి చెందిన నైట్రో 5 ఏఎన్515-56 గేమింగ్ ల్యాప్టాప్ రూ. 69,990 అందుబాటులో ఉంది . ఎమ్ఎస్ఐ కంపెనీకి చెందిన బ్రావో 15 ఎఫ్హెచ్డీ మోడల్ను రూ. 74,990 అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ప్యాడ్ ల్యాప్టాప్ను రూ . 67, 557 కు లభించనుంది. పలు టీవీలపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు.. సోనీ బ్రావీయా 55 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ రూ. 83,990కు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ 55 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీను రూ . 45,999కు అందుబాటులో ఉండనుంది. చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్బెజోస్...! -
ఫ్లిప్కార్ట్ మొబైల్స్ బొనాంజా..! మొబైల్స్పై భారీ తగ్గింపు..!
కరోనా మహమ్మారి రాకతో పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు కస్టమర్లకు అందించే ఫెస్టివల్ సేల్స్ను నిలిపివేశాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల కాస్త తగ్గముఖం పట్టడంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా ఫెస్టివల్ సేల్స్ను కస్టమర్లకు అందించాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకోసం మొబైల్ సేవింగ్ డేస్ సేల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా మరో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ అదే బాటలో నడుస్తోంది. ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకోసం ఫ్లిప్కార్ట్ మొబైల్స్ బోనాంజా సేల్స్ను అందుబాటులోకి తెచ్చింది. (చదవండి:WhatsApp:మీరు అనుకుంటే వాట్సాప్లో కనిపించకుండా చేయవచ్చు.!) ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్స్ నేటితో ప్రారంభమై ఐదు రోజుల పాటు ఆగస్టు 23 వరకు కొనసాగనుంది. ఈ సేల్స్లో భాగంగా పలు మొబైల్స్పై , మొబైల్ యాక్సేసరిస్పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 12 మినీ, పోకో ఎం 3, మోటో జి 60 , ఇన్ఫినిక్స్ హాట్ 10 ఎస్ వంటి స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్, డిస్కౌంట్లను ఫ్లిప్కార్ట్ అందించనుంది. ఐఫోన్ 12, రియల్మీ సి 20, ఒప్పో ఎఫ్ 19 వంటి మోడళ్లపై ప్రీపెయిడ్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో భాగస్వామ్యమై ఎంపిక చేసిన ఫోన్లపై తక్షణ డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ సేల్ మార్కెట్లో అందుబాటులోని ప్రముఖ ఫోన్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ బొనాంజా సేల్స్లో ఫ్లిప్కార్ట్ అందిస్తున్న పలు ఆఫర్ల వివరాలు..! ఫ్లిప్కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ ఐఫోన్ 12 మినీ స్మార్ట్ఫోన్ను ధర రూ. 59,999 అందిస్తోంది. ఐఫోన్ ఎస్ఈ (2020) స్మార్ట్ఫోన్ ధర రూ. 34,999 అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ను రూ. 48,999 అందించనుంది. ఐఫోన్ ఎక్స్ ఆర్ను రూ. 41,999, ఐఫోన్ 11 ప్రోను రూ. 74,999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. మోటో జీ60 స్మార్ట్ఫోన్ను రూ. 16,999 అందిస్తుంది. పోకో ఎమ్3ను రూ. 10,499 కాగా, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 ను రూ. 6,999 అందించనుంది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) -
అమెజాన్ మరో సేల్..! మొబైల్స్పై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్ల కోసం అమెజాన్ ఇండిపెండెన్స్ సేల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమెజాన్ తన కస్టమర్లకోసం మరో సేల్ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 వరకు జరగనుంది. ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లపై ఇతర మొబైల్ యాక్సెసరీలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. మొబైల్ కొనుగోళ్లపై పన్నెండు నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్ఐలను అమెజాన్ ఇవ్వనుంది. పలు మొబైల్ కొనుగోళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ డీల్స్ను కూడా అమెజాన్ తన కస్టమర్లకు అందించనుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలుదారులకు 10 శాతం సుమారు రూ. 1250 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా 'అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్' ప్లాన్ కింద ప్రైమ్ కస్టమర్లకు ఆరునెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, హెచ్డీఎఫ్సీ కార్డులపై మూడు నెలల అదనపు నో కాస్ట్ ఈఎమ్ఐ వంటి అదనపు ఆఫర్లను అమెజాన్ అందిస్తుంది. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ భాగంగా వన్ప్లస్ ,షావోమీ , శాంసంగ్ , ఐక్యూ , రియల్మీ కంపెనీల స్మార్ట్ఫోన్లపై సుమారు 10 శాతం తగ్గింపు ధరను అమెజాన్ ప్రకటించింది. వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవ్వనుంది. ఈ మొబైల్ కొనుగోలుపై సుమారు రూ .4000 వరకు డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కూపన్రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ కొనుగోలుపై పన్నెండు నెలల నో కాస్ట్ ఈఎమ్ఐతో పాటు అదనంగా రూ. 3000 డిస్కౌంటును పొందవచ్చును. ఎమ్ఐ 11 ఎక్స్ కొనుగోలు ఎక్సేచేంజీ పై అదనంగా రూ. 5,000 తగ్గింపును అందిస్తుంది. మొబైల్ యాక్సెసరీస్ ప్రారంభ ధర రూ. 69 కాగా పవర్ బ్యాంకులు రూ.399 నుంచి ప్రారంభంకానున్నాయి. -
ఐఫోన్-12 మినీ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకోసం మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ ఆగస్టు 5న ప్రారంభమై ఆగస్టు 9న ముగియనుంది. ఈ సేల్లో భాగంగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై, స్మార్ట్ఫోన్లపై ఆసక్తికర ఆఫర్లను కస్టమర్లకు అందించింది. తాజాగా ఆపిల్ ఐఫోన్ 12 మిని మొబైల్పై ఫ్లిప్కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 మినిపై సుమారు రూ. 10 వేల వరకు తగ్గింపుతో ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు అందిస్తోంది. ఐఫోన్ 12 మినీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లలోకి ప్రారంభ ధర రూ. 69,900 అమ్మకాలను మొదలుపెట్టింది. వచ్చేనెల సెప్టెంబర్లో ఐఫోన్ 13 లాంచ్ అవుతున్న నేపథ్యంలో ఐఫోన్ 12 మినీ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని ఆపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 12 మినీ ధర భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణుల భావిస్తున్నారు. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ భాగంగా ఐఫోన్ 12 మినీపై రూ .9,901 ఫ్లాట్ డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ అందిస్తుంది.దీంతో ఐఫోన్ 12 మినీ రూ .59,999కే రానుంది. కొనుగోలు చేసే సమయంలో ఫ్లిప్కార్ట్ మరిన్ని డీల్స్ను కూడా అందించనుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై కొనుగోలు జరిపితే అదనంగా 10 శాతం సుమారు రూ. 1000 వరకు తగ్గింపును ఫ్లిప్కార్టు అందిస్తోంది. ఇతర స్మార్ట్ఫోన్తో ఎక్సేచేంజ్ చేస్తే సుమారు రూ. 15 వేల వరకు తగ్గింపు రానుంది. -
పలు కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించిన హ్యూందాయ్..!
Hyundai Offers August 2021: ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ హ్యూందాయ్ మోటార్స్ కస్టమర్లకు తీపికబురును అందించింది. అమ్మకాలను పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పలు కార్ల మోడళ్లపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. హ్యూందాయ్ కంపెనీకి చెందిన పలు కార్ల మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 50 వేల వరకు బెనిఫిట్లను అందించనుంది. హ్యుందాయ్ శాంట్రో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మొదలైన కార్లపై డిస్కౌంట్లతో పాటు పలు బెనిఫిట్లను అందించనుంది. కాగా ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 31 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ప్రాంతాలను బట్టి సంబంధిత కార్ల ధరలో మార్పులు ఉండవచ్చును. ఆయా కార్లపై హ్యూందాయ్ అందిస్తోన్న ఆఫర్లు ఇవే..! హ్యుందాయ్ శాంట్రో (పెట్రోల్) వేరియంట్పై సుమారు రూ. 40 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వేరియంట్లపై సుమారు రూ. 40 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్)వేరియంట్పై సుమారు రూ. 40 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. హ్యుందాయ్ ఆరా (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వేరియంట్లపై సుమారు రూ. 50 వేల వరకు తగ్గింపును, ఇతర బెనిఫిట్లను అందిస్తోంది. -
ఈ మొబైల్పై భారీ తగ్గింపును ప్రకటించిన శాంసంగ్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ మొబైల్ కొనుగోలుదారులకు గుడ్న్యూస్ను అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్ఫోన్ ధరను సుమారు రూ. 6000 వరకు తగ్గించింది. కాగా ఈ ఆఫర్ వ్యాలిడిటీ కొన్ని రోజులపాటు మాత్రమే ఉండనుంది. శాంసంగ్ గెలక్సీ ఎఫ్62ను ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లలోకి కంపెనీ రిలీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 రెండు రకాల వేరియంట్లలో లభించనుంది. 6జీబీ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 అసలు ధర రూ. 23, 999 కాగా ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 17, 999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. 8జీబీ వేరియంట్ అసలు ధర రూ. 25, 999 కాగా ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 19, 999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్ను శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే సుమారు రూ. 2500 క్యాష్ బ్యాక్ను అందింనుంది. ఫ్లిప్కార్టులో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1000 తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫీచర్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1 6.7-అంగుళాల ఫుల్-హెచ్డి + (1080x2400) సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ- O డిస్ప్లే Exynos 9825 ప్రాసెసర్ 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ టైప్ సీ 25w ఫాస్ట్ఛార్జింగ్ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ -
Apple Days Sale: ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్..!
భారత ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ దిగ్గజం విజయ్ సేల్స్ ఆపిల్ ఉత్పత్తులపై భారీగా క్యాష్బ్యాక్ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆపిల్ డేస్ సేల్ను విజయ్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ మంగళవారం ఆగస్టు 3 న మొదలై ఆగస్టు 9 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఆపిల్ డేస్ సేల్లో భాగంగా ఐఫోన్ల నుంచి మాక్బుక్స్తో పాటు ఇతర ఆపిల్ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల ద్వారా భారీగా క్యాష్బ్యాక్ను కూడా అందిస్తోంది. దేశ వ్యాప్తంగా కంపెనీ రిటైల్ అవుట్లెట్లలో ఈ ఆఫర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కంపెనీకి చెందిన వెబ్సైట్ విజయ్సేల్స్. కామ్లో కూడా కొనుగోలు చేయవచ్చును. ఆపిల్ ఉత్పత్తులపై విజయ్ సేల్స్ అందిస్తోన్న ఆఫర్లు..! ఐఫోన్ 11 ప్రారంభ ధర రూ. 50,999. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 ప్రో ధర రూ. 1,09,900 నుంచి ప్రారంభంకానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ధర రూ.1,19,999 నుంచి ప్రారంభంకానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 ధర ప్రారంభ ధర రూ. 73,400. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 6000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ. 63.499. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 6000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ ఎస్ఈ ప్రారంభ ధర రూ. 35,990. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ ఎక్స్ఆర్ ప్రారంభ ధర రూ. 43,199. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐపాడ్ ప్రారంభ ధర రూ. 24,500 కాగా, ఐపాడ్ ప్రో ప్రారంభ ధర రూ. 55,900 కాగా చ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. మాక్బుక్ ఎర్ ఎమ్1, మాక్బుక్ ప్రో విత్ ఎమ్1 చిప్ సెట్ కొనుగోలుపై వరుసగా రూ. 6000, రూ 7000 క్యాష్ బ్యాక్ను అందిస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఆపిల్ వాచ్ ఎస్ఈ కొనుగోలుపై వరుసగా రూ. 3000, రూ. 2000 క్యాష్ బ్యాక్ను అందిస్తోంది. -
ఆపిల్ ఎయిర్పాడ్స్పై భారీ తగ్గింపు...!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 25 నుంచి ప్రారంభమై జూలై 29తో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా ఆపిల్కు చెందిన ఎయిర్పాడ్ ప్రోపై భారీగా తగ్గింపును ప్రకటించింది. ఆపిల్ ఎయిర్పాడ్ ప్రో పై సుమారు రూ. 6,901 డిస్కౌంట్ను అందించనుంది. అంతేకాకుండా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1,500 పొందవచ్చును.దీంతో ఎయిర్పాడ్ ప్రోపై సుమారు రూ. 8 వేల వరకు తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఆపిల్ ఎయిర్పాడ్ ప్రో అసలు ధర. రూ.24,900. ఆపిల్ ఎయిర్పాడ్స్ ప్రో యాక్టివ్ నైస్ కాన్సిలేషన్తో పాటు పది రకాల ఆడియో కోర్ను అందిస్తోంది. అంతేకాకుండా ఐపీఎక్స్4 సర్టిఫికేషన్ను కల్గి ఉంది. వాటితో పాటు ఎయిర్పాడ్స్ ప్రోలో అడాప్టివ్ ఈక్వలైజర్తో వస్తుంది. -
Amazon Prime Day Sale: స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకు ప్రైమ్ డే సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు రెండు రోజలపాటు జరగనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్ భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు ఆపిల్ ఐఫోన్ 11పై సుమారు రూ. 6900 తగ్గింపు ధరతో రూ. 47, 999 అందించనుంది. అసలు ధర. రూ 54,900 వన్ప్లస్ 9పై తొలిసారిగా డిస్కౌంట్ను ప్రకటించింది. కూపన్ల రూపంలో సుమారు రూ. 4000 వరకు తగ్గింపును అందిస్తోంది. వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ను ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ. 22, 999 కు లభించనుంది. 6 నెలల నోకాస్ట్ ఈఎమ్ఐ రూపంలో కూడా కోనుగోలు చేయవచ్చును. షావోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్పై సుమారు రూ. 6000 తగ్గింపు ధరతో రూ. 27,999 అందించనుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 33,999. రెడ్మీ నోట్ 10 ఎస్ స్మార్ట్ఫోన్ రూ.1000 తగ్గింపు ధరతో రూ. 13,999 ధరకు అందించనుంది. అంతేకాకుండా అమెజాన్ పేతో కొనుగోలు చేస్తే రూ. 1000 క్యాష్ బ్యాక్ను అందించనుంది. రియల్మీ సి 11 స్మార్ట్ఫోన్ను అమెజాన్ లాంచ్ చేయనుంది. లాంచ్ ధర రూ .6,999 కాగా ఈ సేల్ భాగంగా రూ. 6,699 కు అందించనుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్: స్మార్ట్ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 25 ఆదివారం నుంచి జూలై 29 వరకు కొనసాగుతుంది. బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్,రియల్మి, పోకో, మోటరోలా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా ఈ రోజు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డుపై కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. ప్రస్తుతం సేల్ లైవ్లో కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న డిస్కౌంట్ ధరలు ఆపిల్ ఐఫోన్ 12 మినీ తగ్గింపు ధర రూ. 57,999, అసలు ధర రూ. 69,990 ఆపిల్ ఐఫోన్ 12 తగ్గింపు ధర రూ. 67,999, అసలు ధర రూ. 79,990 మోటోరోలా రేజర్ తగ్గింపు ధర రూ. 54, 999 అసలు ధర రూ. 1,49,999 ఆసుస్ రాగ్ ఫోన్ 3 తగ్గింపు ధర రూ. 39,999 అసలు ధర రూ. 55,999 మోటోరోలా జీ10 పవర్ తగ్గింపు ధర రూ. 9,999 అసలు ధర రూ. 12,999. రియల్ మీ 8 తగ్గింపు ధర రూ. 13,999, అసలు ధర రూ 16, 999. శాంసంగ్ ఎఫ్62 తగ్గింపు ధర రూ. 17,999 అసలు ధర రూ. 29,999. ఎలక్ట్రానిక్స్పై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న డిస్కౌంట్ ధరలు గో ప్రో 9 తగ్గింపు ధర రూ. 37, 499, అసలు ధర రూ. 47,000 శాంసంగ్ గెలాక్సీ వాచ్ ఆక్టివ్ 2 తగ్గింపు ధర రూ. 14, 990 అసలు ధర రూ. 25,990 నోకియా మీడియా స్ట్రీమర్ తగ్గింపు ధర రూ 1,899 అసలు ధర రూ. 4,999 ఆసుస్ వివోబుక్ గేమింగ్ కోర్ ఐ5 ల్యాప్టాప్ తగ్గింపు ధర రూ. 52, 490, అసలు ధర రూ. 76, 990. -
Amazon Prime Day Sale: అమెజాన్ అందిస్తున్న ఆఫర్లు ఇవే...
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకు ప్రైమ్ డే సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు రెండు రోజలపాటు జరగనుంది. అమెజాన్ ఈ సేల్లో భాగంగా సరికొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. పలు ఉత్పత్తులపై భారీగా ఆఫర్లను ఇవ్వనుంది. హెచ్డీఎఫసీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ స్మార్ట్ఫోన్స్, ఫిట్నెస్ అక్సేసరీస్, టీవీలు, అమెజాన్ గ్యాడ్జెట్స్, అలెక్సా పవర్డ్ డివైజ్లపై భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్షిప్ సభ్యులకు మాత్రమే. అమెజాన్ ఫోన్లపై అందిస్తోన్న ఆఫర్లు వన్ప్లస్, శాంసంగ్, ఐక్యూ, షావోమీ కంపెనీల కొత్త ఉత్పత్తులు ప్రైమ్ డే సేల్లో లాంచ్ కానున్నాయి. పలు స్మార్ట్ ఫోన్లపై సుమారు రూ. 3000 కూపన్ ఆఫర్లను అందించనున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే స్మార్ట్ఫోన్లపై 6 నెలల స్క్రీన్ రిప్లెస్మెంట్ను ఇవ్వనుంది. టెక్నో స్మార్ట్ఫోన్లపై సుమారు 20శాతం పైగా డిస్కౌంట్స్. వివో స్మార్ట్ఫోన్లపై సుమారు 30 శాతం వరకు డిస్కౌంట్ దాంతో పాటు పాత ఫోన్ ఏక్సేచేంజ్పై సుమారు రూ. 2500 ఇవ్వనుంది. ఒప్పో ఫోన్లపై సుమారు 20శాతం వరకు డిస్కౌంట్, 12 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ. వన్ప్లస్ స్మార్ట్ఫోన్లపై ఎక్సేచేంజీపై సుమారు రూ. 5000 అందిస్తోంది. షావోమీ ఫోన్ల ఎక్సేచేంజీపై సుమారు రూ. 3000 దాంతో పాటుగా ఎంపిక చేసిన ఫోన్లపై ఉచిత స్క్రీన్ రిప్లేస్మెంట్ను ఇవ్వనుంది. ఫిట్నెస్ ట్రాకర్స్, ల్యాప్ట్యాప్లపై.. మొబైల్ ఆక్సేసరిస్ రూ.69 నుంచి ప్రారంభం కానున్నాయి. ల్యాప్ట్యాప్లపై సుమారు రూ. 35 వేల వరకు డిస్కౌంట్లను అందించనుంది. గేమింగ్, ఫిట్నెస్ ట్రాకర్స్పై సుమారు 60 శాతం వరకు డిస్కౌంట్లను ఇవ్వనుంది. హెడ్ఫోన్స్పై 75 శాతం వరకు, స్పీకర్స్, హై స్పీడ్ రూటర్స్, వైఫై స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాల పై సుమారు 70 శాతం వరకు, డేటా స్టోరేజ్ డివైజ్లపై సుమారు 60 శాతం వరకు, కంప్యూటర్ కంపోనెంట్స్, మానిటర్స్పై సుమారు 50 శాతం వరకు తగ్గింపును కొనుగోలుదారులు ప్రైమ్ డే సేల్ భాగంగా పొందవచ్చును. హోమ్ ఆప్లియన్స్పై.. ఏసీలపై సుమారు 40 శాతం, రిఫ్రిజరేటర్లపై 30 శాతం, వాషింగ్ మెషిన్లపై సుమారు 30 శాతం, మైక్రో వేవ్స్పై 35 శాతం, 43, 40 ఇంచుల స్మార్ట్ టీవీలపై సుమారు 50 శాతం వరకు, 4కే టీవీలపై సుమారు 60 శాతం భారీ డిస్కౌంట్లను ఈ సేల్ పొందవచ్చును. -
Reliance Digital: ‘డిజిటల్ ఇండియా సేల్’లో బంపర్ ఆఫర్లు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ డిజిటల్ కొనుగోలుదారులకు ‘ ఇండియా బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్-డిజిటల్ ఇండియా సేల్’ పేరిట సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్లను రిలయన్స్ డిజటల్ అందిస్తోంది. డిజిటల్ ఇండియా సేల్ జూలై 26 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్ అన్ని మై జియో స్టోర్స్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్లో అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కంపెనీ వెబ్సైట్ www.reliancedigital.in. ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చును. టెలివిజన్లు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, యాక్సెసరీస్ వంటి విస్తృతమైన కేటగిరీల శ్రేణిలో ప్రత్యేకమైన ఆఫర్లు లభించును. జూలై 22 నుంచి ఆగస్టు 5, 2021 వరకు రూ.10,000 కనీస లావాదేవీపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద 10% క్యాష్ బ్యాక్ను అందిస్తోంది.ఈ ఆఫర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఈఎమ్ఐ లావాదేవీలపై కూడా లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో, కస్టమర్లకు డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్లు లభిస్తాయి. జూలై 31 వరకు ఎంపిక చేసిన ఫోన్స్ పై యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ లభించును. వన్ప్లస్ నార్డ్2 స్మార్ట్ఫోన్ సేల్భాగంగా జూలై 28 నుంచి లభిస్తుంది. అంతేకాకుండా ఆపిల్ వాచ్ సీరీస్ 6, శాంసంగ్ గాలక్సీ ఆక్టివ్ 2 స్మార్ట్ వాచ్లు అతి తక్కువ ధరకే లభించనున్నాయి. SpO2 ఫీచర్ కలిగిన ఈ సరికొత్త ఫైర్ బోల్ట్ అగ్ని స్మార్ట్ వాచ్ డిజిటల్ ఇండియా సేల్ లో భాగంగా ఎక్స్ క్లూజివ్ గా రూ. 2,599/ ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. ల్యాప్ ట్యాప్ కేటగిరీలో బ్యాంక్ క్యాష్ బ్యాక్, బ్రాండ్ వారంటీ ఆఫర్లతో పాటు అదనంగా రూ. 14,990/- విలువైన ప్రయోజనాలు అందుకోగలరు. Asus 10th Gen i5 గేమింగ్ ల్యాప్ టాప్ రూ. 64,999/- ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. దాంతో పాటుగా మ్యాక్ బుక్ ప్రో స్టూడెంట్స్, టీచర్లకు ప్రత్యేకంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే రూ. 7000 క్యాష్ బ్యాక్ తో రూ. 1,12,990/- ఫ్లాట్ ధరకు ఎక్స్ క్లూజివ్ గా లభిస్తుంది. ల్యాప్ టాప్లపై స్పెషల్ డీల్ జూలై 26 నుంచి జూలై 27 న మాత్రమే లభించును. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.32 ఇంచుల స్మార్ట్ టీవీలు రూ. 12,990 నుంచి ప్రారంభం కానున్నాయి. రిఫ్రిజరేటర్లు రూ. 11,990, ప్రారంభం కానున్నాయి. అంతేకాకుంగా కొనుగోలుపై ఉచితంగా రూ. 1,999 విలువైన వస్తువులు లభిస్తాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ. 13,290 ధరతో ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులు తమకు నచ్చిన స్టోర్ల నుంచి మూడు గంటలలోపు డెలివరీ పొందవచ్చును. -
విద్యార్థులకు గుడ్న్యూస్..! ఆపిల్ బంపర్ ఆఫర్..!
అమెజాన్ విద్యార్థుల కోసం బ్యాక్ టూ కాలేజ్ పేరిట బంపర్ ఆఫర్ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘బ్యాక్ టూ స్కూల్’ పేరిట విద్యార్థుల కోసం ఆపిల్ బంపర్ సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా విద్యార్థులు ఆపిల్ మాక్ బుక్ లేదా ఐప్యాడ్ కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఎయిర్పాడ్స్ను అందించనుంది. ఈ ఆఫర్ను భారత అధికారిక ఆపిల్ ఆన్లైన్ స్టోర్లో పొందవచ్చును. ఆపిల్ అందిస్తోన్న సేల్ ప్రకారం.. విద్యార్థులు మాక్ బుక్ను కొనుగోలు చేస్తే ఉచితంగా వైర్డ్ ఛార్జింగ్ వెర్షన్ ఎయిర్పాడ్స్ను అందించనుంది. ఒక వేళ విద్యార్థులు వైర్ లెస్ ఛార్జింగ్ ఎయిర్పాడ్స్ను కోరితే అదనంగా రూ. 4000 ను చెల్లించాల్సి ఉంది. ఎయిర్పాడ్స్ ప్రోపై ఆసక్తి ఉన్న వారు అదనంగా రూ. 10,000 చెల్లిస్తే విద్యార్థులు వాటిని పొందవచ్చును. కాగా ఆపిల్ ఎయిర్పాడ్స్ ధరలు వరుసగా రూ. 14,900, ఎయిర్పాడ్స్ వైర్లెస్ ఛార్జింగ్ రూ. 18,900, ఎయిర్పాడ్స్ ప్రో రూ. 24, 900గా ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు మాక్బుక్ ఎయిర్, మాక్బుక్ ప్రో, ఐమాక్, మాక్ ప్రో, మాక్ మినీ, ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై 20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ను పొందవచ్చును. విద్యార్థులకు ఆపిల్ పెన్సిల్, కీ బోర్డుపై ఎల్లప్పుడు డిస్కౌంట్లను అందించనుంది. అంతేకాకుండా విద్యార్థులు కేవలం నెలకు రూ. 49 చొప్పున ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆపిల్ టీవీ ప్లస్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందగలరు. దాంతో పాటుగా ఈ సబ్స్క్రిప్షన్పై ఆపిల్ ఆర్కేడ్ను మూడు నెలల పాటు విద్యార్థులకు ఆపిల్ అందించనుంది. కాగా ఈ ఆఫర్ కేవలం ప్రస్తుతం ఉన్న, కొత్త కాలేజీలో ఉన్న విద్యార్థులకు వర్తించనుంది. బ్యాక్ టూ స్కూల్ ఆఫర్ను కాలేజీల ఐడీనుపయోగించి విద్యార్థుల అర్హతను ధృవీకరిస్తారని ఆపిల్ తన కంపెనీ అధికారిక వెబ్సైట్లో తెలిపింది. -
ఆపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సోమవారం ఆపిల్ డేస్ సేల్ను ప్రకటించింది. ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. కొనుగోలుదారులకు ఆపిల్ డేస్ సేల్ జూలై 17 శనివారం వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్లో భాగంగా ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11, ఇతర ఆపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అమెజాన్ అందించనుంది. ఆపిల్ డేస్ సేల్లో ఐఫోన్ 12 బేసిక్ ఫోన్ను రూ. 9,000 తగ్గింపుతో రూ .70,900 వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారులు ఇతర ఆపిల్ ఉత్పత్తులపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే లావాదేవీలపై సుమారు రూ. 6,000 అదనపు తగ్గింపును పొందవచ్చును. ఆపిల్ ఐప్యాడ్ మినీ, మాక్బుక్ ప్రో, ఇతర ఉత్పత్తులపై ఆఫర్లను కూడా తీసుకురాబోతోంది. ఆపిల్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ ఎక్స్ మాక్స్ నుంచి ఐఫోన్ 6 ఎస్ వరకు ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్ పొందవచ్చునని అమెజాన్ పేర్కొంది. ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ ఇతర ఆపిల్ మోడళ్లకు ఆన్లైన్లో తగ్గింపు ధరలకు అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్: మొబైల్ ఆఫర్ల ప్రోమో రిలీజ్ చేసిన అమెజాన్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. మొదట ఈ సేల్ను జూన్ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్ కారణంగా ప్రైమ్ డే సేల్ వాయిదా పడింది. కోవిడ్-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్ డే సేల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో డిస్కౌంట్ వచ్చే స్మార్ట్ఫోన్ల జాబితాను అమెజాన్ విడుదల చేసింది. డిస్కౌంట్ ధరలతో లభించే వన్ప్లస్ నార్డ్ సిఇ 5 జి, రెడ్మి నోట్ 10 ఎస్, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్, ఐఫోన్ 11 వన్ప్లస్ 9 ఆర్ 5 జి, రెడ్మి నోట్ 10 ఫోన్లను అమెజాన్ ప్రకటించింది. ఐఫోన్ 12 ప్రో, శామ్సంగ్ నోట్ 20, ఎంఐ 11 ఎక్స్ 5 జి, ఎంఐ 10 ఐ 5 జి, ఐక్యూ 7 లెజెండ్ వంటి ఫోన్లపై కూడా డిస్కౌంట్లను ప్రకటించనుంది. ఈ మొబైళ్ల ధరలను అమెజాన్ పూర్తిగా వెల్లడించలేదు. ప్రైమ్ డే సేల్లో సుమారు 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొబైళ్లపై డిస్కౌంట్ ఆఫర్లను సేల్కు రెండురోజుల ముందు ప్రైమ్ మెంబర్స్కు అందుబాటులో ఉంచనుంది -
అమెజాన్ కస్టమర్లకు గుడ్న్యూస్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకు తీపికబురును అందించింది. అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించింది. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. మొదట ఈ సేల్ను జూన్ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్ కారణంగా ప్రైమ్ డే సేల్ వాయిదా పడింది. కోవిడ్-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్ డే సేల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో అమెజాన్ ప్రైమ్ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రైమ్ డే సేల్లో బ్లాక్బస్లర్ డీల్స్తో పాటు, భారీ డిస్కౌంట్లను, సూపర్ సేవింగ్ డీల్స్ను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుంగా సుమారు 300కి పైగా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కాగా జూలై 8 నుంచి జూలై 24 వరకు అమ్మకందారులతో అమెజాన్ ఒప్పందాలను కుదుర్చుకోనుంది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, వంటివి లాంచ్ చేయడమే కాకుండా వాటిపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లక్షలాది స్థానిక వ్యాపారులకు లాక్డౌన్ నుంచి ఉపశమనం కల్గుతుందని అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. #PrimeDay is here! 🤩 Save the dates 🗓 2️⃣6️⃣•0️⃣7️⃣•2️⃣1️⃣ – 2️⃣7️⃣•0️⃣7️⃣•2️⃣1️⃣ Celebrating 5 years of Prime in India, #DiscoverJoy with two days of savings, great deals, blockbuster entertainment, and much more. 🛍📽🎧 Read more 👉🏼 https://t.co/F4XfMbhcyT pic.twitter.com/UOyH4AU3DE — Amazon India News (@AmazonNews_IN) July 8, 2021 -
అమెజాన్ మెగా హోమ్ మాన్సూన్ సేల్: 70 శాతం వరకు తగ్గింపు!
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు మెగా హోమ్ మాన్సూన్ సేల్ను ప్రకటించింది. ఈ సేల్ జూలై 8 నుంచి జూలై 11 వరకు కొనసాగనుంది. గృహోపకరణాలు, కిచెన్ ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తుల కొనుగోలుపై 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు పది శాతం, రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో భాగంగా, కనీసం ఐదు వేల రూపాయల విలువ గల వస్తువుల కొనుగోలుపై సుమారు 10శాతం తక్షణ డిస్కౌంట్ను అందిస్తోంది. అమెజాన్ శాంసంగ్, ఎల్జీ, వర్ల్పూల్ వంటి సంస్థల వాషింగ్ మెషీన్లపై సుమారు 30శాతం డిస్కౌంట్ను ఇవ్వనుంది. ఎల్జీ, శామ్సంగ్, వర్ల్పూల్, హైయర్, గోద్రేజ్ వంటి సంస్థల రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై అమెజాన్ ఇండియా 35శాతం తగ్గింపును అందిస్తోంది. గీజర్ల కొనుగోలుపై 35 శాతం వరకు, వాటర్ ప్యూరిఫైయర్లపై 45 శాతం వరకు ,బేసిక్ ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 60శాతం వరకు మినహాయింపును ఇస్తోంది. -
ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు...!
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్. ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోని రిలీజ్ చేయనున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్పై సుమారు రూ. 9000 వరకు డిస్కౌంట్ను అందిస్తోంది. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుంచి పొందవచ్చును. అమెజాన్ తన కస్టమర్లకు ఐఫోన్ 12 బేసిక్ మోడల్(64జీబీ) రూ .70,900 కు అందిస్తోంది. ఐఫోన్ 12 బేసిక్ అసలు ధర రూ. 79,900. 128 జీబీ ఐఫోన్ 12 మోడల్ పై సుమారు రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కాగా 256 జీబీ వేరియంట్పై ఏలాంటి ఆఫర్ను అందించడంలేదు. ఐఫోన్ 12 మినీ వేరియంట్ పై సుమారు రూ. 6000 వరకు డిస్కౌంట్ వస్తోంది. అంతేకాకుండా అమెజాన్ పే, లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేస్తే రూ. 400 క్యాష్బ్యాక్ లభించనుంది. చదవండి: ఈ ఏడాది చివరలో ఐఫోన్ 13..! -
సిస్కా నుంచి స్మార్ట్వాచ్..54 శాతం భారీ తగ్గింపు!
ప్రముఖ హోం లైటింగ్, స్మార్ట్ హోం పరికరాల తయారీదారు సిస్కా కంపెనీ కొత్తగా స్మార్ట్వాచ్ను విడుదల చేసింది. భారత్లో గణనీయమైన వృద్ధితో ఎదుగుతున్న స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి ప్రవేశించిన రెండో కంపెనీగా సిస్కా నిలిచింది. సిస్కా తన కంపెనీ నుంచి తొలి స్మార్ట్వాచ్ బోల్ట్ ఎస్డబ్ల్యూ100ను ఆవిష్కరించింది. కాగా ఈ స్మార్ట్ వాచ్ 10 రోజుల లాంగ్లాస్టిక్ బ్యాటరీ బ్యాకప్ను కల్గి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ వాచ్ను రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది. కాగా ఈ స్మార్ట్ వాచ్ 1.28 ఇంచుల టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 10 రకాల విభిన్నమైన స్పోర్ట్స్ ట్రాకింగ్ మోడ్స్ను ఇందులో అమర్చారు. ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ను కల్గి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ వి5తో అన్ని రకాల ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చును. అంతేకాకుండా SpO2 పర్యవేక్షణ, చేతి శానిటైజేషన్ రిమైండర్, పల్స్రేటు, వెదర్ రిపోర్ట్ ను ఈ వాచ్ అందించనుంది. కాగా స్మార్ట్ వాచ్ స్పేక్ట్రా బ్లూ, స్పేస్ బ్లాక్, ఒషన్ గ్రీన్ కలర్ వేరియంట్లలో రానుంది. సిస్కా స్మార్ట్వాచ్ ధరను రూ. 5,499గా నిర్ణయించారు. కాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ స్మార్ట్ వాచ్ను సుమారు 54 శాతం భారీ తగ్గింపుతో రూ. 2,499లకు అందించనుంది. చదవండి: ఆపిల్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం! -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ వచ్చేశాయి.. మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!
సాక్షి, ముంబై: కొత్తగా మొబైల్ ఫోన్లను కొనేవారికి శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో వినియోగదారులకు ప్రత్యేక సేల్ను నిర్వహించనుంది. ఈ నెల 13 నుంచి 16 వరకు సేల్ కొనసాగనుంది. కాగా ఈ సేల్లో మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను వినియోగదారులకు అందించనుంది. ప్రముఖ కంపెనీల మొబైల్ ఫోన్లు ఈ సేల్లో భారీగా తగ్గనున్నాయి. గూగుల్ పిక్సెల్, ఐఫోన్, ఆసుస్, శాంసంగ్ గెలాక్సీ తదితర ఫోన్ల ఆఫర్ ధరలను ఫ్లిప్కార్ట్ రివీల్ చేసింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కు ఒక రోజు ముందుగానే జూన్ 12 అర్ధరాత్రి నుంచే బిగ్ సేవింగ్ డేస్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్లతో పాటుగా ఎలక్ట్రానిక్ డివైజ్లపై 80 శాతం వరకు, స్మార్ట్ వాచ్లపై 60 శాతం వరకు, టాబ్లెట్లపై 50 శాతం వరకు, డెస్క్టాప్, ల్యాప్టాప్లపై సుమారు 30శాతం వరకు డిస్కౌంట్లను అందించనున్నాయి. మొబైల్ ఫోన్లపై ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ఆఫర్లు ఇవే మొబైల్ ఫోన్ అసలు ధర ఆఫర్ ధర గూగుల్ పిక్సెల్ 36,250 26,999 ఐఫోన్ 11 ప్రో 79, 899 74,999 మోటోరొలా రేజర్ 5జీ 1,09,999 89,999 శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 10,999 9999 ఆసుస్ రాగ్ ఫోన్ 3 46,999 41,999 ఐఫోన్ ఎక్స్ ఆర్ 41,999 39,999 వీటితో పాటుగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్స్ జియోనీ మ్యాక్స్ ప్రో, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనున్నాయి. అంతేకాకుండా ఎస్బీఐ కార్డు ద్వారా షాపింగ్ చేసే వినియోగదారులకు పది శాతం ఇన్స్టాంట్ తగ్గింపును అందించనుంది. -
రాయితీలతో ‘ఎలక్ట్రిక్’ సవారీ!
సాక్షి, హైదరాబాద్: రోడ్లపైకి విపరీతంగా వచ్చి చేరుతున్న వాహనాలతో చుట్టుముడుతున్న కాలుష్యానికి కళ్లెం వేసే క్రమంలో ఎక్కువ సంఖ్యలో బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను అనుమతించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించటంతోపాటు ఉద్యోగావకాశాలు కూడా కల్పించేందుకు బ్యాటరీ వాహనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ వాహనాలవైపే మక్కువ చూపుతున్న నేపథ్యంలో వారి దృష్టిని ఆకర్షించేలా ఈ–వాహనాలు కొంటే ప్రత్యేక తాయిలాలు ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రూపొందిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం ఈ మేరకు ప్రకటించ డంతో ఇప్పుడు పాలసీ రూపొందించే బాధ్య తను పరిశ్రమల శాఖ చేపట్టింది. రవాణాశాఖ తో కలసి కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నవి 10 వేలే... రాష్ట్రంలో ప్రస్తుతం నామమాత్రంగానే ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. ఆ సంఖ్య కూడా ఇటీవలి కాలంలోనే పెరిగింది. గత రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రాష్ట్రంలో దాదాపు 23 శాతం పెరిగింది. ప్రస్తుతం అన్ని రకాల మోడళ్లు కలుపుకొని 10 వేల వరకు బ్యాటరీ వాహనాలు ఉన్నాయి. వచ్చే ఐదారేళ్లలో ఈ సంఖ్యను భారీగా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త పాలసీకి రూపకల్పన చేస్తోంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు, త్రైమాసిక పన్ను, లైఫ్ ట్యాక్స్లలో రాయితీలు ఇవ్వడం ద్వారా ఈ వాహనాలు కొనేందుకు కొనుగోలుదారులను ప్రోత్సహించనుంది. పెట్టుబడిదారులకూ ఆఫర్లు... రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టే వారిని ఆకట్టుకొనేలా రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల తయారీ, బ్యాటరీల తయారీ, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.. ఇలా వివిధ రకాల సంస్థలను ప్రోత్సహించనుంది. నిర్ధారిత కాలానికి, ముందుగా పెట్టుబడి పెట్టే నిర్ధారిత సంఖ్యలోని సంస్థలకు 20 శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, పవర్ టారిఫ్ డిస్కౌంట్ 25 శాతం, ఎస్జీఎస్టీలో రీయింబర్స్మెంట్ సౌకర్యం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు తదితరాలు అందించనుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి కొంత స్థలాన్ని కూడా కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రంగంలో లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, రెండున్నర లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉందని అంచనా. రాయితీలు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర పెద్ద వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తొలుత దీన్ని నిర్ధారిత సంఖ్యలో వాహనాలకు మాత్రమే పరిమితం చేయాలనుకుంటోంది. ముందుగా కొనే 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 వేల కార్లు, ఇతర పెద్ద వాహనాలకు దీన్ని వర్తింపచేయాలనుకుంటోంది. ఆ తర్వాత కొనే వాహనాలకు ఆ పన్నును పరిమిత మొత్తంలో వేయాలా లేక రాయితీని కొనసాగించాలా అనే విషయంపై తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం మారుమూల పల్లెటూళ్లలోనూ ఆటోరిక్షాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఆ కేటగిరీలో కూడా ఢిల్లీ తరహాలో బ్యాటరీ వాహనాలను ప్రోత్సహించనుంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో నూరు శాతం రాయితీలను తొలి 20 వేల ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. త్రైమాసిక పన్ను, లైఫ్ ట్యాక్స్ విషయంలోనూ ఇదే తరహా పరిమితులు వర్తించనున్నాయి. -
పతంజలి భారీ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై : ఎఫ్ఎంసీజీ సెక్టార్లో దూసుకొచ్చిన దేశీయ సంస్థ బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ పలు ఉత్పత్తులపై పరిమిత కాలానికి ప్రత్యేక డిస్కౌంట్లను, కాంబో ఆఫర్లను అందిస్తోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా విక్రయాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో వినియోగ దారులను ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా భారీగా విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా అయిదారు రకాల ఆహారోత్పత్తులు, ఆయిల్స్, డ్రింక్స్, ఆటా, ఓట్స్, రడీ టూ ఈట్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా మూడు వస్తువులు కొంటే మూడు వస్తులను ఉచితంగా అందిస్తోంది. అలాగే కొన్ని ఆహార ఉత్పతులను ధరలను సగానికిపైగా తగ్గించి వినియోదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇంకా షాంపూలు, ఫేస్వాష్, ఇతర సౌందర్య సాధనాలపై కాంబో ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకునేందుకు, వినియోగదారులకు భారీగా ఆకట్టుకునేందుకు తొలిసారిగా పతంజలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా రసాయన రహిత, సహజసిద్ద ఉత్పత్తులంటూ దేశీయ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ప్రవేశించిన పతంజలి ఆయుర్వేద సంస్థ అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారతీయ రంగ సంస్థగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ బాలకృష్ణ సీఈవోగా హరిద్వార్ కేంద్రంగా నడుస్తున్న పతంజలి లాభాలను ఎన్డీయే సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ దెబ్బ కొట్టింది. అలాగే విదేశీ కంపెనీలు పోటీగా నిలవడంతో అమ్మకాల్లో, లాభాల్లోనూ వెనకబడింది. సీఏఆర్ఈ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018లో వెయ్యికోట్ల రూపాయలు కోల్పోయింది. కంపెనీ 2016-17లో రూ.9030 కోట్లు అమ్మకాలు సాధించగా.. 2017-18లో రూ.8135కోట్లకు పడిపోయింది. -
మహీంద్ర బైక్పై రూ.75 వేల భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : మహీంద్రా కంపెనీ తన మోజో బైక్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మహీంద్ర మోజో యూటీ 300 బైక్ కొనుగోలు చేసే వినియోగదారులు ఏకంగా రూ.75 వేల తగ్గింపును పొందవచ్చు. ముఖ్యంగా మహీంద్రా కంపెనీలో పని చేసే ఉద్యోగులకైతే రూ.75వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందుతుంది. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ఆఫర్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్ర డీలర్ ద్వారా అయితే రూ.40 వేల డిస్కౌంట్ అందుతుంది. అలాగే పాత బైక్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.60వేలడిస్కౌంట్ పొందవచ్చు. మరోవైపు టూవీలర్ సెగ్మెంట్లో జావా బైక్స్ ఎంట్రీ మోజో బైక్ విక్రయాలను దెబ్బతీసింది. అటు మోజో బైక్ ధర భారీగా ఉండడటంతో కస్టమర్లను ఆకర్షించలేకపోతోంది. దీంతో ఈ బైక్ తయారీని నిలిపివేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే భారీ స్థాయిలో డిస్కౌంట్ని అందిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మోజో బైక్ ప్రధానంగా రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. యూటీ 300, ఎక్స్టీ 300పేర్లతోఅందుబాటులో ఉన్న ఈ రెండింటిలో యూటీ 300 ధర తక్కువ. యూటీ 300 ధర రూ.149 లక్షలు కాగా, ఎక్స్టీ 300 ధర రూ.1.79 లక్షలుగా ఉంది. -
గూగుల్ ‘పిక్సెల్ 2’ పై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: గూగుల్ లేటెస్ట్ ష్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ 2 పై స్మార్ట్ఫోన్ లవర్స్కు తీపి కబురు అందించింది. పిక్సల్ సిరీస్లో వచ్చిన ఈ స్మార్ట్ఫోన్ను ఇపుడు కేవలం రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు. ‘బిగ్ షాపింగ్ డేస్’ పేరిట ఈ నెల 7నుంచి 9 వరకు నిర్వహించే సేల్లో గూగుల్ పిక్సల్2 (64జీబీ వేరియంట్) ధరపై మొత్తం రూ.21 వేల భారీ డిస్కౌంట్తో రూ.39,999లకే లభ్యం. గూగుల్, ఫ్లిప్కార్ట్ సంయుక్తంగా ఈ భారీ డిస్కౌంట్ను అందిస్తున్నాయి. వన్ప్లస్ 5టీ ధర రేంజ్లోకి ఈ డివైస్ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ పిక్సల్ 2 అక్టోబర్లో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చింది. భారత్లో దీని ప్రారంభ ధర రూ.61వేలు. ఫ్లిప్కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్’ సేల్లో దీనిపై రూ.11వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. క్రెడిట్ / డెబిట్ కార్డు వినియోగదారులకు కార్డు పేమెంట్స్ ద్వారా మరో రూ.10వేలు తగ్గింపు. మొత్తంగా రూ.21వేలు తగ్గి రూ.39,999కే ఫోన్ ఇది లభ్యం కానుంది. దీంతో పాటు ఎక్ఛ్సేంజ్ ఆఫర్ కింద రూ.18 వేలు. అంతేకాదు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.36,500 బైబ్యాక్ గ్యారెంటీని ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. అంతేకాకుండా ‘బిగ్ షాపింగ్ డేస్’ సేల్లో మరిన్ని ఫోన్లపై కూడా ఫ్లిప్కార్ట్ ఆఫర్లను అందిస్తోంది. -
వినాయక చవితి: స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో స్మార్ట్ ఫోన్ల ఫై ఆఫర్లు కురిపిస్తున్నాయి. వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లపై దాదాపు 8నుంచి 45 శాతం డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. లెనోవా ఎ 6699 ప్లస్ (బ్లాక్) : లెనోవో స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందిస్తున్న డిస్కౌంట్ 27శాతం అంటూ కేవలం రూ.6,240 కే దీన్ని సొంతం చేసుకోవచ్చు. అసలు ధర రూ. 8,499 నోకియా 6: నోకియా 6 (32జీబీ)స్మార్ట్ఫోన్ ఈ రోజు అమెజాన్ లో సేల్ కి అందుబాటులో ఉంది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలైన ఈసేల్ రూ.14,999 ధరలో అందుబాటులోఉంది. శాంసంగ్ ఆన్ 7 ప్రొ: ఈ శాంసంగ్ ఆన్ 7 ప్రో స్మార్ట్ ఫోన్పై ద అమెజాన్ ఇస్తున్న 5శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 9,490 అంటే రూ. 8,990 కు పొందవచ్చు . మోటో ఈ 4వజనరేషన్: దీనిపై కేవలం ఫ్లిప్కార్ట్ లో 6 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 8,999 లకు లభ్యం లెనోవో వైబ్ కే 5: ఫ్లిప్కార్ట్లో 16శాతం తగ్గింపుతో రూ. 9,999 లకు లభ్యం. అసలు ధర రూ.11,999 వీటితో పాటు లెనోవా జెడ్ 2 స్మార్ట్ఫోన్పై 40శాతం, ఆపిల్ ఐఫోన్ 6 మీద 44 శాతం, 6ఎస్ 23 శాతం దాకా డిస్కౌంట్, శాంసంగ్ గెలాక్సీ 6శాతం, కూల్ ప్యాడ్ నెట్ 5 మీద 8 శాతం దాకా డిస్కౌంట్ను అందిస్తున్నాయి. ఈ తగ్గింపు ఆఫర్లపై పూర్తి వివరాలకు వెబ్సైట్లను సందర్శించగలరు. -
ఎయిర్ ఏషియా బిగ్ సేల్
హైదరాబాద్: విమాన టికెట్లకు సంబంధించి ఎయిర్ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్... భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.తమ బిగ్సేల్లో భాగంగా పుణే, గోవా, కోచి, గౌహతి, వైజాగ్ వంటి దేశీయ రూట్లలో విమాన టికెట్లు రూ.990 (అన్ని చార్జీలు కలుపుకొని)నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీగ్ట్రాండ్ టెక్ పేర్కొన్నారు. అలాగే బ్యాంకాక్, కౌలాలంపూర్, వంటి అంతర్జాతీయ నగరాలకు తమ గ్రూప్ విమానాల ద్వారా జరిపే విమాన ప్రయాణాలకు చార్జీలను రూ.3,699కు ఆఫర్ చేస్తున్నామని వివరించారు. ఈ నెల 29 వరకూ ఎయిర్ఏషియాడాటకామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ కాలం వచ్చే ఏడాది మే 1 నుంచి 2017 ఫిబ్రవరి 5 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్కు డెరైక్ట్ విమాన సర్వీస్ను ఎయిర్ ఏషియా ఎక్స్ నుంచి అందిస్తున్నామని వివరించారు. -
సెల్పాయింట్లో ఆఫర్ల వెల్లువ
విశాఖపట్నం సిటీ : సెల్పాయింట్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 20 రోజులుగా వినియోగదారులకు ఇస్తున్న ప్రత్యేక ఆఫర్లు దీపావళితో ముగియనున్నాయి. ఆధునిక మోడళ్లతో సెల్పాయింట్ షోరూమ్లు కళకళలాడుతున్నాయి. భారీ డిస్కౌంట్లతో పాటు కాంబో, జోడీ ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా సెల్పాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ మోహన్ప్రసాద్ పాండే మాట్లాడుతూ మొబైల్ కొనుగోలుదారులకు బంపర్ బహుమతుల కింద 10 మందికి మలేషియా ఫారిన్ ట్రిప్, ఐదుగురికి స్కూటీ పెప్స్లను డ్రా ద్వారా అందజేయనున్నట్టు తెలిపారు. తమ షోరూమ్స్లో శామ్సంగ్, సోనీ, నోకియా, కార్బన్, సెల్కాన్, మైక్రోమ్యాక్స్, ఎల్జీ, హెచ్టీసీ, ఐఫోన్ కంపెనీల సెల్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నామని చెప్పారు. జోడి ఆఫర్తో కొన్ని రకాల సెలెక్టెడ్ బ్రాండ్లపై బ్లూటూత్, ఫ్లిప్ కవర్స, మెమరీ కార్డులు, హెడ్ఫోన్లు, ట్యాబ్, సౌండ్ సిస్టమ్స్, మిక్సీ, ఇండక్షన్ స్టవ్, రైస్కుక్కర్లతోపాటు మరెన్నో ఆకర్షణీయమైన వస్తువులు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక మొబైల్ కొనుగోలు చేస్తే మూడు మొబైల్స్ ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. గెలక్సీ నోట్-4 కొనుగోలుపై ఎల్ఈడీ టీవీ ఉచితంగా, ఐఫోన్ 6(ఎస్), ఐఫోన్ 6(ఎస్) ప్లస్ కొనుగోలుపై మలేషియా ట్రిప్ని గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. తమ ఆఫర్లకు విశేష స్పందన లభిస్తోందన్నారు. డైమండ్ పార్కు, డాబాగార్డెన్స, గాజువాక, ఎన్ఏడీ, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, తణుకు, అమలాపురం, విజయవాడ, గుంటూరులో మొత్తం 60 శాఖలున్నాయని చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
ఆకర్షిస్తున్న ఆన్లైన్ షాపింగ్
న్యూఢిల్లీ: ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్... తదితర అంశాలు ఆనలైన్ షాపింగ్ జోరును పెంచుతున్నాయి. ఈ అంశాల కారణంగా వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ పట్ల ఆకర్షితులవుతున్నారని తమ సర్వేలో వెల్లడైందని క్యాష్బ్యాక్, కూపన్ల సైట్ క్యాష్కరోడాట్కామ్ తెలిపింది. ఈ సంస్థ 3,200 మంది ఆన్లైన్ షాపర్లపై నిర్వహించిన ది ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్స్ సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు..., దరలు తక్కువగా ఉండడం, ఇంట్లో ఉంటూనే షాపింగ్ చేసే వీలుండడం.. వంటి అంశాలు కూడా ఆన్లైన్ షాపింగ్ జోరును పెంచుతున్నాయి. క్యాష్బ్యాక్ ఆఫర్ తమను ఆకర్షించిందని సర్వేలో పాల్గొన్న 95 శాతం మంది చెప్పారు. భారీ డిస్కౌంట్ల కారణంగా ఆన్లైన్ షాపింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నామని 27 శాతం మంది పేర్కొన్నారు. తక్కువ ధరల కారణంగా ఆన్లైన్ షాపింగ్కు ఆకర్షితులవుతున్నామని 25 శాతం మంది వివరించారు. సౌకర్యం దృష్టికోణంలో ఇంటర్నెట్ ద్వారా షాపింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నామని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎంచుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయని 16 శాతం మంది, నచ్చకపోతే వస్తువులు తిరిగి ఇచ్చే విధానం బావుండటంతో 10 శాతం మంది ఆన్లైన్ షాపింగ్కు జై కొడుతున్నారు. 40 శాతం మంది సగటున ఏడాదికి రూ.10,000 చొప్పున ఆన్లైన్ షాపింగ్ చేస్తుండగా, దాదాపు 10 శాతం మంది సగటున ఏడాదికి రూ.50,000 చొప్పున షాపింగ్ చేస్తున్నారు. వస్తువును ఎంచుకునేందుకు ధర అంశానికి ప్రాధాన్యత ఇస్తామని 30 శాతం మంది, వస్తువు నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ విస్తృతి పెరుగుతుండడంతో భారత ఇ-కామర్స్ మార్కెట్ దూసుకుపోతోంది. సమీప భవిష్యత్తులో ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య 20 కోట్లకు సులభంగానే చేరుతుంది. 2013లో భారత ఇ కామర్స్ మార్కెట్ 33 శాతం వృద్ధితో రూ.62,967 కోట్లకు చేరిందని అంచనా.