kuchipudi
-
మహా కుంభమేళాలో మన సాంస్కృతిక పరిమళాలు
అనేక శాస్త్రీయ నృత్యప్రదర్శనలు మహా కుంభమేళాలో జరుగుతున్నాయి. వీటిలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, సత్రియా.. ఇతర నృత్యరూపాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వడానికి ఎంపికయ్యారు. వారిలో హైదరాబాద్ నుంచి ఎంపికైన ప్రతిభావంతులైన కూచిపూడి నృత్యకారిణులు పద్మజారెడ్డి, దీపికారెడ్డిలు ఉన్నారు.నయనానందంప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో గణతంత్ర దినోత్సవం రోజున గంగా పండాల్లో పెద్దస్టేజీపై ప్రదర్శన ఇచ్చాం. యు.పి. ప్రభుత్వంతోపాటు కేంద్ర సాంస్కృతిక శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఉదయం మా శిష్య బృందంతో కలిసి నదీ స్నానాలు చేశాం. చిన్నా, పెద్దా తేడా లేకుండా లక్షలాదిగా భక్తులు ఒక ప్రవాహంలా కదలి వెళ్లడం చూస్తుంటే మాకందరికీ రోమాంచితం అయ్యింది. దారిలో ఖిలా ఘాట్ దగ్గర జనగణమన, వందేమాతరం వినిపిస్తూ ఉంటే మాటల్లో చెప్పలేని ఆనుభూతి. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు అలుపు లేకుండా నడిచాం.నదీ స్నానం చేసి, రూమ్కి వచ్చి, సాయంత్రం ప్రదర్శన చేశాం. గంగామాతగా నా కూతురు శ్లోకారెడ్ది, పార్వతిగా నేను, రుత్విక అనే అమ్మాయి శివుడిగా, 12 మంది శిష్యబృందంతో ప్రదర్శన ఇచ్చాం. డి.ఎస్.శాస్త్రి సంగీతం అందించారు. అక్కడికి వచ్చిన భక్తులు ఎంతోమంది తమ హర్షధ్వానాలతో మా ప్రదర్శనను అభినందించారు. జవాన్లు వచ్చి ఫొటోలు తీసుకున్నారు. 50 నిమిషాలపాటు జరిగిన ఈ నృత్య ప్రదర్శనలో శివపార్వతి కళ్యాణం, గంగను భగీరథుడు భూమికి తీసుకురావడంలో చేసిన తపస్సు ప్రధానాంశాలు. కుంభమేళాకు తగినట్టు కొన్ని మార్పులు చేసి, ఇందులో ప్రదర్శన ఇచ్చాం. పవిత్ర నదీస్నానం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇన్నేళ్లుగా కళాసేవ చేయడం వల్ల మహాకుంభమేళాలో ప్రదర్శించే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. మా శిష్యబృందం చాలా ఆనందించారు. అన్ని కోట్లమందిని చూడటమే నయనానందకరం అనుకుంటే, మా నృత్యం ద్వారా అక్కడకు వచ్చినవారికి మేం నేత్రానందం కలిగించడం అదృష్టంగా భావిస్తున్నాం. – దీపికారెడ్డి, కూచిపూడి నృత్యకారిణినమామి గంగే: డాక్టర్ పద్మజారెడ్డిగంగ పారే చోటుకి యాత్రలకు వెళితే ఆ నీటిని ఇంటికి తెచ్చుకుంటాం. మన ఇళ్లలో అందరూ తలపై చల్లుకుంటారు. బంధుమిత్రులకు కూడా ఆ నీటిని ఇస్తుంటారు. ఎందుకంటే, గంగ స్వచ్ఛమైనది కాబట్టి. మనం ఒక దేవతను కలుషితం చేసి, మన బిడ్డలకు ఇస్తున్నామా.. ఇది కరెక్టేనా.. ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకోవాలా, మనకి బాధ్యత లేదా.. ఈ విషయాన్నే ఆలోచించి ‘నమామి గంగే’ పేరుతో మహా కుంభమేళాలో 30 మంది శిష్యబృందంతో కలిసి కూచిపూడి నృత్యం చేస్తున్నాను. కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి కుంభమేళాకు రెండు వారాల ముందే ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 9న పాల్గొనబోయే ఈ కార్యక్రమం గురించే కాదు ఏ కాన్సెప్ట్ అనుకున్నా దానికి ముందు నాకు కొన్ని నిద్రలేని రాత్రులే ఉంటాయి.కాన్సెప్ట్ ఎలా ఉండాలి, దానికి తగిన కొరియోగ్రఫీ, ఎంతమంది, డ్రెస్సింVŠ ... అన్నింటి గురించి అర్ధరాత్రులు కూర్చొని నోట్స్ రాసుకుంటాను. గ్రాఫ్స్ గీస్తూ, ప్లాన్స్ రాసుకుంటూ ఉంటాను. టాపిక్ గురించి ఎవరూ నన్నేం అడగలేదు. కుంభమేళా నదీస్నానం. కాబట్టి నేనే ‘గంగానది’ గురించి టాపిక్ ఎంచుకున్నాను. నృత్యమంతా గంగ, శివుడు, శక్తి ప్రధానంగా ఉంటుంది. గతంలో స్వచ్ఛగంగలో భాగంగా దేశంలో మొత్తంలో ప్రధానంగా గంగానది పారే ఐదు చోట్లలో నృత్య ప్రదర్శన ఇచ్చాను. కళ సామాజిక చైతన్యానికి తోడ్పడాలి. ఆ తపనతోనే పురాణాల నుంచి ఎన్నో కథనాలు తీసుకొని చేశాను.‘భ్రూణ హత్యలు, హెచ్ఐవి పట్ల అవగాహన, ప్రకృతిని కాపాడుకోవడం... వంటి సామాజిక అంశాలమీద నృత్యప్రదర్శనలు ఇచ్చాను. ఇందుకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాను. ఈసారి మహా కుంభమేళాలలో నా నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. 50 ఏళ్ల నా నృత్య జీవనంలో 30 ఏళ్లుగా సామాజిక అంశాలలో ప్రజలకు అవగాహన కలిగించేలా వేలాది ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. ఈ కార్యక్రమం తర్వాత ప్రభుత్వం చేస్తున్న మూసీ ప్రక్షాళనలో ‘నమామి మూసీ’ కథనాన్ని నృత్యరూపకంగా తీసుకురాబోతున్నాను. – డాక్టర్ పద్మజారెడ్డి, కూచిపూడి నృత్యకారిణి -
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్ జయంత్. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్ జయంత్ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్ జయంత్. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్ పర్సన్’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్ఎన్ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్’ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. -
అందెల రవళికి స్వర్ణోత్సవం
నేటి నుంచి జరగబోయే పతాక స్వర్ణోత్సవాలకు కూచిపూడి సిద్ధమైంది. సిద్దేంద్రయోగి అడుగు జాడలతో కూచిపూడి వెలిగిపోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కూచిపూడి అభిమానులు, నాట్యకారులను అమితంగా ఆకర్షిస్తున్న మాట... కూచిపూడి స్వర్ణోత్సవ పతాకం. ‘కూచిపూడి’ పుట్టిన కూచన్నపూడి గ్రామం పేరు కూచిపూడిగా మారింది. దేశానికి జాతీయ జెండా ఉన్నట్లుగానే కూచిపూడి వైభవాన్ని ప్రతిబించించే పతాకం ఒకటి ఉండాలని వేదాంతం పార్వతీశం సంకల్పించారు. చెరకుగడ, జడ, కర్ర గుర్తులతో 1974లో పతాకాన్ని రూపొందించారు. ఆ రూపకల్పన జరిగి యాభైఏళ్లు పూర్తయిన సందర్భంగా పతాక స్వర్ణోత్సవాలకు ముస్తాబైంది కూచిపూడి. కూచిపూడి కళా పీఠం దగ్గర 50 అడుగుల ఎత్తులో నిర్మించిన స్థూప పతాకాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. మూడు రోజులపాటు కూచిపూడి గురువులు, కళాకారులు, కళాభిమానుల మధ్య రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి. పతాక స్వర్ణోత్సావాల నేపథ్యంలో చివరిరోజు రెండు వేల మందికి పైగా కళాకారులతో ప్రదర్శన ఇచ్చేందుకు కూచిపూడి సిద్ధం అయింది. ప్రదర్శనలకు ముందు అంబాపరాకు పాట పాడడం సంప్రదాయంగా వస్తోంది ‘అందెల రవమిది పదములదా... అంబరమంటిన హృదయముదా’ అంటూ కూచిపూడి స్వర్ణోత్సవ పతాకం తన సంబరాన్ని అంబరంతో పంచుకునే దృశ్యం కనుల విందు చేయనుంది. గత వైభవం ఘనంగా...మన సంప్రదాయ కళను భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. పతాక స్వర్ణోత్సవాలలాంటి కార్యక్రమాల ద్వారా గత వైభవాన్ని మళ్లీ ఘనంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఆ ఉత్సాహంతో మన నాట్యకళ మరింత శక్తిమంతమై మరింతగా జనాల్లోకి వెళుతుంది.– జి. శ్రీవత్సల, రాజమహేంద్రవరంనవతరానికి స్ఫూర్తిని ఇచ్చేలా...అమ్మ సలహా మేరకు నేర్చుకున్న కూచిపూడి ఇప్పుడు నాకు మరో అమ్మ. కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల గురించి తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాను. దేశ విదేశాల నుంచి నాట్యకారులు పాల్గొనే ఈ కార్యక్రమాలతో ఆ గడ్డపై గత వైభవం మరోసారి పునరావిష్కృతం అవుతుంది. నవతరానికి స్ఫూర్తిని ఇస్తుంది.– ఎం. వసుధ, హైదరాబాదుఆ జెండా రెప రెపలలో...కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల సందడి ఆప్రాంతానికి మాత్రమే పరిమితమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కూచిపూడి కళాకారులకు సంతోషాన్ని కలిగించే విషయం. ఆ జెండా రెపరెపలలో కూచిపూడి కళ మరింతగా వెలిగిపోవాలని కోరుకుంటున్నాను.– లంక సుస్మిత, విజయవాడదిశానిర్దేశం చేసే పతాకంకూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు ప్రపంచం నలుమూలలలో ఉన్న కూచిపూడి కళాకారులకు పండగలాంటివి. అంతెత్తున ఎగరబోయే జెండా కూచిపూడి నృత్యానికి సంబంధించి మౌనంగానే దిశానిర్దేశం చేయనుంది.– జల్లూరి శరణ్య, మచిలీపట్నంకెనడాలో కూచిపూడియాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తునందుకు సంతోషంగా ఉంది. కెనడాలో కూచిపూడి అకాడమీ ఏర్పాటు చేశాను. ఆసక్తి ఉన్న వారికి నేర్పించడంతో పాటు ప్రదర్శనలు ఇస్తున్నాను. కూచిపూడి నాట్య వ్యాప్తి కోసం నా వంతుగా కృషి చేస్తున్నాను.– డాక్టర్ వేదాంతం వెంకట నాగ చలపతి రావు, కెనడాపేద పిల్లలకు అండగా... ప్రతి ఏటా ఆర్థిక స్థోమత లేని ఇద్దరు చిన్నారులకు సొంత ఖర్చుతో కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నాను. ఇప్పటికి 40 మందికి నేర్పించా. ఇక్కడ నేర్చుకున్న ఎంతోమంది నాట్య పాఠశాలలు మొదలుపెట్టి ఆసక్తి ఉన్న వారికి కూచిపూడి నేర్పిస్తున్నారు.– డా. రవి బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపల్, కూచిపూడి కళాక్షేత్రం, కూచిపూడి– ఎస్.పి యూసుఫ్, సాక్షి, మచిలీపట్నంఫోటోలు: పవన్, సాక్షి, విజయవాడ -
అత్యంత అద్భుతంగా నాట్య తోరణం (ఫోటోలు)
-
Alekhya Punjala: కళలతో కరిక్యులమ్
అలేఖ్య పుంజాల... శాస్త్రీయనాట్య పుంజం. ఆమెది యాభై ఏళ్ల నాట్యానుభవం... ముప్పై ఏళ్ల బోధనానుభవం. ఆమె మువ్వలు... కథక్... ఒడిస్సీ.. భరతనాట్యం... కూచిపూడి... అడుగులను రవళించాయి. రాష్ట్రపతి నుంచి పురస్కారం... ఆమెలో సాక్షాత్తూ అమ్మవారిని చూస్తూ ప్రేక్షకులు చేసిన అభివందనం... ఇప్పుడు సంగీతనాటక అకాడెమీకి వన్నెలద్దే బాధ్యతలు... ఆమె నాట్యముద్రలతో పోటీ పడుతున్నాయి. తెలంగాణ సంగీతనాటక అకాడెమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ’సాక్షి ఫ్యామిలీ’తో ఆమె చెప్పిన సంగతులివి.‘‘తెలంగాణలో కళారీతులు వందల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రజాబాహుళ్యంలోకి వచ్చాయి. మరుగున పడిన మరెన్నో కళారీతులను అన్వేíÙంచాల్సి ఉంది. నా వంతుగా పరిశోధనను విస్తరించి మరిన్ని కళారీతులను ప్రదర్శన వేదికలకు తీసుకు రావాలనేదే నా లక్ష్యం. సంగీత, నాటక అకాడెమీ కళాకారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కళాకారులందరినీ ఒక త్రాటి మీదకు తీసుకురావాలి. అసలు తెలంగాణ ఉనికి కళలే. ఒక ప్రదేశం గుర్తింపు, అక్కడ నివసించే ప్రజల గుర్తింపు కూడా ఆ సంస్కృతి, కళలతో ముడిపడి ఉంటుంది. తరతరాలుగా కళాకారులు గడ్డు పరిస్థితుల్లో కూడా కళను వదిలేవారు కాదు. కళను బతికించడమే తమ పుట్టుక పరమార్థం అన్నట్లుగా కళాసాధన చేశారు. ప్రస్తుతం మన విద్యావిధానంలో కళలకు సముచిత స్థానం కల్పిస్తూ కరిక్యులమ్ రూ΄÷ందాలి. అందుకోసం కళారీతుల గురించి అధ్యయనం చేస్తున్నాను. కళాంశాన్ని పాఠ్యాంశంగా రూ΄÷ందించాలి. పిల్లలు జీవన శాస్త్రీయ విషయాలతోపాటు శాస్త్రీయ కళలను కూడా పాఠాలుగా చదవాలి.సోషల్ మీడియా దన్ను మా తరంలో కళాసాధనను కెరీర్ ఆప్షన్గా ఎంచుకోవడానికి భయపడే వాళ్లు, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. టెక్నాలజీ విస్తృత మైంది. ఇప్పుడు కళాకారులు సోషల్ మీడియానే పెద్ద కళావేదికగా మలుచుకుంటున్నారు. మా తరంలో కళాకారుల్లో సగానికి పైగా కళాసాధనలోనే జీవితాన్ని వెతుక్కునేవారు. కొంతమంది కళకు దూరమై బతుకుతెరువు బాట పట్టేవారు. ఈ తరంలో నా దృష్టికి వచి్చన విషయాలేమిటంటే... కళాసాధనలో అనతికాలంలోనే గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. సంతృప్తికరమైన గుర్తింపు లేకపోతే కళను వదిలేస్తున్నారు. కొనసాగేవాళ్లు పదిశాతానికి మించడం లేదు. నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తెలిస్తే గుర్తింపు కూడా అనతికాలంలోనే వస్తుంది. ఈ టెక్నాలజీ యుగంలో వృత్తి–ప్రవృత్తి రెండింటికీ న్యాయం చేసే అవకాశం ఉంది. జీవిక కోసం ఒక ఉద్యోగం చేసుకుంటూ కళాసాధన, కళాప్రదర్శనలు కొనసాగించండి. కళ కోసం చదువును నిర్లక్ష్యం చేయవద్దు. చదువు కోసం కళకు దూరం కావద్దు. రాబోయేతరాల కోసం ఈ వంతెనను నిలబెట్టండి. ఇప్పుడు మన శాస్త్రీయ కళారీతులు విశ్వవ్యాప్తమయ్యాయి. విదేశాల్లో ప్రదర్శనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కళాసాధనలో సవాళ్లు మహిళలకు ఎదురయ్యే సవాళ్లు దేహాకృతిని కాపాడుకోవడంలోనే. సంగీతసాధనకు దేహాకృతి పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి కాదు, నాట్యకారులకు దేహాకృతితోపాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం. ప్రసవం, పిల్లల పెంపకం కోసం ఎక్కువ విరామం తీసుకుంటే కళాసాధనకు దూరమైపోతాం. పిల్లలను పెంచుకుంటూ తమ మీద తాము కూడా శ్రద్ధ తీసుకున్న నాట్యకారులే ఎక్కువ కాలం కొనసాగగలరు. మహిళలకు ఎదురయ్యే పెద్ద చాలెంజ్ ఇదే. కుటుంబం సహకరిస్తే కళకు సంబంధం లేని ఉద్యోగం చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ కూడా కళాసాధన కొనసాగించవచ్చు.’’ లకుమాదేవి గొప్ప వ్యక్తిత్వం గల మహిళడాక్టర్ సి. నారాయణరెడ్డిగారితో కలిసి ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన రాసిన ‘కర్పూర వసంతరాయలు’ గేయకావ్యాన్ని విన్నాను. 14వ శతాబ్దంలో కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో నర్తకి లకుమాదేవి. కావ్యంలో లకుమాదేవి పాత్ర అద్భుతంగా ఉంది. ఆ పాత్రను ప్రదర్శించడానికి నారాయణరెడ్డి గారి అనుమతి తీసుకున్నాను. నాకిష్టమైన పాత్రల్లో మండోదరి, దుస్సల, రుద్రమదేవి, వేలు నాచియార్ పాత్రలు ముఖ్యమైనవి. వేలు నాచియార్ తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన మహిళా పాలకురాలు, బ్రిటిష్ పాలకులతో పోరాడిన యోధ. ఆ పాత్రను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ‘వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్’ నాట్యరూపకంలో ప్రదర్శించాను. నేను అమ్మవారి పాత్ర ప్రదర్శించినప్పుడు నాలో అమ్మవారిని చూసుకుని ఆశీర్వాదం కోసం సాష్టాంగ ప్రణామం చేసిన ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పది. వారి అభిమానానికి సదా కృతజ్ఞతతో ఉంటాను.ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్రెడ్డి -
Avantika: అద్భుతం.. అవంతిక నృత్యం
కూచిపూడి, భరతనాట్యం, జానపదం, కథకళి, కథక్, మణిపురి, ఒడిస్సీ, మోహినీ అట్టం, యక్షగానం ప్రముఖమైన నృత్యకళలు. వీటిలో భరత నాట్యానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయాల్లో కనిపించే శిల్పాలు భరతనాట్య భంగిమలో దర్శనమిస్తాయి. తంజావూరులో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భరతనాట్యమంటే అందరికీ ఇష్టమే. భరతనాట్య కళాకారులకు గుర్తింపు, గౌరవం కూడా ఎక్కువే. అలాంటి గుర్తింపు, గౌరవాన్ని చిన్న వయసులోనే సొంతం చేసుకుంది మార్కాపురానికి చెందిన చిన్నారి అవంతిక. మార్కాపురం: కళలపై అభిరుచి ఉన్న తలిదండ్రులు తమ పిల్లలను ప్రముఖ కళాకారులుగా చూడాలని కోరుకుంటారు. మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపని కాశయ్య, అన్నపూర్ణాదేవి దంపతులు కూడా తమ కుమార్తె అవంతికను నాట్య కళాకారిణిగా చూడాలని భావించారు. ఐదేళ్ల వయసు నుంచే నాట్య గురువు ప్రతిమ దగ్గర శిక్షణ ఇప్పిస్తున్నారు. 2016లో ప్రారంభమైన నృత్య శిక్షణ ఇప్పటికీ కొనసాగుతోంది. మార్కాపురం పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఆ చిన్నారి గడిచిన ఏడేళ్లలో సొంతూరితోపాటు ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా నరసింహ కౌతువం ప్రదర్శనలో అవంతిక నాట్యం అద్భుతమని చెప్పవచ్చు. ఇందులో హావభావాలు, ముఖ కవళికలను చూసి తీరాల్సిందే. 2022లో మలేíÙయా, 2023లో శ్రీలంక, ఈ ఏడాది ఏప్రిల్లో దుబాయ్లోనూ నృత్య ప్రదర్శనలిచ్చిన అవంతిక అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు అందుకుంది. అంతే కాదండోయ్.. చదువులో కూడా అవంతిక క్లాస్ ఫస్టే. మరొక విశేషమేమిటంటే అవంతిక సంగీతంలోనూ శిక్షణ తీసుకుంటోంది.గెలుపొందిన అవార్డులు ⇒ 2020లో నిర్వహించిన జాతీయ నృత్య ఉత్సవాల్లో పాల్గొని నంది పురస్కారం అందుకుంది. ⇒ 2021లో హంపిలో నిర్వహించిన జాతీయ స్థాయి నృత్య ప్రదర్శనలో అంజనా పురస్కారం, ధూర్జటి పురస్కారం, నాట్యమయూరి పురస్కారం పొందింది. ⇒ 2022లో జాతీయ స్ధాయిలో సూపర్ చాంపియన్గా ఎంపికైంది. డివిజన్ స్థాయి ఐకాన్ అవార్డు పొందింది. అలాగే బాల నాట్య నర్తకీమణి, నర్తన నంది, గజకేశరి పురస్కారాలు పొందింది. ⇒ కాళహస్తిలో నిర్వహించిన నృత్య పోటీలో ప్రథమ స్ధానాన్ని కైవసం చేసుకుంది. ⇒ రాజమండ్రిలో నిర్వహించిన పోటీల్లో రెండో స్ధానం, శ్రీశైలంలో నిర్వహించిన జాతీయ స్ధాయిలో మూడో స్ధానంలో నిలిచింది. ⇒ 2023లో అంతర్జాతీయ స్ధాయిలో సూపర్ చాంపియన్గా ఎంపికైంది. నాట్యం, సంగీతం చాలా ఇష్టం మా అమ్మాయి అవంతికకు నాట్యమంటే ఇష్టమని గమనించి నాట్య గురువు ప్రతిమ వద్ద 2016లో శిక్షణలో చేరి్పంచాం. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రేక్షకులను మెప్పించి బహుమతులు సాధించింది. ఈ మధ్య సంగీతం కూడా నేర్చుకుంటోంది. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ చదువులో కూడా ఫస్ట్ వస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన కళల్లో శిక్షణ ఇప్పించి ప్రోత్సహిస్తే సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించినవారవుతారు. మానసిక ఆనందంతోపాటు గౌరవం కూడా లభిస్తుంది. – భూపని కాశయ్య, అన్నపూర్ణాదేవి -
ప్రపంచ వారసత్వ దినోత్సవం: వారసత్వ మెట్లు.. ‘కూచిపూడి’ వెలుగులు (ఫొటోలు)
-
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్లోని డాలస్లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన,రామ్, కృతిశెట్టి సందడి (ఫొటోలు)
-
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
స్కూల్ బస్సు బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, బాపట్ల: అమృతలూరు మండలం కూచిపూడి వద్ద స్కూల్ బస్సు బోల్తా పడటంతో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులు ఉన్నారు. కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా బస్సు అదుపు తప్పినట్లు తెలిసింది. స్వాతంత్ర్య వేడుకలు ముగించుకుని విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి.. -
అద్భుతం.. ‘అనన్య’ నృత్యం..
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): దీపాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్యగురువు దీపికారెడ్డి శిష్యురాలు అనన్య పొలసాని కూచిపూడి నృత్య అరంగేట్రం శనివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె చక్కటి హావభావాలతో నర్తించిన పుష్పాంజలి, భామాకలాపం ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు శ్రీనివాస్గౌడ్ గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు హాజరై అనన్యను అభినందించారు. అనన్య ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మేనకోడలు. -
కూచిపూడి వనంలో జాబిల్లి
ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి చిహ్నం కూచిపూడి నాట్యం. దీనిలో అభినయానికి, భావ ప్రకటనకు ప్రాధాన్యమిస్తారు. అటువంటి కూచిపూడి నృత్యమే శ్వాసగా.. నాలుగేళ్ల ప్రాయం నుంచే నాట్య కళకు అంకితమై ఘనాపాటిగా పేరొందారు పి.వనజాచంద్రశేఖర్. ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానంతోపాటు వందల వేదికపై సత్కారాలు పొంది ప్రశంసలు అందుకున్నారు. కూచిపూడి శిక్షణాలయాలు ఏర్పాటుచేసి నాట్యగురువుగా అనేక మంది విద్యార్థులకు నృత్యంపై ఆసక్తి పెంచుతున్నారు. గన్నవరం రూరల్: ఏలూరులో జన్మించిన వనజ కూచిపూడి నాట్య ప్రదర్శనలతో దేశమంతా ప్రశంసలు పొందుతున్నారు. నాలుగేళ్ల వయసులోనే ప్రాయానికి మించి కూచిపూడి నాట్యంపై మక్కువ చూపారు. ఆమెకు నాలుగేళ్ల వయసులో వారి ఇంటికి సమీపంలో ఉండే నాట్యగురువు నాగమణి బుద్ధదేవ్ ప్రభావం ఆమైపె పడటంతో కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ మార్గదర్శకంలో 1990లోనే స్వాగత గీతంతో అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 1700కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అనేక సత్కారాలు పొందారు. విద్యార్థులకు శిక్షణాలయాలు 2016లో వివాహం చేసుకున్న వనజ చంద్రశేఖర్ గన్నవరం నియోజకవర్గం పెద అవుటపల్లిలో అత్తవారింట స్థిరపడ్డారు. ఆ తర్వాత కూడా ఆమె కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. కూచిపూడి నృత్యాన్ని జనజీవనంలో మరింత ప్రాచుర్యం పొందడానికి నాట్య శిక్షణాలయాలు ఏర్పాటు చేశారు. గన్నవరం, పెద అవుటపల్లి, ఆత్కూరు గ్రామాల్లో 70మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అత్తవారింటి ప్రోత్సాహంతో కళను ఔత్సాహికులందరికీ నేర్పాలని ఆకాంక్షతో పలు పాఠశాలల్లో కూడా కూచిపూడి నృత్యాన్ని నేర్పుతున్నారు. 2012లో గిన్నిస్ బుక్లో స్థానం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 2012లో ప్రదర్శించిన మహా బృంద నాట్యంతో ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది. గురువు నాగమణి బుద్ధదేవ్ ఆధ్వర్యంలో దేశంలోని మహా నగరాల్లో, ప్రఖ్యాత ఆలయాల్లో, విదేశీయులు, సీఎంలు, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు పాల్గొన్న వేదికలపై కూచిపూడి నృత్యం ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ప్రదర్శనలు రాంచి, జంషెడ్పూర్, ఆగ్రా, ఢిల్లీ, ముంబయి, కర్ణాటక మంజునాథ టెంపుల్, తమిళనాడు, కేరళ, రాజస్తాన్లో ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకృష్ణ లీలలు, దశావతార ఘట్టాలు, గోదాదేవి కల్యాణంలో గోదాదేవిగా, అర్ధనారీశ్వరునిగా, మన్మథుడిగా, నారదుడు, నరసింహుడు, ప్రహ్లాదుడు వేషధారణలు వేసి పండిత పామరులతో ఔరా అనిపించుకున్నారు. మహిషాసుర మర్ధనిగా, మోహినీగా ఆమె హావభావాలు ప్రేక్షకులకు కనులపండువగా నిలిచాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిగా ప్రదర్శించిన కళాఖండాలు ప్రశంసలు పొందాయి. నాట్య కళాపరిషత్ల జేజేలు ఆమె చేసిన ప్రదర్శనలకు మెచ్చిన కళాపరిషత్లు జేజేలు పలికాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో గురువు నాగమణి బుద్ధదేవ్ ప్రతినెలా 15 ప్రదర్శనలను ఏర్పాటు చేసే వారని తెలిపారు. ముంబాయి అభినయ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, విజయవాడ ధర్మ పరిషత్, అఖిల భారత కూచిపూడి నాట్య మండలి, సిలికాన్ ఆంధ్రా ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ కన్వెన్షన్, ప్రపంచ తెలుగు మహా సభలు–ఏలూరు, కుంభమేళా ప్రదర్శనలు ఆమె కీర్తి కిరీటంలో మచ్చు తునకలు. బ్రహ్మాంజలి నృత్యంలో పెట్టింది పేరు. బాలరత్న, కళారత్న, నాట్య కిరీటి బిరుదులతో ఆమె ప్రశంసలు సాధించారు. కూచిపూడి నాట్యానికి పూర్వ వైభవం కూచిపూడి నృత్యానికి పూర్వ వైభవం రావాలి. ప్రభుత్వం కూచిపూడి నృత్యానికి ఆదరణ కల్పించటం ఆనందదాయకం. పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలి. తగిన ఆదరణ కల్పించాలి. ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తే నాట్య గురువులకు గౌరవంతో పాటు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించినవారవుతారు. –వనజ చంద్రశేఖర్ -
కూచిపూడి నృత్య అరంగేట్రం చేసిన శాలిని దేవరకొండ
-
విజయవాడ : నేత్రపర్వం.. నృత్యోత్సవం ( ఫొటోలు)
-
సిక్కోలు బిడ్డ ఖ్యాతి: అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణాలు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చెందిన ప్రఖ్యాత నాట్యగురు రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్యురాలు అన్నా నేహాథామస్ అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణపతకాలు గెలుచుకున్నారు. ఐసీఎండీఏ చెన్నై, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ న్యూఢిల్లీ వారు ఇటీవల అంతర్జాతీయ నాట్య పోటీలను అంతర్జాలంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అన్నా నేహా థామస్ కూచిపూడి, భరతనాట్యం విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో కూచిపూడి, భరతనాట్యంలలో రెండు స్వర్ణాలు, ఐసీఎండీఏ చెన్నైవారు నిర్వహించిన భరతనాట్యం పోటీలో స్వర్ణ పతకం అందుకుంది. ఈ సందర్భంగా అన్నా నేహా థామస్కు పలువురు అభినందనలు తెలిపారు. -
కూచిపూడి కళాకారులకు సినీ హీరో కార్తీ సాయం
బంజారాహిల్స్: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో కళాకారులకు కష్టకాలం దాపురించింది. ఈ పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న కూచిపూడి కళాకారులను ఆదుకునేందుకు సినీ హీరో కార్తీ ముందుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 50 మంది కూచిపూడి కళాకారులకు ఆయన రూ.లక్ష సాయం అందించారు. సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు భావన పెదప్రోలు విజ్ఞప్తి మేరకు కార్తీ ముందుకు వచ్చారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లోనే సాయం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తన లక్ష్యాన్ని ఈ ఏడాది పూర్తి చేసుకున్నాడు. గుర్తించిన 50 మంది కళాకారులకు ఈ మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేసినట్లు భావన తెలిపారు. ఈ సందర్భంగా కూచిపూడి కళాకారుల తరఫున ఆమె కార్తీకి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్న హీరో కార్తి -
ఈ పాదం నటరాజుకే అంకితం
అవిశ్రాంతంగా నాట్యకళకే అంకితమైన ఆమె పాదాలు దివిలో నర్తించడానికి పయనమయ్యాయి. తెలుగువారి నృత్యరీతికి జీవితాన్ని ధారపోసిన ఆమె ప్రయాణం ఇకపై మరోలోకంలో కొనసాగనుంది. శోభానాయుడు అనే అసలు పేరును, కూచిపూడి మహారాణి అనే ముద్దుపేరును కలిగిన ఆ నాట్యశిరోమణి ఒక జీవితకాలంలో పది జీవిత కాలాల కృషిని చేసింది. దేశ విదేశాల్లో రెండువేల మంది విద్యార్థులు ఆమె దారిలో కూచిపూడి నాట్యతారలుగా మెరుస్తున్నారు. ఆమె తయారు చేసిన వందకు పైగా సోలో కొరియోగ్రఫీలు రాబోయే తరాలకు నాట్యగ్రంథంగా మారనున్నాయి. ఆమే సత్యభామ. ఆమే చండాలిక. ఆమే దుర్గ. ఆమే దేవదేవి. ఆమె కోసమే కూచిపూడి రూపుదిద్దుకుంది. కూచిపూడి కోసమే ఆమె జన్మించింది. ఒక నృత్యకారిణి, భారతీయ స్త్రీ సుదీర్ఘంగా కళారంగంలో కొనసాగాలంటే ఎంతో సంకల్పం... మరెంతో అంకితభావం ఉండాలి. తనకు అవి ఉన్నాయని ఆఖరి శ్వాస వరకూ నిరూపించిన నాట్యవిదుషీమణి శోభానాయుడు. నేడు ఆమె వేదిక దిగి వెళ్లిపోయారు. మువ్వలు మూగపోయాయి. తెలుగు వారి నాట్యం ఈ ధ్రువతారకు సదా రుణపడే ఉంటుంది. శోభానాయుడు జీవితాన్ని తరచి చూస్తే కూచిపూడి కోసం ఆమె ఎంత నిబద్ధతతో పని చేశారో తెలుసుకుని గౌరవం రెట్టింపవుతుంది. ఆమె కూచిపూడి మీద ప్రేమతో ఇతర నాట్యరీతులను కూడా నేర్చుకోలేదు. కోట్లరూపాయలు రాగల సినిమా అవకాశాలను తృణీకరించారు. ఆమె ఆరోప్రాణం మాత్రమే ఆమెది. పంచప్రాణాలూ కూచిపూడే. అనకాపల్లి అమ్మాయి శోభానాయుడు 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పుట్టారు. రాజమండ్రిలో పెరిగారు. తండ్రి వెంకట రెడ్డి ఇంజినీరు. తల్లి సరోజమ్మ గృహిణి. తండ్రికి నృత్యాలు, కళలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నృత్యంపై మక్కువ పెంచుకున్న కూతురి నైపుణ్యాన్ని గ్రహించి తల్లి సరోజమ్మ ప్రోత్సహించారు. సరైన శిక్షణ ఇప్పిస్తే రాణించగలదనే నమ్మకంతో తొలుత రాజమండ్రిలోని నాట్యాచార్యుడు పి.ఎల్.రెడ్డి వద్ద శిక్షణ ఇప్పించారు. శోభా నాయుడు తొమ్మిదో తరగతిలో ఉండగా, మెరుగైన శిక్షణ కోసం సరోజమ్మ ఆమెను మద్రాసు తీసుకువచ్చి, వెంపటి చినసత్యం వద్ద చేర్పించారు. కూతురి శిక్షణ కోసం పదకొండేళ్లు ఒక చిన్న ఇంట్లో ఉంటూ నానా ఇబ్బందులు పడ్డారు. వెంపటి చినసత్యం వద్ద శోభా నాయుడు గురుకుల పద్ధతిలో శిక్షణ పొందారు. ఆమె భర్త అర్జునరావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కుమార్తె శివరంజని తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కూచిపూడి నర్తకిగా రాణిస్తున్నారు. అరండేల్ ఆశీస్సులు... శోభా నాయుడు అరంగేట్రం ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన ప్రఖ్యాత నర్తకి, భరతనాట్య దిగ్గజం రుక్మిణీదేవి అరండేల్ ఎంతగానో ముగ్ధులయ్యారు. ‘అనవసరంగా సినిమాల వ్యామోహంలో చిక్కుకోవద్దు. కూచిపూడి ప్రక్రియకే అంకితమై కృషిని కొనసాగిస్తే నాట్యరంగానికి ఎనలేని సేవ చేయగలవు’ అంటూ ఆశీర్వదించారు. రుక్మిణీదేవి అరండేల్ సలహాను శోభా నాయుడు అక్షరాలా పాటించి, పూర్తిగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. తన గురువు వెంపటి చినసత్యం బృందంతో కలసి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, వివిధ వేదికలపై లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. పలు నృత్యరూపకాల్లో కీలక పాత్రలు ధరించి, తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కూచిపూడి నృత్యరీతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలోనూ ఆమె చిరస్మరణీయమైన కృషి చేశారు. నృత్య రంగానికి శోభానాయుడు చేసిన కృషిని గౌరవిస్తూ విశాఖపట్నం కళాకారులు ఆమెను పురవీధుల్లో ఊరేగించి.. పల్లకీ మోశారు. సత్యభామ శోభానాయుడు ‘భామా కలాపం’తో చాలా ఖ్యాతి పొందారు. సత్యభామగా సినిమాల్లో జమున అభినయానికి కీర్తిగడిస్తే కూచిపూడిలో శోభానాయుడు ఖ్యాతి గడించారు. ఆమె ప్రదర్శించే శ్రీకృష్ణపారిజాతం రూపకాన్ని తిలకించేందుకు జనం పోటెత్తేవారు. భర్త అయిన కృష్ణుడి మీద దాచుకోవాలనిపించేంత ప్రేమ, తనమీద అతడి ప్రేమను మరొకరు పంచుకుంటున్నారన్న కోపం దూరంగా నెట్టేస్తూనే దగ్గరకు తీసుకోవాలన్న ఆత్రం... ఇవన్నీ ఆమె సత్యభామ పాత్రలో ఆద్భుతంగా చూపిస్తారు. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘శ్రీకృష్ణ శరణం మమ’, ‘చండాలిక’, ‘మేనక–విశ్వామిత్ర’, ‘విప్రనారాయణ’, ‘విజయోస్తు నారీ’, ‘గిరిజా కళ్యాణం’, ‘స్వామి వివేకానంద’ వంటి దాదాపు పదహారు నృత్యరూపకాలను, నృత్యనాటికలను శోభానాయుడు తన బృందంతో కలసి దేశ విదేశాలలో పలు జాతీయ, అంతర్జాతీయ వేడుకల్లో లెక్కకు మిక్కిలిసార్లు ప్రదర్శించారు. ఎన్నో సోలో ప్రదర్శనలూ ఇచ్చారు. ‘సత్యభామ’ పాత్రలో చేసే అభినయానికి ఆమెకు ఎంతో పేరు వచ్చింది. ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ నృత్య నాటికలో అన్ని పాత్రలనూ తానే అభినయిస్తూ చేసే ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు పొందడం విశేషం. బ్లాంక్ చెక్ ఇచ్చినా... ఎన్నో అవకాశాలు తనను వెదుక్కుంటూ వచ్చినా శోభా నాయుడు ఏనాడూ సినిమా వ్యామోహంలో చిక్కుకోలేదు. పదహారేళ్ల వయసులో ‘అభిమానవంతులు’ (1973) సినిమాలో ‘ఎప్పటివలె కాదురా నా స్వామి... ఎప్పటివలె కాదురా’ అనే పాటలో వెండితెరపై మెరిసిన శోభా నాయుడుకు ఆ తర్వాత కూడా చాలా అవకాశాలే వచ్చాయి. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ఆమెను తన సినిమాల్లో నటించమని కోరారు. శాస్త్రీయ నర్తకి పాత్రలే ఇస్తానని కూడా భరోసా ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కారు పంపించి, తన సినిమాలో నటించాల్సిందిగా తానే స్వయంగా అడిగారు. ఈ అవకాశాలను ఆమె సున్నితంగా తిరస్కరించారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.నాగిరెడ్డి ఏకంగా బ్లాంక్ చెక్ చేతిలో పెట్టినా, తిరిగి ఇచ్చేసి, నాట్యానికే పూర్తిగా అంకితం కాదలచుకున్నానని చెప్పారు. నాగిరెడ్డి కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. అలాగని, శోభా నాయుడుకు సినిమాలంటే వ్యతిరేకత ఏమీ లేదు గాని, కూచిపూడి నాట్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే తన ఆశయానికి ఆటంకం కాగలవనే కారణంతోనే ఆమె చాలా అవకాశాలను వదులుకున్నారు. అయితే, తన గురువు వెంపటి చినసత్యం నృత్యదర్శకత్వం వహించిన వాటిలో ‘అమెరికా అమ్మాయి’ వంటి అతికొద్ది చిత్రాలకు సహాయ నృత్యదర్శకురాలిగా పనిచేశారు. తీరని కోరిక... నృత్య గ్రంథాలయం కూచిపూడి నృత్య సంప్రదాయంలో దాదాపు ఐదు శతాబ్దాలు పురుషులే నాట్యాచార్యులుగా ఏలారు. శోభా నాయుడు సాగించిన నిరుపమానమైన కృషి ఫలితంగానే ప్రస్తుతం ఎందరో మహిళలు కూచిపూడి నాట్యాచార్యులుగా రాణిస్తున్నారు. హైదరాబాద్లోని కూచిపూడి నృత్య అకాడమీ ప్రిన్సిపాల్గా 1981లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె వందల సంఖ్యలో శిష్యులను తీర్చిదిద్దారు. ఆమెకు దాదాపు 1500 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో కొందరు దేశ విదేశాల్లో కూచిపూడి నృత్య అకాడమీని శాఖోపశాఖలుగా విస్తరించారు. ఎన్నెన్నో పురస్కారాలు సంప్రదాయ నృత్యరంగంలో ఆమె సాగించిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను 2001లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. మద్రాసులోని కృష్ణ గానసభ నుంచి ‘నృత్య చూడామణి’ (1982), ‘సంగీత నాటక అకాడమీ అవార్డు’ (1990), ‘నృత్యకళా శిరోమణి’ (1996), ‘ఎన్టీఆర్ అవార్డు’ (1998) వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. నిజానికి శోభానాయుడు కృషి మరో రెండు దశాబ్దాలైనా కొనసాగాల్సింది. ఆమె మరెన్ని ఎత్తులకు ఎదగాల్సింది. ఎన్నో చేదు జ్ఞాపకాలను ఇచ్చిన ఈ పాడు సంవత్సరం ఆమెను తీసుకుపోయి తెలుగువారిని నిజంగా వంచించింది. ఇది క్షమార్హం కాని కాలం. – పన్యాల జగన్నాథ దాసు -
అద్భుతంగా సప్తగిరి వైభవం
-
భూపతిరాజు లక్ష్మికి లేడీ లెజెండ్ అవార్డు
హైదరాబాద్ : కూచిపూడి నాట్య గురువు శ్రీమతి భూపతిరాజు లక్ష్మీకి అంతర్జాతీయ లేడీ లెజెండ్-2020 అవార్డు వరించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏటా బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్, ఆటా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలంలో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్, ఆట జాతీయ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాస్రావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భూపతిరాజు లక్ష్మి వద్ద పలువురు నాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. -
పట్టుచీర కట్టుతో.. అతనే ఆమైతే..!
సాక్షి, ఆదోని(కర్నూలు): అబ్బాయి అమ్మాయి అయితే ఎలా వుంటుంది? సంప్రదాయ పట్టుచీర కట్టుతో వేదికపైకి వచ్చి.. చక్కటి హావభావాలతో కూచిపూడి, భరతనాట్యం చేస్తుంటే ఎలా అనిస్తుంది. ఆదోని పట్టణం మండగిరి వీధికి చెందిన శ్రీనివాసులు అచ్చం ఇలాగే చేస్తున్నాడు. కాళ్లకు గజ్జెలు కట్టి, ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నాడు. గతేడాది డిసెంబరు 23న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఎన్ఎస్ఎస్ రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్యంలో బెస్ట్ ఫర్మామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాడు. ఇటీవల ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సెట్కూర్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కళా ప్రదర్శన పోటీల్లో కూడా కూచిపూడిలో మొదటి బహుమతి, భరత నాట్యంలో తృతీయ బహుమతి అందుకున్నాడు. అంతేగాక అంతర్జిల్లా పోటీలకు అర్హత సాదించాడు. స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలలో కూడ తన అద్భుత నాట్య కళాభినయంతో అందరి మెప్పు పొందుతున్నాడు. వర్ధమాన కళాకారుడిగా ప్రశంసలు అందుకుంటున్న శ్రీనివాసులు.. స్థానికంగా ఉన్న అవ్వ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఆరు సంవత్సరాలుగా డ్యాన్స్ మాస్టర్లు విజయ్కుమార్, వాసు, రాజ్కుమార్తో శిక్షణ పొందుతున్నాడు. డిగ్రీ దాకా పూర్తి చేసిన శ్రీనివాసులు తన జీవితాన్ని కళామతల్లికి అంకితం చేస్తానని చెప్పారు. తండ్రి బసన్న.. కట్టెల మండి వ్యాపారి. తల్లి రంగమ్మ ఇటీవలె అనారోగ్యంతో మృతి చెందింది. అంతర్ జిల్లా పోటీలకు అర్హత సాదించిన శ్రీనివాసులును అవ్వ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాచోటి రామయ్య బుధవారం అభినందించారు. నాట్యమే తన జీవితంగా భావిస్తున్న శ్రీనివాసులుకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావాలని రాచోటి రామయ్య అకాంక్షించారు. తనకు చిన్నతనం నుంచి నాట్యమంటే ఎంతో మక్కువ అని, తన అసక్తి మేరకు నాట్యంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సొసైటీ నిర్వాహకులు, డాన్స్ మాస్టర్లకు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. తాను నాట్యంలో అత్యుత్తమ కళాకారుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోను మంచి గుర్తింపు తెచ్చుకుంటానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి : శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం -
ఈ త్రివేణి 'నాట్యం'లో మేటి
సాక్షి, విజయనగరం : నృత్యం చిన్నారులకు దేవుడిచ్చిన వరం. చిన్నప్పటి నుంచి నిష్ణాతులైన గురువుల వద్ద శిక్షణ ఇప్పిస్తే మెలకువలు నేర్చుకుంటారు. పెద్దయ్యాక నాట్యంలో రాణిస్తారు. వేదికలపై అలరిస్తారు. దీనికి గొట్లాం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని బోడసింగి త్రివేణి నిదర్శనం. చిన్నవయసులోనే నాట్యంలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో అవార్డులు కైవసం చేసుకుంటోంది. విద్యల నగరమైన విజయనగరం జిల్లా ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేస్తోంది. ఓ వైపు చదువులో ప్రతిభ చూపుతూ మరోవైపు కూచిపూడి, భరతనాట్యంలో కీర్తనలకు అడుగులు కదిపి అలరిస్తోంది. చక్కని ప్రతిభ... త్రివేణి కూచిపూడి, భరతనాట్యంలో నాలుగేళ్ల సర్టిఫికేట్ కోర్సును పూర్తిచేసింది. పదవర్ణం, థిల్లానా, శబ్దం, అష్టపదులు అద్భుతంగా చేస్తూ అందరిమన్ననలు అందుకుంటోంది. కూచిపూడిలో బ్రహ్మాంజలి, భామా కలాపం, కొలువైతివా.. జతిస్వరం, థిల్లానాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి త్రివేణి నాట్యంపై ఉత్సాహం చూపడంతో తల్లిదండ్రులు బి.అప్పలనారాయణ, లక్ష్మిల నర్తనశాల డాక్టర్ భేరి రాధికారాణి వద్ద శిక్షణ ఇప్పిస్తున్నారు. నాటినుంచి నేటి వరకు ఎనిమిదేళ్ల పాటు ఆమె వద్దనే శిక్షణ పొందుతూ వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఇప్పటి వరకు సుమారు వెయ్యికిపైగా ప్రదర్శనలిచ్చిన త్రివేణి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో త్రివేణి విశేష ప్రతిభ కనబరుస్తోంది. జిల్లాలో ఎక్కడా ఎటువంటి కార్యక్రమమైనా తమ బృందం తరఫున ప్రధా న పాత్ర వహిస్తూ, గురువుల సారథ్యంలో అద్భుతమైన ప్రతిభను కనబరచి అందరిమన్ననలు అందుకుంటోంది. రాజస్థాన్, శ్రీకాళహస్తి, విజయవాడ, భు వనేశ్వర్, హైదరాబాద్, గుణుపూర్, బొబ్బిలి, సాలూ రు, శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, తుని, తిరుపతి, భద్రాచలం, ఇలా ఆంధ్ర రాష్ట్రమంతా ప్రదర్శనలిస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. పశంసలు, రికార్డులు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది నామ సంవత్సవ వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శనతో అవార్డును సొంతం చేసుకుంది. గురజాడ ఫౌండేషన్ (అమెరికా) సంస్థ నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆçహూతుల ప్రశంసలందుకుంది. విజయనగర ఉత్సవ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం మ్యూజిక్ అండ్ కల్చరల్ ఫెస్టివల్లో త్రివేణి నృత్యం చూపరులను కట్టిపడేసింది. యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో త్రివేణి నృత్యానికి చోటు దక్కింది. డివిజనల్ యూత్ ఫెస్టివల్, గురజాడ 154వ జయంతి, శిల్పారామం, ఇంటర్నేనేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి వేడుకలులో ఇచ్చిన ప్రదర్శనలకు ప్రశంసపత్రాలు, మన్ననలు అందుకుంది. విశాఖరత్న కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో త్రివేణి ప్రతిభకు నృత్యరత్న అవార్డు వరించింది. -
నృత్య మనోహరం
-
నాట్య విలాసం...
-
సత్యభామ గురించి విన్నాను.. ఇప్పుడు చూశాను
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో హైదరాబాద్కు చెందిన కేంద్ర సంగీత నాటక ఆకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ జి. పద్మజారెడ్డి ప్రదర్శించిన కూచిపూడి భామా కలాపం నృత్య ప్రదర్శన అలరించింది. ఇటీవల న్యూఢిల్లీలో కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి సుమారు 30 మంది ప్రఖ్యాత శాస్త్రీయ కళాకారులు హాజరై నృత్యాలు ప్రదర్శించారు. డాక్టర్ పద్మజారెడ్డి ప్రదర్శించిన భామా కలాపం ప్రధానితో పాటు అతిథులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పద్మజా రెడ్డిని ప్రశంసిస్తూ ‘పద్మాజీ.. సత్యభామ పాత్ర గురించి నేను విన్నాను.. చదివాను.. ఇప్పుడు మీలో ఆమెను చూడగలగటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ప్రధాని ప్రశంసనీయ వ్యాఖ్యలపై పద్మజారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నివాసంలో ప్రదర్శనకు అవకాశం రావడం తనకెంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు. తాను ప్రదర్శన ప్రారంభంలో వేదికపై వెళ్లినప్పుడు కొద్దిగా ఉద్వేగానికి గురయ్యానని.. తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి, కమిటీకి పద్మజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
సప్తవర్ణ శోభితం..సప్తరాగ రంజితం..
-కన, విన వేడుకగా ఏడు నృత్యరూపకాలు –అలరించిన కూచిపూడి నృత్యోత్సవం రాజమహేంద్రవరం కల్చరల్ : వీనులకు విందుచేసే మధురమైన సంగీతానికి ఉత్తమ విలువలతో కూడిన సాహిత్యం అబ్బింది. సంగీత సాహిత్యాలకు రాగభావతాళయుక్తమైన చక్కని నృత్యాభినయం తోడైంది. వెరసి కళాభిమానుల కనులకు, వీనులకు విందు దక్కింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన నిర్విరామ సప్తనృత్యరూపకాల కూచిపూడి నృత్యోత్సవం హృదయరంజకంగా సాగింది. సంగీత త్రిమూర్తులు త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, పదకవితాపితామహుడు అన్నమయ్య కీర్తనలు, క్షేత్రయ్యపదాలు, నారాయణతీర్థుల తరంగాలతో పాటు ఆదిశంకరుల స్తోత్రసాహిత్యాలకు నృత్యరూపకాలు కళాదర్పణం పట్టాయి. నాట్యశాస్త్రం పంచమవేదమని కళాక్షేత్ర వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ అన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజకుమార్ ఉడయార్ నృత్యోత్సవానికి జ్యోతిప్రకాశనం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నాట్యశాస్త్రాన్ని బోధించిన భరతముని పేరులో మొదటి అక్షరమైన ‘భ’–భావాన్ని, ‘ర’ రాగాన్ని, ‘త’ తాళాన్ని తెలియచేస్తుందన్నారు. తాన్సేన్ సంగీతంతో వర్షంకురిపించాడన్నారు. నృత్యరూపకాలన్నిటిలో సనాతన భారతీయ వైభవాన్ని చాటడానికే ప్రయత్నించామన్నారు. ప్రతి రూపకం.. రసపూరితం.. తొలి నృత్యరూపకం సంగీత నాట్యామృత వైభవంలో భారతీయ సంగీత, నాట్యవైభవాలను చాటిచెప్పారు. గోరుగంతు లక్ష్మీదీపిక ప్రదర్శించిన ‘భామనే, సత్యభామనే, ఇంతినే, చామంతినే’ ఆకట్టుకుంది. ‘బ్రోచేవారెవరురా’, ‘మత్స్య, కూర్మ,వరాహ, మనుష్యసింహవామనా’ కీర్తనలకు కళాకారులు చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. రెండోదైన సనాతన సాంప్రదాయ వైభవం రూపకంలో త్రిమూర్తుల్లో ఎక్కువతక్కువలు లేవని, జగన్మాత వలనే ముగ్గురికీ శక్తి కలుగుతోందన్న సందేశాన్ని ఇచ్చారు. ‘దశరథవర కుమారుడవయితివి’, ‘శంభో శివశంభో’, కీర్తనలకు, ఆదిశంకరుల‘అయిగిరి నందిని’ వంటిశ్లోకాలతో పాటు మహాకవి కాళిదాసు విచిత ‘చేటీభవన్నిఖిల కోటీ’ శ్లోకాన్ని వినిపించారు, ప్రదర్శించారు. దుర్గాసప్తశతి శ్లోకాలకు చిన్నారులు ప్రదర్శించిన అభినయనం ఆకట్టుకుంది. సనాతన గురువైభవం రూపకం ద్వారా భారతీయ సనాతన ధర్మంలో గురువు వైభవాన్ని తెలియచేశారు. ‘ఇదిగో భద్రాద్రి, గౌతమి అదిగో’, ‘తక్కువేమి మనకు, రాముండొక్కడు తోడుండు వరకు’ ‘కృష్ణం వందే జగద్గురుం’ వాడవాడలా వెంట వసంతము’ వంటి కీర్తనలకు చక్కటి అభినయనాన్ని ప్రదర్శించారు. సాయి మహిమామృతం రూపకంలో సద్గురు సాయినాథుడు భక్తులకు తమ ఇష్టదైవం రూపంలో కనిపించడం వృత్తాంతం. ద్వాదశరాశి వైభవంలో యదువంశసుధాంబుధి చంద్ర, స్వామిరారా వంటికీర్తనలతో 12 రాశుల ప్రభావాన్ని కళ్లకు కట్టించారు. శ్రీశంకరవైభవంలో పరమేశ్వరుని ముఖం నుంచి ఉద్భవించిన పంచభూతాలు, సప్తస్వరాలు, పంచ వాయిద్యాలు, పంచతన్మాత్రలు, పది ఇంద్రియాలు,4 అంతఃకరణలు–ఇలా మొత్తం 36 తత్త్వాలను అభినయించారు. నక్షత్రమాలికాచరితంలో పదకవితా పితామహుడు అన్నమయ్య రచించిన కీర్తనలతో, 27 నక్షత్రాలను వర్ణించారు. ఖగోళశాస్త్రం ఘనతను, త్రిమూర్తుల జీవన పరిమాణాన్ని వివరించారు. చివరిగా ,కళాక్షేత్ర వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ రూపొందించిన గోదావరి హారతి నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. రికార్డులకెక్కిన ప్రదర్శన ఏడు నృత్యరూపకాలను ఒకే ఆహార్యంతో ఉన్న 63 మంది కళాకారులు 12 గంటల 23 నిమిషాల ఒక సెకండులో పూర్తి చేశారు. ఈ ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదైనట్టు ఆయా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. ప్రదర్శన ముగిశాక జరిగిన సభలో హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ పసుమర్తి శేషుబాబు మాట్లాడుతూ, దివినుంచి దిగి వచ్చిన అప్సరసలు చేసిన నాట్యం తిలకించిన అనుభూతి కలిగిందన్నారు. నిర్వాహకులను అభినందించారు. ప్రత్యేక అతిథులుగా వచ్చిన సినీ నటులు పూర్ణిమ, కిన్నెర కళాకారులను అభినందించారు. రాష్ట్ర ఆస్థాన శిల్పి రాజకుమార్ ఉడయార్, విజయవాడకు చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, కళాక్షేత్ర నిర్వాహకులు గోరుగంతు నారాయణ, గోరుగంతు ఉమాజయశ్రీ, ప్రపంచరికార్డుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏడువేల మందితో కూచిపూడి నృత్యప్రదర్శన
విశాఖపట్నం: విశాఖ మరో రికార్డుకు వేదికకానుంది. ఏడువేల మందికి పైగా బాలికలు కూచిపూడి నాట్యం చేయనున్నారు. మూడు జిల్లాలకు చెందిన విద్యార్ధులు ఇందులో పాల్గొంటున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన ఏడువేలమంది బాలికలు కూచిపూడి నృత్యప్రదర్శన చేస్తున్నారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మంగళవారం ఉదయం ఈప్రదర్శన ప్రారంభమైంది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 21 గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు నృత్యప్రదర్శన ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్బాబులు హాజరుకానున్నారు. -
జీవితాన్ని కూచిపూడికి త్యాగం చేసిన ఫ్యామిలీ
-
నృత్య తరంగం
-
ప్రతి ఇంటి నుంచి ఓ కళాకారుడు రావాలి
-
ప్రతి ఇంటినుంచి ఓ కళాకారుడు రావాలి
అందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 6,117 మంది కూచిపూడి నృత్యకళాకారులతో ఘనంగా మహాబృంద నాట్యం విజయవాడ కల్చరల్: తెలుగునేల మీద ప్రతి ఇంటి నుంచి ఒక కూచిపూడి నృత్య కళాకారుడు రావాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం ఎన్.చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవా ల ముగింపు సభ, మహాబృంద నాట్య ప్రారంభ సభ ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్కు అప్పగించామని తెలిపారు. అందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కళలు జాతికి జీవనాడులని ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మహాబృంద నృత్యానికి దేశ విదేశాల నుంచి 6,117 మంది కూచిపూడి నృత్యకళాకారులు హాజరయ్యారు. జయము జయము గీతానికి అనుగుణంగా వారు నృత్యం చేశారు. 15 నిమిషాలపాటు ఈ నృత్యం కొనసాగింది. ఈ నృత్యాన్ని గిన్నిస్బుక్ ప్రతినిధులు అరుదైన ఫీట్గా గుర్తించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులకు నాయకత్వం వహించిన రూపానాథ్ ఈ కార్యక్రమం ప్రపంచంలో రికార్డు సృష్టించిందంటూ.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులకు గిన్నిస్ బుక్ ధ్రువపత్రం అందజేశారు. -
వలసలు నాయకులే..ఓటర్లు కాదు..
కూచిపూడి: వలస వెళుతున్నది నాయకులే కానీ ఓటర్లు కాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్దసారథి పేర్కొన్నారు. పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కొలుసు పార్దసారథి, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లెం వెంకటేశ్వరరెడ్డితో కలిసి గురువారం రాత్రి మొవ్వ మండలం కూచిపూడికి విచ్చేశారు. వైఎస్సార్ సీపీ మొవ్వ మండల అధ్యక్షుడు రాజులపాటి రాఘవరావు కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో, వైసీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. కల్పన పార్టీ మారటంతో ఏర్పడే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపి నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్పన పిలుపునకు స్పందన నిల్ తనతో పాటు టీడీపీలో చేరాలని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పిలుపునకు స్పందని కనిపించలేదు. మండలం నుంచి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా టీడీపీలో చేరటానికి వెళ్ళలేదు. -
జయహో గోల్కొండ
గోల్కొండ: అపురూప కూచిపూడి నృత్యంతో గోల్కొండ కోట పులకించింది. తన నృత్యాభినయంతో కోట చరిత్ర, తెలంగాణలోని చారిత్ర ప్రదేశాలను దీపికారెడ్డి బృందం అద్భుతంగా ఆవిష్కరించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో దీపికారెడ్డి తన 25 మంది శిష్యులతో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలుత జయహో గోల్కొండ నృత్య రూపకంలో కోట చరిత్ర, కుతుబ్షాహీల వైభవాన్ని కళ్లకు కట్టారు. తెలంగాణ వైభవంలో ఇక్కడి చారిత్రక కట్టడాల కథనాన్ని నృత్యంలో చూపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారని ఫిక్కి హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు పద్మరాజగోపాల్ అన్నారు. -
కూచిపూడికి ఉమారావు సేవలు నిరుపమానం
ప్రసిద్ధ నాట్యాచార్యులు ఉమా రామారావు మృతిపై కళాకారుల సంతాపం కూచిపూడి : ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఉమా రామారావు శనివారం కన్నుమూయడంతో కూచిపూడి కళాలోకం ఆమెకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె సేవలను కొనియాడింది. 1938వ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించిన డాక్టర్ ఉమా రామారావు తన 5వ ఏటనుంచే కూచిపూడి నాట్యాభ్యాసం ప్రారంభించి ఆ రంగంలో లబ్ధప్రతిష్టులయ్యారు. హైదరాబాదులో లాస్యప్రియా నృత్య అకాడమిని ఏర్పాటు చేసి దాదాపుగా 2000 మందికి పైగా ఔత్సాహికులను కళాకారులుగా తీర్చిదిద్దారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖ హెడ్గా ఇరవై సంవత్సరాలకు పైగా సేవలనందించారు. దేశవిదేశాలలో వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రశంశలను అందకుని, అనేక అవార్డులను సొంతం చేసుకున్న ఘనత ఉమారావుది. ఎన్నో అవార్డులు ఉమారావును ఎన్నో అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళానీరాజనం అవార్డు, బెస్ట్ టీచర్ అవార్డు,శ్రీ కళపూర్ణ అవార్డులను అందుకున్నారు, పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం నుంచి 2003లో ప్రతిభా పురస్కారం లభించింది. కళా ప్రముఖుల సంతాపం ఉమ మృతి పట్ల కేంద్ర సంగీతనాటక అవార్డు గ్రహీతలు పసుమర్తి రత్తయ్య శర్మ, వేదాంతం రాధేశ్యాం, కూచిపూడి కళాపీఠం ప్రిన్స్పాల్ రామలింగ శాస్త్రి, బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార అవార్డు గ్రహీతలు వేదాంతం వెంకట నాగ చెలపతి, చింతా రవి బాలకృష్ణ, యేలేశ్వరపు శ్రీనివాస్, కూచిపూడి నాట్య కళామండలి పసుమర్తి కేశవప్రసాద్ సంతాపాన్ని తెలియచేశారు. -
‘కూచిపూడి’ని కాపాడాలని...
ఢిల్లీ సంస్థ ఆధ్వర్యంలో భామా కలాపాం షూటింగ్ కూచిపూడి : అంతరించిపోతున్న కళలను కాపాడడానికి, అలాగే భావితరాలకు అందచేయటానికి ఢిల్లీకి చెందిన న్యూస్ వరల్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దేశంలోని 15 పురాతన కళలపై డాక్యుమెంటేషన్, కాఫీ టేబుల్బుక్ ప్రచరణకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు రమణ్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం కూచిపూడి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో 14వ శతాబ్ధంలోని సిద్ధేంద్రుడు రచించిన భామా కలాపం నృత్యరూపకాన్ని డాక్యుమెంటేషన్ రూపంలో నిర్మిస్తున్నారు. ఇందులో బిస్మిల్లా ఖాన్యువ పురస్కార అవార్డు గ్రహీత వేదాంతం వెంకట నాగ చెలపతి సత్యభామగా, సూత్రధారునిగా పసుమర్తి రత్తయ్య శర్మ ప్రదర్శించారు. వీరికి పసుమర్తి హరినాధ శర్మ హరినాధ శాస్త్రి మృదంగంపై, పాలపర్తి అంజనేయులు వయోలిన్ పై, పసుమర్తి పాపని ఆత్రంతో సహకరించారు. -
నేత్రపర్వంగా కూచిపూడి నృత్యాలు
విజయవాడ కల్చరల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. కార్యక్రమ ప్రారంభంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు అన్నవరపు రామస్వామి వయోలిన్ కచేరీ నిర్వహించారు. గురువందనంతో ప్రారంభించి వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. మరో సంగీత విద్వాంసురాలు విశాఖకు చెందిన మండా సుధారాణి నిర్వహిచిన గాత్ర సంగీత సభ ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా కె.వీ.సత్యనారాయణ బృందం, టి.శ్రావణి, శివసుధీర్కుమార్(భక్తిరంజని) న్యూఢిల్లీకి చెందిన సంగీతశర్మ ప్యూజన్ డాన్స్తో అలరించారు. మహాబృందనాట్య వేదిక మార్పు ప్రభుత్వం మహా బృంద నాట్యం వేదిక ఇందిరాగాంధీ స్టేడియంగా ప్రకటించింది. కళాకారులకు అలానే సమాచారం అందించారు. ప్రేక్షకుల సంఖ్య పలుచగా ఉండడంతో దానిని సంగమ ప్రాంతానికి మార్చారు. సమాచారం లేక కళాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే కళాకారులు పుష్కర కృష్ణ గీతానికి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చని రెండురోజుల కిందట ప్రకటించారు. చివరి నిమిషంలో స్టేడియంలో ప్రభుత్వం మరో కార్యక్రమం నిర్వహించటంతో వేదికను మరోచోటుకు మార్చారు. కళాకారులు వ్యయప్రయాసల కోర్చి సంగమం ప్రాంతానికి చేరుకోవాల్సి వచ్చింది. -
కృష్ణా పుష్కర వైభవం మనోహరం
విజయవాడ కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చాటుతున్నాయి. శనివారం ప్రారంభ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ఉషాబాల, వాణిబాల వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. ఆంధ్రనాట్యం ప్రాభవాన్ని ప్రచారం చేస్తున్న నాట్యాకళాకారిణి శారద రామకృష్ణ పుష్కర చరిత్రను నృత్యాంశంగా ప్రదర్శించారు. గుడిసేన విష్ణుప్రసాద్ కథను, కుమార సూర్యానారాయణ సంగీతాన్ని అందించారు. ప్రధాన పాత్రలో శారదా రామకృష్ణ, భరత్, సత్యప్రసాద్,దేవ వర్షిణి తదితరులు నృత్యాన్ని అభినయించారు. కార్యక్రమంలో భాగంగా జ్యోస్యుల రామచంద్రమూర్తి అన్నమయ్య, త్యాగరాజు తదితర వాగ్గేయకారుల కీర్తనలకు నృత్యాన్ని అభినయించారు. కృష్ణనది ప్రారంభంనుంచి హంసలదీవిలో సంగమించే దాకా నదీ పరివాహక ప్రాంతంలోని దేవాలయాలు, చారిత్రక వైభవం, పుష్కర చరిత్ర అంశాలుగా నృత్యరూపం సాగుతుంది. -
సంగీత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హన్మకొండ కల్చరల్ : ప్రభుత్వ విద్యారణ్య సంగీత నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక గాత్రం, వయోలిన్, కూచిపూడి నృత్యం, మృదంగం, హిందుస్థానీ గాత్రం, సితార్, తబలా, పేరిణి నృత్యం తదితర విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులలో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వివరాలకు 0870–2426228 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఆకట్టుకున్న కళా సౌరభ నృత్యప్రదర్శన
కర్నూలు (కల్చరల్): నటరాజ నృత్య కళామందిర్ ఆధ్వర్యంలో 12వ త్రై మార్షిక కళా సౌరభ కార్యక్రమంలోని నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నటరాజ నృత్య కళామందిర్ నిర్వాహకులు కరీముల్లా ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీ (వనపర్తి) నిర్వాహకురాలు మీరజాదేవి శిశ్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నత్యాలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అంతకుముందు కడప జిల్లా వాస్తవ్యులు సుగునాకర్ పాడిన అన్నమయ్య కీర్తనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సంగీత విభావరికి సుధాకర్, రమణయ్య సంగీత సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు డా.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నటరాజ నృత్య కళా మందిర్ కర్నూలు నగరంలో ఎంతో మంది విద్యార్థులను భారతీయ శాస్త్రీయ నృత్యాలలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి కళాసౌరభం పేరుతో వివిధ ప్రాంతాల కళాకారులను కర్నూలుకు పిలిపించి నృత్య ప్రదర్శనలు ఇప్పించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ఆకాశవాణి వ్యాఖ్యాత డా.వి.పోతన్న, కళాసౌరభం అధ్యక్షులు డా.బీవీ.స్వరూప్సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
'డీఎస్సీలో కూచిపూడి కోసం ప్రత్యేక పోస్టులు'
విశాఖ: డీఎస్సీలో కూచిపూడి కోసం ప్రత్యేక పోస్టులు క్రియేట్ చేసి భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని కళాభారతిలో జరిగిన మంజునాథం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోస్టులను భర్తీ చేసే ముందు మంజుభార్గవి లాంటి కళాకారులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం కూచిపూడి నృత్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి మంజుభార్గవి మాట్లాడుతూ.. కూచిపూడి వర్క్షాపు నిర్వహించాలంటే కనీసం నెలరోజులైనా సమయం ఉండాలని సూచించారు. కూచిపూడి కళాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తోడునీడగా నిలవాలని మంజుభార్గవి కోరారు. -
భద్రాచలంలో నృత్యాభిషేకం సందడి
-
కూచిపూడికి రాష్ట్ర కళ హోదా
రాజమండ్రి కల్చరల్ (తూర్పుగోదావరి): కూచిపూడి నాట్యాన్ని రాష్ట్ర కళగా ప్రభుత్వం గుర్తించిందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఆదివారం రాజమండ్రి రామకృష్ణ మఠం ఆడిటోరియంలో జరిగిన జాతీయ కూచిపూడి నాట్య పోటీలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కృష్ణా జిల్లా, కూచిపూడి గ్రామంలో కూచిపూడి భవనాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. కాగా, కూచిపూడి పోటీలలో పాల్గొన్న విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. -
జీవితమే ఒక నృత్యం
నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం డాన్స్ ఈజ్ ద హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ ది సోల్.. అంటారు. వ్యక్తిత్వ వికాసాన్ని అందించే పాఠాలు కళలే! అందులో నాట్యం వేసే ముద్రా ప్రాధాన్యమైనదే! వినోదమే ప్రధానంగా ఉన్న టీవీలో చాలా రియాలిటీ షోలకు నేటికీ డాన్సే ముఖ్యాంశం అయిందంటే దానికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది. అంతలా డాన్స్కి ప్రాధాన్యం లభించేలా చేసింది యునెస్కో మొదలుపెట్టిన ‘ఇంటర్నేషనల్ డాన్స్ డే’! ఈ సందర్భంగా మన శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి గురించి ప్రముఖ కళాకారిణులు అచ్యుతమానస, డాక్టర్ హిమబిందు కనోజ్ల అభిప్రాయాలివి. - సరస్వతి రమ జీవించడం ఎలాగో నేర్పుతుంది: ‘కూచిపూడి మై లైఫ్’ అంటూ కూచిపూడి నృత్యాన్ని అనాథ ఆడపిల్లలకు నేర్పిస్తూ తద్వారా వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్న కూచిపూడి, భరతనాట్యం, కథక్, మోహినీ ఆట్టం కళాకారిణి అచ్యుత మానస. నాట్యం ఓ కళే కాదు, విజ్ఞానాన్ని అందించే గురువు కూడా అంటారు ఆమె. ‘‘మదర్స్ డే, ఫాదర్స్ డేలాగా డాన్స్కి ఓ డే ఉండడం నిజంగా సంతోషమే. అయితే నేనీ డేస్కి వ్యతిరేకం. నా దృష్టిలో ప్రతిరోజు మాతృదినోత్సవమే.. పితృదినోత్సవమే. డాన్స్కి సంబంధించైతే లైఫ్ ఇట్సెల్ఫ్ ఈజ్ డాన్స్. ప్రతిరోజూ నవరసాలను అనుభవిస్తుంటాం. శాస్త్రీయ నృత్యం జీవించడం నేర్పిస్తుంది. ఆత్మసంతృప్తి కలిగిస్తుంది. మన శాస్త్రీయ నృత్యాల్లో వినోదం, విద్య రెండూ ఉన్నాయి. కానీ చాలామంది కేవలం వినోదాన్నే ఆస్వాదిస్తూ అది పంచే విజ్ఞానాన్ని గమనించక నిర్లక్ష్యం చేస్తున్నారు. మన దేశం కళలకు కాణాచి. కానీ అంతటి ప్రాధాన్యం అందట్లేదు. మానసిక వికాసాన్నిచ్చే ఇలాంటి కళలను పాఠ్యాంశాల్లో భాగంగా ప్రతి ఒక్కళ్లకి నేర్పిస్తే ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఎన్నో అసాంఘిక శక్తులు మటుమాయమవుతాయి. ఆ దిశగా ఆర్ట్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది’’ అంటారు మానస. పిల్లల వ్యక్తిత్వం వికసిస్తుంది: డాక్టర్ హిమబిందు కనోజ్ కూచిపూడిలో డాక్టరేట్ చేసిన కళాకారిణి. హైదరాబాద్లోని చందానగర్లో ‘మువ్వ నృత్యరాగ నిగమం’ను నిర్వహిస్తున్న గురువు. ‘‘నాట్యం అంటే దైవారాధన. పెద్దల పట్ల గౌరవం, ప్రకృతి పట్ల గౌరవం, ఆరాధన, మొత్తంగా విశ్వాన్నే ప్రేమించే తత్వాన్ని నేర్పిస్తుంది. మనలో కోపాన్ని, అహాన్ని తగ్గిస్తుంది. సహనాన్ని పెంచుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతుంది. కళారూపంగా భావించి దీన్ని నేర్చుకుంటే ఓటమిని అధిగమించడమెలాగో తెలుపుతుంది. ఇవే కాదు, జీవితానికి అవసరమైన క్రమశిక్షణనూ నేర్పిస్తుంది. అందుకే నాట్యానికి వయసు అంతరం లేదు. వర్గ భేదాల్లేవ్. ఆసక్తి ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు. మా ఇన్స్టిట్యూట్లో పిల్లలు, పెద్దలు, (తల్లీ బిడ్డల కాంబినేషనూ ఉంది) గృహిణులు, వర్కింగ్ ఉమన్ అందరూ నేర్చుకుంటున్నారు. వర్కింగ్ ఉమన్, గృహిణులు అయితే నాట్య సాధనను మంచి స్ట్రెస్ రిలీజ్గా భావిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, టీవీ తప్ప వేరే ప్రపంచమే లేకుండా పోయిన నేటి పిల్లల్లోనైతే ఈ డాన్స్ ద్వారా మార్పు తెప్పిస్తున్నాం. దీనివల్ల మన కళలు, సంస్కృతి ఏంటో తెలుసుకోగలుగుతున్నారు వాళ్లు. ఒకరితో ఒకరు కలిసిపోవడం, ఒకరికోసం ఒకరు సర్దుకుపోవడం. ఒకరు గెలిచినప్పుడు అభినందించడం, గెలిచిన వాళ్లు మిగిలినవాళ్లను ఎంకరేజ్ చేయడం వంటివీ అలవడతాయి. వీటిని పెంపొందిం చేందుకు ప్రతి ఆరునెలలకోసారి మేం పిల్లలతో డాన్స్ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తుంటాం. ఇందులో అతిథులను ఆహ్వానించడం దగ్గర్నుంచి యాంకరింగ్ చేయడం వరకు అన్నీ పిల్లలే చూసుకుంటారు. దీనివల్ల ఎవరిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన పోటీని అలవర్చుకుంటారు. అన్నిటికీ మించి సృజన బయటకు వస్తుంది. ఏ అడ్డంకినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సంపాదించుకుంటారు’’ అని చెప్తారు డాక్టర్ హిమబిందు! డాన్స్ ఈజ్ డివైన్ అన్నది అందుకేనేమో! నాట్యంతో సేవచేసిన, చేస్తున్న నాట్యకళామహానుభావులు అందరికీ కళాభివందనాలు! -
1 నుంచి సిద్ధేంద్రయోగి నాట్యోత్సవాలు
కూచిపూడి: అఖిల భారత కూచిపూడి నాట్యకళామండలి(కూచిపూడి), కూచిపూడి ఆర్ట్ అకాడమీ(చెన్నై) సంయుక్త నిర్వహణలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ(న్యూఢిల్లీ) సౌజన్యంతో మార్చి ఒకటి నుంచి ఏడో తేదీ వరకు సిద్ధేంద్రయోగి నాట్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థల కార్యదర్శులు పసుమర్తి కేశవప్రసాద్, వెంపటి వెంకట్లు తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాలను కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో సిద్ధేంద్రయోగి కళాపీఠంపై నిర్వహిస్తామన్నారు. రోజూ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. -
‘స్పిరిట్ ఆఫ్ డ్యాన్స్
ప్రతీక్ష కాశీ.. తల్లినుంచి నాట్యకళను వారసత్వంగా అందిపుచ్చుకుంది. డ్యాన్స్ మీద పాషన్తో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేసింది. నాలుగు నృత్యరీతులను కలిపి ‘స్పిరిట్ ఇండియా’ పేరుతో మాదాపూర్లో ఓ నృత్య ప్రద ర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా సిటీప్లస్ ఆమెను పలకరించింది... ..:: కోన సుధాకర్రెడ్డి అమ్మ వైజయంతి కాశీ.. కూచిపూడి నృత్యకారిణి. చిన్నప్పుడు అమ్మ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కు వెళ్లేదాన్ని. ఓసారి ఆమె ప్రదర్శన ఇస్తున్నప్పుడు... ఆడియన్స్లో ఉన్న నేను నేరుగా స్టేజిపైకి వెళ్లి వచ్చీరానీ డ్యాన్స్ చేశాను. ఒక్కటే చప్పట్లు. కేరింతలు. అలా నా డ్యాన్స్ జీవితం నాకు తెలియని వయస్సులోనే ప్రారంభమైంది. అయితే ఒక్క కూచిపూడికే పరిమితం కాకుండా ఒడిస్సీ, కథక్తోపాటు కర్ణాటక సంగీతం కూడా నేర్చకున్నాను. తల్లి, గురువు ఒక్కరే అయితే వాళ్లంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరూ ఉండరు. మా అమ్మ నన్ను బిడ్డలానే కాదు, శిష్యురాలిగా కూడా చూస్తుంది. నేను ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా పక్కన అమ్మ ఉండాల్సిందే. నృత్యం మాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయింది. గురు-శిష్య పరంపర కోసం కర్ణాటకలో దేశంలో ఎక్కడా లేని విధంగా ‘శాంబవీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ రెసిడెన్సియల్ స్కూల్’ ప్రారంభించాం. అమ్మ, నేను నడుపుతున్నాం. స్పిరిట్ ఆఫ్ ఇండియా.. కూచిపూడి, మోహినీఆట్టం, యక్షగానం, కథక్... ఈ నాలుగు నృత్యాల కలయికే స్పిరిట్ ఆఫ్ ఇండియా. భారతీయ పురాణాల్లోని శక్తివంతమైన అంశాలను నృత్యరూపంగా తీసుకొచ్చాం. అందులో కూచిపూడిదే ప్రధాన పాత్ర . ఇందులో రిథమ్స్-మెలోడిస్ (సంగీతం) ముఖ్యమైన వి. ‘శ్రీమహా గణపతి మనసా స్మరామి’, ‘కళాంగ మర్దన’, ‘తివక్ర స్టోరీ’, ‘కేశవ ప్రతిగచ్ఛతీ’ అనే నాలుగు మహాఘట్టాలు ఇందులో ఉంటాయి. ఎవరైనా మనస్సు పెట్టి వీటిని తిలకిస్తే గొప్ప పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కళ ఒక ఆయుధం... సమాజాన్ని జాగృతం చేసే ఏకైక సాధనం కళ. నలుగురిలో ఉండవచ్చు. ఒకే క్షణంలో నాలుగొందల మందికి ‘ఆనందం’ పంచవచ్చు. అందుకే ఇటువైపు అడుగుపెట్టిన నేను వెనుతిరిగి చూడలేదు. ప్రధానంగా ప్రజలకు ఉపయోగపడే థియరిటికల్ ఎలిమెంట్స్పైనే మా నృత్యప్రదర్శనలు ఉంటాయి. నా ప్రజెంటేషన్లో ఓ క్రియేటివిటీ ఉండితీరుతుంది. నృత్యం ఓ మహోత్తరమైన విల్పవర్ ఇస్తుంది. హయగ్రీవుడు చదువునిస్తాడు. సరస్వతీదేవి జ్ఞానం ఇస్తుంది. నటరాజు సువిశాల సమాజాన్ని ఇస్తాడు. ఇవన్నీ ఒక సంప్రదాయ నృత్యం ద్వారా అబ్బుతాయి. ఉత్సాహవంతమైన నగరం.. హైదరాబాద్ వెరీవెరీ యాక్టివ్ ప్లేస్. కళకు ఇక్కడ మంచి స్థానం ఉంది. రెండేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు వస్తున్నా. హైదరాబాద్లో ఈ మధ్య జరిగిన సిలికానాంధ్ర సమ్మేళనంలో రుద్రమదేవి పేరుతో నృత్య ప్రదర్శన చేశాను. సినిమా చేస్తున్నా.. ‘ఇంతందంగా ఉన్న మీరు క్లాసిక్ డ్యాన్స్ వైపు రావటం ఏంటీ?’ అని అందరూ అడుగుతారు. మనం ప్రేమించే దాంట్లో అఛీవ్మెంట్ ఉంటుంది. 2014 నవంబర్ 22న ఆదిత్యా విక్రమ్ బిర్లా ‘కళా కిరణ్ పురస్కార్’ అందుకొన్న సందర్భం జీవితంలో మరువలేను. తక్కువ కాలంలోనే వందలాది ప్రదర్శనలు ఇచ్చా. ఆరు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చా. చైనాకు యూత్ డెలిగేట్గా వెళ్లాను. నృత్య ప్రదర్శనలు చేస్తూనే, కన్నడలో టీవీ సీరియల్స్ చేస్తున్నా. ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నా. -
నవమల్లిక
మల్లికా సారభాయ్.. కూచిపూడికి, భరతనాట్యానికి కేరాఫే కాదు స్వతంత్రతకు ప్రతీక! కళను పోరాట సాధనంగా మలచుకున్న ఆర్టిస్ట్! భయమెరుగని గళానికి భౌతిక రూపంలా కనిపించే ఆమె కళాకృతి నిర్వహిస్తున్న కృష్ణాకృతి ఆర్ట్ ఫెస్టివల్లో నృత్యప్రదర్శన ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మల్లిక మనసులోని మాటలు కొన్ని.. ..:: సరస్వతి రమ నా చిన్నప్పుడు మా అమ్మ (మృణాళిని సారభాయ్)లో చాలామంది గ్లామర్ చూస్తే.. నేను ఆమె హార్డ్వర్క్ చూసేదాన్ని. ఆ కష్టాన్ని చూసే జీవితంలో డ్యాన్సర్ కావొద్దు అనుకున్నాను. అమ్మ ఒత్తిడి చేయడంతో ‘దర్పణ’ ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ నేర్చుకోక తప్పలేదు. డ్యాన్సర్ కావొద్దని అనుకుని థియేటర్లో జాయిన్ అయ్యాను. సంగీతం నేర్చుకున్నాను. ఎంబీఏ చేశాను. ఎకనామిస్ట్ అయ్యాను. అన్నీ తిరిగాక హఠాత్తుగా ఓ డిప్రెషన్ ఆవహించింది. నాకేం కావాలి? నేనేం చేస్తున్నాను? అనే మథన. అప్పుడు మనసు తన మాట వినిపించింది నీ లక్ష్యం నాట్యమే.. నువ్వు డ్యాన్సరే కావాలి అని. అలా మళ్లీ డ్యాన్స్ దగ్గర ఆగాను. అవుట్ స్పోకెన్ నా చిన్నప్పుడు అమ్మ తన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కోసం ఎప్పుడూ టూర్లు వెళ్లేది. నాన్నా (విక్రమ్ సారభాయ్) సైంటిస్ట్గా బిజీ. ఇంట్లో నేను, తమ్ముడు (కార్తికేయ) ఉండేవాళ్లం. ఇలా కాదని నాన్న ఓ నియమం పెట్టాడు. మాకు పన్నెండేళ్లు వచ్చేవరకు తనో, అమ్మో ఇద్దరిలో ఎవరన్నా విధిగా మాతో ఉండేట్టు. సో.. అమ్మకెప్పుడూ ప్రోగ్రామ్స్ ఉండేవి కాబట్టి నాన్న మాతో ఉండేవాడు. అప్పుడే నాన్న ‘సమాజం చెప్పినట్టు నడుచుకునే వాళ్లుంటారు. నేనూ, మీ అమ్మ.. అలాంటి వాళ్లకు భిన్నం. మాకు నిజమనిపించిందే మేం చేస్తాం. కానీ మాలాంటి వాళ్లను సమాజం మెచ్చదు. నువ్వే నిర్ణయించుకో.. సమాజం చెప్పినట్టు వినాలా లేక.. నీకంటూ ఓ పంథానేర్పర్చుకోవాలా అని’ అన్నారు. నాలుగు రోజుల తర్వాత నాన్న దగ్గరకు వెళ్లి చెప్పాను.. ‘నాకంటూ ఓ పంథా ఏర్పరచుకుంటాను’ అని. నాటి నుంచి నాకు సత్యమనిపించిందే చేస్తున్నాను. దీనివల్ల చాలా ఎదురుదెబ్బలు తిన్నాను. అయినా మారలేదు. ఇదే విలువలను నా పిల్లలకూ నేర్పాను. స్వతంత్ర మనుషులు లేరు.. ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కేవలం స్త్రీలే పొందట్లేదు అంటున్నారు. కాని అవి పురుషులకూ లేవంటున్నాన్నేను. పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఇంటర్ పూర్తయ్యాక ‘తనకు నచ్చింది చదివే స్వేచ్ఛతో ఉన్నాడా ? తన అభిరుచిని ఆస్వాదించుకునే స్వాతంత్య్రాన్ని పొందుతున్నాడా? లేడు. ఇక్కడ ఆడవాళ్లం కనీసం ఒక పంజరంలో ఉన్నాం.. మనకు స్వేచ్ఛకావాలి అన్న జ్ఞానంతోఅయినా ఉన్నారు. కానీ పురుషుడికి ఆ జ్ఞానం కూడా లేదు. పంజరంలో ఉండి కూడా స్వేచ్ఛగా ఉన్నాననే భ్రమల్లో బతుకుతన్నాడు. కళ.. భాష సమాజంలో లింగ వివక్షను రూపుమాపడానికి కళను భావప్రకటన భాషగా మార్చి 30 ఏళ్లుగా పోరాడుతున్నాను. మా ప్రదర్శనల ద్వారా ప్రతి తల్లికి, అత్తకి చెప్తున్నాం.. వాళ్ల వాళ్ల కూతుళ్లను, కోడళ్లను స్త్రీలుగా కాకుండా మనుషులుగా చూడమని. గౌరవించమని. దర్పణలో ట్రైన్ అయ్యే ప్రతి అబ్బాయికి స్త్రీని సాటి మనిషిగా గౌరవించాలనే స్పృహను కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్తో.. నా మీద ఈ నగరం ఇన్ఫ్లుయెన్స్ చాలా గొప్పది. నా కూచిపూడి గురువు సీఆర్ ఆచార్యులు హైదరాబాదీ అయినా.. అహ్మదాబాద్లో స్థిరపడ్డారు. ఆయనను మేం మాస్టర్జీ అనేవాళ్లం. మా అమ్మ టూర్స్కి వెళ్లినప్పుడు నన్ను, తమ్ముడిని మాస్టర్జీ ఇంట్లో ఉంచేది. ఆయన మెదడు కంప్యూటర్ కన్నా చురుకైంది. ఆయన వరకట్నాన్ని, స్త్రీ మీద జరుగుతున్న హింసను చాలా వ్యతిరే కించేవాడు. మా ఇద్దరి కోసం ఆయన బ్రౌన్కలర్ పేపర్తో పెద్ద ఆల్బం ఒకటి తయారు చేశారు. దాంట్లో ప్రతి పౌరాణిక క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఉండేది. ఆ క్యారెక్టర్స్కు కాంటెంపరరీ సిట్యుయేషన్ను జోడించి మాకు కథలు చెప్పేవారు. వాలి క్యారెక్టర్తో పర్యావరణాన్ని బోధించేవారు. ఏకపాత్రాభినయం, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నిటిని అన్ని రూపాల్లో చేసి చూపించేవారు. మాకది త్రీడీ ప్రెజెంటేషన్లా ఉండేది. అది మాకు లాజికల్ థింకింగ్ నేర్పింది. ఆయన కూచిపూడికున్న ఫోక్ ఎలిమెంట్ను కాపాడారు. నా కూచిపూడి డ్యాన్స్లో కూడా అదే ఉంటుంది. ఇదంతా హైదరాబాద్ మాస్టర్జీ ఇచ్చిన విద్య. అంటే ఇన్డెరైక్ట్గా హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సే కదా. నాకు హైదరాబాదీల మీద ఓ కంప్లయింట్ కూడా ఉంది (నవ్వుతూ). ఈ ఊరిని ఎంతగానో ప్రేమించే నన్ను ఓ నాలుగేళ్లుగా ఇక్కడివాళ్లు మరచిపోయారు. పిలవట్లేదు. తేల్చుకోవాలి ఎందుకో (నవ్వుతూ)! -
ప్రవాస లాస్యం
నేడు NRI డే భారతీయులు ఇప్పుడు విశ్వమానవులు. అనితరసాధ్య విజయాల చిరునామాలు. కలల సాకారంలో భాగంగా దేశం మారినా తమదైన ‘కళల’ ప్రాకారాన్ని మాత్రం నిర్మిస్తూనే ఉన్నారు. ఈ గడ్డమీద నివసిస్తున్న మనవారెందరో... పొరుగింటి పుల్లకూర రుచికి మైమరచిపోతుంటే.. పొట్ట చేత్తో పట్టుకుని వెళ్లినవారు పొరుగింటికి మనింటి రుచుల కమ్మదనాన్ని చవిచూపుతున్నారు. మేరా భారత్ మహాన్ అని విదేశీయులతోనూ అనిపిస్తున్నారు. అలాంటి ఎన్నదగ్గ ఎన్నారైలకు ఉదాహరణ.. వీళ్లు. ..:: ఓ మధు భరతభూమిలో గజ్జెకట్టిన ఎందరో.. ప్రవాసులైన తర్వాత కూడా సంప్రదాయ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. విదేశీయులకు భారతీయ లాస్య విన్యాసాన్ని చూపుతున్నారు. అంతేనా కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేకంగా మాతృభూమికి తరలి వచ్చి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటీవల నగరంలో ఈ ఎన్నారై కుటుంబాలు తమ నృత్యప్రదర్శనతో సిటీవాసులను అలరించారు. ఈ ‘కళ్చ’రల్ అంబాసిడర్స్తో ముచ్చటించినప్పుడు... పడమర వేదికపై.. ‘మాది చెన్నై. చిన్నప్పుడు అడియార్ కె.లక్ష్మణ్, ప్రొఫెసర్ చిత్రా విశ్వేశ్వరణ్ల దగ్గర నృత్యం నేర్చుకున్నాను. మంచి డ్యాన్సర్ని అవుదామనుకున్నాను. పెళ్లయ్యాక మన అభిరుచిని కంటిన్యూ చేయడం కష్టమే. అయినా ఆసక్తి పరిస్థితులను మనకు అనుకూలంగా మారుస్తుంది. పెళ్లి తర్వాత న్యూజెర్సీకి వెళ్లాక ఇక నా చిన్ననాటి ‘కళ’కు నీళ్లొదలాల్సిందే అనుకున్నా. కాని అనుకోకుండా అక్కడ కొంతమందిలో భారతీయ నృత్యాలపై చాలా ఆసక్తి ఉందని గమనించాను. వాళ్లకి నేర్పడం ద్వారా నేను కోల్పోతున్నదేదో భర్తీ అవుతుందనిపించింది. అలా మొదలై పాతికేళ్లుగా... 300కి పైగా స్టూడెంట్స్కు నేర్పించాను. మంచి శిక్షకురాలిగా పేరు తెచ్చుకున్నాను. నిజం చెప్పాలంటే.. అక్కడ మన కళలకు లభిస్తున్న గౌరవం చూస్తే.. ఇంత గొప్ప వారసత్వాన్ని అందించిన భారతమాతకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. అందుకే ఏటా ఇక్కడికి వచ్చి తప్పకుండా ప్రదర్శనలిస్తాను. డ్యాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాను. నా స్టూడెంట్స్తో ఇక్కడ అరంగేట్రం చేయిస్తుంటాను. మా అబ్బాయికి కూడా నృత్యం నేర్పించా. 2012లో తను చెన్నైలో అరంగేట్రం చేశాడు. నేను నేర్పిన వారితో కలసి వేదిక మీద నృత్యం చేయడం కొత్త అనుభూతి. నా కొడుకుతో కలిసి చేయడం మరింత విచిత్రమైన అనుభూతి’ అని వివరించారు రమ్య రామ్నారాయణ్. నృత్యమే భవిష్యత్తు... చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ నృత్యం చూస్తూ పెరిగాను. అమ్మ ఎందరికో నేర్పిస్తుండటం చూసి నాకు నేర్చుకోవాలనిపించింది. భావం, భాషా అన్నీ అమ్మ వివరంగా చెప్పేది. కళ అంటే కేవలం కాళ్లు చేతుల కదలిక మాత్రమే కాదనీ అందులో ఎన్నో అద్భుతమైన అర్థాలున్నాయని తెలిసింది. దాంతో మనదైన కళ మీద మరింత ఇష్టం పెరిగింది. అందుకే నేర్చుకునేటప్పుడు ఎక్కువగా కష్టం అనిపించలేదు. కేవలం నృత్యమే కాకుండా ట్రంపెట్ వాయించడం కూడా నేర్చుకున్నాను. ఇక్కడైనా, ఎక్కడైనా మనం ఏదైనా నేర్చుకోవాలంటే టైం సరిపోదు, టైం లేదు అని ఏం ఉండదు. పొద్దున్నే స్కూల్కి వెళ్తాను. వచ్చాక నాకు నచ్చిన ఆసక్తి ఉన్న పని చేస్తాను. కొంచెం క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే ఎవరైనా వారికి ఆసక్తి వున్న కళను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు. అదృష్టవశాత్తూ నేను మా అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటాను. భవిష్యత్తులోనూ డాన్స్ టీచర్గానే కొనసాగాలని అనుకుంటున్నాను’ అని చెబుతారు రంగరాజ్ తిరుమలై. నృత్యమే పండుగ.. మాది సికింద్రాబాద్. పెళ్లి కాకముందు శోభనాయుడు గారి దగ్గర కూచిపూడి శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నుంచి నాట్యవిశారద కోర్స్ పూర్తి చేశాను. పెళ్లయిన తర్వాత 1991లో యూఎస్కి వెళ్లాను. కళాకారిణిగానే ఉండాలనుకున్నాను. ఆ సమయంలో అక్కడ ప్రదర్శనలకు అవకాశాలు తక్కువ. నాట్యాన్ని కొనసాగించడానికి వీకెండ్ స్కూల్స్లో కూచిపూడి టీచర్గా ఐదేళ్లు పనిచేశాను. పిల్లలు పుట్టాక కూడా ఎప్పుడూ బ్రేక్ ఇవ్వలేదు. భర్త ప్రోద్బలంతో 1996లో కూచిపూడి డాన్స్ అకాడమీని మేం ఉండే మేరీల్యాండ్లో ప్రారంభించాం. ఇప్పుడు 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇతర నృత్య శైలులకు చెందిన టీచర్స్ అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడి చాలా డాన్స్ ఫెస్టివల్స్ నిర్వహించాం. ఇండియాలో ఆసక్తి ఉన్న వారు మాత్రమే కళలు నేర్చుకుంటారు. కానీ యుఎస్లో కల్చర్ని కాపాడటం అనేది ఒక అవసరం. పిల్లలు భారతీయుల్లా పెరగాలంటే కల్చర్ గురించి, కళల గురించి తెలియాల్సిందే. - లక్ష్మీబాబు, మేరీల్యాండ్, యూఎస్ నాకు స్ఫూర్తి మా అమ్మ పిట్స్బర్గ్లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను. మా కాలేజీల్లో ఇండియన్ డ్యాన్స్ టీమ్స్ ఉంటాయి. క్లాసికల్, ఫ్యూజన్, బాంద్రా, దాండియా గ్రూప్స్ ఉంటాయి. వాటికి కాంపిటీషన్స్ చాలా టఫ్గా నిర్వహిస్తారు. కాలేజ్లో ఆడిషన్స్ ద్వారా 10 మందిని సెలెక్ట్ చేస్తారు. మా కాలేజ్ క్లాసికల్ డ్యాన్స్ టీమ్కి నేనే కెప్టెన్. విదేశాల్లో మనదైన కళలకు ఆదరణ పెంచడం అనేది ఒక బాధ్యతగా అనిపిస్తుంది. అమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్నాను. - శ్రీయ బాబు, లక్ష్మీబాబు కూతురు నాట్యం ఒక భాగం.. నాట్యం మా జీవనశైలిలో ఒక భాగం. ఊహ తెలిసిన దగ్గర్నుంచి మా చుట్టూ డ్యాన్స్, స్టూడెంట్స్, క్లాసెస్, డ్యాన్స్షోలే ఉండేవి. అంత గొప్ప సంస్కృతి, సందడిని చూశాక, డ్యాన్స్ తప్ప వేరే ఎంచుకోవాలనే ఆలోచన కూడా లేదు. నృత్య సాధన ఇండియాలోనే చేయాలని ఆశిస్తున్నాను - స్నేహ బాబు, లక్ష్మీబాబు కూతురు -
గజ్జె గల్ఫ్మంది!
ఎడారి దేశమైన కువైట్లో కూచిపూడి ద్వారా భారతీయ సంస్కృతిని ప్రతిష్ఠాపన చేయిస్తున్నారు వేదవల్లి ప్రసాద్. గృహిణిగా ఏడేళ్ల క్రితం కువైట్లో అడుగుపెట్టిన వేదవల్లి... నృత్య గురువుగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన కూచిపూడి నృత్యోత్సవాలలో పాల్గొనడానికి తన ఇరవై మంది కువైట్ శిష్యబృందాన్ని, వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకొచ్చారు. ఆ సందర్భంగా తనను కలిసిన ‘ఫ్యామిలీ’తో ఆమె పంచుకున్న విషయాలు, విశేషాలు. - నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి కువైట్ వెళ్లిన మొదట్లో మనవారెవరూ కనిపించక, విసిరేసినట్టు దూర దూరంగా ఉన్న ఇళ్ల మధ్య ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యారు వేదవల్లి. ‘‘బాబోయ్ ఆ రోజుల్ని అస్సలు ఊహించుకోలేను. నాలుగు నెలల పాటు డిప్రెషన్లో ఉండిపోయాను’’ అంటారు వేదవల్లి. ఐదు పదులకు చేరువవుతున్న ఈ కూచిపూడి నృత్యకళాకారిణి స్వస్థలం తెనాలి. కొన్నాళ్లు హైదరాబాద్లో ఉన్నారు. అయితే భర్త ఉద్యోగరీత్యా ఏడేళ్ల క్రితం కువైట్ వెళ్లారు. అంతవరకు బాగానే ఉంది కానీ... భర్త ఉద్యోగానికి, కొడుకు స్కూల్కి వెళ్లాక వేదవల్లిని భయంకరమైన ఒంటరితనం అలుముకోవడం మొదలైంది! ‘గెట్ టు గెదర్’ మలుపు తిప్పింది ‘‘ఆ దుఃఖం మాటల్లో చెప్పలేను. తెలిసినవారెవరూ లేరు. కొత్త పరిచయాలు పెంచుకోవడానికి అక్కడ ఆడవాళ్లెవరూ బయటకు రారు. చుట్టుపక్కల మన భారతీయులు ఎవరైనా కనిపిస్తే బాగుండు అని రోజూ కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూసేదాన్ని. ఒక్కరూ కనిపించేవారు కాదు. రోజూ మా వారితో గొడవ.. మన దేశం వెళ్లిపోదామని. కానీ, చేస్తున్న ఉద్యోగం వదిలి ఎలా వెళ్లడం? నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. నాలాగే చాలామంది గృహిణులు అక్కడ ఉన్నారని చాలారోజుల తర్వాత తెలిసింది. ఓసారి ‘ఎంప్లాయీస్ గెట్ టు గెదర్’ అంటే మావారితో కలిసి వెళ్లాను. అక్కడ మన వారిని కొంతమందిని చూశాక ప్రాణం లేచివచ్చినట్లయింది. వారంతా మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు. అయితే వారి పిల్లల్లో మనదైన సంస్కృతి ఏదో మిస్ అయినట్లు అనిపించింది. ఇంటికి వచ్చాక కూడా కొన్నాళ్ల పాటు అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. నాకు కూచిపూడి వచ్చు. దీనినే అక్కడి పిల్లలకు పంచగలిగితే... కాలక్షేపమే కాదు, నా విద్య కూడా మెరుగుపడుతుంది. మనదైన సంస్కృతిని కాపాడటానికి ఇదో మంచి అవకాశం అనిపించింది’’ అని చెప్పారు వేదవల్లి. ఇంటికి కళ వచ్చింది ఆలోచన వచ్చిందే తడవుగా డ్యాన్స్ క్లాస్ బోర్డ్ పెట్టేశారు వేదవల్లి. పార్టీలో పరిచయమైన నలుగురికి ఆ సంగతి చెప్పారు. ముందు ఒకరు, ఇద్దరు తమ పిల్లలను తీసుకువచ్చారు. సాధారణంగా డ్యాన్స్ క్లాస్ అంటే వారంలో రెండు, మూడు రోజులు ఉంటుంది. కానీ, వేదవల్లి దగ్గర ప్రతి రోజూ క్లాస్ ఉంటుంది. ఒకరిద్దరితో మొదలైన క్లాస్ ఏడాది తిరగక ముందే ఇరవై మంది పిల్లల వరకు చేరుకుంది. ‘‘పిల్లలంతా చాలా ఉత్సాహంగా క్లాసులకు వస్తారు. వారి వెంట వారి తల్లులు కూడా! ఒకరిద్దరు తల్లులు కూడా డ్యాన్స్ క్లాస్లో చేరారు. మొదట్లో నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టుగా ఉండే మా ఇల్లు రోజూ సాయంత్రం పిల్లల కాలి అందెలతో సందడిగా మారిపోయేది’’ అని వేదవల్లి అన్నారు. మంచీచెడు కూడా! క్లాస్కు వచ్చే పిల్లలకు, వారి తల్లులకు ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ప్రవర్తనలకు సంబంధించి మంచి విషయాలు చెబుతుంటారు వేదవల్లి. ‘‘వాళ్లు కోపం తెచ్చుకుంటారేమో అని కూడా ఆలోచించాను. అయినా మంచి చెబితే తప్పేమిటి? అందుకే వినేంతవరకు వదలను. అంతేకాదు, పండగలు, వేడుకలు అంతా కలిసి చేసుకునేలా ప్లాన్ చేస్తాను’’ అని చెప్పారు వేదవల్లి. ఎక్కడ కూచిపూడి నృత్యోత్సవాలు జరిగినా అక్కడికి తన శిష్యురాళ్లను తీసుకెళతారు ఆవిడ. ‘‘కువైట్లో మాతో పాటు కేరళ, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల వారు ఉన్నారు. ఒకప్పటిలా ఎవరికివారు అన్నట్టు కాకుండా ఇప్పుడు అందరం మంచి మిత్రులమైపోయాం. ఇంట్లో కూర్చుని ఉండి ఉంటే ఇవన్నీ చేసేదాన్ని కాదు. ఈ ఏడాది హైదరాబాద్ వచ్చి అంతర్జాతీయ కూచిపూడి నృత్య సంబరాల్లో పాల్గొని ప్రదర్శన ఇచ్చిన మా పిల్లలంతా ఎంతో సంతోషించారు. రెండేళ్ళ క్రితం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం’’ అని తెలిపారు వేదవల్లి. ‘‘ఏడేళ్ల క్రితం ఒంటరిని అని బాధపడిన నేను, ఇప్పుడు నా చుట్టూ ఉన్న నాట్యబృందాన్ని చూసి ముచ్చటపడిపోతుంటాను. ఎవరైనా మహిళలు ఒంటరిగా ఉంటే ఊరుకోను. తెలిసింది ఏ చిన్న పనైనా భయపడకుండా ముందు మొదలుపెట్టమని చెబుతుంటాను. ఎంచుకున్న పని ఇచ్చే సంతృప్తి నాకు తెలుసు కాబట్టి, ఆ ఆనందాన్ని నలుగురూ పొందాలని కోరుంటాను’’అని వివరించారు వేదవల్లి. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి తెలిసిన ఊరే కానక్కర్లేదు. కొత్త ప్రపంచమైనా మనకు అనుకూలంగా మార్చుకునే నేర్పును పెంచుకుంటే చాలు, అనుకున్నది సాధిస్తాం అని నిరూపిస్తున్నారు వేదవల్లి. ఫొటోలు: సృజన్ పున్నా నృత్యం వ్యక్తిత్వం మేం పన్నెండేళ్లుగా కువైట్లో ఉంటున్నాం. మా అమ్మాయి సాయిశ్రీ శ్రావ్య నాలుగేళ్లుగా వేదవల్లి గారి దగ్గర నృత్యం నేర్చుకుంటోంది. నృత్యంతో పాటు వ్యక్తిత్వ వికాస విషయాలూ నేర్పిస్తున్నారు వేదవల్లి. - విజయ, విజయవాడ (కువైట్) ఎడారిలో ఒయాసిస్సు మా అమ్మాయి వర్షికి 12 ఏళ్లు. రెండేళ్లుగా వేదవల్లిగారి దగ్గర నృత్యం నేర్చుకుంటోంది. వేల మంది మధ్య నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం మాకు వేదవల్లి ద్వారా లభించింది. ఎడారిలో మాకు దొరికిన ఒయాసిస్ ఆవిడ. - స్మిత, బెంగళూర్ (కువైట్) చదువూ మెరుగైంది నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను. వేదవల్లి మేడమ్ దగ్గర మూడేళ్లుగా నృత్యం నేర్చుకుంటున్నాను. డ్యాన్స్లోనే కాదు చదువులోనూ బెస్ట్ అయ్యానని మా మమ్మీ డాడీ, టీచర్స్ చెబుతుంటారు. ఆ క్రెడిట్ అంతా మా మేడమ్దే. - అఖిల, కువైట్ -
కూచిపూడికి పట్టాభిషేకం
నృత్యసాగరంగా మారిన గచ్చిబౌలి స్టేడియం సమూహ నాట్య ప్రదర్శనతో కొత్త రికార్డు పాలుపంచుకున్న వేలాదిమంది కళాకారులు గిన్నిస్బుక్లోకి మహా బృంద నాట్యం! ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం హైదరాబాద్: అచ్చతెలుగు కూచిపూడి నృత్యానికి భాగ్యనగరం పులకించిపోయింది. ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు వేలాదిమంది నృత్యకారులు పాదం పాదం కలిపి ఒకేసారి చేసిన నృత్యానికి ‘రికార్డులు’ తలవంచాయి. ప్రవాసాంధ్ర సంస్థ సిలికానాంధ్ర నాల్గో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా చివరిరోజైన ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మహాబృంద నాట్యం అద్భుతంగా సాగింది. కడలి అలలా సాగిన వేలాది మంది కళాకారుల నాట్యం ఆహూతులను ఆకట్టుకుంది. ఈ నృత్య ప్రదర్శన త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాదం కలిపిన 6,327 మంది... మహాబృంద నాట్యంలో మొత్తంగా 6,327 మంది కళాకారులు భాగస్వాములయ్యారు. నృత్య గురువులను అనుసరిస్తూ మొదట స్టేడియంలో నిలబడ్డారు. ఢమరుక శబ్ధం వినిపించగానే పాదం పాదం కలుపుతూ ఒకేసారి మహాబృంద నాట్యం ప్రారంభించారు. శివుడి జటాఝూటం నుంచి భగీరథుడు గంగను భూమిపైకి రప్పించిన ఘట్టాన్ని తలపించేలా కళాకారులు అందెల సవ్వడితో ఏకకాలంలో చేసిన నృత్యానికి ఆహుతులు మైమరిచిపోయారు. అనంతరం నిర్వహించిన రామాయణ శబ్ధం బృంద నృత్యం నయనానందకరంగా సాగింది. రామాయణ శబ్ధం (రామకథ) పేరుతో రాముని జీవిత ఘట్టాలు తెలుపుతూ ఈ నృత్యం సాగింది. చివరగా వేదాంతం రాఘవ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాగిన మహారుద్ర నాట్యం ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం నృత్యాలలో పాలుపంచుకున్న కళాకారులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు. తెలుగువారి తరగని ఆస్తి కూచిపూడి: ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి తెలుగువారి తరగని ఆస్తి కూచిపూడి అని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి అన్నారు. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలకు, సంస్కృతికి నిదర్శనం కూచిపూడి అని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. నాలుగో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తమ ప్రభుత్వం కూచిపూడి నృత్య అభివృద్ధికి కేంద్రంగా ఉంటుందన్నారు. కాగా, ఆరో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామంలోని నాట్యారామంలో 2016 డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో నిర్వహిస్తామని సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి.. మహాబృంద నాట్య ప్రదర్శనకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దీనికి సంబంధించిన పత్రాన్ని కూడా అందజేశారు. అనివార్య కారణాల వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు రాలేకపోయారని, వారికి రికార్డ్స్కు సంబంధించిన వివరాలు పంపుతామని సిలికానాంధ్ర నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు శేషుబాబు, మామిడి హరికృష్ణ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ యామినీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గజ్జె ఘల్లుమంది..
సిరిసిరిమువ్వలు కట్టుకున్న చిన్నారి అడుగులు.. నాట్యంలో అందెవేసిన మువ్వలు.. జతకలసిన వేళ అందెల రవం మార్మోగింది. కూచిపూడి నాట్య సీమలో వికసించిన కుసుమాల అభినయంతో రాజధాని మరోసారి పులకించింది. అరుణ వర్ణంలో కొందరు.. తొగరు రంగులో ఇంకొందరు.. పచ్చందన చందనంలో మరికొందరు.. ఇలా రంగురంగుల సంప్రదాయ వస్త్రాల్లో కూచిపూడి ప్రాభవాన్ని కళ్ల ముందుంచారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన కూచిపూడి నాట్య సమ్మేళనం కన్నులపండువగా సాగింది. -
కూచిపూడి విశ్వరూపం
వైభవంగా ప్రారంభమైన నాట్య సమ్మేళనం 18 దేశాల నుంచి 8500 మంది కళాకారులు హాజరు సాక్షి, హైదరాబాద్: నాలుగో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాల యోగి స్టేడియంలో శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్ర మంలో తొలి రోజు ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 18 దేశాల నుంచి 8500 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, కువైట్, హాంగ్కాంగ్, సింగపూర్ తదితర దేశాల నుంచి కళాకారులు తరలివచ్చారు. ఈ సమ్మేళనాన్ని ఎంపీ కవిత, ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్లు జ్యోతిప్రజ్వలన చేసి ఆరంభించారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కూచిపూడి ప్రపంచ విఖ్యాత కేంద్రం కావాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పష్టం చేశారు. కూచిపూడి నృత్యం విశేష ప్రచారానికి ప్రధానితో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కూచిపూడి కేవలం ఏపీకి చెందిన కళ కాదని, విశ్వవ్యాప్తమని చెప్పారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ త్వరలో కూచిపూడి నాట్య కళల అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కళా వ్యాప్తి కోసం ఏపీ ప్రభుత్వం క ట్టుబడి ఉందని, సిలికానాంధ్ర సంస్థ అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి కళకు విశేష సేవలందిస్తున్నందని అభినందించారు. కవిత మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఎంతో ఉత్కృష్ఠమైనదని, కళలకు ఎల్లలు లేవని అన్నారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడున్నా ఒక్కటేనని చెప్పారు. సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావటానికే అంతర్జాతీయ నాట్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో పద్మభూషణ్ రాజా రాధారెడ్డి, పద్మభూషణ్ యామి ని కృష్ణమూర్తి, పద్మశ్రీ కె.శోభానాయుడు, వేదాంతం రామలింగశాస్త్రి, పసుపర్తి రామలింగశాస్త్రి, వేదాంతం రత్తయ శర్మ, వేదాంతం రాధేశ్యాం, కె. ఉమారామారావు, ఆర్. కవితాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి దిగ్గజాలందరూ కలసి బాలా త్రిపుర సుందరి, శ్రీరామలింగేశ్వరస్వామి, వెంపటి చినసత్యం తదితరుల చిత్రపటాలతో చేసిన కూచిపూడి శోభాయా త్ర ఆకట్టుకుంది. తొలిరోజు ‘అంబా పరాకు’ అంటూ సామూహిక గురు ప్రార్థనతో మొదలైన ప్రదర్శన ఆద్యంతం రక్తికట్టించింది. అనంతరం నర్తకి యామినిరెడ్డి తన బృందంతో శివుడ్ని స్తుతిస్తూ చేసిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. శోభానాయుడు శిష్యబృందం అమెరికా నుంచి విచ్చేసిన జ్యోతి చింతలపూడి, రష్యా కళాకారులు అన్నా మౌషక్, ఎలీనా తరషోవాతో కలిసి చేసిన ‘వాగ్గేయకారుల మనోభిరాముడు శ్రీ రాముడు’ అంశం సుమనోహరంగా సాగింది. విశాఖ నాట్యగురు బాల కొండలరావు శిష్యబృందం ‘ఆలోకయే శ్రీబాలకృష్ణం’ అంటూ తరంగం ప్రదర్శించి కరతాళధ్వనులందుకున్నా రు. బెంగళూరు కళాకారులు సరస్వతీ రజేతేష్ ఆధ్వర్యంలో దశోహం ప్రదర్శించారు. తొలిరోజు గ్రాండ్ ఫినాలెగా పసుమర్తి రామలింగశాస్త్రి శిష్య బృందం ‘ శిశిరేఖ పరిణయం ’ యక్షగానం ప్రదర్శించి అలరించారు. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ యక్షగానం విశేషంగా ఆకర్షించింది. -
నృత్యాభిషేకం
నృత్యాభిషేకం తూర్పూ పడమర ఏకమై నృత్య సౌరభాలు వెద జల్లాయి. ఆ సౌగంధాల పరిమళాలతో కళాభిమానుల హృదయాలు ఆనందార్ణవంలో తేలియాడాయి. దేశ, విదేశాలకు చెందిన కళాకారులు కూచిపూడికి నృత్యాభిషేకం చేశారు. విభిన్న రూపకాలను ప్రదర్శించి...ఆహూతులను ఆనంద పరవశుల్ని చేశారు. జీఎంసీ బాలయోగి అంతర్జాతీయ స్టేడియంలో సిలికానాంధ్ర నేతృత్వంలో నిర్వహించిన కూచిపూడి నాట్య సమ్మేళనం సమ్మోహితులను చేసింది. -
25న అన్నమయ్య జయంతోత్సవాలు
కూచిపూడి: అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 606వ జయంతి, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం 85వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈనెల 25న నిర్వహించనున్నట్లు కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా కూచిపూడిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచేకాక అమెరికాలో కూచిపూడి నాట్యాన్ని ప్రచారం చేస్తున్న 22 మంది నాట్యాచార్యుల శిష్యబృందాలు అన్నమయ్య సంకీర్తనలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్ట్స్ అండ్ లెటర్స్ ఆడిటోరియంలో(ఇందిరాపార్కు సిగ్నల్స్ వద్ద) సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ 124వ జయంతి ఉత్సవం జరుపనున్నట్టు కేశవప్రసాద్ ప్రకటించారు. -
నాడిది రెండో ఊటీ
ఆమె సిరిసిరి మువ్వల సరిసరి అడుగులు నెమలికి నడ కలు నేర్పిస్తాయి. గమకాల నాదవినోదానికి తన నాట్యవిలాసంతో గమనం జత చేసింది. కూచిపూడికి కాణాచిగా వెలుగొందుతున్న నర్తకి శోభానాయుడు. ఖండాంతరాల్లో వెల్లువెత్తిన ఆ నాట్య తరంగాలు.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉత్తుంగ గంగా తరంగాల్లా ఉప్పొంగుతాయని చెబుతారామె. సిటీకి తరలి వచ్చాక ఆ అపూర్వ అభినయం నర్తనశాలగా మారి మరెందరినో కూచిపూడి కొమ్మలుగా తీర్చిదిద్దుతోంది. 33 ఏళ్ల కిందట భాగ్యనగరంలో అడుగిడిన ఆ అందెలు.. తాళం తప్పని అప్పటి పట్నం పోకడను ఇప్పటికీ గొప్పగా చెబుతుంటాయి. అద్వితీయ బంధంగా మారిన హైదరాబాద్ తనకు రెండో ఊటీగా తోచేదని చెబుతున్న శోభానాయుడు సిటీతో తనకున్న అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. ..:: హనుమా ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. మద్రాసు నుంచి హైదరాబాద్కు రైల్లో వచ్చేవాళ్లం. ఎప్పుడు వస్తుందా అని కిటికీ దగ్గర కూర్చుని ఎదురు చూస్తుండేవాళ్లం. నగరం సమీపిస్తుంటే... చల్లని గాలులు వీస్తూ... చినుకులు పడుతూ... పచ్చని చెట్లు కనిపిస్తుంటే... ఆహా... అసలా ఫీలింగే వేరు. మేం ‘సెకండ్ ఊటీ’ అనేవాళ్లం. అంతటి ఆహ్లాదం... చల్లదనం. ఇప్పుడు ఆ హాయి పోయి, వాహనాలు, అపార్ట్మెంట్లు పెరిగి, చెట్లు తగ్గిపోయి కాలుష్యం విరజిమ్ముతోంది. అంతకముందు చాలాసార్లే వచ్చివెళ్లినా... మద్రాసును వదిలి పూర్తిగా నగరానికి మారింది మాత్రం 1981లో. అప్పట్లో ఇక్కడ నాట్య అకాడమీ నెలకొల్పాలనేది నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆకాంక్ష. ఆయన కోరిక... మా గురువుగారి ప్రోద్బలంతో పాటు... ఆంధ్రుల ఆడపడుచును కనుక... మన ఇంట పుట్టిన కూచిపూడిని అందరికీ పంచాలని హైదరాబాద్ వచ్చా. అప్పుడప్పుడే మద్రాస్లో పేరు తెచ్చుకుంటున్నా. అంతవరకు ఒక బాధ్యతారహిత జీవితం గడిపా. ఇక్కడకు వచ్చాక బాధ్యత పెరిగింది. అకాడమీ స్థాపించి నడిపించడమంటే... ఎంత కష్టమో అర్థమైంది. బెత్తం పట్టుకుని పాఠాలు నేర్పడం... పాలనా వ్యవహారాలు చూసుకోవడం... అష్టావధానంలా అనిపించేది. తొలుత ఇన్స్టిట్యూట్ హిమాయత్నగర్ టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా అద్దె ఇంట్లో ఉండేది. అక్కడి నుంచి నారాయణగూడ వెంకటేష్ థియేటర్ ఎదురుకు మారాం. ప్రస్తుతం దోమల్గూడలో ఉన్నది పర్మినెంట్ బిల్డింగ్. కేంద్ర ప్రభుత్వ నిధులతో సమకూర్చుకున్నాం. అది దేవాలయం... హైదరాబాద్ వస్తున్నామంటే కళ్లలో మెదిలేది రవీంద్రభారతే. మాకది లండన్ క్వీన్సా నగరంలా. అందులో నాట్యమాడుతుంటే... సాక్షాత్తూ ఆ రవీంద్రుడి ముందు ఆడుతున్నట్టే అనుభూతి. నాకది దేవాలయం. అలాగే మా అకాడమీ, త్యాగరాయ గానసభ... నగరంలో బాగా ఇష్టమైన ప్రాంతాలివే. ఇక చిన్నప్పుడు ఇక్కడకు వచ్చినప్పుడల్లా సాలార్జంగ్ మ్యూజియంకు వెళ్లేవాళ్లం. పబ్లిక్ గార్డెన్లో షూటింగ్లు బాగా జరిగేవి. నాడు వాటర్ ట్యాంకర్లంటే తెలీదు. మారనిదల్లా... నాంపల్లి ఎగ్జిబిషన్. అప్పటిలానే కొనసాగుతోంది. క్లాసికల్ డ్యాన్స్, సంగీతం కోసమే సభలుండేవి. మాలాంటి వారికి అవే ప్రోత్సాహం. నేడవి కనిపించడం లేదు. ప్రభుత్వం తరపు నుంచి కళాకారులకు నామమాత్రపు ప్రోత్సాహం, సహకారం కూడా అందడం లేదు. ఎమ్మెల్యే పెసరట్టు... అప్పట్లో అసెంబ్లీ పక్కన ఓ హోటల్లో ఎమ్మెల్యే పెసరట్టు బాగా ఫేమస్. ఇప్పుడు దాని ప్లేస్లో చిరంజీవి దోశలొచ్చేశాయి (చమత్కారం). ఇక డబుల్ డక్కర్ బస్సు ఎక్కి కూర్చుని... ట్యాంక్బండ్ మీద నుంచి వెళుతూ... హుస్సేన్సాగర్ అందాలను చూస్తుంటే... అబ్బో... అద్భుతం. చార్మినార్ ఎక్కి చూడటమంటే మాలాంటి వారందరికీ పెద్ద కోరిక. కోఠి, అబిడ్స్, చార్మినార్... నాడు షాపింగ్ ప్లేసెస్ ఇవే. ఇప్పుడు ఏ ప్రాంతానికా ప్రాంతం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్తో బడా సెంటర్లుగా మారిపోయాయి. ఫ్లైఓవర్లంటే తెలీదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే. తగ్గుతున్న విలువలు ఐటీ, వెడల్పాటి రోడ్లు, ఫ్లైఓవర్లు, బడా భవంతులు... ఒక్కోసారి భాగ్యనగరమా లేదంటే అమెరికాలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతోంది. మార్పు కొంత వరకు బానే ఉంది. కానీ బిజీ లైఫ్, వెస్ట్రన్ కల్చర్ మోజులో మమతలు, మమకారాలు పోయి, బాంధవ్యాలు తెగిపోతున్నాయి. చిన్న వయసులో చైల్డ్కేర్ సెంటర్లు, విద్యార్థి దశలో హాస్టళ్లు, ఉద్యోగ వేటలో విదేశాలు, వయసుకో చోట మకాం. ఫలితం, దూరాలు పెరిగి, విలువలు తగ్గి, కుటుంబ వ్యవస్థ పతనమైపోతోంది. ఏ వివాహ బంధానికైతే మన దేశం పేరో... ఆ బంధాలు నేడు కార్పొరేట్ కల్చర్లో మునిగితేలుతున్న సిటీలో మాయమవుతున్నాయి. మా బంధం అపురూపం... మాది రాజమండ్రి. సంప్రదాయ కుటుంబం. నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరు. మా ఇంటా వంటా డ్యాన్స్ లేదు. నాకేమో అదంటే ప్రాణం. చెన్నైలో ఉండగా సినిమా ఆఫర్లు వచ్చినా... నాట్యం కోసమే వాటిని వదులుకున్నా. అక్కినేని నాగేశ్వరరావు చాలాసార్లు అనేవారు... ‘నేను ఓ మంచి హీరోయిన్ను మిస్సయ్యా’ అని. ఇక నాకు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. మా మధ్య బంధం విలువలతో పెనవేసుకున్నది. చంద్రిక (సెయింట్ఆన్స్లో కౌన్సెలర్), శారదా శ్రీనివాసన్ (మాజీ రేడియో అనౌన్సర్), జానకి, సత్యశ్రీ (గృహిణులు), మేము రెగ్యులర్గా మీటవుతుంటాం. కార్తీకమాసం వనభోజనాలు, కీసర, బాసర వంటి టెంపుల్ టూర్స్, లేదంటే మాలో ఒకరి ఇంట్లో మీటవుతాం. ఒక్కోరు ఒక్కో కూర తెచ్చి సరదాల విందుతో జ్ఞాపకాలు నెమరేసుకొంటాం. వేణువై వచ్చారు.. వెదురులోకి ఒదిగిన కుదురులేని గాలి.. హుస్సేన్సాగర్ అలల తరంగాలను తాకుతూ గానకేళిగా పల్లవించింది. వేణువై వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ట్యాంక్బండ్ పరిసరాల్లో మలయమారుతాల్లా ప్రతిధ్వనించారు. ట్రిబ్యూట్ టు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా పేరిట ట్యాంక్బండ్ మెయిన్ రోడ్లోని సెయిలింగ్ అనెక్స్లో ఆదివారం జరిగిన సుస్మిత, దేవప్రియ చటర్జీ సిస్టర్స్ వేణుగానం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. -
కళాజగతిలో... చెరగని ముద్ర
తొంభై ఐదో ఏట, సుదీర్ఘ అనారోగ్యం తరువాత మరణం ఒక ఉపశమనం కావచ్చు. కానీ, ఆమె మరణం కళాభిమానులకు మాత్రం తీరని దుఃఖమే. అటు సంప్రదాయ కథక్ నృత్యంలో, ఇటు సినీ రంగంలో సితారాదేవి వేసిన చెరగని ముద్ర అలాంటిది. మంగళవారం నాడు కన్నుమూసిన ఆమె మిగిల్చిపోయిన తీపి గుర్తులు అనేకం. జీవితమే ఒక నర్తన దీపావళి సమయంలో ‘ధన్తేరస్’ నాడు పుట్టి, ధనలక్ష్మిగా పెరిగారామె. ఉత్తరాదిలో పురాణ కాలక్షేప తరహా ‘కథాకారుల’ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి సుఖ్దేవ్ మహరాజ్ నుంచి కృష్ణాలీలా ‘కథాకార్’గా ఆ కౌశలాన్ని పుణికిపుచ్చుకున్నారు. గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన వారు నృత్యానికి దూరంగా ఉండే రోజుల్లోనే రంగం మీదికి వచ్చారు. కథక్ నృత్యకారిణిగా ఎదిగారు. ఆ అభినయ ప్రతిభ చూసే తండ్రి ఆమె పేరును ‘సితారాదేవి’గా మార్చారు. కథక్ నృత్య సమ్రాట్ బిర్జూ మహరాజ్ తండ్రి అచ్చన్ మహరాజ్తో సహా పలువురు అత్యుత్తమ గురువుల వద్ద కథక్లో ఆమె శిక్షణపొందారు. పిన్న వయసులోనే మూడు గంటల తన నృత్య ప్రదర్శనతో సాక్షాత్తూ ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగూర్ను మైమరచేలా చేశారు సితారాదేవి. ఆమె నృత్యానికి ముగ్ధులైన టాగూర్ ఆమెను ‘నృత్య సామ్రాజ్ఞి’గా అభివర్ణించారంటే, ఆ వయసులోనే ఆమె చూపిన నర్తన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఎంచుకున్న నాట్యరంగంలో ఎంతో పేరొచ్చినా, లేశమంతైనా అలక్ష్యం చేయకుండా... కృషి ఆపకుండా ఆమె నిరంతరం సాధన చేసేవారంటే ఆశ్చర్యం కలుగుతుంది. నృత్యంలో దిట్ట అంటే చాలు చిన్నవారి దగ్గరకు వెళ్ళి సూచనలు, సలహాలు తీసుకోవడానికి కూడా ఆమె వెనకాడేవారు కాదు. తనను ‘దీదీ’ (అక్కయ్య) అని పిలిచే ఇరవై ఏళ్ళు చిన్నవాడైన బిర్జూ మహరాజ్ను సైతం నృత్యంలో ‘గురువు’గా భావిస్తూ, ‘గురుభక్తి’ని చూపేవారు. ‘‘ఒక రోజు సితార ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. కానీ, ఆమె నృత్యం చేయడానికే సిద్ధమైంది. నృత్యం చేయాల్సి వస్తే, ఆరోగ్యం గురించి పట్టించుకోని అంకితభావం ఆమెది’’ అని బిర్జూ మహరాజ్ వ్యాఖ్యానించారు. అభినయ సితార హిందీ చిత్రసీమలో కథక్కు ఒక ప్రత్యేక స్థానం తేవడంలో బెనారస్ ఘరానా (శైలి, సంప్రదాయం) కి చెందిన సితార పాత్రను విస్మరించలేం. నృత్యపాటవమే ఆమెను ‘ఉషా హరణ్’ ద్వారా సినిమాల్లోకి తెచ్చింది. ఆ సినిమా విడుదల ఆలస్యమైనా, ఈ లోగానే 1930ల చివర్లో సినీవినీలాకాశంలో ఆమె అక్షరాలా ‘సితార’ అయ్యారు. 1940లలో నాయికగా వెలిగారు. 1950ల తరువాత వెండితెర నటనకు స్వస్తి చెప్పి, వేదికపై కథక్ నర్తకిగా సేవ కొనసాగించారు. విరామం లేకుండా నర్తించడంలో ఆమెకున్న సత్తా, అలాగే అభినయ నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరిచేవి. చివరకు, 90వ పడిలో పడ్డాక కూడా కథక్ అంటే ఆమె చూపిన ఉత్సాహం, అంకితభావం నవతరానికి నిరంతరం స్ఫూర్తినిచ్చేవి. నృత్యకళాకారులు శారీరకంగా దృఢంగా ఉండాలని ఆమె భావించేవారు. అప్పుడే అనాయాసంగా ప్రదర్శనను రక్తికట్టించగలమని శిష్యులకు నూరిపోసేవారు. అందుకే, వ్యాయామం మీద దృష్టి పెట్టమనేవారు. ఆమె దీర్ఘకాలం పాటు నర్తనను కొనసాగించగలగడానికి అది కూడా తోడ్పడిందని చెప్పాలి. గమ్మత్తేమిటంటే, సితారాదేవి అక్కలైన అలకనంద, తారాదేవి కూడా నర్తకీమణులే. సినిమాల్లో నర్తించినవారే! ఇక, కథక్ కళాకారుడిగా ఖ్యాతి గడించిన గోపీకృష్ణ ఆమె సోదరి తారాదేవి కుమారుడే! స్వతంత్ర వ్యక్తిత్వం విమర్శలకు వెరవకుండా ప్రాచీన కథక్ రూపానికి ఆధునికత రంగరించిన సితారాదేవి కళారంగంలోనే కాక... జీవితంలోనూ స్వతంత్రతను ప్రదర్శించారు. నచ్చిన రీతిలోనే జీవించారు. నజీర్ అహ్మద్ఖాన్తో జీవితం పంచుకున్న సితార, ఆ బంధం తెగిపోయాక, ప్రసిద్ధ ‘మొఘల్- ఏ- ఆజవ్ు’ చిత్ర దర్శక-నిర్మాత కె. ఆసిఫ్ను పెళ్ళాడారు. విభేదాలతో విడిపోయాక తూర్పు ఆఫ్రికాలో పర్యటన సందర్భంగా గుజరాతీ కుటుంబాలతో ఏర్పడిన స్నేహం ఫలితంగా, ఆ కుటుంబానికి చెందిన ప్రముఖుడు ప్రతాప్ బారోట్తో కలసి ఏడడుగులు నడిచారు. అయితే, ఆసిఫ్ మరణించినప్పుడు ఆయనకు చట్టబద్ధమైన భార్యగా హిందూ సంప్రదాయ విధానంలో తన ఇంట్లోనే అపర కర్మలూ చేశానని ఆమే ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. నిర్ణయాల్లోనే కాదు... అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పడంలోనూ ఆమెది వెనుకంజ వేయని తత్త్వమే. నిజజీవితంలోనూ ఆమె నిర్మొహమాటంగానే వ్యవహరించేవారు. ఫలితంగా, ఆమె నోటికి దడిచి, దూరం పెట్టిన వారూ లేకపోలేదు. అయినా ఆమె తన తత్త్వాన్ని మార్చుకోలేదని తెలిసినవారంటారు. నటుడు దిలీప్ కుమార్ను సోదరుడిగా భావించే సితార కొన్ని దశాబ్దాలుగా ఏటా ఆయనకు రాఖీ కట్టేవారు. ఒక సందర్భంలో ఏకంగా తొమ్మిది గంటల పాటు కథక్ నృత్యం చేసి, అందరినీ అబ్బురపరచిన సితారాదేవి లాంటివారు అక్షరాలా కళ కోసమే జీవించిన నటరాజ పాదసుమాలే! ఇప్పుడీ సుమం సాక్షాత్తూ ఆ నటరాజు పాద సన్నిధికే చేరిందేమో! - రెంటాల కూచిపూడికి వెంపటి... కథక్కు సితార సినిమాల్లో సితారాదేవి నటనతోనూ, రంగస్థలంపై ఆమె కథక్ నృత్యాలతోనూ, ఎవరి పాటలు వారే పాడుకొనే టాకీల తొలి దశకంలో నటిగా ఆమె పాటలతోనూ నాది చిరకాల పరిచయం. 1940లలో మెహబూబ్ వారి సినిమాల్లో ఆమె నటిస్తూ, పాడిన దృశ్యాలు ఇప్పటికీ గుర్తు. దిలీప్ కుమార్, నర్గీస్, బల్రాజ్ సాహ్నీ నటించగా, కె. ఆసిఫ్ నిర్మించిన ‘హల్చల్’లో మునివేళ్ళ మీద నిల్చొని ఆమె చేసిన బ్యాలే డ్యాన్స ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతోంది. అలాగే, ‘అంజలి’లో బౌద్ధ భిక్షువైన చేతన్ ఆనంద్ను తన కుమార్తె నిమ్మీకి వశపడేలా చేసేందుకు వాద్యసంగీతానికి నర్తించే దృశ్యంలో భిల్లస్త్రీగా సితారాదేవి నటన ఇవాళ్టికీ గుర్తుంటుంది. ఆమెది అద్భుతమైన నృత్యం కానీ, గాత్రం కొద్దిగా కటువు. ‘రోటీ’ చిత్రంలో భిల్ల యువతిగా ఆమె నటన, పాడిన పాటలు నాకు గుర్తే. అశోక్కుమార్తో నటించిన ‘నజ్మా’లోనూ ఆమె పాడారు. ఆమె పాడిన పాటల గ్రావ్ుఫోన్ రికార్డులు డజను దాకా నా దగ్గరున్నాయి. మద్రాస్ కృష్ణగానసభలో ‘నాట్యకళాసదస్సు’కు ఏళ్ళక్రితమొచ్చినప్పుడు ఆమెతో మాటామంతీ జరిపి, ఆటోగ్రాఫ్ తీసుకొన్నా. కథక్తో పాటు ‘జాగ్తే రహో’ చిత్రం ద్వారా పేరొచ్చిన మనోహర్ దీపక్తో కలసి మగవేషం వేసుకొని మరీ ఆమె ఎన్నో ఏళ్ళు వేదికపై పంజాబీ ‘భాంగ్రా’ నృత్యం ప్రదర్శించేవారు. వారిద్దరూ వేదికపైన, బయట జంటగా వెలిగారు. గోపికలు రోదిస్తుండగా, కృష్ణుడు మధురకు వెళ్ళడం (‘కృష్ణా మధురా గమన్’) అంశానికి తానొక్కతే కృష్ణ, రాధ, గోపికలుగా ఆమె చేసే అభినయం అపూర్వం. తక్కిన కథక్ కళాకారులకు భిన్నంగా ‘చక్కర్లు’ కొడుతూ ఒక ముద్రలో సరిగ్గా ఆగడం, ప్రతిసారీ ఒక్కో విధమైన భావం, భంగిమ చూపడం ఆమెలోని విశేషం. ఒక్కమాటలో చెప్పాలంటే, పాతకాలపు కూచిపూడి నృత్యానికి మన వెంపటి చినసత్యం ఆధునిక సొబగులు ఎలా అద్దారో, అలాగే పాతపద్ధతిలోని కథక్ను ఆధునికంగా తీర్చిదిద్దిన ఘనత సితారది. విచిత్రం ఏమిటంటే, ఆ రోజుల్లో ఆమెలోని ఈ ప్రయోగశీలతను విమర్శించిన కథక్ నర్తకులు సైతం ఆ తరువాత కాలంలో ఆమె నవీన ఆవిష్కరణలన్నిటినీ తమ నృత్యంలో భాగం చేసుకున్నారు. జీవితంలోనూ, కళా జీవితంలోనూ తనకు నచ్చినట్లే బతికిన కళాకారిణికి జీవించి ఉండగానే దక్కిన అపూర్వ గౌరవమది! - వి.ఎ.కె. రంగారావు, ప్రసిద్ధ సంగీత - నృత్య- సినీ విమర్శకులు ఆ సేవను గుర్తించామంటారా? బ్రిటన్, అమెరికాలతో సహా దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలిచ్చిన చరిత్ర సితారాదేవిది. కథక్ కొరియోగ్రాఫర్గా వెండితెరపై మధుబాల, రేఖ, మాలాసిన్హా, కాజోల్లతో అడుగులు వేయించారు. సంగీత, నాటక అకాడెమీ అవార్డు (1969), పద్మశ్రీ (’73), కాళిదాస్ సమ్మాన్ (’95) సహా అనేక గౌరవాలు దక్కాయి. 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారం ప్రకటిస్తే, సితారాదేవి తిరస్కరించారు. ‘‘ఇన్నాళ్ళకు ఈ పురస్కారం నాకు ఇవ్వాలనుకోవడం గౌరవం కాదు, అవమానం. ఇన్ని దశాబ్దాలుగా కథక్కు నేనందించిన సేవలు ప్రభుత్వానికి తెలియవా? ‘భారతరత్న’కు తక్కువ మరే పురస్కారం అంగీకరించను’’ అని ప్రకటించిన నిర్మొహమాటి ఆమె. -
ఆదివారం హైదరాబాద్
-
సాహితీ మేరువు ‘జీవీ’
నేడు జీవీ కృష్ణరావు శతజయంత్యుత్సవం తెలుగు సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ తన విశి ష్టతను చాటిన సాహితీ మేరువు జీవీ కృష్ణరావు,. ఆయన సునిశిత పరిశీలన నుంచి తప్పించుకున్న సాహిత్య వస్తువేదీ లేకపోవటం విశేషం. డాక్టర్ జీవీ కృష్ణరావు పూర్తి పేరు గవిని వెంకట కృష్ణరావు. తెనాలి సమీపంలోని కూచిపూడి ఆయన స్వస్థలం. సాధారణ రైతు కుటుంబంలో 1914 నవంబర్ 15న జన్మించారు. గ్రామంలో ప్రాథమిక విద్య, దగ్గర్లోని తురుమెళ్లలోని జార్జి కారొనేషన్ హైస్కూలు విద్య చదివారు. అప్పటికే ఆయనకు కవిత్వం అలవడిం ది. గుంటూరు ఏసీ కాలేజీలో తెలుగు ప్రత్యేక పాఠ్యాంశంగా బీఏ చదివారు. ఆ రోజుల్లోనే ‘వరూ ధిని’ ఖండకావ్యం రాశారు. ఆంధ్ర సాహిత్యంతో పాటు సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లోని ఔచిత్యా లను గుర్తెరిగి ‘సునీధ’ వంటి నాటికలు రాశారు. కాశీలో ఎంఏ ఇంగ్లిష్ సాహిత్య అధ్యయనం ప్రారం భించారు. ప్లేటో, అరిస్టాటిల్, కాంటే, హ్యూమ్, హెగెల్ల దర్శనాలను, పాశ్చాత్య కావ్యాలు, కావ్యా నుశాసనాలు, ప్రాచీన భారత దర్శనాలను ఔపోసన పడుతూ వచ్చారు. బనారస్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం ఫలంగా ‘కావ్యజగత్తు’ అవతరిం చింది. ఆర్థిక సమస్యతో ఇంటికి తిరి గొచ్చారు. గుంటూరులో ‘దేశాభిమాని’ పత్రికలో కొంత కాలం పనిచేసి బయట పడ్డారు. మిత్రులతో కలసి ప్రజాసా హిత్య పరిషత్తు పేరుతో ప్రచురణ సం స్థను, ‘సమీక్ష’ పేరుతో పత్రికను స్థాపిం చారు. అనంతరం ‘ఆంధ్రప్రభ’లో సబ్ ఎడిటర్గా చేరారు. నార్ల, శ్రీశ్రీతో పని చేశారు. ‘జఘనసుందరి’ నవల అప్పు డు వెలువడింది. తెనాలిలో చక్రపాణి, కొడవటిగంటి, త్రిపుర నేని గోపీచంద్ వంటి రచయితల సాంగత్యంతో కృష్ణరావుకు ఇంగ్లిష్ సాహిత్యాభిలాషే కాకుండా ఎంఎన్ రాయ్ రచనలపై ఆకర్షణ, మార్క్సిస్టు దృక్పథం అలవడ్డాయి. ‘లోకం కోసం ఏడిస్తే అది కవిత్వం, తన కోసం ఏడిస్తే స్వార్థం, తన కోసం, లోకం కోసం ఏడిస్తే అది ధర్మం, రెండింటి కోసం ఏడ్చినట్లు నటిస్తే అది రాజకీయం’ అంటూ కవిత్వ ప్రయోజనాన్ని విడమరిచి చెప్పిన కృష్ణ రావు, తన రచనల్లో సమాజాన్ని ప్రతి బింబిస్తూ వచ్చారు. కొద్దికాలం తర్వాత పత్రికా రంగానికి కూడా ఉద్వాసన పలి కారు. మళ్లీ చదువుబాట పట్టి, పీజీ చద వకుండానే పీహెచ్డీ డిగ్రీ కోసం మద్రాస్ (చెన్నై)లో పరిశోధన చేశారు. సింగళి సూరన ‘కళాపూర్ణోదయం’పై ఇంగ్లిష్లో బృహద్గ్రంథాన్ని వెలువరిం చారు. తెలుగు క్లాసిక్గా గుర్తింపు పొం దిన ‘కీలుబొమ్మలు’ నవలను పూర్తి చేశారు. ప్లేటో తాత్విక విచారాన్ని విపులీకరిస్తూ ‘జేగంటలు’ రాశారు. 1952లో తెనాలిలో వీఎస్ఆర్ కాలేజీలో అధ్యాపక వృత్తిలో చేరారు. పదేళ్ల తర్వాత ఆ ఉద్యో గానికి రాజీనామా చేశారు. 1963లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చేరి 1973లో ఉద్యోగ విర మణ చేసేవరకు పనిచేశారు. సాహిత్య వ్యాసంగాన్ని మాత్రం జీవితకాలం కొనసాగించారు. తెలుగు భాషా సంప్రదాయానికనుగుణంగా పుల్స్టాప్లు, కామాలు, కోలన్లు లేకుండా ‘యుగసంధ్య’ పద్యకావ్యం రాశారు. ప్రజలందరికీ అన్నం పెట్టలేని ఈ వ్యవస్థపై ‘భిక్షాపాత్ర’ నాటికతో తిరుగుబాటు చేశారు. ‘బొమ్మ ఏడ్చింది’ వంటి ఎన్నో రచనలు చేశారు. పాఠకుని పెదిమ విరియ టం, కన్ను కురియటం జరిగినప్పుడే రచన సార్థకం అవుతుందనీ, అదే ఉత్తమ కృతి అనీ, అలా కాన పుడు ఆ రచన బొందు వేసిన పైరు అవుతుందని చెప్పుకున్నారు. 1979 ఆగస్టు 23న ఆయన సన్ని హితుడు అనపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కృష్ణరావు రచ నలను ఏర్చికూర్చి ఏడు సంపుటాలుగా వెలువరిం చి పాఠకులకు అందుబాటులో ఉంచారు. డాక్టర్ జీవీ కృష్ణరావు సాహిత్య సమాలోచన, జీవీకే మర ణానంతరం 1980లో తీసుకొచ్చిన ‘సాహితీ చైత్ర రథం’ పుస్తకాన్ని ఆయన కుటుంబం 2013లో పున ర్ముద్రించింది. నవంబర్ 15న ఆయన జన్మస్థలమైన కూచిపూడిలో, 16న తెనాలిలో జీవీకే శతజయంతిని నిర్వహించనున్నారు. బి.ఎల్.నారాయణ సీనియర్ జర్నలిస్టు, తెనాలి -
చాంగ్ భళా
కూచిపూడి నాట్య భంగిమలతో అచ్చమైన భారతీయాన్ని ఆవిష్కరించారు విదేశీయులు. గచ్చిబౌలి హెచ్సీయూలో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్టడీ ఇండియా ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫెస్ట్లో కోర్సు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థినులు నాట్యంతో పాటు సితార ప్లే చేశారు. భారతీయ గీతాలు ఆలపించి, హిందీ కవితలు వినిపించి అబ్బుర పరిచారు. జపాన్, సౌదీ, అమెరికా, జర్మనీ, స్వీడన్, ఇరాన్లకు చెందిన 200 మంది తమ టాలెంట్ చూపి ఆకట్టుకున్నారు. - సెంట్రల్ యూనివర్సిటీ -
కూచిపూడి ఆహారం
ఆవకాయ.. ముద్దపప్పు.. పప్పుచారు.. గడ్డపెరుగు.. కలగలసిన రుచికర భోజనం ఇప్పుడు మన ఇంట్లోనే కాదు హోటల్లో కూడా దొరుకుతుంది. అచ్చతెలుగు రుచులు అందించేందుకు మాదాపూర్లో కూచిపూడి హోటల్ బుధవారం ప్రారంభమైంది. శాకాహార విందే కాదు.. పెద్దమ్మ మాంసం పలావ్, మాంసం పప్పుచారు, రాజాగారి భోజనం, రాజాగారి కోడి పలావ్, బొమ్మిడాయిల పులుసు, భీమవరం కోడి వేపుడు వంటి మాంసాహార వంటకాలు ఇక్కడ కొలువుదీరాయి. ఈ హోటల్ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ స్టార్ సునీల్ విచ్చేశారు. ‘వెస్ట్రన్ రుచులు పరచుకున్న మెనూలో గంటల తరబడి వెతికినా మన వంటకం కనిపించదు. అలాంటిది మనైవైన రుచులను మరింత పసందుగా అందించడం సూపర్బ్గా ఉంది’ అని సునీల్ అన్నారు. -
15న విశాఖలో ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవం
మంత్రి గంటా వెల్లడి మంజుభార్గవి పర్యవేక్షణలో కూచిపూడి నాట్య ప్రదర్శనలు విశాఖపట్నం-కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్లో అక్టోబర్ 15న భారీస్థాయిలో రాష్ట్రస్థాయి ఉత్సవాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (ఎన్ఎండీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల ‘ఏపీ బ్రాండ్ కూచిపూడి-2014’ పోస్టర్ను మంత్రి తన కార్యాలయంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవ సందర్భంగా 15న సాయంత్రం ఏపీ పర్యాటక రంగానికి తలమానికంగా భాసిల్లే రామకృష్ణా బీచ్లో 30 అడుగుల ఎత్తై కూచిపూడి నాట్య చిహ్నం (సత్యభామ జడ) సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా రు. కాళీమాత ఆలయం ఎదుట ఏర్పాటు చేసే వేదికపై సుప్రసిద్ధ కూచిపూడి నర్తకీమణి ‘శంకరాభరణం’ఫేం మంజుభార్గవి పర్యవేక్షణలో 2 గంటలపాటు నాట్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు గంటా వెల్లడించారు. 11,12 తేదీల్లో పోటీలు భారతీయ సంప్రదాయ కళలపై విద్యార్థులకు అవగాహన పెం పొందించేందుకు పలు రంగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఏపీ బ్రాండ్ కూచిపూడి అనే ఇతివృత్తంపై చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన, జామ్ పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ ఛాయా చిత్రనిపుణుడు దివాకర్ శ్రీనివాస్ కాళీమాత ఆలయ ప్రాంగణంలో పలు భారతీయ నృత్య రీతుల ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో జాలాది చారిట బుల్ ట్రస్టు వ్యవస్థాపక కార్యదర్శి జాలాది విజయ, ఆడిటర్ వెలుగుల శ్రీధర్ డాక్టర్ శ్రీధర్ బిత్ర, వైశాఖిజల ఉద్యానవన డైరక్టర్ చింతపూడి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘కూచిపూడి’కి మహర్దశ !
నాట్య అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం ఎమ్మెల్యే కల్పన సూచనలకు సీఎం సానుకూలం కూచిపూడి : దేశవిదేశాల్లో గుర్తింపు పొందిన కూచిపూడి నృత్యానికి, గ్రామానికి త్వరలోనే మరింత ప్రాచుర్యం లభించనుంది. విఖ్యాత నాట్యక్షేత్రమైన కూచిపూడి గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ఇటీవల పలు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కూచిపూడి గ్రామంలో నాట్య అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ అకాడమీని తెలుగు విశ్వవిద్యాలయం అధీనంలో ఉన్న శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠంలో ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. పసుమర్తి వారిధర్మచెరువులో గ్రామం పంచాయతీ కేటాయించిన ఎకరం పైగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు. అకాడమీ ఏర్పాటు చేస్తే కూచిపూడి నృత్యానికి, తమ గ్రామానికి మహర్దశ పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎందరో ఉద్దండుల కృషి వల్ల విశ్వవ్యాపితం.. కూచిపూడి నృత్యం సనాత భారతీయ సంస్కృతికి దర్పణంగా నిలుస్తుంది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సంప్రదాయాలను ప్రతిబింబింపజేస్తుంది. ఇంతటి ఘనతను పొందిన ఈ నృత్యం... ప్రఖ్యాత నాట్యాచార్యులు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం, పద్మశ్రీ డాక్టర్ వేదాంతం సత్యనారాయణశర్మ, భరత కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి, భరత కళాప్రపూర్ణ వేదాంతం రాఘవయ్య, కులపతి భాగవతుల రామకోటయ్య, కులపతి పీవీజీ కృష్ణశర్మ వంటి ఉద్దండుల కృషి, అంకితభావం కారణంగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ నాట్యాన్ని ఒకే రీతిలో పుట్టినింట నేర్చుకోవడానికి ప్రభుత్వం నిబంధనలు విధిస్తే కళాకారులకు, గురువులకు మరింత శోభ లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు, పొరుగు రాష్ట్రాల కళాకారులు, అభిమానులు తరలివచ్చి శ్రీ సిద్ధేంద్రుడు నడయాడిన ఈ గ్రామాన్ని సందర్శించే అవకాశముందని చెబుతున్నారు. నిరుపయోగంగా పర్యాటక శాఖ భవనం శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠం భవనం పై అంతస్తులో సుమారు రూ.50లక్షలతో నిర్మించిన పర్యాటక శాఖ భవనం నిరుపయోగంగా మారింది. ఆ భవనంలో నృత్య అకాడమీ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 25న పర్యాటక శాఖ కార్యక్రమాలు? పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పర్యాటక శాఖ అధికారిణి, విజయవాడ సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఈ నెల 25న కూచిపూడి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కూచిపూడి నాట్య ప్రదర్శనల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో కూచిపూడిలో నాట్య అకాడమీ ఏర్పాటుపై జిల్లా పర్యాటక అధికారిణి దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బెజవాడకే జై
రాజధానితో జిల్లాకు మహర్ధశ అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం బందరు పోర్టు అభివృద్ధి పరిసరాల్లోనే సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు మెగాసిటీ ఉడా పరిధి లాజిస్టిక్ హబ్గా జిల్లా కూచిపూడిలో నాట్య అకాడమీ దివిసీమలో మిస్సైల్ పార్కు సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కళలకు పుట్టినిల్లుగా పేరొందిన ‘విజయవాడ’ సిగలో రాజధాని అనే మరో కలికితురాయి వచ్చి చేరడంతో ఈ ప్రాంతానికి ‘రాజ’యోగం పట్టనుంది. మేధావులు, రాజకీయ విశ్లేషకులు, వ్యాపారులు తదితర ప్రముఖులు భావించినట్లుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం శాసనసభలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని అని ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరిలను కలుపుతూ ఏర్పడిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా మహర్దశ పట్టనుంది. సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో పెద్ద మెగాసిటీ రూపుదిద్దుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే.. నగరం చుట్టుపక్కలే సెక్రటేరియట్, అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. తమ్ముళ్లు, రియల్టర్లలో ఉత్సాహం అసెంబ్లీలో విజయవాడ పరిసరాలను రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన వెంటనే నగరంలో తమ్ముళ్లు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అలాగే, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘పార్టీ’లు చేసుకున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసేందుకు సిద్ధమయ్యారు. నగర పరిసరాల్లోనే రాజధాని ఉంటుందని చెప్పడంతో వారిలో చెప్పలేని ఆనందం కనిపించింది. ఇప్పటివరకు అమ్ముడుపోని కొన్ని ప్లాట్లు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయనే ఆనందంలో వారున్నారు. మరోవైపు.. మధ్యతరగతి వారు, సామాన్యులు మాత్రం ఇకపై మా బతుకు భారమేనంటున్నారు. జిల్లాకు ఇచ్చిన హామీలు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా మార్చడం బందరు పోర్టును మరింత అభివృద్ధి చేసి వ్యాపారాభివృద్ధి కేంద్రంగా తయారుచేయడం, ఆక్వా కల్చర్ అభివృద్ధి, ప్రాసెసింగ్ యూనిట్, ఆయిల్ రీఫైనరీ, క్రాకర్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వీజీటీఎం ఉడా ప్రాంతాన్ని మెగా సిటీగా రూపొందించడం విజయవాడలో టెక్స్టైల్ పార్క్, టూరిజం సర్క్యూట్, భవానీ ద్వీపం అభివృద్ధి, స్మార్ట్ సిటీల ఏర్పాటు, ఆటోమొబైల్ హబ్.. ఫుడ్ పార్క్ యూనిట్, ఐటీ హబ్ ఏర్పాటు అవనిగడ్డలో మిస్సైల్ పార్క్.. జిల్లాను లాజిస్టిక్ హబ్గా రూపొందించడం కూచిపూడిలో కూచిపూడి అకాడమీ ఏర్పాటు ఇదిలా ఉంటే... విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారే కానీ ఖచ్చితమైన ఏరియాను ప్రకటించకపోవడంతో స్థానికుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. అలాగే, సీఎం చేసిన ప్రకటనలు ఎంతవరకు, ఎప్పటిలోపు అమలవుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ సకాలంలో అమలుచేస్తే మంచి అభివృద్ధిని సాధించినట్లుగా భావించవచ్చు. -
పోలీసుల వైఖరిలో మార్పు తీసుకురండి
కూచిపూడి ఘటనపై దర్యాప్తు చేయించండి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు టీడీపీ నేత వర్ల రామయ్య ఆగడాలకు అడ్డుకట్ట వేయండి ఎస్పీకి పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పేర్ని నాని వినతి మచిలీపట్నం : జిల్లాలో టీడీపీ నాయకుల ఆగడాలకు హద్దులేకుండా పోతోందని, వారిని అదుపులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పామర్రు ఎమ్మెల్యే , అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తదితరులు ఎస్పీ జి.విజయకుమార్ను కోరారు. బుధవారం ఎస్పీని కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు టీడీపీ నేతల అగడాలపై ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీని కచ్చితంగా అమలుచేయాలని కోరుతూ ఆరు రోజుల క్రితం కూచిపూడిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన శాంతియుతంగా ధర్నా చేస్తుండగా, టీడీపీ నాయకులు పోటీగా ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారని తెలిపారు. తనను, వైఎస్సార్ సీపీ నాయకులను పరుషపదజాలంతో దూషించారని చెప్పారు. తాము కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి పోలీసులు తమ వద్దే ఉన్నారని ఆమె తెలిపారు. తమను అకారణంగా దూషించిన టీడీపీ కార్యకర్తలపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లే సమయంలోనూ పోలీసులు వెంట వచ్చారని వివరించారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ నేత వర్ల రామయ్యతో కలసి వచ్చి తాము టీడీపీ కార్యకర్తలను కులం పేరుతో దూషించామని, చెప్పుతో కొట్టినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆమె వివరించారు. ఆద్యంతం పోలీసులు తమ వెంటే ఉన్నారని, తాము ఏం చేసిందీ పోలీసులు మొత్తం చూశారని, ఈ విషయంపై సమగ్ర విచారణ చేయించాలని కోరారు. పోలీస్స్టేషన్కు వచ్చిన టీడీపీ నేత వర్ల రామయ్య డీఎస్పీ, సీఐలను తనదైన శైలిలో బెదిరించారని చెప్పారు. ‘ప్రభుత్వం మాదే ఉంది. మా మాటే వినాలి..’ అంటూ పోలీసు అధికారులపై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పేర్ని నాని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. బందరు నియోజకవర్గం శివగంగలోనూ పేదలు నివసిస్తున్న గుడిసెలు ఖాళీ చేయించేందుకు ఇనగుదురుపేట పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని, ఈ విషయంపైనా దర్యాప్తు చేయించాలని కోరారు. తాతినేని పద్మావతి మాట్లాడుతూ రైతుల పక్షాన కూచిపూడిలో తాము ధర్నా చేస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవటమే కాకుండా తమపై తప్పుడు ఫిర్యాదుచేశారని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఆయా సంఘటనలపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కూచిపూడి సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్లను ల్యాప్టాప్లో చూపించారు. సీడీని ఎస్పీకి అందజేశారు. ఏఎస్పీ బీడీవీ సాగర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రుణమాఫీ జాప్యం చేస్తున్నారు ఎస్పీని కలిసిన అనంతరం ఉప్పులేటి కల్పన, పేర్ని నాని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రూ.87వేల కోట్లను పంట రుణాలుగా తీసుకున్నారని, టీడీపీ ప్రభుత్వం మాత్రం డ్వాక్రా సంఘాల రుణాలతో కలిపి రూ.35 వేల కోట్లను మాఫీ చేస్తామని చెబుతోందని విమర్శించారు. పంట రుణాలను రీషెడ్యూలు చేస్తామని ఒకసారి, మాఫీ చేస్తామని మరోసారి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, బ్యాంకుల్లో రైతులకు అప్పులు ఇవ్వటం లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లెం వెంకటేశ్వరరెడ్డి, పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష, వైఎస్సార్ సీపీ నాయకుడు మారుమూడి విక్టర్ప్రసాద్, పెడన 9వ వార్డు కౌన్సిలర్ చంద్రబాబు పాల్గొన్నారు. -
హైలైఫ్ ఎక్స్పో...
దేశంలోని వివిధ నగరాల డిజైనర్లు రూపొందించిన ఫ్యాషన్, లైఫ్సై ్టల్ ఉత్పత్తుల ప్రదర్శనకు హైలై ఫ్ ఎక్స్పో వేదిక కానుంది. మాదాపూర్ హెచ్ఐసీసీలో ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హైలైఫ్ ఫ్యాషన్, లైఫ్స్టైల్, లగ్జరీ ప్రదర్శనలో 150 మందికి పైగా ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, పుణే, బెంగళూరు, కోల్కతా వంటి అనేక ప్రాంతాల నుంచి ఆభరణాలు, డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, హోమ్ డెకార్స్, ఫర్నిషింగ్, గిఫ్టింగ్, వేలాది రకాల లైప్స్టైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్రదర్శన జూలై 3 నుంచి 5వ తేదీ వరకు కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. కూచిపూడి ప్రదర్శన ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ సంస్థ 2005 నుంచి కూచిపూడిలో పలు ప్రదర్శనలు ఇచ్చింది. వార్షికోత్సవం రోజున గురువుతో పాటు 50 మంది విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించనున్నారు. నిర్వహణ : భోగిరెడ్డి శ్రావ్య, సుమధుర ఆర్ట్ అకాడమీ డెరైక్టర్ అండ్ గురువు వేదిక : శృంగేరీ శంకరమఠం ప్రాంతం : మోతీనగర్, హైదరాబాద్ తేదీ : 2 జూలై (బుధవారం) సాయంత్రం 6.30 - 8 వరకు. -
కూచిపూడికి కంఠాభరణం
ఆయన చిరునామా కూచిపూడి... అది ఒకప్పడు! ఇప్పుడు కూచిపూడికి ఆయనే ఓ చిరునామా! కొన్ని దశాబ్దాలపాటు కూచిపూడి నాట్యానికి సేవ చేశారు తాజాగా 94 ఏళ్ల వయసులో... కేంద్రసంగీత నాటక అకాడెమీ అవార్డును అందుకున్నారు ‘‘ఈ పురస్కారాన్ని అందుకున్న చేతులు మాత్రమే నావి... అసలైన పురస్కార గ్రహీత కూచిపూడినాట్యమే’‘ అంటున్నారు... అవార్డు గ్రహీత చింతా సీతారామాంజనేయులు చింతా సీతారామాంజనేయులు పుట్టిపెరిగింది కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో. తండ్రి నుంచి నాట్యాన్ని వారసత్వంగా అందుకున్నారు. జీవితంలో కూడా ఆ నాట్యం నడిపించినట్లే అడుగులు కదిపారు. కూచిపూడి నాట్యపరిమళాలను అనేక ప్రాంతాలకు విస్తరించే క్రమంలో కూచిపూడి కళాక్షేత్ర కొత్తగా ఏర్పాటు చేసిన శాఖ కోసం నాట్యాచార్యునిగా గుడివాడలో అడుగుపెట్టారు. రక్తం పంచుకు పుట్టిన ఐదుగురికీ నాట్యం నేర్పించారు. ‘‘కూచిపూడి నాట్యంలో మాది నాలుగవ తరం. నాకిప్పుడు 94 ఏళ్లు. ఆరవ ఏట గజ్జె కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాట్యమే ఊపిరిగా జీవిస్తున్నా’’ అన్నారు సీతారామాంజనేయులు. ప్రతిష్ఠాత్మక కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డును గత వారమే అందుకున్న ఆయనను కదిలిస్తే, కూచిపూడి సంప్రదాయానికి సంబంధించి తన జ్ఞాపకాలను పంచుకున్నారాయన. ‘‘ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు అప్పట్లో ఉంటే కూచిపూడి నాట్యం ఎప్పుడో ఖండాంతర ఖ్యాతిని సాధించేది. మేము ఒక ఊరి నుంచి మరో ఊరికి బళ్లు కట్టుకుని వెళ్లేవాళ్లం. ఐదారు మైళ్ల దూరాలు నడిచి వెళ్లేవాళ్లం. అప్పట్లో నాట్యసాధన అంటే అదే ప్రధాన వ్యాపకం అన్నట్లు ఉండేది. నాట్యం, అభినయం, కీర్తనం (సాహిత్యం), హావభావాలు పలికించడం... ఈ నాలుగింటినీ సమన్వయం చేస్తూ సాధన చేయాలి. అందులో పరిణతి చెందాలి. అప్పుడే కళాకారుడిగా గుర్తించేవారు. అప్పట్లో గురువులు నాట్యసాధన కోసం పెద్దగా సౌకర్యాలను కోరేవాళ్లు కాదు. ఇళ్లలో, గుళ్లలో, సత్రాల్లో ఎప్పుడు ఎక్కడ సాధ్యమైతే అక్కడే సాధన చేయించేవారు. ఉన్నట్లుండి ఒకసారి వీధిలోకి తీసుకెళ్లి సాధన చేయమనేవారు. పిల్లల్లో సిగ్గు, బిడియం వదలడానికి అలా చేసేవారన్నమాట. హఠాత్తుగా ఎవరైనా రాలేకపోతే ఆ పాత్రను మరొకరు రక్తి కట్టించేవారు తప్ప తెల్లముఖం వేయడమనేదే లేదు. మా గురువులు మమ్మల్ని అలా తీర్చిదిద్దారు. అప్పట్లో ‘శశిరేఖా పరిణయం, ఉషాపరిణయం, భక్త ప్రహ్లాద’ యక్షగానాల్లో శశిరేఖ, ఉష, లీలావతి పాత్రలు వేసేవాణ్ణి. ఆడ, మగ - ఏ పాత్రలోనైనా భావాలు పలికించడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. తరువాతి రోజుల్లో యక్షగాన ప్రక్రియలో ఎక్కువ ప్రయోగాలు చేశా. యక్షగానంలో ఎవరి పాట వారే పాడాలి, ఎవరి సంభా షణలు వాళ్లే చెప్పాలి. ఒక కథాంశాన్ని ప్రదర్శించాలంటే కనీసం ఏడాది సాధన చేయాలి. చెరుకూరి వీరయ్య (స్క్రిప్టు) సహకారంతో సమకాలీన అంశాలను యక్షగానాలుగా ప్రదర్శించాను. గుడివాడలో పనిచేశాక, జవహర్ బాలభవన్ నాట్య కార్యక్రమాల రూపకల్పన కోసం నాగార్జున సాగర్లో సేవలందించా. వందల మందికి కూచి పూడి శిక్షణనిచ్చా. 1947లో స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో ‘ఉషాపరిణయం’ప్రదర్శన ఇచ్చాం. మరో సందర్భంలో రాధాకృష్ణ నాటకంలో రాధ పాత్ర పోషించినప్పుడు మా గురువు వేదాంతం పార్వతీశం గారు మెచ్చుకున్నారు. ఇవి రెండూ మరచిపోలేని సంఘటనలు’’ అంటారాయన. రాష్ర్టపతి నుంచి అందుకున్న తాజా అవార్డును ప్రస్తావించినప్పుడు...‘‘ఇది నాకు వచ్చిన పురస్కారం కాదు. మా కూచిపూడికి అందిన గౌరవం. మా గురువు గారికి చెందాలి. ఆ రోజుల్లో ఎవరూ గుర్తించకపోవడంతో వారికి ఇలాంటి పురస్కారాలు రాలేదు. ఇప్పుడు గుర్తించే మాధ్యమాలున్నాయి కాబట్టి ఈ కళలో ఉన్న గొప్పతనాన్ని దేశం గుర్తించింది. కానీ, ఇవాళ్టికీ జీవితాంతం కళ కోసమే జీవించిన ఎందరో జీవనభృతి లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొంత నిధిని ఏర్పాటు చేసి వారికి నెలనెలా కొంత భృతి కల్పిస్తే బావుండని నా ఆశ. ఒక గుర్తింపు కార్డు ఇస్తే అదే పురస్కారాల పెట్టు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాగా డాన్సు, మ్యూజిక్ కూడా పెడితే... మన సంప్రదాయ నాట్యరీతి, సంగీతం పట్ల ప్రాథమిక అవగాహన కలుగుతుంది. నా వంతుగా ఇప్పటికీ ఇంటి దగ్గర చిన్నపిల్లలకు నాట్యం నేర్పిస్తున్నా’’ అన్నారాయన. ఒకే ఒక్క బ్యాలే రూపొందించి తగినంత గుర్తింపు రాలేదని ఆవేదన చెందేవాళ్లు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో ఇన్ని దశాబ్దాలు కృషి చేసినా, ‘ఈ పురస్కారం అందాల్సింది నాక్కాదు, కూచిపూడి నాట్యానికి’ అంటున్న సీతారామాంజనేయులు గారిని చూస్తే ఎంత ఎదిగినా... ఒదిగి ఉండాలన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు. - వాకా మంజులారెడ్డి -
మెడీ కూచిపూడి!
హార్మోనల్ సింఫనీ ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రొఫెసర్. దేహనిర్మాణం, గ్రంథుల పనితీరు, వాటి సమన్వయం గురించి పాఠాలు చెప్పే గురువు. హఠాత్తుగా ఓ రోజు కాలికి గజ్జెకట్టి కూచిపూడి నాట్యం చేశారు. ఆ నృత్యరూపకం కూడా దేహధర్మాల ఇతివృత్తంతోనే. వైద్యశాస్త్రాన్ని, సంప్రదాయ శాస్త్రీయ నృత్యాన్ని కలబోశారు డాక్టర్ జయంతీరమేశ్. కూచిపూడి చరిత్రలోనే ఇదో వినూత్న ప్రక్రియ! కూచిపూడి నాట్యంలో పౌరాణిక, సామాజిక, చారిత్రక ఇతివృత్తాలకు నాట్యరూపం ఇచ్చాను. వైద్యరంగాన్ని నాట్యంతో సమ్మేళనం చేయాలనే ఆలోచన కొత్తది. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది ఒక కథ కాదు. దేహనిర్మాణాన్ని చెప్పాలి. కంటికి కనిపించని హార్మోన్లను పరిచయం చేయాలి. వాటి పనితీరును కళ్లకు కట్టాలి. ఇందుకు కూచిపూడి నాట్యంలో ముద్రలు లేవు. ఇంత కష్టపడ్డా డాక్యుమెంటరీలా తప్ప నాట్యప్రయోగంలా అనిపించదేమోననే సందేహం ఒక పక్క. అయినా సరే శాస్త్రాన్ని, శాస్త్రీయ నృత్యానికి ఆపాదిస్తూ బాలేని రూపొందించాం. ఈ రూపకంలో మేము చెప్పదలుచుకున్న సందేశం చక్కగా ప్రసారమైంది. పధ్నాలుగు మంది పాల్గొన్న ఈ బాలే ప్రేక్షకులను అలరించింది కూడ. - భాగవతుల సేతురామ్, కూచిపూడి నాట్యాచార్యులు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏప్రిల్ ఆరు ఆదివారం సాయంత్రం. హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. మర్నాడు అంటే ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా జరుగుతున్న వేడుకలవి. డాక్టర్ జయంతీరమేశ్ బృందం ‘హార్మోనల్ సింఫనీ’ నృత్యరూపకం ప్రదర్శిస్తోంది. ఆద్యంతం రసవత్తరంగా సాగిన వైద్యనాట్యరూపకానికి గొప్ప ప్రశంస లభించింది. ఇదో వినూత్న ప్రయోగమని కితాబిచ్చారు నాట్యకారులు. ఇంతకీ ఈ ప్రయోగం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని డాక్టర్ జయంతీరమేశ్ని అడిగినప్పుడు ‘నా పేషెంట్లు, వారి అనారోగ్యాలే’ అన్నారాయన. డాక్టర్ జయంతీరమేశ్ది విశాఖపట్నం. బాల్యం విశాఖ, గుంటూరు, తిరుపతిల్లో గడిచింది. స్వతహాగా కళల పట్ల ఆసక్తి ఉండడంతో మెడిసిన్లో చేరడానికి ముందు రెండేళ్లపాటు వైజాగ్లో ‘కూచిపూడి’ నేర్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం వైద్యవిద్యతోపాటు ఒడిస్సీ సాధన చేసినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. క్రమంగా వైద్యరంగంలో నిమగ్నమయ్యారు. వృత్తిలో ఎంతగా విలీనమైనప్పటికీ తన కళాభినివేశాన్ని మరవలేదు. అలాంటి స్పందనల్లో ఒకటి ఇలా నాట్యరూపకంగా మనముందుకొచ్చింది. అదే విషయాన్ని చెప్తూ ‘‘మా దగ్గరకు వచ్చే పేషెంట్లను చూస్తుంటే బాధ కలుగుతుంది. స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు, మహిళల్లో పీసీఓడీ వంటివన్నీ జీవనశైలిలో చోటు చేసుకున్న విపరీత పరిణామాల వల్ల వస్తున్నవే. ఆ విషయం పేషెంట్లకు చెప్తూనే ఉన్నా... ఎంతమందికని చెప్పగలను? నా దగ్గరకు వచ్చిన వారికి చెప్పగలను. వైద్యనిపుణుడిగా సదస్సులు పెట్టి పవర్పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా వివరించవచ్చు. కానీ ఆ ప్రదర్శనకు ఎంతమందిని ఆకర్షించగలననేది మరో ప్రశ్న. అందుకే సాంస్కృతిక మాధ్యమాన్ని ఎంచుకున్నాను’’ అంటారు. రూపకల్పన కోసం... ఈ తరం పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కోసమే ఈ ప్రయత్నం అంటూ తన ప్రయత్నాలను వివరించారు. ‘‘నా ఆలోచనలు, భావాలను పాట రాసుకున్నాను. ఆ గేయానికి తగినట్లు కొరియోగ్రఫీ చేయడానికి చాలామంది ప్రముఖ నాట్యకారులను కోరాను. నా సంకల్పానికి ఆ దేవుడే అన్నీ అమర్చినట్లు భాగవతుల సేతురాం గారిని కలిపారు. ఆయన సంతోషంగా ఆ పనిలో మునిగిపోయారు. నేను ఈ రూపకం కోసం మళ్లీ నాట్యసాధన చేశాను’’ అన్నారు. ఆవిడే యాంకర్! రమేశ్ ప్రయత్నానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు ఆయన శ్రీమతి డాక్టర్ శ్రీవల్లి. ఇదో సృజనాత్మకమైన ఆలోచన అంటారామె. ‘‘నేను థైరాయిడ్ సర్జన్ని. హార్మోన్ల అసమతౌల్యతతో వస్తున్న సమస్యలకు వైద్యం చేస్తుంటాను. కాబట్టి రమేశ్ ఈ నాట్యరూపకం గురించి చెప్పినప్పుడు ఎంతగా ఉద్వేగానికి లోనయ్యానంటే... ఇందులో నేను చేయగలిగింది ఏమైనా ఉందా అనిపించింది. రమేశ్ తెలుగులో రాసిన గేయాన్ని ఇంగ్లిష్లోకి తర్జుమా చేశాను. ఈ హార్మోనల్ సింఫనీ రూపకాన్ని మొదట ఫిబ్రవరి ఒకటిన హైటెక్స్లో ఇంగ్లిష్ వెర్షన్లోనే ప్రదర్శించారు. వైద్యరంగానికి సంబంధించిన విదేశీ ప్రముఖులు హాజరైన కార్యక్రమం అది. ‘దేహనిర్మాణం- దాని పనితీరును భారతీయ సంప్రదాయ నాట్యరీతిలో చూడడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది’ అని ప్రశంసిస్తూ ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాలా అవసరమన్నారు వారంతా’’ అన్నారు శ్రీవల్లి. ఇతివృత్తం! ‘‘ప్రకృతితో మమేకమై మనిషి జీవించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించగలం. ఆధునికతను స్వాగతించాలి. కానీ ప్రకృతికి దూరంగా వెళ్లకూడదు. ప్రకృతి విరుద్ధంగా సాగే జీవనంలో వికృతం విలయతాండవం చేయకముందే మేలుకో... అనే సందేశం ఉంటుంది. మనం ప్రకృతి క్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే హార్మోన్ల విడుదల కూడా క్రమం తప్పుతుంది. హార్మోన్ల విడుదల తీరు నాట్య లయకు తగినట్లు ఉంటుంది. నిర్దిష్టమైన చర్య ఉన్నప్పుడు దానికి ప్రతిచర్య కూడా అంతే నిర్దిష్టంగా ఉంటుంది. ఈ వరుస తప్పకూడదు. ఈ విషయాల పట్ల చైతన్యవంతం చేయడానికి దేశమంతా పర్యటించి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు. -
జగన్తోనే అభివృద్ధి సాధ్యం.
ూచిపూడి(అమృతలూరు) మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలు జగన్తోనే సాధ్యమని నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున శుక్రవారం అన్నారు. నాలుగో రోజు గడపగడపకూ వైఎ స్సార్సీపీ ప్రచారంలో భాగంగా భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఇంటింటికీ తిరిగారు. పార్టీ అధికారంలోకి వస్తే చేయనున్న పథకాలు, కార్యక్రమాలు వివరిం చారు. ఆరోగ్యశ్రీ పూర్తిస్థాయిలో అమలు, పేదలకు నేరుగా సంక్షేమ పథకాలు అందేలా పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రాపర్ల నరేంద్ర, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గాజుల వర్తి బెన్హర్, యువజన విభాగ మండ కన్వీనర్ గర్నెపూడి అజయ్కుమార్, వీవర్స్ సొసైటీ అధ్యక్షుడ బట్టు వీరాస్వామి, నాయీబ్రాహ్మణ సంఘ జిల్లా కార్యదర్శి వక్కలగడ్డ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చవ్వాకుల రాఘవరావు, కూచిపూడి మోషే, ఇంటూరు, తురుమెళ్ళ సర్పం చులు బట్టు మోషే, పేర్ల వెంకట సుబ్బారావు, పార్టీ నాయకులు యల వర్తి రామ్మోహనరావు, యలవర్తి సురేష్ పాల్గొన్నారు. -
సొగసు చూడ తరమా..!
కళ అది కూచిపూడి నృత్యాలు జరిగే వేదిక. వ్యాఖ్యాత వచ్చి ‘‘ఇప్పుడు ఓ చిన్నారి భామాకలాపం ప్రదర్శిస్తుంది’’ అని చెప్పారు. ఓ పదమూడేళ్ల చిన్నారి వచ్చి సత్యభామలా సొగసులు పోతూ... తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మదిని దోచింది. ప్రేక్షకులు పులకించిపోయారు. వ్యాఖ్యాత తిరిగి వేదికపైకి వచ్చి... ఇప్పటి వరకు మీ ముందు నృత్యం చేసిన చిన్నారి బాలిక కాదు బాలుడని చెప్పారు. అంతే... సభాసదులందరూ నిశ్చేష్టులయ్యారు. నాటి నుంచి నేటి వరకూ అలా ఎందరినో అబ్బురపరుస్తూనే ఉన్నాడు... నెల్లూరు, రంగనాయకులపేటకు చెందిన విక్రమ్. విక్రమ్ పసితనంలోనే బుల్లితెరలో వచ్చే పాటలకు తగ్గట్లుగా పాదాలు కదపడాన్ని గమనించిన తల్లిదండ్రులు ముత్యాల మధురజని, రవికుమార్... అతనికి నృత్యంలో శిక్షణ ఇప్పించారు. శిక్షణాలయంలో చేరిన ఆరు నెలలకే వేదికలపై ప్రదర్శన ప్రారంభించిన విక్రమ్... ఇప్పటి వరకు వందల ప్రదర్శనలిచ్చాడు. చీరచుట్టి, గజ్జెకట్టి విక్రమ్ అచ్చమైన స్త్రీమూర్తిలా వేదిక మీద ఆడుతుంటే... చూసినవాళ్లంతా సొగసు చూడతరమా అంటూ మైమరచిపోతారు. ఓసారి అలా ప్రదర్శన ఇస్తున్నప్పుడు చూసిన అతడి అమ్మమ్మ, తాతయ్యలు... తమకు మనవరాలు లేని లోటును విక్రమ్తోనే ఎందుకు తీర్చుకోకూడదు అనుకున్నారు. అందుకే పనిగట్టుకుని స్త్రీ వేషంలో వివిధ పాత్రల కోసం శిక్షణ ఇప్పించారు. నాటి నుంచి నేటి వరకూ విక్రమ్ స్త్రీ పాత్రల్లో అలరిస్తూనే ఉన్నాడు. తారంగం, భామనే సత్యభామనే, భామాకలాపం, జతీస్వరం, బ్రహ్మాంజలి, సప్తపది, కృష్ణశబ్దం, శివపాదం, మంజీరనాదం తదితర నృత్యాలను ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శించి మన్ననలందుకున్నాడు విక్రమ్. ‘కాంచన’ సినిమాలోని ఓ పాటలో కూడా నర్తించాడు. అయితే కేవలం స్త్రీవేషంలో మాత్రమే నర్తించడు విక్రమ్. అబ్బాయి వేషంలో కూడా అదరగొట్టేస్తాడు. ఇతని ప్రతిభ చూసి ‘షిరిడీ జైసాయిరాం’ చిత్రంలో ఓ నృత్యప్రదర్శనకు చాన్స్ ఇచ్చారు. అదే విధంగా పలు చిత్రాలలోనూ నటించే అవకాశాలు దగ్గరకు వచ్చాయి. -
నీలం పరిహారం పంపిణీకి సిద్ధం
కూచిపూడి, న్యూస్లైన్ : రెండేళ్ల క్రితం సంభవించిన నీలం తుపాను నష్టపరిహారం బకాయి రూ.3 కోట్లు పంపిణికీ సిద్ధంగా ఉందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆయన మొవ్వ మండలంలోని కారకంపాడులోని స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రూ.13కోట్లు పంటనష్టపరిహారంగా గుర్తించామని అందులో తొలి విడత రూ.10 కోట్లు అప్పట్లోనే విడుదల కాగా మిగిలిన రూ.3కోట్లు వారం రోజుల క్రితం విడుదలయ్యాయని, రెండు మూడు రోజుల్లో వ్యవసాయ శాఖాధికారులు రైతుల ఖాతాలకు నేరుగా పంపుతారని చెప్పారు. ఈ మేరకు జేడీకి ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. కాగా కారకంపాడు నుంచి నిడుమోలు వరకు డబుల్రోడ్డుకు రూ.10.10కోట్లతో అంచనాలు వేయించామన్నారు. దీనికి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఆమోదం తెలిపారని చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్లను రిటైర్ అయ్యే వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే రిటైరయ్యే పోస్టుల్లో మాత్రం ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకున్నా... అది అమలు జరిగే అవకాశాలు లేవన్నారు. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు, విడివిడిగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తేనే రాష్ట్ర విభజనకు అవకాశం ఏర్పడుతుందన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే రాష్ట్రం విడిపోతేనే తీవ్ర పరిణామాలు ఏర్పడుతాయని పేర్కొంటుండటంతో విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని సార థి తేల్చి చెప్పారు.ఆయన అంతకుముందుగా మొవ్వ ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, తహశీల్దార్ జీ భద్రుతో చర్చించారు. ఆర్డబ్ల్యుఎస్ ఈఈ అమరేశ్వరరావు, డీఈ ఏ శ్రీనివాసరావుతో శాఖాపరమైన చర్చలు జరిపారు. -
అలరించిన నాట్యోత్సవం
కూచిపూడి, న్యూస్లైన్ : తానీషా యువ నాట్యోత్సవ్ ముగింపు వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. కూచిపూడిలోని కళావేదికపై అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులనుంచి నిర్వహిస్తున్న ఈ నాట్యోత్సవాల్లో కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత నాట్యాచార్య పసుమర్తి రత్తయ్యశర్మను ఘనంగా సత్కరించారు. ఆయనకు రూ. 5,116లు నగదు, దుశ్శాలువ, మెమెంటోను అందించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడితో పాటు సోదర నాట్యాలైన భరతనాట్యం, మణిపురి, మోహినీఆట్టం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చెన్నైకు చెందిన భరతనాట్య కళాకారిణిమురుగ శాంకరీ శంకర శ్రీగిరి...అంటూశివతాండవం (హంసనందిని) ను నర్తించింది. తంజావూరులోని బృహదీశ్వరుని స్తుతిస్తూ మనవి చేసుకొనరాదా చక్కని స్వామి (శంకరాభరణం), పట్టాభిరాముని ప్రార్థిస్తూ నే మాటలే మాయనురా (పూర్వకల్యాణి) అంశాలను ప్రదర్శించారు. కలకత్తాకు చెందిన మణిపురి నాట్యకళాకారుడు సుదీప్ ఘోష్ తొలి అంశం బసంత రాసలీలలులో చూపిన హావభావాలు ఆకట్టుకున్నాయి. శ్రీ కృష్ణునిపై భక్తి భావాలుగల ఈ అంశంలో 108 మంది గోపికలతో మహరాస్, బసంతరాస్ (హోళీ) కుంజరాస్, దిబారాస్, నృత్తరాస్లను నర్తించారు. వీటిల్లో ఈ నృత్యాచార్యుడుబసంత్రాస్ ప్రత్యేకతను తన ప్రదర్శన ద్వారా చూపారు. రెండవ అంశంలో అభినయ్లో రాధాకృష్ణుల శృంగార, ప్రణయ సన్నివేశాలను ప్రదర్శించారు. నర్తకుడు ఆ రెండు పాత్రలు తనే అయి సంచార భావంలో హావభావాలు ప్రదర్శించారు. తర్వాత దశావతారాల్లో శ్రీ కృష్ణుని అవతారానికి బదులు బలరామావతారంతో మిగిలిన తొమ్మిది అవతారాలను ప్రదర్శించారు. బెంగుళూరుకు చెందిన రేఖారాజ్ మోహిని ఆట్టం నృత్యాలను ప్రదర్శించారు. నృత్తానికి, పాదాభినయానికి ప్రాధాన్యత నిచ్చిన చొళ్లుకట్టు (జతిస్వరం)కు ప్రేక్షకుల కరతాళధ్వనులు లభించాయి. అమీర్ కళ్యాణ్ రాగంలో తాం..దితితాం....అంటూ జతుల తోనే ప్రదర్శించారు. నల, దమయంతుల మధ్యగల ప్రేమ, శృంగారంలకు చెందిన ప్రాణ ప్రియనానానళవై ఓర్టెన్ (శుద్ధసన్యాసి)ను, స్వాతి తిరునాళ్ కీర్తన చెలియ కుంజ నమో....(బృందావన సారంగ) అంటూ రాధాకృష్ణుల ప్రణయాన్ని సంచార భావం ద్వారా వెల్లడించారు. అయ్యప్ప భక్తి గీతం హరివరాసనం-విశ్వమోహనం (మధ్యమావతి)లో ఆమె చూపిన హస్త, భావ, పాద విన్యాసాలు కార్యక్రమానికే తలమానికం. రాజమండ్రికి చెందిన లలితా సింధూరి కూచిపూడి నాట్యాంశాలైన ఆనంత తాండవ మాడే ..శివుడు (రాగమాలిక), శ్రీ గణపతిని సేవింపరారే-త్యాగరాజ కీర్తన, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన జాయతే వనమాలిలను నర్తించారు. జగ్గయ్యపేటకు చెందిన పండిట్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారీ కురవి సుబ్రహ్మణ్య ప్రసాద్ ప్రదర్శించిన నాట్యాంశాలు సంప్రదాయ రీతిలో సాగాయి. ఈయన నర్తించిన అంశాలకు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి నట్టువాంగం చేయగా గాత్రంపై వీవీ దుర్గాభవాని, మృదంగంపై పసుమర్తి హరనాథశాస్త్రి, వయోలిన్పై పాలపర్తి ఆంజనేయులు సహకరించి జీవం పోశారు. వీరికి అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ పర్యవేక్షణలో ముఖ్యఅతిథి జ్ఞాపికలనందించారు. తొలుత బందరు పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణరావు జ్యోతి ప్రజ్వలనచేశారు. ఎస్బీఐ మేనేజర్ రమణారావు, టూరిజం శాఖ మేనేజర్ జి. రామలక్ష్మణరావు, ఇంజినీర్ ఎన్. శివన్నారాయణ, రిటైర్డ్ ఆంధ్యా బ్యాంక్ ఉన్నతాధికారి వెహైచ్ రామకృష్ణ, నాట్యాచార్య చింతా రవిబాలకృష్ణ, వేదాంతం రత్తయ్యశర్మ, సర్పంచి కందుల జయరామ్ పాల్గొన్నారు. -
తన్మయపరచిన తానీషా నాట్యోత్సవాలు
కూచిపూడి, న్యూస్లైన్ : తానీషా యువ నాట్యోత్సవ్లో భాగంగా రెండో రోజు శనివారం నిర్వహించిన నాట్యాంశాలు కళాప్రియులను అలరించాయి. కూచిపూడిలోని కళావేదికపై అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి, పద్మభూషణ్ డాక్టర్ వెం పటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పాల్గొన్న కళాకారుల అందెల రవళులతో ప్రాం గణం మార్మోగింది. కూచిపూడికి చెం దిన యేలేశ్వరపు సోదరీమణులు ఉషామాధురి, రాధిక నిర్వహించిన గాత్ర విభావరి పండిత పామరులను ఓలలాడించింది. గుడివాడకుచెందిన సంగీత విద్వాంసులు పోపూరి శ్యామ్ సుందర్ శిష్యురాండ్రైన వీరి కచ్చేరికి మృదంగంపై చింతా సూర్యప్రకాష్, వయోలిన్పై పాణ్యం దక్షిణామూర్తిలు సహకరించారు. వీరిని నిర్వాహకుల్లో ఒకరైన పసుమర్తి కేశవప్రసాద్ ఆధ్వర్యంలో మెమొంటోలతో సత్కరించారు. అలరించిన నాట్యాంశాలు : విశాఖపట్నంకు చెందిన కూచిపూడి నాట్య అకాడమీ ప్రధానాచార్యులు పసుమర్తి వెంకటరమణ శిష్యురాలు టీవీ ఎస్ఎస్ సాకేత ప్రదర్శించిన రెండు అం శాలు పూర్వ సాంప్రదాయపద్ధతిలో సాగాయి. నృత్యరవళి కూచిపూడి డాన్స్ అకాడమీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం. సురేంద్రనాధ్ శిష్య బృం దంతో కలసి ప్రదర్శిం చిన అంశాలు తన్మయత్వ పరిచాయి. పండిట్ బిస్మిల్లాఖన్ అవార్డీ, నాట్యాచార్య చింతా రవి బాలకృష్ణ శిష్యురాండ్రు ప్రదర్శించిన అంశాలకు రసజ్ఞులైన ప్రేక్షకులు కళానీరాజనాలందించారు. మౌనిక, వల్లి ,పీ లాస్యప్రణతి, ఎం. సాయి చంద్రిక, బీ హరిప్రియ ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. చింతా రవి బాలకృష్ణ నట్టువాంగం, వీవీడి భవానీ గాత్రం, పీ హరనాధ్ మృదంగం , పీ ఆంజనేయుల వయోలిన్ మంత్రముగ్ధులను చేశాయి. తహశీల్దార్ జీ భద్రు ముఖ్యఅతిథిగా పాల్గొనగా అతిథులుగామాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య, కూచి పూడి సర్పంచ్ జీ జయరామ్, మొవ్వ ఏఎంసీ చైర్మన్ మండవ రత్నగిరిరాావు, వ్యాపారవేత్త పిన్నమనేని భీమశంకరరావు హాజరై ప్రసంగించారు. కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశకప్రసాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అ సందర్భంగా నాట్యాచార్యులు వేదాంతం రాధే శ్యాంను ఘనంగా సత్కరించారు. -
నాట్యోత్సవం
కూచిపూడి సంప్రదాయ నృత్యరీతులు.. విభిన్న నాట్య విన్యాసాలు.. వెరసి తానీషా యువ నాట్యోత్సవాలు రసజ్ఞులను ఆనందడోలికల్లో ముంచెత్తారుు. కళాకారుల అందెల సవ్వళ్లు.. వీక్షకుల కరతాళ ధ్వనులతో కూచిపూడిలోని సిద్ధేంద్రయోగి కళావేదిక శుక్రవారం మార్మోగిపోరుుంది. ఆద్యంతం కళామయంగా సాగిన మొదటిరోజు కార్యక్రమాలకు జనుల నుంచి విశేష స్పందన వచ్చింది. అంతర్జాతీయ కళాకారులు తమ నాట్య విన్యాసాలతో ఆకట్టుకున్నారు. కూచిపూడి, న్యూస్లైన్ : అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నాట్యక్షేత్రమైన కూచిపూడిలో నిర్వహించే ‘తానీషా యువ నాట్యోత్సవ్’ శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు కార్యక్రమాలను పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం స్మారక నాట్యోత్సవం పేరిట నిర్వహించారు. శ్రీసిద్ధేంద్ర యోగి కళావేదికపై ఏర్పాటుచేసిన నాట్య ప్రదర్శనలకు ప్రేక్షకులు నీరాజనాలర్పించారు. తొలిగా అమెరికా కళాకారిణి హేమశిల్ప ఉప్పల కూచిపూడి అంశాలను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. సదాశివ బ్రహ్మేంద్ర రచించిన శృంగార ప్రాధాన్యత కలిగిన ‘జావలి ఎంతటి కులుకే..’ అంశంలో నాయిక విరహవేదన, భక్తి భావాలను ఆమె చూడచక్కగా ప్రదర్శించారు. హాంకాంగ్కు చెందిన భరతనాట్య కళాకారిణి రూపా కిరణ్ విఘ్నేశ్వర స్తుతితో నాట్యాన్ని ప్రారంభించారు. పురందరదాస్ రచించిన ‘గజవదనా బేడువే..’ అంటూ పుష్పాంజలి అంశాన్ని ప్రదర్శించారు. మద్వాచార్యులు విరచిత ద్వాదశ స్తోత్రం (దశావతారం) ‘దేవకీనందన...’తో ప్రారంభించి విష్ణుమూర్తి అవతారాలను చూపించారు. చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లే రచిం చిన ‘మధురానగరిలో చల్లనమ్మబోవుదారి..’ అంటూ ప్రదర్శించిన అంశం ఆకట్టుకుంది. పండిట్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత యేలేశ్వరపు శ్రీనివాసులు బృందం ప్రదర్శించిన ‘భక్తప్రహ్లాద’ సంక్షిప్త యక్షగానం ఆహ్లాదకరంగా సాగింది. ప్రహ్లాదుడిగా యేలేశ్వరపు లక్ష్మీసంధ్య వైష్ణవి, హిరణ్యకశ్యపుడిగా యేలేశ్వరపు శ్రీనివాసులు, నృసింహస్వామిగా యేలేశ్వరపు పూర్ణచంద్రరావు నర్తించారు. చివరిగా ముంబరుుకి చెందిన నాట్యాచారిణి మేకల రాధామోహన్ బృందం ‘పద్మావతి కల్యాణం’ నృత్య నాటకం ప్రదర్శించింది. పద్మావతిగా శివానంద్, వేంకటేశ్వరస్వామిగా రాధామోహన్ నటన అద్భుతమనిపించింది. అన్నమాచార్యుడి కీర్తనల్లో ఈ అంశానికి సంబంధించిన కీర్తనలను క్రోడీకరించి రాధామోహన్ కోరియోగ్రఫీ చేసిన తీరు శభాష్ అనిపించుకుంది. శివుడిగా అంజలీసుందరం, పార్వతీదేవిగా ఇసికాజిందల్, భృగుమహర్షిగా కె.ప్రశాంత్కుమార్, నారదుడిగా పీటీఎన్ వీఆర్ కుమార్తో పాటు మీత, కేటికి, రాజేశ్వరి తదితర 24మంది కళాకారిణులు ఈ నృత్య నాటకంలో పాల్గొన్నారు. -
27నుంచి తానీషా యువ నాట్యోత్సవ్
కూచిపూడి, న్యూస్లైన్ : అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి (కూచిపూడి) పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ (చెన్నై) సంయుక్త ఆధ్వర్యంలో 27వ తేదీనుంచి 29వ తేదీవరకు ‘తానీషా యువ నాట్యోత్సవ్ - 2013 నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ తానీషాకు నాట్య నివాళి అర్పిస్తున్నామన్నారు. తొలిరోజు వెంపటి చినసత్యం, రెండవరోజు పీవీజీ కృష్ణశర్మ, ముగింపురోజును వేదాంతం సత్యనారాయణశర్మల పేరిట స్మారక నాట్యోత్సవాలుగా నామకరణం చేసి నిర్వహిస్తున్నామని చెప్పారు. వేడుకలను దేవాదాయ ధర్మాదాయ కమిషనర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి నందివెలుగు ముక్తేశ్వరరావు ప్రారంభిస్తారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పామర్రు శాసనసభ్యులు డీవై దాస్ జ్యోతి ప్రజ్వలన చేస్తారని తెలిపారు. నృత్యవాఛస్పతి వేదాంతం పార్వతీశం స్మారక పురస్కారాన్ని నాట్యాచార్య చింతా సీతారామాంజనేయులు, వెంపటి చినసత్యం స్మారక పురస్కారాన్ని కళారత్న ఏబీ బాలకొండలరావుకు బహూకరిస్తున్నామని చెప్పారు. రాజమండ్రికి చెందిన లలితా సింధూరి కూచిపూడి నాట్యం, హాంకాంగ్కు చెందిన రూపా కిరన్ భరతనాట్యం, యుఎస్ఏకు చెందిన ఉప్పల హేమశిల్పి కూచిపూడి నాట్యం, పండిట్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారగ్రహీత యేలేశ్వరపు శ్రీనివాసు బృందం భక్తప్రహ్లాద యక్షగాన ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు. రెండవ రోజు ముఖ్యఅతిధిగా జూనియర్ సివిల్ జడ్జి కే ప్రభాకరరావు పాల్గొని నాట్యాచార్య వేదాంతం రాధేశ్యాంను పురస్కరిస్తారని తెలిపారు. కూచిపూడికి చెందిన యేలేశ్వరపు సోదరీ మణులు సంగీత సభ, బెంగళూరుకు చెందిన పసుమర్తి వెంకటరమణ కూచిపూడి నాట్యం, వందన ఒడిస్సీ నాట్యం, హైదరాబాద్కు చెందిన ఎం.సురేంద్రనాధ్ బృందం కూచిపూడి నాట్యం, పండిట్ బిస్మిల్లాకాన్ యువ పురస్కారగ్రహీత చింతా రవిబాలకృష్ణ శిష్యబృందం కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇస్తారని చెప్పారు. ముగింపురోజున ముఖ్యఅతిథిగా ఎంపీ కొనకళ్ల నారాయణరావు పాల్గొని కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత నాట్యాచార్య పసుమర్తి రత్తయ్యశర్మను సత్కరిస్తారని తెలిపారు. అనంతరం చెన్నైకు చెందిన మురుగ శాంకరి భరతనాట్యం, కలకత్తాకు చెందిన సుధీర్ ఘోష్ మణిపురి, బెంగళూరుకు చెందిన మోహినీ ఆట్టం, పండిట్ బిస్మిల్లాకాన్ యువపురస్కార గ్రహీత కురవి సుబ్రహ్మణ్య ప్రసాద్ కూచిపూడి నాట్యం ప్రదర్శిస్తారని తెలిపారు. -
నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనం
కూచిపూడి.. కథక్.. యక్షగానం.. బంజారా డ్యాన్స్లు.. విభిన్న రాష్ట్రాల కళా ప్రదర్శనలు నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనంలో ఆవిష్కృతమయ్యాయి. సెంట్రల్ యూనివర్శిటీలోని డీఎస్టీ ఆడి టోరియంలో జాతీయ స్థాయి కళల ప్రదర్శన శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.దేశంలోని 8 నవోదయ విద్యాలయాల రీజియన్ల నుంచి 500 మంది విద్యార్థులు ఈ ప్రత్యేక సాంస్కృతిక సంబరాల్లో భాగస్వాములయ్యారు. దక్షిణ, ఈశాన్య, ఉత్తర భారతదేశ సంప్రదాయ, జానపద, గ్రామీణ కళలను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. -
కరాటేలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
కూచిపూడి, న్యూస్లైన్ : ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈ నెల 17న నిర్వహించిన ఏపీ అంతర్ జిల్లా గోజోరియో కరాటే ఓపెన్ చాంపియన్షిప్ పోటీల్లో మొవ్వ మండలం కోసూరు, మొవ్వ విద్యార్థులు పలు పతకాలు సాధించారు. కోసూరు విజయశ్రీ సన్ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు డి.పి.ఎస్.మణికంఠ అండర్-9 విభాగంలో కటాలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. సీహెచ్.వంశీ కటాలో మూడో స్థానంలో నిలిచాడు. అండర్-10 కటాలో జె.మోహన్చైతన్య మూడో స్థానం, కటాలో డి.మనోజ్వర్మ మూడో స్థానంలో నిలిచాడు. అండర్ 11 కటాలో ఎ.దినేష్కుమార్, డి.రోహిత్ మూడో స్థానం, అండర్ 12 కటాల్లో సీహెచ్.జితేంద్ర రెండో స్థానం, ఎ.చైతన్య సాయి మూడో స్థానాన్ని పొందారు. వీరిని కరస్పాండెంట్ పున్నంరాజు, ప్రిన్సిపాల్ జోసఫ్ అభినందించారు. అలాగే మొవ్వ హోలీ స్పిరిట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థి కె.వి.ఎస్.భరత్కుమార్ అండర్-14 కటాలో మొదటి స్థానం, కుమితిలో రెండో స్థానం, కటాలో రెండో స్థానం సాధించారు. అండర్-9లో ఎం.రఘురామ్ టీమ్ కటాలో మొదటి స్థానం, కుమితిలో మూడో స్థానం సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ సిస్టర్ ఫిలోమినీ జేమ్స్ అభినందించారు. ‘కొమ్మారెడ్డి’ విద్యార్థులకు పతకాలు బంటుమిల్లి రూరల్ : అంతర్ జిల్లా గోజో రియో కరాటే ఓపెన్ చాంపియన్షిప్ పోటీలలో బంటుమిల్లిలోని కొమ్మారెడ్డి టాలెంట్ హైస్కూల్ విద్యార్థులు పలు అంశాలలో పతకాలు గెలుపొందినట్లు పాఠశాల డెరైక్టర్ కె.కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కటా విభాగంలో ఆర్. చిద్విలాస్, కె.సాయినితిన్, ఎ.రవీనాశ్రీ, కె.బాలాజీ బంగారు పతకాలు, వై. వెంకటరత్నం, పి.సందీప్ రజతపతకాలు, జె.అంజనిబాబు, వై.కార్తికేయవెంకట్ కాంస్య పతకాలు సాధించినట్టు వివరించారు. టీం కటా విభాగంలో వీరు తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. విజేతలను పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, కోచ్ ఎస్. వెంకటేశ్వరరావు, మంగళవారం అభినందించారు. -
కూచిపూడి మయూరం
శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో భక్తితత్వాన్ని... సంక్రాంతి సంబరాలలోసంక్రాంతి లక్ష్మిని... తెలుగు మహాసభల్లో తెలుగుభాషను... అభినయంతో నర్తించే అమ్మాయే లలితాసింధూరి! కూచిపూడిలోనే ఆనందం... కూచిపూడితోనే కెరీర్... అంటోందీ అమ్మాయి. కళ దేవుడి వరం... కళ కోసం జీవించడమే మా లక్ష్యం... అంటున్నారు... వరలక్ష్మి, ప్రసాద్లు. సింధూరిని నాట్యమయూరిగా తీర్చిదిద్దడంలో వారి అనుభవాలే ఈ వారం లాలిపాఠం!! తిరుమల శ్రీవారిమండపంలో నాదనీరాజనంలో కూచిపూడి నాట్యప్రదర్శన...భోపాల్లో ఆంధ్రతెలుగు కళాసమితి, కోల్కతాలోని ఆంధ్రసంఘం ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు, చెన్నైలో చిత్తూరు నాగయ్య అవార్డు ప్రదానోత్సవం, ఒడిషాలో గజపతి ఉత్సవాలు, కూచిపూడిలో తానీషా యువ ఉత్సవ్, రాజమండ్రిలో త్యాగరాజ నారాయణదాస సేవాసమితి వేడుకలు, నెల్లూరులో జాతీయస్థాయి కూచిపూడి నాట్యపోటీలు... ఇవి కూచిపూడి నర్తకి లలితాసింధూరి నాట్యం చేసిన వేదికలలో కొన్ని. నాట్యసాధన మొదలుపెట్టిన పదేళ్లలో ఈ అమ్మాయి ఆరు వందలకుపైగా ప్రదర్శనలు ఇచ్చింది. లలితాసింధూరి మనకు కూచిపూడి నాట్యకారిణిగానే తెలుసు. నిజానికి ఆమె మూలాలు కూచిపూడి నాట్యం రూపుదిద్దుకున్న కూచిపూడి గ్రామంతోనే ముడిపడి ఉన్నాయి. కూచిపూడి త్రయంలో ఒకరైన వెంపటి వెంకటనారాయణ సింధూరి ముత్తాత. పన్నెండేళ్ల వయసులో శాస్త్రీయంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. సింధూరి తండ్రి ప్రసాద్ ఇదే విషయం చెప్తూ ‘‘ఎల్కేజీ నుంచి స్కూల్ ప్రోగ్రాముల్లో డాన్స్ చేసేది. జెమినీ టీవీలో ‘డాన్స్ బేబీ డాన్స్’లో కూడా చేసింది. సింధూరి డాన్సును ఇష్టపడుతోందని సంప్రదాయనృత్యాన్ని నేర్పిద్దాం అనుకున్నాం. అలా తను ఏడవ తరగతిలో ఉండగా నాట్యసాధన మొదలుపెట్టింది. తొలిగురువు పసుమర్తి శ్రీనివాస్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్యూనివర్శిటీలో శాస్త్రీయ నృత్యంలో పీజీ చేస్తోంది. పీహెచ్డి సీటు కూడా వచ్చింది’’ అన్నారు. చిన్న చిన్న త్యాగాలు... పిల్లలను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు చిన్న చిన్న త్యాగాలకు సిద్ధం కావల్సిందేనంటారు వరలక్ష్మి. రాజమండ్రిలో స్కూల్ టీచర్గా ఉద్యోగం చేస్తూ సింధూరి నాట్యసాధన కోసం ఉద్యోగం మానేశారు. ‘‘సింధూరి కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఏడాదికి నేను ఉద్యోగం మానేశాను. పాపను నాట్యప్రదర్శనలకు తీసుకెళ్లడంతోపాటు నాట్యసాధనకు కూడా నా సహాయం అవసరమయ్యేది. సింధూరి గురువు హైదరాబాద్కి మారిపోయారు. దాంతో వారాంతాలలో హైదరాబాద్కి వచ్చేవాళ్లం. సింధూరి వేసవి సెలవులు హైదరాబాద్లో నాట్యసాధనలోనే గడిచేవి. ఆ తర్వాత బీటెక్ చదివేటప్పుడు భామాకలాపం నేర్చుకోవడానికి రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లేవాళ్లం. గురువుగారి వెసులుబాటుని, కాలేజీ ప్రాక్టికల్స్ను బట్టి ప్లాన్ చేసుకుంటూ ప్రయాణాలు చేసేవాళ్లం. డాన్సుకోసం ఎంతగా శ్రమించినా సరే చదువును పక్కనపెట్టకూడదనేది మా వారి అభిప్రాయం. బీటెక్ తర్వాత సింధూరి డాన్సులోనే కెరీర్ డెవలప్ చేసుకుంటానని చెప్పగానే ఆయన సందేహించకుండా ప్రోత్సహించారు. సింధూరి డాన్సుకోసం నేను ఉద్యోగం మానేస్తే మావారు బ్యాంకులో ప్రమోషన్లను వదులుకున్నారు’’ అన్నారామె. హోమ్వర్క్ చేయాల్సిందే! కళ రాణించాలంటే గురువు దగ్గర చేసే సాధన ఒక్కటే సరిపోదు, బాగా హోమ్వర్క్ చేయాలంటారు ప్రసాద్. ‘‘నేను కర్ణాటక సంగీతం పాడుతాను. సాంస్కృతిక కార్యక్రమాలలో పాడడం నా ప్రవృత్తి. అందుకోసం చాలా పాటలతో ఆల్బమ్లు తయారు చేసుకున్నాను. సింధూరి చేత ఆ పాటల మీద వర్కవుట్ చేయించాను. ఘంటసాల ప్రైవేట్ పాటలను సాధన చేస్తున్న గాయకులు ఉన్నారు కానీ కొరియోగ్రఫీ చేసిన వాళ్లు లేరు. ఆ పని నువ్వే చేయచ్చుగా అని కె.వి.రావు సూచించారు. ఆ సూచనతో ‘జయహే ఆంధ్రమాతా...’ పాటకు డాన్సు కంపోజ్ చేసింది. తర్వాత సుమారు పాతిక పాటలకు కొరియోగ్రఫీ చేసుకుంది సింధూరి. వాటికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఘంటసాల పాటలతోపాటు ఇతర జానపదాలు, జావళులకు కూడా నాట్యరీతిని రూపొందించింది. మా ఆవిడ చెప్పినట్లు ప్రమోషన్ వదులుకోవడం అనేది పెద్ద త్యాగమే అయితే... ఆ త్యాగానికి ప్రతిఫలంగా మా అమ్మాయి నాకు లెక్కలేనన్ని బహుమతులిచ్చింది. నాట్యప్రదర్శనల ద్వారా అనేక ప్రదేశాలు పర్యటించాను. కళ భగవంతునికే అర్పణం అని మా అమ్మాయికి చెప్తుంటాను’’ అని సింధూరి నాట్యప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారాయన. పాత పాటలు అభినయవాచకాలు! ‘‘సింధూరికి సినీనటి సావిత్రి అంటే ఇష్టం. డాన్స్ బేబీ డాన్స్లో సావిత్రి పాటలకే డాన్సులు చేసేది. సాహిత్యమే ప్రధానంగా సాగే పాటలకు నాట్యసాధన చేయించడంతో సింధూరికి నాట్యంలో ప్రావీణ్యత వచ్చింది. సినిమా పాటలకు క్లాసికల్ డాన్సేంటి అని విమర్శించిన వాళ్లు లేకపోలేదు. కానీ మేము ఆ మాటలను పట్టించుకోలేదు. నాట్యాన్ని ప్రదర్శించే వేదికను బట్టి పాటను తీసుకోవాలి. ఆ ఎక్సర్సైజ్ అంతా మావారిదే. సింధూరికి పాట ఇస్తే అరగంటలో డాన్సు కంపోజ్ చేసుకుంటుంది. అలా ఏ ప్రదర్శనకైనా అమ్మాయి దృష్టి డాన్సు మీద మాత్రమే ఉండేటట్లు జాగ్రత్త తీసుకుంటారాయన. సింధూరి వాగ్గేయకారుల కీర్తనలకూ, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గానం చేసిన హనుమాన్చాలీసాకు నాట్య రూపకల్పన చేసింది’’ అన్నారు వరలక్ష్మి. అక్క కోసం తమ్ముడు! ‘‘మేము సింధూరి నాట్యసాధన, ప్రదర్శనలతో ప్రయాణాలు చేస్తుంటే మా అబ్బాయి మాత్రం ఒక్కడే ఇంట్లో ఉండి వంట చేసుకుని కాలేజ్కెళ్లేవాడు. ఇప్పుడు వాళ్లక్క కోసం తనే నెట్ నుంచి పాటలు డౌన్లోడ్ చేయడం, రికార్డింగ్, మిక్సింగ్... వంటి పనులన్నీ చేసి ఇస్తాడు. కాలేజీకి సెలవు ఉంటే అక్కకు తోడుగా వెళ్తాడు. తనకి ఏ అవసరం వచ్చినా అందుకోసం పరుగులు తీస్తాడు’’ అని వరలక్ష్మి మురిపెంగా చెప్పారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా..! ‘‘మా ఇంట్లో అందరం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. అందుకే ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ప్రదర్శనలకు తీసుకెళ్లేవాళ్లం. చాలా సందర్భాల్లో ప్రదర్శన ద్వారా వచ్చిన డబ్బుకంటే అందుకు అయిన ఖర్చే ఎక్కువగా ఉండేది. అయినా లెక్క చేయలేదు. డాన్సులో మంచి స్థాయికి వెళ్లాలి, కానీ కమర్షియల్ చేయకూడదు. కళ యెడల అంకిత భావంతో ఉంటూ, జీవితంలో భాగం చేసుకోవాలి. అప్పుడే అందులో రాణిస్తాం. పిల్లలకు అదే చెప్తుంటాం. కళ అనేది దేవుడిచ్చినవరం, దానిని ఆయనకే అంకితం చేయాలన్నది మా ఉద్దేశ్యం’’ అంటారు సింధూరి తల్లిదండ్రులు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఉద్యోగం ఎప్పుడైనా వస్తుంది, డాన్సు రావాలంటే వయసు మించకూడదు. అందుకే నాట్యంలో రీసెర్చ్ చేస్తానంటే మేము అడ్డుచెప్పలేదు. సింధూరి విజయాల్లో నాకు అత్యంత సంతోషం కలిగించిన సందర్భాలు రెండు. రాష్ట్రపతి చేతుల మీదుగా బాలశ్రీ పురస్కారం అందుకోవడం, పీహెచ్డి ఎంట్రన్స్లో సెలెక్ట్ కావడం... - వరలక్ష్మి, లలితాసింధూరి తల్లి లలితాసింధూరి విజయాలలో కొన్ని... 2011లో జూనియర్ చాంబర్ నుంచి జాతీయస్థాయి ‘అవుట్స్టాండింగ్ పర్సన్’ అవార్డు 2006లో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం చేతుల మీదుగా బాలశ్రీ జాతీయ పురస్కారం 2004-05లలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా బాలరత్న, ప్రతిభ అవార్డులు నృత్యకౌముది, నృత్య భారతి, అభినవ రసధుని, నాట్యమయూరి బిరుదులు 2004 నుంచి నాలుగేళ్లు ‘నవ్యనాటక సమితి’ జాతీయస్థాయి డాన్స్పోటీలలో ప్రథమ బహుమతి పద్మశ్రీ శోభానాయుడు నిర్వహించిన ‘సిరిసిరిమువ్వ’ డాన్స్ కాంపిటీషన్లో మొదటి బహుమతి దూరదర్శన్ ‘మువ్వల సవ్వడి’లో ప్రథమ బహుమతి ఒంగోలులో అఖిల భారత తెలుగు మహాసభల్లో ప్రదర్శన. -
ఘనంగా తెలుగు సాంస్కృతిక దినోత్సవం
సాక్షి, ముంబై: వడాలాలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ‘తెలుగు సాంస్కృతిక దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గేయాలతోపాటు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు, నాటికలు, బుర్రకథను ప్రదర్శించడమేగాకుండా భాగవతంలోని పద్యాలను రాగయుక్తంగా పాడి ఆహూతులను కట్టిపడేశారు. నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పాశ్చాత్య సంస్కృతివైపు ఆకర్షితులవుతున్న నేటి తరానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మాతృభాష పట్ల మమకారం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ భాషలోని మాధుర్యాన్ని తరతరాలకు అందజేయాలన్న సంకల్పంతో తెలుగు సాహిత్యం లోని అనేక ప్రక్రియలను, బుర్రకథలను, పురాణ గాథలను వినిపిస్తున్నామన్నారు. కాగా విద్యార్థుల ప్రదర్శనలకు ముగ్ధులైన ఆంధ్రా ఎడ్యుకేషన్ అధ్యక్షులు స్వరూపరావు, కార్యదర్శి పీఎం రావు విద్యార్థులకు బహుమతులను అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, అతిథులు, విద్యార్థులతోపాటు స్థానికులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
అనురాగ సంగమం
జూన్ 3న సాగర సంగమం విడుదలైంది. జూలై 3న అలేఖ్య, వినయ్ల పెళ్లయింది. ఈ ముప్పై ఏళ్ల దాంపత్య జీవితంలో... ఇద్దరూ కలిసి చూసిన సినిమా సాగర సంగమం ఒక్కటే! అది కూడా పెళ్లికి ముందర! వినయ్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అలేఖ్య ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. ప్రముఖులైన భార్యాభర్తలకు... సినిమాలకు, షికార్లకు టైమ్ దొరక్కపోవడంలో ఆశ్యర్యం లేదు. అయితే ‘దొరకని టైమ్’లో ఈ దంపతులు దొరకపుచ్చుకున్నవి చాలా ఉన్నాయి! ఆమె అభినయం... ఆయన పరవశం. ఆయన అనునయం... ఆమె జన్మఫలం. ‘మనసే జతగా...’ సాగిన వీరి దాంపత్యం... ఒక అనురాగ సంగమం! అచ్చ తెలుగింటి ఆహార్యంతో కనిపించే ఆమె పేరు అలేఖ్యపుంజాల. కూచిపూడి నృత్యకళాకారిణి. మూడు దశాబ్దాలుగా నృత్యరీతులెన్నింటినో వేదికల మీద అభినయిస్తున్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు కూచిపూడి విభాగానికి అధిపతిగా విధులను నిర్వర్తిస్తున్నారు. వేదికమీద లయబద్ధంగా అందెల రవళులు చేస్తూనే, విధి నిర్వహణలో మెలకువగా ఉంటూనే, ఇంటిల్లిపాదికి స్వయంగా వంట చేసి ఆప్యాయంగా వడ్డన చేయడం... ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అని ఆమెను ఆడిగితే చిరునవ్వుతో తన శ్రీవారు డాక్టర్ వినయకుమార్ వైపు చూశారు ఆమె. ఈ డాక్టర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. ‘‘నాట్యం అంటే నాకు అమితమైన ప్రేమ. నా నాట్యాన్ని ప్రేమించడం ఈయనకు హాబీ’’ అంటూ సంసారపు తొలి అడుగులను గుర్తుచేసుకుంటూ తమ దాంపత్య బంధంలోని మధురానుభూతులను మనముందుంచారు అలేఖ్య. ఇద్దరూ పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే! వినయ్కుమార్ అక్క, అలేఖ్య ఇద్దరూ డ్యాన్స్ క్లాస్లో స్నేహితులు. అక్కను కలుసుకోవడానికి వెళ్లినప్పుడు అలేఖ్యను చూసి, మొదటి చూపులోనే ప్రేమించేశారట ఈ డాక్టర్గారు. వెంటనే వెళ్లి ఆమెకు తన మనసులోని మాట చెప్పేశారట. ‘పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించింది కాదు, ఇరువైపుల కుటుంబాలూ సరే అనాలి. ముందు పెద్దలందరినీ ఒప్పించండి’ అని చెప్పారట అలేఖ్య. దాంతో నేరుగా ఆమె తల్లిదండ్రులను కలిశారు వినయ్కుమార్. పెళ్లినాటి పరిస్థితులను అలేఖ్య వివరిస్తూ-‘‘ముందు వీళ్ల అమ్మగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. కొడుకు డాక్టర్ కాబట్టి మెడిసిన్ చదివిన అమ్మాయి అయితేనే కొడుకు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నారు. ఈయన మూడేళ్ల మౌనవ్రతానికి ఆవిడా సరే అనక తప్పలేదు. మొత్తానికి ఇరువైపుల పెద్దల అంగీకారంతో జూలై 3, 1983లో మా పెళ్లి అయ్యింది. అత్తగారింట్లో ఉమ్మడి కుటుంబం.. కొద్దిరోజుల్లోనే వారందరితో కలిసిపోయాను. ముందు మా పెళ్లిని కాదన్న మా అత్తగారే నన్ను కూతురిలా చూసుకునేవారు. ‘ఎదుటి వారికి మంచిని పంచితే నీకు మంచే వస్తుంది’ అని మా అమ్మ నా చిన్నప్పటి నుంచి చెబుతుండేవారు. ఆ సూచనను ఇప్పటికీ పాటిస్తూ ఉంటాను’’ అన్నారు ఆమె. వీలైనంత ఎక్కువ సమయం... పెళ్లయిన తర్వాత ఇంటిని చక్కదిద్దుకున్న విధానాన్ని చెబుతూ-‘‘ఈయన చాలా మితభాషి. ఏదీ బయటకు చెప్పేవారు కాదు. ఈయన వ్యక్తిత్వాన్ని అర్థ్ధం చేసు కుని అందుకు అనుగుణంగా నన్ను నేను తీర్చిదిద్దు కోవ డానికి కొంత కాలం పట్టింది. అదేవిధంగా భార్యగా, కోడలిగా బాధ్యతల నడుమ రోజూ డ్యాన్స్ క్లాస్కు వెళ్లడం కుదిరేది కాదు. ప్రాక్టీస్ను ఐదేళ్ల పాటు వారానికి రెండు రోజులకు తగ్గించుకున్నాను. పెద్దబాబు పుట్టి, వాడిని స్కూల్లో జాయిన్ చేశాక మా గురువుల సూచనతో అధ్యాపకురాలిగా యూనివర్శిటీలో చేరాను. అభిరుచి, ఉద్యోగం, ఇల్లు... వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం కష్టపడ్డాను. దాంతో పనులను విభజించుకోవడం మొదలుపెట్టాను. స్టేజ్ ప్రోగ్రామ్లు, డ్యాన్స్ క్లాస్లు, ప్రాక్టీస్, రీసెర్చ్.. సమయానుకూలంగా చూసుకుంటూనే కుటుంబంతో గడపడానికి ప్లాన్ చేసుకునేదాన్ని. ఇంట్లోని వారితో ఎక్కువగా మాట్లాడుతూ, అరమరికలు లేకుండా చూసుకోవడం వల్ల బంధాలు బలపడతాయి అనేది నా నమ్మకం. ఇప్పటికీ ఈ సూత్రాన్ని పాటిస్తుంటాను’’ అని అలేఖ్య చెబుతుంటే... ‘‘ఈవిడ ఎప్పుడైనా నొచ్చుకుంటే... రెండు మూడు రోజులవరకు మూడీగా ఉంటుంది. తనంతట తనే ఆ బాధ నుంచి బయటపడాలి తప్ప ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. తన మూడ్ మారేంతవరకు ఓపిగ్గా ఎదురు చూడటం ఇప్పటికీ నాకు అలవాటు’’ అంటూ భార్య మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న తీరును వివరించారు వినయ్కుమార్! ప్రోత్సాహమిచ్చిన బంధం కళాకారిణిగా తన భర్త ప్రోత్సాహంతోనే నాట్యంలో ఎన్నో ప్రయోగాలను చేయగలిగాను. నేను ప్రోగ్రామ్లు, క్లాస్లు అంటూ వెళ్లినప్పుడు పిల్లలను ఈయనే చూసుకునేవారు’’ అని అలేఖ్య చెబుతుంటే... ‘‘తనకు పేరు వస్తుందంటే అది నాకు వచ్చినట్టుగానే భావిస్తాను’’ అని వినయ్కుమార్ సంతోషంగా చెప్పారు. అలేఖ్య మాట్లాడుతూ- ‘‘నా డ్యాన్స్ ఇన్విటేషన్ కార్డ్స్ డిజైన్ చేయడం దగ్గరనుంచి, అందరికీ పంచడం వరకు ఈయనే చూసుకుంటారు. ఈయన ప్రోత్సాహం వల్లే నేను పీహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకోగలిగాను. ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందగలిగాను’’ అన్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఒకరు ‘లా’ మరొకరు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్లు చేస్తున్నారు. ‘స్నేహం’గా విశాలమైన కుటుంబం... కుటుంబమంటే... ఇరువైపులా బంధువులతో పాటూ ఇరువైపు స్నేహాలూ సవ్యంగా ఉండాలనేది ఈ దంపతుల మాట. ‘‘మా ఇద్దరికీ చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ ఉన్నారు. వారి కుటుంబాలతో సహా అందరం తరచూ కలుసుకుంటాం’’ అన్నారు వినయ్కుమార్. ‘‘ఈయనకు నిరుపేదలు చాలా ముఖ్యమైన స్నేహితులు. హాస్పిటల్కి వచ్చే పేదలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నెలకు ముప్పై సర్జరీలెనా పేదవారికి ఉచితంగా చేసేవారు. ఈయన చికిత్స చేసిన పేషంట్స్ దగ్గు వచ్చినా ఈయనకే ఫోన్ చేస్తుంటారు. ఇది మీకు సంబంధించింది కాదు కదా! అలాంటి వాటికి కూడా రెస్పాండ్ అవడం ఎందుకు అని అంటుంటాను. కాని, వారికి ఓపికగా చెప్పే సమాధానాలు వింటున్నప్పుడు ఈయనలోని సహనానికి ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది’’ అన్నారు ఆమె. ‘‘దాంపత్యం అంటే అర్థం ఏంటో కాబోయే ప్రతి జంట తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. డబ్బు ప్రధానం కాదు ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఎంత సమయం, శక్తి ఉపయోగిస్తే అంతగా ఆ ఇద్దరి బంధం బాగుంటుంది’’ అన్నారు ఈ దంపతులు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ‘‘అలేఖ్య ఒక్క డ్యాన్స్ అనే కాదు... ఇంటి అలంకరణ, వంట, ఉద్యోగం, అందరితో కలివిడిగా ఉండటంలో ఎక్కడా చిరునవ్వు చెదరనీయదు. - డా. పి. వినయ్కుమార్ ఇంట్లో డ్యాన్స్ క్లాస్ ఏర్పాటు చేయాలన్నా, క్లాస్కు వెళ్లాలన్నా,.. నాకు నచ్చినట్టు సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ఈయన ఎప్పుడూ ముందుంటారు ఆ ప్రోత్సాహమే నా బలం. - అలేఖ్య పుంజాల -
ఒకటే లక్ష్యం...ఒకటే గమ్యం
ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం.. అదే సమైక్యాంధ్ర.. అంటూ సమైక్యవాదులు ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచుకోవడం కోసం ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. జిల్లాలో 58వ రోజు కూడా వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ మున్సిపాలిటీలో ఇంజనీర్లు 72 గంటల సెలవులోకి వెళ్లారు. సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం జిల్లాలో వినూత్న నిరసనలతో హోరెత్తుతోంది. 58వ రోజైన గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. విజయవాడలోని అన్ని రైతుబజార్ల సిబ్బంది, రైతులు కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. కూరగాయల దండలు ధరించి ప్రదర్శన జరిపారు. మైలవరంలోని విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు ప్రధాన రహదారిలో మూడోరోజు ధర్నా నిర్వహించారు. కలిదిండిలో సర్పంచ్ నజీమా ఆధ్వర్యంలో ముస్లింలు రిలే దీక్షలు చేశారు. ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. మండవల్లిలో ఆర్ఎంపీ వైద్యులు రిలేదీక్షలు చేశారు. ఉపాధ్యాయులు జలదీక్ష నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచులకు వాయినాలు.. పెనుగంచిప్రోలులో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై బతుకమ్మ ఆటలు, తెలంగాణ ఆడపడుచులకు వాయినాలు అందించారు. గుడివాడ స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షల్లో గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. చేపల మార్కెట్లో పనిచేసేవారు రోడ్డుపైనే చేపలు తోమి తమ నిరసన తెలిపారు. పామర్రులో జేఏసీ నాయకులు రహదారుల వెంట భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. అవనిగడ్డలో కొత్తపేట, రామకోటిపురం రైతులు దీక్ష చేపట్టారు. నాగాయలంకలో రైతులు దీక్ష చేపట్టి, ఎడ్లబళ్లతో నిరసన తెలిపారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో ఆ మండలంలోని రైతులు ట్రాక్టర్లను నిలిపి రహదారులను దిగ్బంధించారు. 2న హనుమాన్జంక్షన్లో రైతు మహాగర్జన.. రైతుల సమస్యలను వివరించేందుకు హనుమాన్జంక్షన్లో అక్టోబర్ రెండున రైతు మహాగర్జన నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ నేత విద్యాసాగర్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పెడనలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 18వ వార్డు మహిళలు కూర్చున్నారు. తోట్లవల్లూరులో పొలిటికల్ జేఏసీ నాయకులు మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. కూచిపూడిలో హోలీ స్పిరిట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ఉపాధ్యాయులు జేఏసీ నేతలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలతో భిక్షాటన చేశారు. నూజివీడు మండలం మర్రిబంధంలో ఉపాధ్యాయులు వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. మచిలీపట్నంలో జేఏసీ నాయకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 31వ రోజుకు చేరాయి. కంచికచర్లలో ఎన్జీవోలు, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు స్థానిక జాతీయ రహదారిపై ప్రదర్శన, మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక నెహ్రూ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. నందిగామ శివారు అనాసాగరం సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. పలువురు ఉద్యోగులు రోడ్డుపై పడుకుని సమైక్య నినాదాలతో నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై వచ్చే ప్రైవేట్ బస్సులను అడ్డుకుని నిరసన చేపట్టారు. కోత మిషన్ల యజమానుల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కనకతప్పెట్ల మేళాలతో ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో కొనసాగింది. గాంధీ సెంటర్లో మానవహారం ఏర్పాటుచేశారు. జార్జి అనే వృత్తిదారుడు సమైక్యాంధ్రకు మద్దతుగా గుండు గీయించుకుని నిరసన తెలిపాడు. 30 నుంచి సమ్మెలోకి ఇంజనీర్లు.. ఈ నెల 30 అర్ధరాత్రి నుంచి పులిచింతల ప్రాజెక్టు, ఎన్ఎస్పీల ఇంజనీర్లు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. జగ్గయ్యపేటలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘాల మహిళా జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై పలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మున్సిపల్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై మ్యూజికల్ చైర్స్ తదితర క్రీడలతో నిరసన తెలిపారు. పలువురికి చేతులపై గోరింటాకుతో జై సమైక్యాంధ్ర అని చిత్రీకరించి మహిళలు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో తెలుగు ప్రజల సంృ్కతిలో భాగమైన బతుకమ్మను ఏర్పాటుచేసి, దానికి సమైక్యాంధ్ర జెండాను ఉంచి స్థానిక పాత సినిమా హాల్ సెంటర్లో పాటలు పాడారు. వత్సవాయి జేఏసీ నాయకులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. మక్కపేట గ్రామంలో విద్యార్థులు, గ్రామస్తులు కలిసి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మోపిదేవిలో జాతీయ రహదారిపై కార్పెంటర్లు వడ్రంగి పనులు చేపట్టి నిరసన తెలిపారు. వెంకటాపురంలో ప్రధాన రహదారిపై మహిళలు, పిల్లలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. వెంకటాపురం 11వ నంబర్ కాలువలో జలదీక్ష చేపట్టి రైతులు నిరసన తెలిపారు. ఇంజనీర్ల రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో మున్సిపల్ ఇంజనీర్లు 72 గంటల సెలవులోకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్నారు. -
సాహితీ రెడ్డి కూచిపూడి ప్రదర్శన
కేంద్రమంత్రి జైపాల్రెడ్డి మనవరాలు, డాక్టర్ ఎస్.ఆనంద్రెడ్డి, అరుణారెడ్డిల కుమార్తె సాహితీరెడ్డి కూచిపూడి రంగప్రవేశం అట్టహాసంగా జరిగింది. రవీంద్రభారతిలో ఆదివారం ప్రదర్శించిన ఈ నాట్య విన్యాసం అద్వితీయంగా సాగింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత రాజా, రాధారెడ్డి కొరియోగ్రఫీ చేశారు. జైపాల్రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, సీఎం సురేష్, ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, మంత్రి జానారెడ్డి హాజరై సాహితిపై అభినందనల జల్లు కురిపించారు.