nandini
-
నందినికి నజరానా.. నగదు ప్రోత్సాహకంగా రూ. లక్ష
సాక్షి, హైదరాబాద్: ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసార నందినికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు, అక్షర విద్యాసంస్థల చైర్మన్ అరశనపల్లి జగన్మోహన్ రావు అండగా నిలిచారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ (ఉప్పల్ బ్రాంచ్)లో జరిగిన వార్షికోత్స వేడుకలో నందినిని జగన్మోహన్ రావు ఘనంగా సత్కరించారు. ఉత్తరాఖండ్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఈనెల 8వ తేదీన తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి రూ.1 లక్ష చెక్ను నగదు ప్రోత్సాహకంగా ఆయన అందించారు.భవిష్యత్లో కూడా నందినికి అన్ని విధాలా అండగా ఉంటానని ఈ సందర్భంగా జగన్మోహన్ రావు హామీ ఇచ్చారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, అనేక కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న నందిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని జగన్మోహన్ రావు సూచించారు. నందిని 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం నందిని మాట్లాడుతూ... ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, అందుకు తానే ఒక ఉదాహరణ అని చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను తెలుసుకొని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించాలని కోరింది. అనంతరం పాఠశాలలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నందిని పతకాలను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో అక్షర విద్యాసంస్థల సీఈఓ ఎ.మదన్మోహన్ రావు, ఫైనాన్స్ డైరెక్టర్ రామారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరితా రావు, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. మరిన్ని క్రీడా వార్తలుశ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు నాలుగో విజయం సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో నాలుగో విజయం చేరింది. హైదరాబాద్లో సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో ఐజ్వాల్ ఎఫ్సీ జట్టుపై గెలిచింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున గుర్ముఖ్ సింగ్ (5వ నిమిషంలో), లాల్రొమావియా (24వ నిమిషంలో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో శ్రీనిధి జట్టు 12 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. నాలుగింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదింటిలో ఓడి 15 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈనెల 6న హైదరాబాద్లో జరిగే తదుపరి మ్యాచ్లో రియల్ కశ్మీర్ ఎఫ్సీ జట్టుతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. సుశ్రుత–శ్రీశాన్వి జోడీకి కాంస్య పతకం సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం లభించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ టోరీ్నలో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో సుశ్రుత అనియా ఆనంద్–శ్రీశాన్వి కామారపు (తెలంగాణ) జోడీ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్లో సుశ్రుత–శ్రీశాన్వి ద్వయం 11–13, 6–11, 9–11తో దివ్యాంశి–నైషా (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది. తెలంగాణ జట్టుకు ఎస్.ప్రణీత్, ఎం.చైతన్య కోచ్లుగా వ్యవహరించారు. -
మరోసారి మోకాళ్లపై 'తిరుమల కొండ' ఎక్కిన తెలుగు హీరోయిన్
సినిమాల కోసం మాత్రమే గ్లామర్ లుక్లో కనిపించే నందిని రాయ్(Nandini Rai) సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ, ఆమెలో ఆధ్యాత్మికత చింతన చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చాలాసార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని.. తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ (Tirumala Temple) చేరుకున్నారు. ఇన్స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.( ఇదీ చదవండి: గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక)టాలీవుడ్లో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన నందినీ రాయి.. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్తో చాలామందికి దగ్గరైంది. అయితే, 2011లోనే 'ఫ్యామిలీ ప్యాక్' బాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం '040' మూవీతో అడుగుపెట్టింది. కోలీవుడ్లో విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్కు జోడిగా నందిని రాయ్ నటించింది. తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని నందిని రాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు. అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు. అయితే, సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్ మోకాళ్లపై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.నటి సౌందర్య ఇన్సిపిరేషన్తో ..దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్తో సినిమాల్లోకి వచ్చానని చెప్పిన నందిని రాయ్ పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు.అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న నందినిగతంలో తను ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఇలా చెప్పింది. 'కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా' అని చెప్పింది. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?
భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన కుమార్తె 'ఇషా అంబానీ'కి వ్యాపార రంగానికి చెందిన అజయ్ పిరమల్ కుమారుడు 'ఆనంద్ పిరమిల్'తో వివాహం జరిపించారు. ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న పిరమల్ వ్యాపార సామ్రాజ్యంలో 'నందిని పిరమల్' కీలకమైన వ్యక్తి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె నెట్వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ నందిని పిరమల్?నందిని పిరమల్ అజయ్ పిరమల్ కుమార్తె. ఈమె పిరమల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తన తల్లిదండ్రులు అజయ్, డాక్టర్ స్వాతి పిరమల్.. సోదరుడు ఆనంద్ పిరమల్తో కలిసి కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, పిరమల్ ఫార్మా చైర్పర్సన్గా ఉన్నారు. ఓవర్-ది-కౌంటర్ (OTC) వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించడం ఆమె ప్రధాన పాత్ర వహిస్తోంది.నందిని పిరమల్ నాయకత్వంలో ఓటీసీ విభాగం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మారింది. దీని అనేక ఉత్పత్తులు వాటి సంబంధిత విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పిరమల్ గ్రూప్లో హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉంది.2010లో నందిని కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె పిరమల్ గ్రూపుకు చెందిన దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్కు విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,638 కోట్లు) విలువైన ఈ డీల్ ఆ సమయంలో భారతీయ ఔషధ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగునందిని పిరమల్ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీ, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. చదువు పూర్తయిన తరువాత మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్గా పనిచేసింది. ఆ తరువాత 2006లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్2009 మార్చిలో నందిని.. పీటర్ డీ యంగ్ను వివాహం చేసుకుంది. పీటర్ పిరమల్ గ్లోబల్ ఫార్మా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతడు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోనే చదువుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే & కంపెనీలో పనిచేసారు. నందిని పిరమల్ నెట్వర్త్ గురించి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,307 కోట్లు). 2023 ఆర్ధిక సంవత్సరంలో పిరమల్ గ్రూప్ రూ. 9087 కోట్ల ఆదాయాన్ని గడించింది. -
‘రివర్స్’తో నందిని నెయ్యి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. మహాపచారానికి పాల్పడ్డారని పచ్చి అబద్ధాలు వల్లిస్తూ శ్రీవారి సన్నిధిలో రివర్స్ టెండర్లు ఏమిటంటూ గద్దించిన సీఎం చంద్రబాబు తాజాగా అదే విధానంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థకు కేటాయించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.టెండర్లో ఎల్ 1గా నిలిచిన కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకుండా రివర్స్ టెండర్ పిలిచి అత్యధికంగా ఆల్ఫా మిల్క్ సంస్థకు కేటాయించడం గమనార్హం. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్కు కట్టబెట్టేందుకే లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి తెచ్చి రివర్స్ టెండర్ విషయాన్ని పక్కదారి పట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ 1 కాదని ఎల్ 2కి ఎలా ఇస్తారు? ‘రివర్స్’ మతలబేంటి?తిరుమలలో స్వామి వారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టాలని కూటమి పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీటీడీ గత నెల 7 తేదీన మూడు నెలలకు సరిపడా నెయ్యి సరఫరాకు ఈ టెండర్లు పిలిచింది. ఇందులో కర్ణాటకకు చెందిన నందిని(కర్ణాటక కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) కిలో నెయ్యి రూ.470 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది.ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ రూ.530 కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఎల్ 1గా నిలిచిన నందినికే టెండర్ దక్కాలి. అయితే నందినిని కాదని ‘ముఖ్య’ నేత ఆల్ఫా ఫుడ్స్ సంస్థకు నెయ్యి టెండర్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీటీడీ వెంటనే రివర్స్ టెండర్లు పిలిచింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ టెండర్లు పిలిచిన తరువాత తిరిగి టెండర్లు పిలవాల్సి వస్తే మళ్లీ ఈ టెండర్నే పిలవాలి.రివర్స్ టెండర్కి అవకాశమే లేదు. అయితే టీటీడీ ఈవో ఆదేశాల మేరకు గత నెల 9న రివర్స్ టెండర్స్ నిర్వహించారు. ఈసారి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కిలో నెయ్యి రూ.450 చొప్పున కోట్ చేయగా నందిని కిలో రూ.475కి కోట్ చేసింది. ఈ టెండర్లో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్కి 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. రివర్స్ టెండర్పై వివాదాన్ని తెరపైకి తేకుండా నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. -
నందిని నెయ్యి వద్దన్నది బాబే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచార కుట్ర కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పూటకో కట్టు కథ, రోజుకో అవాస్తవ ఆరోపణలతో కుతంత్రానికి పదును పెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశి్నస్తుండటం ఈ కుట్ర కథలో తాజా అంకం. వాస్తవం ఏమిటంటే.. దశాబ్ద కాలంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న నందిని డెయిరీని 2015లో తొలిసారిగా పక్కకు తప్పించింది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబు ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసేందుకు యతి్నస్తుండటం గమనార్హం. నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబే... కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలంపాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ ప్రక్రియను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. నాడు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచి్చంది. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ అప్పట్లో ఓ టీవీ చానల్లో రిపోర్టర్గా ఉన్న సమయంలో నందినీ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ వార్తలు కూడా ప్రసారం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వచి్చనా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నందినీ డెయిరీని కాదని గోవింద్ డెయిరీకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టింది. నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో టెండర్లలో పాల్గొనని నందిని ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొనలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వనందున టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనబోమని పేర్కొంది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఎల్ 1గా నిలిచిన ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. ఇదీ అసలు విషయం. అయినా సరే ఎందుకు ఇవ్వలేదంటూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచడం విస్మయం కలిగిస్తోంది. అసలు వైఎస్సార్సీపీ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు? ఈ విషయం తెలిసినా సీఎం చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 2015లో టీడీపీ హయాంలో టెండరు ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వనిది చంద్రబాబే అన్నది పచ్చి నిజం. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వెనుక చంద్రబాబు రాజకీయ కుతంత్రం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
National Inter State Senior Athletics Championships 2024: జ్యోతి, నందినిలకు స్వర్ణాలు
పంచ్కులా (హరియాణా): జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణం, ఆంధ్రప్రదేశ్కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. మహిళల విభాగంలో ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్లో తెలంగాణ క్రీడాకారిణి నందిని అగసార పసిడి పతకాన్ని దక్కించుకుంది. నందిని ఓవరాల్గా 5806 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో అంతర్జాతీయ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి యర్రాజీ విజేతగా నిలిచింది. వైజాగ్కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్కే చెందిన నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్లో షణ్ముగ 20.95 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందాడు. -
పొంగిన నందిని పాల ధర
శివాజీనగర: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరికొన్ని నిత్యావసరాల ధరలను భగ్గున మండించింది. రాష్ట్ర పాల సమాఖ్య (కేఎంఎఫ్) నందిని బ్రాండ్ పాల ధరను లీటర్పై రూ. 2 పెంచింది, బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఇప్పటినుంచి అర్ధ, 1 లీటర్ పాల ప్యాకెట్లో అదనంగా 50 మి.లీ.పాలను చేర్చి విక్రయిస్తామన్నారు. 50 మిల్లీలీటర్ల పాల విలువ 2 రూపాయల 10 పైసలు అవుతుందన్నారు. ఇది అదనపు పాల ధర తప్ప పెంపు కాదని చెప్పారు.లీటరుకు రూ. 44కు చేరికప్రస్తుతం నందిని నీలిరంగు ప్యాకెట్ పాల ధర లీటర్ రూ.42 ఉండగా, బుధవారం నుంచి రూ.44 అవుతోంది. అర్ధ లీటర్ పాల ధర రూ.22 నుంచి రూ. 24కు చేరుతుంది. పెరుగు, ఇతర నందిని ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని తెలిపారు. కొన్నిరోజుల పాటు పాల ప్యాకెట్లపై పాత ఉన్నా కొత్త రేటును వసూలు చేస్తారని ప్రజలు గమనించాలని కోరారు.పోరాడుతాం: బీజేపీపాల ధరపై బీజేపీ నేతలు బీ.వై.విజయేంద్ర, ఆర్.అశోక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే పాల ధరను 2 సార్లు పెంచారు. పేదలు, మద్య తరగతి ప్రజలపై కొంచైమెనా కనికరం ఉంటే తక్షణమే పాల ధరను తగ్గించాలన్నారు. పెట్రోల్–డీజిల్ ధరల పెరుగుదల, కూరగాయలతో ప్రజలు కంగారు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ధరల పెంపుపై నిరంతరం ఆందోళనలు చేస్తామని తెలిపారు.నాకు తెలియదే: సీఎం సిద్దుకేఎంఎఫ్ పాల ధర పెంపు తన దృష్టికి రాలేదని సీఎం సిద్దరామయ్య చెప్పడం గమనార్హం. మంగళవారం తన నివాస కార్యాలయం కృష్ణాలో అఖిల భారత సాహిత్య సమ్మేళనం నిర్వహణపై సాహితీవేత్తలతో చర్యలు జరిపారు. ఆపై విలేకరులతో మాట్లాడుతూ పాల ధర పెంపు నాకు తెలియదు. కేఎంఎఫ్తో మాట్లాడుతాను. ధరల విషయం ప్రభుత్వ పరిధిలో ఉండదు అని అన్నారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పాల ధర తక్కువగా ఉంటుందని చెప్పారు. -
Muthu Nandini: పర్యావరణహిత భవనం! ఈ ముత్తు నందిని ప్యాలెస్..
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచి్చనట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభి్రపాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం.. కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చెప్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పొడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పొట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాట ప్రాంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను' -
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
ఖమ్మం రేసులో డిప్యూటీ సీఎం భార్య.. ఎంపీ టికెట్కు దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆమె గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి సోనియాగాంధీ, ప్రియాంకను పోటీ చేయాలని కోరామన్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని.. వారు పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు ఆమె తెలిపారు. దాదాపు 20 ఏళ్లుగా ఖమ్మం ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఒత్తిడి మేరకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని, తెలంగాణలో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్త చేశారు. దేశంలో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని నందిని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని పలు లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇదీ చదవండి: టీ కాంగ్రెస్లో ఒక్క ఛాన్స్ ప్లీజ్! -
ఖమ్మం నుంచి అవకాశం ఇవ్వండి: మల్లు నందిని
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తెరపైకి కొత్త ముఖాలు వస్తున్నాయి. ఈసారి ఎంపీలుగా పోటీచేసే జాబితాలో పలువురు మంత్రుల కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తనకు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆమె గురువారం గాందీభవన్లో దరఖాస్తు సమర్పించారు. కాగా, ఇదే సీటుకు మరో సీనియర్ నేత మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ స్థానంలో ఆయన పోటీ చేస్తారనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ఇదే సీటు కోసం కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, మరో రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్లు కూడా పోటీలో ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ నుంచి బరిలో ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ హాట్సీటుగా మారిందనే చెప్పవచ్చు. రెండోరోజు 34 మంది దరఖాస్తు రెండోరోజు 34 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆయా పార్లమెంట్ స్థానాల వారీగా చూస్తే మహబూబాబాద్కు 9, నాగర్కర్నూల్కు 8, వరంగల్కు 6, భువనగిరికి 6, ఖమ్మంకు 2, నిజామాబాద్కు 3 దరఖాçస్తులు వచ్చాయి. భువనగిరి సీటుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డితోపాటు ఉస్మానియా విద్యారి్థనేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్గౌడ్ దరఖాస్తు సమర్పించారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత దరఖాస్తు అందజేశారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 41 మంది దరఖాస్తు చేశారు. కాగా ఈనెల 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉండటంతో శుక్ర, శనివారాల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని గాం«దీభవన్వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
చేతులు, కాళ్లు కట్టేసి మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య
తిరువొత్తియూరు: తాళంబూర్ సమీపంలో చేతులు, కాళ్లను కట్టి వేసి మహిళా ఇంజినీరును దహనం చేసి హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. చెంగల్పట్టు జిల్లా తాళంబూరు సమీపం ఫోన్మార్ మాంబాక్కం వెళ్లే రోడ్డులో ప్రైవేటు నీళ్ల కంపెనీ ఉంది. కంపెనీ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి శనివారం రాత్రి 8 గంటల సమయంలో సుమారు 50 మీటర్ల దూరంలో మహిళ ఆర్తనాదాలు వినిపించాయి. ఆ మార్గంలో వెళ్లిన వాహనదారులు శబ్దం విని అక్కడికి వెళ్లి చూడగా యువతి ఒకరు చేతులు, కాళ్లు గొలుసులతో కట్టివేయబడి మండుతున్న దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. ప్రజలు నీళ్లను ఆమైపె పోసి మంటలు ఆర్పారు. ఈ లోపు ఆ మహిళ మృతి చెందింది. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు తాళంబూరు పోలీస్ ఇన్స్పెక్టర్ చార్లెస్ నేతృత్వంలో పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం క్రోమ్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఒక సెల్ ఫోన్ లభ్యమైనది. ఆ ఫోన్లో ఆ నంబర్లను ఆధారంగా విచారణ జరిపారు. మృతి చెందిన మహిళ బెంగళూరులో ఉన్న ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ఇంజినీర్ నందిని(25) అని తెలిసింది. ఈ సంఘటన గురించి తాళంబూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చేతులు కాళ్లు కట్టి వేసిన మహిళా ఇంజినీర్ హత్య చేయబడిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. -
Nandini Rai: బిగ్ బ్యాస్ బ్యూటీ నందిని రాయ్..తెల్లచీరలో మెరిసిపోతున్న (ఫోటోలు)
-
షేక్స్పియరే తన పవర్
‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో? తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’... మహాకవి మాట తిరుగులేని సత్యం అయినప్పటికీ కొన్నిసార్లు యుద్ధాలు, తారీఖులు, ప్రేమ పురాణాలు, ముట్టడికైన ఖర్చులు... చారిత్రక పరిశోధనకు అవసరం. ఏ సమాచారమూ వృథా పోదు. వర్తమానంలో ఉండి ఆనాటి మొగల్, బ్రిటిష్ ఇండియాలోకి వెళ్లడం అంత తేలిక కాదు. అలుపెరగని పరిశోధన కావాలి. అంతకుముందు కనిపించని ప్రత్యేక వెలుగు ఏదో ఆ పరిశోధనలో ప్రతిఫలించాలి. అందమైన శైలికి అద్భుతమైన పరిశోధన తోడైతే...అదే ‘కోర్టింగ్ ఇండియా’ పుస్తకం. ఫ్రొఫెసర్ నందిని దాస్ రాసిన ‘కోర్టింగ్ ఇండియా: ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్–2023 గెలుచుకుంది... ఇంట్లో, తరగతి గదిలో, పుస్తకాల్లో, టీవీల్లో విన్న కథల ద్వారా నందిని దాస్కు షేక్స్పియర్ ఇష్టమైన రచయితగా మారాడు. ఆ మహా రచయితపై ఇష్టం ఆంగ్ల సాహిత్యంపై ఇష్టంగా మారింది. ఆయన పుస్తకాలు తన మనోఫలకంపై ముద్రించుకుపోయాయి. అలనాటి ప్రయాణ సాహిత్యం నుంచి భిన్న సంస్కృతుల మధ్య వైరు«ధ్యాల వరకు నందినికి ఎన్నో అంశాలు ఆసక్తికరంగా మారాయి. పరిశోధిస్తూ, రాసే క్రమంలో తన మానసిక ప్రపంచం విశాలం అవుతూ వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో నందిని దాస్ ప్రొఫెసర్. షేక్స్పియర్ సాహిత్యం ఆమెకు కొట్టిన పిండి. ఆమె పేరు పక్కన కనిపించే విశేషణం...‘స్పెషలిస్ట్ ఇన్ షేక్స్పియర్ స్టడీస్’ కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్శిటీలో బీఏ ఇంగ్లీష్ చేసింది నందిని. ఆ తరువాత స్కాలర్షిప్పై యూనివర్శిటీ కాలేజి, ఆక్స్ఫర్డ్లో చేరింది. కేంబ్రిడ్జీ, ట్రినిటీ కాలేజిలో ఎంఫిల్, పీహెచ్డీ చేసింది. ఒక ప్రచురణ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా పని చేసిన నందిని సంవత్సరం తరువాత మళ్లీ అకాడమిక్ రిసెర్చ్లోకి వచ్చింది. ఇక తాజా విషయానికి వస్తే... ‘ది పవర్ ఆఫ్ గుడ్ రైటింగ్’గా విశ్లేషకులు కీర్తించిన ‘కోర్టింగ్ ఇండియా’ యూరోపియన్ల హింసా ధోరణి గురించి చెప్పింది. రాయబార కార్యాలయాల అసమర్థతను ఎత్తి చూపింది. మొఘల్ రాజకీయాలను ఆవిష్కరించింది. ‘ ఆనాటి బ్రిటన్, ఇండియాలకు సంబంధించి వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించింది నందిని. మొగల్ రాజుల ఒడిదొడుకుల నుంచి బ్రిటీష్ వైఖరి వరకు ఈ పుస్తకంలో ఎన్నో కనిపిస్తాయి’ అంటాడు బ్రిటీష్ అకాడమీ బుక్ప్రైజ్– ఛైర్ ఆఫ్ ది జ్యూరీ ప్రొఫెసర్ చార్లెస్ ట్రిప్. -
నేనేంటో నాకు తెలుసు.. వదిలిపెట్టను: స్వప్నాకు నందిని అగసార కౌంటర్
స్వప్నా బర్మన్ చేసిన సంచలన ఆరోపణలను భారత అథ్లెట్ నందిని అగసార ఖండించింది. తన విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చింది. తానేంటో తనకు తెలుసునని.. ఒకవేళ స్వప్నా దగ్గర తనకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలని సవాల్ విసిరింది. కాగా ఆసియా క్రీడలు-2023లో తెలంగాణకు చెందిన నందిని అగసార హెప్లథ్టాన్ విభాగంలో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. చైనాలోని హోంగ్జూలో ఏడు క్రీడాంశాలతో కూడిన హెప్టథ్టాన్లో సత్తా చాటి మెడల్ సాధించింది. ఇదే ఈవెంట్లో వెస్ట్ బెంగాల్కు చెందిన స్వప్నా బర్మన్ నాలుగోస్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ట్రాన్స్జెండర్ వల్ల తాను కాంస్యం కోల్పోయానంటూ సంచలన పోస్టుతో నందినిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓటమిని తట్టుకోలేని ఆమె విద్వేషంతో ఈ మేరకు చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది. నందినిని తక్కువ చేసేలా మాట్లాడిన స్వప్నా బర్మన్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై తాజాగా స్పందించిన నందిని అగసార స్వప్నాకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. ‘‘నేనేంటో నాకు తెలుసు. ఆమె దగ్గర నాకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. నేను కూడా నా దగ్గర దేశం కోసం గెలిచిన ఈ మెడల్ను చూపిస్తాను. దేశం కోసం ఆడాలన్నదే నా ధ్యేయం. ఇప్పుడు మేము గెలిచాం. మా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయనుకుంటా. ఈ విషయాన్ని నేను భారత అథ్లెటిక్స్ సమాఖ్య దృష్టికి తీసుకువెళ్తాను. ప్రస్తుతం నేను పతకం సాధించానన్న ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. నేను ఇండియాకు వెళ్లిపోతున్నాను’’ అని నందిని అగసార పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా తెలంగాణకు చెందిన 20 ఏళ్ల నందిని మహిళల హెప్లథ్టాన్ విభాగంలో 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. మరోవైపు స్వప్నా బర్మన్కు ఈ ఈవెంట్లో 5708 పాయింట్లు మాత్రమే వచ్చాయి. చదవండి: కోహ్లికి నో ఛాన్స్! మరో టీమిండియా స్టార్కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్: బట్లర్ #KheloIndiaAthlete @AgasaraNandini's journey to 🥉at #AsianGames2022 is a testament to years of dedication and hard work. With a total score of 5712 in Women's Heptathlon, we have got a new champion🏆 Congratulations, Nandini. We wish to see you shine in all of your future… pic.twitter.com/nTRt320IIU — SAI Media (@Media_SAI) October 1, 2023 -
భారత అథ్లెట్ నందినిపై విషం చిమ్మిన స్వప్నా.. ట్రాన్స్జెండర్ అంటూ తీవ్ర ఆరోపణలు
భారత అథ్లెట్ స్వప్నా బర్మన్ తోటి క్రీడాకారిణి అగసార నందినిపై విషం చిమ్మింది. ఆసియా క్రీడలు-2023లో ఓటమిని జీర్ణించుకోలేని ఆమె తెలంగాణ అమ్మాయి నందినిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నందినిని ట్రాన్స్జెండర్గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన స్వప్నా వెంటనే దానిని డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలో స్వప్నా తీరుపై భారత క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి ప్లేయర్పై విద్వేషపూరిత కామెంట్లు చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు. కాగా చైనా వేదికగా హోంగ్జూలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో నందిని కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో 5712 పాయింట్లు సాధించిన ఈ తెలంగాణ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా బ్రాంజ్ మెడల్ సాధించి ఆసియా క్రీడల్లో సత్తా చాటింది. అయితే, ఇదే ఈవెంట్లో వెస్ట్ బెంగాల్కు చెందిన స్వప్నా బర్మన్ నాలుగోస్థానంతో సరిపెట్టుకుని రిక్తహస్తాలతో వెనుదిరగింది. గత ఎడిషన్లో పసిడి పతకం సాధించిన స్వప్నా ఈసారి ఘోర ఓటమి నేపథ్యంలో నందిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది. Now this is Shocking! Swapna Barman, who finished 4th in Heptathlon yesterday, saying that compatriot Nandini, who won Bronze medal, is a transgender and that this is against the rules of Athletics! https://t.co/ST6Th0mAc9 — India_AllSports (@India_AllSports) October 2, 2023 ‘‘చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడల్లో భాగంగా నేను నా కాంస్య పతకాన్ని ఓ ట్రాన్స్జెండర్ వుమెన్కు చేజార్చుకున్నాను. నా మెడల్ నాకు కావాలి. నాకు ఎవరైనా సాయం చేయండి. అథ్లెటిక్స్లో ఇలాంటి వాళ్లు పోటీ చేయడం నిబంధనలకు విరుద్ధం’’ అంటూ ఆమె ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వెంటనే ఆ పోస్ట్ను స్వప్నా డిలీట్ చేసినప్పటికీ అందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్గా మారాయి. కాగా స్వప్నా బర్మన్ అధికారిక ఖాతా నుంచి పోస్ట్ వచ్చిందా లేదంటే ఆమె అకౌంట్ నుంచి వేరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఇలా నందినిపై ఆరోపణలు చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వరల్డ్ అథ్లెటిక్స్ రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారం.. ట్రాన్స్జెండర్ అథ్లెట్లు మహిళా వరల్డ్ ర్యాంకింగ్స్ ఈవెంట్లలో పాల్గొనడానికి వీల్లేదు. మార్చి 31 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కాగా స్వప్నా ఇటీవల బ్రిడ్జ్తో మాట్లాడుతూ.. ‘‘టెస్టోస్టిరాన్ లెవల్స్ 2.5 కంటే ఎక్కువగా ఉన్నవాళ్లు 200 మీ. మించి ఏ ఇతర ఈవెంట్లలో పాల్గొనకూడదు. ఏ అమ్మాయైనా సరే.. త్వరగా హెప్టాథ్లాన్ ఈవెంట్ను పూర్తి చేయలేదు. నేనైతే 13 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్న తర్వాతే ఇక్కడిదాకా వచ్చాను. కానీ ఆమె నాలుగు నెలల శిక్షణలోనే ఈ స్థాయికి ఎలా చేరుకుందో’’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. 100 మీటర్ల హర్డిల్స్ (4వ స్థానం), హైజంప్ (9వ స్థానం), షాట్పుట్ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్జంప్ (3వ స్థానం), జావెలిన్ త్రో (9వ స్థానం), 800 మీటర్ల పరుగు పందెంలో సత్తా చాటిన అగసార నందిని కాంస్యం కైవసం చేసుకున్న నేపథ్యంలో స్వప్నా బర్మన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 🎽𝗔 𝗖𝗢𝗡𝗧𝗥𝗢𝗩𝗘𝗥𝗦𝗬 𝗨𝗡𝗙𝗢𝗟𝗗𝗜𝗡𝗚! Swapna Barman, who finished fourth in the Heptathlon, has alleged that her fellow Indian and Bronze winner Nandini Agasara is transgender and contends that this gives her an unfair advantage in competing in the women's event. 🥉… pic.twitter.com/CsM5sJVF8I — Team India at the Asian Games 🇮🇳 (@sportwalkmedia) October 2, 2023 -
‘నందివర్ధనం’.. పేద కుటుంబం నుంచి వచ్చి.. ‘అవరోధాలు’ అధిగమించి
Asian Games 2023: గత కొంత కాలంగా వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతూ వచ్చిన తెలంగాణ అథ్లెట్ అగసార నందిని అసలు సమయంలో తన ఆటను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలిసారి కాంస్యంతో మెరిసింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నందిని మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఏడు ఈవెంట్లలో కలిపి నందిని 5712 పాయింట్లు సాధించింది. హెప్టాథ్లాన్లోని తొలి ఆరు ఈవెంట్లు ముగిసేసరికి నందిని ఐదో స్థానంలో నిలిచింది. 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసి 100 మీటర్ల హర్డిల్స్ (4వ స్థానం), హైజంప్ (9వ స్థానం), షాట్పుట్ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్జంప్ (3వ స్థానం), జావెలిన్ త్రో (9వ స్థానం)... ఇలా వరుసగా ఆమె ప్రదర్శన కొనసాగింది. అయితే చివరి ఈవెంట్ 800 మీటర్ల పరుగులో సత్తా చాటడంతో కాంస్యం ఖాయమైంది. ఈ పరుగును 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసిన నందిని అగ్ర స్థానంలో నిలిచింది. దాంతో ఓవరాల్ పాయింట్లలో ఆమె మూడో స్థానానికి ఎగబాకింది. 2018 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్లో స్వర్ణం సాధించిన మరో భారత అథ్లెట్ స్వప్న బర్మన్ చివరి వరకు పోటీలో నిలిచినా... ఓవరాల్గా 5708 పాయింట్లతో నాలుగో స్థానానికే పరిమితమైంది. పేద కుటుంబం పేద కుటుంబం నుంచి వచ్చి నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివిన నందిని అదే పాఠశాలలో నెలకొల్పిన అథ్లెటిక్స్ అకాడమీ తొలి బ్యాచ్ విద్యార్థిని. ప్రస్తుతం సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్న నందినికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ తాజా విజయానికి రూ. 1 లక్ష నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. #KheloIndiaAthlete @AgasaraNandini's journey to 🥉at #AsianGames2022 is a testament to years of dedication and hard work. With a total score of 5712 in Women's Heptathlon, we have got a new champion🏆 Congratulations, Nandini. We wish to see you shine in all of your future… pic.twitter.com/nTRt320IIU — SAI Media (@Media_SAI) October 1, 2023 -
మనస్తాపంతో.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
మహబూబ్నగర్: మనస్తాపం చెంది ఓ వివాహిత పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం మండలంలోని గుంపన్పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాత్లావత్ భాస్కర్కు లింగాల మండలం ఎంసీతండాకు చెందిన నందిని(18)తో ఆరు నెలల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల పాటు అన్నోన్యంగా ఉన్న దంపతులు రెండు రోజులుగా చిన్నపాటి గొడవ అయ్యిందని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని పురుగుల మందు తాగింది. అపస్మారకస్థితిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని నాగర్కర్నూల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
సెల్ఫోన్ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ
దుబ్బాక టౌన్: అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్ చిచ్చు రాజేసింది. ఫోన్కోసం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, చెల్లెలు క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మర్గల శంకర్, వసంత దంపతులకు ముగ్గురు కూతుర్లున్నారు. రెండో కుమార్తె నందిని డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చిన్న కుమార్తె నవిత అలి యాస్ నవ్య (18) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఉదయం ఇద్దరూ సెల్ఫోన్ విషయమై గొడవ పడ్డారు. ఇది గమనించిన తల్లి, వారిని మందలించి ఫోన్ ను బీరువాలో పెట్టి తాళం వేసి పని కోసం వెళ్లింది. దీంతో అప్పటికే ఆవేశంలో ఉన్న నవిత గడ్డిమందు తాగింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నందిని, చెల్లి అపస్మరక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు చేరుకున్నా రు. వెంటనే నవితను దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం సిద్దిపేట హాస్పిటల్కు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నవ్య మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెరగనున్న పాల ధరలు.. ఆగష్టు 01 నుంచే..
టమాట ధరల పెరుగుదల మిగతా నిత్యావసరాల ధరల మీద ప్రభావం చూపుతోంది. కర్ణాటకలో పాల ధరలు కూడా 2023 ఆగష్టు 01 నుంచి పెరగనున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్ఎఫ్) బృందం & ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య జరిగిన సమావేశం తరువాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని (Nandini) ధరలు లీటరుకు రూ. 3 పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న కారణంగా పాల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కెఎమ్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. కెఎమ్ఎఫ్ చైర్మన్ భీమా నాయక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనను ఆమోదించింది. కావున కొత్త ధరలు ఆగష్టు 01 నుండి అమలులోకి రానున్నాయి. ధరల పెరుగుదల కేవలం పాలకు మాత్రమే వర్తిస్తుందని.. పెరుగు, ఇతర పాల పదార్థాలు వర్తించే అవకాశం లేదని తెలిపారు. (ఇదీ చదవండి: భారత్లో టాప్ 5 సన్రూఫ్ ఫీచర్ కార్లు - వివరాలు) ప్రస్తుతం మార్కెట్లో నందిని టోన్డ్ మిల్క్ ధర రూ. 39 ఉండగా.. ఆగష్టు 01 నుంచి ఇది రూ. 42కి చేరుతుంది. పాల పొడి ధరలు కూడా పెంచాలన్న బృందం విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. ధరల పెరుగుదల వల్ల పాడి పరిశ్రమ కూడా అదనపు ఆదాయాన్ని పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వం నియంత్రణలో నడిచే నందిని ఇప్పుడు పాల ధరను పెంచనుండడంతో మిగతా ప్రైవేట్ డెయిరీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. నందిని రూ.3 పెంచితే ప్రైవేట్ కంపెనీలు కనీసం రూ.5 వరకు పెంచే అవకాశం ఉందని అక్కడి వర్గాలు తెలిపాయి. -
Nandini Krishnan: అనువాద వారధి
సొంతగా రచనలు చేయగలిగేవారు అనువాదాలు చేయరు. భాష బాగా వచ్చినంత మాత్రాన అనువాదం చేయలేరు. దానికి నైపుణ్యం, కొంత నిస్వార్థం కావాలి. తమిళ రచయిత్రి నందిని కృష్ణన్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఇంగ్లిష్ అనువాదం ఏప్రిల్ 24న మార్కెట్లోకి రానుంది. నవలలోని పాతకాలపు తమిళాన్ని నేటి యువతకు అందేలా అనువాదం చేయడం సులువు కాదు. తమిళంలోని ఉత్తమ నవలలను సవాలుగా తీసుకుని నందిని ఇంగ్లిష్లో అనువాదం చేస్తోంది. ఆమెకు వస్తున్న గుర్తింపు ఆ రంగంలో రాణించాలనుకునే స్త్రీలు గమనించదగ్గది. దాదాపు 2500 పేజీలు ఉండే ఐదు భాగాల భారీ ప్రఖ్యాత తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను ఇంగ్లిష్లో అనువాదం చేయబూనడం సాహసం. కాని ఈ క్లాసిక్ను అనువాదం చేయడానికి చాలా మంది ట్రై చేస్తూనే వచ్చారు. ముగ్గురు నలుగురు సఫలీకృతులయ్యారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్కు తగ్గట్టుగా అనువాదం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నందిని కృష్ణన్ వంతు. ఆమె చేసిన ఈ నవల అనువాదం మొదటి భాగం పూర్తయ్యింది. ఏప్రిల్ 24న విడుదల కానుంది. వెస్ట్ల్యాండ్ బుక్స్ దీనిని ప్రచురిస్తుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాల సినిమాగా తీస్తున్న దర్శకుడు మణిరత్నం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్ నవల 75 ఏళ్ల క్రితం నాటిదని గుర్తు లేనంతగా అనునిత్యం తమిళ సాహిత్యంలో కలగలిసిపోయింది. కల్కి రాసిన ఈ నవలలోని భాషను, పై అర్థాన్ని, లోపలి అర్థాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం చాలా జటిలం. అయినా చేశాను. పాఠకులు సులభంగా చదువుకోవడానికి, చేత బట్టుకోవడానికి వీలుగా ఇంగ్లిష్లో ఐదు కంటే ఎక్కువ భాగాలుగా విభజించి పుస్తకాలుగా తేనున్నాము’ అని తెలిపింది నందిని కృష్ణన్. ఎవరీ నందిని కృష్ణన్? నందిని కృష్ణన్ చెన్నైలో స్థిరపడిన నాటకకర్త, రచయిత్రి, స్టేజ్ యాక్టర్ కూడా. లండన్లో, ఢిల్లీలో జర్నలిస్ట్గా పని చేసింది. ఆ తర్వాత చెన్నై నుంచి వెబ్, ప్రింట్ మీడియాలలో పని చేయడం మొదలుపెట్టింది. హాస్యం రాస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వైవాహిక వ్యవస్థపై విమర్శను పెడుతూ వివాహమైన స్త్రీలను, పురుషులను ఇంటర్వ్యూ చేసి ‘హిచ్డ్: ది మోడర్న్ అండ్ అరేంజ్డ్ మేరేజ్’ పుస్తకం తెచ్చింది. ట్రాన్స్ మెన్ జీవితాల ఆధారంగా ‘ఇన్విజిబుల్ మెన్‘ పుస్తకం రాసింది. పెరుమాళ్ మురుగన్ నవలలను ఇంగ్లిష్లో అనువాదం చేయడం ద్వారా అనువాద రంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్‘ అనువాదం చేస్తోంది. నందిని కృష్ణన్ ఇంట్లో ఎప్పుడూ వీధి కుక్కలు ఉంటాయి. వాటిని సాకుతుంటుంది. పిల్లులను కూడా. ‘కుక్కలు, పిల్లలు, వేల కొద్ది పుస్తకాలు అంతే మా ఇల్లు’ అని చెబుతుంది. కత్తి మీద సాము ‘అనువాదం చేయడం కత్తి మీద సాము’ అంటుంది నందిని. ‘సొంత రచనైతే అలా ఒక సమాధి స్థితికి వెళ్లి రాసుకుంటూ పోతాము. అనువాదం అలా కాదు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు చదివితే అది కేవలం అనువాదం అనిపించకూడదు. అదే సమయంలో ఒరిజినల్ నవల తాలూకు పరిమళం దానిలో ఉండాలి. అనువాదం పూర్తి చేశాక ఎవరిదో కన్నబిడ్డను మనం సాకాం... ఇక దీనితో రుణం చెల్లిపోయింది అన్న బాధ తప్పదు’ అంటుంది నందిని. ‘అనువాదకులు స్వయంగా రచయితలు కాకపోవడం వల్ల కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వాళ్లు ప్రతి మాటా కచ్చితంగా అనువాదం చేస్తూ కృతకంగా మారుస్తారు. అనువాదకులు స్వయంగా రచయితలైనా కూడా కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వారు తమ సృజనశక్తిని కూడా కలుపుతారు. అది తప్పు. వేరొకరు గీసిన బొమ్మను నకలు చేసేటప్పుడు మనం పికాసో అంతటివాళ్లమైనా ఆ బొమ్మలో మన గొప్పదనం చూపకూడదు. అనువాదం అయినా అంతే’ అంటుంది నందిని కృష్ణన్. మంచి అనువాద రుసుము ‘అనువాదంలో రాణించాలంటే మంచి డబ్బు కూడా మనకు ఆఫర్ చేయాలి. తగిన డబ్బు లేకుండా అనువాదం చేయడం అనవసరం’ అంటుంది నందిని. ‘కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్పి అనువాదం చేయించుకోవాలనుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను రోజుకు ఆరేడు గంటలు అనువాదం చేస్తాను. ఒక పదానికి బదులు ఎన్ని పదాలు వాడొచ్చో అవసరమైతే లిస్ట్ రాసుకుంటాను. ఒరిజినల్ని చదువుతూ, అనువాదాన్ని చదువుకుంటూ పని ముగిస్తాను. పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు పల్లెల్లో మరీ కొన్ని వర్గాలు మాత్రమే వాడే మాటల్ని ఉపయోగించి రాస్తారు. వాటికి ఇంగ్లిష్ మాటలు ఉండవు. డిక్షనరీలు కూడా ఉండవు. అందుకే అవసరమైతే ఒరిజినల్ రచయితనే సంప్రదిస్తూ డౌట్లు క్లియర్ చేసుకుంటూ అనువాదం ముగించాలి’ అంటుంది నందిని. నందిని లాంటి అనువాదకులు తెలుగులో కూడా ఉంటే మన క్లాసిక్స్ కూడా ప్రపంచ పాఠకులకు తప్పక చేరుతాయి. అనువాదకులకు గుర్తింపునూ తెచ్చిపెడతాయి. -
కర్ణాటకలో నందిని Vs అమూల్
-
పిల్లల పాలిట కాలయముడు.. భార్య మీద కోపంతో కూతుళ్లపై..
పాలకుర్తిటౌన్: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలపై విష ప్రయోగం చేశాడు. పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, చిన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురానికి చెందిన గుండె శ్రీనుకు మండలంలోని దర్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు నాగప్రియ(9), నందిని (5), రక్షిత్ తేజ్(4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. విసిగిపోయిన భార్య ఇటీవల కుమార్తెలను తండ్రి వద్దే వదిలి నాలుగేళ్ల కుమారుడితో పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 6న కూల్డ్రింక్లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని బిడ్డలు దాన్ని తాగారు. అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించా రు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం సైతం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కన్నడనాట పాల గోల.. ఇప్పుడు నందినీపై పడ్డారని బీజేపీపై విమర్శలు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో పాలపై వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. బెంగళూరులో ఆన్లైన్ ద్వారా అమూల్ పాలు, పెరుగు విక్రయించనున్నట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇటీవల చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అమూల్కు వ్యతిరేకంగా పలు కన్నడ సంస్థలు సోమవారం నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి. గో బ్యాక్ అమూల్, సేవ్ నందిని అంటూ హాష్ట్యాగ్లతో సోషల్ మీడియాలోనూ నిరసనలు జోరందుకుంటున్నాయి. అమూల్ను రాష్ట్రంలోకి తీసుకొచ్చి స్థానిక నందినీ డెయిరీని దెబ్బ తీసేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని విపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘‘గుజరాత్కు చెందిన బరోడా బ్యాంక్ మా విజయ బ్యాంక్ను కబళించింది. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలన్నింటినీ గుజరాతీ అయిన అదానీకి కట్టబెడుతున్నారు. ఇప్పుడు నందినీ డెయిరీపై పడ్డారు’’ అంటూ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య దుయ్యబట్టారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి కూడా అమూల్పై విమర్శలతో ట్వీట్లు చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అమూల్ కర్ణాటకలోకి ప్రవేశించడం లేదని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ చెప్పారు. నందినీ డెయిరీని అమూల్లో విలీనం చేస్తారన్నది కూడా కాంగ్రెస్ కుట్రపూరిత ప్రచారం మాత్రమేనన్నారు. బీజేపీ హయాంలోనే నందినీ డెయిరీ భారీగా విస్తరించిందని చెప్పుకొచ్చారు. -
కర్నాటక ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.. నందిని Vs అమూల్
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అమూల్ పాల విషయం కాస్తా పొలిటికల్ హీట్ను పెంచింది. కర్నాటకలో తమ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించడం, అందుకు ప్లాన్ చేయడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం.. వ్యాపార విస్తరణలో భాగంగా బెంగళూరులో తమ పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని అమూల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న నందిని సంస్థను అమూల్లో విలీనం చేయాలనే వార్తలు బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అమూల్ పాల ఉత్పత్తులను రానిచ్చే ప్రస్తకే లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతో పాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. గుజరాత్కు చెందిన అమూల్కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్యకు చెందిన నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. కేఎంఎఫ్ను, రాష్ట్రంలోని పాల రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావ్ చెప్పారు. ఇకపై మంచి కాఫీ, స్నాక్స్ తయారు చేసేందుకు నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తామని వెల్లడించారు. దీంతో బెంగళూరులో తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్న అమూల్కు ఊహించని షాక్ తగిలింది. నందిని పాల ఉత్పత్తులకు సౌత్ ఇండియాలో కూడా డిమాండ్ ఉంది. #WATCH | Bengaluru: We want to protect our milk and our farmers. We already have Nandini which is a better brand than Amul...We don't need any Amul..our water, our milk, and our soil is strong: Karnataka Congress chief DK Shivakumar pic.twitter.com/LNvBynEDsB — ANI (@ANI) April 8, 2023 -
సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్గా కమల్ బాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2023–24 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్గా కమల్ బాలి, డిప్యుటీ చైర్పర్సన్గా ఆర్ నందిని ఎన్నికయ్యారు. 2022–23కి గాను సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్గా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా వ్యవహరిస్తున్నారు. వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్న కమల్ బాలికి సీఐఐతో చిరకాల అనుబంధం ఉంది. 2022–23కి గాను ఆయన సీఐఐ సదరన్ రీజియన్ డిప్యుటీ చైర్మన్గా ఉన్నారు. పరిశ్రమలోని పలు సంస్థలు, ఇన్వెస్ట్ కర్ణాటక ఫోరం మొదలైన వాటిలో ఆయన వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. అటు నందిని .. చంద్ర టెక్స్టైల్స్ సంస్థకు ఎండీగా ఉన్నారు. ఆమె సీఐఐ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. సీఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్లో సభ్యురాలిగా, సీఐఐ నేషనల్ కౌన్సిల్ టాస్క్ ఫోర్స్ (గ్రామీణాభివృద్ధి, వలస కార్మికులు)కు కో–చైర్పర్సన్గా ఉన్నారు. అలాగే పలు సంస్థల్లో డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్లోని టీ–హబ్లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ (సీఐఈఎస్) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను సీఐఐ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం, ప్రతీక్షా ట్రస్ట్స్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫాం .. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలదని తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఐఐ సీఐఈఎస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా : హీరోయిన్
అటు పోట్లు ఎన్ని ఎదురైనా దృఢ సంకల్పం ఉంటే విజయం సాధించవచ్చు అని నటి నందిని రాయ్ నిరూపించింది. వరుస ఫ్లాప్లతో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య గురించీ ఆలోచించింది. మళ్లీ తనకు తానే ధైర్యం చెప్పుకుని అపజయాలను చాలెంజ్గా తీసుకుంది. ప్రస్తుతం వరుస విజయాలు చవిచూస్తోంది. ఆ విజేత పరిచయం.. ► కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా ► పుట్టింది, పెరిగింది హైదరాబాద్లోనే. చిన్న వయసులోనే మోడల్గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైమ్లోనే అంతర్జాతీయ మోడల్గా పేరు సంపాదించుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకుంది. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. ► ‘040’ అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ‘మాయ’, ‘ఖుషీ ఖుషీగా’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘శివరంజని’ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ నటించింది. అటు హిందీలో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే సినిమాలో కనిపించింది. ► బిగ్ బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్కు మరింత దగ్గరైంది. ఇటీవల సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గాలివాన’ వెబ్ సిరీస్లో కూడా నటించి విమర్శల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘పంచతంత్ర కథలు’, ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్లతో వీక్షకులను అలరిస్తోంది. -
‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ ట్రైలర్ రిలీజ్
రణధీర్, నందిని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. ఈ సినిమాకు వినయ్ బాబు దర్శకత్వం వహించగా.. శ్రీ ధనలక్ష్మీ మూవీస్ బ్యానర్పై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతులమీదుగా ట్రైలర్ విడుదల చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ...‘ ఈ సినిమా టైటిల్తో పాటు ట్రైలర్ కూడా చాలా బావుంది. హీరో హీరోయిన్ల జంట చూడముచ్చటగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో అర్థమైంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’అని అన్నారు. దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ...‘‘మా చిత్రం ట్రైలర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్ నచ్చి మా చిత్రం యూనిట్ ప్రశంసించారు. నిజాయితీ గా ప్రేమించుకున్న ప్రతి యువతీ, యువకులు చూడాల్సిన చిత్రమిది' అని అన్నారు. నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఈ చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నందిని హీరోయిన్గా నటించింది. మా చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. త్వరలో సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. -
‘బిగ్బాస్ 2’ ఫేం నందిని రాయ్ బర్త్డే వేడుకలు..
-
శెభాష్: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ జాతీయ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో శుక్రవారం తెలంగాణ మహిళా అథ్లెట్స్ అగసార నందిని స్వర్ణం, జీవంజి దీప్తి రజతం... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజ రజిత కాంస్యం సాధించారు. గుజరాత్లో జరుగుతున్న ఈ మీట్లో నందిని 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.97 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. ఈ ప్రదర్శనతో నందిని కొలంబియాలో ఆగస్టు 1 నుంచి 6 వరకు జరిగే ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించింది. దీప్తి 100 మీటర్ల ఫైనల్ రేసును 12.17 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని దక్కించుకుంది. రజిత 400 మీటర్ల ఫైనల్ రేసును 56.32 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. నందిని, దీప్తి, రజిత హైదరా బాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘సాయ్’ కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ పొందుతున్నారు. చదవండి: Rafael Nadal: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం -
టాక్సీ డ్రైవర్తో డాక్టర్ ప్రేమవివాహం.. నిజం తెలిసి..
హోసూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇదివరకే వివాహమైందని తెలిసి మహిళా డాక్టర్ మిద్దె మీద నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. మత్తిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. కడలూరు జిల్లా బన్రుట్టి ప్రాంతానికి చెందిన నందిని (24) హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయుర్వేద విభాగంలో డాక్టర్గా పనిచేస్తోంది. ధర్మపురికి చెందిన మునియప్ప (29) హోసూరు సమీపంలోని కురుబట్టిలో ఉంటూ కాల్ టాక్సీ నడిపేవాడు. ఇతనితో నందినికి పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఇరువురూ మత్తిగిరి దగ్గర నివాసముంటున్నారు. మునియప్పకు గతంలోనే పెళ్లయిందనే సంగతిని నందినికి తెలియడంతో తరచూ కాపురంలో గొడవలేర్పడుతుండేది. చదవండి: (జిమ్ చేస్తూనే కుప్పకూలిపోయిన మహిళ.. వీడియో వైరల్) గత మూడు రోజుల క్రితం ఏర్పడిన గొడవల్లో ఇరువురూ నిద్ర మాత్రలు తిని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాయం నుంచి బయటపడి ఇల్లు చేరుకొన్న వీరికి శుక్రవారం రాత్రి మళ్లీ గొడవలేర్పడింది. దీనితో జీవితంపై విరక్తి చెందిన నందిని మిద్దెపై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలపాలైన చనిపోయింది. మత్తిగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమించి, శారీరకంగా ఒక్కటై.. గర్భం దాల్చగానే..
సాక్షి, కంబదూరు: మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నరాయుడు కుమారై నందిని (22) మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెలుగు చూసింది. కళ్యాణదుర్గంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాజేష్ వెల్లడించారు. నందిని, కనగానపల్లి మండలం భానుకోటకు చెందిన నరేష్ ప్రేమించుకున్నారు. శారీరకంగానూ ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నరేష్పై ఒత్తిడి చేసింది. ఇష్టం లేని అతను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. చదవండి: (పెళ్లైన 13 రోజులకే.. సచివాలయ ఉద్యోగి బలవన్మరణం) ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మబలికి ఈ నెల 13న బైక్పై దేవరమాన్ల నుంచి తిమ్మాపురం వైపు వెళ్లే కపిలబండ పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా పురుగు మందు తాపి హత్య చేశాడు. కాగా.. నందిని మృతదేహాన్ని ఈ నెల 18న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే మృతదేహం పాడైంది. పక్కనే పురుగు మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావించారు. కానీ పోస్టుమార్టంలో ఆమె గర్భవతి అని తేలింది. ఆమె అన్న కుళ్లాయిస్వామికి అనుమానం వచ్చి కంబదూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. నందినిని నరేష్ హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అతన్ని మంగళవారం నూతిమడుగు సమీపంలో అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు. -
భారత జట్టులో శ్రీనివాస్, నందినికి చోటు
న్యూఢిల్లీ: ఈనెల 17 నుంచి 22 వరకు కెన్యాలోని నైరోబీలో జరిగే ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్, తెలంగాణకు చెందిన అగసార నందినిలకు భారత జట్టులో చోటు లభించింది. శ్రీనివాస్ 200 మీటర్ల విభాగంలో... నందిని 100 మీటర్ల హర్డిల్స్లో ప్రాతినిధ్యం వహిస్తారు. దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీ మొత్తం 28 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. -
పెద్దల అనుమతితో ప్రేమ వివాహం: నందిని
కుంకుమ పూల సౌరభాలు.. మంచు కొండల సోయగాలు.. పచ్చని ప్రకృతి ఆమె చిన్ననాటి నేస్తాలు. సమస్త జంతుజాలం చెట్టు చేమలతో నిండిన అందమైన అడవి ఆమెకు ఎంతో ఇష్టం. కొమ్మల మాటున దాగిన పక్షుల కువకువలు తననే పలకరిస్తున్నట్లు .. చెంగుచెంగున దూకే లేత పసికూనల్లాంటి లేడిపిల్లలు తన వెంటే వస్తున్నట్లు.. వనమంతా తామై స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు తమను సంరక్షించమన్నట్లు వెంటాడిన ఆ భావన హిమసీమల్లో వికసించిన ఆ విద్యాసుమాన్ని అటవీశాఖవైపు నడిపించాయి. అలా తన మనసుకు నచ్చిన వన్యప్రాణి సంరక్షణనే వృత్తిగా మలచుకున్న కాశ్మీరీ కుసుమం నందినీ సలారియా ఇందిరాగాంధీ జూ పార్కు క్యూరేటర్గా బదిలీపై వచ్చారు. భూతలస్వర్గంగా పిలిచే జమ్ముకశ్మీర్ నుంచి పర్యాటకుల స్వర్గధామమైన విశాఖ వరకు ఆమె జీవనప్రయాణం .. ఈ వారం ఆర్మీ స్కూల్లో విద్యాభ్యాసం మాది జమ్ములోని కథువా. అమ్మ, నాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. నా బాల్యమంతా జమ్ములోనే. జమ్మూకశ్మీర్లోని ఆర్మీ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత హర్యానాలోని జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కాలేజీలో వెటర్నరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత వెటర్నరీ సైన్స్లో పీహెచ్డీలో చేరాను. ఒక సంవత్సరం తర్వాత 2013లో ఐఎఫ్ఎస్కు ఎంపిక కావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అలా ఐఎఫ్ఎస్కు .. నాకు ముందు నుంచి వన్యప్రాణులపై ఆసక్తి ఉండేది. డిగ్రీ సమయంలో ఐఎఫ్ఎస్ గురించి తెలిసింది. మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 24వ ర్యాంక్ రావడంతో నాకిష్టమైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఎంచుకున్నాను. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ తీసుకున్నాను. రెండేళ్ల శిక్షణ అనంతరం మరో పది నెలలు వైల్డ్లైఫ్లో డిప్లమో చేశాను. అమ్మ, నాన్నలే ఇన్స్పిరేషన్ అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగులు కావడంతో వాళ్లలా ఉన్నత ఉ ద్యోగం చేయాలి అనే తపన ఉండేది. ఆ క్రమంలోనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. మొ దటి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాను. అడవులన్నీ చుట్టేశా ట్రైనింగ్ సమయంలో దాదాపు అడవులన్నీ చూశాను. రెండేళ్ల శిక్షణలో ఒక నెల రోజులు తరగతులు ఉంటే మరో 20, 25 రోజులు ఫీల్డ్ ట్రిప్ ఉండేది. అలా దాదాపు ఉత్తర భారతదేశంలోని అడవులన్నీ తిరిగాం. ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్సిజన్ అందేది కాదు. ఆ పరిస్థితులన్నీ తట్టుకోగల ఫిట్నెస్ చాలా అవసరం. మా శిక్షణలో అదీ భాగమే. కాకినాడలో ఫస్ట్ పోస్టింగ్ 2016లో నా మొదటి పోస్టింగ్ కాకినాడలో. డీఎఫ్వోగా చేరాను. 2020 జూన్ వరకు అక్కడే. తర్వాత బదిలీపై విశాఖ జూ పార్కు క్యూరేటర్గా వచ్చాను. ప్రశాంత వాతావరణంలోనే.. జమ్ము, కశ్మీర్ అంటే సెన్సిటివ్ ప్రాంతమే. కానీ మేము ఉన్న కథువా ప్రశాంత ప్రదేశం. ఎలాంటి అలజడులు లేవు. వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. సందేశాత్మక చిత్రాలు ఇష్టం నాకు వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు, సందేశాత్మక చిత్రాలు ఇష్టం. కాలేజ్ డేస్లో ఇంగ్లిష్, హిందీ మూవీస్ బాగానే చూశాను. ఇపుడు చూడటం తగ్గించేశాను. ప్రస్తుతం సినిమాల్లో డ్రెస్సింగ్ బాగా లేదు. ఇప్పుడిప్పుడే మంచి స్టోరీ ఉన్న తెలుగు మూవీస్ చూస్తున్నాం. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ నచ్చాయి. అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి. అభద్రతా భావం పోవాలి. చట్రంలోంచి బయటపడాలి. వాళ్లు ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి వెళ్లడానికి కృషి చేయాలి. వన్యప్రాణుల దత్తతకు ముందుకు రావాలి నాకు వన్యప్రాణులంటే ఎంతో ఇష్టం. వాటికి సంబంధించిన పుస్తకాలే అధ్యయనం చేస్తున్నాను. విశాలమైన అరణ్యంలో స్వేచ్ఛగా తిరిగే జంతువులను, పక్షులను జూలో ఎన్క్లోజర్లకే పరిమితం చేస్తున్నాం. అలాంటి వాటిపై ప్రేమ, మానవత్వం చూపించాలి. ఎందరో దాతలు అన్నదానాలకు లక్షల రూపాయల్లో విరాళాలిస్తారు కదా, మరి నోరు తెరిచి చెప్పలేని మూగజీవులను ఎందుకు పట్టించుకోరు అనిపిస్తుంది. జంతుప్రేమికులు జూలో వన్య ప్రాణులను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలి. ప్రపంచస్థాయి జూపార్కుల్లో ఒకటిగా నిలపాలని.. విశాఖ జూపార్కును ప్రపంచస్థాయి జూపార్కుల్లో ఒకటిగా నిలపాలని నా ఆలోచన. ఇక్కడి అవకాశాలు, వాతావరణంపై సీజెడ్ఏఐకి నివేదిక ఇచ్చాను. ఇక్కడ లేని జంతువులు, పక్షులను ఇతర దేశాల జూపార్కుల నుంచి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సందర్శకులు ఆకట్టుకునేలా దీనిని తీర్చిదిద్దాలి. అందుకు ప్రయత్నిస్తున్నా. తెలుగు బాగా నేర్చుకున్నా.. రెండేళ్ల ఐఎఫ్ఎస్ శిక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కడపలో కొద్ది నెలలు శిక్షణ పొందాను. మొదటి పోస్టింగ్ కూడా కాకినాడలో వచ్చింది. ఇక్కడ ప్రాంతీయ భాష తెలుగు కావడంతో నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగింది. తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించాను. అలా ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నాను. మా మాతృభాష డోగ్రీతో పాటు ఇంగ్లిష్, హిందీలో ఫ్లూయెన్సీ ఉంది. పెద్దల అనుమతితో ప్రేమ వివాహం ఐఎఫ్ఎస్ శిక్షణ కాలంలో నా బ్యాచ్మేట్ అనంత్ శంకర్తో పరిచయం ప్రేమగా మారింది. ఆయనది జార్ఖండ్. ఇరువైపుల పెద్దల అంగీకారంతో 2017లో మా వివాహం జరిగింది. ఆయన ఇప్పుడు విశాఖ డీఎఫ్వోగా చేస్తున్నారు. నన్ను ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తారు. ఎప్పుడూ మన ప్రయాణం ఆగకూడదు.. మనం ఏం చేసినా గుర్తింపు ఉండాలి. ఉన్నత స్థాయికి చేరాలి అంటే ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెబుతారు. -
హీరోయిన్ నందిని రాయ్ అదిరే స్టిల్స్
-
మా ఊరి మహా వంటగత్తె
బిగెస్ట్ స్పెషల్ పిజా గ్రాండ్ మా ఈ అవ్వ ప్రత్యేకంగా తయారుచేసిన అతి పెద్ద పిజ్జాను ఇప్పటి వరకు 72,45,705 మంది చూశారు. ఈ అవ్వేమీ సెలబ్రిటీ కాదు. వయసు తొంభై పైమాటే. మట్టి పాత్రలు, కట్టెల పొయ్యి, ఇనుప వస్తువులు, ఆరుబయట ప్రకృతిలో పక్షుల కిలకిలల మధ్య, ఆకుల గలగలల మధ్య అతి సామాన్యంగా అవలీలగా కిలోలుకిలోలు వండుతుంది. సెలబ్రిటీలకు ధీటుగా ఉంటారు ఈ అవ్వ వంటలకు ప్రేక్షకులు. బోసి నవ్వుల అవ్వ ఎంతో రుచికరంగా తయారు చేసిన వంటను తనే రుచి చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తుంది. అవ్వ తయారుచేసిన వంట కంటె, అవ్వను చూస్తే, ‘ఈవిడ మన అవ్వ అయితే బాగుంటుంది’ అనిపిస్తుంది. చికెన్ డ్రమ్స్టిక్ మస్తానమ్మ మస్తానమ్మ చేసిన చికెన్ డ్రమ్స్టిక్ రెసిపీని 66,58, 359 మంది చూశారు. మాంసాహారపు వంటకాలను ప్రత్యేకంగా తయారుచేసిన మస్తానమ్మ 105 సంవత్సరాలు జీవించారు. ఆ వయసులోనూ ఐదు కేజీల బరువును మోశారు. ఆరుబయట కట్టెల పొయ్యి ముందు కూర్చుని, స్వయంగా అన్నీ తరుగుతూ, ఎంతో ఓపికగా వంటలు చేశారు. ఈ తాతమ్మ వంటలను లక్షలమంది మాంసాహార ప్రియులు చూస్తున్నారు. అన్నిటి కంటె చికెన్ డ్రమ్స్టిక్ వంటకాన్ని ఎక్కువ మంది చూశారు. కుడి వైపు పమిటతో ఉన్న మస్తాన్మ వంటకాలను ఎంతో ప్రేమగా వండింది. వయసుతో సంబంధం లేకుండా తయారుచేసుకున్న వంటకాలను ఎంతో సరదాగా రుచి చూశారు మస్తానమ్మ. దంతాలు లేకపోతేనేం, చిగుళ్లు ఉన్నాయిగా రుచి చూడటానికి అనే మస్తానమ్మ 105 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. మ్యాగీ నూడుల్స్ , బ్రెడ్ ఆమ్లెట్ న్యూఢిల్లీ రైల్వేస్టేషన్, తేజ్ మండీ చౌక్ దగ్గర ఈ అవ్వ వేగంగా మ్యాగీ నూడుల్స్, బ్రెడ్ ఆమ్లెట్ తయారుచేస్తూ కనిపిస్తారు. వాటిని తినటానికి ఎంతో మంది ఓపికగా నిరీక్షిస్తుంటారు. ఈ అవ్వ వంటకాలను వీడియోలో బంధించి, యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. రెండు నెలల కాలంలోనే 11,15,975 మంది వీక్షించారు. కుటుంబాన్ని పోషించుకోవటం కోసం వీటిని తయారుచేçస్తున్న ఈ అవ్వ చేతి వంటను ఇష్టపడనివారు ఉంటారా. అందునాతల్లిదండ్రులకు దూరంగా, ఉద్యోగాల కోసం నగరాలకు వస్తున్నవారికి ఇంటి భోజనం, ఇంటి ఆప్యాయతలు తలపించేలా ప్రేమతో నిండిన ఆహారం దొరికితే విడిచిపెడతారా. అవ్వ ఇచ్చేవరకు ఓపికగా నిరీక్షిస్తున్నారు ఇక్కడకు వచ్చేవారంతా. అవ్వను హడావుడి పెట్టకూడదని వారికి తెలుసుగా. వేగంగా రగడా కవితకు నిండా ముప్పై సంవత్సరాలు లేవు. పనిలో చాలా చురుకు. ముంబైలోని చించ్పోక్లీ స్టేషన్కి సమీపంలో కవిత రగడా పట్టీస్ పావ్ వేగంగా తయారుచేస్తూ హుషారుగా కనిపిస్తారు. కవిత రగడాలు తయారుచేయటంలోనే కాదు, ప్యాకింగ్ చేయడంలోనూ అత్యంత వేగం చూపుతారు. ఈమె పని నైపుణ్యాన్ని వీడియో తీసి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఆరు నెలలకే 33,31,272 మంది చూశారు. ఎంతో చురుకుగా అలసట కనపడనీయకుండా, అతి వేగంగా రగడా తయారుచేసి అందిస్తూ, మరో వైపు పార్సిల్స్ కడుతూ ఎవ్వరినీ ఎక్కువసేపు నిరీక్షించకుండా పని చేస్తున్న కవిత, ‘మేం సామాన్య మహిళలం కాదు, మేం కూడా సెలబ్రిటీ లమే’ అంటున్నట్లుగా అనిపిస్తారు. నందిని వంట హైదరాబాద్ చందానగర్ స్వాగత్ హోటల్ పక్కన, రోడ్డు మీద చికెన్ బోటీని అతి తక్కువ ధరకు అందిస్తున్నారు మూడు పదులు కూడా నిండని నందిని. వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ తాను ఒక్కర్తే స్వయంగా తయారుచేసి, పన్నెండు గంటలకు వంటకాలను మోసుకొచ్చి, ఆకలితోఉన్నవారికి సాయంత్రం నాలుగు గంటల వరకు అతి తక్కువ ధరలో భోజనం పెడుతున్నారు నందిని. ఆమెను వీడియోలో బంధించి అప్లోడ్ చేశారు. ఆమె చలాకీగా వంటలు వడ్డించటం, వచ్చిన వారిని నవ్వుతూ పలకరించటాన్ని ఇప్పటి వరకు 40,48,611 మంది చూశారు. ఇందులో ఒక్కరూ సెలబ్రిటీలు కాదు. సంపన్న కుటుంబాల వారు కాదు, అందంగా అలంకరించుకుని, మేకప్ వేసుకుని కూడా ఉండరు. మన ఇంట్లో ఉండే అమ్మ, అవ్వ, అక్క, వదిన, చెల్లి వంటివారు వీరందరిలో నిండుగా కనిపిస్తారు. వీరంతా కుటుంబాలను చక్కగా పోషించుకుంటున్న స్వాభిమానులు. శక్తిమూర్తులు, ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నవారు. కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా, ఆకలితో ఉన్న ఎంతోమందిని సంతృప్తులను చేస్తున్నారు. -
ఫేస్బుక్లో ఫోన్ నంబరు.. నటిపై ఫిర్యాదు
చెన్నై, పెరంబూరు : బుల్లితెర నటిపై సమత్తువ మక్కళ్కట్చి నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుల్లితెర నటి నందిని మైనా నకిలీ ఫేస్బుక్ను ప్రారంభించింది. అందులో సమత్తువ మక్కళ్ కట్చి నాయకుడి ఫోన్ నంబరును నమోదు చేసింది. ఆ ఫోన్ నంబరుకు పలువురు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడినట్టు తెలిసింది. ఆ ఫోన్ నంబరు ఈ రోడ్డు జిల్లా, అందియూర్ సమీపంలోని అన్నామడులై గ్రామానికి చెందిన గురునాథన్ అనే వ్యక్తిది. ఈయన ఉత్తర ఈరోడ్డు జిల్లా సమత్తువ మక్కళ్ కట్టి కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా ఆయన ఫోన్ నంబర్ నటి నందిని మైనా నకిలీ ఫేస్బుక్లో నమోదు చేయడంతో అది ఆమె నంబర్ అనుకుని ఎవరెవరో అర్ధరాత్రుల్లో ఫోన్ చేసి విసిగించడంతో గరునాథన్ నటి నందిని మైనాపై అందియూర్ లీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోడ్డు జిల్లా సైబర్ పోలీసులకు కేసును అప్పగించారు. సైబర్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్సీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ
సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినికి క్యాంపస్ ప్లేస్మెంట్లో భారీ ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లోని ఎంసీఏ విద్యార్థిని వి. నందిని సోని క్యాంపస్ ప్లేస్మెంట్లో అడోబ్ సిస్టమ్స్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. హెచ్సీయూలోని ప్లేస్మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో సమన్వయంతో ఈ ప్లేస్మెంట్ను నిర్వహించారు. రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి నందినిని అడోబ్ సిస్టమ్స్ కంపెనీ ఎంపిక చేసింది. దీంతో హెచ్సీయూలో చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థినిగా నందిని సోనీ నిలిచారు. నందిని తన పాఠశాలను విద్యను మహారాష్ట్రలోని బోయిసర్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో పూర్తి చేశారు. అహ్మదాబాద్లోని సెయింట్ జేవీయర్స్ కళాశాలలో బీసీఏ చదివారు. కాగా, ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లో 200 మందిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని హెచ్సీయూ ప్లేస్మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో చైర్మన్ రాజీవ్ వాంకర్ తెలిపారు. ఇంజినీరింగ్ వదిలేశా: నందిని మొదట ఇంజినీరింగ్ కోర్సులు చేయాలనుకున్నా కానీ ఆ తరువాత కంప్యూటర్స్లో ఉన్నత విద్యను అభ్యసించాలని.. నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉండాలన్న లక్ష్యంతో ఎంసీఏలో చేరినట్టు నందిని సోని తెలిపారు. స్మార్ట్ ఇండియా హాకథాన్– 2019లో తన బృందంతో కలిసి విజేతగా నిలిచినట్టు వెల్లడించారు. అత్యధిక ప్యాకేజీతో అడోబ్ సిస్టమ్స్లో ఉద్యోగం రావడం సంతోషంగా ఉందన్నారు. (ఐసెట్–2020 నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విద్యార్థిని అదృశ్యం
టేక్మాల్(మెదక్): విద్యార్థిని అదృశ్యమైన సంఘటన టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసంగి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుసంగి గ్రామానికి చెందిన కుమ్మరి రామమ్మ కూతురు నందిని(16) సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ చదువుకుంటుంది. ఈనెల 18వ తేదీన వాళ్ల అమ్మమ్మ పెంటమ్మతో కలిసి మధ్యాహ్న సమయంలో గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లారు. అక్కడ ఇరువురు పనులు చేస్తుండగా నందిని దాహం వేస్తుందని దగ్గరలో ఉన్న గుడిసెలో నీళ్లు తాగేందుకు వెళ్లింది. నీళ్లు తాగేందుకు వెళ్లిన నందిని తిరిగి రాలేదు. సాయంత్రం రామమ్మ కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి కూతురు ఇంటి వద్ద లేకపోవడంతో ఇరుగుపొరుగు వాళ్ల ఇళ్లలో, బంధువుల వద్ద వెతికారు. నందిని ఆచూకి లభించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నందిని చామన్ఛాయ రంగులో ఉండి లేత ఆకుపచ్చ లాంగ్ ప్రాక్ డ్రెస్ వేసుకున్నట్లు తెలిపారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
ఎస్ఎన్ చిన్న, హేమంత్, శ్రద్ధ, చైత్ర, నందిని ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చిన్నాతో ప్రేమగా’. పీవీఆర్ దర్శకత్వంలో ఎస్.యన్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బి. చండ్రాయుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా బి. చండ్రాయుడు మాట్లాడుతూ– ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఒక ముఖ్యమైన పాత్ర చేయడంతో పాటు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ఈ వారంలో పూర్తవుతుంది. మరో మూడు షెడ్యూల్స్లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిట్టిబాబు కామెడీ, ప్రియాంక క్లాసికల్ డ్యాన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ’’అన్నారు పీవీఆర్. ఈ చిత్రానికి కెమెరా: రెబాల సుధాకర్ రెడ్డి, సంగీతం: రాజ్ కిరణ్. -
నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి
తమిళనాడు, పెరంబూరు: మద్య నిషేధం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాది నందిని వివాహం బుధవారం నిడారంబరంగా జరిగింది. వివరాలు.. మదురైకి చెందిన న్యాయవాది నందిని, ఆయన తండ్రి ఆనందన్లు మద్య నిషేధం కోసం పోరాటం చేస్తున్నారు. నందినికి ఆమె తండ్రి స్నేహితుడి కొడుకు గుణజ్యోతిబసుతో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ నెల 5వ తేదీన వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఇటీవల నందిని, ఆమె తండ్రి ఆనందన్ మద్యనిషేధం కోరుతూ శివగంగై జిల్లాలో పోరాటం చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని తిరుపత్తూర్ కోర్టులో హాజరుపరచగా కోర్టును ధిక్కరించిన కేసులో వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వారిని మదురై జైలుకు తరలించారు. దీంతో నందిని పెళ్లి ఆగిపోయింది. ఇదిలాఉండగా నందిని, ఆమె తండ్రి ఆనందన్లు మూడు రోజుల క్రితం బెయిల్పై విడుదలయ్యారు. ఈ పరిస్థితుల్లో నందిని పెళ్లిని వెంటనే జరిపించాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నాడు. దీంతో బుధవారం మదురై జిల్లా, తెన్నమల్లూర్లోని వారి కులదైవం పట్టవన్ స్వామి అలయంలో నిరాడంబరంగా నందిని, గుణ జ్యోతిబసుల వివాహం జరిగింది. అనంతరం వధూవరులిద్దరూ కుల దైవం సన్నిధిలో ఇకపై తామ వ్యక్తిగత జీవితంతో పాటు సామాజిక సేవలోనూ శ్రద్ధ చూపుతామని ప్రతిజ్ఞ చేశారు. -
నందిని వివాహానికి అనుమతించండి
సాక్షి, చెన్నై : మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ జైలు నిర్బంధంలో ఉన్న నందినిని వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి శనివారం పలువురు నేతలు విజ్ఞప్తి చేశారు. పదేళ్లుగా మద్యానికి వ్యతిరేకంగాను, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్మాక్ దుకాణాలను మూసివేయాలని కోరుతూ న్యాయవాది నందిని, ఆమె తండ్రి ఆనందన్ పోరాడుతున్న విషయం తెలిసిందే. 2016లో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కరపత్రాలు పంచిపెట్టిన కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేసి, తిరుపత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఈ కేసుకు సంబంధించి నందిని కోర్టును, న్యాయవాదులను విమర్శించే రీతిలో మాట్లాడడంతో వేరొక కేసును నమోదు చేశారు. దీంతో జూలై 9వ తేదీ వరకు ఆమెను జైల్లో నిర్బంధించేందుకు శుక్రవారం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జూలై 5న నందినికి వివాహం జరగాల్సి ఉండగా. ఇది వరకే వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. ఈ నేపథ్యంలో తమిళ్ ఎళుచ్చి పేరవై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నందినిని ఆమె వివాహానికి అనుమతించాలని కోరింది. అలాగే, ఎస్డీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అహ్మద్నబి విడుదల చేసిన ప్రకటనలో మద్యనిషేధం కోసం పోరాడుతున్న నందినిని ఆమె తండ్రి ఆనందన్ను విడుదల చేయాలని కోరారు. నందినికి జూలై 5న వివాహం జరగనున్నందున వెంటనే ఆమెను విడదల చేయాలని కోరారు. -
కన్యాదానం ఏంటీ?
భారతదేశంలో చాలాకాలంగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థకు భిన్నంగా, ఒక మహిళ పౌరోహిత్యం వహించి, కన్యాదానం లేకుండా వివాహం జరిపించింది. ‘‘పితృస్వామ్య వ్యవస్థ నుంచి బయటకు వచ్చి, మహిళ ప్రాధాన్యతను తెలియచేయాలనుకున్నాను’’ అంటారు నందిని భౌమిక్. అన్విత జనార్దన్, అర్క భట్టాచార్యల వివాహాన్ని కన్యాదానం లేకుండా చేయించారు. స్త్రీ సాధికారతను తెలియచేయాలన్నదే నందిని భౌమిక్ లక్ష్యం. జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో టీచర్గా పనిచేస్తున్న నందిని, ఈ పది సంవత్సరాల కాలంలో 40 పెళ్లిళ్లు కన్యాదానం లేకుండా చేయించారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే, పది నాటక కంపెనీలలో... మతాంతర, కులాంతర వివాహ విధానాలను ప్రదర్శిస్తున్నారు. భౌమిక్లో ఇటువంటి ఆలోచన కలగడానికి కారణం ఆవిడకు విద్య నేర్పిన గౌరీ ధర్మపాల్. పౌరోహిత్యంతో వచ్చే ధనంలో అధికభాగం అనాథలకు అందచేస్తున్న నందిని, తన ప్రాణ స్నేహితురాలితోను, కాలేజీ విద్యార్థులతోనూ కలిసి ఈ వేడుకను కొత్తగా జరిపించారు.సంస్కృతంలో ఉన్న మంత్రాలను ఇంగ్లీషు, బెంగాలీ భాషలలోకి అనువదించి, వధూవరుల చేత పలికిస్తున్నారు నందిని. ఆమెతో వచ్చిన విద్యార్థులు బ్యాక్ గ్రౌండ్లో రవీంద్ర సంగీత్ ఆలపిస్తుంటారు.‘‘చాలామంది మగ పురోహితులు మంత్రాలను తప్పులు పలకడం గమనించాను. మా స్నేహితుల వివాహంలో నందిని చేస్తున్న వివాహంలో ఆవిడ సంస్కృత మంత్రాలను వివరించడం చూసి, నా వివాహం ఆమె చేత చేయించుకోవాలనుకున్నాను’’ అంటారు అర్క. ఋగ్వేదంలో కన్యాదానం లేని వివాహాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. అందుకే నందిని... కన్యాదానం లేని వివాహాల గురించి ప్రచారం చేయడానికి నడుం బిగించారు. సంస్కృత పండితుడైన నృసింహప్రసాద్ భాదురి... మహిళలు పౌరోహిత్యం వహించకూడదని హిందూధర్మం ఎన్నడూ చెప్పలేదని, వేదాల గురించి జరిగిన చర్చలలో మహిళలు పాల్గొని ఆధ్యాత్మిక, తాత్విక అంశాలలో ప్రతిభను ప్రదర్శించినట్లు ఆధారాలు ఉన్నాయని అంటారు. నందిని గురించి తెలుసుకున్న యువత ఇప్పుడు ఆమెను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. – జయంతి -
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
కాచిగూడ: భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ జానకి రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ నింబోలిఅడ్డ ప్రాంతానికి చెందిన సంతోష్కుమార్, నందినికి (24) 2013లో వివాహం జరిగింది. వీరికి ఒక కు మార్తె. గత కొంత కాలంగా మద్యానికి బానిసైన సంతోష్ తరచూ భార్యను వేధించేవాడు. నం దిని తల్లిదండ్రులు పలుమార్లు అల్లుడికి నచ్చజెప్పినా అతడి వైఖరిలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికిలోనైన నందిని సోమవారం రాత్రి ఇం ట్లో ఎవరూలేని సమయం లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడు సంతోష్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు. -
‘రిషబ్’ స్కామ్ నిందితుల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రిషబ్ చిట్ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముసుగులో చిట్టీలు, ఫిక్సిడ్ డిపాజిట్ల పేరుతో వందల మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితులు శైలేశ్కుమార్ గుజ్జర్, అతడి భార్య నందినిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ కుంభకోణం విలువ రూ.70 కోట్లు ఉంటుందని అధికారికంగా తేలినా.. బాధితులు మొత్తం బయటకు వస్తే రూ.200 కోట్లు దాటుతుందని తెలుస్తోంది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామని, తదుపరి విచారణకు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని అదనపు డీసీపీ జోగయ్య వెల్లడించారు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు విలువైన చిట్టీలు నిర్వహించడంతోపాటు మెచ్యురిటీ పూర్తయిన, పాడుకున్న వారికి నెలకు రూ.2 వడ్డీ ఆశచూపి ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లుగా తమ వద్దే ఉంచుకున్నారు. కొన్నాళ్లు వడ్డీ చెల్లించిన శైలేశ్ హఠాత్తుగా కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పరారీలో ఉన్న వారిద్దరినీ పట్టుకునేందుకు సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చివరకు గురువారం సమీప బంధువు ఇంట్లో తలదాచుకున్న ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరిని రిషబ్ సంస్థ కార్యాలయంతోపాటు ఇంటికి తీసుకెళ్లి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారాల్లో పెట్టుబడులు.. చిట్టీలు, డిపాజిట్ల రూపంలో కాజేసిన డబ్బును హైదారాబాద్తోపాటు రాష్ట్రాల్లో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టానంటూ శైలేశ్ వివరించాడు. ఆ వ్యాపారాల్లో నష్టాలే మిగిలాయని చెప్పాడు. నిందితుడు చెప్పిన వివరాల్లో నిజానిజాలు తేల్చాలని పోలీసులు నిర్ణయించారు. కాగా, నిందితులపై బాధితులు దాడికి యత్నించారు. డబ్బులు ఇప్పించాలని సీసీఎస్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. -
క్వార్టర్స్లో నందిని, శిరీష
సాక్షి, హైదరాబాద్: వి.ఎ.శర్మ, వి. ఇందిరాంబ స్మారక తెలంగాణ రాష్ట్ర క్యారమ్ టోర్నమెంట్లో ఆనంద్నగర్ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్ఏ) క్రీడాకారులు కె. నందిని, కె. నవిత, సీహెచ్ శిరీష, సరస్వతి క్వార్టర్స్కు చేరుకున్నారు. ఖైరతాబాద్లో జరుగుతోన్న ఈ టోర్నీ అండర్–18 బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల్లో వీరంతా విజయం సాధించారు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో నందిని 22–0తో కె. శిరీషపై, సీహెచ్ శిరీష 25–0తో శ్రీవల్లి పద్మావతిపై, నవిత 23–5తో బాలేశ్వరిపై, సరస్వతి 25–8తో భార్గవిపై నెగ్గారు. ఇతర మ్యాచ్ల్లో కార్తీక వర్ష (నాసర్) 25–4తో దీప్తి (ఏడబ్ల్యూఏఎస్ఏ)పై, ప్రణీష (వరంగల్) 22–0తో అశ్విని (ఏడబ్ల్యూఏఎస్ఏ)పై, ఎన్. స్వాతి (మంచిర్యాల) 25–0తో పి. సరిత (ఏడబ్ల్యూఏఎస్ఏ)పై నెగ్గి క్వార్టర్స్లో అడుగుపెట్టారు. -
సివిల్స్ ప్రథమ ర్యాంకర్ నందినికి సన్మానం
కాశీబుగ్గ : ఆల్ ఇండియా సివిల్స్ ప్రథమ ర్యాంకర్, కేరళకు చెందిన నందినికి పలాసలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలి టీ పరిధిలో పారసాంబ గ్రామానికి యువ ఐఏఎస్లు మంగళవారం రాత్రి చేరుకున్నారు. మంగళవారం గ్రామంలో బస చేసిన ఆమెకు స్థానికులు, పట్టణ వాసులు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపి శాలువతో సత్కరించారు. ఇటీవల ఐఏఎస్ అధికారులుగా ఎంపికైన 19మంది ట్రైనీ ఐఏఎస్ల బృందం పశ్చిమబెంగాల్ నుంచి విశాఖ నేవల్ డాక్యార్డుకు చేరుకుంటున్న సమయంలో మార్గమధ్యం లో పలాస వచ్చారు. ఐఏఎస్ శిక్షణలో భాగంగా భారత దర్శిని పేరుతో అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ జాతీయ రహదారిపై వెళ్తున్న ఈ బృందాన్ని సివిల్స్ 3వర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ ఆ హ్వానించడంతో ఆయన ఇంటికి చేరుకుని బస చేశారు. ఆరుబయట నేలపై కూర్చుని భోజన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో మిగిలిన ఐఏ ఎస్ అధికారులు, టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, రోణంకి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్: ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గణేష్ నగర్లో గ్రీష్మ నందిని అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతిచెంది ఉంది. కాగా, ఆమెను అత్తమామలే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసు స్టేషన్కు నందిని బంధువులు భారీగా చేరుకున్నారు. -
ఎంత పనిచేశావు నాన్నా..
⇒చిన్నారిని బలితీసున్న దారి వివాదం ⇒తొమ్మిది నెలల కుమార్తెనుగొంతు నులిమి చంపిన తండ్రి ⇒తాను కూడా ఆత్మహత్యాయత్నం ⇒విషాదంలో మాధవరం తండ్రి తనను బైక్ మీద ఎక్కించుకొంటుంటే ఎప్పటి లాగే షికారుకు తీసుకెళ్తున్నాడని సంబర పడిపోయింది ఆ చిన్నారి. బజారుకు తీసుకెళ్లి ఏ చాక్లెట్లో.. బిస్కెట్లో కొనిస్తాడనుకొని ఆశ పడింది. బోసి నవ్వులు నవ్వుకుంది. పాపం.. అభం శుభం తెలియని ఆ పాలబుగ్గల పసిపాపకేం తెలుసు రోజూ తనను గారం చేసే కన్న తం్రడ్రే తన గొంతు నులిమి చంపేస్తాడని..? దాయాదుల మధ్య తలెత్తిన దారి వివాదంతో మనస్తాపం చెందిన ఓ అభాగ్యుడు తల్లిని హత్తుకొని పడుకొన్న తొమ్మిది నెలల చిన్నారిని పొలానికి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు. తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ముక్కుపచ్చలారని బిడ్డను చంపేందుకు ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో.. అని స్థానికులు విస్మయం వ్యక్తం చేయగా.. తన చిట్టిచెల్లి ఇక లేదని తెలియని మూడేళ్ల బాలుడు నిర్జీవంగా పడి ఉన్న చిన్నారిని తడుముతూ మురిపెంగా ముద్దాడుతుంటే.. అతడి అమాయకత్వాన్ని చూసి కన్నీటిని ఆపుకోవడం అక్కడున్న ఎవరి తరమూ కాలేదు. గుండెల్ని పిండేసే ఈ విషాద ఘటన దర్శి మండలం మాధవరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. తాళ్లూరు: మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన ఇడమకంటి నాగిరెడ్డి, స్వాతి దంపతులకు మూడేళ్ల కుమారుడు అజయ్కుమార్ (సాయి), తొమ్మిది నెలల వయసు కుమార్తె నందిని ఉన్నారు. కాస్త అమాయకంగా ఉండే నాగిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. నాగిరెడ్డికి తనకు బాబాయి వరసయ్యే దాయాదులైన ఇడమకంటి గురువారెడ్డి, పిచ్చిరెడ్డిలతో చాలా రోజులుగా పొలం వద్ద దారి వివాదం నలుగుతోంది. దీనిపై పెద్ద మనుఘల వద్ద పంచాయితీలు జరిగాయి. స్టేషన్లో ఫిర్యాదుల వరకు వెళ్లాయి. రెండు రోజుల క్రితం పొలం వద్ద దారి విషయంలోనే వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో దారి విషయం తెలేవరకు తమ ఇంటి ముందుగా ఉన్న దారిలో నడవటానికి వీల్లేదంటూ గురువారెడ్డి, పిచ్చిరెడ్డిలు నాగిరెడ్డి నివాసం చుట్టూ చిల్ల కంపవేసి దారి మూసి వేశారు. దీంతో గ్రామంలో తమకు న్యాయం చేసే వారు లేరంటూ సోమవారం రాత్రి నాగిరెడ్డి తన తల్లిదండ్రులు, భార్య పిల్లలతో కలిసి, గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గుంటి గంట సత్రానికి వెళ్లారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు, బంధువులు వారి వద్దకు వెళ్లి నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి చుట్టూ వేసిన కంప తీసివేశారు. మంగళవారం ఉదయం దాయాదులు మళ్లీ దారి మూసివేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినది. దీంతో నాగిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నిద్రిస్తున్న బిడ్డను ఎత్తుకొని.. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మంచంపై తల్లి పక్కన పడుకొని నిద్రిస్తున్న కుమార్తె నందినిని ఎత్తుకొని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్లాడు. పొలానికి వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. పాపను రోజూ నాగిరెడ్డి ఇలాగే కాసేపు బజారుకు, పొలానికి బైక్పై తీసుకువెళ్తూ ఉంటాడు కదా.. అని తల్లి అభ్యంతరం చెప్పలేదు. ఎంతకీ బిడ్డను తీసుకురాక పోవటంతో స్వాతి తన భర్తకు ఫోన్ చేసింది. స్పందన రాలేదు. తర్వాత మరోకరి సెల్ నుంచి ప్రయత్నించింది. తాను పాపను చంపేశానని.. తాను కూడా చనిపోతానని భార్యతో చెప్పినట్లు సమాచారం. దీంతో షాక్కు గురయిన స్వాతి బంధువులకు విషయం చెప్పింది. హుటాహుటిన బంధువులు పొలం వద్దకు వెళ్లేసరికి అప్పటికే పాప మృతి చెందింది. నాగిరెడ్డి ఒక వైపు పడి ఉండటం చూసిన వెంటనే ఒంగోలు ప్రవేట్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందిన చిన్నారిని తాతయ్య, నానమ్మలు ఇంటికి తీసుకొచ్చారు. నాగిరెడ్డి పొలంలోని విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. అంతలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలిసింది. చిన్నారి మృతితో విషాదం.. మృతి చెందిన చిన్నారి స్వాతిని తండ్రి పొట్టన పెట్టుకోవటం పట్ల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కుపచ్చలారని పసిపాపను ఒడిలో పెట్టుకుని స్వాతి గుండెలవిసేలా రోదించింది. అన్న అజయ్కుమార్ చెల్లిని ముద్దాడుతూ అటూ ఇటూ తిరగటం చూసిన బంధువుల కళ్లు చెమర్చాయి. ఘటన స్థలాన్ని ఎస్ఐ మహేష్ పరిశీలించారు. దర్శి సీఐ రాఘవేంద్ర పాప మృతదేహాన్ని పరిశీలించి తల్లి స్వాతి, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. -
బుల్లితెర నటి భర్త ఆత్మహత్య
పెరంబూర్: బుల్లితెర నటి నందిని భర్త కార్తికేయన్(30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్లితే విరుగంబాక్కం, వీఎస్ఎన్.నగర్ 3వ వీధికి చెందిన రవిచంద్రన్ కొడుకు కార్తికేయన్. ఇతను టీ.నగర్లో జిమ్ను నిర్వహించేవాడు. రెండే ళ్ల క్రితం వెన్నెల అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని నెలలకే ఆమె మరణించింది. కాగా కార్తికేయన్ జిమ్కు బుల్లితెర తారలు వస్తుండేవారు. అలా వెళ్లన బుల్లితెర నటి నందినితో కార్తికేయన్ పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల సమ్మతంతో ఎనిమిది నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.నందిని శరవణన్ మీనాక్షి సీరియల్లో మైనా పాత్రలో నటిస్తోంది. ఆమె నటి కావడంతో రోజూ అర్ధరాత్రి వేళల్లో ఇంటి కి వెళ్లేదట. ఈ విషయంలో కార్తికేయన్, నందినిల మధ్య తర చూ గొడవలు జరిగేవని సమాచారం. అంతే కాదు నందినిపై కార్తికేయన్కు అనుమానం కలగడంతో ఆమెకు కొన్ని ఆంక్షలు విధించారని సమచారం. అయితే ఆ ఆంక్షలు నందిని పెడచెవిన పెట్టడంతో విభేదాలు తలెత్తి ఇద్దరూ విడిపోయారట.ఇలాంటి పరిస్థితుల్లో కార్తికేయన్ మంగళవారం నందినికి ఫోన్ చేయగా ఆమె దుర్భాషలాడినట్లు సమాచారం. అనంతరం కార్తికేయన్ తను తరచూ బస చేసే స్థానిక వడపళని, పొన్నియమ్మాళ్ వీధిలోని గెస్ట్హౌస్కు వెళ్లాడు.అయితే రాత్రి పొద్దుపోయినా కార్తికేయన్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి శాంతి అతను బస చేసే గెస్ట్హౌస్కు వచ్చింది. ఇంటి లోపల తాళం వేసి ఉండడంతో చాలా సేపు తలుపు కొట్టినా కార్తికేయన్ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన శాంతి వెంటనే విరుగంబాక్కం పోలీసులకు ఫోన్ చేసింది.వెంటనే అక్కడి వచ్చిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించగా కార్తికేయన్ నోటిలో నురగలు కక్కి నిర్జీవంగా పడిఉన్న దృశ్యం కనిపించింది. అతను విషం కలిపిన శీతల పానీయం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.కార్తికేయన్ పడి ఉన్న సమీపంలో మూడు లెటర్లు ఉన్నాయి.వాటిని తీసుకుని కార్తికేయన్ భౌతిక కాయాన్ని రాజపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్మార్టం కోసం పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేకెత్తించింది. -
వివాహిత ఆత్మహత్య
గుడిబండ (మడకశిర) : గుడిబండ మండలం బాలదిమ్మనపల్లికి చెందిన కాపుగుండన్నగారి హనుమంతరెడ్డి భార్య నందిని(22) అనే వివాహిత వరకట్నం వేధింపులు భరించలేక శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఖాజాహుస్సేన్ తెలిపారు. అగళి మండలం కురసంగనపల్లికి చెందిన నందిని వివాహం బాలదిమ్మనపల్లికి చెందిన హనుమంతరెడ్డితో అయింది. పెళ్లైనప్పటి నుంచి భర్త, అత్త, మామ అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తుండే వారని మృతురాలి తండ్రి ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టీచర్ మందలించిందని.. విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో..మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని హయత్నగర్ పోలీస్స్టేసన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నందిని(15) సాయి చైతన్య స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. హోం వర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో.. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురి మృతికి కారణమైన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నందిని తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. -
బైక్ ఢీకొని విద్యార్ధిని మృతి
సైకిల్పై కాలేజీకి వెళుతున్న విద్యార్ధినిని ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని భజన నర్తం గ్రామంలో జరిగింది. జూనియర్ ఇంటర్ చదువుతున్న నందిని(17) సైకిల్పై కాలేజీకి బయలు దేరింది. మార్గ మధ్యంలో సైకిల్ను భైక్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నందిని అక్కడికక్కడే మృతి చెందింది. -
స్కూల్ వ్యాను కిందపడి చిన్నారి మృతి
షాద్నగర్ : మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ పట్టణంలోని రైతు కాలనీ వద్ద శనివారం స్కూల్ బస్సుకిందపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. కాకతీయ స్కూల్కు చెందిన బస్సు పిల్లలను ఎక్కించుకునేందుకు రైతు కాలనీలో ఆగింది. అదే సమయంలో స్థానికులురాలు మానస కుమార్తె నందిని(2) ఆడుకుంటూ ఆగి ఉన్న బస్సు కిందికి వెళ్లి పోయింది. బస్సుకింద చిన్నారి ఉన్న విషయం గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దాంతో ఆ చిన్నారి బస్సు చక్రాలకింద నలిగిపోయి మృతి చెందింది. చిన్నారి మృతితో కాలనీలో విషాదం నెలకొంది. -
బాలిక కాదు.. బాహుబలి!
బెంగళూరు: భారతదేశంలోనే అత్యధిక బరువుతో పుట్టిన ఆడ శిశువుకు, బెంగళూరు మహిళ జన్మనిచ్చింది. నందిని అనే గర్భిణికి హసన్ ఆస్పత్రిలో సోమవారం పుట్టిన బాలిక 6.82 కిలోల బరువు ఉందని డాక్టర్లు వెల్లడించారు. అప్పుడే పుట్టిన శిశువులు సగటున 3.4 కిలోల వరకు బరువుంటారు. తన 25 ఏళ్ల సర్వీసులో ఇంత భారీగా బరువున్న ఆడ శిశువును ఎప్పుడూ చూడలేదంటూ డాక్టర్ వెంకటేశ్ రాజు అనే స్థానిక వైద్యాధికారి ఆశ్చర్యపోయారు. బిడ్డకు తగ్గట్టే తల్లి నందిని కూడా 5.9 అడుగుల ఎత్తు, 94 కిలోల బరువు ఉన్నారు. ప్రస్తుతం ఈ శిశువును ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శిశువు ఆరోగ్యం అన్ని విధాలా బాగుందని, అయితే ఆమె భారీ కాయాన్ని చూసి అంతా విస్తుపోయామని సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించిన గైనకాలజిస్టు డాక్టర్ పూర్ణిమ మణు వివరించారు. గత ఏడాది కూడా ఫిర్దోస్ ఖాటూన్ అనే మహిళ 6.7 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చారు. నందిని కుమార్తె ఇంతకంటే ఎక్కువ బరువు ఉండటం విశేషం. -
సావిత్రి పెళ్లెలా అయిందంటే..
చిత్రం: ‘సావిత్రి’, తారాగణం: నారా రోహిత్, నందిని, ధన్యాబాలకృష్ణన్, మురళీశర్మ, ‘అల్లరి’ రవిబాబు, ‘ప్రభాస్’ శ్రీను, పమ్మి సాయి, మాటలు: కృష్ణచైతన్య, సంగీతం: శ్రవణ్, నిర్మాత: డాక్టర్ వి.బి. రాజేంద్రప్రసాద్, కథ: స్క్రీన్ప్లే: దర్శకత్వం: పవన్ సాదినేని ఇటీవల వరుసగా ఒకటికి నాలుగు సిన్మాలు చేస్తున్న యువ హీరో నారా రోహిత్. విభిన్నమైన కథలు ఎంచుకుంటాడని పేరొస్తున్న ఈ హీరో, ‘ప్రేమ - ఇష్క్ - కాదల్’ ద్వారా ఆకర్షించిన దర్శ కుడు పవన్ సాదినేని కలయికలోది ‘సావిత్రి’. దొరబాబు (మురళీశర్మ) దంపతులకు ఇద్దర మ్మాయిలు. గాయత్రి (ధన్యా బాలకృష్ణన్), సావిత్రి (నందిని). సావిత్రికి చిన్నప్పటి నుంచి ‘పెళ్ళి’ అంటే తగని ఉత్సాహం! బామ్మ (రమాప్రభ)తో కలసి ట్రైన్లో ట్రావెల్స్ వాళ్ళతో షిర్డీకి వెళుతున్న ప్పుడు ఆమెకు బుుషి (నారా రోహిత్) తారసపడతాడు. డాక్టరైన హీరో ఎదురవుతాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఒక ప్రేమ జంటను కలిపేందుకు ప్రయత్నిస్తూ హీరోయిన్కూ దగ్గరవుతాడు. హీరో పెళ్ళి చూపులు చూడాల్సిన అమ్మాయి, ట్రైన్లో ఎదురుపడడంతోనే అతను ప్రేమలో పడ్డ అమ్మాయి - ఒకరే అనే అలవాటైన ట్విస్ట్ పాత్రలకు కాక, ప్రేక్షకులకే తెలుస్తుంది. ఇంటర్వెల్ పడుతుంది. ఇక అక్కడ నుంచి కథ కొత్త మలుపు తిరుగుతుంది. హీరో ప్రేమను ఒప్పుకోని హీరోయిన్... ఆమె తండ్రిని ఒప్పించలేని హీరో... హీరోయిన్ను పెళ్ళాడాలని 20 ఏళ్ళుగా బ్రహ్మచారిగా మిగిలిపోయిన విలన్ కాని విలన్ (‘అల్లరి’ రవిబాబు)... హీరోయిన్ బాబాయ్ (అజయ్) పాత్రల మధ్య కథ నాలుగు స్తంభాలాటే. చివరకు హీరోయిన్ తండ్రి ఎలా కన్విన్స అయ్యాడు, సావిత్రి పెళ్ళెలా జరిగిందన్నది మిగతా సిన్మా. నిజానికి, సావిత్రి అనే పేరు చూసి పూర్తి లేడీ ఓరియంటెడ్ సిన్మా అనుకోకూడదు. కథానాయిక లైఫ్ చుట్టూ కథ తిరిగినా, కథని నడిపేది చుట్టూ ఉన్న పాత్రలు, పరిస్థితులే. ఆరంభమైన కాసేపటికే హిందీ ‘చెన్నై ఎక్స్ప్రెస్’, మన తెలుగు ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ లాంటివన్నీ గుర్తుకు వస్తాయి. అయితే, ఆ పోలికలు ఫస్టాఫ్తో సరి. అక్కడ నుంచి కథ మరోలా ముందుకెళుతుంది. కొన్నిచోట్ల పలువురు యువ హీరోల శైలిని తలపించారు రోహిత్. హీరో బాలకృష్ణ ప్రస్తావన, పాటల వాడకం లాంటి ఫ్యాన్స మెచ్చే ట్రిక్కులూ వాడారు. పనిలో పనిగా నటన, దేహం మీదా దృష్టి పెట్టాలని ఫ్యాన్స భావిస్తారు. నందిత తదితర నటులు, డైలాగ్లు, కెమేరా విభాగాల వారు అక్కడక్కడ మెరుస్తారు. వినోదం బాగున్నా, హీరోయిన్కీ, ఆమె పెళ్ళికీ మరింత బలమైన ప్రతికూల స్థితులుంటే ఇంకా బాగుండేది. వెరసి, ప్రేమకథగా మొదలై చివరికి ఆడపిల్ల మనసు తెలుసుకోని పెంపకం దగ్గర కుటుంబకథగా ‘సావిత్రి’ ఆగుతుంది. -
తుంగభద్ర నదిలో ప్రమాదం ఇద్దరి మృతి
కర్నూలు జిల్లా సి.బెలగళ్ మండలం ఎర్లదిన్నె వద్ద తుంగభద్ర నదిలో మునిగి తల్లీ కుమార్తెలు మృతి చెందారు. ఉరుకుణ్ణమ్మ (26) తన కుమార్తెలు నందిని (6), నాగేశ్వరి(8)తో కలసి తుంగభద్ర నదిలో చేపల సేకరణకు గాను తెప్పపై వెళ్లింది. దానికి రంధ్రం ఏర్పడి లోపలికి నీరు చేరడంతో అది మునిగిపోయింది. ఉరుకుణ్ణమ్మ, నందిని నీళ్లలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందగా... నాగేశ్వరి మాత్రం ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకుంది. -
నల్లగొండలో సూది సైకో కలకలం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నాలుగు రోజులుగా సూది సైకో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తున్న ఓ బాలికపై గుర్తు తెలియని వ్యక్తి సూదితో దాడి చేశాడు. వివరాలు..స్థానిక సెంట్ ఆల్ఫోన్స్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదివే నందిని నడిచి వెళ్తుండగా బైక్పై వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆమె చేతిపై సూదితో పొడిచి వెళ్లిపోయాడు. దీంతో బాలిక గట్టిక కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. -
ప్రాణస్నేహం
ఆత్మహత్య ఆపడానికి ఒక్క ఫ్రెండూ ఉండడు... కాటికి మోసుకెళ్లడానికి నలుగురు అవసరమా? స్నేహం చెయ్యాల్సింది బాటలో ముళ్లు తీయడానికి... అంతిమయాత్రలో పూలు చల్లడానికి కాదు! స్నేహం నిలబడాల్సింది భారం మోయడానికి... కాయాన్ని మోయడానికి కాదు! స్నేహం కావల్సింది కన్నీటిని తుడవడానికి... నీటి కుండ పగలేయడానికి కాదు! స్నేహం ఉండాల్సింది జీవాగ్ని నింపడానికి... చితికి మంట పెట్టడానికి కాదు! వృథా... వృథా... వృథా... స్నేహం వృథా... ఫ్రెండ్ ప్రాణం కాపాడలేని స్నేహం వ్యథ! ఏడవకండి... ఏడుస్తూ కూర్చోకండి. మీ స్నేహంలో దమ్ముంటే... స్నేహం ప్రాణాన్ని నిలబెట్టండి. ఆత్మీయ స్నేహితుల్లారా... ఆత్మహత్యల్ని ఆపండి. ఎదుటి వారి మాటలను మనం ఎప్పుడైనా వింటున్నామా..? కనీసం ‘ప్రాణ’స్నేహితుల్ల మాటలను మనసుపెట్టి ఆలకిస్తున్నామా..? గజి‘బిజీ‘ జీవితాలతో గిడసబారిపోయి, మనం వినే అలవాటును ఎప్పుడో పోగొట్టుకున్నాం. బతుకుపోరు సాగించలేని ప్రాణస్నేహితులు... జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసేసుకున్నాక... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిండు జీవితమే ముగిసిపోయాక వగచి విలపిస్తున్నాం. అలా కాకుండా, నిరాశలో కూరుకుపోయిన మిత్రుల మాటలను కాస్త ఓపికగా విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగేవా? ఒక రవళి, ఒక రిషితేశ్వరి, ఒక నందిని, ఒక మనీషా... ఇంకా ఇలాంటి చాలామంది...అర్ధంతరంగా తమ బతుకుకు చరమగీతం పాడేవారా..? మొన్న కడప నారాయణ కాలేజీలో నందిని, మనీషాలు, అటుమొన్న గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, నిన్న నెల్లూరు డిగ్రీ కాలేజీలో రవళి... ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు... ఈ ఏడాది ఇప్పటివరకు మనకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో పదిహేను మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పదకొండు మంది ఒక విద్యాసంస్థకు చెందిన కాలేజీల్లోని విద్యార్థులే! తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక... ఒకవేళ చెప్పుకుందామని ఆశగా ప్రయత్నించినా, వినేవాళ్లు ఎవరూ లేక... ఒంటరిపక్షుల్లా అల్లాడి అల్లాడి... చాలామంది నిరాశలో కూరుకుపోయి, అర్ధంతరంగా తమ జీవితాలను ముగించేసుకుంటున్నారు. అనర్థాలు జరిగిపోయాక అందరూ తీరికగా ఆవేదన చెందుతున్నారు. మిత్రుల బలవన్మరణాలను జీర్ణించుకోలేక. ఆవేశంతో బంద్లు, రాస్తారోకోలు చేస్తున్నారు. మిత్రుల మరణాలను మరవలేకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయతతో కాలగమనంలో పడి కొట్టుకుపోతున్నారు. మనసుపెట్టి గమనించండి ‘ప్రాణ’స్నేహితులుగా ఉండేవారు మనసుపెట్టి గమనిస్తే, తమ స్నేహితుల్లోని ఆత్మహత్యా ధోరణులను ముందుగానే కనిపెట్టి జాగ్రత్తపడవచ్చు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయిన వారు, ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మనోవేదనను అనుభవించేవారు, ర్యాగింగ్ వంటి వేధింపుల కారణంగా మనస్తాపం చెందిన వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. వాళ్లలో కొందరు ఇదివరకు ఆత్మహత్యకు విఫలయత్నాలు చేసిన వారూ ఉండే ఉంటారు. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక ఒంటరిగా కుమిలిపోతున్న వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ల పట్ల కాస్త శ్రద్ధపెట్టండి. ఒంటరిగా మిగిలిపోయామని భావించి, బాధపడుతున్న వారికి ఆసరాగా ఉన్నామంటూ భరోసా ఇవ్వండి. వాళ్లు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. బతుకుపోరులో తోడుగా మేమున్నామంటూ వారికి ధైర్యం చెప్పి, వాళ్లకు బతుకు మీద ఆశ కల్పించండి. ఈ కాస్త మిత్రధర్మాన్ని పాటించినట్లయితే, మీరు మీ మిత్రుల నిండుప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. మీ మిత్రుల్లో డేంజర్ సిగ్నల్స్ ఏవి కనిపించినా, వెంటనే అలెర్ట్ కావాల్సిందే. అలాంటి మిత్రుల వద్ద ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారి మనసు మళ్లించడానికి, ధైర్యం చెప్పడానికి మీ వంతు ప్రయత్నాలు చేయడంతో పాటు, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, వారికి నిపుణుల సలహా సూచనలు అందేలా సాయం చేయడం మీ మిత్రధర్మంగా గుర్తెరగండి. అవసరమైతే ఢిల్లీలోని సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్లైన్- 88888 17666, హైదరాబాద్లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థ 040-27848584, 66202000. ముంబైలోని ఆస్రా స్వచ్ఛంద సంస్థ 91-22-27546669 నంబర్లకు సంప్రదించి, సలహా సూచనలు కోరండి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: మోపూరు బాలకృష్ణారెడ్డి, సాక్షి, కడప పోలు అశోక్ కుమార్, సాక్షి, నెల్లూరు, సాక్షి ఇవీ... డేంజర్ సిగ్నల్స్ ఆత్మహత్యలకు సిద్ధపడే వారు ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. వాటిని గుర్తించి, సకాలంలో అలర్ట్ అయితే చాలు... నిండుప్రాణాలు బలికాకుండా కాపాడుకోవచ్చు. అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న ప్రకారం ఆత్మహత్యలకు సిద్ధపడేవారు ఇచ్చే కొన్ని ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్... తిండి, నిద్ర అలవాట్లలో విపరీతమైన మార్పులు కనపరుస్తారు. నిత్యం ఉల్లాసంగా ఉండేవారు అకస్మాత్తుగా ముభావంగా మారిపోతారు. లేదంటే, ఎప్పుడు మౌనంగా ఉండేవారు హఠాత్తుగా ఉత్సాహం ఉరకలేస్తూ కనిపిస్తారు. మిత్రులకు, కుటుంబ సభ్యులకు దూరదూరంగా ఉంటారు. కొందరు హింసాత్మక ధోరణిని కూడా ప్రదర్శిస్తారు. ఏకాగ్రత లోపంతో కనిపిస్తారు. తరచు కడుపునొప్పి, తలనొప్పి, అలసటగా ఉన్నట్లు చెబుతారు. కత్తి, బ్లేడు, తాడు, విషం, నిద్రమాత్రలు... వంటి ఆత్మహత్యా సాధనాల గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆత్మహత్యా పద్ధతుల గురించి చదవడం వంటివి చేస్తుంటారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధగా ఉంటారు. ఏ పని మీదా ఆసక్తి చూపరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉంటారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడరు.అపరాధ భావనలో ఉంటారు. ‘నాకు బతికే అర్హత లేదు’, ‘నన్ను పట్టించుకునే వారే లేరు’, ‘ఈ జీవితంతో విసిగిపోయాను’... అంటూ నిరాశాపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడే వెళ్లి ఉంటే... రవళిది, మాది ఒకే ఊరు. ఒకే రూమ్లో ఉండేవాళ్లం. ఇద్దరం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాం. ‘హాస్టల్లో ఉండలేకపోతున్నాను. మా నాన్నకు ఫోన్చేసి రమ్మంటాను. రాగానే ఇంటికి వెళ్లిపోతాను’ అని చెప్పింది. బట్టలు కూడా బ్యాగులో సర్దుకుంది. గురువారం ఎప్పట్లాగే క్లాసుకు బయల్దేరాం. కిందకు రాగానే ‘నోట్స్ మర్చిపోయాను’ అంటూ తన బుక్స్ నా చేతికిచ్చి, మేడమీద గదిలోకి వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో మేం క్లాస్కు బయల్దేరాం. రవళి బుక్స్ను ఆమె క్లాస్రూమ్లో ఇచ్చి వెళ్లాం. కొంతసేపటి తర్వాత రవళి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అప్పుడే అనుమానించి, మేమూ రూమ్కి వెళ్లి ఉంటే ఆమె బతికేదనిపిస్తోంది. - ఎర్రబల్లి గంగాభవాని, రాపూరు మండలం,పెనుబర్తి, నెల్లూరు తెలుసుకోలేకపోయాం... మేమిద్దరం ఒకే ఊరు వాళ్లం. దాంతో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. నేను డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఒకే హాస్టల్లో ఉండటంతో నాతో చనువుగానే ఉండేది. అయితే, తన కష్టమేంటో ఎప్పుడూ చెప్పేది కాదు. నేనూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తను మా మధ్య లేదంటే బాధగా ఉంది. - మాదమాల శ్రీలక్ష్మి, రాపూరు మండలం, పెనుబర్తి మంచి స్నేహితులు... మాకు ఇక్కడ మార్కులు ఆధారంగా సెక్షన్స్ కేటాయిస్తారు. తక్కువ మార్కులు వస్తే అటు పేరెంట్స్ నుంచి, ఇటు కాలేజీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అప్పటి వరకూ మేం మా పేరెంట్స్ వద్దే పెరిగి ఒక్కసారిగా హాస్టల్ పరిస్థితులకు అలవాటు కావడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో త్వరగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాం. అదే విషయాన్ని కొన్ని సార్లు మనీషా, నందిని మాటల్లోనూ దొర్లాయి. మేమంత సీరియస్ తీసుకోలేదు. మంచి స్నేహితులు దూరమైపోయారు. - జి.గీతారెడ్డి, ద్వితీయ సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఊహించలేదు.. మనీషా, నందిని ఇద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా హుషారుగా ఉండేవారు. హాస్టల్లోని మిగతావారితోనూ బాగా మాట్లాడేవారు. అలాంటి వారు ఒక్కసారిగా చనిపోయారంటే చాలా భయపడ్డాం. కళాశాలలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువే. బాగా ఒత్తిడి ఉంటుంది. అమ్మనాన్నలు ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ ఒత్తిడి గురించి మా మాటల్లో దొర్లినా ఇదంతా మామూలేకదా అనుకున్నాం. కానీ, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. - పి.శివబిందు, మొదటి సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఒక్క ఆత్మహత్య ఆపడానికి ఎంతోమంది స్నేహితులు కావాలి. ఉన్న స్నేహితులే కాదు... తల్లిదండ్రులూ స్నేహితులు కావాలి. గురువులూ స్నేహితులు కావాలి.ఇరుగు పొరుగు వారూ స్నేహితులు కావాలి. నాయకుడనేవాడూ స్నేహితుడు కావాలి. కాపాడగలవారందరూ స్నేహితులు కావాలి. అప్పుడే ఈ ఆత్మహత్యల్ని ఆపగలుగుతాం. కడపలో ఆత్మహత్య చేసుకున్న కాలేజీ స్టూడెంట్ (మనీషా) తల్లిని ఓదార్చుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి (ఫైల్ఫొటో) -
నందిని, మనీషాల మృతిపై న్యాయ విచారణ జరపాలి
కడప ఎడ్యుకేషన్ : నారాయణ కళాశాలలో ఈనెల 17న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు నందిని, మనీషాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై న్యాయ విచారణ నిర్వహించాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కడపలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సంధ్యా సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ హరితా హోటల్ వరకు సాగింది. అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు అలూరు ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ.. నందిని, మనీషాలవి ముమ్మాటికి హత్యలేనన్నారు. ఇందుకు కారణమైన కళాశాల సిబ్బంది, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అనుమతులను రద్దు చేయాలని కోరారు. మరణించిన విద్యార్థుల ఇళ్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లి.. దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు తిష్ట వేయడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు నిత్య పూజయ్య, నాగార్జున రెడ్డి, మాసిన్, పెంచలయ్య, సందీప్, అబ్బాస్, సలావుద్ధీన్, సోహెల్, వెంకటేష్ పాల్గొన్నారు. -
త్రిసభ్య కమిటీకి వినతులు
కడప ఎడ్యుకేషన్: ఈనెల 17వ తేదీన నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన నందిని, మనీషారెడ్డిల మృతిపై విచారణ చేపట్టి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం రాష్ట్ర అతిథి గృహంలో ఉన్న త్రిసభ్య కమిటి సభ్యులకు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, ఎస్ఎఫ్ఐ, ఐఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. విద్యార్థులు మృతి చెందిన రోజు కళాశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. త్రిసభ్య కమిటి సభ్యులను కలిసిన వారిలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిలా అధ్యక్షుడు అలూరు ఖాజీ ర హ్మతుల్లా, ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి. పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి అంకన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ ఉన్నారు. -
'నా కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి'
కడప : తన కుమార్తె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని నందిని తండ్రి సుబ్బారావు వ్యాఖ్యానించారు. నందిని కాళ్లకి, మంచానికి జానెడు తేడా లేకుండా ఆత్మహత్య ఎలా జరుగుతుందని ఆయన బుధవారమిక్కడ ప్రశ్నించారు. 'ఆత్మహత్య చేసుకునే సమయంలో పెనుగులాట జరిగి ఉంటే ఆమె కళ్లజోడు కిందపడేది కదా?, ఇంతవరకూ కనీసం మాతో కళాశాల యాజమాన్యం మాట్లాడలేదు? నా కూతురికి జరిగిన అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదన్నదే నా ఆవేదన' అని సుబ్బారావు కన్నీటిపర్యంతమయ్యారు. కడప శివారులోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని నందిని సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా కడపలో ఆర్యవైశ్య సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది. నారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం డిమాండ్ చేసింది. -
మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కడప నారాయణ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడంపై ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఒత్తిడిని తట్టుకోలేక నందిని, మనీషా ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇందుకు మంత్రి నారాయణను బాధ్యుడిని చేసి మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆనంద్, ఏబీవీపీ నగర కార్యదర్శి భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్ఎంకే ప్లాజాలోని నారాయణ కళాశాల ఎదట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కళాశాలలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ..ప్రైవేట్ కళాశాలల్లో మార్కుల కోసం విద్యార్థులను యంత్రాలుగా మార్చి మానసిక ప్రశాంతతను యాజమన్యాలు హరిస్తున్నాయని ఆరోపించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో.. సోమా ఆర్కేడ్లోని నారాయణ కళాశాల(గర్ల్స్) ఎదుట ఏబీవీపీ నగర కమిటీ అధ్యక్షుడు భరత్కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి నారాయణనను అడ్డుపెట్టుకొని విద్యావ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కడప ఘటన లో ఇద్దరు విద్యార్థులు చనిపోతే ఇంతవర కు ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం దా రుణమన్నారు. రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ కరువైందని, రిషితేశ్వరి ఘటన మ రువక ముందే నందని, మనిషా ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర ఆవేదన కలిగిం చిందన్నారు. కార్యక్రమంలో నాయకులు శివ, సుమన్, భరత్, సురేష్నాయక్, మహేష్, ప్రశాంత్, అంజి, భాస్కర్ పాల్గొన్నారు. నేడు విద్యాసంస్థల బంద్ కడప నారాయణ కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన నందిని, మనిషా ఘటనకు నిరసనగా బుధవారం ఏబీవీపీ, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, పీడీఎస్యూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. -
మిన్నంటిన ఆందోళనలు
అనంతపురం ఎడ్యుకేషన్ : వైఎస్ఆర్ జిల్లా కడప నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు నందిని, మనీషారెడ్డి ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యం వేధింపులేనని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రాస్తారొకోలు, ధర్నాలు, మంత్రి నారాయణ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఏఐఎస్ఎఫ్ నగర కమిటీ ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్లో నారాయణ విద్యా సంస్థల యాజమాన్య దిష్టిబొమ్మను దహనం చేశారు. విదార్థినుల మృతిపై న్యాయ విచారణ జరిపేందుకు మంత్రి కళాశాల కావడంతో అధికారులు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రమణ, కుళ్లాయప్ప, పవన్, కుళ్లాయిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఓవర్బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కేవై ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థినిల ఆత్మహత్యలపై సిట్టింగ్జడ్జితో న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గాదిలింగ, చాంద్బాషా, సంతోష్, మున్నా తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నగరంలోని నారాయణ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాల యాజమాన్య వేధింపులు కారణంగానే విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మ దహనం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్థానిక క్లాక్టవర్ వద్ద మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే కళాశాలల్లో ఎంతటి వేధింపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కోకన్వీనర్ వీరాంజనేయులు, నాయకులు హరికృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినుల ఆత్మహత్యకు నిరసనగా బుధవారం రాయలసీమ వ్యాప్తంగా కార్పొరేట్ జూనియర్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గోపి ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి కూడా నేడు విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిచ్చారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరుణకుమార్ డిమాండ్ చేశారు. మంత్రిని పదవి నుంచి తప్పించి నారాయణ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేడు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు. గుంతకల్లు, కదిరి, ఉరవకొండ, హిందూపురంలలో సైతం విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. -
మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
విద్యార్థి సంఘాల డిమాండ్ నేడు విద్యాసంస్థల బంద్కు పిలుపు కడప/కర్నూలు/అనంతపురం/తిరుచానూరు: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని నారాయణ జూనియర్ కళాశాలలో మనీషా, నందిని ఆత్మహత్య ఘటనలో మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పలు విద్యాసంఘాలు ఆందోళన చేపట్టాయి. వైఎస్సార్ జిల్లాలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్, ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. కడపలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నారాయణను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సంఘీభావం నిబంధనలకు విరుద్ధంగా కళాశాలల్ని నడుపుతున్న ప్రైవేటు కాలేజీల తీరుకు నిరసనగా ఈ నెల 19వ తేదీన ఏఐఎస్ఎఫ్ (అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్) పిలుపు నిచ్చిన విద్యా సంస్థల రాష్ట్ర బంద్కు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సంఘీభావం ప్రకటించింది. వైఎస్సార్ కడప జిల్లాలోని నారాయణ కళాశాల హాస్టల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడం సహా గత ఏడాది కాలంలో నారాయణ సంస్థల్లో పదుల సంఖ్యలో సంభవించిన మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని విద్యార్థి విభాగం అధ్యక్షుడు షేక్ సలాంబాబు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని విమర్శించారు. విద్యార్థుల మరణాలకు ఎవరు కారకులో తేల్చాలని కోరారు. తాము బంద్కు మద్ధతిస్తున్నట్లు ప్రకటించారు. -
ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య
అధ్యాపకుల వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ కడప అర్బన్/చింతకొమ్మదిన్నె : వైఎస్సార్ జిల్లా కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఉన్న నారాయణ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదవుతున్న ఇద్దరు విద్యార్థినిలు సోమవారం సాయంత్రం ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కడప నగరం ఓం శాంతినగర్కు చెందిన మాలేపాడు సుబ్బారావు కుమార్తె నందిని(16), సిద్దవటం మండలం భాకరాపేట లెవెన్త్ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చవ్వా బాలకృష్ణారెడ్డి కుమార్తె మనీషా(16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన వీరుఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో చేరారు. ఇదే క్యాంపస్లో హాస్టల్లో ఉంటూ 103వ గదిలో కలసి ఉంటున్నారు. సాయంత్రం 4 గంటలకు టీ బ్రేక్ తరువాత హాస్టల్ గదిలోకి వెళ్లారు. కొంత సేపటి తర్వాత ఇతర విద్యార్థినులు వెళ్లి చూసే సరికి ఉరి వేసుకుని కనిపించారు. కళాశాల సిబ్బంది వచ్చి చూసే సరికే మృతి చెందారు. మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని అధ్యాపకుల వేధించడంవల్లే మనీషా, నందిని ఆత్మహత్యకు పాల్పడ్డారిని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కళాశాల ఫర్నీచర్ ధ్వంసం: కాలేజీలో విద్యార్థినుల ఆత్మహత్యలకు యాజమాన్యం, అధ్యాపకుల వేధింపులే కారణమని మృతుల బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలలో ఫర్నీచర్, ద్వారం, కిటీకీల అద్దాలు ధ్వంసం చేశారు. -
గ్రహణంతో అదృష్టం
కాలం కలసి రాకపోతే గ్రహణం పట్టిందంటారు. అలాంటి గ్రహణమే అదృష్టం నందిని వరించింది. అర్థం కాలేదా? గ్రహణం చిత్రం ద్వారా ఈ బ్యూటీ కథానాయికగా కోలీవుడ్కు పరిచయం అవుతోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ నిర్మిస్తున్న తాజా చిత్రాలలో గ్రహణం ఒకటి. నవ దర్శకుడు ఇళన్ పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కష్ణ, చంద్రన్ హీరోలుగా నటిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి బిగ్ ప్రింట్ సంస్థ అధినేతలు శోభన్బాబు, కార్తీక్ సహా భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి నందిని పంచుకుంటూ 2010లో అందాల ఫోటోలో మిస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని గెలుచుకున్నాను. ఆ తరువాత పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాను. అలా తెలుగులో మాయ చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేశాను. దాంతో కన్నడంలో పిలుపొచ్చింది. అక్కడ ఖుషి ఖుషియాణి చిత్రం చేశాను. అడిషన్ ద్వారా ఈ గ్రహణం చిత్రానికి హీరోయిన్గా ఎంపికయ్యాను. నటనలో, సంభాషణల ఉచ్చారణలో చాలా రిహార్సిల్స్ చేసి షూటింగ్ సిద్ధం అయ్యాను. ఇది నాకు సరికొత్త అనుభవం. చిత్రంలో తన కలను నెరవేర్చుకోవడానికి తపన పడే యువతి స్వేత పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. ఇళన్నూతన దర్శకుడైనా చాలా క్లారిటీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు హీరోలకు ధీటుగా నా పాత్ర ఉంటుంది. హీరో కృష్ణ చాలా జాలీ టైప్. షూటింగ్ స్పాట్లో జోకులతో నవ్విస్తూ అందరూ సరదాగా ఉండాలనే లక్ష్యం ఆయన ప్రవర్తన ఉంటుంది. గ్రహణం చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. -
కాపురానికి పంపలేదని కత్తితో దాడి
గుంతకల్ (అనంతపురం): భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన ముగ్గురు బావమరదులపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లోని హనుమేష్నగర్లో మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్ అయిన ధనుంజయ్ స్థానికంగా పోర్టర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య నందిని ఆరు నెలల గర్భిణి. ఆమె మూడు రోజుల క్రితం పట్టణంలోని హనుమేష్నగర్లో తన పుట్టింటికి వెళ్లింది. భార్యను వెంటనే కాపురానికి పంపించాలని ధనుంజయ్ ఫోన్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులను కోరాడు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, కుదుటపడిన తర్వాత పంపిస్తామని చెప్పారు. ఈ క్రమంలో బావకు సర్ది చెబుదామని నందిని సోదరులు గణేశ్, అనిల్, రాజా మంగళవారం సాయంత్రం ధనుంజయ్ ఇంటికి వెళ్లారు. కోపంతో ధనుంజయ్ కత్తితో వారిపై దాడి చేశాడు. గాయపడిన ముగ్గురినీ కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రత్రికి తరలించారు. వీరిలో గణేశ్, రాజా పరిస్థితి విషమంగా ఉంది. -
పేదింట పూసిన విద్యాకుసుమాలు
♦ పిల్లలిద్దరికీ ట్రిపుల్ ఐటీలో సీటు ♦ గతేడాది ఒకరికి.. ఈ యేడాది మరొకరికి ♦ ఆనందంలో తల్లిదండ్రులు కామారెడ్డి : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. వారికి ఇద్దరు పిల్లలు. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇద్దరు పిల్లల్ని జెడ్పీహెచ్ఎస్ గంజ్ ఉన్నత పాఠశాలలో చదివించారు. పిల్లలిద్దరూ కష్టపడి చదివారు. గత యేడాది వారి కూతురు ట్రిపుల్ ఐటీకి ఎంపికైతే, ఈ యేడాది కొడుకు ఎంపికై నేనేం తక్కువ కాదని నిరూపించాడు. ఇంకేముంది, ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోరుుంది. పిట్లంకు చెందిన జంపగల్ల నగేశ్, అన్నపూర్ణ దంపతులు ఇరువై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కామారెడ్డి పట్టణానికి వ చ్చారు. ఇద్దరూ చెరో పనిచేసుకుంటూ పిల్లలిద్దరిని పోషిస్తున్నారు. చేసిన పనికి వచ్చే కూలీ డబ్బులు తిండికే సరిపోతుండడంతో ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకుండా పోరుుంది. కానీ, వారి నమ్మకాన్ని పిల్లలు వమ్ము చేయలేదు. కష్టపడి చదివారు ఇద్దరూ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు. ‘తమ కష్టాన్ని పిల్లలు గుర్తించి తగిన ఫలితం ఇచ్చారని’ చెమర్చిన కళ్లతో నగేశ్, అన్నపూర్ణ దంపతులిద్దరూ ‘సాక్షి’తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. పిల్లలే మా వెలుగు... మా ఇద్దరికీ చదువు రాదు. పిల్లలను సర్కారు బడిలో చది వించాం. పిల్లలిద్దరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు. ఇద్దరూ ట్రిపుల్ ఐటీకి ఎంపికవడం ఆనందం గా ఉంది. మా బావమర్ది చంద్రకాంత్ పిల్లలను ఎంతగానో ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు కూడా ఎంతో సహకా రం అందించారు. పిల్లలే మాకు వెలుగు. నగేశ్,అన్నపూర్ణ, తల్లితండ్రులు నాకు తోడుగా తమ్ముడు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన నాకు ఇప్పుడు తమ్ముడు తోడయ్యాడు. ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరం మంచిగా చదువుకుని అమ్మానాన్నకు మంచి పేరు తీసుకొస్తాం. వాళ్లు పడే కష్టం రోజూ చూసి కష్టపడి చదివాం. నందిని, కూతురు ఉపాధ్యాయులు ప్రోత్సాహించారు పదో తరగతిలో 9.7 జీపీఏ రావడానికి మా సార్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మా, నాన్నతో పాటు మామయ్య ప్రోత్సహించారు. మంచి చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటాం. నితీష్, కుమారుడు -
’మోసగాళ్ళకు మోసగాడు’టీంతో చిట్చాట్
-
అనుష్క శర్మలా ఉన్నానట!
‘‘నన్ను చూసి చాలామంది ప్రముఖ హిందీ కథానాయిక అనుష్క శర్మలా ఉన్నానని అంటుంటారు. అంత పెద్ద నటితో పోల్చడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది’’ అని నందిని అన్నారు. సుధీర్బాబు, నందిని జంటగా లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. బోస్ నెల్లూరి దర్శకుడు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ -‘‘చిన్నప్పుడు మా స్కూల్ కార్యక్రమానికి సౌందర్యగారు వచ్చారు. ఆవిడని చూసి ఎలాగైనా హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నా. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్లోనే. ఎం.బీ.ఏ చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్గా, 2011లో మిస్ ప్రెట్టీ ఐస్గా సెలెక్ట్ అయ్యా. మొదట నీలకంఠగారి దర్శకత్వంలో ‘మాయ’ చిత్రంలో నటించాను. కన్నడంలో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ రీమేక్లో కూడా చేశాను. ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’లో నాయికగా ఎంపికయ్యా. ఈ సినిమాలో నా పాత్ర పేరు జానకి. చాలా అమాయకంగా ఉంటుంది. నా పాత్రకు సముచిత ప్రాధాన్యం ఉంది. నాకు నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే గ్లామర్ మన ఎక్స్ప్రెషన్స్లో ఉండాలి కానీ దుస్తుల్లో ఉండదని నా ఫీలింగ్. ప్రస్తుతం తమిళంలో పీవీపీ పతాకంపై ‘గ్రహణం’ అనే సినిమాలో నటిస్తున్నాను. ఇంకా తమిళంలో మరో రెండు, మూడు సినిమా ఆఫర్లు రెడీ గా ఉన్నాయి. అందుకే ఇప్పుడిప్పుడే తమిళం కూడా నేర్చుకుంటున్నా’’ అని చెప్పారు. -
'మోసగాళ్లకు మోసగాడు' ఆడియో ఆవిష్కరణ
-
కమర్షియల్ మోసగాడు
నిఖిల్ నటించిన ‘స్వామిరారా’ చిత్రం క్రైమ్ కామెడీ చిత్రాల్లో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమాకు సీక్వెల్గా ‘మోసగాళ్లకు మోసగాడు’ రూపొందుతోంది. సుధీర్ బాబు, నందిని జంటగా లక్ష్మీనరసింహ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై బోస్ నె ల్లూరి దర్శకత్వంలో, చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సూపర్స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ నెల 26న పాటలను, వచ్చే నెల 7న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసాద్ వర్మ, సమర్పణ: శంకర్ చిగురుపాటి, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న. -
పాల ధరల యుద్ధం
-
ఆ ఇంట ఆనందిని
పరిగి, కుల్కచర్ల: బోరుబావిలో పడిన బాలిక క్షేమంగా బయటపడింది. బావిలోని ఓ రాయి ఆ చిన్నారి ప్రాణం నిలిపింది. బోరుబావిలో 10 ఫీట్ల లోతులో ఉన్న రాయి చిన్నారిని మరింత కిందకు జారకుండా ఆపింది. దీంతో సహాయక చర్యలు వేగంగా చేపట్టి జిల్లా యంత్రాంగం నందిని అలియాస్ అంజలిని(6) ప్రాణాలతో కాపాడగలిగింది. మంగళవారం సాయంత్రం జిల్లాలో సంచలనం రేపిన ఈ సంఘటన చివరకు సుఖాంతమైంది. మహబూబ్నగర్ జిల్లా కోస్గీ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్, బుజ్జిబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆ నలుగురిలో నందిని(6) వారికి చివరి సంతానం. బతుకుదెరువు కోసం లక్ష్మణ్ దుబాయికి బుజ్జిబాయి పూణె వలస వెళ్లారు. అయితే కుమారులు పెద్దవాళ్లు కావడంతో ముదిరెడ్డిపల్లి తండాలోనే ఉంటూ చదువుకుంటున్నారు. ఇక ఇద్దరు కుమార్తెలు చిన్నవారు కావడంతో వారిని గోవిందుపల్లిలోని తన తల్లిగారింట వదిలి బుజ్జిబాయి వలస వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం అమ్మమ్మ సీతాబాయి, తాత భోజ్యానాయక్లు తండా సమీపంలోని పొలంలో పనికి వెళ్లగా నందిని(6) కూడా వారితోపాటే వెళ్లింది. అప్పటివరకు అక్కడ ఆడుకున్న బాలిక సాయంత్రం సమయంలో కనిపించలేదు. ఇంటికి వెళ్లి ఉండవచ్చని ఊహించి వారిద్దరూ తండాకు వచ్చారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడ చిన్నారి జాడ లేకపోవడంతో ఆందోళనకు గురైన వృద్ధులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుక్కుంటూ మళ్లీ పొలానికి వెళ్లారు. పొలంలో ఉన్న బోరుబావిలో శబ్దాలు వినిపించగా అందులో పరిశీలించారు. ఆ బావి నుంచి మరింత స్పష్టంగా నందిని ఏడుపు వినిపిస్తుండటంతో చిన్నారి అందులో పడిపోయిందని స్పష్టమైంది. రెండున్నర గంటలపాటు సహాయక చర్యలు చిన్నారి బావిలో చిక్కుకున్న వార్త మీడియాకు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చిన్నారి ప్రాణాలకు కోసం ప్రార్థించారు. కొన్ని రోజుల క్రితం మంచాలలో జరిగిన బోరుబావి ఘటన మరవక ముందే జిల్లాలో మరో ఘటన చోటు చేసుకోవడం జిల్లా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గతంలో మంచాలలో కొన్ని రోజులపాటు సాగిన సహాయక చర్యల్లో చివరికి చిన్నారిని ప్రాణాలతో కాపడలేకపోయారు. ఇక ఇక్కడ కూడా ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జిల్లావాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే బావిని గతంలో పూడ్చడానికి యత్నించినా పని పూర్తి చేయలేదు. ఇక బోరుబావిలో పది ఫీట్ల కింద ఉన్న రాయి చిన్నారి మరింత లోతుకు జారకుండా అడ్డుకుంది. చిన్నారి బోరుబావిలో పడిందన్న విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ రాములు హుటాహుటినా పోలీసులకు, 108కు సమాచారం అందించారు. ఇక రాత్రి 7 గంటల వరకు జేసీబీ, పోలీసులు, 108 వాహనం ఘటనా స్థలానికి చేరకున్నాయి. 108 సిబ్బంది బోరుబావిలో చిన్నారికి ఆక్సిజన్ అందించగా జేసీబీ బోరుబావికి సమాంతరంగా తవ్వకం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బోరుబావి నుంచి చిన్నారిని విజయవంతంగా బయటకు తీశారు. అయితే చిన్నారి ప్రాణాలకు ఎలాంటి అపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే చిన్నారిని 108లో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
ఈ చిన్నారిని కాపాడరూ!
మామిడిగుడ్డి(మెళియాపుట్టి) :తోటి చిన్నారులతో ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ చదువుకుంటున్న ఆ చిన్నారిపై విధి చిన్నచూపు చూసింది. క్యాన్సర్ వ్యాధి సోకడంతో మంచంపట్టి కనీసం కదలలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. తమ బిడ్డను ఏ దేవుడైనా కరుణించకపోతాడా అని ఆ తల్లిదండ్రులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వివరాలివీ.. మామిడిగుడ్డి గ్రామానికి చెందిన మూడో తరగతి చదువుతున్న జన్ని నందిని(8) ఈ ఏడాది సెప్టెంబర్ లో అనారోగ్యానికి గురైంది. అంతకుముందు ఎడమ కంటికి చిన్న గాయం కాగా, ఆ తర్వాత నుంచి కన్ను బయటకు ఉబ్బెత్తుగా వస్తూ అనారోగ్యం పాలైంది. తలిదండ్రులు లక్ష్మి, వెంకటస్వామి ఆ చిన్నారిని శ్రీకాకుళం, విశాఖలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఐటీడీఏ సాయంతో విశాఖపట్నం కేజీహెచ్లో చేర్పించారు. కొద్దిరోజులు బాలికకు వైద్య పరీక్షలు చేయించిన వైద్యులు చివరికి క్యాన్సర్ వ్యాధి సోకినట్లు ధ్రువీకరించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. అంత ఆర్థిక స్థోమతలేని ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేశారు. కుమార్తెకు వైద్యం చేయించుకోలేని దుస్థితిని తలుచుకుని రోజూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం నందిని ఆరోగ్యం రోజురోజూకూ క్షీణిస్తోంది. ఆహారంగా కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటోంది. తమ కుమార్తెకు హైదారాబాద్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తే తప్ప బతికే అవకాశం లేదని కంటి తడిపెడుతున్నారు. దాతలు, ఐటీడీఏ సహకరించి తన కుమార్తెకు మెరుగైన వైద్యం అందించాలని వారు వేడుకుంటున్నారు. కాగా, చిన్నారి నందినికి మెరుగైన వైద్యం అందించేలా ఆర్వీఎం చర్యలు చేపట్టాలని సోమవారం జరిగిన ఎస్ఎంసీ సమావేశంలో తీర్మానించినట్లు జీపీఎస్ పాఠశాల హెచ్ఎం ఎస్.రామారావు తెలిపారు. -
ప్రేమ పేరిట వంచించి ప్రాణం తీశాడు...
* పెళ్లి చేసుకుంటానని మోసం * గర్భిణి అని తెలియడంతో తప్పించుకునే యత్నం * గర్భస్రావం చేసుకుంటేనే పెళ్లంటూ ఒత్తిడి * చివరికి ప్రాణాలు కోల్పోయిన బాలిక విజయవాడ, న్యూస్లైన్ : ప్రేమించానని వెంటబడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు.. తీరా ఆమె ఐదు నెలల గర్భిణి అని తెలియడంతో ముఖం చాటేశాడు. అదేమంటే ముందు గర్భస్రావం చేయించుకో.. అప్పుడు పెళ్లి చేసుకుంటానన్నాడు. దీంతో సరేనని అతనిచ్చిన మాత్రలు మింగిన ఆమె అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయింది. విషాదకరమైన ఈ ఘటనపై పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలివీ... స్థానిక రామరాజ్యనగర్ కొండ ప్రాంతానికి చెందిన బోయి అప్పలస్వామి రిక్షా నడుపుతుండగా, భార్య మణి షాపుల్లో చిన్నపాటి పనులు చేస్తుంది. వీరి కుమార్తె నందిని (17) టైలరింగ్ నేర్చుకొని ఇంటివద్దే ఉంటుండగా.. కుమారుడు దుర్గారెడ్డి (15) పదో తరగతి చదువుతున్నాడు. భార్యాభర్తలు ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటారు. కొడుకు చదువుకునేందుకు వెళ్లి సాయంత్రం వస్తాడు. దీన్ని అవకాశంగా చేసుకుని సమీపంలో నివాసముండే ఆటో డ్రైవరు నెర్సు దుర్గారావు (23) ఆమెను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి కోసం ఒత్తిడి తెస్తుండటంతో తనకు రూ.3 లక్షల కట్నం ఇచ్చేందుకు సంబంధం వచ్చిందని దుర్గారావు చెప్పాడు. ఈ వ్యవహారంలో వారి మధ్య కొద్దిరోజులుగా ఘర్షణ జరుగుతోంది. గర్భస్రావం చేయించుకుంటే.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. వివాదం పెరుగుతుండటంతో ఇక లాభం లేదనుకున్న దుర్గారావు గర్భస్రావం చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని మాటలను మరోసారి విశ్వసించిన నందిని గురువారం రాత్రి దుర్గారావు తెచ్చిన మాత్రలు వేసుకుంది. ఉదయం లేచేసరికే తీవ్ర అస్వస్థతకు లోనైంది. కంగారుపడిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళతామన్నారు. విషయం బయటపడితే కుటుంబ సభ్యులు ఏమంటారోననే ఆందోళనతో ఆమె నిరాకరించింది. దీంతో మందుల షాపులో మాత్రలు తెచ్చిచ్చారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అతను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడినుంచి పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలిపింది. ఆస్పత్రిలో ఆమెను పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భిణిగా తేల్చారు. ఆమెను బతికించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నందిని మృతితో హతాశులైన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకుని వన్టౌన్ పోలీస్స్టేషన్కి వెళ్లి న్యాయం చేయాలంటూ అక్కడే బైఠాయించారు. న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నెలసరి నొప్పి అని సరిపెట్టుకున్నా... అప్పుడప్పుడు కడుపు నొప్పి అనేది. నెలసరి నొప్పేమో అని మందుల షాపు నుంచి బిళ్లలు తెచ్చిచ్చేవాళ్లం. మరీ నొప్పి అంటే ఆస్పత్రికెళదామన్నా ఒప్పుకొనేది కాదు. ముందే చెప్పి ఉంటే ఇంతవరకు రానిచ్చేవాళ్లం కాదు. చెప్పి మమ్మల్ని బాధపెట్టకూడదని.. తాను మాత్రం ప్రాణాలు తీసుకుంది.. అంటూ నందిని తల్లి మణి పడే వేదన చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. వేణ్ణీళ్లెవరు పెడతారు... ఉదయం వెళితే రాత్రికి గాని ఇంటికి రాను. రాగానే ఆప్యాయంగా పలకరించేది. వెంటనే స్నానానికి వేణ్ణీళ్లు పెట్టేది. స్నానం చేసిన తర్వాత ‘కష్టపడి వచ్చావు నాన్నా’ అంటూ ఒళ్లంతా కొబ్బరి నూనె రాసి మర్దనా చేసేది. ఇకపై నాకు వేణ్ణీళ్లు ఎవరు పెడతారంటూ అప్పారావు కన్నీరుమున్నీరుగా రోదించడం పోలీసులను సైతం చలింపజేసింది. -
అనుమానంతో అఘాయిత్యం
ఉప్పల్, న్యూస్లైన్: అనుమానం పెనుభూతమైంది... కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతను పెరోల్పై బయటకు వచ్చి భార్యను అతికిరాతకంగా పొడిచి చంపి పారిపోయాడు. రామంతాపూర్ గాంధీనగర్లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన ఎస్. వీరు (36) చార్మినార్లో ట్రైలరింగ్ పని చేసేవాడు. 12 ఏళ్ల క్రితం అఫ్జల్గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే సంగీతను ప్రేమించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈకేసులో బెయిల్పై బయటకు వచ్చిన వీరు.. తనపై కేసులు ఎత్తేశారని నమ్మబలికి రామంతాపూర్ గాంధీనగర్కు చెందిన బసంతి కూతురు నందిని(30)ను 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ధనుష్ (8) సంతానం. అనంతరం ప్రియరాలి హత్య కేసులో వీరుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్త జైలుకు వెళ్లినప్పటి నుంచి నందిని అమ్మగారి ఇంటిపక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ.. దుస్తుల షాపులో పని చేస్తూ జీవిస్తోంది. ఏడేళ్ల తర్వాత ఈనెల 3న పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చిన వీరు భార్య వద్దే ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన రోజు నుంచి అనుమానంతో ఆమెతో గొడవ పడుతున్నాడు. కుమారుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి.. తన కొడుకును తీసుకుపోతానని పలుమార్లు గొడవపడ్డాడు. ఇదిలా ఉండగా, సోమవారం మధ్యాహ్నం నందిని భోజనం చేస్తుండగా ఇంటికి వచ్చిన వీరు ఆమెతో గొడవకు దిగాడు. అప్పటికే భార్యపై అనుమానం పెంచుకున్న వీరు.. తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపు, ఛాతి, కాళ్లపై విచక్షణారహితంగా పొడిచాడు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న కుమారుడు తల్లిపై దాడిని అడ్డుకోబోగా అతడిని కూడా కత్తితో గాయపర్చి పారిపోయాడు. వెంటనే ధనుష్ పక్కనే ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి.. ఆమెను తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న నందినిని రామంతాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందని హత్యతో గాంధీనగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.