new bikes
-
కళ్లుచెదిరే కొత్త కార్లు.. భళా నయా బైక్లు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (Bharat Mobility Global Expo 2025) కనులపండువగా సాగుతోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025(రెండో ఎడిషన్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఆటోమొబైల్ ఎక్స్ పో వేదికగా పలు కార్లు, టూవీలర్ కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి.హీరో మోటోకార్ప్ నాలుగు కొత్త మోడళ్లు హీరో మోటోకార్ప్ (Hero Motocorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా నాలుగు ద్విచక్ర వాహన మోడళ్లను ఆవిష్కరించింది. ఎక్స్ట్రీమ్ 250ఆర్, ఎక్స్ప్లస్ 210 పేరుతో రెండు మోటార్స్ బైకులు లాంచ్ చేసింది. స్కూటర్ల పోర్ట్ఫోలియోలో ఎక్స్మ్ 125, ఎక్స్మ్ 160 రెండు సరికొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆవిష్కరణలతో ప్రీమియం బ్రాండ్లు ఎక్స్ట్రీం, ఎక్స్ప్లస్లు మరింత బలోపేతమయ్యాయని కంపెనీ సీఈఓ నిరంజన్ తెలిపారు. వీటి బుకింగ్స్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. మార్చి నుంచి డెలీవరి ఉంటుంది. యమహాయమహా (Yamaha) తమ పెవిలియన్లో RX- 100, RD-350 వంటి లెజెండరీ మోటార్సైకిళ్లతోపాటు ప్రీమియం శ్రేణి మొదటి తరం మోడళ్లను ప్రదర్శించింది. ఇందులో ప్రముఖ YZF-R15, మస్కులర్ FZ సిరీస్లు ఉన్నాయి.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ హ్యుండై మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ను (Hyundai CRETA Electric) విడుదల చేసింది. పరిచయ ఆఫర్లో ధర రూ.17.99 లక్షలు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్తో 42 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 390 కిలోమీటర్లు, 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 473 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కియా ఈవీ6 అప్గ్రేడెడ్ వర్షన్ దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా తాజాగా ఈవీ6 అప్గ్రేడెడ్ వర్షన్ను (Kia EV6) పరిచయం చేసింది. 84 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 650 కిలోమీటర్లకుపైగా పరుగెడుతుందని కంపెనీ ప్రకటించింది. 350 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్తో 10 నుంచి 80 శాతం చార్జింగ్ 18 నిముషాల్లో అవుతుంది. ఇప్పటి వరకు ఈ మోడల్కు 77.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ వాడారు. బీఎండబ్ల్యూ మేడిన్ ఇండియా ఈవీ జర్మనీ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ (BMW) భారత్లో తయారైన ఎలక్ట్రిక్ వెహికిల్ ఐఎక్స్1 లాంగ్ వీల్బేస్ ఆల్ ఎలక్ట్రిక్ను విడుదల చేసింది. ధర రూ.49 లక్షలు. 66.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 531 కిలోమీటర్లు పరుగెడుతుంది.మైబహ్ కొత్త ఈవీ మెర్సిడెస్ బెంజ్ భారత్లో లగ్జరీ ఎలక్ట్రిక్ ఈక్యూఎస్ మైబహ్ ఎస్యూవీ (Mercedes-Benz Maybach EQS SUV) 680 నైట్ సిరీస్ను విడుదల చేసింది. ధర రూ.2.63 కోట్లు. గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.4 సెకన్లలో చేరుకుంటుంది. మైబహ్ జీఎల్ఎస్ 600 నైట్ సిరీస్లో కొత్త వేరియంట్ను రూ.3.71 కోట్ల ధరతో ప్రవేశపెట్టింది. అలాగే సీఎల్ఏ క్లాస్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది.టాటా మోటార్స్భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో టాటా మోటార్స్ పలు కొత్త మోడళ్లను ప్రదర్శించింది. వీటిలో హ్యారియర్ ఈవీ, అవిన్యా ఎక్స్ కాన్సెప్ట్, టాటా సియర్రా ఎస్వీ, టాటా ఇంట్రా వాహనాలున్నాయి.టయోటా టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తమ అద్భుతమైన ఉత్పత్తులను, అధునాతన సాంకేతికతలను ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. -
రూ.8.89 లక్షల కొత్త ట్రయంఫ్ బైక్ ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్సైకిల్' (Triumph Motorcycle).. భారతదేశంలో రూ. 8.89 లక్షల (ఎక్స్ షోరూమ్) విలువైన 'స్పీడ్ ట్విన్ 900' (Speed Twin 900) లాంచ్ చేసింది. ఇది దాను మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ అప్డేట్స్ పొందినట్లు తెలుస్తోంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైకులో 900 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 65 హార్స్ పవర్, 80 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ అప్డేటెడ్ బైక్ లేటెస్ట్ యూరో 5 ప్లస్ నిబంధనలకు అనుగుణంగా ఉంది.కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 ఇప్పుడు ఎక్కువ బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతుంది. ఇచ్చి చూడటానికి స్పీడ్ ట్విన్ 1200ని పోలి ఉంటుంది. అయితే ఇందులో యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, బ్రాండెడ్ రేడియల్ కాలిపర్ను కలిగి ఉంది. ఈ బైక్ సీటు ఎత్తు 900 మిమీ వరకు ఉంది. సింగిల్-పాడ్ డిజి-అనలాగ్ డిస్ప్లే స్థానంలో TFT యూనిట్ ఉంటుంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైక్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని డెలివరీలు 2025 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. స్పీడ్ ట్విన్ 900 పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.Your journey to making every ride exceptional begins here. The new Speed Twin 900 is priced from ₹ 8 89 000* /- Ex showroom Delhi.Discover more: https://t.co/AUDQTKfjrc#SpeedTwin900 #MeetTheNewOriginal #MakeEveryRideExceptional #TriumphMotorcycles #ForTheRide pic.twitter.com/gMiAku7wtS— TriumphIndiaOfficial (@IndiaTriumph) December 23, 2024 -
భారత్లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ
కవాసకి దేశీయ మార్కెట్లో 2025 నింజా 1100ఎస్ఎక్స్ లాంచ్ చేసింది. దీని ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ.. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.నింజా 1100ఎస్ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్, 1099సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద, 136 హార్స్ పవర్ & 7600 rpm వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.చూడటానికి కవాసకి నింజా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు, షార్ప్ అండ్ అగ్రెసివ్ ఫ్రంట్ ఫెయిరింగ్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులో 4.3 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి వాటిని చూపిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ పవర్ మోడ్లు, హ్యాండిల్బార్ మౌంటెడ్ USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కవాసకి నింజా 1100ఎస్ఎక్స్ బైకుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ధర పరంగా ట్రయంఫ్ రోడ్-బియాస్డ్ టైగర్ 900 జీటీ పోటీపడుతోంది. కాగా ఈ బైక్ కోసం కవాసకి డీలర్షిప్లలో రూ. 50,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. -
2025లో లాంచ్.. ఇప్పుడే సిద్దమైన డుకాటీ
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ' సరికొత్త మల్టిస్ట్రాడా వీ2, వీ2 ఎస్ బైకులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాది (2025) లాంచ్ చేయనున్నట్లు సమాచారం.2025లో లాంచ్ కానున్న కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ2 బైక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా 18 కేజీల తక్కువ బరువుతో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్లు. ఇందులోని 890 సీసీ ఇంజిన్ 115.6 హార్స్ పవర్, 92.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ అండ్ బైడైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది.కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఎస్ వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యూనిట్. ఈ బైక్ ముందు భాగంలో 120/70-ఆర్19 టైర్, వెనుక 170/60-ఆర్19 టైర్లు ఉన్నాయి. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్లు, వెనుక 265 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి.మల్టీస్ట్రాడా వీ2 ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, పవర్ మోడ్లు, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్తో కూడిన సరికొత్త ఎలక్ట్రానిక్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేలో కనిపిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ ధరలను వెల్లడించలేదు. అయితే ధరలు రూ. 16 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్లు
న్యూఢిల్లీ: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న ఆస్ట్రియన్ కంపెనీ కేటీఎం పూర్తి స్థాయిలో ఉత్పత్తులను అందించడం ద్వారా భారత్లో తన మార్కెట్ ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. నాలుగు విభాగాల్లో అంతర్జాతీయంగా లభించే 10 కొత్త బైక్స్ను భారత మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.4.75 లక్షలతో మొదలై రూ.22.96 లక్షల వరకు ఉంది.‘అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా కేటీఎం అమ్మకాలను పెంచుకోగలిగింది. ప్రత్యేకించి బజాజ్ ఆటోతో భాగస్వామ్యం తర్వాత ఎగుమతులు అధికం అయ్యాయి. మహారాష్ట్ర చకన్లోని బజాజ్ ప్లాంటులో తయారైన బైక్స్ను 120కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ఏడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3.7 లక్షల మోటార్సైకిళ్లను విక్రయించింది’ అని కేటీఎం–స్పోర్ట్మోటార్సైకిల్ జీఎంబీహెచ్ ఆసియా, పసిఫిక్, మిడిల్–ఈస్ట్, ఆఫ్రికా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ పెర్బెర్స్లాగర్ తెలిపారు.ఇదీ చదవండి: మూడు ‘హీరో’ బైక్లు లాంచ్కు రెడీఅమ్మకాలలో భారత్ వాటా 40 శాతమని, ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ పూర్తి ఉత్పత్తి శ్రేణిని దేశీయంగా అందించలేదని వివరించారు. చకన్ ప్లాంటు నుంచి 500 సీసీలోపు సామర్థ్యంగల 12 లక్షల యూనిట్ల కేటీఎం బైక్లు ఎగుమతి అయ్యాయి.కొత్త బైక్లు ఇవే..అడ్వెంచర్ టూరర్ మోటార్సైకిల్ సెగ్మెంట్లో 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్ (రూ. 22.74 లక్షలు), 890 అడ్వెంచర్ ఆర్ (రూ. 15.80 లక్షలు), ఎండ్యూరో మోటార్సైకిల్ శ్రేణిలో 350 EXC-F (రూ. 12.96 లక్షలు), మోటోక్రాస్ విభాగంలో 450 SX-F (రూ. 10.25 లక్షలు), 250 SX-F (రూ. 9.58 లక్షలు), 85 SX (రూ. 6.69 లక్షలు), 65 SX (రూ. 5.47 లక్షలు), 50 SX (రూ. 4.75 లక్షలు). -
EICMA 2024 : కళ్ళు చెదిరే సరికొత్త బైకులు.. చూస్తే మతిపోవాల్సిందే! (ఫోటోలు)
-
ఇదే మంచి తరుణం.. ప్రీమియం బైక్లపై భారీ డిస్కౌంట్లు
పండుగ సీజన్లో మంచి ప్రీమియం బండి కొనాలనుకుంటున్నవారికి ఇదే మంచి సమయం. జావా యెజ్డీ మోటార్సైకిల్స్ తమ బైక్లపై పలు ఆఫర్లను ప్రకటించింది. జావా/యెజ్డీ బండిని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నుండి బుక్ చేసుకుంటే వివిధ బ్యాంకులు అందించే డిస్కౌంట్లతో పాటు రూ.22,500 వరకు ఆదా చేసుకోవచ్చు.ఫ్లిప్కార్ట్లో జావా/యెజ్డీ బైక్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే.. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.8,500 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 12,500 నుండి రూ.22,500 వరకు స్ట్రెయిట్ అప్ డిస్కౌంట్తోపాటు రూ.10,000 క్యాష్బ్యాక్ పొందవచ్చు.జావా యెజ్డీ మోటార్సైకిళ్లపై కంపెనీ ప్రాంతాలవారీగానూ ఆఫర్లను అందిస్తోంది. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ.19,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , నాలుగు సంవత్సరాల లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీస్, నాలుగేళ్లు లేదా 50,000 కి.మీ వారంటీ ఉన్నాయి.తూర్పు ప్రాంత కస్టమర్లకు రూ.14,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో పాటు రూ.1,500 విలువైన రోడ్ సైడ్ అసిస్టెన్స్, రూ.2,500 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు. ఇక ఉత్తర భారతదేశంలోని కస్టమర్లకు రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతోపాటు సులభమైన ఫైనాన్స్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. కొత్త యెజ్డీ అడ్వెంచర్ని కొనుగోలు చేసేవారు రూ.16,000 విలువైన ట్రయల్ ప్యాక్ యాక్సెసరీస్ ప్యాకేజీని ఉచితంగా అందుకోవచ్చు. -
భారత్లో కొత్త బైక్ లాంచ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన సోషల్ మీడియా ఖాతాలో ఓ బైక్ వీడియో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో బీఎస్ఏ మోటార్సైకిల్స్ కంపెనీకి చెందిన గోల్డ్ స్టార్ 650 బైక్ కనిపిస్తోంది. ఈ బైక్ వీడియో షేర్ చేస్తూ వెల్కమ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. లక్షల మందిని మెప్పించిన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650మహీంద్రా గ్రూప్నకు చెందిన మోటార్సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ దశాబ్దాల తరువాత భారత్లో అడుగుపెట్టింది. గోల్డ్ స్టార్ 650 పేరుతో లాంచ్ అయిన కొత్త బైక్ ధరలు రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 652 సీసీ ఇంజిన్ కలిగి 45.6 పీఎస్ పవర్, 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్తో వస్తుంది.Welcome back….#TheGreatestSingleOfAllTime #LegendIsHere #BSAgoldstar pic.twitter.com/03a66g8YHg— anand mahindra (@anandmahindra) August 20, 2024 -
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైక్ ఈ నెల 18న లాంచ్ అవుతుందని గతంలో వెల్లడైంది. అయితే ఈ డేట్ ఇప్పుడు జూలై 5కి మారింది. ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్లో సీఎన్జీ బైక్ లేదు.బజాజ్ లాంచ్ చేయనున్న ఈ కొత్త సీఎన్జీ 125 సీసీ విభాగంలో లాంచ్ అవుతుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ పేరు 'బ్రూజర్' అని తెలుస్తోంది. ఈ బైక్ సీఎన్జీ, పెట్రోల్తో నడిచే ప్రపంచంలోనే మొదటి ప్రొడక్షన్ స్పెక్ మోటార్సైకిల్. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. వాహన వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.భారతదేశంలో ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలతో పోలిస్తే.. సీఎన్జీ ధరలు తక్కువ. కాబట్టి దేశీయ మార్కెట్లో సీఎన్జీ బైక్ లాంచ్ అనేది ఆటోమొబైల్ చరిత్రలో ఓ సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ బైకుకు సంబంధించిన మరిన్ని వివరాలు జూలై 5న వెల్లడయ్యే అవకాశం ఉంది. -
రూ.20.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు
భారతీయ విఫణిలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ తన 'ఆర్ 1300 జీఎస్' బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 20.95 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ కంటే రూ. 40000 ఎక్కువ.కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ 1300 సీసీ లిక్విడ్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 143.5 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. పవర్, టార్క్ అనేవి దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ చూడటానికి దాని ఆర్ 1300 జీఎస్ మాదిరిగానే ఉంటుంది. కానీ కొన్ని అప్డేటెడ్ మార్పులను చూడవచ్చు. ఇందులో రీడిజైన్ ఫ్రంట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్, స్టీల్ షీట్-మెటల్ ఫ్రేమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఈ బైకులో 6.5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT స్క్రీన్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ పొందుతుంది.సుమారు 237 కేజీల బరువున్న ఈ ఆర్ 1300 జీఎస్.. తక్కువ హైట్ ఉన్న సీటును పొందుతుంది. పొట్టిగా ఉన్న రైడర్లకు కూడా ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది ట్రయంఫ్ టైగర్ 1200 జిటి ప్రో, హార్లీ-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.Let's set the pace together. The all-new BMW R 1300 GS starts at an introductory price of INR 20.95 Lakhs*.Have you booked yours? ⬇️https://t.co/NIhvPAPFXK#r1300gs #1300gs #bmw1300gs #pricelaunch #adventurebike #kingofadventure #bmwmotorradlndia #makelifearide pic.twitter.com/Pl9KOODGs0— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) June 13, 2024 -
ఇండియన్ మార్కెట్లో రూ.20.98 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ ఇండియా' దేశీయ మార్కెట్లో కొత్త 'పానిగేల్ వీ2' బైకును బ్లాక్ కలర్ ఆప్షన్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 20.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 30000 ఎక్కువ. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డుకాటీ పానిగేల్ వీ2 బ్లాక్ ఫెయిరింగ్ పొందటమే కాకుండా.. ఫ్యూయల్ ట్యాంక్ మీద, వీల్స్ మీద, వెనుక భాగంలో రెడ్ కలర్ స్కీమ్ చూడవచ్చు. డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి అదే కన్ను మాదిరిగా ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, ట్విన్ హెడ్ల్యాంప్ వంటివి ఉన్నాయి.పానిగేల్ వీ2 బైక్ అదే 995 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 rpm వద్ద 155 Bhp పవర్, 9000 rpm వద్ద 104 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ షోవా యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు ఫుల్లీ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్.. కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. పైరెల్లీ డయాబ్లో రోస్సో కోర్సా II టైర్లను కలిగి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఖరీదైన బైకులను లాంచ్ చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ సరికొత్త 'ఆర్ 1300 జీఎస్'ను జూన్ 13న లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ ఆధునిక హంగులతో, అద్భుతమైన పనితీరును అందించడానికి కావాల్సిన ఇంజిన్ ఆప్షన్ పొందనున్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ పాడ్ హెడ్లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BMW రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్ చేయగల ఏబీఎస్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లాంచ్ అవుతుందని సమాచారం. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ ఇదే.. ఆటోమొబైల్ చరిత్రలో నవశకం
దశాబ్దాల క్రితం డీజిల్ బైకులు వినియోగంలో ఉండేవి. ఆ తరువాత పెట్రోల్ బైకులు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి. కాగా.. త్వరలో సీఎన్జీ బైక్ లాంచ్ అవ్వడానికి సిద్ధమైంది.ప్రస్తుతం భారతీయ విఫణిలో సీఎన్జీతో నడిచే వాహనాల జాబితాలో కార్లు, ఆటో రిక్షాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎన్జీ బైకులు ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టలేదు. కాబట్టి బజాజ్ ఆటో సీఎన్జీ బైక్ లాంచ్ చేసి.. నవ శకానికి నాంది పలకడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త సీఎన్జీ బైక్ కోసం ఇప్పటికే ట్రేడ్మార్క్ను కూడా దాఖలు చేసింది.బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైకును ఈ నెల (జూన్ 18) అధికారికంగా పరిచయం చేయనుంది. లాంచ్కు సిద్దమవుతున్న ఈ బైక్కు 'ఫైటర్' అని నామకరణం చేశారు. బజాజ్ కంపెనీ గత కొంత కాలంగా ఈ సీఎన్జీ బైక్ మీద పనిచేస్తోంది. త్వరలో దీనిని అధికారికంగా ఆవిష్కరించడానికి సిద్ధమైంది.ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించిన బజాజ్ సీఎన్జీ బైక్ హాలోజన్ టర్న్ ఇండికేటర్లు, టెలిస్కోపిక్ ఫోర్క్లు, సస్పెన్షన్ డ్యూటీల కోసం మోనోషాక్ యూనిట్ వంటి వాటితోపాటు మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్ పీస్ సీటు, డిస్క్ & డ్రమ్ బ్రేక్ యూనిట్ పొందనున్నట్లు సమాచారం. -
రూ. 82911లకే కొత్త బైక్.. 73 కిమీ మైలేజ్
హీరోమోటోకార్ప్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 లాంచ్ చేసింది. కంపెనీ ఎవర్గ్రీన్ కమ్యూటర్ యొక్క 30వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా ఈ బైకును రూ. 82911 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది.కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 8.02 hp పవర్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు ఏకంగా 73 కిమీ మైలేజ్ అందిస్తుంది.డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ పొందిన ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ డిస్ప్లే.. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది.డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ బైక్ దాని స్టాండర్డ్ XTEC మోడల్ కంటే కూడా రూ. 3000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ఉఇప్పటికే అమ్మకానికి ఉన్న హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
'బీఎండబ్ల్యూ మోటొరాడ్' దేశీయ మార్కెట్లో సరికొత్త 'ఎమ్ 1000 ఎక్స్ఆర్' బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే భారతీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరింది. ఇది సీబియూ మార్గం ద్వారా ఇండియాకు దిగుమతి అవుతాయి. ఈ బైక్ బుక్ చేసుకుంటే డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.మంచి డిజైన్ కలిగిన ఈ బైక్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 6.5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. అంతే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, బ్రేక్ స్లైడ్ అసిస్ట్ ఫంక్షన్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ లిమిటర్ ఫంక్షన్లు వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ బైక్ 999సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 199 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో 6-స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం వాడుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 278 కిమీ కావడం గమనార్హం. ఇందులో రెయిన్, రోడ్, డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ ప్రో మోడ్ అనే ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. -
రూ.1.32 లక్షల కవాసకి బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి బైక్ పేరు 'డబ్ల్యూ175 స్టీట్'. దీని ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 12000 తక్కువ ధరకే లభిస్తుంది. బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్లతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 177 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 13 హార్స్ పవర్, 13.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్.. కవాసకి డబ్ల్యూ175 స్టీట్ బైక్ హాలోజన్ హెడ్లైట్, అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటివి పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తక్కువ ధర వద్ద విడులవడంతో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. -
ఈ వారం భారత్లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
పండుగ సీజన్ తరువాత కూడా భారతీయ మార్కెట్లో కొత్త బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయగా, చెన్నైకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ రెండు కొత్త బైకులను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్స్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 650 దేశీయ బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల 650 సీసీ విభాగంలో ఓ స్టైలిష్ బైక్ లాంచ్ చేసింది. రూ. 4.25 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ మంచి మీటియోర్ లాంటి డిజైన్ కలిగి 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. 2024 హిమాలయన్ భారతదేశంలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు సరోకొత్త మోడల్గా మార్కెట్లో విడుదలైంది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు రూ.2.69 లక్షల నుంచి రూ.2.79 లక్షల మధ్య ఉంటాయి. ఈ ధరలు 2023 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లిబాటు అవుతాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. 2024 హిమాలయన్ లిక్విడ్ కూల్డ్, 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 40 హార్స్ పవర్ మరియు 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కాబట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ చూడవచ్చు. ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె.. ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'ఓర్క్సా ఎనర్జీ' (Orxa Energy).. దేశీయ విఫణిలో 'మాంటీస్ ఎలక్ట్రిక్' (Mantis Electric) బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.6 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). కేవలం ఒకే వేరియంట్లో లభించే ఈ బైక్ 1.3 కిలోవాట్ ఛార్జర్ పొందుతుంది. కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్తో 221 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే 'మాంటీస్ ఎలక్ట్రిక్' 182 కేజీల బరువును కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారులకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. -
మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ తరుణంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని చాలా ఆసక్తి కనపరుస్తారు. అలాంటి వారికోసం ఈ కథనంలో ఈ వారంలో మార్కెట్లో అడుగుపెట్టిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హోండా సీబీ300ఎఫ్ (Honda CB300F) హోండా మోటార్సైకిల్ ఇండియా పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని అప్డేటెడ్ 'సీబీ300ఎఫ్' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న బిగ్వింగ్ డీలర్షిప్లలో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ 293 సీసీ ఆయిల్-కూల్డ్ SOHC ఇంజన్ కలిగి 24 హార్స్ పవర్ అండ్ 25.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్తో 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్బాక్స్తో లభిస్తుంది. 14.1 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 7.94 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ (Kawasaki Ninja ZX-4R) ఇప్పటికే మార్కెట్లో మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతున్న కవాసకి ఇప్పుడు ఎట్టకేలకు 'నింజా జెడ్ఎక్స్-4ఆర్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ధర ఎక్కువైనా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ 399 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి సిక్స్-స్పీడ్ గేర్బాక్స్తో స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 14,500 ఆర్పీఎమ్ వద్ద 76 బీహెచ్పీ పవర్ & 13,000 ఆర్పీఎమ్ వద్ద 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇదీ చదవండి: మహిళలకు శుభవార్త! గ్యాస్ స్టవ్తో పాటు ఫ్రీ సిలిండర్ పొందండిలా.. న్యూ కేటిఎమ్ 390 డ్యూక్ (New KTM 390 Duke) యువ రైడర్లకు ఎంతగానో ఇష్టమైన కేటిఎమ్ ఇప్పుడు మరో కొత్త బైక్ రూపంలో (న్యూ కేటిఎమ్ 390 డ్యూక్) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ ధర రూ. 3,10,520 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కావున ఇందులో 399 సీసీ ఉంటుంది. ఇది 45 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
విడుదలకు సిద్దమవుతున్న కొత్త బైకులు, ఇవే!
Upcoming Bikes: 2023 ఆగష్టు నెల ముగిసింది.. గత నెలలో హీరో కరీజ్మా ఎక్స్ఎమ్ఆర్, టీవీఎస్ ఎక్స్ ఈ-స్కూటర్, హోండా SP160, ఓలా ఎస్1 వంటివి విడుదలయ్యాయి. కాగా ఈ నెలలో మరి కొన్ని విడుదలకావడానికి సన్నద్ధమవుతున్న బైకులు ఏవి? ఎప్పుడు లాంచ్ అవుతాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్స్ ఈ నెలలో అపాచీ ఆర్ఆర్310 నేక్డ్ స్ట్రీట్ఫైటర్ వెర్షన్ను విడుదల చేయనుంది. ఇది కేవలం రీబ్యాడ్జ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ మాత్రమే కాదు.. చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉండే అవకాశం ఉండనై ఆశిస్తున్నాము. ఇది 2023 సెప్టెంబర్ 06న విడుదలకానున్నట్లు సమాచారం. 2024 కేటీఎమ్ 390 డ్యూక్.. యువతరానికి ఇష్టమైన కెటిఎమ్ బ్రాండ్ త్వరలో 2024 కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల చేయనుంది. ఈ బైక్ 399 సీసీ ఇంజిన్ కలిగి 44.8 హార్స్ పవర్ & 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము. సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ.. సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ఈ నెలలో తన వీ-స్ట్రోమ్ 800 డీఈ బైక్ లాంచ్ చేయనుంది. ఇది 776 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించనుంది. ఈ కొత్త 800DE ఒక ఆధునిక ఎలక్ట్రానిక్స్ సూట్ అండ్ 21 ఇంచెస్ ఫ్రంట్ వీల్ను కలిగి ఉంది. ఈ కొత్త బైకుకి సంబంధించిన ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుదలవుతాయి. -
హోండా కొత్త బైక్ ఎస్పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
Honda SP160 ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా భారత మార్కెట్లో సరికొత్త బైక్ ఎస్పీ160 విడుదల చేసింది. ఇది హోండా యునికార్న్ , హోండా X-బ్లేడ్ తర్వాత 160cc విభాగంలో ఇది మూడో మోడల్. వీటి ఎక్స్షోరూంలో ధర రూ.1.17 లక్షల నుండి ప్రారంభం. రెండు ట్రిమ్స్, ఆరు రంగుల్లో లభిస్తుంది. 13 బీహెచ్పీ పవర్, 14.58 ఎన్ఎం టార్క్తో 162 సీసీ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్, ఫ్లాషింగ్ ఇండికేటర్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్, సింగిల్ చానెల్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ వంటి హంగులు ఉన్నాయి. 3 ఏళ్లు స్టాండర్డ్, ఏడేళ్లు ఆప్షనల్ వారంటీ ఉంది. వేరియంట్ వారీగా హోండా ఎస్పీ160 ధరలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) సింగిల్ డిస్క్ - రూ. 1,17,500 డ్యూయల్ డిస్క్ - రూ. 1,21,900 -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో బైక్ - లాంచ్ ఎప్పుడంటే?
Royal Enfield Scram 440: దేశీయ టూ వీలర్ దిగ్గజం 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) మార్కెట్లో మరో సరికొత్త మోడల్ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ బైక్ వచ్చే సంవత్సరానికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ స్క్రామ్ 440 మోడల్ అవుతుందని సమాచారం. అంటే ఇది ఇప్పటికే మార్కెట్లో స్క్రామ్ ఆధారంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇది 411 సీసీ ఇంజిన్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ ఇప్పటికే స్క్రామ్ 411లో ఉంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ వంటివి అధికారికంగా విడుదలకాలేదు, త్వరలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ బైక్ స్క్రామ్ సబ్-బ్రాండ్ క్రింద ఉంటుంది. అయితే హిమాలయన్ బైక్ కంటే కూడా తక్కువ ధర వద్ద ఉంటుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న బైకుల జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే కాకుండా యమహా, హోండా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వారి పరిధిని విస్తరిస్తూ దేశంలో ఉనికిని మరింత చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
భారత్లో ట్రయంఫ్ కొత్త బైక్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ట్రయంఫ్ తాజాగా భారత మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ వీటిలో ఉన్నాయి. బజాజ్ ఆటో, ట్రయంఫ్ సంయుక్తంగా ఈ రెండు మోడళ్లను అభివృద్ధి చేశాయి. 2017లో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఎక్స్షోరూంలో ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ.2.23 లక్షలు ఉంది. ఈ నెల నుంచే లభిస్తుంది. స్క్రాంబ్లర్ 400 ఎక్స్ ధర ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ నుంచి ఈ మోడల్ డెలివరీలు ఉంటాయి. పెద్ద ఎత్తున అమ్మకాలను ఆశిస్తున్నట్టు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర పుణే సమీపంలోని చకన్ వద్ద ఉన్న కొత్త ప్లాంటులో ఈ బైక్స్ తయారు చేస్తామన్నారు. 2024 మార్చి నాటికి 80 నగరాలు, పట్టణాల్లో ట్రయంఫ్ వరల్డ్ షోరూంలు 100కుపైగా రానున్నాయి. -
దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్
సూపర్బైక్స్ బ్రాండ్ కీవే ఎస్ఆర్ 250, ఎస్ఆర్ 125 మోడళ్ల తయారీని దేశీయంగా ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రకటించింది. ఇటీవలే ప్రీమియం సెగ్మెంట్లో నాన్-రెట్రో మోటార్సైకిళ్లను ప్రవేశపెట్టింది కీవే. ఢిల్లీఎక్స్షోరూంలో పరిచయ ఆఫర్ ధర ఎస్ఆర్ 250 రూ.1.49 లక్షలు వద్ద అందుబాటులో ఉంటుంది. రూ.2,000కి బుక్ చేసుకోవచ్చు. ఇక ఎస్ఆర్ 125 రూ.1.19 లక్షలుగా ఉంది. కేవలం 1000కే బుక్ చేసుకోవచ్చు. వినియోగదార్లు దేశవ్యాప్తంగా ఉన్న 55 బెనెల్లి, కీవే షోరూంలు లేదా ఆన్లైన్లో ఈ బైక్స్ను కొనుక్కోవచ్చు. కీవే ఎస్ఆర్ 250 తొలి 500 డెలివరీల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక లక్కీ డ్రాను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో, ఐదుగురు లక్కీ కస్టమర్లు కీవే ఎస్ఆర్ ఎక్స్-షోరూమ్ ధరపై 100 శాతం క్యాష్బ్యాక్ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేనా దీనికి అదనంగా , AARI 'My SR My Way' అనే కొత్త ప్లాట్ఫారమ్ను పరిచయం చేస్తోంది. కీవే ఎస్ఆర్ 125 బెస్ట్ మైలేజీ సామర్థ్యాన్ని కోరుకునే బైక్ లవర్స్కు ఇది బెస్ట్ ఆప్షన్. 125 సీసీ 4-స్ట్రోక్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఇది గరిష్టంగా 9.7hp శక్తిని 8.2nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇంకా హాలోజన్ హెడ్ల్యాంప్, LCD కలర్ డిస్ప్లే, కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ , డ్యూయల్-పర్పస్ టైర్స్ 1 ఉంది. బ్రేకింగ్ సిస్ఠంలో 300ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుకవైపు 210ఎంఎ డిస్క్ను అందించింది. బైక్కు 160ఎంఎ గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ లభిస్తుంది. Wishing a Happy World Motorcycle Day to those who love corners and the open highways.#HappyWorldMotorcycle #Bikers #MotorcycleDay #Passion #Riding #Keeway #India pic.twitter.com/sUPSPE272j — KeewayIndia (@keeway_india) June 20, 2023 -
ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్న యమహా ప్లాన్స్
స్టైలిష్ బైకులకు ప్రసిద్ధి చెందిన 'యమహా' (Yamaha) దేశీయ మార్కెట్లో రానున్న రోజుల్లో ప్రీమియం బైక్స్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ వీటి కోసం త్వరలోనే ఫ్రీ బుకింగ్స్ కూడా స్వీకరించడానికి సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యమహా విడుదల చేయనున్న ఈ కొత్త బైక్స్ తమ బ్లూ స్క్వేర్ షోరూమ్స్ల విక్రయించనున్నట్లు సమాచారం. కంపెనీ ఇటీవలే 200వ షోరూమ్ను చెన్నైలో ప్రారభించింది. యమహా 2019 నుంచి ఈ ప్రీమియం డీలర్షిప్ నెట్వర్క్ ప్రారంభించడం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఈ షోరూమ్ల సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) యమహా ఇండియా ఎమ్టి03, ఎమ్టి-07, ఎమ్టి-07, ఆర్3, ఆర్1, ఆర్1ఎమ్ వంటి ప్రీమియం బైకులను త్వరలోనే దేశీయ విఫణిలో విడుదల చేయనుంది. ఇప్పటికే సంస్థ వీటిని ఒక ప్రైవేట్ ఈవెంట్లో ప్రదర్శించింది. అయితే ఇవి మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయనే ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ఇవి పండుగ సీజన్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ బైక్లు.. ధరలు, ఫీచర్లు ఇవే..
ట్రయంఫ్ (Triumph) మోటార్సైకిల్స్ ఇండియా కొత్త ప్రీమియం బైక్లను మార్కెట్లోకి విడుదల చేసింది. 2023 స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ఎస్, స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ మోడళ్లను పరిచయం చేసింది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ధర రూ. 10.17 లక్షలు, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ. 11.81 లక్షలు. (ఎక్స్ షోరూమ్) కలర్స్ ఇవే.. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ సిల్వర్ ఐస్, క్రిస్టల్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ సిల్వర్ ఐస్, కార్నివాల్ రెడ్, కాస్మిక్ ఎల్లో అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది. స్పెసిఫికేషన్లు 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్లో లిక్విడ్-కూల్డ్, 765 సీసీ ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ ఉంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఇంజిన్ 11,500 ఆర్పీఎం వద్ద 118.4 బీహెచ్పీ, 9,500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 80 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్కు 6-స్పీడ్ గేర్బాక్స్తో జత చేశారు. ఇక స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ 12,000 ఆర్పీఎం వద్ద 128.2 బీహెచ్పీ అధిక అవుట్పుట్ను 9,500 ఆర్పీఎం వద్ద 80 ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఫీచర్స్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్లో కార్నరింగ్ ఏబీఎస్, లీన్-యాంగిల్ సెన్సిటివిటీతో ట్రాక్షన్ కంట్రోల్, లింక్డ్ బ్రేకింగ్ సిస్టమ్, వీలీ కంట్రోల్, ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. మరోవైపు 2023 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ నాలుగు రైడింగ్ మోడ్లను అందిస్తుంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్లో ఎల్సీడీ డిస్ప్లే, ఆర్ఎస్ మోడల్లో బ్లూటూత్ కనెక్టివిటీతో టీఎఫ్టీ స్క్రీన్ ఉన్నాయి. ల్యాప్ టైమర్, క్రూయిజ్ కంట్రోల్తో కూడిన ట్రాక్ ఉపయోగం కోసం ఆర్ఎస్ వేరియంట్ను మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించారు. StreetTriple 765 R-the new definitive street fighter-is priced from INR 10,17,000 Ex-Showroom, and StreetTriple 765 RS-the most powerful #StreetTriple ever-is priced from INR 11,81,000 Ex-Showroom.#StreetTriple765R #StreetTriple765RS #RacePowered #StreetTriple765 #TriumphIndia pic.twitter.com/2sOfixWOSc — TriumphIndiaOfficial (@IndiaTriumph) June 16, 2023 -
భారత్లో మళ్ళీ అడుగెట్టిన హీరో ఫ్యాషన్ ప్లస్ - ధర & వివరాలు
Hero Passion Plus: బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా భారతదేశంలో మూడు సంవత్సరాలకు ముందు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) నిలిపివేసిన 'ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) ఇప్పుడు మళ్ళీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. కాగా ఈ బైక్ లాంగ్ స్టాండింగ్ ఎయిర్ కూల్డ్, 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉపయోగించి అదే 8 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఇప్పుడు OBD-2 కంప్లైంట్ అండ్ E20 కి సిద్ధంగా తయారైంది. ఈ బైక్ ఐ3ఎస్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా పొందుతుంది. హీరో ఫ్యాషన్ ప్లస్ టెలిస్కోపిక్ ఫోర్క్ & ట్విన్ షాక్ అబ్జార్బర్స్ కలిగి డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ పొందుతుంది. ఈ బైక్ బరువు 115 కేజీలు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఉన్న 100 సీసీ విభాగంలో ఇదే అత్యంత బరువైన బైక్ అని తెలుస్తోంది. ముందు, వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్లు ఉంటాయి. (ఇదీ చదవండి: ఇండియాలో అక్కడ నివాసం చాలా కాస్ట్లీ - హైదరాబాద్ స్థానం ఏంటంటే?) గతంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హీరో ఫ్యాషన్ ప్లస్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్స్తో లభించడమే కాకుండా సెల్ఫ్ స్టార్ట్, డిజిటల్ అనలాగ్ డిస్ప్లే, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి వాటిని పొందుతుంది. ఈ బైక్ మార్కెట్లో హోండా షైన్, బజాజ్ ప్లాటినా మొదలైన 110 సీసీ విభాగంలోని బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. -
సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?
హిస్టారిక్ ప్రీమియం మోటార్సైకిల్ బ్రాండ్, కరిజ్మా ఎక్స్ఎంఆర్ బైక్ మళ్లీ ఎంట్రీ ఇస్తోందన్న ఊహాగానాలు, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దారు హీరో మోటోకార్ప్ దాఖలు చేసిన ట్రేడ్మార్క్ దరఖాస్తుతో మరోసారి ఊపందు కున్నాయి. హీరో మోటోకార్ప్, రాబోయే మోటార్సైకిల్కి సంబంధించిన 14 సెకన్ల టీజర్ వీడియోను ఇటీవల విడుదల చేసింది. జూన్ 14న లాంచ్ డేట్ నిర్ధారించినప్పటికీ నిర్దిష్ట మోడల్ ఇంకా వెల్లడించలేదు. ఎక్స్ఎంఆర్ 210 లేదా ఎక్స్ట్రీమ్ 160R అప్డేటెడ్ వెర్షన్ అని కావచ్చని భావిస్తున్నారు. హీరో మోటార్స్ అప్డేట్ చేసిన రీమోడల్ బైక్ ఎక్స్ట్రీమ్160R అప్డేటెడ్ వెర్షన్లో ఫీచర్లు, డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్లు పెద్దగా మారకపోవచ్చని అంచనా. అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, 5-స్పీడ్ గేర్బాక్స్ లాంటి అదనపు ఫీచర్లతో కీలక అప్గ్రేడ్స్నే అందిస్తోందట. కొత్త టూ-టోన్ బాడీ షేడ్స్ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే, డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్తో వస్తుందా అనేది స్పష్టత లేదు. 163cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ 15 పవర్ను, 14 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ధర రూ. 1.30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో నాలుగు బైకులు - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
Upcoming Royal Enfield Bikes: ద్విచక్ర వాహన విభాగంలో భారతీయ మార్కెట్లో 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) బైకులకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి నుంచి కూడా ఈ బైకులకు డిమాండ్ భారీగా ఉంది. ఇప్పటికే క్లాసిక్ 350, మీటియోర్ 350, ఇంటర్సెప్టర్ 650, హిమాలయన్ విక్రయాలతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న సంస్థ త్వరలో మరో నాలుగు బైకులు విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ ఏడాది విడుదల చేయనున్న ఈ నాలుగు బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 గత కొన్ని రోజులుగా సంస్థ హిమాలయన్ 450 విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కంపెనీ కూడా ఈ మోడల్ మీద పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో 450 సీసీ ఇంజిన్ ఉండే అవకాశం ఉండండి నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చే బైక్ బుల్లెట్. బైక్ రైడర్ల మనసులో అంతగా ఈ పేరు పాతుకుపోయింది. అయితే ఈ బైక్ త్వరలోనే కొత్త వెర్షన్గా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ న్యూ జనరేషన్ బుల్లెట్ 350 క్లాసిక్ మాదిరిగా కాకుండా కొంత లేటెస్ట్ డిజైన్ పొందుతుందని సమాచారం. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 650 ప్రస్తుతం 350 సీసీ విభాగంలో మాదిరిగానే 650 విభాగంలో కూడా విడుదలయ్యే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఈ విభాగంలో ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 వంటివి ఉన్నాయి. కాగా ఈ విభాగంలో కంపెనీ షాట్గన్ 650 విడుదలకానున్నట్లు సమాచారం. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బాబర్ 350 జావా కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న బాబర్ బైక్ గురించి వినే ఉంటారు. అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ క్లాసిక్ బాబర్ 350 పేరుతో ఒక కొత్త బికా విడుదల చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ బైక్ గురించి ప్రస్తుతానికి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు, కానీ ఈ ఏడాది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
భారత్లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?
భారతదేశంలో ఎట్టకేలకు డుకాటీ కంపెనీ మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే ఖరీదైనప్పటికీ అద్భుతమైన డిజైన్, ఆధునిక పరికరాలను పొందుతుంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'డుకాటీ మాన్స్టర్ ఎస్పి' (Ducati Monster SP) ధర రూ. 15.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా రూ. 3 లక్షలు ఎక్కువ ఖరీదైనది కావడం విశేషం. డిజైన్ & ఫీచర్స్: నిజానికి లేటెస్ట్ డుకాటీ మాన్స్టర్ ఎస్పి డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో MotoGP ఇన్స్ఫైర్డ్ లివరీతో పాటు బ్లాక్ అవుట్ పార్ట్స్ కలిగి ప్యాసింజర్ సీట్ కౌల్ పొందుతుంది. LED DRL ప్రొజెక్టర్ స్టైల్ హెడ్ లాంప్ ఇందులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ ఇండికేటర్లతో మస్కులర్ ఫ్యూయెల్ ట్యాంక్, స్టెప్ అప్ సీట్, రెండు వైపులా 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. (ఇదీ చదవండి: వయసు 24.. సంపాదన రూ. 100 కోట్లు - అతడే సంకర్ష్ చందా!) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ కలిగిన 4.3 ఇంచెస్ కలర్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించి రైడర్ కి కావలసిన సమాచారం అందిస్తుంది. ఎలక్ట్రానిక్ లాంచ్ కంట్రోల్ సిస్టం, రైడింగ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త డుకాటీ మాన్స్టర్ ఎస్పి బైక్ ఇంజిన్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే 937 సిసి ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 9250 rpm వద్ద 109.9 bhp పవర్ & 6500 rpm వద్ద 93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్ల వరకు ఉంటుంది. (ఇదీ చదవండి: వాట్సాప్లో ఇంటర్నేషనల్ కాల్స్.. క్లిక్ చేసారో మీ పని అయిపోయినట్టే!) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'డుకాటీ మాన్స్టర్ ఎస్పి' బైక్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS, బీఎండబ్ల్యూ ఎఫ్900 ఆర్, కవాసకి జెడ్900 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ కావాలా? ఇదిగో ఈ కొత్త బైక్ బెస్ట్ ఆప్షన్!
యువ రైడర్లను ఎంతగానో మెప్పించిన కెటిఎమ్ (KTM) దేశీయ మార్కెట్లో మరో కొత్త చేసింది. 'కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్' (KTM 390 Adventure X) పేరుతో విడుదలైన ఈ బైక్ మునుపటి అడ్వెంచర్ బైక్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ బైక్ ప్రారంభ ధర రూ. 2.8 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్తో (రూ. 3.38 లక్షలు) పోలిస్తే దాదాపు యాభై వేలు తక్కువ ధరకే లభిస్తుంది. కావున తక్కువ ధరకు కెటిఎమ్ కావాలనుకునే వారు ఈ లేటెస్ట్ బైక్ ఎంచుకోవచ్చు. డిజైన్ & ఫీచర్స్: నిజానికి కెటిఎమ్ విడుదల చేసిన ఈ కొత్త బైక్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, క్విక్షిఫ్టర్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఫీచర్స్ అందుబాటులో లేదు. కానీ ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సెటప్ కలిగి, వెనుక చక్రం వద్ద ABS స్విచ్ ఆఫ్ చేసే సదుపాయం ఉంటుంది. కావున ఇది ఆఫ్-రోడ్లో ప్రయాణించేటప్పుడు బైక్ను స్లైడ్ చేయడంలో సహాయపడుతుంది. కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ బైకులో కలర్-TFT డిస్ప్లే ఉంటుందా లేదా LCD డిస్ప్లే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ కొత్త బైక్ కొన్ని ఫీచర్స్ కాకుండా మిగిలిన డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అదే ఎల్ఈడీ లైట్స్, ఇంజిన్ మొదలైనవన్నీ అలాగే ఉన్నాయి. (ఇదీ చదవండి: లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన టీవీఎస్ కొత్త బైక్ - మరిన్ని వివరాలు) ఇంజిన్ & పర్ఫామెన్స్: కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ 373.27 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్తో కూడిన ఫోర్ వాల్వ్ ఇంజిన్ కలిగి 9000 ఆర్పిఎమ్ వద్ద 42.9 బీహెచ్పి పవర్, 7000 ఆర్పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? ట్విటర్ బంపరాఫర్) ప్రత్యర్థులు: కెటిఎమ్ నుంచి విడుదలైన ఈ సరసమైన బైక్ రూ. 3 లక్షల కంటే తక్కువ కావున మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఇది దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకుకి ప్రత్యక్ష ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. -
లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన టీవీఎస్ కొత్త బైక్ - మరిన్ని వివరాలు
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'రైడర్ సింగిల్-పీస్ సీట్' బైక్ లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో లభిస్తుంది రైడర్ స్ప్లిట్ సీట్, స్మార్ట్-ఎక్స్నెక్ట్ (SmartXonnect) వేరియంట్కి దిగువన ఉంటుంది. ఇది కంపెనీ ఎంట్రీ లెవెల్ మోడల్ అవుతుంది. ఈ బైక్ ధర, వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టీవీఎస్ రైడర్ సింగిల్ పీస్ సీట్ మోడల్ ధర రూ. 94,719 కాగా, స్మార్ట్-ఎక్స్నెక్ట్ వేరియంట్ ధర లక్ష వరకు ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేయడంతో, రైడర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ నిలిపివేసింది. డిజైన్ & ఫీచర్స్: టీవీఎస్ కొత్త రైడర్ బైక్ ఎల్ఈడీ లైట్స్ వంటి వాటితో మంచి డిజైన్ పొందుతుంది. కాగా ఇందులోని LCD డిస్ప్లే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో USB ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద చిన్న స్టోరేజ్ యూనిట్ కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!) ఇంజిన్ & పర్ఫామెన్స్: టీవీఎస్ రైడర్ ఇంజిన్ ముందుపతి మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో 124.8 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ కలిగి 11.4 హెచ్పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడుతుంది. ఈ బైక్ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టీవీఎస్ రైడర్ సింగిల్-సీట్ వెర్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ కలిగి ఉంటుంది. అదే సమయంలో బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ఒకే ఫ్రంట్ డిస్క్ వెనుక డ్రమ్ సెటప్ పొందుతుంది. ఇందులో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్ల వరకు ఉంటుంది. -
బ్రిటీష్ కంపెనీ ఇప్పుడు బజాజ్ చేతుల్లోకి..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' ఇప్పుడు భారతదేశంలో ట్రయంఫ్ మోటార్సైకిల్స్కి సంబంధించి విక్రయాలు, సర్వీస్ మొదలైన వాటన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొన్ని సంవత్సరాలకు ముందు ప్రకటించిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇది ఒక భాగం. బజాజ్ ఆటో ఇప్పుడు ట్రయంఫ్ భాగస్వామ్యంతో కొత్త ఎంట్రీ-లెవల్ మిడ్-కెపాసిటీ ట్రయంఫ్ మోడల్లను అభివృద్ధి చేయడంలో భాగంగా బజాజ్ తన చకాన్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఈ కార్యకలాపాలన్నీ కూడా ప్రస్తుతం సుమీత్ నారంగ్ నేతృత్వంలోని బజాజ్ ప్రోబైకింగ్ కిందికి వస్తాయి. బజాజ్ కంపెనీ చేసిన ఈ అధికారిక ప్రకటనలో భాగంగా 2023లో మొదటి బజాజ్-ట్రయంఫ్ బైక్ విడుదలకానున్నట్లు సమాచారం. అయితే ఇందులో అది ఏ బైక్ అనేది ఖచ్చితంగా వెల్లడికాలేదు. దీనికి సంబంధించిన వివరాలు రానున్న రోజుల్లో విడుదలవుతాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) బజాజ్-ట్రయంఫ్ నేతృత్వంలో మరింత సరసమైన ట్రయంఫ్ మోడల్లను అందించడానికి, కంపెనీ డీలర్ నెట్వర్క్ కూడా రాబోయే 2 సంవత్సరాలలో దాని నెట్వర్క్ పెంచడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ దేశంలోని 120 నగరాల్లో తన షోరూమ్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. -
భారత్లో 2023 హయబుసా లాంచ్: ధర వింటే దడ పుట్టాల్సిందే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్సైకిల్స్ దేశీయ మార్కెట్లో '2023 హయబుసా' లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దా.. ధరలు & బుకింగ్స్: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సుజుకి హయబుసా ధర రూ. 16.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 49,000 ఎక్కువ. కంపెనీ ఈ బైక్ కోసం దేశ వ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. డిజైన్ & ఫీచర్స్: 2023 హయబుసాలో ఆల్రౌండ్ ఎల్ఇడి లైటింగ్స్ ఉన్నాయి. అయితే టర్న్-ఇండికేటర్స్ ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టిఎఫ్టి డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా యాంటీ-లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్ వంటి వాటిని కంట్రోల్ చేయవచ్చు. కలర్ ఆప్షన్స్: 2023 హయబుసాలో చెప్పుకోదగ్గ అప్డేట్ కలర్ ఆప్షన్స్. ఈ బైక్ ఇప్పుడు మెటాలిక్ గ్రే, గ్రే లెటర్రింగ్ అండ్ సైడ్లో క్రోమ్ స్ట్రిప్తో ఫుల్-బ్లాక్ పెయింట్ ఆప్షన్లో లభిస్తుంది. అంతే కాకుండా దీని ఫ్రంట్, రియర్, సైడ్ ఫెయిరింగ్లో క్యాండీ రెడ్ హైలైట్లు ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ హయబుసా ఇంజిన్ ఎటువంటి అప్డేట్స్ పొందలేదు, కావున ఇందులో అదే 1,340 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 190 బిహెచ్పి పవర్, 142 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్, అసిస్ట్ క్లచ్ & ద్విబై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో పాటు 6-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. (ఇదీ చదవండి: మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్) సుజుకి హయాబుసా అదే అల్యూమినియం ఫ్రేమ్ను కలిగి భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ USD ఫోర్క్ & వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 320 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రెంబో స్టైల్మా 4-పాట్ కాలిపర్, వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పాట్ కాలిపర్తో ఒకే 260 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. -
ఒడిస్సే కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రూ. 999తో బుక్ చేసుకోండి!
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఒడిస్సే ఎలక్ట్రిక్ (Odysse Electric) తన రెండవ ఎలక్ట్రిక్ బైకుని అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి రేంజ్ అందించేలా రూపుదిద్దుకుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ (Odysse Vader Electric) బైక్ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం మార్చి 31 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జులైలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. డిజైన్: ఈ బైక్ చూడగానే ఆకర్శించే మంచి డిజైన్ పొందుతుంది. ఇది డ్యూయెల్ టోన్ ఫినిష్, ఎల్ఈడీ హెడ్లైట్, టెయిల్లైట్, హాలోజెన్ ఇండికేటర్స్, స్ప్లిట్ సీట్స్, స్పోర్టీ డెకల్స్, అలాయ్ వీల్స్, చిన్న ఫ్లై స్క్రీన్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ 14 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు: మార్చిలో ఏకంగా..) ఫీచర్స్: కొత్త ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ బైకులో 7 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీఎఫ్టీ టచ్స్క్రీన్ ఉంటుంది. కావున వినియోగదారుడు దీని ద్వారా బ్లూటుత్ కనెక్టివిటీ ఆప్షన్ పొందటమే కాకుండా.. బైక్ లొకేటింగ్, జియో ఫెన్సింగ్, లో బ్యాటరీ అలర్ట్, యాంటీ-థెఫ్ట్ వంటి సమాచారం తెలుసుకోవచ్చు. బ్యాటరీ & రేంజ్: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త వాడర్ ఎలక్ట్రిక్ బైక్ IP67 రేటెడ్ 3.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ పొందుతుంది. ఇది 170 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 125 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది రైడర్ ఎంచుకునే రైడింగ్ మోడ్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ కేవలం 4 గంటల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. -
రూ. 31.50 లక్షల బైక్.. భారత్లో విడుదల
ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ బిఎండబ్ల్యు మోటొరాడ్ (BMW Motorrad) దేశీయ మార్కెట్లో కొత్త ఆర్18 ట్రాన్స్కాంటినెంటల్ బైక్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆర్18 లైనప్లో చేసింది. ధరలు: భారతదేశంలో విడుదలైన కొత్త బిఎండబ్ల్యు మోటొరాడ్ ఆర్18 ట్రాన్స్కాంటినెంటల్ ధర అక్షరాలా రూ. 31.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే ఈ లైనప్లో ఆర్18, ఆర్18 ఫస్ట్ ఎడిషన్, ఆర్18 క్లాసిక్ ఫస్ట్ ఎడిషన్ వంటివి ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఆర్18 ట్రాన్స్కాంటినెంటల్ చేరింది. కలర్ ఆప్సన్స్: బిఎండబ్ల్యు మోటొరాడ్ ఆర్18 ట్రాన్స్కాంటినెంటల్ మొత్తం ఐదు కలర్ అప్షన్స్లో లభిస్తుంది. అవి బ్లాక్ స్టార్మ్ మెటాలిక్, గ్రావిటీ బ్లూ మెటాలిక్, మాన్హట్టన్ మెటాలిక్ మ్యాట్, మినరల్ వైట్ మెటాలిక్, గెలాక్సీ డస్ట్ మెటాలిక్/టైటాన్ సిల్వర్ 2 మెటాలిక్ కలర్స్. డిజైన్ & ఫీచర్స్: ఆర్18 ట్రాన్స్కాంటినెంటల్ దాని మునుపటి మోడల్స్కి కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో విండ్స్క్రీన్, విండ్ డిఫ్లెక్టర్లు, బాడీ-కలర్డ్ ప్యానియర్స్, టాప్బాక్స్తో పెద్ద హ్యాండిల్బార్ మౌంటెడ్ ఫెయిరింగ్ ఉన్నాయి. అంతే కాకుండా పిలియన్ సీటు, అల్లాయ్ వీల్స్ కూడా చూడవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ చూడవచ్చు. ఇది రౌండ్ అనలాగ్ గేజ్లతో 10.25 ఇంచెస్ స్క్రీన్. ఈ బైకులో ఆరు స్పీకర్లు, సబ్ వూఫర్తో మార్షల్ గోల్డ్ సిరీస్ స్టేజ్ 2 సౌండ్ సిస్టమ్ ఉంటుంది. యాక్టివ్ క్రూయిస్ కంట్రోల్ రాడార్ సెన్సార్లను ఉపయోగించి వేగాన్ని అడ్జస్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: మునుపెన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్: ఇప్పటికే..) పవర్ట్రెయిన్: బిఎండబ్ల్యు మోటొరాడ్ ఆర్18 ట్రాన్స్కాంటినెంటల్ బైక్ అదే 1,802సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్ కలిగి 91 హెచ్పి పవర్, 158 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి రెయిన్, రోల్, రాక్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
2023 Royal Enfield 650 Twins: రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇప్పుడు మరింత కొత్తగా
వాహన ప్రేమికులు రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 & కాంటినెంటల్ GT 650 బైకులను లేటెస్ట్ అప్డేట్స్తో లాంచ్ చేసింది. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆధునిక బైకుల ధరలు కలర్ ఆప్సన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాంటినెంటల్ జిటి 650 బైక్ ప్రారంభ ధర రూ. 3.19 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 3.39 లక్షల వరకు ఉంటుంది. ఇక ఇంటర్సెప్టర్ 650 ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 3.21 లక్షలు. ధరలు వీటి మునుపటి మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. కలర్ ఆప్సన్స్: కాంటినెంటల్ జిటి 650 బైక్ రాకర్ రెడ్/బ్రిటీష్ రేసింగ్ గ్రీన్, డక్స్ డీలక్స్, అపెక్స్ గ్రే/స్లిప్స్ట్రీమ్ బ్లూ అనే మూడు కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. అదే సమయంలో ఇంటర్సెప్టర్ 650 విషయానికి వస్తే క్యాన్యన్ రెడ్/కాలి గ్రీన్, బ్లాక్ పెర్ల్/సన్సెట్ స్ట్రిప్, బార్సిలోనా బ్లూ/బ్లాక్ రే కలర్స్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) అప్డేటెడ్ డిజైన్ & ఫీచర్స్: ఆధునిక హంగులతో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇంజిన్, అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్, సైడ్ ప్యానెల్ వంటివి బ్లాక్-అవుట్ థీమ్ పొందుతాయి. ఇందులో ఇప్పుడు అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. అంతే కాకుండా కొత్త అల్యూమినియం స్విచ్ క్యూబ్స్, ఎల్ఈడీ హెడ్లైట్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. యుఎస్బి ఛార్జింగ్ ఆప్సన్ కూడా ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్గా వస్తోంది. ట్యూబ్లెస్ టైర్స్ ఈ బైకులలో అమర్చారు. ఇంజిన్: అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 డిజైన్, ఫీచర్స్ అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాంటినెంటల్ జిటి, ఇంటర్సెప్టర్ బైక్ రెండూ 648 సీసీ ప్యారలల్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కలిగి 47.5 హెచ్పి పవర్, 52 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. (ఇదీ చదవండి: వెహికల్ స్క్రాపింగ్పై క్లారిటీ వచ్చేసింది.. చూశారా!) బ్రేకింగ్ & సస్పెన్షన్ సెటప్: భారతీయ మార్కెట్లో 650 సిసి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బైకులు బోల్ట్ ట్రస్సింగ్తో ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ను కలిగి 41 మిమీ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు డ్యూయల్ కాయిల్-ఓవర్ షాక్లు పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్స్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, డ్యూయెల్ ఛానల్ స్టాండర్డ్గా అందుబాటులో ఉంటుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్.. వచ్చేస్తున్నాయ్
భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా కంపెనీ అమ్మకాలు తారా స్థాయిలో చేరుకుంటున్నాయి. 2023 ఫిబ్రవరిలో 71,544 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 20.93 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ లైనప్లో హంటర్ 350సీసీ, బుల్లెట్ 350సీసీ, క్లాసిక్ 350సీసీ, మీటియోర్ 350సీసీ, హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, మరియు సూపర్ మెటోర్ 650 వంటి తొమ్మిది మోడళ్లు ఉన్నాయి. కంపెనీ కొత్త ప్రణాళికలో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో రెండు 350సీసీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అవి బుల్లెట్ 350, షాట్గన్ 350 బాబర్ బైకులు. అంతే కాకుండా 450 సీసీ విభాగంలో, 650 సీసీ విభాగంలో కొత్త బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350: రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ ఈ బుల్లెట్ 350. ఇది దాని మునుపటి మోడల్ కంటే అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. మీటియోర్ 350 మాదిరిగానే ఇది కూడా 5 స్పీడ్ గేర్బాక్స్తో 346 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ పొందనుంది. (ఇదీ చదవండి: బజాజ్ నుంచి అప్డేటెడ్ బైక్స్ విడుదల) రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 350 బాబర్: ఇక కంపెనీ విడుదలచేయనున్న మరో కొత్త బైక్ 'రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 350 బాబర్'. ఇది కూడా మీటియోర్ 350 మాదిరిగానే అదే ఇంజిన్, పర్ఫామెన్స్ పొందే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుంది. దీని ధర రూ. 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
అదిరే ఫీచర్స్తో హోండా కొత్త బైక్స్.. ధర ఎంతంటే?
హోండా మోటార్సైకిల్ ఇండియా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో హైనెస్ CB350, CB350RS బైకులను విడుదల చేసింది. సీబీ350 బైక్ ధర రూ. 2.10 లక్షల నుంచి రూ. 2.15 లక్షలు, కాగా సీబీ350ఆర్ఎస్ ధర రూ. 2.15 లక్షల నుంచి రూ. 2.18 లక్షల మధ్య ఉన్నాయి. హోండా విడుదల చేసిన ఈ కొత్త బైక్స్ చూడటానికి మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. కావున ధరలు రూ. 9,400 నుంచి రూ. 12,000 వరకు ఎక్కువగా ఉంటుంది. కొత్త హైనెస్ సీబీ350 ట్యాంక్పై రెండు తెల్లటి చారలు గమనించవచ్చు. సీబీ350ఆర్ఎస్ బైక్ గ్లోసి బ్లూ, మాట్ గ్రే/బ్లాక్ కలర్వే కలర్స్లో అందుబాటులో ఉంది. (ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!) హోండా కొత్త బైకులలో 349 సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 21 హెచ్పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. అదే సమయంలో స్ప్లిట్ సీట్ సెటప్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి. -
భారత్లో రూ. 27.22 లక్షల కవాసకి బైక్ విడుదల: పూర్తి వివరాలు
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో రెండు కొత్త బైకులను విడుదల చేసింది. ఇందులో ఒకటి ZH2 కాగా, మరొకటి ZH2 SE. వీటి ధరలు వరుసగా రూ. 23 లక్షలు, రూ. 27.22 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు వాటి మునుపటి మోడల్స్ కంటే రూ. 30,000 ఎక్కువ. బుకింగ్లు డీలర్షిప్లో లేదా ఆన్లైన్లో చేయవచ్చు. కవాసకి ఈ రెండు కొత్త బైకులను ఒకే మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే కలర్ ఆప్షన్లో అందిస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే.. జెడ్హెచ్2, జెడ్హెచ్2 ఎస్ రెండూ కూడా 998 సీసీ ఇన్లైన్, ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ సూపర్ చార్జ్డ్ ఇంజిన్ కలిగి 197 బీహెచ్పి పవర్, 137 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 1,299కే కొత్త ఇయర్ఫోన్స్.. ఒక్క ఛార్జ్తో 40 గంటలు) కవాసకి లేటెస్ట్ బైక్స్ ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ రైడింగ్ మోడ్లు, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకుండా స్కైహుక్ టెక్నాలజీతో కవాసకి క్విక్ షిఫ్టర్ (KQS), కవాసకి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సస్పెన్షన్ (KECS), కవాసాకి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సస్పెన్షన్ (KECS) వంటివి కూడా ఇందులో ఉన్నాయి. -
రూ. 3.93 లక్షలకే హ్యార్లీ డేవిడ్సన్ ఎక్స్350 బైక్
ప్రముఖ లగ్జరీ బైక్ మేకర్ హ్యార్లీ డేవిడ్సన్ ఎట్టకేలకు X350 మోటార్సైకిల్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ప్రస్తుతం కేవలం చైనా మార్కెట్లో మాత్రమే అమ్మకానికి ఉంటుంది. దీని ధర 33,388 యువాన్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.93 లక్షలు. చైనా మార్కెట్లో విజయం పొందిన తరువాత ఇండియా, బ్రెజిల్, థాయ్లాండ్ మార్కెట్లలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ 353 సీసీ, ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 34 బిహెచ్పి పవర్, 31 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో హ్యార్లీ డేవిడ్సన్ బైకులు చెప్పుకోదగ్గవి. అయితే ఇప్పుడు విడుదలైన ఎక్స్350 తక్కువ ధరతో లభించే మొదటి బైక్ అవుతుంది. ఈ లేటెస్ట్ బైక్ ముందు వైపు 41 మిమీ యుఎస్డి ఫోర్క్స్, వెనుక వైపు మోనో షాక్, ట్రెల్లిస్ ఫ్రేమ్, ట్విన్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్లు పొందుతుంది. (ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్.. 490 కి.మీ రేంజ్: కొత్త 'హ్యుందాయ్ కోన' వచ్చేస్తోంది) ఈ కొత్త బైక్ 13.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉండటం వల్ల లాంగ్ రైడింగ్కి కూడా అనుకూలంగా ఉంటుంది. ముందు, వెనుక వైపు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అదే సమయంలో జాయ్ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ అనే మూడు కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. -
హోండా నుంచి మరో బైక్ 'సిబి350 కేఫ్ రేసర్' - వివరాలు
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా CB350 లైనప్కి కొత్త నియో-రెట్రో మోటార్సైకిల్ జోడించడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. హైనెస్, ఆర్ఎస్ విడుదల చేసిన తరువాత, హోండా సిబి350 కేఫ్ రేసర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. హోండా సిబి350 కేఫ్ రేసర్ గురించి అధికారిక సమాచారం విడుదల కానప్పటికీ, ఇటీవల స్పెషల్ క్లోజ్డ్ డోర్ ఈవెంట్లో కనిపించింది. ఈ బైక్ సాధారణ మోడల్ మాదిరిగా కాకుండా.. చిన్న ఫ్లైస్క్రీన్, బ్యాక్ సీట్ కౌల్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మెకానిజమ్స్ మొత్తం సిబి350కి సమానంగా ఉంటుంది. హోండా సిబి350 కేఫ్ రేసర్ 348 సిసి ఇంజిన్ కలిగి, 20.6 బీహెచ్పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. సిబి350 కేఫ్ రేసర్ బైకులో హ్యాండిల్ బార్, ఫ్లుయెల్ ట్యాంక్ కొంత వెడల్పుగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో క్రోమ్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్, అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, యూఎస్బీ చార్జర్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి సిబి350 కేఫ్ రేసర్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, అయితే ఈ వివరాలు అధికారికంగా ఆవిష్కరణ సమయంలో వెల్లడవుతాయి. (గమనిక: ఈ కథనంలో ఉపయోగించి హోండా సిబి350 ఫోటో అవగాహన కోసం మాత్రమే.) -
చైనా మార్కెట్ కోసం హోండా.. ముచ్చటగా మూడు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'హోండా' చైనీస్ మార్కెట్ కోసం మూడు ఎలక్ట్రిక్ రెట్రో స్కూటర్లను పరిచయం చేసింది. ఈ మూడు స్కూటర్లు సింపుల్ డిజైన్ కలిగి మినిబైకుల మాదిరిగా ఉన్నాయి. ఇవి గతంలో పెట్రోల్ బేస్డ్ మోడల్స్గా అందుబాటులో ఉండేవి. చైనా కోసం రూపొందిన 'కబ్ ఈ (Cub e), డాక్స్ ఈ (Dax e) జూమర్ ఈ (Zoomer e)' ఎలక్ట్రిక్ స్కూటర్లు గతంలో ఎక్కువగా అమ్ముడైన పాపులర్ టూవీలర్స్. ఇవి 1958 నుంచి 2018 వరకు నిరంతరం సిరీస్లో భాగంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. హోండా కబ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఛార్జ్తో 64 కిమీ రేంజ్, డాక్స్ ఈ 80 కిలోమీటర్లు, జూమర్ ఇ సుమారు 90కి.మీ రేంజ్ అందిస్తుంది. కబ్ ఇ అనేది హోండా కబ్ ఆధారంగా రూపొందించబడింది. ఆ తరువాత ఆధునిక అప్డేట్స్ పొందింది. డాక్స్ ఈ దాని దాని మునుపటి మోడల్స్ ఆధారంగా రూపుదిద్దుకుంది. జూమర్ ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ రక్కస్ స్కూటర్ ప్రేరణ పొందింది. ఇది (రక్కస్) 49 సీసీ ఇంజన్తో అందుబాటులో ఉండేది. అయితే కంపెనీ ఇప్పుడు పరిచయం చేసిన మూడు మోడల్స్ పెట్రోల్ వెర్షన్స్ కాదు, ఇవి పూర్తిగా ఎలక్టిక్ మోపెడ్ స్కూటర్లు. ఇవి చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తాయి. కొత్త హోండా ఎలక్ట్రిక్ మోపెడ్ స్కూటర్లలో ఛార్జింగ్ అయిపోతే పెడల్ సహాయంతో సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. ఈ స్కూటర్ల యొక్క గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఇవి కేవలం చైనీస్ మార్కెట్లో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఇతర దేశాల్లో విక్రయించే అవకాశం లేదు. -
BMW R nineT & R 18: వందేళ్ల చరిత్రకు సాక్ష్యం.. లక్ ఉంటే ఈ బైక్ మీదే!
భారతీయ మార్కెట్లో అనేక కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి, ఈ తరుణంలో ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యు మోటొరాడ్ 100 సంవత్సరాల చరిత్రకు నిదర్శనంగా 'బిఎండబ్ల్యు ఆర్ 9టి 100 ఇయర్స్ & ఆర్ 18 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్' విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్స్ ధరలు వరుసగా రూ.24 లక్షలు (ఆర్ 9టి 100 ఇయర్స్), రూ.25.90 లక్షలు (ఆర్ 18 100 ఇయర్స్). నిజానికి ఈ బైకులు 1923లో మొదటి సారి మార్కెట్లో విడుదలయ్యాయి. ఆ తరువాత సరిగ్గా 100 సంవత్సరాలకు లిమిటెడ్ ఎడిషన్స్ రూపంలో పుట్టుకొచ్చాయి. ఈ రెండు బైకులు లిమిటెడ్ ఎడిషన్స్ కాబట్టి ఒక్కొక్క మోడల్ కేవలం 1923 యూనిట్లను మాత్రమే తీసుకొస్తోంది. బీఎండబ్ల్యు ఆర్ 9టి 100 ఇయర్స్ బైక్ రోడ్స్టర్ మోటార్సైకిల్ మాదిరిగా ఉంటుంది. ఇది ఎయిర్ కూల్డ్ 1,170 సీసీ ఫ్లాట్-ట్విన్ ఇంజన్ కలిగి 107.2 బీహెచ్పీ పవర్ 100.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఆర్ 18 క్రూయిజర్ మోటార్సైకిల్ మాదిరిగా ఉంటుంది, ఇది 1,802 సీసీ ఫ్లాట్-ట్విన్ ఇంజిన్ కలిగి 89.8 బిహెచ్పి పవర్, 158 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటాయి. 100 ఇయర్స్ ఎడిషన్స్ కాబట్టి, పేరుకు తగ్గట్టుగానే బ్యాడ్జ్, క్రోమ్ మిక్స్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, మిల్లింగ్ సిలిండర్ హెడ్ కవర్లు, ఇంజన్ హౌసింగ్ కవర్లు, సీట్ హోల్డర్లు, ఆయిల్ ఫిల్లర్ ప్లగ్, అడ్జస్టబుల్ హ్యాండ్ లివర్లు, ఫుట్పెగ్లు వంటివి ఇందులో చూడవచ్చు. ప్రత్యేకంగా ఈ బైక్ సీటును డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ ఆక్స్బ్లడ్ ఫినిషింగ్తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఆర్9టి బైకుతో పోలిస్తే ఆర్ 18 బైకులో తక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ ఉన్నాయి. ఇందులోని టియర్డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ వైట్ కలర్లో ఉన్న డబుల్ పెయింట్ లైన్స్ చూడవచ్చు. డ్యూయెల్ కలర్ సీటు మీద 100 ఇయర్స్ బ్యాడ్జ్ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా అక్రాపోవిక్ ఎగ్జాస్ట్, ఎల్ఈడీ హెడ్లైట్, హీటెడ్ గ్రిప్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఇందులో ఉన్నాయి. -
కళ్లు చెదిరే బైక్లు లాంచ్ చేసిన యమహా.. సూపర్ ఫీచర్స్!
యువత అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్, అధిక సీసీ బైక్లను తయారు చేస్తున్న యమహా మోటార్ ఇండియా కంపెనీ 150 సీసీ రేంజ్లో మరికొన్ని వర్షన్లను లాంచ్ చేసింది. యమహా ఆర్15 వీ4, ఎంటీ 15, ఎఫ్జెడ్-ఎక్స్ బైక్లను విడుదల చేసింది. వీటి ప్రత్యేకతలు.. ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. మిగతా యమహా 150 సీసీ బైక్లకు ఉన్న ఇంజిన్ ప్రత్యేకతలన్నీ వీటికీ కొనసాగింపు. బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా కొత్తగా ఆన్బోర్డ్ డయాగ్నస్టిక్ డివైజ్(ఓబీడీ). అన్నింటికీ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఎఫ్జెడ్-ఎక్స్లో 149 సీసీ ఎఫ్ఐ ఇంజిన్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్ అలర్ట్స్ వచ్చే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఎంటీ 15లో అప్సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, డిజిటల్ ఎల్సీడీ మీటర్. ఆర్15 వీ4లో ఏబీఎస్ డ్యుయల్ చానల్. యమహా ఎంటీ 15 వీ5లో నాలుగు రంగులు. ధర రూ.1,68,400. ఎఫ్జెడ్ఎస్ ఎఫ్ఐ వీ4 డీలక్స్ మూడు రంగులు. ధర రూ.1,27,400. ఎఫ్జెడ్ ఎఫ్ఐ వీ3 డీలక్స్ రెండు రంగులు. ధర రూ.1,15,200. ఎఫ్జెడ్-ఎక్స్ మూడు రంగులు. డాక్ట్ మ్యాటీ బ్లూ ధర రూ.1,36,900, మిగతా రెండింటి ధర రూ.1,35,900. ఆర్15 వీ4 ఒకే రంగు. ధర రూ.1,93,900. (ధరలన్నీ ఢిల్లీ ఎక్స్షోరూం ప్రైజెస్) -
జావా అదిరిపోయే కొత్త బైక్ చూశారా? ధర కూడా అంతే అదుర్స్
న్యూఢిల్లీ: లగ్జరీ బైక్ మేకర్ జావా కొత్త బైక్ను లాంచ్ చేసింది. జావా 42 బాబర్ పేరుతో సూపర్ బైక్ను తీసుకొచ్చింది.సరికొత్త డిజైన్తో, అప్గ్రేడెడ్ ఫీచర్స్తో వస్తున్న ఈ బైక్ ధరను ధర రూ. 2.06 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. (Akasa Air ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!) జావా 42 బాబర్ మిస్టిక్ కాపర్, మూన్స్టోన్ వైట్, డ్యూయల్ టోన్ జాస్పర్ రెడ్ మూడు రంగుల్లో లభిస్తుంది. టెస్ట్ రైడ్లతో పాటు వచ్చే వారం ప్రారంభంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కొత్త రౌండ్ హెడ్ల్యాంప్, ఇండిపెండెంట్ క్లాక్ కన్సోల్, కొత్త హ్యాండిల్ బార్, కొత్త ఫ్యూయల్ ట్యాంక్, రీడిజైన్ చేసిన సీట్లు ప్రధాన ఫీచర్లుగా ఉండగా, ఇంకాకన్సోల్ LCD స్క్రీన్, ఫంక్షన్లను నియంత్రించడానికి కొత్త స్విచ్గేర్ కూడా జోడించింది. ఫ్లోటింగ్ సీటు 2స్టెప్ ఎడ్జస్టబుల్ ఫీచర్తో రైడర్ తనకనుగుణంగా ముందుకి, వెనక్కీ ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంజీన్: ఇక ఇంజీన్ విషయానికి వస్తే జావా పెరాక్ మాదిరిగానే 334cc ఇంజన్ అందించింది. ఇది 30.64 PS పవర్, 32.74 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్, రీట్యూన్డ్ సస్పెన్షన్,రీకాలిబ్రేటెడ్ బ్రేక్, కాంటినెంటల్ డ్యూయల్ ఛానల్ ABSని ప్రామాణికంగా అందిస్తున్నట్టు జావా వెల్లడించింది. ధరలు జావా 42 బాబర్ మిస్టిక్ కాపర్ ధర రూ. 2,06,500 జావా 42 బాబర్ మూన్స్టోన్ వైట్ ధర రూ.2, 07,500 జావా 42 బాబర్ డ్యూయల్ టోన్ జాస్పర్ రెడ్ ధర రూ. 2,09,187 -
డుగ్గుడుగ్గు మంటూ..రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ వచ్చేస్తోంది!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ మరో బైక్ను విడుదల చేయనుంది. హంటర్ 350 పేరుతో ఆదివారం ఈ బైక్ను మార్కెట్కు పరిచయం చేయనుంది. ఈ బైక్ ధర రూ.1,30,000 నుంచి రూ.1,40,000 ధర మధ్యలో ఉండనుంది. ప్రస్తుతం ఈ బైక్ తరహాలో టీవీఎస్ రోనిన్, ట్రయంఫ్ బోన్నెవిల్లే టీ120, రాయిల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హంటర్ 350 స్పెసిఫికేషన్స్ రాయిల్ ఎన్ ఫీల్డ్ సంస్థ హంటర్ 350ని నేటి తరం ట్రెండ్కు తగ్గట్లుగా డిజైన్ చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే బైక్ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెహికల్ చాసిస్(బైక్ బాడీ)ను పలు మార్లు డిజైన్ చేయడం అవి నచ్చకపోవడం చివరకు ఈ తరహాలో తయారు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మిగిలిన బైక్స్తో పోలిస్తే రాయిల్ ఎన్ఫీల్డ్ 350సీసీ రేంజ్,ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ను అమర్చారు. హంటర్లో రౌండ్ లైట్ క్లస్టర్లు,స్పీడ్ను కంట్రోల్ చేసే ట్విన్ రియర్ షాక్లు వంటి అనేక క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ డిజైన్ ఎలిమెంట్స్ను కలిగి ఉంది. అయితే మొత్తం డిజైన్ 350 సీసీ శ్రేణిలో క్రూయిజర్ కంటే రోడ్స్టర్గా ఉంది. సీసీ ఒకేలా ఉన్నా బైక్ డిజైన్ ప్రత్యేకంగా ఉందని రాయల్ ఎన్ఫీల్డ్ చెబుతోంది. ఈ బైక్లో స్పీడ్ను కంట్రోల్ చేయడం లేదంటే పెంచేందుకు ఉపయోగపడే ఫ్రంట్ పోర్క్ను 41ఎంఎం(మిల్లీ మీటర్స్) నుండి 130ఎంఎం వరకు అందించింది. అయితే వెనుక భాగంలో 6 దశల ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్,102ఎంఎం వీల్ ట్రావెల్తో ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్లతో డిజైన్ చేసింది. 17అంగుళాల టైర్లను అమర్చింది. టియర్ డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, రైడర్కు మోకాళ్లపై స్ట్రెస్ తగ్గించింది. ఫ్రీగా ఉండేలా డ్రైవింగ్ సీటు వెనుక బాగా ఫ్లాట్గా ఉండేలా రూపొందించింది. అయితే ఫుట్ పెగ్లు మరింత వెనక్కి జరిపి స్పోర్టియర్ రైడింగ్ పొజిషన్ను అందిస్తుంది. ఈ బైక్లో టెయిల్ ల్యాంప్ ఎల్ఈడీ యూనిట్ అయితే హెడ్ల్యాంప్ హాలోజన్ బల్బ్తో వస్తుంది. -
కళ్లు చెదిరే సూపర్ బైక్లు , అదిరిపోయే ధర
ముంబై: బ్రిటీష్ మోటార్సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్, తన ఫ్లాగ్షిప్ అడ్వెంచర్ (ADV) బైక్ 'టైగర్ 1200' 2022 వెర్షన్ను భారతదేశంలో విడుదల చేసింది, 2021 చివరిలో గ్లోబల్గా లాంచ్ చేసిన ‘ట్రయంఫ్ టైగర్ 1200 ’ సూపర్ బైక్లను ఇండియన్ మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. జీటీ ప్రో, ర్యాలీ ప్రో, జీటీ ఎక్స్ప్లోరర్, ర్యాలీ ఎక్స్ప్లోరర్ అనే నాలుగు వేరియంట్లలో ఈ బైక్స్ అందుబాటులో ఉంటాయి. బేస్ వేరియంట్ ధర రూ. 19.19 లక్షల (ఎక్స్-షోరూమ్) టాప్ వేరియంట్ ధర రూ. 21.69 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఇవి హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా, డుకాటీ మల్టీ స్ట్రాడాతో పోటీగా నిలవనున్నాయి. కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 ADVని స్పోక్డ్ వీల్స్ , లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఫీచర్లతో రెండు కేటగిరీలుగా తీసుకొచ్చింది. బ్రెంబో కాలిపర్లతో పాటు ముందు వైపున ట్విన్ 320ఎమ్ఎమ్ ఫ్లోటింగ్ డిస్క్లు , వెనుక వైపున ఒక సింగిల్ 280ఎమ్ఎమ్ డిస్క్లు, డ్యూయల్-ఛానల్ ABS కూడా అమర్చింది. ఇక ప్రో, ఎక్స్ప్లోరర్ వేరియంట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ప్రో ట్రిమ్లలో అందించే 20-లీటర్తో పోలిస్తే ఎక్స్ప్లోరర్ వేరియంట్లు 30-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో లభిస్తాయి. ట్రయంఫ్ టైగర్ 1200 స్పెక్స్ T-ప్లేన్ క్రాంక్ షాఫ్ట్తో 1,160cc ఇన్లైన్-ట్రిపుల్ సిలిండర్ ఇంజన్. 148 బీహెచ్పీ , 130 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. బైక్ స్లిప్ ,అసిస్ట్ క్లచ్తో కూడిన 6-స్పీడ్ గేర్బాక్స్ను కూడా అమర్చింది. పాత బైక్లతో పోలిస్తే 25 కిలోల బరువు కూడా తక్కువ. కొత్త ఫ్రేమ్, డబుల్ సైడెడ్ స్వింగ్ఆర్మ్ అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్ని ఉపయోగించడం ద్వారా బైక్ బరువును తగ్గించింది. సేఫ్టీ ఫీచర్లు బ్లైండ్ స్పాట్ , లేన్ చేంజ్ వార్నింగ్ సిస్టమ్, లీన్-సెన్సిటివ్ కార్నరింగ్ లైట్లు, బ్లూటూత్ సపోర్ట్తో కూడిన 7-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ఆరు రైడింగ్ మోడ్ల వరకు, ఒక రాడార్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. డౌన్ క్విక్షిఫ్టర్, హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్ , కీలెస్ ఆపరేషన్. ఎక్స్ప్లోరర్ వేరియంట్లలో టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హీటెడ్ రైడర్, పిలియన్ సీట్లు అదనం. -
వచ్చేస్తున్నాయ్! ఆగస్టులో రయ్రయ్మంటూ...
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశమంతా ఆగస్టులో ఆజాదీ కా అమృత్ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఓలా స్కూటర్ కూడా ఇదే నెలలో డెలివరీకి రెడీ అవుతోంది. ఓలాతో పాటు ఈ నెలలో రిలీజ్ కాబోతున్న ముఖ్యమైన వెహికల్స్ గురించి క్లుప్తంగా ఓలా పెరిగిన పెట్రోలు ధరలతో జనమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. దీంతో లక్ష ప్రీ బుకింగ్స్ సాధించి ఓలా రికార్డు సృష్టించింది. పది రంగుల్లో వంద కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ రాబోతుందని అంచనా. ఇంకా తేది ఖరారు కానప్పటికీ ఆగస్టులోనే ఓలా స్కూటర్ రోడ్లపై పరుగులు పెడుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సక్సెస్ ఫుల్ మోడల్ క్లాసిక్ 350కి మరిన్ని హంగులు జోడించి న్యూజెనరేషన్ మోడల్ని ఆగస్టులో మార్కెట్లోకి తెస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ తెస్తోంది. న్యూ ఇంజన్, ఫ్రేమ, టెక్నాలజీ, అధునాత ఫీచర్లను రాయల్ఎన్ఫీల్డ్ జోడించింది. ఇప్పటి వరకు ఉపయోగించిన ఇంజన్ స్థానంలో మెటియోర్ 350లో వాడే ఇంజన్ను ఆర్ఈ తెచ్చింది. సీటు, లైటు, హ్యాండిల్ బార్, పెయింట్ స్కీం, డిస్క్ బ్రేకుల్లో మార్పులు చేసింది. బీఎండబ్ల్యూ సీ 400 జీటీ బీఎండబ్ల్యూ మోటారడ్ నుంచి సరికొత్త సీ 400 జీటీ మ్యాక్సీ స్కూటర్ని మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది. ఈ ప్రీమియం మోడల్ స్కూటర్ ధర రూ. 5 లక్షల దగ్గర ఉండవచ్చని అంచనా. సింపుల్వన్ ఎమర్జింగ్ మార్కెట్గా భావిస్తోన్న ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది సింపుల్ వన్ స్కూటర్. ఆగస్టు 15న ఈ స్కూటర్ ఇండియా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, అథర్లకు పోటీగా ఇది మార్కెట్లోకి వస్తోంది. హోండా హర్నెట్ 2.0 బేస్డ్ ఏడీవీ ఈ నెలలో హార్నెట్ 2.0 ఏడీవీ మోడల్ రిలీజ్ చేసేందుకు హోండా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హోండాకి చెందిన రెడ్ వింగ్ లైన్ డీలర్షిప్ ద్వారా ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ బైకు ధర రూ.1.20 నుంచి 1.50ల మధ్య ఉండవచ్చు. -
3.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం
ముంబై: బీఎండబ్ల్యూ అనుబంధ ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ శుక్రవారం తన ఆర్ నైన్ టీ, ఆర్ నైన్ టీ స్కాంబ్లర్ మోడళ్ల కొత్త వెర్షన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ధరలు వరుసగా రూ.18.5 లక్షలు, రూ.16.75 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉన్నాయి. బీఎస్–6 ప్రమాణాలను కలిగిన ఈ రెండు బైకుల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటిలో 1,170 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ను అమర్చారు. కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. గంటకు గరిష్టంగా 200 వేగంతో ప్రయాణించగలవు. బీఎండబ్ల్యూ మోటోరాడ్ షోరూముల్లో ఈ కొత్త బైక్లను బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ చార్జింగ్పై స్టెర్లింగ్ అండ్ విల్సన్ కన్ను న్యూఢిల్లీ: దేశీ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో ప్రవేశించేందుకు వీలుగా ఈనెల్ ఎక్స్తో చేతులు కలిపినట్లు స్టెర్లింగ్ అండ్ విల్సన్ పేర్కొంది. తద్వారా సమాన వాటా (50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కాగా, క్విక్ ఎలక్ట్రిక్ చార్జర్ సౌకర్యాలతో దేశీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు స్టెర్లింగ్ జనరేటర్స్ సీఈవో సంజయ్ జాధవ్ అభిప్రాయపడ్డారు. -
కొత్త బెనెల్లి లియోన్సినో 500 వచ్చేసింది : ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: బెనెల్లి ఇండియా కొత్త ప్రీమియం బైక్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. దేశీయ బీఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 2021 బెనెల్లి లియోన్సినో 500 వెర్షన్ను విడుదల చేసింది. 2021 మోడల్ లియోన్సినో 500 స్టీల్ గ్రే, రెడ్ రెండు రంగులలో లభిస్తుంది. స్టీల్ గ్రే కలర్ వేరియంట్ ధరను 4,59,900 (ఎక్స్-షోరూమ్), రెడ్ కలర్ మోడల్ ధర రూ. 4,69,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. బీఎస్-6 బెనెల్లి లియోన్సినో 500 ను విడుదల చేయడం సంతోషంగా ఉందని బెనెల్లి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝాబక్ వ్యాఖ్యానించారు. దేశీయ మార్కెట్లో కొత్త బెనెల్లి లియోన్సినో 500 బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించాయి. 10వేల రూపాయలు చెల్లించి కంపెనీ డీలర్షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో డెలివరీ ప్రారంభించనుంది. మరోవైపు ఈ బైక్ 2019మోడల్ రూ.4,79,000 (ఎక్స్-షోరూమ్) ధరతో పోలిస్తే 2021మోడల్ ధరను తగ్గించడం విశేషం. 2021లో బీఎస్-6 బెనెల్లి మోటార్సైకిళ్లను ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా, మహావీర్ గ్రూప్తో పాటు భారతదేశంలో విడుదల చేయాలని బెనెల్లి యోచిస్తోంది. బీఎస్-6 బెనెల్లి లియోన్సినో 500 విశేషాలు మంచి పనితీరు, ఆకర్షణీయమైన నేకెడ్ రెట్రో స్క్రాంబ్లర్ లుక్తో పాటు ఇతర కొత్త ఫీచర్లు జోడించింది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, టెయిల్ లైట్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ వంటివి ఉన్నాయి. 500 సీసీ ఇంజిన్, 4 స్ట్రోక్ ట్విన్ సిలిండర్, డీఓహెచ్సి, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్పీఎం వద్ద 47.5 బీహెచ్పీ పవర్ను 6,000 ఆర్పీఎం వద్ద 46 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ గేర్బాక్స్, టెలిస్కోపిక్ ఫోర్క్, లీన్ కంట్రోల్, కార్నరింగ్ ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఇతర ఫీజర్లు ఇందులో ఉన్నాయి. -
కొత్త ప్రపంచం 15th Dec 2019
-
కొత్త ప్రపంచం 10th Nov 2019
-
కొత్త ప్రపంచం 3rd Nov 2019
-
కొత్త ప్రపంచం 28th July 2019
-
హీరో మోటో టూరింగ్ బైక్స్ : బడ్జెట్ ధరలో
దేశీయ దిగ్గజ టూవీలర్ మేకర్ హీరో మోటొకార్ప్ కొత్త బైక్స్ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎక్స్పల్స్ 200, ఎక్స్పల్స్ 200టీ, కరిజ్మ 200 బైక్స్ పేరుతో మూడు సరికొత్త టైవీలర్స్ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. లాంగ్ గ్యాప్ తరువాత హీరో కంపెనీ వీటిని 1న ఇవి మార్కెట్లో ఆవిష్కరించనుంది. తాజాగా ఈ బైక్స్ లైవ్ ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. 2017, 2018 ఈఐసీఎంఏషోలో పరిచయం చేసిన ఎక్స్పల్స్ 200, ఎక్స్పల్స్ 200టీ అనే ఈ రెండు బైక్స్లోనూ ఇంజిన్ పరంగా దాదాపు ఒకేలా ఉండనున్నాయి. అయితే మెకానికల్గా స్వల్ప మార్పులతో రైడింగ్ స్టైల్ మాత్రం భిన్నంగా ఉండనున్నాయి. 200సీసీ ఇంజీన్, 5స్పీడ్ టాన్స్మిషన్, సింగిల్ ఛానల్ ఏబీఎస్, 17 అంగుళాల అల్లోయ్ వీల్స్ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఫ్లై స్క్రీన్, ఆల్ డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, బ్లూటూత్, నావిగేషన్, ఎల్ఈడీ లైట్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. వీటి ధరలు రూ.1-రూ.1.1 లక్షల మధ్య నిర్ణయించవచ్చని అంచనా. బడ్జెట్ధరలో అందుబాటులోకి రానున్న టూరింగ్ బైక్స్ ఇవే నని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కరిజ్మ 200 అనే మరో కొత్త బైక్ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముందని తెలుస్తోంది. -
మోస్ట్ ఎవైటెడ్ బైక్స్ లాంచ్
సాక్షి, న్యూ ఢిల్లీ : ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొత్త బైక్ మోడళ్లను ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఇండియా యమహా మోటార్ లాంచ్ చేసింది. ఎంటీ-15 పేరుతో సరికొత్త 155సీసీ బైక్ను కంపెనీ శుక్రవారం విడుదల చేసింది. దీని ధర రూ. 1.36లక్షలు(ఎక్స్ షోరూం న్యూఢిల్లీ)గా నిర్ణయించింది. ఎంటీ సిరీస్లో భాగంగా తీసుకొచ్చిన ఎంటీ-15 బైక్లో లిక్విడ్ కూల్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), వేరియబుల్ వ్యాల్యూ యాక్చుయేషన్ తదితర అధునాతన ఫీచర్లు ఈ కొత్త బైక్లో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మెటాలిక్ బ్లాక్, డార్క్ మ్యాట్ బ్లూ కలర్స్లో ఇది లభ్యం కానుంది. అలాగే ట్యాంక్ ప్యాడ్, సీట్ కవర్, మొబైల్ హోల్డర్, పోలో షర్ట్స్, స్టికర్, కీ రింగ్ లాంటి యాక్సెసరీస్ ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఏడాది 60వేల ఎంటీ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియా యమహా మోటార్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర సింగ్ తెలిపారు. మార్కెట్ డిమాండ్ను బట్టి ఎంటీ-03 లాంటి బైక్లను కూడా భారత్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. యమహా ఇప్పటికే పలు మోడళ్లను తయారుచేసింది. అయితే భారత్లో ఎంటీ-09 మోడల్ను మాత్రమే విడుదల చేసింది. 2015 నుంచి ఈ మోడల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. దాని తర్వాత మళ్లీ ఎంటీ సిరీస్లో ఇప్పుడు ఎంటీ-15 బైక్ను తీసుకొచ్చింది. -
కొత్త ప్రపంచం 3rd Feb 2019
-
కొత్తప్రపంచం 20th jan 2019
-
బీఎండబ్ల్యూ రెండు కొత్త బైక్లు
లగ్జరీ కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన బీఎండబ్ల్యూ రెండు ప్రీమియం బైకుల 2019 మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. బీఎండబ్ల్యూ కు చెందిన మోటార్ సైకిళ్ళ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్ భారత మార్కెట్లలో నిన్న (జనవరి 18 శుక్రవారం) ఆర్1250జీఎస్, ఆర్1250జీఎస్ అడ్వెంచర్ పేరుతో రెండు బైకులను విడుదల చేసింది. ఈ సూపర్ బైక్లు బ్లాక్ , బ్రీజ్ , సిల్వర్ మెటాలిక్ రంగుల్లో ,రెండు వేరియంట్లలో లభించనున్నాయి. దేశీయ డీలర్ల వద్ద బుక్కింగ్స్ అందుబాటులో ఉన్నాయి. 1,254 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్,136హెచ్పీ పవర్,143 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. వీటి ధరల శ్రేణి రూ. 16.5 లక్షల నుండి 21.95 లక్షలుగా ఉంది. -
కొత్త ప్రపంచం 30th Dec 2018
-
కొత్త ప్రపంచం 23rd Dec 2018
-
జావా బైక్స్ బ్యాక్ : మూడు వేరియంట్లలో
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్ర అండ్ మహీంద్ర అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ప్రయివేటు లిమిటెడ్ ఖరీదైన బైక్లను లాంచ్ చేసింది. జావా బ్రాండ్లో మూడు మోటార్ బైక్లను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది అయితే ఇవి వచ్చే ఏడాది ఆరంభంలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ జావా న్యూ జనరేషన్ అవతార్లో భారతీయ విఫణిలోప్రజాదరణ పొందిన తన జావా మోటార్ సైకిళ్లను తిరిగి ప్రారంభించింది. జావా, జావా 42, పెరాక్ పేర్లతో ఈ బైక్స్ను తీసుకొచ్చింది. 293సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్తో, బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా వీటిని రూపొందించింది. వీటి (ఎక్స్ షోరూం ఢిల్లీ) ధరలు ఇలా ఉన్నాయి. జావా ధర :1.55 లక్షల రూపాయలు జావా 42 : 1.64లక్షల రూపాయలు జావా పెరాక్ : 1.89లక్షల రూపాయలు జావా బైక్ బ్లాక్, మరూన్, గ్రే కలర్స్లో లభ్యంకానుండగా, జావా 42 హాలీస్ టీల్, గెలాక్సీ గ్రీన్, స్టార్లైట్ బ్లూ, లుమస్ లైమ్, నెబ్యులా బ్లూ, కామెట్ రెడ్ అందుబాటులోకి రానుంది. ఇంజీన్, ఇతర స్పెసిఫికేషన్స్ 293 సిసీ సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 27హెచ్పీ, 28 ఎన్ఎమ్ టార్క్ను అందిస్తుంది. 6స్పీడ్ ట్రాన్స్మిషన్, రౌండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రౌండ్ హెడ్లాంప్స్, డ్యూయల్ టోన్ క్రోమ్ ఫినిష్ ఫ్యూయల్ ట్యాంక్, ట్విన్ ఎగ్జాస్ట్స్, ఫ్లాట్ జీడిల్. చైన్ కవర్, ఇతర ప్రధాన ఫీచర్లు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్లను ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఇవి వినిగాదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పిత్తంపూర్లో మహీంద్రా ప్లాంట్లో రూపుదిద్దుకున్న ఈ బైకుల విక్రయాల కోసం సుమారు 105 డీలర్లు రూ.2 కోట్లు డిపాజిట్ చేశారు. మొదటి దశలో, వచ్చే నెల ప్రారంభంలో ప్రధాన నగరాల్లో 64 డీలర్షిప్లను ప్రారంభించనున్నారు. టెస్ట్ డ్రైవ్, డెలివరీ ఫిబ్రవరి 2019 నాటికి ప్రారంభం. -
కొత్త ప్రపంచం 30th sep 2018
-
డుకాటీ స్క్రాంబ్లర్ 1100 లాంచ్, ధర ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ: సూపర్ బైక్ మేకర్ డుకాటీ తన కొత్త స్క్రాంబ్లర్ 1100 ను ఇండియాలో విడుదల చేసింది. ఇప్పటి వరకు తన బైకులను లాంచ్ చేసిన మాదిరిగానే, కొత్త డుకాటీ స్క్రాంబ్లర్ 1100 ను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రారంభించింది. డుకాటీ స్క్రాంబ్లర్1100 బైకును స్టాండర్డ్, స్పెషల్, స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లలో విడుదల చేసింది. స్టైలింగ్ పరంగా, 803 సీసీ స్క్రాంబ్లర్ ను కొత్త స్క్రాంబ్లర్ 1100 పోలి ఉంటుంది. ముందుగా వచ్చిన మోడళ్ల కంటే ఇది చూడడానికి కాస్త స్టైలిష్, దృఢంగా కనిపిస్తుంది. బైకు నడిపేవారికి అవసరమైన సమాచారాన్ని చూపించడానికి కొత్త ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కూడా దీనికి అమర్చారు. ఇక ధరల విషయానికి వస్తే రూ. 10.91 లక్షలు ( ఎక్స్ షోరూమ్ )గా కంపెనీ నిర్ణయించింది. స్క్రాంబ్లర్ 1100 స్పెషల్ ధర రూ. 11.12 లక్షలు ( ఎక్స్ షోరూమ్ ), స్క్రాంబ్లర్ స్పోర్ట్స్ ధర రూ. 11.42 లక్షలు ( ఎక్స్ షోరూమ్ )గా ఉంది. డుకాటీ స్క్రాంబ్లర్ 1100 ప్రత్యేకతలు ఎల్ - ట్విన్ ఇంజన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, 1,079 సీసీ, 85 బీహెచ్ పీ శక్తి, 88 ఎన్ఎమ్ టార్క్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మూడు రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ వంటివి స్క్రాంబ్లర్ 1100 ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కొత్త స్క్రాంబ్లర్ 1100 కు ఫ్రంట్లో రెండు డిస్క్ బ్రేకులను, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్ను, మోనోషాక్ సస్పెన్షన్ వ్యవస్థ ను వెనుక వైపు అమర్చింది. -
మార్కెట్లోకి బీఎమ్డబ్ల్యూ కొత్త బైక్లు
న్యూఢిల్లీ: జర్మన్ కార్ల తయారీ సంస్థ బీఎమ్డబ్ల్యూ... 500 సీసీ లోపుండే భారత బైక్ల మార్కెట్లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చింది. బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్ సైకిల్ విభాగం మోటోరాడ్... భారత మార్కెట్లో బుధవారం రెండు సబ్–500 సీసీ బైక్లను విడుదల చేసింది. వీటిలో జీ310ఆర్ (ఎక్స్ షోరూం) ధర రూ.2.99 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. మెక్సికో, బ్రెజిల్, యూరోప్ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ బైక్ను ఇండియాలో విడుదల చేయడం ద్వారా కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నట్లు మోటోరాడ్ రీజినల్ హెడ్ డిమిట్రిస్ రాప్టిస్ చెప్పారు. ఇక డీ130జీఎస్ ధర రూ.3.49 లక్షలుగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. బీఎండబ్ల్యూ మోటోరాడ్... గతేడాదే భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే ఇప్పటిదాకా 1000సీసీ, అంతకు మించిన సామర్థ్యం ఉన్న బైక్లనే విక్రయిస్తోంది. తాజాగా 500 సీసీలోపుండే బైక్ మార్కెట్లోకి ప్రవేశించింది. తాజా రెండు మోడళ్ల విడుదలతో భారత మార్కెట్లో బీఎమ్డబ్ల్యూ బైక్ల పోర్టిఫోలియో 16కు చేరుకుందని రాప్టిస్ తెలిపారు. టీవీఎస్ హొసూర్ ప్లాంట్లో ఈ బైక్ల ఉత్పత్తి జరుగుతుండగా ఈ సంస్థతో దీర్ఘకాలిక బంధం కొనసాగించడం కోసం పలు పరికరాలను భారత్లోనే ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే 248 యూనిట్లు భారత్లో అమ్ముడయ్యాయని, 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల బైక్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. -
కొత్త ప్రపంచం 15th July 2018
-
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రెండు కొత్త బైక్స్
న్యూఢిల్లీ : దేశీయ దిగ్గజ మిడ్-సైజు మోటార్సైకిల్ తయారీదారి రాయల్ ఎన్ఫీల్డ్ తన రెండు కొత్త 650 సీసీ మోటార్సైకిల్స్ను ఆస్ట్రేలియా మార్కెట్కి తరలిస్తోంది. ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటర్ జీటీ 650 పేర్లతో రూపొందించిన ఈ బైక్లను ఆస్ట్రేలియన్ మార్కెట్లో రిటైల్ చేయబోతోంది. వీటి ధరలు ఆస్ట్రేలియా మార్కెట్లో 10వేల ఏయూడీ(సుమారు రూ.5.04 లక్షలుగా)గా, 10,400 ఏయూడీ( సుమారు రూ.5.24 లక్షలుగా)గా ఉన్నాయి. ఈ రెండు కొత్త బైక్లను చెన్నై ప్లాంట్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ తయారీచేసింది. భారత మార్కెట్లో కూడా వీటిని 2018 ఏప్రిల్ తర్వాత లాంచ్ చేయబోతోంది. అయితే భారత్లో వీటి ధరలు ఎంత ఉంటాయనేది కంపెనీ రివీల్ చేయడానికి నిరాకరించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత మార్కెట్లలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్ ధరలను పోల్చి చూస్తే.. త్వరలో భారత్లోకి రాబోతున్న ఈ బైక్స్ ధరలను అంచనా వేయొచ్చని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. హిమాలయన్ బైక్ ధర భారత్లో రూ.1.68 లక్షలుగా ఉండగా.. ఆస్ట్రేలియాలో రూ.3.02 లక్షలుగా ఉంది. అంటే కొత్త ఇంటర్సెప్టర్ 650 బైక్ ధర భారత మార్కెట్లో సుమారు రూ.3 లక్షలుగా ఉండొచ్చని తెలుస్తోంది. కాంటినెంటర్ జీటీ 650 ధర దానికి కంటే కాస్త ఎక్కువగా ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ల మాదిరిగానే, ఈ కొత్త బైక్లు కూడా రెట్రో స్టయిల్లో రూపొందాయి. కాంటినెంటర్ జీటీ 650 కేఫ్ రేసర్, ఇది ప్రస్తుతమున్న సింగిల్-సిలిండర్ కాంటినెంటర్ జీటీ 535 మాదిరిగానే ఉంది. ఇంటర్సెప్టర్ 650 తేలికగా రైడ్ చేయొచ్చు. ఈ రెండు కొత్త బైక్లు కొత్త 650సీసీ, ఎయిర్ కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్తో రూపొందాయి. ఈ బైక్స్లో అతిపెద్ద 320ఎంఎం ఫ్రంట్, 240ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్, అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జ్డ్ రియర్ షాక్ అబ్జార్బర్స్, ప్రీమియం పిరెల్లీ టైర్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లున్నాయి. -
నో హెల్మెట్.. నో పూజ!
పారదీప్: హెల్మెట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారని తెలుసు. పూజారులు కూడా పూజ చేయరనే విషయం మీకు తెలుసా? ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ప్రతిష్టాత్మక సరళాదేవి మాతా ఆలయ పూజారులు మాత్రం హెల్మెట్ లేకపోతే తాము పూజ చేయబోమని కచ్చితంగా చెప్పేస్తున్నారట. కొత్త ద్విచక్ర వాహనం కొనుక్కొని ఎవరు వచ్చినా.. హెల్మెట్ చూపితేనే పూజ చేస్తామని చెప్పడమే కాదు, లేనివారిని తిప్పి పంపుతున్నారట. స్థానిక పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆలయ పూజారులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆలయ పరిసరాల్లో కూడా పలుచోట్ల ‘నో హెల్మెట్.. నో పూజ’ అనే బోర్డులు పెట్టడంతో దేవి దర్శనానికి వచ్చిన భక్తులంతా హెల్మెట్ అవసరంపై చర్చించుకుంటాన్నారని పూజారులు చెబుతున్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పూజారులు చెబుతున్నారు. ఈ సరళాదేవి మాతా ఆలయం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని పూజారులు తెలిపారు. అందుకే ఇక్కడ వాహనాలకు పూజ చేయించుకుంటే మంచిదని భక్తులు భావిస్తారని వారు చెప్పారు. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరు కొత్త బండి కొన్నా ఈ ఆలయానికే వచ్చి పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోందట. అందుకే ఈ ఆలయంలోనే ‘నో హల్మెట్.. నో పూజ’ను అమలు చేయాలని భావించామని పోలీసులు తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు అన్నారు. -
జిల్జిగేల్మన్న కవసాకి బైక్స్
ఎన్నో రోజులుగా వస్తున్న ఊహాగానాలకు కవసాకి చెక్ పెట్టింది. దేశీయ టూ-వీలర్ మార్కెట్కు రెండు సరికొత్త బైక్స్ను ఆటో ఎక్స్పో 2018లో పరిచయం చేసింది. దానిలో ఒకటి నింజా హెచ్2 ఎస్ఎక్స్, మరొకటి హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ బైక్స్. కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ ధర రూ.21.8 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ ధర రూ.26.8 లక్షల నుంచి మొదలవుతోంది. సీబీయూ మార్గం ద్వారా నింజా హెచ్2 బైక్ను భారత్లో కంపెనీ విక్రయించనుంది. ఎస్ఎక్స్ రేంజ్ బైక్స్ను ఇటీవలే అంతర్జాతీయంగా కవసాకి తీసుకొచ్చింది. సూపర్ ఛార్జ్డ్ ఇంజిన్తో కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ రూపొందింది. స్పోర్ట్స్ టూరింగ్ సెగ్మెంట్లో వచ్చిన తొలి వాహనం ఇదే కావడం విశేషం. ఈ కొత్త కవసాకి హెచ్2 ఎస్ఎక్స్ బైక్, హెచ్2 కంటే 18 కేజీలు ఎక్కువ బరువు ఉంది. ప్రతిరోజూ రైడింగ్ చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ సూపర్ ఛార్జ్డ్ ఇంజిన్ను కవసాకి అభివృద్ధి చేసింది. ఈ ఇంజిన్ కొత్త సిలిండర్ హెడ్, పిస్టోన్, క్రాంక్షాఫ్ట్, కామ్షాఫ్ట్, థొరెటెల్ బాడీని కలిగి ఉండనుంది. సిక్స్ స్పీడ్ గేర్బాక్స్తో ఇది రూపొందింది. నింజా హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈకి ఎల్ఈడీ కార్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. నింజా హెచ్2 ఎస్ఎక్స్లో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. దూరప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. నింజా హెచ్2 ఎస్ఎక్స్తో పాటు కవసాకి వాల్కన్ ఎస్ 650 క్రూయిజర్ను కూడా కవసాకి ప్రదర్శించింది. ఇటీవల లాంచ్చేసిన జడ్900, జడ్ఎక్స్-10ఆర్లను కూడా ఈ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. -
ఆంధ్రా ట్రాఫిక్ పోలీసులకు కొత్త బైక్ లు
హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులకు త్వరలో కొత్త పెట్రోలింగ్ బైక్ లు రానున్నాయి. హోండా కంపెనీ ప్రతినిధులు పెట్రోలింగ్ బైక్ల నమూనాను సిద్ధంచేసి డీజీపీ జేవీ రాముడికి చూపించారు. డీజీపీ డిజైన్ ను అప్రూవ్ చేసినట్లు తెలిసింది. త్వరలో తెల్లటి హోండా డ్రీమ్ నియో బైక్లను ఆంధ్రా ట్రాఫిక్ పోలీసులకు ఇవ్వనున్నారు. తెలంగాణా ప్రభుత్వం హోండా సీబీజెడ్ ఎక్స్ట్రీమ్ వాహనాలను అందిస్తే, ఆంధ్రా ప్రభుత్వం హోండా డ్రీమ్ నియో బైక్లను ఇవ్వనుంది. హోండా సీబీజెడ్ ఎక్స్ట్రీమ్ ధర దాదాపు రూ. 80 వేలుగా ఉంటే డ్రీమ్ నియో ధర రూ.55 వేలు. పికప్ తక్కువగా ఉండే బైక్లు అందిస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు ఉసూరుమంటున్నారు. -
విజయవాడ మార్కట్లో రెండు న్యూ బైక్స్