new features
-
వాట్సప్ కొత్త ఫీచర్: దీని గురించి తెలిస్తే..
స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దాదాపు అందరూ వాట్సప్ వినియోగిస్తున్నారు. కంపెనీ కూడా యూజర్ల సౌకర్యార్థం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్' అనే ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.వాట్సప్ పరిచయం చేసిన కొత్త వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్.. వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్ అని పలువురు చెబుతున్నారు.నిజానికి వాయిస్ మెసేజ్ అనేది నలుగురిలో వినడానికి బహుశా చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వారు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్.. ఉపయోగించి టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. అయితే ఇది ట్రాన్స్లేటర్ కాదు, వాయిస్ మెసేజ్ ఏ రూపంలో ఉంటుందో.. ఆ భాషకు టెక్స్ట్ రూపం ఇస్తుంది.మెసేజ్ అందుకున్న వ్యక్తి మాత్రమే.. దీనిని వాయిస్ నుంచి టెక్స్ట్ రూపంలో మార్చుకోగలడు. కానీ పంపిన వ్యక్తికి ఆ అవకాశం లేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ వంటి భాషలకు సపోర్ట్ చేస్తాయి. ఐఓఎస్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలకు మాత్రమే కాకుండా.. అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్ వంటి వాటికి సపోర్ట్ చేస్తాయి. రాబోయే రోజుల్లో.. మరిన్ని భాషలకు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్వాట్సప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. సెట్టింగ్స్లో చాట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దానిని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడం ద్వారా.. భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే సపోర్ట్ చేయని భాషలను ఎంచుకుంటే.. ఎర్రర్ వస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది, రాబోయే రోజుల్లో ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. -
సన్రూఫ్.. సూపర్ క్రేజ్!
బీచ్ రోడ్డులోనో... ఫారెస్ట్ దారిలోనో కారులో అలా ఓ లాంగ్ డ్రైవ్కెళ్లాలని ఎవరికుండదు చెప్పండి? దీంతో పాటు కారులో సన్రూఫ్ కూడా ఉంటే... మజామజాగా ఉంటుంది కదూ! దేశంలో కారు ప్రియుల మది దోచేస్తున్న క్రేజీ ఫీచర్ ఇది. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు చిన్న కార్లలోనూ వచ్చి చేరుతుండటం దానికున్న క్రేజ్కు నిదర్శనం!దేశీ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు సన్/మూన్ రూఫ్ మాంచి ట్రెండింగ్లో ఉంది. యువ కస్టమర్ల జోరుతో ఈ ఫీచర్ ‘టాప్’లేపుతోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఎస్యూవీలు, సెడాన్లతో పాటు హ్యాచ్బ్యాక్స్లోనూ దీన్ని చేర్చేందుకు సై అంటున్నాయి. డిమాండ్ ‘రూఫ్’ను తాకుతుండటంతో ప్రపంచస్థాయి తయారీ సంస్థలు దీన్ని సొమ్ము చేసుకోవడానికి తహతహలాడుతున్నాయి. మార్కెట్లో అధిక వాటా కోసం భారీ పెట్టుబడులతో ఉత్పత్తి పెంచే పనిలో ఉన్నాయి. నెదర్లాండ్స్కు చెందిన ఇనాల్ఫా రూఫ్ సిస్టమ్స్ దాని భాగస్వామ్య సంస్థ గాబ్రియెల్ ఇండియాతో కలిసి తయారీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో సన్రూఫ్ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది ఈ జాయింట్ వెంచర్ (ఐజీఎస్ఎస్) లక్ష్యం. ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో తొలి ప్లాంట్ను ఏర్పాటు చేసిన ఐజీఎస్ఎస్కు ఏటా 2 లక్షల సన్రూఫ్ల తయారీ సామర్థ్యం ఉంది. హ్యుందాయ్, కియా కంపెనీలకు ఇది సన్రూఫ్లను సరఫరా చేస్తోంది. ఇక జర్మనీకి చెందిన గ్లోబల్ సన్రూఫ్ తయారీ దిగ్గజం వెబాస్టో కూడా తయారీ గేరు మార్చింది. ప్రస్తుతం ఏటా 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుండగా... 2027 నాటికి రెట్టింపు స్థాయిలో 9.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తోంది. ట్రెండ్ రయ్ రయ్... దేశీ వాహన రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా కొంగొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యధికంగా కారు ప్రియులు కోరుకుంటున్న ఫీచర్లలో సన్రూఫ్ శరవేగంగా దూసుకుపోతోందని యూనో మిండా చైర్మన్, ఎండీ ఎన్కే మిండా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ వాహన విడిభాగాల సంస్థల్లో ఇది ఒకటి. సన్రూఫ్ల తయారీ కోసం తాజాగా జపాన్కు చెందిన ఐసిన్ కార్ప్తో సాంకేతిక లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోని టాప్–10 వాహన విడిభాగాల ఉత్పత్తి కంపెనీల్లో ఐసిన్ కార్ప్ కూడా ఒకటి. కాగా, యూనో మిండా 80,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో హరియాణాలో కొత్త ప్లాంట్ నెలకొల్పుతోంది. ‘ఈ మధ్య కాలంలో సన్రూఫ్ల వాడకం ఓ రేంజ్లో పెరుగుతోంది. గతంలో బడా ఎస్యూవీలు, లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ట్రెండ్ మరింత జోరందుకోనుంది. ఇప్పుడు హ్యాచ్బ్యాక్ (చిన్న కార్లు) కస్టమర్లు సైతం ఈ ఫీచర్ కోసం ఎగబడుతుండటమే దీనికి కారణం’ అని మిండా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరే ఇక్కడా వినూత్న ఫీచర్లు, కస్టమైజేషన్లకు ప్రాధాన్యమిచ్చే ట్రెండ్ కనిపిస్తోందన్నారు.స్టేటస్ సింబల్... ఇప్పుడు కారే కాదు అందులోని ప్రీమియం ఫీచర్లు కూడా స్టేటస్ సింబల్గా మారుతున్నాయి. ఇందులో సన్రూఫ్ కూడా ఒకటి. క్రూయిజ్ కంట్రోల్, కళ్లు చెదిరే డిస్ప్లేలు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. వీటి వాడకం అరుదుగానే ఉన్నప్పటికీ, భారతీయ రోడ్డు పరిస్థితులకు పెద్దగా ఉపయోగకరం కానప్పటికీ.. కస్టమర్లు మరిన్ని ప్రీమియం ఫీచర్లు కోరుకుంటుండటంతో కార్ల కంపెనీలు వాటిని తప్పనిసరిగా అందించాల్సిన పరిస్థితి నెలకొందని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా పేర్కొన్నారు.ప్రతి నాలుగు కార్లలో ఒకటి... జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక కారుకు (27.5%) ఈ లగ్జరీ ఫీచర్ ఉంది. ఐదేళ్ల క్రితం 12.7%తో పోలిస్తే కస్టమర్లు దీనికి ఎలా ఫిదా అవుతున్నారనేది ఈ జోరు చాటిచెబుతోంది. కాగా వచ్చే ఐదేళ్లలో (2029 నాటికి) ఈ విభాగంలో 17.6 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్) నమోదవుతుందనేది వాహన పరిశ్రమ అంచనా. ముఖ్యంగా ఎస్యూవీల్లో సన్రూఫ్ ఫీచర్కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరి–ఆగస్ట్ మధ్య ఏకంగా 44.7% వృద్ధి ఈ విభాగంలో నమోదైంది. మరోపక్క, భారతీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తయారీ సంస్థలు అధునాతన గ్లాస్ టెక్నాలజీతో సన్రూఫ్లను ప్రవేశపెడుతున్నాయి. వేడిని బాగా తట్టుకోవడం, యూవీ కిరణాల నుంచి రక్షణతో పాటు సన్రూఫ్లను ‘స్మార్ట్రూఫ్’లుగా మార్చేస్తున్నాయి. పానోరమిక్ సన్రూఫ్లు కారు లోపల మరింత విశాలమైన స్పేస్ ఫీలింగ్ను కూడా అందిస్తాయని భాటియా చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొత్త ఆండ్రాయిడ్15లో అబ్బురపరిచే ఫీచర్లు
సరికొత్త గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్లను మరింత మెరుగ్గా చేసేందుకు ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. వీటిలో అబ్బురపరిచే కొన్ని ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం..ప్రైవేట్ స్పేస్ప్రైవేట్ స్పేస్ అనేది వర్చువల్ లాకర్. వ్యక్తిగతమైన, గోప్యమైన యాప్లను ఇక్కడ ఉంచవచ్చు. ఈ యాప్లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా భద్రతను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్కు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్లు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి.చార్జింగ్ లిమిట్ ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ 15లో 80% లిమిట్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా బ్యాటరీ తొందరగా దెబ్బతినకుండా నివారించుకోవచ్చు.థెఫ్ట్ ప్రొటెక్షన్ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అసాధారణ చర్యలతో మీ ఫోన్ను ఎవరైనా చోరీ చేయడానికి ప్రయత్నించి ఉంటే తెలియజేస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైతే మీ డేటాను రక్షించడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా ఇది ఆటోమేటిక్గా లాక్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్ని ఉపయోగించి వేరొక ఫోన్ నుంచి మీ ఫోన్ను లాక్ చేయవచ్చు.అడాప్టివ్ వైబ్రేషన్కొందరికి రింగ్ టోన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫోన్ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకుంటారు. మీటింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు కాల్స్ వచ్చినప్పుడు గుర్తించలేం. దీని పరిష్కారం కోసమే ఆండ్రాయిడ్ 15లో అడాప్టివ్ వైబ్రేషన్ ఫీచర్ ఇచ్చారు. సందర్భానికి అనుగుణంగా దానంతట అదే వైబ్రేషన్ను అడ్జెస్ట్ చేస్తుంది.యాప్ పెయిర్స్తరచూ స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించేవారి కోసమే ఈ ఫీచర్. ఏవైనా రెండు యాప్లను జతగా వినియోగించేవారు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. వీటిని హెమ్ స్క్రీన్పై షార్ట్కట్స్గా సేవ్ చేసుకోవచ్చు.యాప్ ఆర్కైవింగ్ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడు పాత యాప్లను వదిలించుకోవాలి. అయితే యాప్ను అన్ఇన్స్టాల్ చేయడం వలన దాని డేటా మొత్తం పోతుంది. మళ్లీ ఇన్స్టాల్ చేస్తే మొదటి నుండి సెటప్ చేయాలి. దీన్ని పరిష్కరించడానికి గూగుల్ గతంలో ప్లేస్టోర్కి యాప్ ఆర్కైవింగ్ని జోడించింది. ఇప్పుడిదే ఫీచర్ను ఆండ్రాయిడ్ 15తో ఇన్బిల్ట్గా తీసుకొచ్చింది. తొలగించిన యాప్ను మళ్లీ ఇన్స్టాల్ చేసినప్పడు పాత డేటా అలాగే ఉంటుంది.శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్లు పంపించే ఈ సరికొత్త ఫీచర్ను ఆండ్రాయిడ్ 15లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించలేం. క్యారియర్లు ఈ సర్వీస్కు ధర నిర్ణయించే పనిలో ఉన్నాయి. దీని కోసం కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. -
జియోఫైనాన్స్ కొత్త యాప్.. ఇక మరిన్ని ఫీచర్లు
న్యూఢిల్లీ: జియోఫైనాన్స్ యాప్ను మరింత మెరుగ్గా ప్రారంభించినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. రుణాలు, పొదుపు ఖాతాలు, యూపీఐ బిల్లు చెల్లింపులు, రీఛార్జ్లు, డిజిటల్ ఇన్సూరెన్స్తో సహా అనేక రకాల సేవలను ఈ యాప్ అందిస్తోంది.జియోఫైనాన్స్ యాప్ బీటా వెర్షన్ 2024 మే 30న ప్రారంభమైంది. 60 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నారు. బీటా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులు సేవలు జోడించామని, మ్యూచువల్ ఫండ్లపై రుణాలు, గృహ రుణాలు (బ్యాలెన్స్ బదిలీతో) సహా ఆస్తిపై రుణాలు వీటిలో ఉన్నాయని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. -
ఏకకాలంలో మూడు యాప్లు: గూగుల్ ప్లే స్టోర్లో కొత్త ఫీచర్
సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్లో ఒకసారికి ఒక యాప్ను మాత్రమే ఇన్స్టాల్ చేయొచ్చు లేదా అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు యాప్ మేనేజ్మెంట్ మరింత వృద్ధి చెందింది. కాబట్టి ఏకకాలంలో మూడు యాప్లు లేదా గేమ్లను ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవచ్చు.ఈ కొత్త ఫీచర్ భారతదేశంతో సహా ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్లోని ఈ అప్డేట్ మునుపటి సిస్టమ్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం: ఎందుకో తెలుసా? గూగుల్ ఏప్రిల్లో మొదటిసారి రెండు యాప్లను ఏకకాలంలో ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు చేరింది. యూజర్ ఒకేసారి మూడు యాప్స్ ఇన్స్టాల్/అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు 'అప్డేట్ ఆల్' అనే ఫీచర్ ఎంచుకోవాలి ఉంటుంది. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత యాప్స్ అప్డేట్లు ప్రాసెస్ అవుతాయి. అయితే ఈ ఫీచర్ కొన్ని పరికరాల్లోనూ అందుబాటులో లేదు. కానీ రాబోయే రోజుల్లో అన్ని పరికరాల్లోనూ అందుబాటులో వస్తుందని సమాచారం. -
యూట్యూబ్లో కొత్త ఫీచర్స్.. ఇవెలా పనిచేస్తాయంటే?
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో సంస్థలు కూడా యూజర్లకు అనుగుణంగా తమ యాప్లను అప్డేట్ చేయడం లేదా కొత్త ఫీచర్స్ తీసుకురావడం చేయాలి. ఇందులో భాగంగానే గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మూడు కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. ఇవన్నీ యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.స్లీప్ టైమర్ ఫీచర్పేరుకు తగ్గట్టుగానే.. యూజర్ ఏదైనా కంటెంట్ను చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు టైమర్ను సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న టైమ్ తరువాత వీడియోని ఆటోమేటిక్గా పాజ్ చేయవచ్చు. వీడియో చూస్తూ నిద్రపోయే వ్యక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యూజర్లు మొబైల్, డెస్క్టాప్లోని సెట్టింగ్ల మెను నుంచి స్లీప్ టైమర్ ఫీచర్ను యాక్సెస్ చేయవచ్చు.డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ఇది క్రియేటర్లకు ఉపయోగపడే ఫీచర్. ఇది మొబైల్ యాప్లో పనిచేస్తుంది. 'ఏఐ'ను ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లను క్రియేట్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. షార్ట్ కెమెరా ఓపెన్ చేయడానికి వినియోగదారులు ప్లస్ (+) చిహ్నం మీద క్లిక్ చేసి.. గ్రీన్ స్క్రీన్ ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కనిపిస్తాయి.ఆన్సర్ బాట్ ఫీచర్ప్రత్యేకించి ఈ ఫీచర్ను మొబైల్ యూజర్ల కోసం పరిచయం చేశారు. వీడియో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్నప్పుడు వీడియోకు సంబంధించి అనుమానాలు వస్తే.. వాటిని పరిష్కరించుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది కూడా ఏఐ బేస్డ్ ఫీచర్. యూట్యూబ్లోని అన్ని వీడియోలు ఈ కొత్త ఫీచర్ను కలిగి ఉండవు. ఇది వీడియో కింద ఉన్న ఆస్క్ ట్యాబ్ రూపంలో అర్హులైనవారికి మాత్రమే వీడియోలలో కనిపిస్తుంది. యూజర్లు ముందుగా సెట్ చేసిన ప్రశ్నలను ఎంచుకోవడం మాత్రమే కాకుండా.. సొంత ప్రశ్నలను టైప్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.యూట్యూబ్ కొత్త ఫీచర్స్ కొన్ని రోజులు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్లీప్ టైమర్ ఫీచర్ సెప్టెంబర్ 2 వరకు, డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ ఆగస్ట్ 20 వరకు, ఆన్సర్ బాట్ ఫీచర్ ఆగస్ట్ 21 వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. టెస్టింగ్ పూర్తయిన తరువాత భవిష్యత్తులో ఇవి వినియోగంలోకి వస్తాయి. కానీ ఇప్పుడునా వస్తాయి అనేది తెలియాల్సి ఉంది. -
గూగుల్ ‘మ్యాప్’ వార్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఓలా మ్యాప్స్ నుంచి పోటీ తీవ్రతరం కావడంతో గూగుల్ జోరు పెంచింది. భారత్లో యూజర్లను ఆకట్టుకోవడం కోసం గురువారం పలు సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్లతో పాటు కారు డ్రైవర్లు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా ఏఐ ఆధారిత రూటింగ్ సమాచారం వంటివి ఇందులో ఉన్నాయి. ఓలా ఫౌండర్, సీఈఓ భవీశ్ అగర్వాల్ దేశీ డెవలపర్ల కోసం ఓలా మ్యాప్స్ను అందుబాటులోకి తీసుకొచి్చన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గూగుల్ మ్యాప్స్ను వాడొద్దని కూడా ఆయన పిలుపునివ్వడంతో మ్యాప్స్ వార్కు తెరలేచింది. దేశీ డెవలపర్లకు గాలం వేయడానికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్ను ఉచితంగా వాడుకునే సదుపాయాన్ని కూడా అగర్వాల్ ప్రకటించడం విశేషం. దీంతో గూగుల్ కూడా వెంటనే రంగంలోకి దిగింది. గూగుల్ మ్యాప్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించే డెవలపర్లకు ఆగస్ట్ 1 నుంచి 70 శాతం వరకు ఫీజులను తగ్గిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దేశీ యూజర్లకు మేలు చేసేందుకే... ఓలా పోటీ కారణంగానే ధరల కోత ప్రకటించాల్సి వచి్చందా అన్న ప్రశ్నకు గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్, జీఎం మిరియమ్ డేనియల్ స్పందిస్తూ... వాస్తవానికి పోటీ సంస్థలపై మేము దృష్టి సారించమని, తమ యూజర్లు, డెవలపర్ల ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మా పార్ట్నర్స్ చాన్నాళ్లుగా ధరలను తగ్గించాలని కోరుతున్నారు. మా యూజర్లతో పాటు డెవలపర్లకు మేలు చేయడంపై దృష్టి సారించాం. అందులో భాగంగానే రేట్ల కోతను ప్రకటించాం. వ్యాపార సంస్థలు, డెవలపర్లు, ప్రజలకు డిజిటల్ మ్యాపింగ్ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడం కోసమే ఏఐ ఆధారిత రూటింగ్ తదితర కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాం’ అని వివరించారు. భారత్లో ఇరుకు రోడ్లు అనేవి కారు డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతుంటాయని, అందుకే వాటిని తప్పించుకునే విధంగా ఏఐ ఆధారిత రూటింగ్ ఆల్గారిథమ్ వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు భవనాల మధ్య దూరం, రోడ్ల రకాల వంటి సమాచారంతో రోడ్ల కచి్చతమైన వెడల్పును మ్యాప్స్లో చూడొచ్చని, తద్వారా సాధ్యమైనంత వరకు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా తప్పించుకునేందుకు వీలవుతుందని బ్లాగ్ పోస్ట్లో వివరించారు. మరోపక్క, బైకర్లు, పాదచారులు, ఇతర ప్రయాణికులు ఇప్పుడు ఈ ఇరుకు రోడ్లలో మరింత సురక్షితంగా, నమ్మకంగా వెళ్లొచ్చని చెప్పారు. అలాగే సంబంధిత రూట్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయో కూడా ముందుగానే తెలియజేసే ఫీచర్ కూడా భారత్లో యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు.ముందుగా ఎనిమిది నగరాల్లో... హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి మొత్తం 8 నగరాల్లో ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ పరికరాల్లో ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని నగరాలతో పాటు ఐఓఎస్, కార్ప్లే సపోర్ట్ను కూడా త్వరలో తీసుకొస్తామని గూగుల్ పేర్కొంది. టూవీలర్ ఈవీ యూజర్లు చార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేందుకు ఎలక్ట్రిక్ పే, అథర్, కాజామ్, స్టాటిక్ వంటి దిగ్గజ చార్జింగ్ ప్రొవైడర్లతో గూగుల్ జట్టు కట్టింది. తద్వారా 8,000 చార్జింగ్ స్టేషన్ల సమాచారం దేశీయంగా గూగుల్ మ్యాప్స్తో పాటు గూగుల్ సెర్చ్లో కూడా లభిస్తుంది. కాగా, ఈ ఫీచర్ను తొలిసారిగా భారత్లోనే ప్రవేశపెట్టడం గమనార్హం. -
మెటా ఏఐలో కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మెటా ఏఐ కొత్త ఫీచర్ ఆవిషక్రయించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.నచ్చిన స్టైల్లో ఫోటోలు క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలో కూడా మెటా సీఈఓ వీడియోలో చూపిస్తారు. యూజర్ తన ముఖాన్ని స్కాన్ చేయి తనకు నచ్చిన విధంగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.జుకర్బర్గ్ వీడియోలో మొదట తన ముఖాన్ని స్కాన్ చేసుకున్నారు. ఆ తరువాత సెర్చ్ బార్లో నచ్చిన విధంగా ఎలాంటి ఇమేజ్ కావాలో సెర్చ్ చేయాలి. అప్పుడు మెటా మీరు అడిగినట్లుగా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. జుకర్బర్గ్ తనను గ్లాడియేటర్గా చూపించమని సెర్చ్ చేశారు. అప్పుడు మెటా అలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ తరువాత బాయ్ బ్యాండ్, గోల్డ్ వేసుకున్నట్లు ఇలా ఫోటోలను క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ వీడియోలో చూడవచ్చు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారా? కొత్త ఫీచర్స్ చూశారా..
మారుతున్న కాలానికి అనుకూలంగా యూట్యూబ్ కూడా అప్డేట్ అవుతోంది. ఇందులో భాగంగానే కంటెంట్ క్రియేటర్స్ లేదా వినియోగదారుల కోసం తాజాగా నాలుగు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టెక్స్ట్-టు-స్పీచ్షార్ట్లకు టెక్స్ట్-టు-స్పీచ్ వీడియో నేరేషన్ ఫీచర్ ఒకటి. ఇది ఆర్టిఫిషియల్ వాయిస్ఓవర్ను అందించడానికి ఉపయోగపడుతుంది. టిక్టాక్లో చూసిన అదే ఫీచర్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మొదట టెక్స్ట్ రెడీ చేసుకున్న తరువాత.. స్క్రీన్ ఎగువన ఎడమవైపు మూలలో ఉండే యాడ్ వాయిస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు కావలసిన వాయిస్ని ఎంచుకోగలుగుతారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్లో కేవలం నాలుగు వాయిస్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఆటో జనరేటెడ్ క్యాప్షన్క్యాప్కట్ వంటి థర్డ్-పార్టీ యాప్ని ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే మీరు మీ వీడియోలకు యాడ్ చేసుకోగలిగే ఆటోమేటిక్ క్యాప్షన్లను యూట్యూబ్ పరిచయం చేస్తోంది. యూట్యూబ్ షార్ట్లకు ఇప్పటికే ఉన్న మాన్యువల్ టెక్స్ట్ ఓవర్లే ఫీచర్ లాగానే, వినియోగదారులు వివిధ ఫాంట్లు, రంగులతో క్యాప్షన్ల స్టైల్ కస్టమైజ్ చేసుకోవచ్చు.మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్యూట్యూబ్ తీసుకువచ్చిన మరో ఫీచర్ మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్. ఇందులో గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్, మైన్ క్రాఫ్ట్ రష్ వంటి మినీ గేమ్ వంటివి ఉన్నాయి.వర్టికల్ వీడియో ఫార్మాట్మరింత మంది యూట్యూబ్ క్రియేటర్లను ఆకర్శించమే లక్ష్యంగా వర్టికల్ వీడియో ఫార్మాట్ ఫీచర్ కూడా తీసుకువచ్చింది. ఇది కూడా టిక్టాక్లో మాదిరిగా ఉంటుంది. మొత్తం మీద మరింత మందిని ఆకర్శించడమే ప్రధానంగా యూట్యూబ్ ఈ ఫీచర్స్ తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది. -
యాపిల్ కీలక ప్రకటన.. ఐఫోన్ 16లో గూగుల్ జెమినీ!
యాపిల్ కంపెనీ తన ఐఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను మెరుగుపరచడానికి కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించనుంది. గూగుల్ జెమినీ ఏఐని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లైనప్తో సహా దాని తర్వాతి తరం ప్లాట్ఫారమ్లలోకి అనుసంధానం చేయడం కోసం యూఎస్ బేస్డ్ టెక్ దిగ్గజం గూగుల్తో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో ఏఐ కోసం యాపిల్ కంపెనీ మెటాతో చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలం కావడంతో.. సంస్థ గూగుల్ జెమిని కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. ఐఫోన్ 16లో గూగుల్ జెమినీ అందుబాటులో రానుంది. ఆ తరువాత యాపిల్ ఫోన్లు అన్నీ కూడా గూగుల్ జెమినీ ఏఐ పొందే అవకాశం ఉందని సమాచారం.యాపిల్ గూగుల్ జెమినినీ ఆన్బోర్డ్ చేసినట్లయితే.. ఐఓఎస్, మ్యాక్ఓఎస్ వినియోగదారులు ఇద్దరూ కూడా ఈ మూడు చాట్బాట్లను ఉపయోగించుకోవచ్చు. అయితే యాపిల్ యూజర్ ఏది ఉపయోగించుకోవాలో అనే విషయాన్ని ముందుగానే నిర్దారించుకోవచ్చు. కాబట్టి యూజర్ ఇష్టానుసారంగానే ఏ ఇంటెలిజెన్స్ అయినా ఉపయోగించుకోవచ్చు.జూన్లో యాపిల్ యాన్యువల్ డెవలపర్ ఫోకస్డ్ ఈవెంట్.. వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో తన సొంత ఏఐ ఫీచర్ల సూట్ను ఆవిష్కరించింది. దీనిని సమిష్టిగా యాపిల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఇది ప్రస్తుతానికి ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. -
క్రోమ్లో ఐదు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగపడతాయంటే?
కంప్యూటర్ లేదా మొబైల్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే చాలామందికి క్రోమ్ గుర్తొస్తుంది. క్రోమ్ ఇప్పుడు యూజర్ల కోసం ఐదు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది. ఇంతకీ క్రోమ్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయని విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.👉సమీపంలో ఉండే ఏదైనా స్థలాలను సెర్చ్ చేయాలనుకున్నప్పుడు క్రోమ్ బార్లో ఎంటర్ చేయగానే మీ పనిని మరింత సులభతరం చేయడానికి మూడు ఆప్షన్స్ చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఓ రెస్టారెంట్ లేదా షాపింగ్ మాల్ వెళ్లాలనుకున్నప్పుడు.. క్రోమ్ బార్లో సెర్చ్ చేయగానే దానికి కింద కాల్, డైరెక్షన్, రివ్యూ అనేవి కనిపిస్తాయి. ఇవి షార్ట్కట్ బటన్స్ అన్నమాట. ఈ ఫీచర్ ఇప్పుడు కేవలం ఆండ్రాయిడ్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ క్రోమ్లో కూడా అందుబాటులోకి వస్తాయి.👉ఐప్యాడ్లు, ఆండ్రాయిడ్ టాబ్లెట్లు వాటి పెద్ద స్క్రీన్ పరిమాణాలను సద్వినియోగం చేసుకోవడానికి.. క్రోమ్ అడ్రస్ బార్ను రిఫ్రెష్ చేసింది. ఒకసారి అడ్రస్ బార్ ఉపయోగించిన తరువాత.. మళ్ళీ తిరిగి వెళ్తే అప్పటికే హిస్టరీ లేదా వెబ్సైట్ డ్రాప్ డౌన్ క్రింద ట్రెండింగ్ అంశాలను చూపిస్తుంది.👉ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో షార్ట్కట్స్ అందిస్తోంది. ఉదాహరణకు సిటీ మెట్రో కోసం సమయాలను చూడడానికి మీరు సాధారణంగా షెడ్యూల్స్ అని టైప్ చేసి ఉండవచ్చు. దాన్ని మళ్ళీ మీరు సెర్చ్ చేసినప్పుడల్లా వెంటనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీ సమయాన్ని సేవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.👉ఐఓఎస్లో ట్రేండింగ్ సెర్చ్.. అంటే మీరు క్రోమ్ సెర్చ్ బార్లో.. సెర్చ్ చేయడానికి ముందే.. ట్రెండింగ్లో ఉన్న విషయాలు కింద కనిపిస్తాయి.👉ఐఓఎస్లో గతంలో వెతికిన విషయాలకు సంబంధించిన వార్తలు, స్పోర్ట్స్ కార్డులు డిస్కవర్ ఫీడ్లో కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్లో అందుబాటులో ఉంది. మీరు మూడు-చుక్కల మెనుని ఎంచుకోవడం ద్వారా క్రోమ్ మొబైల్ యాప్లో డిస్కవర్ ఫీడ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. -
ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందటే?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం 'క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్' అనే సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు లైవ్ స్ట్రీమ్ అనేది ఫాలోవర్స్ అందరికి కనిపించేది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తుంది.క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో కావలసిన వాళ్ళను యాడ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేయవచ్చు. యూజర్ల భద్రతకు పెద్దపీట వేయడానికి ఇన్స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇన్స్టా అకౌంట్ పబ్లిక్ అయితే ఎవ్వరైనా లైవ్ స్ట్రీమింగ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా.. యూజర్ లైవ్ స్ట్రీమింగ్లో ఎవరైతే ఉండాలనుకుంటారో వారిని మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో యాడ్ చేసుకోవచ్చు.ఇన్స్టాగ్రామ్.. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ అనే సరికొత్త ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా, మెటా ఇన్స్టాగ్రామ్ను మరింత ప్రైవేట్ ప్లేస్గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్లో.. గ్రిడ్లో పోస్ట్లను సన్నిహితులకు మాత్రమే కనిపించేలా చేయడానికి వినియోగదారులను అనుమతించే ఆప్షన్ ప్రవేశపెట్టింది.🚨 NEW 🚨Go Live with your Close Friends to ask for OOTD advice or just chat in real time 🎥✨ pic.twitter.com/wDYjqw1N4f— Instagram (@instagram) June 20, 2024 -
'ఏఐ-టెక్నాలజీ'తో కూడిన.. స్నాప్చాట్ లెన్స్ స్టూడియో!
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) ఫీల్డ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్చాట్’ లేటెస్ట్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఇప్పుడు ఏఐ డెవలపర్లు ఏఐ–పవర్డ్ లెన్సెస్ను క్రియేట్ చేయవచ్చు. స్నాప్చాట్ యూజర్లు వాటిని తమ కంటెంట్లో ఉపయోగించవచ్చు.డెవలపర్ప్రోగ్రామ్ ‘లెన్స్ స్టూడియో’కు సంబంధించిన అప్గ్రేడెడ్ వెర్షన్ గురించి ప్రకటించింది స్నాప్చాట్. దీనితో ఆర్టిస్ట్లు, డెవలపర్లు స్నాప్చాట్, వెబ్సైట్, యాప్స్ కోసం ఏఆర్ ఫీచర్లను క్రియేట్ చేయవచ్చు. ఏఆర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి పట్టే సమయాన్ని వారాల నుంచి గంటలకు తగ్గిస్తుంది లెన్స్ స్టూడియో.ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్..డిస్ప్లే: 6.78 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080*2436 పిక్సెల్స్కనెక్టివిటీ: 5జీమెమోరీ: 256జీబి 12జీబి ర్యామ్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 4600 ఎంఏహెచ్బరువు: 190 గ్రా.స్క్రీన్ ఎక్స్పాండర్ అండ్ మాగ్నిఫైయర్..బ్రాండ్: పోట్రానిక్స్మోడల్: పీవోఈఆర్–1899ప్రాడక్ట్ డైమెన్షన్స్: 10*3*3 సీఎం 50గ్రా.కంపెటబుల్ డివైజెస్: మానిటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ఆల్–ఇన్–వన్ స్క్రీన్ క్లీనర్..బ్రాండ్: సౌన్స్కలర్: బ్లాక్మోడల్ నెంబర్: ఎస్సీఎంజీబీకె–బీకె5బరువు: 200 గ్రాస్పెషల్ ఫీచర్స్: పోర్టబుల్, నాన్–స్లిప్, స్ట్రెచబుల్, ఫోల్డబుల్లెన్స్ మెటీరియల్: గ్లాస్ఇవి చదవండి: ‘మై గ్లామ్’లో మోడళ్లు.. -
వాట్సాప్లో మూడు అదిరిపోయే ఫీచర్లు
వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం అప్డేటెడ్ ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా ఆడియోతో స్క్రీన్ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్ అనే మూడు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది.ఆడియోతో స్క్రీన్ షేరింగ్: వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులు ఆడియోతో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ద్వారా తమ స్క్రీన్ & ఆడియోను ఏకకాలంలో పంచుకునేందుకు వీలుంటుంది. స్క్రీన్ షేరింగ్ అనేది గతంలోనే వాట్సాప్ పరిచయం చేసినప్పటికీ.. ఇప్పుడు మెరుగైన ఆడియో సఫోర్ట్ జోడించింది.వీడియో కాల్లలో పెరిగిన పార్టిసిపెంట్ కెపాసిటీ: ఇప్పటి వరకు ఒక మీటింగ్ అంటే జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి యాప్స్ ఉపయోగించి ఉంటారు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 32 మంది వీడియో కాల్లో పాల్గొనవచ్చు.స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్: కాల్లో ఎవరు మాట్లాడుతున్నారో ట్రాక్ చేయడం కోసం స్మార్ట్ఫోన్ యాప్లో కష్టంగా అనిపించినప్పటికీ, మాట్లాడే వ్యక్తిని ఆటోమేటిక్గా హైలైట్ చేయడానికి స్పాట్లైట్ ఫీచర్ను కూడా జోడించింది.వాట్సాప్ ఇప్పుడు ఆడియో, వీడియో నాణ్యతను మెరుగుపరచడం మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సరికొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్స్ అన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ తప్పకుండా వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. -
వాట్సాప్ నుంచి వేరే యాప్లకూ మెసేజ్లు!
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్లో మార్పులు చేస్తున్న ‘వాట్సాప్’ త్వరలో మరో ఫీచర్ను జతచేయనుంది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్లకూ మెసేజ్లను పంపుకోవచ్చు. దీనికి అనువుగా కొత్త ఫీచర్ను వాట్సాప్లో త్వరలో తీసుకురానున్నారు. దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్ నుంచి మెసేజ్లను షేర్ చేసుకోవచ్చు. ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా, విడిగా ఒక చాట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫీచర్ను వాట్సాప్ సిద్ధంచేస్తోంది. ఈ కొత్త ఫీచర్కు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తలమునకలైనట్లు తెలుస్తోంది. వాట్సాప్తో మెసేజ్ల షేరింగ్లపై సిగ్నల్, టెలిగ్రామ్ యాప్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాబేటాఇన్ఫో అనే సంస్థ స్పష్టంచేసింది. ఏఏ యాప్లతో అనుసంధానం అవ్వాలనేది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయనిర్ణయం, స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది. బీటీ వెర్షన్ను టెస్ట్చేస్తున్న కొన్ని సెలక్ట్ చేసిన గ్రూప్లకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్షాట్ అడ్డుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. మరి కొద్ది వారాల్లో ఈ ఫీచర్ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనున్నారు. -
వాట్సాప్లో కీలక మార్పు.. ఇక ఆ పని చేయడానికి నో ఛాన్స్
వినియోగదారుల వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫేమస్ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) ఓ కీలకమైన మార్పుకు సిద్ధమైంది. వినియోగదారు అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని నిరోధించడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల కాల్ బ్లాకింగ్, చాట్లాక్ వంటి ఫీచర్స్ మాదిరిగానే డిస్ప్లే పిక్చర్ లాక్ అనే ఫీచర్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ఇది మనకు తెలియని వ్యక్తులు మన వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలు వెల్లడి కాలేదు. ఇదీ చదవండి: రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? రాబోయే రోజుల్లో మనకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల మనకు నచ్చని వారికి ఫోటో కూడా కనిపించకుండా చేయొచ్చని తెలుస్తోంది. కాబట్టి మనకు నచ్చని వారు మన ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోలేరు. డీప్ ఫేక్లు చెలరేగుతున్న సమయంలో కంపెనీ తీసుకువస్తున్న ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా?
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనో తాజాగా మూడు మోడల్స్ కార్లలో అయిదు కొత్త వేరియంట్లను దేశీ మార్కెట్లో తాజాగా ప్రవేశపెట్టింది. క్విడ్, ట్రైబర్, కైగర్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. వీటి ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 10.99 లక్షల వరకు (ఎక్స్ షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మూడు మోడల్స్లో కలిపి మొత్తం మీద పది కొత్త ఫీచర్లను జోడించినట్లు రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. మరోవైపు, రెనో, రెనోయేతర యూజ్డ్ కార్ల విక్రయాలు, కొనుగోళ్ల కోసం రెన్యూ పేరిట కొత్త బ్రాండ్ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే మూడేళ్లలో భారత మార్కెట్లో అయిదు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెంకట్రామ్ తెలిపారు. వీటిలో కొత్త మోడల్స్తో పాటు కైగర్, ట్రైబర్లో కొత్త వేరియంట్లు కూడా ఉంటాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా గతేడాది అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనప్పటికీ కొత్త మోడల్స్ ఊతంతో ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెనో గతేడాది దేశీయంగా 49,000 కార్లను విక్రయించగా, 28,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇక ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో చిన్న కారు క్విడ్ విక్రయాలను కొనసాగిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నిబంధనలు అనుమతించే వరకు సదరు సెగ్మెంట్లో అమ్మకాలను కొనసాగిస్తామని వెంకట్రామ్ స్పష్టం చేశారు. -
టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే ఉబర్ రైడ్!
చాలామంది తమ నిత్యజీవితంలో ఎక్కడ ఏం కొనాలన్నా కొంత బేరమాడుతూ ఉంటారు, ఇక ఆటోలో ప్రయాణించాలంటే మాత్రం డ్రైవర్తో కొంత బేరమాడకుండా ఉండలేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ 'ఉబర్' ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సంస్థ యాప్లో ఎంత రేటు చూపిస్తే అంత చెల్లించాల్సి వచ్చేది, దీంతో బేరమాడే అవకాశం లేకుండా పోయింది. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ 'ఉబర్ ఫ్లెక్స్’లో మనకు నచ్చిన రేటుకే క్యాబ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ ఒక రేటును కాకుండా.. యూజర్ ప్రయాణించే దూరం, సమయం వంటి వాటిని ఆధారంగా తీసుకుని తొమ్మిది ధరలను చూపిస్తుంది. ఇందులో వింభియోగదారుడు తనకు నచ్చిన రేటుని ఎంచుకోవచ్చు, అయితే ఆ రేటు డ్రైవర్కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఒకే రేటు దగ్గర నిలిచిపోకుండా.. కస్టమర్ తనకు నచ్చిన రేటును ఎంచుకునే అవకాశాన్ని ఉబర్ కల్పిస్తోంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే సమయంలో తక్కువ ధరకే ప్రయాణం చేసే వెసులుబాటుని పొందవచ్చు. ఈ ఫీచర్ను ఉబర్ కంపెనీ భారతదేశంలో ఔరంగాబాద్, ఆజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, దేహ్రాదూన్, గ్వాలియర్, ఇందౌర్, జోధ్పుర్, సూరత్ ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, కెన్యా దేశాల్లో కూడా సంస్థ ఈ ఫీచర్ను అమలుచేసే అవకాశం ఉంది. -
మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ - కొత్త ఫీచర్స్తో సరికొత్త ఎక్స్పీరియన్స్..
Microsoft Outlook Lite: ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఔట్లుక్ లైట్లో కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటు, భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇమెయిల్ అండ్ ఎస్ఎమ్ఎస్ యాప్ పరిచయం చేసింది. వీటి గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ (Microsoft Outlook Lite) అనేది భారతదేశంలోని వినియోగదారుల కోసం కంపెనీ రూపొందించిన ఒక ప్రత్యేకమైన యాప్. ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి అనుకూలంగా ఇది స్థానిక భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఇది 3G, 4G, 5G లాంటి ఏ నెట్వర్క్లో అయినా చాలా వేగంగా పనిచేస్తుంది. ప్రాంతీయ భాషల్లో.. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ భారతదేశంలో విభిన్న భాషా వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల కమ్యూనికేషన్ మరింత సులభమవుతుంది. ఇందులో వాయిస్ టైపింగ్, ట్రాన్స్లేషన్ వంటివి మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో ఇమెయిల్ చదవడం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని లేటెస్ట్ ఫీచర్స్ ద్వారా వినియోగదారుడు తమ మాతృభాష లేదా ప్రాధాన్య భాషలో ఇమెయిల్లను కంపోజ్ చేసుకోవచ్చు, తద్వారా సులభంగా చదువుకోవచ్చు. అంతే కాకుండా ఒక భాషలో ఈ కంటెంట్ టైప్ చేసి దాన్ని తమకు నచ్చిన భాషలో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. హిందీలో ఇమెయిల్ టైప్ చేసి, దాన్ని ఆటోమాటిక్గా ఇంగ్లీష్లో లేదా ఇతర భాషల్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఔట్లుక్ లైట్ సహాయపడుతుంది. ప్రస్తుతం ఇది హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ వంటి ఐదు భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది మరిన్ని భాషలు, మాండలికాల్లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఎస్ఎమ్ఎస్.. ఇక ఎస్ఎమ్ఎస్ మెసేజింగ్ విషయానికి వస్తే, ఔట్లుక్ లైట్ కేవలం ఇమెయిల్స్కి మాత్రమే కాకుండా.. ఎస్ఎమ్ఎస్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రాన్స్లేషన్, ప్రమోషనల్ ఇన్ఫర్మేషన్ వంటి వాటి కోసం సంస్థ 'స్మార్ట్ ఇన్బాక్స్' అందిస్తుంది. ఇది సమాచారాన్ని సులభతరం చేయడమే కాకుండా.. సంబంధిత సందేశాలను ఒకే చోట చూడటానికి అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా ముఖ్యమైన అపాయింట్మెంట్లు, ట్రావెల్ బుకింగ్స్, బిల్ పేమెంట్స్, గ్యాస్ బుకింగ్ వంటి వాటిని గుర్తు చేయడానికి ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఔట్లుక్ లైట్ భారతీయ ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది, కంపెనీ త్వరలోనే ఈ ఫెసిలిటీని కూడా అందించే అవకాశం ఉంది. ఆ తరువాత వినియోగదారుడు తనకు నచ్చిన భాషల్లో మెసేజస్ చదువుకోవచ్చు. నచ్చిన భాషలో అనువాదం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ ఫీచర్స్ పరిచయం చేసిన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ & మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, ఇండియా గ్రూప్ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ 'రాజీవ్ కుమార్' మాట్లాడుతూ.. భారతదేశం టెక్నాలజీలో దూసుకెళ్తున్న తరుణంలో డిజిటల్ అనుభవాలను పెంపొందించడంలో ఔట్లుక్ లైట్ ఫీచర్స్ ఉపయోగపడతాయని, వినియోగదారుల మధ్య బలమైన కమ్యూనికేషన్ పెంపొందించడం సహాయపడతాయని వెల్లడించారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ప్రతి వ్యక్తి లేదా వినియోగదారుడు తన ప్రాధాన్య భాషతో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, రోజువారీ పరస్పర చర్యలను సులభతరం చేయడంలో ఇది సహకరిస్తుందని చెబుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఫీచర్స్ తీసుకురావడంలో కంపెనీ కృషి చేస్తుందని వివరించారు. -
వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్న్యూస్.. వీఐ మ్యాక్స్ ప్లాన్లలో కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ: టెలికం సేవల సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) కొత్తగా మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్పెయిడ్ ప్లాన్లలో రెండు కొత్త ఫీచర్లను జోడించింది. డేటా షేరింగ్, నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా వీటిలో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్ పరిమితికి మించి 10 జీబీ నుంచి 25 జీబీ వరకు డేటాను అదనంగా పొందవచ్చు. దీన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక రాత్రి 12 గం. నుంచి ఉదయం 6 గం. వరకు ఉండే నైట్ టైమ్ అన్లిమిటెడ్ డేటా ఫీచర్ని మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్పెయిడ్ ప్లాన్లకు కూడా వర్తింపచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తం మీద రూ. 601 మ్యాక్స్ ఫ్యామిలీ ప్లాన్లో 2 కనెక్షన్లతో 120 జీబీ డేటా పొందవచ్చు. అంతకు పైబడిన ప్లాన్లలో 325 జీబీ వరకు పొందవచ్చు. -
iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్ఫోన్లు.. యాపిల్ ఐఫోన్లు. కొత్త సిరీస్ ఐఫోన్లు విడుదలైనప్పుడల్లా ఏవో కొత్త ఫీచర్లను యాపిల్ కంపెనీ ప్రవేశపెడుతుంటుంది. ఇదే క్రమంలో ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేసింది. ఈ సారి ఐఫోన్ 15 సిరీస్పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్లో సీ-టైప్ యూఎస్బీ చార్జింగ్తో పాటు ఇప్పటివరకూ ఏ ఫోన్లోనూ లేని తొమ్మిది సరికొత్త ఫీచర్లను ఐఫోన్ 15 సిరీస్లో పరిచయం చేసింది. టైటానియం బాడీ కొత్త ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లను తేలికైన, దృఢమైన టైటానియంతో తయారు చేశారు. ఈ టైటానియం లోహాన్ని వ్యోమనౌకల్లో ఉపయోగిస్తారు. దీంతో ఈ రెండు ఫోన్లు ఇంతకు ముందు ఫోన్ల కంటే 10 శాతం తేలిగ్గా ఉంటాయి. పర్యావరణహితం లైట్ వెయిట్ టైటానియం డిజైన్ 100 శాతం రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేసిన కొత్త సబ్స్ట్రక్చర్ను కలిగి ఉంది. వీటిలో 100 శాతం రీసైకిల్ కోబాల్ట్ బ్యాటరీలు అమర్చారు. అలాగే లెదర్ బ్యాక్ కేస్లకు బదులుగా 68 శాతం పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ కంటెంట్తో తయారు చేసిన వోవెన్ ఫాబ్రిక్ కేస్లను ఉపయోగించారు. యాక్షన్ బటన్ సాధారణంగా చాలా స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక కెమెరా కీని చూస్తుంటాం. అయితే యాపిల్ ఈ సారి iPhone 15 Pro వెర్షన్లలో మ్యూట్ స్విచ్కి బదులుగా యాక్షన్ బటన్ను తీసుకొచ్చింది. ఈ బటన్ రోజూ ఉపయోగించే ఫంక్షన్ల కోసం షార్ట్కట్గా ఉంటుంది. Qi2 వైర్లెస్ ఛార్జింగ్ కొత్త ఐఫోన్లు సరికొత్త Qi2 వైర్లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్తో వచ్చాయి. ఛార్జింగ్ కాయిల్స్ సరిగ్గా అమరేలా అదనపు మ్యాగ్నెట్ రింగ్ను ఇందులో ఇచ్చారు. దీనివల్ల వేగవంతమైన వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అయితే వీటికి అధికారికంగా Qi2-సర్టిఫికెట్ ఇంకా రాలేదు. A17 ప్రో చిప్ మొదటి 3-నానోమీటర్ చిప్గా పిలిచే A17 ప్రో చిప్ను యాపిల్ iPhone 15 Pro, Pro Max ఫోన్లలో ఉపయోగించింది. ఈ చిప్ డివైజ్ పర్ఫామెన్స్ను మరింత మెరుగ్గా చేస్తుంది. యాపిల్ చరిత్రలో ఇది అతిపెద్ద GPU రీడిజైన్. కన్సోల్ గేమింగ్ యాపిల్ కొత్త ప్రాసెసర్, హార్డ్వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ (సాఫ్ట్వేర్ ఆధారిత రే ట్రేసింగ్ కంటే 4 రెట్లు వేగవంతమైనది) సామర్థ్యాలను వండర్లస్ట్ ఈవెంట్లో ప్రదర్శించింది. iPhone 15 Pro, Pro Max ఫోన్లలో మొదటిసారిగా కన్సోల్ గేమింగ్ టైటిల్స్ కనిపించనున్నాయి. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కెమెరా విషయంలో యాపిల్ iPhone 15 ఫోన్లలో చాలా మార్పులు చేసింది. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కోసం Pro Max బేస్ స్టోరేజ్ వేరియంట్లో 256 జీబీ స్టోరేజ్ ఇచ్చింది. 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ ఇమేజ్ క్వాలిటీ, ప్రాక్టికల్ ఫైల్ సైజ్లను బ్యాలెన్స్ చేసేందుకు కొత్తగా 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ సైజ్ ఫీచర్ను యాపిల్ ఐఫోన్ 15 ఫోన్లలో తీసుకొచ్చింది. 48MP మెయిన్ కెమెరాతో హై రిజల్యూషన్లో అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. పోట్రెయిట్ మోడ్కి మారకుండానే పోట్రెయిట్ ఫొటోలను తీసే కొత్త ఫీచర్ను ఇందులో ఉంది. టెట్రాప్రిజం డిజైన్ జూమ్ ఫోటోగ్రఫీ అన్నది ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ప్రత్యేకంగా మారింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లోని 12MP టెలిఫోటో లెన్స్ 120 mm వద్ద 5x జూమ్ను కలిగి ఉంది. దీంతో దూరంతో నుంచే వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ వంటివి చేసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా OIS, ఆటోఫోకస్ 3D సెన్సార్-షిఫ్ట్ మాడ్యూల్తో కూడిన టెట్రాప్రిజం డిజైన్ను కలిగి ఉంటుంది. -
ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు
Apple Wonderlust Event iOS 17 టెక్ దిగ్గజం ‘వండర్ లస్ట్’ పేరుతో యాపిల్ నిర్వహించనున్న మెగా ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేయనుంది. యాపిల్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ పార్క్లో సెప్టెంబర్ 12న జరగనున్న 'వండర్లస్ట్' ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు(సెప్టెంబరు 12, మంగళవారం) 15 సిరీస్తోపాటు, ఐప్యాడ్లు, కొత్త వాచ్ సిరీస్ను అభిమానుల కోసం లాంచ్ చేయనుంది. దీంతోపాటు ఈ ఈవెంట్లో కార్యక్రమంలో ఐవోఎస్ 17ను యాపిల్ ఆవిష్కరించనుంది. ముఖ్యంగా భారత యూజర్ల కోసం ఐవోఎస్ (ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్) 17లో ప్రత్యేక ఫీచర్లను, watchOS 10 లాంచింగ్ తేదీలను అందించనుందని తెలుస్తోంది. దీంతోపాటు యాపిల్ ఐఫోన్ 15 లైనప్ను USB-C పోర్ట్లతో అందించనుండటం మరో విశేషం కానుంది. ఐవోఎస్17లో ఇండియన్ ఫీచర్లు ఐఫోన్లలో ప్రధానంగా మూడు కొత్త ఫీచర్లను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. స్మార్ట్ఫోన్లలో డ్యూయల్ సిమ్ కార్డ్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో డబుల్ సిమ్.ఐవోఎస్ 17 ప్రైమరీ, సెకండరీ సిమ్ ప్రతీ సిమ్ కు మెస్సేజ్ కు సంబంధించి వేర్వేరు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు.మిస్డ్ కాల్ కనిపిస్తే , ఆ నంబర్ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేయకపోయినా నేరుగా కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. బైలింగ్విల్ సిరి అసిస్టెంట్ ద్వారా ఒకటికి మించిన భాషలను టింగ్లీష్, హింగ్లీషు లాగా.. ఇంగ్లిష్, హిందీ కలిపి.. లేదంటే ఆంగ్లంతో తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠి భాషలను కలిపి మాట్లాడొచ్చు. అలాగే కీబోర్డ్లోనే బిల్టిన్ ట్రాన్సలేషన్ సపోర్టుతో తమిళం, తెలుగు, కన్నడ మలయాళంతో సహా 10 భారతీయ భాషల్లోకి అనువాదానికి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, పంజాబీ డిక్షనరీకి iOS 17 బీటా సపోర్ట్ ఉంటుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. సిరీ ప్లీజ్ సెట్ అలారమ్ మ్యూజిక్ ప్లే లాంటి ఆదేశాలను తెలుగులోనే ఇవ్వొచ్చు. IOS 17 ఎప్పుడు విడుదలవుతుంది? గత సంవత్సరం, Apple iPhone 14 ఈవెంట్ తర్వాత ఐదు రోజుల తర్వాత iOS 16 ను విడుదల చేసింది. ఈ సంవత్సరం, iOS 17 బీటా 8 , పబ్లిక్ బీటా 6 ఇప్పటికే ముగిసింది, కాబట్టి Apple అదే షెడ్యూల్ను అనుసరించవచ్చు. iOS 17ని ముందుగానే ప్రయత్నించాలనుకుంటే, బీటాలను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ పబ్లిక్ రిలీజ్ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. -
వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్ - అదేంటో తెలుసా?
Whatsapp Caption Edit Feature: వాట్సాప్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే మెసేజ్ ఎడిట్ ఫీచర్ పరిచయం చేయగా.. ఇప్పుడు మరో లేటెస్ట్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. వాట్సాప్లో ఇప్పుడు ఫొటోస్, వీడియోలు, గిఫ్ట్స్, డాక్యుమెంట్స్ క్యాప్షన్ కూడా ఎడిటింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆ తరువాత ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి వస్తుంది. ఇది తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. ఇదీ చదవండి: ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా! ఇప్పటి వరకు ఇలాంటి ఎడిటింగ్ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త ఫీచర్తో ఒకసారి పంపిన వీడియో, ఫోటో క్యాప్షన్ సులభంగా ఎడిట్ చేయవచ్చు. కావున మీరు పంపించి క్యాప్షన్లో ఏదైనా తప్పులుంటే కేవలం 15 నిమిషాలు లోపు మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఎడిట్ చేసుకునే అవకాశం లేదు. దీనిని వినియోగాదారులు తప్పకుండా గమనించాలి. -
ఇలాంటి ఫీచర్ కదా కోరుకునేది.. పర్సనల్ డీటైల్స్ ఎక్కడున్నా..
Google New Feature: రోజురోజుకి టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం మనదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా అంతర్జాలం మరింత వేగం పుంజుకుంటోంది. ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్ లేని ఇల్లు లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అదే రీతిలో పుట్టుకొస్తున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాతో లెక్కలేనన్ని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త టెక్నాలజీలు వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తున్నట్లు, అలాంటి వాటికి నిర్మూలించి, వినియోగదారులను అప్రమత్తం చేయడానికి గూగుల్ ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ ఫీచర్ ఇప్పుడు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఇది మిగిలిన అన్ని దేశాల్లో విస్తరించనుంది. నివేదికల ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్లో గూగుల్ 'రిజల్ట్ అబౌట్ యూ' లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అనతి కాలంలోనే మొబైల్, వెబ్సైట్ వంటి వాటిలో ప్రత్యక్షమైంది. ఆ ఫీచర్ ఇప్పుడు మరింత ఆధునికంగా మారింది. ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎక్కడైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ తరువాత వాటిని తొలగించడానికి కూడా వీలుంటుంది. ఇదీ చదవండి: వ్యాపార సామ్రాజ్యంలో మహిళా సారధులు - ఏం చదువుకున్నారో తెలుసా? ఇప్పటి వరకు వినియోగదారులకు సంబంధించిన వివరాలను వెతుక్కోడానికి చాలా సమయం పట్టేది. కానీ త్వరలో రానున్న గూగుల్ కొత్త ఫీచర్ యూజర్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ వంటి వ్యక్తిగత వివరాలు కనిపించిన వెంటనే ఇస్తూ.. తొలగించుకోవడానికి సహకరిస్తుంది. ఇదీ చదవండి: భారత్లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! గూగుల్ కొత్త ఫీచర్ వల్ల వ్యక్తిగత వివరాలు సులభంగా తొలగించవచ్చు, కానీ అవసరమైన చోట కూడా ఈ వివరాలు తొలగిపోతాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ వినియోగదారుడు తప్పకుండా కొన్ని ఆప్షన్స్ ఎంచుకోవడం వల్ల అలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
వాట్సాప్ కొత్త ఫీచర్ - భద్రతకు పెద్దపీట!
WhatsApp Phone Number Privacy: ఆధునిక కాలంలో కొత్త యాప్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) త్వరలో మరో అప్డేట్ అందుకోనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, వాట్సాప్ త్వరలో 'ఫోన్ నెంబర్ ప్రైవసీ' అనే లేటెస్ట్ ఫీచర్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ప్రైవసీ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే కాకుండా ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులో ఉంటుంది. అయితే వాట్సాప్ అప్డేటెడ్ బీటా యూజర్లకు మాత్రమే ఇది వర్తించే అవకాశం ఉందని సమాచారం. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. ఒక యూజర్ తన ఫోన్ నెంబర్ తెలియనివారికి కనిపించకుండా ఉండాలనుకున్నప్పుడు వాట్సాప్ సెట్టింగ్స్లో ఫోన్ నెంబర్ ప్రైవసీ అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సెలక్ట్ చేసుకున్నప్పుడు యూజర్ మొబైల్లో సేవ్ అయిన కారికి మాత్రమే కనిపిస్తుంది. ఇతరులకు కనిపించే అవకాశం లేదు. ఇది యూజర్ భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. -
మార్కెట్లో కి కొత్త సూపర్ ఆటో అబ్బురపరిచే ప్రత్యేకతలు..!
-
వాట్సాప్లో అదిరిపోయే 'ఎడిట్ మెసేజ్ ఫీచర్'.. దీన్నెలా వాడాలో తెలుసా?
WhatsApp Edit Message: వాట్సాప్ అనేది ఎక్కువ మంది వినియోగించే యాప్లలో ఒకటి. ఈ యాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ 'ఎడిట్ మెసేజ్ ఫీచర్' అనే మరో కొత్త ఫీచర్ గురించి పరిచయం చేసింది. ఇంతకీ ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ అంటే ఏమిటి? దీన్నెలా ఉపయోగించుకోవాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ఎంతో మంది వాట్సాప్ యూజర్లు ఎదురు చూస్తున్న 'ఎడిట్ మెసేజ్ ఫీచర్' త్వరలోనే అమలులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ సెండ్ చేసిన 15 నిముషాల్లో దానిని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు పంపించిన మెసేజ్లో ఏదైనా తప్పు ఉంటే దానిని సెండ్ చేసిన పదిహేను నిముషాల్లో ఎడిట్ చేయవచ్చు. ఇటీవల వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే టెస్టింగ్ కోసం ఎడిట్ మెసేజ్ ఫీచర్ అందించింది. ఇప్పుడు సాధారణ యూజర్లకు రోల్అవుట్ మొదలుపెట్టింది. (ఇదీ చదవండి: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఇక మార్కెట్లో రచ్చ రచ్చే!) నిజానికి మనం అప్పుడప్పుడు వాట్సాప్ నుంచి మెసేజస్ పంపించినప్పుడు తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. దాన్ని డిలీట్ చేసి మళ్ళీ మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎడిట్ మెసేజ్ ఫీచర్ ద్వారా మెసేజ్ డిలీట్ చేయకుండానే మళ్ళీ ఎడిట్ చేయవచ్చు. ఈ ఫీచర్ మెసేజ్ పంపిన 15 నిముషాల్లో ఉపయోగించుకోవాలి. పదిహేను నిముషాల తర్వాత మెసేజ్ ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ ఫీచర్స్ కేవలం టెక్స్ట్ మెసేజ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఫోటోలు, వీడియోలు, క్యాప్షన్ వంటి వాటిని సెండ్ చేసిన తరువాత ఎడిట్ చేయలేము. వాట్సాప్ మెసేజ్ ఎడిట్ చేయడం ఎలా? ముందుగా మీరు మీరు వాట్సాప్లో సెండ్ చేసిన మెసేజ్పై ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆ తరువాత ఆండ్రాయిడ్ డివైజ్ల్లో మెనూలోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్పై ట్యాప్ చేయాలి. ఐఫోన్లలో మెసేజ్పై లాంగ్ ప్రెస్ చేసి, ఎడిట్ ఆప్షన్పై ట్యాప్ చేయాలి. వెబ్/డెస్క్టాప్లలో మెసేజ్ మెనూలోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్పై ట్యాప్ చేసి మెసేజ్ ఎడిట్ చేసి కరెక్ట్ చేసుకున్న తరువాత మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. ఎడిట్ పూర్తయ్యాక, చెక్ మార్క్పై ట్యాప్ చేస్తే మెసేజ్ అప్డేట్ అవుతుంది. ఇప్పటికే వాట్సాప్ కొందరు బీటా యూజర్లకు వాట్సాప్ ఎడిట్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. సాధారణ యూజర్లందరికీ రోల్అవుట్ను నేడు వాట్సాప్ ప్రారంభించింది. కావున రానున్న కొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ వాడుతున్న యూజర్లందరికీ ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఉపయోగించుకోవచ్చు. -
పేటీఎంలో సరికొత్త ఫీచర్లు..
ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం (Paytm) సరి కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన iOSలో యూపీఐ లైట్ ఫీచర్, యూపీఐకి రూపే క్రెడిట్ కార్డ్ యాడింగ్, స్ప్లిట్ బిల్, మొబైల్ నంబర్లకు బదులుగా పేటీఎం యాప్లో ప్రత్యామ్నాయ యూపీఐ ఐడీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ (PPBL) నిర్వహించిన సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్లో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ, బోర్డు సభ్యుడు భవేష్ గుప్తా, PPBL సీఈవో సురిందర్ చావ్లా కంపెనీ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను ప్రకటించారు. పేటీఎం కొత్త ఫీచర్లు ఇవే.. పేటీఎం యూజర్లు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్ను పేటీఎం యాప్లో యూపీఐ ఐడీతో లింక్ చేసుకోవచ్చు. అన్నింటి ముఖ్యమైన విప్లవాత్మక ఫీచర్.. స్ప్లిట్ బిల్. అంటే ఏదైనా బిల్లును స్నేహితుల సమూహంలో విభజించి పంచుకోవచ్చు. అలాగే పేటీఎంలో చేసిన అన్ని చెల్లింపులను ట్యాగ్ చేయవచ్చు. అదేవిధంగా ట్యాగ్ చేసిన చెల్లింపులను ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇక ఫిబ్రవరిలో ప్రారంభించిన సంచలనాత్మక యూపీఐ లైట్ ఫీచర్ తాజాగా యాపిల్ ఐఓఎస్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. చెల్లింపులను క్రమబద్ధీకరించడం, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ సమస్యను తొలగించడం దీని ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా ఇప్పుడు పిన్ను నమోదు చేయకుండానే రూ. 200 వరకు చెల్లింపులు చేయవచ్చు. టూపీఐ లైట్కి రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2,000 జోడించుకోవచ్చు. ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కేంద్రం శుభవార్త, త్వరలో.. -
సెక్యూరిటీకి ఢోకా లేని కొత్త ఫీచర్లు: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్లను తీసు కొచ్చింది. ఎప్పటికపుడు కొత్త ఫీచర్లను అందిస్తున్న సంస్థ తాజాగా మూడు సెక్యూరిటీ ఫీచర్లను పరిచయం చేసింది. వాట్సాప్ను వాడుతున్నది నిజంగా మీరేనా కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి. మూడు సెక్యూరిటీ ఫీచర్లు అకౌంట్ ప్రొటెక్ట్ (Account Protect), డివైజ్ వెరిఫికేషన్ (Device Verification), ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ (Automatic Security Codes) అని పిలిచే ఈ మూడు ఫీచర్లు ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రానున్నాయి. తద్వారా యూజర్ల ప్రైవసీ, భద్రత మరింత మెరుగు పడుతందని కంపెనీ వెల్లడించింది. (27వేల మంది తొలగింపు: అమెజాన్ సీఈవో కీలక వ్యాఖ్యలు) అకౌంట్ ప్రొటెక్ట్ పాత స్మార్ట్ఫోన్ నుంచి కొత్త ఫోన్కు వాట్సాప్ అకౌంట్ను మార్చేటప్పుడు యూజర్లకు ఓల్డ్ అకౌంట్లో ఎలాంటి హెచ్చరికలు కనిపించవు దీంతో రియల్ యూజర్ స్థానంలో మరొకరు ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రొటెక్ట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ప్రకారం వెరిఫై చేస్తే గానీ కొత్త మొబైల్లో సంబంధిత నంబర్తో వాట్సాప్ అకౌంట్కి లాగిన్ చేయడం కుదరదు. ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ వినియోగదారులు తాము మెసేజ్లు పంపుతున్న అవతల వ్యక్తికి సురక్షితమైన కనెక్షన్ ఉందో లేదో నిర్ధారించుకునే అవకాశం ఈ ఫీచర్ ద్వారా దొరుకుతుంది.'ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్లు' కింద, కంపెనీ "కీ ట్రాన్స్పరెన్సీ" అనే ప్రక్రియపై ఆధారపడి వినియోగదారులు తమ సంభాషణ సురక్షితంగా ఉందని ఆటోమేటిక్గా వెరిఫై చేయడానికి ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ తోడ్పడతాయి. ఎన్క్రిప్షన్ ట్యాబ్లో, చాట్ సురక్షితంగా ఉన్నదీ, లేనిదీ వెరిఫై చేసుకోవచ్చు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) డివైజ్ వెరిఫికేషన్ ఇక మూడవది డివైజ్ వెరిఫికేషన్. యూజర్ల ప్రైవసీ,సెక్యూరిటీ ప్రమాదంలో పడకుండా రక్షించే అదనపు భద్రతా ఫీచర్ ఇది. యూజర్ల అకౌంట్ను అథెంటికేట్ చేయడానికి, డివైజ్లోకి మాల్వేర్ చొరబడితే అకౌంట్ను రక్షించడానికి అదనపు భద్రతా చర్యలను వాట్సాప్ పరిచయం చేసింది. తద్వారా యూజర్లతో సంబంధం లేకుండానే బ్యాక్గ్రౌండ్లో తమంతటమాల్వేర్జాడలను చెక్ చేస్తుంది. ఇందుకోసం వాట్సాప్ తన వినియోగదారులు టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలని కూడా సూచించింది. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) -
తెలుసుకున్నాకే ఫోన్ కొంటున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ ఇప్పుడు అత్యవసర వస్తువుల జాబితాలోకి వచ్చి చేరింది. పొద్దున లేవగానే, అలాగే పడుకునేప్పుడు ఫోన్ ముట్టుకోకుండా ఆ రోజు పూర్తి కాదంటే అతిశయోక్తి కాదేమో. మరి అంతటి ప్రత్యేకత కలిగిన ఫోన్ కొనుగోలు విషయంలో బడెŠజ్ట్ ఒక్కటే కాదు కోరుకునే ఫీచర్లనుబట్టి మోడల్ ఎంపిక జరుగుతోందట. స్తోమత లేనివారు, ఫోన్ వాడకం పెద్దగా అవసరం లేనివారు బేసిక్ ఫోన్లను వాడుతున్నారు. ప్రస్తుతం భారత్లో 60 కోట్ల మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్ల వైపు వినియోగదార్లు మళ్లుతుండడం, 5జీ విస్తరణ కారణంగా 2023లో ఈ సంఖ్య 100 కోట్లను దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్ఫోన్ రంగంలో ధరల శ్రేణి, కోరుకుంటున్న ఫీచర్లు, వినియోగదార్ల అభిరుచులు వేటికవే ప్రత్యేకం. విలువ ఉండాల్సిందే.. ధర ప్రాధాన్యం కాదు.. డబ్బుకు తగ్గ విలువ ఉండాల్సిందేనన్నది భారతీయుల ఆలోచన. రూ.15 వేలల్లో ఫోన్ కొనాలని భావించిన కస్టమర్ ముందు ఎక్కువ ఫీచర్లున్న ఫోన్ రూ.18 వేలకు లభిస్తే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఇక రూ.7 వేల లోపు, అలాగే రూ.30 వేలకుపైగా ఖరీదు చేసే ఫోన్ల ను 2–5 ఏళ్లు వాడుతున్నారట. అదే రూ.15–30 వేల సెగ్మెంట్లో ఆరు నెలలకే మార్చేస్తున్నారు. కారణం యువ కస్టమర్లు కావడం. ఆన్లైన్లో కొనుగోలు చేసే వినియోగదారులకే మొబైల్స్ పట్ల అవగాహన ఎక్కువ. రూ.15 వేల లోపు లభించే ఫోన్లే అధికంగా ఆఫ్లైన్లో అమ్ముడవుతున్నాయి. రూ.15–30 వేల ధరల శ్రేణి మోడళ్ల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా ఎక్కువ. ప్రపంచంలోనే ముందంజ.. స్మార్ట్ఫోన్ల పట్ల అవగాహన ఉన్న కస్టమర్లు భారత్లోనే అత్యధికం. కొనుగోలు కంటే ముందే ఆన్లైన్లో మోడళ్ల ఫీచర్లు, రివ్యూలను చూస్తున్నారట. ఈ విధంగా ముందే అవగాహనకు వచ్చి ఫోన్లను చేజిక్కించుకోవడంలో ప్రపంచంలో భారత్ ముందంజలో ఉందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీ హరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మొబైల్ కొనుగోలు నిర్ణయంలో యువత కీలకపాత్ర పోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు స్మార్ట్ఫోన్ కొనే ముందు వీరిని సంప్రదిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న మోడళ్లు, ఫీచర్లు, రేటింగ్స్ వంటి విషయాలపై యువతకు ముందే అవగాహన ఉంటోంది’ అని వివరించారు. ధర పరంగా చూస్తే.. ► రూ.7,000 లోపు: ఈ విభాగంలో వినియోగదార్లకు కావాల్సింది ఏదైనా స్మార్ట్ఫోన్. వీరికి ఫీచర్లతో పనిలేదు. అత్యధికంగా ఫీచర్ ఫోన్ నుంచి ఇటువైపు మళ్లినవారే. ఇంకో విషయం ఏమంటే వినోదం కోసం పూర్తిగా వీళ్లు ఆధారపడేది ఈ స్మార్ట్ఫోన్పైనే. ► రూ.7–15 వేలు: స్మార్ట్ఫోన్ రంగంలో ఈ విభాగం వాటా ఏకంగా 50 శాతం ఉంది. అధిక బ్యాటరీ, 6.5 అంగుళాలు, ఆపైన సైజున్న డిస్ప్లే, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ కోరుకుంటున్నారు. ► రూ.15–30 వేలు: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో పట్టణ కస్టమర్లు ఎక్కువ. ముఖ్యంగా యూత్ అధికంగా కొనుగోలు చేసే ధరల శ్రేణి ఇది. మంచి డిజైన్, రెండు లేదా ఎక్కువ కెమెరాలు, అధిక రిజొ ల్యూషన్, ఫుల్ హెచ్డీ, అమోలెడ్ డిస్ప్లే, కర్వ్, 5జీ, ఫాస్ట్ చార్జింగ్, తక్కువ మందం ఉండాల్సిందే. ► రూ.30 వేలు ఆపైన: ఇక్కడ ఫీచర్లు ప్రాధాన్యం కాదు. పెద్ద బ్రాండ్ అయి ఉండాలి. ఈ విభాగంలో కంపెనీలు ఎలాగూ ఒకదాన్ని మించి ఒకటి ఫీచర్లను జోడిస్తాయి అన్నది కస్టమర్ల మనోగతం. -
హోండా కార్స్ నుంచి న్యూ సిటీ
న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా తాజాగా న్యూ సిటీ (పెట్రోల్), న్యూ సిటీ ఈ:హెచ్ఈవీ పేరిట రెండు కొత్త మోడల్స్ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. భద్రత, కనెక్టివిటీ, సౌకర్యాలకు సంబంధించి వీటిలో అదనపు ఫీచర్స్ను జోడించినట్లు కంపెనీ తెలిపింది. న్యూ సిటీ (ఐ–వీటెక్) ధర రూ. 11.49 లక్షల నుంచి రూ. 14.72 లక్షల వరకూ ఉంటుంది. న్యూ సిటీ (ఈ–హెచ్ఈవీ) ధర రూ. 18.89 లక్షల నుంచి రూ. 20.39 లక్షల వరకూ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 17.8 నుంచి 18.4 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తాయి. న్యూ సిటీలో అధునాతన 20.3 సెం.మీ. టచ్స్క్రీన్ డిస్ప్లే ఆడియో, వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, అలాగే 6 ఎయిర్బ్యాగ్లు, హోండా లేన్ వాచ్, యాంటీ థెఫ్ట్ అలారం తదితర ఫీచర్లు ఉంటాయి. రెండు మోడల్స్లోనూ 3 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. కావాలంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వర కూ అదనంగా వారంటీ తీసుకోవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ వారంటీ 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీ.గా (ఏది ముందైతే అది) ఉంటుంది. -
ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!
ముంబై: రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్ మరింత మెరుగ్గా యాప్ను తీర్చిదిద్దింది. రైడ్ సమయంలో యాప్ను ప్రతీసారి తెరవకుండానే లాక్ స్క్రీన్పైనే లైవ్ యాక్టివిటీతో రైడ్, వాహన వివరాలు, ట్రిప్ స్టేటస్ను చూడవచ్చు. తన హోమ్స్క్రీన్, కొత్త ఫీచర్ల రీడిజైన్ చేసింది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఇలాంటి మార్పులు ప్రకటించింది. యాప్ను మునుపెన్నడూ లేనంత సులభంగా, స్పష్టంగా , పర్సనలైజ్డ్గా తీసుకొస్తున్నామని ఉడెర్ హెడ్ జెన్ యు అన్నారు. తద్వారా క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ రైడ్ ట్రాకింగ్ ఈజీగా ఉండేలా ఇంటర్ఫేస్ని రూపొందించింది. సో నెక్ట్స్ రైడ్ లేదా ఆర్డర్ ఫుడ్ బుక్ చేస్తే, యాప్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఐవోఎస్ ఉపకరణాలకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ డివైసెస్కు విస్తరించనున్నట్టు కంపెన ప్రకటించింది. సర్వీసెస్ ట్యాబ్ సైతం పొందు పరిచింది. శరవేగంగా లైఫ్ గడిచిపోతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని, సెకన్లలో యాప్ ద్వారా నావిగేట్ చేయగలిగే అవసరాన్ని అర్థం చేసుకున్నామని ఉబర్ ఇండియా దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ అన్నారు. తక్కువ ట్యాప్లతో ప్రయాణాలను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు రైడర్లకు సహాయ పడేందుకు హోమ్స్క్రీన్ను అనుభవాన్ని కూడా మెరుగ్గా అందించనుంది. ఇందుకోసం 'సర్వీసెస్' ట్యాబ్ను జోడించింది. దీని ద్వారా కొత్త యాప్లో సమీపంలోని మోటో నుండి ఆటో, ఇంటర్సిటీ, అద్దెలు, ఇతర వాటితో పాటు నగరంలోని రైడర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులను కనుగొనడానికి ఒక-స్టాప్ షాప్గా కూడా ఉపయోగపడనుంది. అలాగే కొత్తగా యాడ్ చేసిన 'యాక్టివిటీ హబ్' గత రాబోయే రైడ్లను ఒకే చోట ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని ఉబెర్ తెలిపింది. -
గూగుల్ మ్యాప్స్లో అద్భుతమైన అప్డేట్స్, చూసి మురిసిపోవాల్సిందే!
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ తన మాప్స్లో కొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. తన నావిగేషన్ యాప్ వినియోగదారులను మరింత ఆకట్టుకునేలా కొత్త అప్డేట్స్ను పారిస్లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రకటించింది. ఇమ్మర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్తో గూగుల్ మ్యాప్స్లో జత చేసింది. ప్రస్తుతం యూరప్లోని ఐదు కీలక నగరాల్లో తీసుకొచ్చిన ఈ ఫీచర్ను త్వరలోనే మిగిలిన నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్మ్యాప్లో మరింత స్పష్టంగా ఆయా ప్రదేశాలను మనకు చూపించనుంది. గూగుల్ మ్యాప్స్లో సాధారణ స్ట్రీట్ వ్యూ ఫీచర్ లాగానే ఉంటుంది.మరిన్ని స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఇమేజెస్తో వర్చువల్ వరల్డ్ మోడల్ను అందిస్తుంది.వాతావరణం, ట్రాఫిక్, లొకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలుంటాయి. రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో ప్రపంచవ్యాప్తంగా “గ్లాన్సబుల్ డైరెక్షన్స్” అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ,టోక్యో అనే ఐదు నగరాల్లో ఇమ్మెర్సివ్ వ్యూ ని తీసుకొచ్చింది. అలాగే ఆమ్స్టర్డామ్, డబ్లిన్, ఫ్లోరెన్స్, వెనిస్లతో సహా మరిన్ని నగరాలకు ఈ ఫీచర్ను విడుదల చేయాలని భావిస్తోంది. తద్వారా ఆయా నగరాలను సందర్శించే ముందు ప్లాన్ చేసుకోవడంతోపాటు, దానిగురించి అవగాహన పొందడంలో యూజర్లకు సహాయపడుతుందని ఒక బ్లాగ్ పోస్ట్లో గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్లోని ఎడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంప్యూటర్ వ్యూలో డిజిటల్ వరల్డ్ని వీక్షించవచ్చనిపేర్కొంది. ఈ వాస్తవిక దృశ్యాలను రూపొందించడానికి సాధారణ చిత్రాలను 3డీ ఇమేజెస్గా మార్చే అధునాతన ఏఐ సాంకేతికత అయిన న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్లను (NeRF) ఉపయోగిస్తుందని గూగుల్ తెలిపింది. ఆమ్స్టర్డామ్లోని రిజ్క్స్ మ్యూజియం వీడియోను షేర్ చేసింది. వర్చువల్గా బిల్డింగ్ పైన వున్న ఫీలింగ్ కలుగుతుందని వెల్లడించింది. అలాగే ఏటీఎంలు, రెస్టారెంట్లు, పార్కులు, రెస్ట్రూమ్లు, లాంజ్లు, టాక్సీస్టాండ్లు, రెంటల్ కార్స్, ట్రాన్సిట్ స్టేషన్లు వంటి అనేక విషయాలను గుర్తించడంలో సహాయపడటానికి మరో ఫీచర్ యాడ్ చేసింది. ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో రూపొందించిన “సెర్చ్ విత్ లైవ్ వ్యూ” గురించి కూడా పోస్ట్ వెల్లడించింది. ఈ లైవ్ వ్యూ ని లండన్, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కో టోక్యోలలో ప్రారంచింది. బార్సిలోనా, బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్, లండన్, మాడ్రిడ్, మెల్బోర్న్, పారిస్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ తైపీ వంటి అనేక నగరాల్లోని 1,000 కొత్త విమానాశ్రయాలు, రైలు స్టేషన్లు , మాల్స్ లాంటి వివరాలు రానున్న నెలల్లో అందిస్తామని గూగుల్ వెల్లడించింది. కాగా కంపెనీ తన I/O డెవలపర్ కాన్ఫరెన్స్లో గత సంవత్సరం ఇమ్మర్సివ్ వ్యూని తొలిసారి ప్రకటించింది. ఈ ఫీచర్ 2022 చివరిలో అందుబాటులోకి వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.అప్పటినుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఫీచర్ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. Google demos its new immersive maps view at its event in Paris today. pic.twitter.com/LjjXDy15gp — Richard Holmes (@richeholmes) February 8, 2023 Are you the sort of person who needs to get the feel of somewhere before you commit? 🗺 With immersive view on Google Maps, you can see what a neighborhood is like before you even set foot there📍 ✨ Coming to more cities in the next few months ✨#googlelivefromparis pic.twitter.com/VPvqHP25ai — Google Europe (@googleeurope) February 8, 2023 -
వాట్సాప్కు పోటీగా టెలిగ్రాంలో కొత్త ఫీచర్స్..
కొత్త అప్డేట్స్ ఎల్లప్పుడూ యాప్స్కు బూస్టింగ్నిచ్చే అంశాలేనని భావిస్తోంది టెలిగ్రామ్. ఇందులో భాగంగా వాట్సాప్ పోటీని తట్టుకునేందుకు టెలిగ్రామ్ సరికొత్త అప్డేట్స్తో లేటెస్ట్ ఫీచర్స్ను విడుదల చేసింది. వినియోగదారుల చాట్స్ను ట్రాన్స్లేట్ చేసే ఫీచర్ను జోడించింది. ప్రొఫైల్ పిక్చర్, ఎమోజీ కేటగిరితో పాటు ఇతర ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఫీచర్తో మొత్తం చాట్ను ట్రాన్స్లేట్ చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం లభించినట్లయింది. టెలిగ్రామ్లో ఎగువన ఉన్న ట్రాన్స్లేటింగ్ ఎంటైర్ చాట్స్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ ఫీచర్ సేవలను పొందొచ్చు. వినియోగదారులను ఉత్తేజపరిచే ఫీచర్స్లో ఇదీ ఒకటిగా నిలవనుందని టెలిగ్రామ్ అంచనా వేస్తోంది. ప్రీమియం కస్టమర్లకు మాత్రమే.. ట్రాన్స్లేటింగ్ ఎంటైర్ చాట్స్ కేవలం టెలిగ్రాం ప్రీమియం కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర వినియోగదారులు ఈ ఫీచర్ను పొందాలంటే వ్యక్తిగత సందేశాలను ఎంచుకుని అనువాదం నొక్కితే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే ట్రాన్స్లేట్ అవుతుంది. ఇక ప్రొఫైల్ ఫోటో మేకర్తో వినియోగదారులు తమ ప్రొఫైల్ చిత్రంలో ఏదైనా స్కిక్కర్ లేదా యానిమేటెడ్ ఎమోజీని మార్చుకునేందుకు అనుమతిస్తుంది. టెలిగ్రామ్ ప్రీమియం లేకపోయిన్పటికీ.. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాల కోసం యానిమేటెడ్, అలాగే అనుకూల ఎమోజీలను ఉపయోగించవచ్చని టెలిగ్రామ్ ప్రకటించింది. అంతేకాకుండా టెలిగ్రామ్ కూడా కొన్ని ప్రత్యేక ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా స్టిక్కర్లు, ఎమోజీలను వర్గాల వారీగా క్రమబద్ధీకరించింది. దీంతో వినియోగదారులు పది లక్షల కంటే ఎక్కువ విభిన్న స్టిక్కర్లు, ఎమోజీలను షేర్ చేసే అవకాశముంది. టెలిగ్రామ్ మరో సరికొత్త ఫీచర్ "నెట్వర్క్ యూసేజ్"ను కూడా తమ కస్టమర్లకు పరిచయం చేసింది. దీని ద్వారా వైఫై, మొబైల్ డేటాను కస్టమర్లు ఎంత వినియోగించారో తెలుసుకునేందుకు టెలిగ్రామ్ అనుమతిస్తుంది. వారి డేటాకు అనుగుణంగా ఆటో డౌన్లోడ్ సెట్టింగ్లను మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించింది. "ఆటో-సేవ్ ఇన్కమింగ్ మీడియా" ఫీచర్ ద్వారా వీడియా పరిమాణం, వీడియో రకం, ఏ చాట్ నుంచి వీడియో వచ్చిందనే విషయాలను సులభంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. చదవండి: చైనా యాప్లపై కేంద్రం కొరడా.. ఈసారి ఏకంగా -
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్! అదేంటంటే..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. త్వరలో మరో ఆసక్తికర ఫీచర్ను తీసుకురానుంది. చాట్, గ్రూప్ చాట్లలో యూజర్లు మెసేజ్లను పిన్ చేసుకునే వెసులుబాటును కల్పించనుందని వాబేటాఇన్ఫో(WABetaInfo) నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో రానున్న అప్డేట్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్తో ఉపయోగం ఇదే.. వాట్సాప్ చాట్, గ్రూప్చాట్లలో యూజర్లు చేసుకునే మెసేజ్లలో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. వాటిని టాప్లో పెట్టుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత చాట్లో ఉన్న ఇద్దరూ లేదా గ్రూప్లో ఉన్న సభ్యులు ఈ కొత్త అప్డేట్ చేసుకుని ఉంటే పిన్ చేసిన మెసేజ్లు అందరికీ టాప్లో కనిపిస్తాయి. ఒకవేళ అవతల వ్యక్తి పాత వర్షన్ను వినియోగిస్తన్నట్లయితే కొత్త వర్షన్ను అప్డేట్ చేసుకోమని యాప్ సూచిస్తుంది. వాట్సాప్ ఇప్పటికే కాలింగ్ షార్ట్కట్ క్రియేట్ చేసుకునే ఫీచర్ను తీసుకురావడంపైనా పనిచేస్తోందని వాబీటాఇన్ఫో నివేదిక ఇదివరకే తెలియజేసింది. ఇలా సరికొత్త ఫీచర్లు వస్తుండటంతో ఈ మెసేజింగ్ యాప్కు యూజర్లు అంతకంతకూ పెరుగుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో, 200 కోట్ల మందికిపైగా ఈ యాప్ను వినియోగిస్తున్నారు. -
ట్విటర్లో సరికొత్త ఫీచర్లు, త్వరలోనే అందుబాటులోకి
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫారం ట్విటర్ సరి కొత్త ఫీచర్లతో ముస్తాబు కానుంది. వచ్చే వారం నుంచి రానున్న కొత్త ఫీచర్లకు సంబంధించిన వివరాలను మస్క్ స్వయంగా ప్రకటించటం విశేషం. కొత్త పరిణామాలపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ట్వీట్లు, బుక్ మార్కు బటన్ ఫీచర్లు లాంటివి కొన్ని ఈ వారంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మస్క్ తెలిపారు. ఎడమవైపు .. కుడివైపు స్వైపింగ్ చేయటం, రికమండెడ్, ఫాలోడ్ ట్వీట్లను అనుసరించటం వంటి ఫీచర్లు ఈ వారంలోనే అందుబాటులోకి వస్తాయి. ట్వీట్లపైన బుక్ మార్కు కూడా అందుబాటులోకి వస్తోంది. వచ్చే నెలలో.. స్క్రీన్ షాట్లకు బదులు పెద్ద టెక్స్టును షేర్ చేయటం అనేది ఫిబ్రవరి మొదటివారం నుంచిసాధ్యమవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది నవంబరులో మస్క్ దీని గురించి తొలి సారిగా మాట్లాడారు. అందుబాటులోకి రానున్న మరికొన్ని అంశాలు మరో కొత్త ఫీచర్ను కూడా అందించేందుకు ట్విటర్ ప్రయత్నిస్తోంది. పెద్ద టెక్ట్స్ ను ద్రెడ్ సాయంతో ఆటోమేటిక్ గా చిన్నగా విడగొట్టవచ్చు. ఇకపైన వారు ‘ప్లస్’ బటన్ ను ఉపయోగించవలసిన పనిఎంత మాత్రం లేదు. అలాగే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీతో పంపించిన వ్యక్తి లేదా అందుకున్న వ్యక్తి తప్ప ఇతరులు దానిని రహస్యంగా చదవటానికి ఎలాంటి అవకాశం ఉండదు. 2018లోనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తేవాలని ప్రయత్నించినప్పటికీ, అమల్లోకి రాలేదు. మరింత సృజనాత్మకంగా... ట్విటర్ బ్లూ యూజర్లు 60 నిముషాల పెద్ద వీడియోలను 2జీబీసైజులో ఉన్న ఫైల్స్ తో అప్ లోడ్ చేయవచ్చు. అంతకంటే పెద్ద వాటిని వెబ్ ద్వారా పంపాలి. Easy swipe right/left to move between recommended vs followed tweets rolls out later this week. First part of a much larger UI overhaul. Bookmark button (de facto silent like) on Tweet details rolls out a week later. Long form tweets early Feb. — Elon Musk (@elonmusk) January 8, 2023 -
వాట్సాప్లో అదిరిపోయే కొత్త ఫీచర్లు
-
వాట్సాప్లో మరో 5 కొత్త ఫీచర్లు... యూజర్స్ కి పండగే
-
వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్స్: 5 ఫీచర్లు కమింగ్ సూన్
సాక్షి, ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకోసం త్వరలోనే మరో అయిదు కీలక ఫీచర్లను లాంచ్ చేయనుంది. ఎప్పటికపుడు కాలానుగుణంగా అప్డేట్స్తో వినియోగదారులకు ఆకట్టుకునే వాట్సాప్ తాజా అప్డేట్స్పై ఓ లుక్కేద్దాం. మెసేజ్ ఎడిట్: వాట్సాప్ ద్వారా యూజర్లు పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. అయితే ఎడిట్ చేసుకునేందుకు మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు మాత్రమే సమయం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్లో ఉంది. గ్రూపు మెంబర్స్ సంఖ్య: వాట్సాప్ గ్రూపులో గరిష్టంగా 512 మంది మరిమితమైన సంఖ్యను త్వరలోనే రెట్టింపు చేయనుంది. దీంతో ఒక గ్రూపులో 1024 మంది సభ్యులుగా చేరే అవకాశం కలుగుతుంది. షేర్ డాక్యుమెంట్ విత్ క్యాప్షన్: ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. వాట్సాప్ ద్వారా ఒకరికొకరు క్యాప్షన్లతో డాక్యుమెంట్లను సెండ్ చేసుకోవచ్చు. వీడియోలు, ఫోటోలుమాదిరిగానే ఇకమీదట డాక్యుమెంట్లకూ క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. స్క్రీన్ షాట్ బ్లాక్ : వాట్సాప్ ద్వారా వచ్చే మెసేజ్లకు, లేదా ఫోటోలను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశాన్ని రద్దు చేయనుంది. యూజర్ల గోప్యత పరిరక్షణలో భాగంగా వాట్సాప్ దీనికి త్వరలోనే చెక్ పెట్టనుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉండాలంటే, యూజర్లు వ్యూ వన్స్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం సబ్ స్క్రిప్షన్: బిజినెస్ వాట్సప్ ఖాతాల ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ను ప్రారంభించింది. ధర ఇంకా వెల్లడించిపోయినప్పటికీ, వ్యాపార సేవల కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్పై మాత్రమే సేవలను వాట్సాప్ అందించనుంది. వాట్సాప్ బిజినెస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
మారుతి కొత్త S-ప్రెస్సో, మోర్ ఫీచర్స్, మోర్ మైలేజీ, రూ.4.25 లక్షలు
సాక్షి, ముంబై: మారుతి సుజుకి ఇండియా కొత్త ఎస్-ప్రెస్సోను లాంచ్ చేసింది. 1.0 లీటర్ల నెక్స్ట్ జెన్ K-సిరీస్లో 2022ఎస్-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. సుమారు 1.44 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. పాత ఎస్-ప్రెస్సోతో పోలిస్తే, ఫీచర్లనుఅప్డేట్ చేసి, ధరను సుమారు 71,వేల రూపాయలు పెంచింది. అత్యాధునిక ఇంజీన్, ఎక్కువ మైలేజీతో మైక్రో-SUVగా తీసుకొచ్చింది. స్టార్ట్-స్ట్రాప్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ వీవీటీ ఇంజన్, మెరుగైన ఇంధన-సామర్థ్యం, అదనపు ఫీచర్లు కస్టమర్లకు ఆకర్షణీయమైన డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నామని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఫీచర్లు, మైలేజీ, ధర 1.0L డ్యూయల్ జెట్, ఐడిల్-స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో డ్యూయల్ వీవీటి ఇంజన్తో కొత్త S-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మోడల్ 4 ట్రిమ్స్లో అందుబాటులో ఉంది. సరికొత్త భద్రతా ఫీచర్లతో స్టాండర్ట్, LXi, Vxi Vxi వేరియంట్లలో వస్తుంది. దీని ధర రూ. 4.25 లక్షల నుంచి రూ. 5.99 లక్షల మధ్య ఉంటుంది. దీని ఇంజీన్ 5,500rpm వద్ద 65bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయగలదు. సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎకానమీ 25.30 కిలోమీటర్ల మైలేజీ, అందిస్తుందని, అయితే మాన్యువల్ వెర్షన్ 24.76kmplని ఆఫర్ చేస్తుందని మారుతి వెల్లడించింది. స్టాండర్డ్, Lxi, Vxi Vxi+. మాన్యువల్ శ్రేణి ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు రూ. 5.49 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, ఏజీఎస్ గేర్బాక్స్ వరుసగా రూ. 5.65 లక్షలు ,రూ. 5.99 లక్షల ధర కలిగిన Vxi , Vxi+ వేరియంట్లతో మాత్రమే అందుబాటులో ఉంది. Image source: Maruti Suzuki 5-స్పీడ్ మాన్యువల్, AGS(ఆటో-గేర్ షిఫ్ట్), ఎంట్రీ-లెవల్ టాల్-బాయ్ హ్యాచ్బ్యాక్లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు, EBDతో కూడిన ABS, ప్రీ-టెన్షనర్లు, ఫ్రంట్ సీట్బెల్ట్ రిమైండర్ ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్బెల్ట్లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ తోపాటు, హ్యాచ్బ్యాక్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, వాయిస్ కన్సోల్, ట్విన్ ఛాంబర్ హెడ్ల్యాంప్లు , డైనమిక్ సెంటర్ కన్సోల్ స్మార్ట్ ప్లే స్టూడియో లాంటివి ప్రధాన ఫీచర్లు. -
వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ ఎలా చేయాలంటే!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. కానీ వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ వంటి ముఖ్యమైన ఫీచర్ల విషయంలో వాట్సాప్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ వాట్సాప్ వాయిస్ రికార్డ్ ఫీచర్ అవసరమైన యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ను ఆశ్రయిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వాట్సాప్ సంస్థ.. కమ్యూనిటీస్, వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్య పెంచడం, ఎమోజీ రియాక్షన్స్, ఎక్కువ మందికి వాయిస్ కాల్స్ చేసుకోవడం, చాట్ ఫిల్టర్ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. ఈ ఏడాదిలో మరో 15 కొత్త ఫీచర్లను విడుదల చేయాల్సి ఉండగా .. ఇప్పుడు మనం అదే థర్డ్ పార్టీ యాప్స్ను వినియోగించి వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్ను ఎలా చేయాలో తెలుసుకుందాం. వాట్సాప్ వాయిస్ కాల్స్ రికార్డ్ ఎలా చేయాలంటే వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్ చేయాలంటే ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా అందుబాటులో ఉన్న క్యూబ్ కాల్ అనే వాట్సాప్ రికార్డ్ వాయిస్ కాల్స్ థర్డ్ పార్టీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఆ యాప్స్కు మనం మాట్లాడుతున్న వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డ్ చేసేందుకు సెట్టింగ్లో అనుమతి ఇవ్వాలి. సెట్టింగ్లో యాక్సెప్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే కాల్స్ రికార్డ్ చేయలేం. ఒకవేళ ఉచితంగా కాల్ రికార్డ్ ఆప్షన్ లేకపోతే వారానికి లేదంటే నెలకి కొంతమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించినప్పుడు వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. -
హ్యుందాయ్ కొత్త వెన్యూ.. 40కి పైగా మార్పులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ వెన్యూ కొత్త వర్షన్ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్షోరూంలో 1.2 లీటర్ పెట్రోల్ ట్రిమ్ రూ.7.53 లక్షలు, 1.0 లీటర్ టర్బో పెట్రోల్తోపాటు డీజిల్ ట్రిమ్స్ రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం. నాలుగు మీటర్లలోపు కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ విభాగంలో తొలిసారిగా 11 ఫీచర్లను కొత్త వెన్యూకు జోడించారు. డిజైన్, ఇతర అంశాల్లో 40 రకాల మార్పులు చేసినట్టు కంపెనీ తెలిపింది. 60కిపైగా కనెక్టెడ్ ఫీచర్లున్నాయి. వెనుక సీట్లకు రీక్లైనింగ్ ఫంక్షన్, ఆంబియెంట్ నేచుర్ సౌండ్, 12 భాషలు, ఎయిర్ ప్యూరిఫయర్, పవర్ సీట్స్ వంటి హంగులు ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్, వెహికిల్ స్టేటస్ వంటి ఫంక్షన్స్ను ఇంటి నుంచే నియంత్రించవచ్చని హుందాయ్ వివరించింది. చదవండి: సీఎన్జీ వాహనాలకు డిమాండ్.. -
8మంది కాదు.. ఒకే సారి 32మంది, వాట్సాప్లో ఇకపై..!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. వాట్సాప్ గ్రూప్స్లో కొత్త ఫీచర్లు, రియాక్షన్స్తో పాటు లార్జ్ఫైల్ షేరింగ్ చేసే సౌకర్యాన్ని యూజర్లకు అందించనున్నట్లు మెటా ఫ్లాట్ ఫామ్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్లో ఎనిమిది మంది మాత్రమే గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ తాజాగా జుకర్ బెర్గ్ వాయిస్ కాల్స్ చేసే సదుపాయాన్ని 8 మంది నుంచి 32 మందికి పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ఒకే సారి 32 మందికి వాట్సాప్ నుంచి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీడియో, పీడీఎఫ్ వంటి 1జీబీ డేటా ఫైల్స్ను పంపుతుండగా ఇకపై 2జీబీ వరకు ఫార్వర్డ్ చేయోచ్చు. ఉదాహరణకు ఓ స్కూల్కు చెందిన 10 వాట్సప్ గ్రూప్లు ఉంటే.. అందరికి ఒకే సమయంలో ఒకే మెసేజ్ను పంపేలా టూల్ను డిజైన్ చేయనున్నట్లు వాట్సాప్ స్పోక్ పర్సన్ తెలిపారు. రోజూవారీ జీవితంలో భాగమైన చాటింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత అడ్వాన్స్గా యూజర్లకు పరిచయం చేసేలా కొత్త కొత్త యాప్స్ను బిల్డ్ చేస్తున్నట్లు జుకర్ బెర్గ్ తెలిపారు. తద్వారా వందల మంది యూజర్ల నుంచి వేల మంది యూజర్లు చాట్ చేసుకునేలా వీలు కలగనుంది. చదవండి: రూ.22వేల కోట్ల ఫైన్ ! జుకర్ బర్గ్ ఒక్కో యూజర్కు తలా రూ.5వేలు ఇస్తారా!! -
ట్విటర్లో అదిరిపోయే ఫీచర్.. ఇది అందుబాటులోకి వస్తే!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విటర్ త్వరలో మరో సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. మైక్రో-బ్లాగింగ్ సైట్లో తమ ఆలోచనలను ఒక సుదీర్ఘ కథనం రూపంలో పంచుకోవాలనుకునే వారి అవసరాలను తీర్చడానికి ట్విటర్ ఈ కొత్త ఫీచర్పై పనిచేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా టిప్ స్టార్, రివర్స్ ఇంజనీర్ జేన్ మంచున్ వాంగ్ "ట్విటర్ ఆర్టికల్స్" అనే కొత్త ఫీచర్పై ట్విటర్ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్ సహాయంతో ఎక్కువ పదాలను పోస్ట్ చేయడానికి వీలు ఉంటుందని తెలుస్తుంది. ట్విటర్ వినియోగదారులు 280 అక్షరాల పరిమితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ట్విటర్లో పూర్తి కథనాలను రాయడానికి అనుమతించనున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ గురుంచి వినియోగదారుడికి తెలిసేలా ట్విటర్ మెనూ బార్లో ప్రత్యేక ట్యాబ్ను తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది. ఈ ఫీచర్పై ఒక ట్విటర్ ప్రతినిధి మాట్లాడుతూ.. "వ్యక్తుల మధ్య సంభాషణలు, అభిప్రాయాల వెల్లడికి సహాయపడటానికి కంపెనీ ఎల్లప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. త్వరలో మరిన్నింటిని భాగస్వామ్యం చేస్తుంది" అని అన్నారు. దీంతో పాటు ట్విటర్ ఫ్లోక్ అనే మరో కొత్త ఫీచర్ను కూడా పరీక్షిస్తోంది. ఇది ఇన్ స్టాగ్రామ్ లోని క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలాగా పనిచేస్తుంది. Twitter is working on “Twitter Articles” and the ability to create one within Twitter Possibility a new longform format on Twitter pic.twitter.com/Srk3E6R5sz — Jane Manchun Wong (@wongmjane) February 2, 2022 (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త..!) -
వాట్సాప్లో రానున్న కొత్త ఫీచర్స్ ఇవే
WhatsApp Upcomig Features In 2022: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలో అదీ కొత్త ఏడాది మొదట్లో కొత్త ఫీచర్స్తో యూజర్ల ముందుకు రానుంది. ఈ ఏడాది అంతగా ఫీచర్ల అప్డేట్ ఇవ్వని వాట్సాప్.. 2022లో మాత్రం యూజర్ ఫ్రెండ్లీ అప్డేట్స్తో రానున్నట్లు సమాచారం. భారత్ సహా ప్రపంచంలోనే మోస్ట్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్గా ఉంది వాట్సాప్. వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వాట్సాప్.. క్రమంగా వివాదాలను అధిగమిస్తూ యూజర్ ఫ్రెండ్లీ యాప్గా పేరు దక్కించుకుంది. కరోనా ప్రభావంతో కిందటి ఏడాది, అలాగే 2021 కూడా వాట్సాప్ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. ఈ తరుణంలో కొత్త సంవత్సరం అదిరిపోయే ఫీచర్లను అందించబోతోంది. వాబేటా ఇన్ఫోప్రకారం.. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ 2022లో వాట్సాప్ నుంచి రాబోయే కొత్త ఫీచర్ బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు. గ్రూపులో పెట్టే ఏ మెసేజ్నైనా.. అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్ ఇది. అప్పుడు అక్కడ This was removed by an admin అని చూపిస్తుంది. ఇదిలా ఉంటే వాట్సాప్ రీసెంట్గా మెసేజ్ డెలిట్ ఫీచర్ను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. యూజర్లు ఎవరైనా సరే చేసిన మెసేజ్ను వారంలోగా వెనక్కి తీసేసుకునే వెసులుబాటు కల్పించింది. క్విక్ రిప్లయిస్.. బిజినెస్ ప్రత్యేకం వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కోసం ఈ ఫీచర్. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ కోసం తీసుకురాబోతున్నారు. ఇంతకు ముందు ఛాట్బాక్స్లో “/” అనే సింబల్ను తరచూ పంపించే మెసేజ్లకు త్వరగతిన స్పందించేందుకు యాడ్ చేసేవాళ్లు. ఇకపై ఈ ఫీచర్ ఛాట్షేర్ యాక్షన్ మెనూకి సైతం చేర్చునున్నారు. స్టిక్కర్ స్టోర్ వాట్సాప్లో సాధారణంగా ఇతర యాప్ల సాయంతో స్టిక్కర్లు పంపుకోవడం తెలిసిందే. అయితే ఇకపై ఎంపిక చేసిన స్టిక్కర్స్ను నేరుగా వాట్సాప్ ద్వారానే పంపుకునే విధంగా స్టిక్కర్ స్టోర్ ఆప్షన్ తీసుకురాబోతోంది వాట్సాప్. వెబ్ అప్లికేషన్స్తో పాటు డెస్క్టాప్ వెర్షలకు ఈ ఆప్షన్ను అందించనుంది. కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ ఫీచర్. ఇది గ్రూప్ అడ్మిన్ల కోసం తీసుకురాబోతున్న ఫీచర్. తద్వారా మల్టీపుల్(ఒకటి కంటే ఎక్కువ) గ్రూపులు అడ్మిన్ కంట్రోల్ చేతిలో ఉంటాయి. అంతేకాదు సబ్ గ్రూపులను క్రియేట్ చేసే వీలుంటుంది కూడా. మెసేజ్ రియాక్షన్స్ దీని గురించి ఆల్రెడీ చర్చించిందే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మాదిరి.. మెసేజ్లకు ఎమోజీల ద్వారా నేరుగా రియాక్ట్ అయ్యే వెసులుబాటు కల్పించడం. ప్రస్తుతం ఆరు ఎమోజీల సాయంతో ఈ ఫీచర్ను టెస్ట్ చేస్తోంది వాట్సాప్. స్టిక్కర్ సజెషన్స్ వాట్సాప్లో ఏదైనా స్టిక్కర్ ప్యాక్ను డౌన్ లోడ్ చేశారనుకోండి!. ఒకటి కంటే ఎక్కువ స్టిక్కర్లకు(సేమ్ స్టిక్కర్) సరిపోయేలా ఏదైనా టైప్ చేస్తే.. అప్పుడు అందులో ఓ స్టిక్కర్ చిహ్నం(కన్ఫ్యూజ్కి గురి చేయకుండా) ఆటోమేటిక్గా మారుతుంది. ఎందుకంటే వాట్సాప్ సర్వర్లో కాకుండా కేవలం డివైజ్లో మాత్రమే వాటిని డౌన్ లోడ్ చేశారు కాబట్టి. ఆ స్టిక్కర్లకు WhatsAppతో సంబంధం ఉండదు కాబట్టి. ఈ ఫీచర్ యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. సేవ్ చేయకుండా స్టిక్కర్లు ఫార్వాడ్ చేయడం సాధారణంగా వాట్సాప్లో ఎవరైనా స్టిక్కర్లు పంపితే.. వాటిని సేవ్ చేయకుండా మరొకరికి పంపలేం. అందుకే సేవ్ చేయకుండానే పంపే ఆప్షన్ను తీసుకురాబోతోంది. చదవండి: వాట్సాప్ నెంబర్ పదే పదే బ్యాన్ అవుతోందా? ఇలా చేయండి -
ఆండ్రాయిడ్లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....!
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అదిరిపోయే ఫీచర్స్ను త్వరలోనే యూజర్లకు గూగుల్ అందించనుంది. ఈ కొత్త ఫీచర్స్తో, పిల్లల దినచర్యలను, కార్లను కంట్రోల్ చేయవచ్చునని గూగుల్ వెల్లడించింది. గూగుల్ తెస్తోన్న అద్బుతమైన ఫీచర్లతో యూజర్లకు స్మార్ట్ఫోన్స్ మరింత సహాయకరంగా మారనుంది. వీటిలో ఫ్యామిలీ బెల్, డిజిటల్ కార్ కీ లాంటివి సూపర్ ఫీచర్స్గా నిలవనున్నాయి. ఫ్యామిలీ బెల్..కుటుంబ సభ్యులతో మమేకం..! ఈ ఫీచర్తో కుటుంబంలోని సభ్యుల రిమైండర్స్ను, రోజువారీ షెడ్యూళ్లను మానిటర్ చేయవచ్చును. ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ సభ్యులు కలిసి ఉండే క్షణాలు చాలా తక్కువయ్యాయి. ఈ ఫీచర్తో బ్రేక్ఫాస్ట్, లంచ్, హాలిడే లాంటివి ప్లాన్ చేసేందుకు ఉపయోగపడుతోంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయంపాటు గడిపేందుకు సహాయపడుతుంది. దీనిలో గూగుల్ ప్లే బుక్స్, యూట్యూబ్ మ్యూజిక్ లాంటి విడ్గెట్స్ కూడా రానున్నాయి. గూగుల్ ఫోటోస్ గూగుల్ ఫోటోస్లో రానున్న కొత్త ఫీచర్స్తో మీ కుటుంబం, స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను మీకు గుర్తు చేసే లక్ష్యంతో గూగుల్ ఫోటోస్ కొత్త మెమోరీస్ ఫీచర్ను కూడా అందిస్తోంది. ఈ జ్ఞాపకాలను ఫోటో గ్రిడ్లో కనిపిస్తాయి. డిజిటల్ కార్ కీ.. ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్ఫోన్లనుపయోగించి సదరు ఫీచర్ కల్గిన కార్లను లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి గూగుల్ డిజిటల్ ఆటోమోటివ్ కీను అందుబాటులోకి తేనుంది. ఇది తొలుత బీఎమ్డబ్ల్యూ వాహనాల కోసం పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్ఫోన్లలో ఎంపిక చేయబడిన దేశాలలో విడుదల కానుంది. ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్ను సపోర్ట్ చేసే కార్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. గత ఏడాది డిజిటల్ ఆటోమోటివ్ కార్ల కీను యాపిల్ పరిచయం చేసింది. ఈ సదుపాయం కొన్ని లగ్జరీకార్లకు మాత్రమే అందుబాటులో ఉంది. జీబోర్డ్ ఎమోజీ కీబోర్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు గూగుల్ జీబోర్డ్ అనే కీబోర్డ్ను పరిచయం చేసింది. జీబోర్డ్కు కూడా అప్డేట్ తీసుకురానుంది. ఈ అప్డేట్తో మీరు ఇతరులకు చెప్పదల్చుకున్న విషయాలను రెండు ఎమోజీలను ఒకే ఎమోజీగా కనవర్ట్ చేసి సెండ్ చేయవచ్చును. బీటా యూజర్లు రాబోయే రెండు, మూడు వారాల్లో జీబోర్ట్ ఎమోజీకిచెన్ ఫీచర్ అందుబాటులో రానుంది. ఆటో రిసేట్..! ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ తీసుకువస్తోన్న చివరి ప్రధాన మార్పు ఆటో-రీసెట్ పరిష్మన్స్. మీరు ఇంతకాలం ఉపయోగించని డౌన్లోడ్ చేసిన యాప్ల కోసం రన్టైమ్ అనుమతులను ఆటోమెటిక్గా ఆఫ్ చేయడానికి ఈ ఫీచర్ మీ గాడ్జెట్ను ఎనేబుల్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. చదవండి: వాట్సాప్ గ్రీవియన్స్ ఆఫీసర్ రాజీనామా? -
వాట్సాప్లో రూపాయి సింబల్ ఫీచర్..ఎందుకంటే
న్యూఢిల్లీ: చాట్ కంపోజర్కు రూపాయి గుర్తును జోడించినట్టు వాట్సాప్ ప్రకటించింది. చెల్లింపులను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వినియోగదార్లకు అందరికీ వాట్సాప్లో ఈ ఫీచర్ తోడవడానికి కొన్ని రోజులు పడుతుంది. అలాగే కంపోజర్లో ఉన్న కెమెరాతో 2 కోట్లకుపైగా స్టోర్లలో క్యూఆర్ కోడ్స్ను స్కాన్ చేయవచ్చు. 1.5 కోట్ల మంది చిన్న వర్తకులు వాట్సాప్ బిజినెస్ యాప్ వాడుతున్నారు. వీరంతా వాట్సాప్ యూజర్ల నుంచి చెల్లింపులను స్వీకరించవచ్చు. పేమెంట్స్ సేవలను కంపెనీ భారత్లో గతేడాది నవంబర్లో ప్రారంభించింది. చదవండి: వాట్సాప్లో మనీ ట్రాన్స్ఫర్ ఇలా చేయండి.. -
జీమెయిల్ యూజర్లకు గుడ్న్యూస్...!
జీమెయిల్ యూజర్లకు గూగుల్ గుడ్న్యూస్ను అందించింది. జీమెయిల్ మొబైల్ యాప్ను లేదా వెబ్ యాప్స్ను ఉపయోగించి నేరుగా గూగుల్ మీట్ యూజర్లకు వాయిస్, వీడియో కాల్స్ను చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుంగా జీమెయిల్ యూజర్లు ఒకరికొకరు వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్గించనుంది. భవిష్యత్తులో వాయిస్ఇంటర్నెట్ ప్రొటోకాల్స్ను చేసే సామర్థ్యాన్ని కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. జీమెయిల్ యాప్స్లో గ్రూప్ చాట్ సర్వీసులను కూడా యూజర్లు పొందే సౌకర్యాన్ని గూగుల్ అందించనుంది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! గూగుల్ ప్రకటించిన కొత్త ఫీచర్లలో భాగంగా జీమెయిల్ యాప్స్లో చాట్, స్పేసెస్, గూగుల్ మీట్ వంటి మూడు ట్యాబ్లను వర్క్స్పేస్ టూల్స్కు మరింతగా అనుసంధానంగా ఉండనున్నాయి. గూగుల్ మీట్ బటన్పై క్లిక్ చేసిన తరువాత జనరేట్ ఐనా లింక్ను ఇతరులకు పంపడం ద్వారా వీడియో కాలింగ్ను చేయవచ్చును ప్రస్తుతం తెచ్చిన ఫీచర్తో నేరుగా జీమెయిల్ ఖాతాతో గూగుల్ మీట్ పాల్గొనే సదుపాయం కల్గనుంది. తాజాగా గూగుల్ మీట్ కంపానియన్ మోడ్ను నవంబర్లో అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ ప్రయత్నిస్తుంది. గూగుల్ క్యాలెండర్, డ్రైవ్, డాక్స్, షీట్, స్లయిడ్లు, మీట్, టాస్క్లతో సహా ఇతర గూగుల్ వర్క్స్పేస్ టూల్స్ సహకారంతో టీమ్ మీటింగ్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ చాట్ లాంటి ఫీచర్లో భాగంగా పాల్గొనేవారికి డాక్యుమెంట్లను షేర్ చేయడానికి సులువుగా ఉండనుంది. యూజర్ల మధ్య జరిగిన కన్వర్సేషన్ను పూర్తిగా సేవ్ చేసుకోవచ్చును. గూగుల్ అదనంగా గూగుల్ క్యాలెండర్ పలు కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమ వర్క్ డే లోకేషన్ స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది. చదవండి: మైక్రోసాఫ్ట్ తర్వాత మరో రెండు స్టార్ట్ మెనూలు.. ఎబ్బెట్టుగా ఉందని ఫీడ్బ్యాక్! -
Whatsapp : వీడియో ఫీచర్స్లో మార్పులు.. అవేంటంటే !
యూజర్ ఫ్రెండ్లీగా ఉండే సరికొత్త ఫీచర్లను అందుబాటులో తెచ్చేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. వాట్సప్ యూజర్లకు సరికొత్త అనుభూతి ఇచ్చే విధంగా నూతన ఫీచర్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా వీడియో, చాట్ కంటెంట్ విషయంలో ఈ మార్పులు ఉండబోతున్నాయి. వీడియో క్వాలిటీ ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్ ఎప్పుడో పాతపడిపోయింది. ఇప్పుడు 4కే, 8కే రిజల్యూషన్ వీడియో రికార్డింగ్ ట్రెండ్గా మారింది. అయితే 4కే , 8కే వీడియోలు ఎక్కువ మోమోరినీ ఆక్రమిస్తాయి. వీటిని ఇతరులకు సెండ్ చేసేప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరోవైపు వీడియో డౌన్లోడ్లతో ఫోన్లలో మోమరీ సైతం త్వరగా అయిపోతుంది. ఈ రెండు సమస్యల పరిష్కారానికి వీడియో క్వాలిటీ షేరింగ్లో వాట్సప్ మార్పులు చేసింది. దీనికి సంబంధించి బీటా వెర్షన్ను ఆండ్రాయిడ్ ఫోన్లలో టెస్ట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి వాట్సప్ తేనుంది. కొత్త మార్పులు ఇలా వాట్సప్ తాజా అప్డేట్ అయిన వీడియో షేరింగ్ క్వాలిటీకి సంబంధించి మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఆటో వెర్షన్ ఆప్షన్ , వాట్సప్ సైతం దీన్నే రికమండ్ చేయనుంది. బెస్ట్ క్వాలిటీ వీడియో, డేటా సేవ్లు మరో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఆటో వెర్షన్ని ఎంచుకుంటే సెండ్ చేసే వీడియోకు సంబంధించి బెస్ట్ ఆల్గోరిథమ్ని ఎంచుకుని దాని ప్రకారం వీడియోను వాట్సప్ సెండ్ చేస్తుంది. ఇక డేటా సేవ్ ఆప్షన్ ఎంచుకుంటే... వీడియోను కంప్రెస్ చేసి పంపిస్తుంది. మూడవది బెస్ట్ క్వాలిటీ వీడియోస్ని పంపే వెసులుబాటు కల్పిస్తుంది. చూశాక.. మాయం స్నాప్ చాట్ తరహాలోనే నిర్ణీత సమయం తర్వాత మేసేజ్, ఫోటోలు, వీడియోలు తదితర కంటెంట్ ఆటోమేటిక్ డిసప్పియర్ అయ్యేలా ఆప్షన్ను ప్రవేశపెట్టే పనిలో వాట్సప్ ఉంది. వాట్సప్లో వచ్చిన కంటెంట్ను ఒకసారి చూసిన తర్వాత కొంత సమయానికి ఆ కంటెంట్ కనిపించకుండా పోతుంది. బిజినెస్ రిలేటెడ్ చాట్స్కి ఆ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వాట్సప్ అంటోంది. దీనికి సంబంధించి బీటా వెర్షన్ సైతం టెస్టింగ్లో ఉంది. -
వాట్సాప్లో కొత్త ఫీచర్.. ఇకపై..!
వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. తరుచుగా తన వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా మరో ఫీచర్ను మరికొద్ది రోజుల్లోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త ఫీచర్లో భాగంగా వాట్సాప్లో వినియోగదారులకు కనిపించే వాయిస్ మెసేజ్ సీక్ బార్ మారనున్నట్లు తెలుస్తోంది. సీక్బార్ స్థానంలో తరంగాల రూపంలో(వేవ్ ఫార్మ్స్) కనిపించనుంది. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ వాడుతున్న వినియోగదారులకు కూడా శుభవార్తను అందించింది. భవిష్యత్తులో బిజినెస్ అకౌంట్ వాడుతున్న వారికి ఆన్లైన్లో ఉన్నట్లుగా ఉండే ఆప్షన్ ఇతర వాట్సాప్ వినియోగదారులకు కనిపించదని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. బిజినెస్ అకౌంట్ వాడుతున్నవారికి ఇతరులకు లాస్ట్సీన్ కూడా కనిపించదని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి. కాగా ఈ ఫీచరును ఏప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని వాట్సాప్ చెప్పలేదు. చదవండి: వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.! -
గూగుల్ మీట్: స్టూడెంట్స్-టీచర్లకు పనికొచ్చేలా..
న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్ ఫ్లాట్ఫామ్ గూగుల్ మీట్ కొన్ని కొత్త ఫీచర్స్ను తీసుకురాబోతోంది. ఆన్లైన్ క్లాస్ నిర్వాహణకు వీలుగా ఆ ఫీచర్లను డెవలప్ చేయించింది. అడ్మిన్లు, టీచర్లు, స్టూడెంట్స్ లక్క్ష్యంగా రూపొందించిన ఈ ఫీచర్లు.. చాలావరకు ఇబ్బందుల్ని తొలగిస్తాయని గూగుల్ మీట్ భావిస్తోంది. ఇక తాజా ఫీచర్ల వల్ల అడ్మిన్స్కి మీట్పై ఎక్కువ నియంత్రణ దక్కనుంది. కొత్తగా హ్యాండ్ రైజింగ్, లైవ్ క్యాప్షన్స్ ఫీచర్స్ తేనుంది. అంతేకాదు గూగుల్ మీట్ త్వరలో పబ్లిక్ లైవ్ స్ట్రీమ్స్ ఆఫ్షన్ను కూడా అనుమతించబోతోంది. అది కూడా నేరుగా యూట్యూబ్ ద్వారా కావడంతో పేరెంట్స్, పిల్లలు.. ఎవరైనా సరే ఆ మీటింగ్లకు అటెండ్ కావొచ్చు. అంతేకాదు ‘గూగుల్ మీట్ యూజర్ ఇంటర్ఫేస్’ ద్వారా టీచర్లు తమ ప్రజంటేషన్ సమీక్షతోపాటు స్టూడెంట్స్ ప్రజంటేషన్ను కూడా పరిశీలించేందుకు వెసులుబాటు కలగనుంది. ఇక టీచర్లు గూగుల్ నోట్ సెల్ఫ్ ఫీడ్ను మినిమైజ్ చేసి మరింతమంది స్టూడెంట్స్ను కాల్లో చేర్చుకోవడానికి వీలుంటుంది, అలాగే స్టూడెంట్స్ పేర్లు కూడా డిస్ప్లేపై కనిపిస్తాయి. డౌట్ వస్తే చెయ్యెత్తి.. స్టూడెంట్స్, టీచర్ల మధ్య కమ్యూనికేషన్ కోసం హ్యాండ్ రెయిజ్ ఐకాన్(చెయ్యి ఎత్తే సింబల్)ను, దానికి తగ్గట్లు సౌండ్ను డెవలప్ చేసింది గూగుల్ మీట్. తద్వారా స్టూడెంట్లు టీచర్లను కాంటాక్ట్ అవ్వొచ్చు. అలాగే అడ్మిన్ ఆ లిస్ట్ను గమనించి.. ఆర్డర్ ప్రకారం ఆ స్టూడెంట్ లిస్ట్ను సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టూడెంట్ అనుమానం నివృత్తి అయ్యిందంటే.. ఆటోమేటిక్గా ఆ హ్యాండ్ సిబల్ డల్ అయిపోతుంది. మరో ముఖ్యమైన ఫీచర్.. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. ఎప్పటికప్పుడు అవతలివాళ్లకు తగ్గ భాషలోకి తర్జుమా చేసి చూపిస్తుంది. ఈ ఫీచర్స్తో పాటు హోస్ట్, టీచర్లు వీడియోలకు లాక్ వేసే వీలు, టాబ్లెట్.. మొబైల్ ఫోన్ల కోసం కూడా సేఫ్టీ కంట్రోల్ ఫీచర్లు కూడా రాబోతున్నాయి. ఈ ఏడాది బీటా వెర్షన్ను ప్రవేశపెట్టి.. వచ్చేడాది మొదట్లో నుంచి ఈ ఫీచర్లను యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనుంది గూగుల్ మీట్. చదవండి: గూగుల్ ఫొటోస్లో ఉన్న ఫీచర్ ఇప్పుడు.. -
భలే ఫీచర్స్.. ట్రూకాలర్లో ఒకేసారి 8 మందితో కాన్ఫరెన్స్ కాల్
సాక్షివెబ్డెస్క్: ప్రముఖ యాప్ ట్రూలర్ కాలర్ వినియోగదారులకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అప్ డేట్ చేసిన ఫీచర్లతో ఒకే సారి 8మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడే అవకాశం లభించింది. దీంతో పాటు మరికొన్ని అప్ డేట్ గురించి తెలుసుకుందాం. వాయిస్ కాల్స్ ట్రూ కాలర్ వినియోగదారులు అంతర్జాతీయ స్థాయిలో ఒకేసారి ఎనిమిది మంది మాట్లాడే అవకాశం ఉంది. స్పామ్ వినియోగదారులను గుర్తిస్తుంది. గ్రూప్ కాల్ సభ్యులను కాంటాక్ట్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మాట్లాడుకోవచ్చు. ఇతర వినియోగదారులను మరొక కాల్లో లేదా ఆఫ్లైన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ పంపిస్తుంది. స్పామ్ ఎస్ఎంస్ స్పామ్ కాల్స్ను గుర్తించటన్లుగా స్పామ్ మెసేజ్ లను ఫిల్టర్ చేస్తుంది. ఇప్పటికే ఓటీపీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, చెల్లింపు రిమైండర్లు మెసేజ్లను హైలైట్ చేస్తుండగా, తాజాగా ఈ ఫీచర్ ను అప్ డేట్ చేసి అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ వల్ల ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ ఎస్ఎంఎస్ ప్రస్తుతం భారత్, కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికాలో సౌలభ్యంగా ఉంది. ఇది త్వరలో యుఎస్, స్వీడన్, మలేషియా, ఇండోనేషియా, ఈజిప్ట్లకు విస్తరించబడుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇన్ బాక్స్ క్లియర్ ఓటీపీలు,స్పామ్ మెసేజెస్, ఓల్డ్ మెసేజ్ లను హైలెట్ చేస్తుంది. వాటి అవసరం లేదనుకుంటే ఒకే క్లిక్తో వాటిని తొలగించడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. దీంతో మెసేజ్ ఫోల్డర్ లో ఓల్డ్ మేసేజ్ లు కాకుండా లేటెస్ట్ మెసేజ్ లు మనకు హైలెట్ అవుతాయి. -
గూగుల్లో కొత్త ఫీచర్స్..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ప్రైవసీ సెట్టింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్తో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం బీటా వెర్షన్ను ఆవిష్కరించింది. అమెరికాలోని మౌంటెయిన్ వ్యూ క్యాంపస్లో వర్చువల్గా నిర్వహించిన గూగుల్ ఐ/ఓ 2021 కార్యక్రమంలో వీటిని పరిచయం చేసింది. వీటిని ఈ ఏడాది ప్రవేశపెట్టే ఉత్పత్తుల్లో పొందుపర్చనుంది. ‘‘కోవిడ్–19తో నా మాతృదేశమైన భారత్తో పాటు బ్రెజిల్ తదితర దేశాలు ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బోధన, చిన్న వ్యాపార సంస్థల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, అవసరమైన వారికి టీకాలు మొదలైన అత్యవసరాలు సత్వరం అందేందుకు గూగుల్ పలు ఉత్పత్తులు ప్రవేశపెట్టింది. చర్యలు తీసుకుంది’’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. సెర్చి, లెన్స్, ఫొటోస్, మ్యాప్స్, షాపింగ్ మొదలైన ఉత్పత్తుల్లో ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే కొత్త ఫీచర్లను ఈ సందర్భంగా ఆయన వివరించారు. మరిన్ని విశేషాలు.. ►గోప్యతను మరింత మెరుగుపర్చేందుకు ‘‘క్విక్ డిలీట్’’ ఆప్షన్. దీనితో గూగుల్ అకౌంట్ మెనూ ద్వారా ఒక్కసారి ట్యాప్ చేసి 15 నిమిషాల సెర్చి హిస్టరీని డిలీట్ చేసేయొచ్చు. ►మ్యాప్స్ టైమ్లైన్లో లొకేషన్ హిస్టరీ ఫీచర్. ►గూగుల్ ఫొటోస్లో పాస్వర్డ్ రక్షణతో ‘‘లాక్డ్ ఫోల్డర్’’ ఫీచరు. యూజరు ఎంపిక చేసుకున్న ఫొటోలను విడిగా భద్రపర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇవి గ్రిడ్ లేదా షేర్డ్ ఆల్బమ్స్లో కనిపించవు. దీన్ని ముందుగా గూగుల్ పిక్సెల్ ఫోన్లలో ఆ తర్వాత మిగతా ఆండ్రాయిడ్ పరికరాల్లో అందుబాటులోకి తెస్తారు. ►2014 తర్వాత డిజైన్పరంగా గణనీయమైన మార్పులు, చేర్పులతో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ బీటా వెర్షన్. ఇందులో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు. యూజర్ డేటాను ఏయే యాప్స్ తీసుకుంటున్నాయన్న వివరాలను అందించడంతో పాటు యూజర్లకు డివైజ్పై మరింతగా నియంత్రణ ఉండేలా ఆండ్రాయిడ్ 12 రూపకల్పన. -
వాట్సాప్ లో కొత్త ఫీచర్...వాయిస్ మెసేజ్లను...
వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్ ద్వారా సందేశాలను ఇతరులకు పంపుతాము. అప్పుడప్పుడు మనం పంపే మెసేజ్ల్లో ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో..చూసి మెసేజ్లను పంపుతాం. ఈ సౌలభ్యం కేవలం వాట్సాప్లో మెసేజ్లకు మాత్రమే ఉంది. వాయిస్ మెసేజ్లకు లేదు. వాయిస్ మెసేజ్లను ఎలాంటి పునః పరిశీలన చేయకుండానే పంపుతుంటాం. మనలో కొంత మంది అరేరే..! తప్పుగా వాయిస్ మెసేజ్ సెండ్ చేశానే..!అని నాలుక కర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనలో కొందరు వాటివల్ల అనేక పర్యవసానాలను కూడా ఎదుర్కొని ఉంటారు. ఈ సమస్యకు వాట్సాప్ త్వరలోనే చెక్ పెట్టనుంది. అవును మీరు విన్నది నిజమే... రానున్న రోజుల్లో వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్తో వాయిస్ మెసేజ్లను తిరిగి ఒకసారి వినే వీలు కల్గుతుంది. ఈ ఫీచర్ను ప్రస్తుతం వాట్సాప్ పరీక్షిస్తోంది. అంతేకాకుండా వాయిస్ మెసేజ్లను యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడ్ల్లో మెసేజ్లను వినవచ్చును. ఈ ఫీచర్తో యూజర్లు వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించవచ్చును. రానున్న రోజుల్లో వాయిస్ మెసేజ్లను పంపేటప్పడు ‘రివ్యూ’ బటన్ ఉండేలా వాట్సాప్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో వాట్సాప్ తీసుకురానుంది. చదవండి: కరోనా: వాట్సాప్ ‘స్టేటస్’ మారిపోతోంది! -
వన్ప్లస్ ప్రియులకి గుడ్ న్యూస్
గత వారమే వన్ప్లస్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ బీటా వెర్షన్ ను వన్ప్లస్ 7, 7టీ సిరీస్ కోసం విడుదల చేసింది. వన్ప్లస్ తన వినియోగదారులకు కెమెరా విషయంలో ఇంకా మంచి అనుభూతిని అందించడానికి కొత్త అప్డేట్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా తన ఫోన్ కెమెరా యాప్కి ప్రత్యేక మోడ్స్ జోడించి తీసుకొస్తోంది. వన్ప్లస్ కెమెరాలో 6.4.23 వెర్షన్ కింద "టిల్ట్-షిఫ్ట్, స్టార్ట్ బస్ట్, మూన్, హైపర్ లాప్స్" అనే కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. వీటితో వన్ప్లస్ యూజర్లు తమ ఫోన్ కెమెరాతో ఫొటోలను ఇతరుల కంటే భిన్నంగా తీయవచ్చు.(చదవండి: మోటోరోలా ఎడ్జ్ ఎస్లో సరికొత్త ఫీచర్స్) ప్రస్తుతం ఈ సరికొత్త వన్ప్లస్ కెమెరా ఫీచర్లను కొందరు యూజర్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న వన్ప్లస్ 9 సిరీస్లో వీటిని తీసుకొస్తారని సమాచారం. కొత్తగా తీసుకురాబోయే టిల్ట్-షిప్ట్ మోడ్తో సాధారణ ఫోటోలను చాలా చిన్న ఫొటోలుగా క్రియేట్ చేయవచ్చు. అలాగే "స్టార్బర్స్ట్" మోడ్తో సూర్యని లాగా ప్రకాశించే ప్రతి దానిని ఒక నక్షత్రంలాగా మార్చవచ్చు. రాత్రి వేళలో ఆకాశాన్ని ఫోటోలను తీయడానికి ఇష్టపడే యూజర్లు మూన్ మోడ్ ఫిల్టర్లు వాడి చందమామ రంగుల్ని మార్చొచ్చు. -
సిగ్నల్ యూజర్లకు గుడ్ న్యూస్ : వాట్సాప్కు ఝలక్
సాక్షి,న్యూఢిల్లీ: ఫేస్బుక్ యాజమాన్యంలోని ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్లో కొత్త నిబంధనలు, గోప్యతా విధానాల మార్పుల ఆందోళనల నేపథ్యంలో మరో మెసేజింగ్ యాప్ సిగ్నల్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దేశీయంగా వాట్సాప్కు ప్రత్యర్థిగా దూసుకొస్తున్న సిగ్నల్ వినియోగదారులను తనవైపు తిప్పుకునేందుకు వాట్సాప్ తరహాలో ఈ ఫీచర్లను తన యూజర్ల సౌలభ్యం కోసం విడుదల చేసింది. తాము ఎలాంటి యూజర్ డేటాను సేకరించమని ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిర్భయంగా వాడుకోవచ్చని సిగ్నల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రియాన్ ఆక్టన్ ప్రకటించారు. ఇంత తక్కువ వ్యవధిలో తమకు లభించిన ఆదరణ దీనికి నిదర్శమన్నారు. సిగ్నల్ యూజర్లు ప్రతీ ఒక్కరి భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. కాగా వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో కోట్లాదిమంది వినియోగదారులు వాట్సాప్పై గుర్రుగా ఉన్నారు. ఫలితంగా ప్రత్యామ్నాయాలపై దృష్టి మళ్లిస్తున్నారు. దీంతో టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ, తాజాగా వీటికి మైగ్రేట్ అవుతున్న క్రమంగా పెరుగుతోంది. వినియోగదారుల డేటాకుఎలాంటి ఢోకా లేదు అని వాట్సాప్ హామీ ఇచ్చినప్పటికీ ఈ పరంపరం కొనసాగుతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుక సిగ్నల్ శరవేగంగా పావులు కదుపుతోంది. వాట్సాప్ పోలీన ఫీచర్లతో దూసుకొస్తోంది. సిగ్నల్లో కొత్త ఫీచర్లు చాట్ వాల్ పేపర్: వాబేటా ఇన్ఫో సమాచారం ప్రకారం తాజా బీటా నవీకరణలో, సిగ్నల్ క్రొత్త ఫీచర్లను విడుదల చేసింది, ఇది వినియోగదారులను చాట్ వాల్పేపర్ను మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు సిగ్నల్ యాప్లో అందుబాటులో లేదు. స్టేటస్ అప్డేట్: వాట్సాప్ మాదిరిగానే, సిగ్నల్ ఇప్పుడు స్టేటస్ అప్డేట్ను తీసుకొచ్చింది. యానిమేటెడ్ స్టిక్కర్లు: వాట్సాప్లో లభించే యానిమేటెడ్ స్టిక్కర్లను కూడా సిగ్నల్ లాంచ్ చేసింది. "తాజా నవీకరణ మొదటి అధికారిక యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్" డే బై డే "తో పాటు యానిమేటెడ్ స్టిక్కర్లను ఫఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. అలాగే డెస్క్ టాప్ నుండి యానిమేటెడ్ స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్కాల్స్ : సిగ్నల్లో గ్రూప్ కాల్ ఫీచర్ ఉంది, కానీ ఐదుగురు పాల్గొనేందుకుమాత్రమే ఇప్పటిదాకా అనుమతి. ఈ పరిమితిని ప్రస్తుతం వాట్సాప్ మాదిరిగానే ఎనిమిదికి పెంచింది. గ్రూప్ ఇన్వైట్ లింక్: గ్రూపులలో చేరేందుకు, ఇతర సిగ్నల్ వినియోగదారులను ఆహ్వానించడానికి సిగ్నల్ ఇప్పుడు గ్రూప్ ఇన్వైట్ లింక్ యాడ్ చేయడానికి అనుమతిస్తుంది. -
వాట్సాప్.. మరిన్ని కొత్త ఫీచర్స్!
ముంబై, సాక్షి: ఇటీవల డిజెప్పీరింగ్ మెసేజెస్ ఫీచర్ను ప్రారంభించిన వాట్సాప్ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్స్ను అందించనున్నట్లు వేబ్టెయిన్ఇన్ఫో పేర్కొంది. వీటిలో రీడ్ లేటర్, వీడియోలను పంపే ముందు మ్యూట్ చేయడం, రిపోర్ట్ టు వాట్సాప్ తదితర ఫీచర్లను ప్రస్తావించింది. కొద్ది రోజులక్రితం వాట్పాస్ పేమెంట్స్, బల్క్ డీలిట్, షాపింగ్ బటన్ తదితరాలను వాట్సాప్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 12 కొత్త ఫీచర్లు అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం.. రీడ్ లేటర్ మెసేజీలను తదుపరి కాలంలో చదివేందుకు వీలుగా రీడ్ లేటర్ ఫీచర్ను వాట్సాప్ రూపొందిస్తోంది. ఇది ఇప్పటికే వినియోగంలో ఉన్న ఆర్కీవ్డ్ చాట్స్ ఫీచర్ పరిధిలోనికి వస్తుంది. ఈ ఫీచర్ను మరింత ఆధునీకరిస్తోంది. ఈ ఫీచర్ను ఆన్ చేస్తే ఆర్కీవ్ చేసిన చాట్ నుంచి కాల్స్ లేదా మెసేజీలను అందుకునే వీలుండదు. అయితే వెకేషన్ మోడ్తో సహా ఆధునీకరించిన ఈ ఫీచర్ ద్వారా ఆర్కీవ్ చేసిన అన్ని మెసేజీలతోపాటు.. కొత్తగా వచ్చిన మెసేజీలను స్టోర్ చేసుకోవచ్చు. కాగా.. రీడ్లేటర్ను ఆన్ చేస్తే ఈ చాట్కు సంబంధించి నోటిఫికేషన్స్ వెలువడవు. తద్వారా మధ్యలో అంతరాయాలకు తెరదించవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. వెకేషన్ మోడ్పైనా ప్రస్తుతం వాట్సాప్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని సందర్భాలలో కాంటాక్టులను బ్లాక్ చేయడంతో సమస్యలకు చెక్ పెట్టలేము. ఇందుకుగాను రిపోర్ట్ టు వాట్సాప్ ఫీచర్ను రూపొందిస్తోంది. తద్వారా ఈ కాంటాక్టు నుంచి తదుపరి మెసేజీలకు బ్రేక్ పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 4 డివైస్లు ప్రస్తుతం వాట్సాప్ను మొబైల్లో వాట్సాప్తోపాటు.. వెబ్ యాప్ ద్వారా రెండు డివైస్లలో ఓకేసారి వినియోగించేందుకు వీలున్న విషయం విదితమే. అయితే వినియోగదారుడు ఒకే అకౌంట్ ద్వారా ఒకేసారి నాలుగు డివైస్లలో వాట్సాప్ను వినియోగించేందుకు వీలు కల్పించే సన్నాహాల్లో ఉన్నట్లు సంబంధివర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అడ్వాన్స్డ్ వాల్పేపర్ ఫీచర్ పేరుతో యూజర్లు ఒక్కో కాంటాక్టుకు ఒక్కోరకమైన వాల్పేపర్ను సెట్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. -
మరో అద్భుతమైన ఫీచర్తో స్నాప్చాట్!
స్నాప్చాట్లో ఇకపై సబ్స్రైబర్స్ సంఖ్య కనబడనుంది. క్రియేటర్లకు ఆ అవకాశాన్ని కల్పిస్తూ ప్రముఖ యాప్ అనుమతినిచ్చింది. ఇది స్నాప్చాట్ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు స్నాప్చాట్లో సబ్స్రైబర్స్ను చూసే అవకాశం లేదు. ప్రసుత్తం యాప్ను అప్డేట్ చేసి క్రియేటర్స్కు తమకు ఉన్న సబ్స్రైబర్స్ను బహిర్గతం చేసే అవకాశాన్ని కల్పించింది. ఎలాంటి సోషల్మీడియా నిషేధాలు లేకుండా సన్నిహితులు ఉపయోగించుకోవడానికి ఇది ఒక మంచి యాప్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం స్నాప్చాట్లో ఈ అప్డేట్ కనిపిస్తోంది. ఈ యాప్లో క్రియేటర్స్ను స్నాప్ స్టార్స్ అని కంపెనీ సంబోధిస్తుంది. క్రియేటర్స్ కంటెంట్ డిస్కవరీ అనే విభాగంలో కనిపిస్తోంది. అదేవిధంగా సెర్చ్ అప్షన్ ద్వారా కూడా మీరు కావలసిన క్రియేటర్స్ కోసం వెతకవచ్చు. సెర్చ్ బార్ దగ్గర స్నాప్చాట్ ప్రసిద్ధ స్నాప్స్టార్స్ను కూడా చూపెడుతోంది. ఇక క్రియేటర్కు ఎంత మంది సబ్స్రైబర్స్ ఉన్నారో తెలుసుకోవాలంటే వారి ప్రొఫైల్ మీద ప్రెస్ చేయాలి. చదవండి: క్షమాపణలు చెప్పిన స్నాప్చాట్, కారణం? స్నాప్చాట్లో కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ వలన వివిధ రకాల సోషల్మీడియా ఫ్లాట్ఫాంలలో ప్రముఖులకు ఉన్న ఫాలోవర్స్ను స్నాప్చాట్లో ఉన్న ఫాలోవర్స్తో పోల్చి చూసుకోవచ్చు. అయితే చాలా మంది క్రియేటర్స్ తమ ఫాలోవర్స్ సంఖ్యను తెలిపే అవకాశం ఇవ్వాలని కోరడంతో ఈ అప్డేట్ను తీసుకువచ్చినట్లు స్నాప్చాట్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం స్నాప్చాట్ వినియోగం పెరుగుతోంది. భారతదేశంలో దీని వినియోగం రెట్టింపు అయ్యింది. చదవండి: ‘మానసిక సమస్యలకు స్నాప్చాట్ ఫీచర్’ -
ఎల్జీ అద్భుత ఆవిష్కారం: త్వరలో
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ తన దూకుడును పెంచింది. విలక్షణమైన ఇంకా ఎవరూ కనిపెట్టని కొత్త వినియోగ అనుభవాలతో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నఎల్జీ తన ఎక్స్ప్లోరర్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి మోడల్ సెప్టెంబర్ 14న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీజర్ వీడియోను విడుదల చేసింది. ఎల్జీ తన గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసిన వీడియో ప్రకారం రొటేటింగ్, డ్యుయల్ స్క్రీన్ హ్యాండ్సెట్ను టీ షేప్ డిజైనుతో ఆవిష్కరించనుంది. ఎల్జి మొబైల్ గ్లోబల్ ఫేస్బుక్ , యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా సెప్టెంబర్ 14 న వర్చువల్ గా ఈ డివైస్ ను లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఎటువంటి నిర్దిష్ట వివరాలను కంపెనీ అందించలేదు. అయితే క్వాల్కమ్, రేవ్, ఫిక్టో, ట్యూబి, నావర్లతో సహా ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఎల్జీ వింగ్ గా భావిస్తున్న కొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లపై ఇలా ఉన్నాయి. ఎల్జీ వింగ్ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.8 అంగుళాల డిస్ ప్లే 1:1 యాస్పెక్ట్ రేషియోతో 4 అంగుళాల మరో స్క్రీన్ స్నాప్డ్రాగన్ 765 జి సాక్ 8జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరాలు ధర సుమారు రూ. 73,000 -
వాట్సాప్లో గ్రూప్ కాల్స్కో రింగ్టోన్
న్యూఢిల్లీ: అందరితో టచ్లో ఉండాలంటే సోషల్ మీడియాను ఫాలో అవాల్సిందే. అయితే మిగతావాటి పోటీని తట్టుకుని నిలబడేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గ్రూప్ కాల్స్కు కొత్త రింగ్టోన్, యానిమేషన్ స్టిక్కర్స్, కెమెరా ఐకాన్ను తిరిగి అందుబాటులోకి తేవడం వంటి సదుపాయాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది వీటన్నంటినీ ప్రస్తుతం కొత్తగా వస్తున్న ఆండ్రాయిడ్ బీటా వర్షన్లలో పరీక్షిస్తోంది. ఇందులో స్టిక్కర్స్తో భావాలు పలికించే వాళ్ల కోసం మరిన్ని యానిమేషన్ స్టిక్కర్స్ను తీసుకొచ్చింది. (ఫేస్బుక్, వాట్సాప్లకు ధీటుగా ‘బిగ్రాఫి’) వాయిస్ కాల్స్లో క్వాలిటీ పెంచే దిశగా కసరత్తులు చేస్తోంది. ఇందులో కాల్స్ చేసుకునేటప్పుడు బటన్లను కింద భాగంలో చూపించనుంది. అలాగే కెమెరా షార్ట్కట్ సదుపాయాన్ని తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్లో డాక్యుమెంట్లు, కెమెరా, ఫొటోలు, లొకేషన్, కాంటాక్ట్ షార్ట్కట్స్ను సులువుగా గుర్తించవచ్చు. అలాగే వాట్సాప్లోని ఫైళ్లను సులభంగా వెతికేందుకు వీలుగా అడ్వాన్స్డ్ సెర్చ్ ఫీచర్ను కూడా విడుదల చేసింది. అయితే ఇవన్నీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. (వాట్సాప్లో ఐదు కొత్త ఫీచర్స్) -
వాట్సాప్లో మరో అయిదు హాట్ ఫీచర్స్..
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా యూజర్లతో ప్రముఖ మెసేజింగ్ యాప్గా పేరొందిన వాట్సాప్ త్వరలో మరో ఐదు వినూత్న ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే డార్క్ మోడ్ ఫీచర్ను లాంఛ్ చేసిన వాట్సాప్ గ్రూప్ వాయిస్, వీడియో కాల్ పరిమితిని నలుగురి నుంచి ఎనిమిదికి పెంచి యూజర్లను ఆకట్టుకుంది. మల్టిపుల్ డివైజ్ సపోర్ట్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకే సమయంలో ఒక డివైజ్ కంటే పలు డివైజ్ల్లో తమ వాట్సాప్ ఖాతాలోకి యూజర్లు లాగిన్ అయ్యే వెసులుబాటు కలుగుతుంది. మరో నూతన ఫీచర్ క్యూఆర్ కోడ్పై వాట్పాప్ చురుకుగా పనిచేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ కేవలం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా నూతన కాంటాక్ట్స్ను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫాంలపై బీటా వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇక వాట్సాప్ స్టోరీలు, స్టేటస్లు 24 గంటల్లో ఆటోమేటిగ్గా అదృశ్యమవుతున్న తరహాలో నిర్ధిష్ట సమయం కనిపించేలా సెల్ప్ డిస్ర్టక్టింగ్ మెసేజెస్ ఫీచర్ను వాట్సాప్ త్వరలో లాంఛ్ చేయనుంది. డిలీట్ మెసేజెస్ ఆప్షన్తో త్వరలోనే ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఇన్-యాప్ బ్రౌజర్ ఫీచర్పై మెసేజింగ్ యాప్ కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు చాట్స్లో వచ్చిన లింక్స్ను వెబ్ బ్రౌజర్కు రీడైరెక్ట్ చేయకుండానే నేరుగా ఓపెన్ అయ్యేలా ఈ ఫీచర్ వెసులుబాటు కల్పిస్తుంది. ఇక ఎంపిక చేసిన ఫ్రెండ్స్కు లాస్ట్ సీన్ ఆప్షన్ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్ ప్రస్తుతం తమ లాస్ట్ సీన్ స్టేటస్ను కాంటాక్ట్స్లో ప్రతిఒక్కరికీ అనుమతించడం లేదా ఏ ఒక్కరికీ అనుమతించకపోవడం అమలు చేస్తోంది. తాజా ఫీచర్తో ఎంపిక చేసిన ఫ్రెండ్స్తోనే లాస్ట్ సీన్ స్టేటస్ను పంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది. చదవండి : గూగుల్ సెర్చ్లో వాట్సాప్ నెంబర్లు! -
లోన్లు ఇవ్వబోతున్న వాట్సాప్!
కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ద్వారా తమ వారికి దగ్గరవుతున్నారు. లాక్డౌన్ కాలంలో మాములు కాల్స్ కంటే వాట్సాప్ కాల్స్నే ఎక్కువ మంది వినియోగిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్తో రాబోతుంది. అదే వాట్సాప్ లోన్. ఇప్పుడు భారతీయులందరికి లోన్ ఇవ్వడానికి వాట్సాప్ రెడీ అయ్యింది. ఇప్పటికే పేమెంట్స్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్న వాట్సాప్ త్వరలో ఇండియాలో వాట్సాప్ వాడుతూ అర్హులైన వారందరికి అవసరాల కోసం డబ్బును అప్పుగా ఇవ్వడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. (వాట్సాప్ యూజర్లకు శుభవార్త) వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ తన ఫైనాన్షియల్ సర్వీసులను మరింత విస్తరించాలని భావిస్తుండటంతో క్రెడిట్ సర్వీస్ను భారత్లో ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ఫేస్బుక్ ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా పొందింది.ఈ ఫీచర్ మనకి పేమెంట్ల ఆప్షన్లో కూడా కనబడుతుంది. ప్రస్తుతం తొలిదశలోనే ఉన్న ఈ ఫీచర్ త్వరలో యూజర్స్కి అందుబాటులోకి రానుంది. (వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే) -
త్వరలో వాట్సాప్లో కొత్త ఫీచర్
శాన్ఫ్రాన్సిస్కో: ఇటీవల డార్క్ మోడ్ను ప్రవేశపెట్టిన వాట్సాప్ త్వరలో స్వీయ అంతర్ధాన సందేశ (సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజెస్) వెసులుబాటును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు తాము పంపే మెసేజ్లను ఆటోమేటిక్గా డిలీట్ చేసేలా సెట్టింగు పెట్టుకోవచ్చు. నిర్ణీత కాలం తర్వాత (గంట, రోజు, వారం, నెల, సంవత్సరం) ఆ మెసేజ్లు డిలీట్ అయిపోతాయి. ఈ ఫీచర్పై వాట్సాప్ డెవలపర్లు కసరత్తులు చేస్తున్నట్లు ఓ టెక్ వెబ్సైట్ తెలిపింది. మొదటగా ఈ ఫీచర్ను గ్రూపు చాట్లకు మాత్రమే పరిమితం చేసే యోచననలో ఉన్నారు. గ్రూపు సెట్టింగ్స్లో ఈ ఫీచర్కు సంబంధించిన మరిన్ని సెట్టింగులను ఉంచనున్నారు. ఇతర ఫీచర్లలాగే మొదట ఇది వాట్సాప్ బీటా యూజర్లకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి పరిశీలన అనంతరం అప్డేట్ ద్వారా యూజర్లందరికీ అందిస్తారు. -
గూగుల్ క్రోమ్ గురించి ఇవి తెలుసుకోండి..
మీరు గూగుల్ క్రోమ్ను వాడుతున్నారా .. అయితే కచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే. ప్రస్తుత నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు గూగుల్ క్రోమ్ను విరివిగా వాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. మరి అలాంటి గూగుల్ క్రోమ్లో ఇటివలే కొన్ని కొత్త ఫ్యూచర్స్ వచ్చి చేరాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ►గెస్ట్చర్ నావిగేషన్ : వినియోగదారులు క్రోమ్ను వాడే సమయంలో ఒక వెబ్ పేజీ నుంచి మరొక వెబ్పేజ్కు వెళ్లేందుకు క్రోమ్లో ఒక గెస్ట్చర్(నావిగేటర్)ను ప్రవేశపెట్టింది. దీనిని యాక్టివేట్ చేయాలంటే మీ యూఆర్ఎల్ బార్లో 'క్రోమ్ ://ఫ్లాగ్స్/# ఓవర్ స్క్రోల్-హిస్టరీ-నావిగేషన్'ను టైప్ చేయాలి. ►గూగుల్ ఓమ్నిబాక్స్ : ఈ ఆప్షన్ క్రోమ్లో ఉంటుందని సాధారణంగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ క్రోమ్లోని అడ్రస్ బార్లో సాధారణంగా యూఆర్ఎల్ ఉండేదానినే గూగుల్ ఓమ్నిబాక్స్ అంటారు. ఇది నేరుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్కు అనుసంధానమై ఉంటుంది. ఓమ్నిబాక్స్లో టైప్ చేసే విషయాలను గూగుల్ నేరుగా తీసుకుంటుందని వినియోగదారులు గమనించాలి. ►రికవరింగ్ లాస్ట్ టాబ్స్ : మీరు ఎప్పుడైనా పొరపాటుగా మీ ట్యాబ్లను క్లోజ్ చేస్తే పేజ్ రీలోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు.. అలా కుదరకపోతే మళ్లీ కొత్తగా పేజ్ ఓపెన్ చేయాల్సిందే. ఇక మీదట అలా చేయకుండా క్రోమ్ ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. మీరు చేయాల్సిందల్లా విండోస్లో 'కంట్రోల్ + షిఫ్ట్ + టి' నొక్కగానే మీరు ఇంతకు ముందు వాడిన పేజ్కు యాక్సెస్ అవుతుంది. ►డార్క్ మోడ్ : గూగుల్ క్రోమ్లో డార్క్ మోడ్ అనే ఆప్షన్ 2019 లోనే ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్ధేశం కళ్ళపై ఒత్తిడి ఏర్పడకుండా ఓఎల్ఈడీ రూపంలో ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేసుకోవాలంటే 'విండోస్>సెట్టింగ్స్> అప్పియరెన్స్'అనే ఆప్షన్కు వెళ్లి థీమ్ను 'మెటీరియల్ ఇగ్నిటో డార్క్' ఎంచుకోవాలి. అయితే ఈ డార్క్మోడ్ ఆప్షన్ అనేది మాక్ ఓఎస్ 10.14, విండోస్ 10 వర్షెన్లలో మాత్రమే పనిచేస్తుంది. ►మ్యూటింగ్ సైట్స్ : అప్పుడప్పుడు బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో పాపప్ యాడ్స వస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. అయితే పాపప్ను ఆపేందుకు కొత్తగా గూగుల్ క్రోమ్లో మ్యూట్ సైట్ అనే ఆప్షన్ వచ్చి చేరింది.ఆడియో ప్లే అవుతున్న సమయంలో టాబ్పై కుడివైపు క్లిక్ చేసి మ్యూట్ సైట్ క్లిక్ చేస్తే పాప్అప్ యాడ్స్ ఇక కనిపించవు. -
ఏడు కోట్ల ఫాల్కన్!
అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్. సినిమాల్లో లుక్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్ని విషయాల్లో స్టైలిష్గా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇప్పుడు కేరవాన్ని కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేయించుకున్నారు. షూటింగ్ చేస్తూ బ్రేక్ సమయాల్లో స్టార్స్ తమకోసం ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో విశ్రాంతి తీసుకుంటారు. అదే ‘కేరవాన్’. మామూలుగా నిర్మాతలే వాహనం సమకూరుస్తుంటారు. కొందరు స్టార్స్ సొంత కేరవాన్ ఏర్పాటు చేసుకుంటారు. అల్లు అర్జున్ తన కేరవాన్ను సరికొత్త ఫీచర్స్తో డిజైన్ చేయించారని తెలిసింది. ‘‘360 డిగ్రీలు తిరిగే కుర్చీ, మూడ్ లైటింగ్, సన్ రూఫ్, గేమింగ్ జోన్, ఎల్ఈడీ లైటింగ్తో మేకప్ మిర్రర్’ ఈ కేరవాన్ స్పెషాలిటీ. వీటికి తోడు మల్టీ పర్పస్ లాంజ్, బాత్రూమ్ దేనికదే సపరేట్గా ఉండేలా డిజైన్ చేశారు. మల్టీపర్పస్ లాంజ్ను సరికొత్త లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. కొత్త కేరవాన్ గురించి అల్లు అర్జున్ తన ట్వీటర్లో ‘‘జీవితంలో నేనేదైనా ఖరీదైన వస్తువుని కొనుగోలు చేసిన ప్రతిసారీ నా మనసులో ఒకటే ఆలోచన మెదులుతుంది. ప్రజలు నా మీద ఎంతో ప్రేమ చూపించారు. అంత ప్రేమను చూపించబట్టే ఇలాంటివి కొనగలుగుతున్నాను. అందరికీ థ్యాంక్స్. కృతజ్ఞుడ్ని. దీని (కేరవాన్) పేరు ఫాల్కన్’’ అన్నారు. ఇంతకీ ఈ లగ్జరీ కేరవాన్ ఖరీదు ఎంతో తెలుసా? దాదాపు 7 కోట్లు అని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. -
టాక్సీ దారి తప్పితే అలర్ట్
శాన్ఫ్రాన్సిస్కో: టాక్సీ డ్రైవర్లు 500 మీటర్లు దాటి రాంగ్రూట్లో వెళ్తుంటే అలర్ట్ చేసేలా గూగుల్ మ్యాప్స్ నూతన ఫీచర్ను సిద్ధం చేస్తోంది. ‘ఆఫ్ రూట్’గా వ్యవహరిస్తున్న ఈ ఫీచర్ను ప్రత్యేకంగా భారత్లోనే అందించనున్నారు. చేరాల్సిన గమ్యాన్ని మ్యాప్లో నిర్ధారించుకున్న తర్వాత మెనూలోని స్టే సేఫర్ అనే ఆప్షన్లో ఆఫ్ రూట్ అలర్ట్ అనే ఈ ఫీచర్ ఉంటుందని సోమవారం ఎక్స్డీఏ డెవలపర్లు తెలిపారు. టాక్సీ ఎంచుకున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో 500 మీటర్లు దాటిన ప్రతిసారి ఈ ఫీచర్ ద్వారా వినియోగదారునికి అలర్ట్ వస్తుందని తెలిపారు. అయితే మార్గం తప్పిన టాక్సీకి అక్కడి నుంచి తిరిగి గమ్యానికి కలిపే దారిని మాత్రం ఈ ఫీచర్ చూపించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగుల్ ఇంకా ప్రకటించలేదు. బ్రెయిన్ లైవ్ స్టేటస్, బస్ ప్రయాణ సమయం, మిక్స్డ్ మోడ్లో ఆటోరిక్షా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి నూతన ఫీచర్లను గూగుల్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. -
గోప్యత డొల్లేనా!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ ఇటీవల ‘పోర్టల్’గాడ్జెట్ ప్రవేశపెట్టింది.. వీడియో కాలింగ్ కోసం వినియోగిస్తారు దీన్ని.. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.. ఎన్నో ప్రత్యేకతలు.. ఎన్నో వివాదాలు కూడా.. ఇంతకీ ఈ పోర్టల్ ఏమిటి? దాని వెనుక ఉన్న వివాదం ఏంటి..? మీరెప్పుడైనా వీడియో కాల్ చేశారా? చేసే ఉంటారులెండి. దీంతో చిక్కేమిటంటే.. వీడియో కెమెరా స్థిరంగా ఉంటుంది. పక్కన ఉన్నవాళ్ల మాట వినిపిస్తుందేమో గానీ.. ముఖం మాత్రం కనపడదు. ఇంకా బోలెడన్ని సమస్యలున్నాయి. వీటన్నింటికీ తాము ‘పోర్టల్’తో చెక్ పెట్టామని ఫేస్బుక్ వారం రోజుల కింద ప్రకటించింది. ఓ ట్యాబ్లెట్, ల్యాప్టాప్, 360 డిగ్రీ కెమెరా.. అలెక్సా లాంటి పర్సనల్ అసిస్టెంట్లతో తయారైన ఈ సూపర్ గాడ్జెట్లో ప్రత్యేకతలు ఎన్ని ఉన్నా.. వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందన్న ఒకే కారణంతో వివాదం మొదలైంది. ఎన్నో ప్రత్యేకతలు.. వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా ఓ గాడ్జెట్ తయారు కావడం పోర్టల్ మొదటి ప్రత్యేకత అని చెప్పాలి. ఇంట్లో ఓ మూలన ఇది ఉందనుకోండి. ఇంటర్నెట్ ఆధారంగా ఎవరికైనా వీడియోకాల్ చేయొచ్చు. కృత్రిమ మేధతో పనిచేసే వీడియో కెమెరా ఉండటం వల్ల కాల్ నాణ్యత బాగా ఉండటంతో పాటు జూమ్ ఇన్.. జూమ్ అవుట్లు కూడా వాటంతట అవే జరిగిపోతాయి. ఎవరు మాట్లాడుతున్నారో గుర్తించి కెమెరాను వారి వైపు ఫోకస్ చేయడం.. వ్యక్తులు కదిలితే అందుకు తగ్గట్టు కెమెరా యాంగిల్ మార్చడం వంటివన్నీ పోర్టల్ ప్రత్యేకతల్లో కొన్ని. ఇది రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటేమో 15 అంగుళాల స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్తో కూడుకున్నదైతే.. రెండోది 10 అంగుళాల స్క్రీన్ సైజు ఉండేది. రెండింటిలోనూ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ ఉంటుంది. చిన్నదాని ఖరీదు 200 డాలర్లు కాగా.. కొన్ని అదనపు ఫీచర్లున్న పెద్దసైజు పోర్టల్ రెట్టింపు ధర పలుకుతోంది. ఇదీ వివాదం.. ఫేస్బుక్ ద్వారా వినియోగదారుల సమాచారం సేకరించడం.. దాన్ని మార్కెటింగ్ సంస్థలకు అమ్ముకోవడం ఫేస్బుక్ చాలాకాలంగా చేస్తున్న పనే. ఈ కారణంగానే మనం ఏదైనా ఒక పోస్ట్ లేదా ప్రకటనపై క్లిక్ చేస్తే చాలు.. కొంత సమయం వరకూ ఆ ప్రకటన, పోస్టులోని అంశాల ప్రకటనలే కనిపిస్తుంటాయి. వ్యక్తిగత అభిరుచులను గుర్తించి వాటికి అనుగుణమైన ప్రకటనలు గుప్పించడమూ ఫేస్బుక్ చాలాకాలంగా చేస్తోంది. ఇలా వినియోగదారుల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇతర దేశాల ప్రభావం పడిందన్న ఆరోపణలు రావడం.. ఫేస్బుక్ సీఈవో జుకర్బర్గ్ అమెరికా ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ఒప్పుకోవడం ఇటీవలి పరిణామాలే. అయితే ఆ తర్వాత అయినా ఫేస్బుక్ తన పద్ధతులు మార్చుకుంటుందని ఆశించారు. పోర్టల్ ద్వారా తాము సమాచారం సేకరించబోమని ఆ సంస్థ కూడా నమ్మబలికింది. అయితే వారం రోజులు గడిచాయో లేదో.. అసలు విషయం బయటకు వచ్చేసింది. కొన్ని వెబ్సైట్లు పంపిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పోర్టల్ ద్వారా కూడా సమాచార సేకరణ సాధ్యమేనని పరోక్షంగానైనా అంగీకరించింది. వీడియో కాల్ ఎంత సేపు నడిచింది.. ఎవరికి ఎవరు ఎన్నిసార్లు వీడియో కాల్ చేశారు.. అలెక్సా సాయంతో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు? ఉపయోగించిన యాప్లు ఎలాంటివి.. వంటి వివరాలను సేకరించే సామర్థ్యం పోర్టల్కు ఉందని ఫేస్బుక్ అంగీకరించింది. ప్రస్తుతానికి తాము ఈ అంశాన్ని ప్రకటనల కోసం వాడట్లేదని తెలిపింది. వాట్సాప్కు పోటీగా ఫేస్బుక్ సిద్ధం చేసిన చాటింగ్ అప్లికేషన్ ‘మెసెంజర్’ప్లాట్ఫారంపైనే పోర్టల్ కూడా పనిచేస్తుందని వివరించింది. -
ఆండ్రాయిడ్ వాట్సాప్లో ‘పిక్చర్ టు పిక్చర్’
వాషింగ్టన్: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ మరో ఫీచర్ను తీసుకురానుంది. ‘పిక్చర్ టు పిక్చర్’ మోడ్ను అండ్రాయిడ్ ఫోన్లకూ అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సాయంతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తూనే వీడియో కాల్ మాట్లాడొచ్చు. వీడియో కాల్ మాట్లాడుతూనే సందేశాలు పంపవచ్చు. వీడియోలు చూసేటప్పుడు, మెసేజ్లు పంపేటప్పుడు వీడియో కాల్ స్క్రీన్ చిన్నదిగా మారి ఫోన్లో కుడివైపుకొస్తుంది. వీడియో కాల్ మాట్లాడుతూ యాప్లను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్కు ప్రస్తుతం తుది పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, త్వరలో మార్కెట్లోకి తెస్తామని వాట్సాప్ తెలిపింది. -
భారత్ ‘గూగుల్ మ్యాప్స్’లో సరికొత్త ఫీచర్లు!
చండీగఢ్: భారత్లో గూగుల్ మ్యాప్స్లో త్వరలో సరికొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తెలిపింది. భారత్లో రోడ్డు మార్గాలు, ప్రజారవాణా వ్యవస్థలను కచ్చితత్వంతో అందుబాటులోకి తెస్తామని గూగుల్ మ్యాప్స్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ అనల్ ఘోష్ చెప్పారు.‘ టూవీలర్స్ మాత్రమే వెళ్లగలిగే రోడ్లను, షార్ట్కట్లను గూగుల్ మ్యాప్స్లో చేరుస్తాం. దేశంలోని 12,000 రైళ్ల ప్రయాణ వివరాలు చూపేలా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సాయంతో పబ్లిక్ టాయిలెట్లను గూగుల్ మ్యాప్స్లో చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతోపాటు కోల్కతా, సూరత్ నగరాల్లో బస్సుల రాకపోకలపై రియల్ టైమ్ సమాచారాన్ని అందజేస్తున్నాం’ అని తెలిపారు. ఈ రియల్ టైమ్ సౌకర్యాన్ని మిగతా పట్టణాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు ఘోష్ వెల్లడించారు. -
వాట్సాప్ ఆ ఫీచర్లు ఇక అందరికీ..
వాట్సాప్ గత కొన్ని రోజుల కింద లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చిన గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను, ప్రస్తుతం యూజర్లందరికీ అందించడం ప్రారంభించింది. పెద్ద మొత్తంలో తన యూజర్లకు ఈ ఫీచర్లను ఆవిష్కరిస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. గత నెలలో ఎఫ్8 కాన్ఫరెన్స్లో ఈ ఫీచర్లను ఫేస్బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక నుంచి యూజర్లందరూ ఈ లేటెస్ట్ ఫీచర్లతో ఎంజాయ్ చేయవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్లను యూజర్లు పొందాలంటే, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ను అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. కుడివైపు పైన ఒక కొత్త సభ్యుడిని చేర్చుకునే సింబల్ కనిపిస్తే, ఈ ఫీచర్లు మీకు లైవ్లో అందుబాటులోకి వచ్చినట్టే. ఈ ఫీచర్ ద్వారా ఒకే సమయంలో నలుగురు యూజర్లు మాట్లాడుకునే అవకాశముంటుంది. అంటే మీతో కలిపి మరో ముగ్గురితో మాత్రమే ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్లలో మాట్లాడే అవకాశముంటుంది. ఈ ఫీచర్ను చాలా సులభతరంగా, తేలికగా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ కాల్ చేయాలంటే, తొలుత ఒక యూజర్తో వీడియో కాల్ ప్రారంభించాలి. ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న యాడ్ పార్టిసిపెంట్ బటన్ను ట్యాప్ చేయాలి. ఇతర యూజర్లను కూడా గ్రూప్ వీడియో/వాయిస్ కాల్కి ఆహ్వానించవచ్చు. -
వాట్సాప్ నుంచి మరో రెండు అద్భుత ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్ల ద్వారా వచ్చే ఇమేజస్ అన్నీ ఇన్నీ కావు. అవన్నీ ఫోన్లోని గ్యాలరీకే వెళ్లిపోతాయి. కొంతమంది ఆ ఇమేజస్ను ప్రైవసీ దృష్టిలో పెట్టుకుని ఫోన్ గ్యాలరీలో కనిపించకూడదని అనుకుంటారు. వాటిని వెంటనే డిలీట్ చేయడం చేస్తుంటారు. కానీ కొందరికి డిలీట్ చేసే తీరిక ఉండదు. ఈ అవసరాన్ని గుర్తించి, వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. అదే మీడియా విజిబిలిటీ. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ మీడియా కంటెంట్ గ్యాలరీలో కనిపించాలో, హైడ్ చేసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. దీని కోసం వాట్సాప్లోని సెట్టింగ్స్కు వెళ్లి, డేటా, స్టోరేజ్ యూసేజ్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ షో మీడియా ఇన్ గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది డిఫాల్ట్గా టిక్ చేసి ఉంటుంది. ఒకవేళ వాట్సాప్ ఇమేజస్ గ్యాలరీలో కనిపించకూడదంటే, దాన్ని అన్టిక్ చేసుకోవాలి. దాంతో గ్యాలరీలో వాట్సాప్ ఇమేజస్ కనిపించవు. అయితే ఆ ఇమేజస్ను ఫైల్ మేనేజర్కు వెళ్లి అక్కడ చూసుకోవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్లోని కొత్త బీటా వెర్షన్(2.18.159) యూజర్లకు ఈ మీడియా విజిబిలిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్ను ఇన్స్టాగ్రామ్ లాంటి పలు మెసేజింగ్ యాప్స్ అందిస్తున్నాయి. దీంతో పాటు మరో ఫీచర్ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. అది న్యూ కాంటాక్ట్ షార్ట్కట్. ఈ ఫీచర్ కూడా కొత్త బీటా వెర్షన్ వాళ్లకు అందుబాటులో ఉంది. చాట్ స్క్రీన్లో కింద కుడివైపున న్యూ మెసేజ్ బటన్ను ప్రెస్ చేస్తే, న్యూ కాంటాక్ట్ షార్ట్కట్ ఫీచర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కాంటాక్ట్లను జత చేర్చుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్లను పొందడానికి వాట్సాప్ బీటా వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. -
వాట్సాప్లో ఫీచర్లు.. కథా కమామిషు
నిత్యం ఉపయోగించే సామాజిక మాద్యమాలలో వాట్సాప్ది ప్రత్యేక స్థానం. వాట్సాప్ను ప్రతి నెల 1.4 బిలియన్ల మంది వాడుతుంటే ఒకరోజులో వాట్సాప్ ద్వారా పంపించే మెసెజ్ల సంఖ్య అక్షరాల 60 బిలియన్లు. ప్రతి రోజు వాట్సాప్ తెరవకుండా ఉండలేని వారు కోట్లలోనే ఉన్నారంటే అందులో ఆశ్ఛర్యమేమి లేదు. అంతే కాదు మనలో చాలా మందికి తెలియని ఫీచర్లు ఎన్నో వాట్సాప్లో ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం... 1) వాట్సాప్లో యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు మన మిత్రులు పంపిన యూట్యూబ్ వీడియో లింక్ను అక్కడే ఓపెన్ చేసి చూడొచ్చు. ఏవైనా వీడియో సైట్ల నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ను వాట్సాప్లో మనం చూసే అవకాశం ఉంటుంది. ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే వీడియో ఆన్లో ఉండగానే మనం చాట్ చేయోచ్చు అంతేకాదు వీడియోను క్లోజ్ చేయకుండానే వేరు వేరు వ్యక్తులతో చాట్ చేసే సౌలభ్యం కూడా ఉంది. 2) ఫోటోలకు స్టిక్కర్లు అంటించవచ్చు ఫోటోలు, వీడియోలపై స్టిక్కర్లు అంటించడానికి ఉపయోగపడే టూల్ ఇందులో ఉంది. ఫోటోలపై వీడియోలపై లొకేషన్, టైం స్టిక్కర్లను అంటించి మనం ఎవరికైనా పంపే అవకాశం ఉంది. ఇందుకోసం వాట్సాప్లో ఉన్న + సింబల్ను నొక్కి మనకు అవసరమైన ఫోటోలపై వీడియోలపై స్టిక్కరింగ్ చేసుకోవాలి. 3) మనీ ట్రాన్స్ఫర్ సౌలభ్యం వాట్సాప్లో మనీ ట్రాన్ఫర్స్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఎవరికైనా డబ్బు పంపాలన్నా, మనం డబ్బు పొందాలన్నా వాట్సాప్లో చాట్ విండో క్లోజ్ చేయకుండానే చేసుకోవచ్చు. 4) వ్యక్తిగత గోప్యత మీరు ఎప్పుడు చివరగా వాట్సాప్ ఓపెన్ చేశారు, ఎన్ని గంటలు చాట్ చేశారు అన్న విషయాలు మీ స్నేహితులకు, ఇతరులకు తెలియకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్లోని అకౌంట్లోకి వెళ్లి ప్రైవసీలోని లాస్ట్ సీన్ ఆప్షన్లో నోబడిని క్లిక్ చేస్తే సరిపోతుంది. 5) డిలీట్ మెసెజ్ ఈ ఆప్షన్ ద్వారా మనం పోస్టు చేసిన మెసెజ్లను డిలీట్ చేయొచ్చు. మొదట మెసెజ్లు డిలీట్ చేయడానికి 7 నిమిషాల సమయం మాత్రమే ఉండేది కాని దానిని ప్రస్తుతం 68 గంటలకు పొడిగించారు. -
శాంసంగ్ నుంచి సరికొత్త టీవీ
సాక్షి : కళ్లకు కట్టినట్టు కనిపించే దృశ్యాలను చూస్తూ ఉండాలని ఎవరికి మాత్రం అనిపించదు. అలాంటి అనుభూతిని కలిగించేందుకు శాంసంగ్ సరికొత్త టీవీలను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. బ్రిక్స్బీ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లు, ఎత్తుగడతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నోటి మాట ద్వారా మనకు నచ్చిన సినిమాలను, పాటలను (టీవీలో అంతర్గతంగా ఉండే బ్రిక్స్బీ పరికరం సహాయంతో) ప్లే చేయించవచ్చు. ఈ అధునాతన టీవీలు త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. శాంసంగ్ స్మార్ట్ వ్యూ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్లోని కంటెంట్ను టీవీలో వీక్షించవచ్చు. అదనంగా సరికొత్త ఫీచర్తో క్యూఎల్ఈడీ టీవీలు మే నెల చివరికల్లా భారతీయ వినియోగదారులను పలకరించబోతున్నాయి. త్వరలోనే వీటి ధరలను ప్రకటించనున్నట్లు సామ్సాంగ్ అధికారులు తెలిపారు. 4కె రిజల్యూషన్తో క్యూఎల్ఈడీ టీవీలను ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లోకి లాంచ్ చేయనున్నామన్నారు. 85 ఇంచుల తెర, 8కె కృత్రిమ మేధస్సులాంటి ఫీచర్స్తో రాబోతున్నట్లు ప్రకటించారు. కాగా 2017లో శాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీలు ఇండియాలో లాంచ్ చేసింది. ఒక్క నెలలోనే విశేషమైన స్పందన వచ్చింది. డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు తాజాగా మరింత వేగంగా దూసుకొస్తోంది. -
వేధింపులను అరికట్టే ఫేస్బుక్ టూల్స్
హూస్టన్: మహిళలపై ఆన్లైన్ వేధింపులను అరికట్టడంలో భాగంగా సామాజిక మాధ్యమం ఫేస్బుక్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆకతాయిల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు, మెసేజ్లు రాకుండా ఈ కొత్త ఫీచర్లు అడ్డుకుంటాయి. ఢిల్లీకి చెందిన, మహిళా సాధికారత కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్’తో కలసి ఫేస్బుక్ ఈ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఐపీ అడ్రస్లు ఇతర సంకేతాలను ఉపయోగించడం ద్వారా నకిలీ ఖాతాలను గుర్తించి ఫేస్బుక్ వాటిని డీయాక్టివేట్ చేస్తుంది. అలాగే ఎవరైనా సందేశాలు పంపి విసిగిస్తున్నప్పుడు దానిని అనవసర సందేశం (అన్వాంటెడ్ మెసేజ్) అని మార్క్ చేస్తే ఇకపై ఆ మెసేజ్లకు సంబంధించిన నోటిఫికేషన్లు రావు. అవన్నీ ఒక ప్రత్యేక ఫోల్డర్లో సేవ్ అయ్యుంటాయి. ఆ తర్వాత ఎప్పుడైనా వినియోగదారులు వాటిని చదివినా అవతలి వ్యక్తికి ఆ విషయం తెలియదు. -
వాట్సాప్ నుంచి గ్రేట్ ఫీచర్స్
మెసేజింగ్ సర్వీసుల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వాట్సాప్, కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఐఫోన్లపై రెండు సరికొత్త ఫీచర్లను వాట్సాప్ ఆవిష్కరించింది. దానిలో ఒకటి యూట్యూబ్ వీడియోలను సంభాషణ మధ్యలో ఉండగానే ప్రత్యక్షంగా చూసేలా, రెండోది లాక్ రికార్డింగ్. దీని ద్వారా కింద ఉన్న బటన్ను అలానే పట్టుకుని ఉండకుండానే యూజర్లు వాయిస్ మెసేజ్ను రికార్డు చేయవచ్చు. యూట్యూబ్ ఫీచర్ను పిక్చర్ ఇన్ పిక్చర్(పీఐపీ) మోడ్లో యూజర్లకు అందిస్తోంది. ఈ ఫీచర్లను సద్వినియోగం చేసుకునేందుకు ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి కొత్త వాట్సాప్ వీ2.17.81 యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. '' యూట్యూబ్ వీడియో తిలకించేందుకు యూజర్లు ఓ లింక్ను పొందితే, దాన్ని ప్రస్తుతం వాట్సాప్లోనే ప్లే చేసుకోవచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్తో మరో చాట్ను నావిగేట్ చేస్తూనే వీడియోను తిలకించవచ్చు'' అని యాప్ స్టోర్ పేర్కొంది. ఇంతకముందు వరకు యూజర్లు వారు పొందిన లింక్ను క్లిక్ చేస్తే, స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ అయిన యూట్యూబ్ యాప్లో ఆ వీడియో ఓపెన్ అయ్యేది. తాజా అప్డేట్ ద్వారా లాంగ్ మెసేజ్లను కూడా తేలికగా రికార్డు చేసుకోవచ్చు. లాంగ్ వాయిస్ మెసేజస్ను తేలికగా రికార్డు చేసుకోవాలనుకుంటే, లాక్ రికార్డింగ్ను స్వైప్ చేసి, వాయిస్ రికార్డింగ్ను చేపట్టవచ్చు. అదేవిధంగా మరో ఫీచర్ను కూడా లాంచ్ చేసేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. వాయిస్ నుంచి వీడియో కాల్కు, వీడియో నుంచి వాయిస్ కాల్కు కాల్ మధ్యలో ఉండగానే మారేలా వాట్సాప్ పనిచేస్తుందని తెలుస్తోంది. దీని కోసం ఓ కొత్త బటన్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. -
వాట్సాప్లో మరో రెండు కొత్త ఫీచర్లు..
మెసేజింగ్ యాప్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచర్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆ రెండు కొత్త ఫీచర్లపై పనిచేస్తుందని వాట్సాప్ బీటా వాచర్ డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. దీనిలో ఒకటి వాట్సాప్ కాల్ మధ్యలో ఉండగానే అటు వీడియో కాల్కు కానీ, ఇటు వాయస్ కాల్కు కానీ స్విచ్ అవొచ్చు. రెండోది మరింత తేలికగా వాయిస్ మెసేజ్ను రికార్డు చేయడం. ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటాల్లో స్పాట్ అయి ఉన్నాయని తెలిసింది. వీడియో-వాయిస్ కాల్ యాప్ స్విచ్, తొలుత జూలైలోనే టెస్టింగ్కు వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మాట్లాడుతున్న కాల్ను కట్ చేయకుండానే వీడియో కాల్ నుంచి వాయిస్ కాల్లోకి మారడం, వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్లోకి మారడం చేసుకోవచ్చు. ఈ ఫీచర్ను అంతర్గతంగా మాత్రమే టెస్ట్ చేయడం ప్రారంభించారని డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. అదేవిధంగా వాయిస్ మెసేజ్ బటన్ కోసం కూడా కొత్త కార్యాచరణను ప్రారంభించింది. యూజర్లు వాయిస్ మెసేజ్ను రికార్డు చేయడం ప్రారంభించిన అనంతరం ఓ టోగుల్ కనిపిస్తుంది. ఈ టోగుల్ ద్వారా వాయిస్ మెసేజ్ రికార్డింగ్ను లాక్చేయొచ్చు. దీంతో మెసేజ్ రికార్డు చేసేటప్పుడు యూజర్ తమ హ్యాండ్ను ఫ్రీగా ఉంచుకోవచ్చు. -
ఇక ఫేస్బుక్లో ప్రైవేట్ ప్రొఫైల్స్
సాక్షి,న్యూఢిల్లీః సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్లను ఆకట్టుకునేందుకు మరో ఫీచర్ను ఇంట్రడ్యూస్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రైవేట్ ప్రొఫైల్గా పిలిచే కొత్త తరం ప్రొఫైల్పై ఫేస్బుక్ ప్రస్తుతం దృష్టిసారించినట్టు నెక్ట్స్ వెబ్ అనే టెక్నాలజీ సంస్థ నివేదిక వెల్లడించింది. ఈ ప్రొపైల్ యూజర్ ఫ్రైండ్ లిస్ట్లో ఉన్న వారందరికీ కాకుండా కేవలం సన్నిహిత మిత్రుల గ్రూపుకే పరిమితంగా అందుబాటులో ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఎఫ్బీ మొబైల్ యాప్లో ఈ కొత్త ఫీచర్ బీటా వెర్షన్ అందుబాటులో ఉంది. క్రియేట్ ఏ ప్రైవేట్ ప్రొఫైల్ అని యూజర్ను కోరుతూ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే పొందుపరిచారు. దీంతో పాటు ఇన్స్టంట్ వీడియో ఫీచర్ను కూడా ఎఫ్బీ ప్రవేశపెట్టనుంది. యూజర్లు వీడియోను డౌన్లోడ్ చేసుకోకుండానే నేరుగా దాన్ని వీక్షించే వెసులుబాటు ఈ ఫీచర్లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ఫేస్బుక్ తన యాప్లో కూడా పలు మార్పులు చేపడుతోంది. -
ఫేస్బుక్లో కొత్త ఆప్షన్లు....
ముంబై: ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్లలను అందించే సోషల్ మీడియా దిగ్గజం మరో కొత్త సదుపాయాన్ని తెచ్చింది. మీ కంప్యూటర్లో ఎడమ పక్క ఓ డౌన్ ఏరో బటన్ ఉంటుంది కదా.. అక్కడ కొత్త ఆప్షన్లలను పొందుపరచింది. డౌన్ ఏరో బటన్ను క్లిక్ చేసినప్పుడు చివర్లో స్విచ్ అకౌంట్స్, క్రియేట్ న్యూ ఫేస్బుక్ అకౌంట్ అనే రెండు కొత్త ఆప్షన్లను చేర్చింది. సాధారణంగా ఒకే కంప్యూటర్లను చాలా మంది స్నేహితులు, బంధువులు ఉపయోగిస్తూ ఉంటారు. స్విచ్ అకౌంట్ను ఉపయోగించడం వల్ల ఇంకో ఫేస్బుక్ అకౌంట్లలోకి సులభంగా మారిపోవచ్చు. అయితే మొదట లాగిన్ అయిన అకౌంట్ లాగౌట్ అవుతుంది. అలాగే మన అకౌంట్స్ నుంచి క్రియేట్ న్యూ అకౌంట్ ఆప్షన్ ద్వారా ఇతరలకు మరో అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. -
వాట్సాప్ బీటాలో రెండు కొత్త ఫీచర్లు
వాషింగ్టన్ : వాట్సాప్ బీటా (ప్రయోగాత్మక సేవలు)లోని కొన్ని వెర్షన్లలో మరో రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రూప్ చాట్లలో లైవ్ లొకేషన్ ఫీచర్ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీంతో గ్రూప్ సభ్యుల్లో ఎవరు ఎక్కుడున్నారో మిగిలిన వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. సభ్యులంతా ఒకచోట కలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరెంత దూరంలో ఉన్నారో తెలుసుకోడానికి ఇది బాగా ఉపయోగపడనుంది. ఇందుకోసం వినియోగదారులు గ్రూప్లోకి వెళ్లి ‘షో మై ఫ్రెండ్స్’అనే ఆప్షన్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో ఫీచర్ విషయానికి వస్తే వినియోగదారులు ఒకసారి పంపిన సందేశాలను కూడా మళ్లీ వెనక్కు తీసుకుని మార్పులు చేసి పంపొచ్చు. అయితే సందేశాన్ని పొందిన వ్యక్తి అప్పటికి దానిని చదివి ఉండక పోతేనే ఇది సాధ్యమవుతుంది. వాట్సాప్ ఫీచర్లను ఎప్పటికప్పుడు తెలియజేసే @WABetaInfo అనే సంస్థ ఈ వివరాలను అందించింది. -
వావ్.. వాట్సప్లో మరిన్ని ఫీచర్లు!
వాట్సప్లో ఒక మెసేజి పంపిన తర్వాత అందులో ఏమైనా పొరపాటు ఉంటే.. అరెరె అంటూ నాలుక కరుచుకుని మళ్లీ దాన్ని సవరిస్తూ కొత్త మెసేజి పంపాల్సిందే తప్ప పాత దాన్ని ఏమీ చేయలేం. కానీ అది గతమే. ఇందులో కొత్తగా ప్రవేశపెడుతున్న ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే. ఒకసారి పంపిన మెసేజిని 'అన్ సెండ్' చేయడం, లేదా దాన్ని ఎడిట్ చేయడం కూడా సాధ్యం అవుతుందట. ఇంతకుముందు మనం ఒక మెసేజి పొరపాటున పంపి, దాన్ని డిలీట్ చేసినా.. అది కేవలం మన ఫోన్లో మాత్రమే డిలీట్ అవుతుంది తప్ప అవతలి వాళ్ల ఫోన్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఇప్పుడు వాట్సప్ కొత్తగా తేబోతున్న ఫీచర్ పుణ్యమాని అవతలి వాళ్ల ఫోన్లోంచి కూడా అది పోతుందని చెబుతున్నారు. వాబీటాఇన్ఫో అనే సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. వాట్సప్ బీటా వెర్షన్లో కొత్తగా రివోక్ అనే బటన్ ఉంటుందని, దాన్ని ట్యాప్ చేస్తే పంపిన మెసేజ్ కూడా పోతుందని అంటున్నారు. కేవలం మెసేజ్లు మాత్రమే కాదు.. పొరపాటున పంపిన ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు.. ఇలా ఏవైనా కూడా అలాగే తీసేయొచ్చని వివరించారు. ప్రస్తుతానికి ఇది అందరికీ అందుబాటులో లేదు గానీ, త్వరలోనే వచ్చేస్తుందని హామీ ఇస్తున్నారు. ఇంతకుముందు గత సంవత్సరం నుంచి జీమెయిల్ కూడా ఇలాంటి ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. పొరపాటున ఒక మెయిల్ పంపినా, దాన్ని కావాలంటే అన్డూ చేయొచ్చు. అలా చేస్తే, అవతలివాళ్ల ఇన్బాక్స్ లోంచి కూడా అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు వాట్సప్లో ఇది వస్తే.. అందులో రెండో అతిపెద్ద అప్గ్రేడ్ అవుతుంది. ఇంతకుముందు ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు వెర్షన్ల కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని వాట్సప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది భారతదేశం సహా 180 దేశాల్లో వచ్చింది. ఆండ్రాయిడ్ పాతవెర్షన్లు సహా ఐఫోన్ పాత వెర్షన్లలోను, కొన్ని విండోస్ ఫోన్లలోను వాట్సప్ పనిచేయదంటూ ఒక బాంబు కూడా పేల్చిన సంగతి తెలిసిందే.