Nissan
-
హోండా, నిస్సాన్ పొత్తు లేనట్టే!
టోక్యో: వ్యాపార ఏకీకరణపై చర్చలను ముగించినట్లు వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థలు హోండా, నిస్సాన్, మిత్సుబిషి గురువారం తెలిపాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ వంటి స్మార్ట్ కార్ల అభివృద్ధిపై కలిసి పనిచేయడం కొనసాగిస్తామని ఈ మూడు సంస్థలు వెల్లడించాయి. ‘చర్చలు జాయింట్ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలన్న అంశంపై జరగాలి. కానీ హోండా అనుబంధ సంస్థగా నిస్సాన్ను మార్చాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రపంచ పోటీలో గెలవడానికి కంపెనీలను కలపాలి. కానీ నిస్సాన్ సామర్థ్యాన్ని గుర్తించడం లేదు. కాబట్టి నేను వారి ప్రతిపాదనను అంగీకరించలేను. హోండా లేకుండా నిస్సాన్ ఆర్థిక పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోబోతోంది’ అని నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మకొటొ ఉషీడా మీడియాకు వెల్లడించారు.నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేయడానికి హోండా స్టాక్ స్వాప్ను సూచించిందని హోండా చీఫ్ ఎగ్జిక్యూటివ్ తోషిహిరో మీబ్ అన్నారు. ‘నేను నిజంగా నిరాశ చెందాను. వ్యాపార అవకాశం గొప్పదని భావించాను. కానీ అది కార్యరూపం దాల్చాలంటే బాధ కలిగించే చర్యలు అవసరమని కూడా నాకు తెలుసు’ అని వివరించారు. నిస్సాన్లో ఫాక్స్కాన్కు వాటా?హోండా మోటార్ కంపెనీ, నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ సంయుక్త హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయడానికి చర్చలు జరపబోతున్నట్లు 2024 డిసెంబర్లో ప్రకటించాయి. ఆ గ్రూప్లో చేరడాన్ని పరిశీలిస్తున్నట్లు మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ వెల్లడించింది. 2025 జూన్ నాటికి ఒప్పందాన్ని ఖరారు చేసి.. ఆగస్టు కల్లా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు హోండా, నిస్సాన్ మొదట్లో తెలిపాయి. ఇదిలావుంటే హోండా, నిస్సాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయని జపాన్ మీడియా ఇటీవలి కాలంలో కథనాలు ప్రచురించింది. హోండాతో భాగస్వామ్యంలో ఒక చిన్న భాగస్వామిగా మారడానికి నిస్సాన్ నిరాకరించిందన్నది వార్తా కథనాల సారాంశం. నిస్సాన్లో వాటా తీసుకోవడాన్ని తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ పరిశీలిస్తోందన్న మీడియా ఊహాగానాల గురించి తనకు తెలియదని మీబ్ అన్నారు.ఇదీ చదవండి: స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ @ రూ. 49,500 కోట్లు ఆర్థికంగా మెరుగ్గా హోండా..హోండా ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉంది. అలాగే ఉమ్మడి కార్యనిర్వాహక బృందంలో ముందంజలో ఉంది. 2024 ఏప్రిల్–డిసెంబర్ లాభాలు 7 శాతం తగ్గి 5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు హోండా నివేదించింది. మరోవైపు వాహన అమ్మకాలు పడిపోవడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో నిస్సాన్ నష్టాలను ప్రకటించింది. దీని ఫలితంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఉషీడా తన వేతనంలో 50 శాతం కోత విధించుకున్నారు. -
ఆటో దిగ్గజాల జత.. సక్సెస్ మంత్ర..!
ఆటోరంగం ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ఒక కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వేగంగా దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ కార్లు ఒకవైపు, ఆర్టీఫిషియల్ టెక్నాలజీతో నడిచే డ్రైవర్ లెస్ కార్లు రోబో ట్యాక్సీలు మరోవైపు ఆటో కంపెనీ లకు ఆర్థిక భారాన్ని పెడుతున్నాయి.. అమెరికా కార్ల దిగ్గజం టెస్లా ఎలక్ట్రిక్ కార్లతో ఆధిపత్యం చెలాయిస్తుంటే, చైనా కంపెనీలు బీవైడీ, నియో, గ్రేట్వాల్ మోటార్స్ తక్కువ ధరకే ఈవీలను రోడ్లపైకి తెస్తూ చైనాకు చెక్ పెడుతున్నాయి. కొత్తగా ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి, అనేక దేశాల్లో ఆటో కంపెనీలు తమ పోటీ కంపెనీలతోనే పొత్తుకు దిగుతున్నాయి.ప్రత్యర్ధి కంపెనీలతోనే చేతులు కలుపుతున్నాయి. కార్ల తయారీ నుంచి మార్కెటింగ్ దాకా పలు విభాగాల్లో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా విలీనం బాట పట్టి ఇతర మార్కెట్లకు విస్తరిస్తుంటే మరికొన్ని టెక్నాలజీని షేర్ చేసుకుంటూ కొత్త మోడళ్ల అభివృద్ధి వ్యయాలు తగ్గించుకుంటున్నాయి. తాజాగా జపనీస్ కంపెనీలు నిస్సాన్, హోండా కూడా విలీనానికి చేతులు కలపడం ఆటో రంగంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నా విలీనాలు, భాగస్వామ్యాలతో ఏ కంపెనీ ఎక్కువ లాభపడినట్లు గణాంకాలు వెల్లడించడంలేదు. వివరాలు చూద్దాం. – సాక్షి, బిజినెస్ డెస్క్భాగస్వామ్యాల తీరిదీ.. ⇒ ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ సాంకేతికతల కోసం ఫోర్డ్ మోటార్, ఫోక్స్వేగన్ చేతులు కలిపాయి. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల బిజినెస్ను మూసివేయగా.. కొంతమేర లబ్ధి పొందాయి. ⇒ జనరల్ మోటార్స్తో హోండా జత కలిసింది. జీఎం తయారు చేసే 2 ఈవీ కార్లను హోండా విక్రయిస్తోంది. ఈ రెండింటికి మాత్రమే ఈ భాగస్వామ్యం పరిమితం. ⇒ ఫ్రాన్స్ ప్యూజో, ఫియట్ క్రిస్లర్ జట్టు కట్టడం ద్వారా 2021లో స్టెల్లాంటిస్కు ఊపిరిపోశాయి. అయితే ఫ్యాక్టరీలు మూసివేత బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ⇒ రేనాల్ట్తో నిస్సాన్ జత కలిసింది. దీంతో నిస్సాన్ నిలదొక్కుకుంది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే అంత విజయవంతంకాలేదు. ⇒ అందుబాటు ధరల కార్ల తయారీకి వీలుగా లగ్జరీ కార్ల కంపెనీ దైమ్లర్తో, క్రిస్లర్ విలీనమైనప్పటికీ 9 ఏళ్ల తదుపరి 2007లో విడిపోయాయి.దేశీయంగా.. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2016లోనే భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 2019 ఆగస్ట్లో దీర్ఘకాలిక సహకారంలో భాగంగా ఈవీ టెక్నాలజీ, అటానమస్ డ్రైవింగ్పై కన్నేశాయి. ఈ బాటలో దేశీయంగా మారుతీ సుజుకీ బ్రాండ్ ద్వారా కార్ల అమ్మకాలు పెంచుకునే ప్రణాళికలు వేశాయి. మరోపక్క మారుతీ సియాజ్, ఎర్టిగా ప్లాట్ఫామ్ ద్వారా అభివృద్ధి చేసిన వాహనాలను సరఫరా చేయనుంది. ఇదేవిధంగా సీవిభాగంలోని ఎంపీవీ, టయోటా కరోలా సెడాన్, విటారా బ్రెజ్జా తదితర ప్లాట్ఫామ్లను పరస్పరం అభివృద్ధి చేయనున్నాయి.టాటా చేతికి జేఎల్ఆర్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి జాగ్వార్– ల్యాండ్రోవర్(జేఎల్ఆర్), మజ్దా, వోల్వో విభాగాలను ఫోర్డ్ మోటార్ కంపెనీ విక్రయించింది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ భారీ నష్టాలలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల విభాగం జేఎల్ఆర్ను దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. తదుపరి కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా అధ్యక్షతన నష్టాలను వీడి లాభాల బాట పట్టిన సంగతి తెలిసిందే. హోండా – నిస్సాన్ విలీనం.. మూడో పెద్ద కంపెనీ జపనీస్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ తాజాగా విలీనానికి అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో అమ్మకాలరీత్యా ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీ ఆవిర్భావానికి తెరతీయనున్నాయి. మిత్సుబిషీ సైతం వీటితో కలవనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే విలీన కంపెనీ టయోటా, ఫోక్స్వ్యాగన్తో పోటీ పడనుంది. ఇప్పటికే నిస్సాన్, హోండా, మిత్సుబిషీ సంయుక్తంగా ఈవీల కోసం బ్యాటరీలు తదితర విడిభాగాల తయారీ టెక్నాలజీని పంచుకోనున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా అటానమస్ డ్రైవింగ్కు వీలుగా సాఫ్ట్ వేర్పై పరిశోధనలు సైతం చేపట్టనున్నట్లు తెలియజేశాయి.ఆర్ఐఎల్– టెస్లా టెస్లా దేశీయంగా రిలయన్స్తో భాగస్వామ్యానికి చర్చలు జరుపుతున్నట్లు సమా చారం. తద్వారా స్థానికంగా టెస్లా ఎల క్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికే వాణిజ్య వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్తో భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ దేశీయంగా తొలి హైడ్రోజన్ ఐసీఈ ఇంజిన్తో నడిచే హెవీడ్యూటీ ట్రక్ను 2023లో ఆవిష్కరించింది.జేఎస్డబ్ల్యూ– చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి జిందాల్ గ్రూప్ దిగ్గజం జేఎస్డబ్ల్యూ సైతం చైనీస్ దిగ్గజాలు బీవైడీ, జీలీ తదితరాలతో చర్చలు. జరుపుతోంది. లైసెన్సింగ్ ఒప్పందం, టెక్నాలజీ బదిలీ తదితరాలకు ఒప్పందాలు కుదుర్చుకునే సన్నాహాల్లో ఉంది. వోల్వో కార్ల కంపెనీగా జీలీ ఇప్పటికే పరోక్షంగా కార్యకలాపాలు కలిగి ఉంది. దేశీయంగా 2024 తొలి 11 నెలల్లో 18.7 లక్షల ఎలక్ట్రిక్ కార్లు విక్రయంకావడంతో పలు దిగ్గజాలు ఈవీ మార్కెట్పై ఆసక్తి చూపుతున్నాయి. -
హోండా, నిస్సాన్ విలీనం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఫ్రాన్స్కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్లో ఉంది. ఫోక్స్వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. ప్రయోజనాలేమిటంటే.. ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది. 2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితాటయోటా - 10.3 మిలియన్ వాహనాలువోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలుహ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలుస్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలుజనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలుఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలుహోండా - 4.2 మిలియన్ వాహనాలునిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలుమెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు -
హోండా, నిస్సాన్ విలీనం.. టయోటాకు గట్టిపోటీ తప్పదా?
ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్ని కూడా ఈ డీల్లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్వేర్పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. -
మాగ్నైట్కు ఎగుమతి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ నిస్సాన్ తన కాంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్కు ఎగుమతి కేంద్రంగా భారత్ను బలోపేతం చేయడానికి 100 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని పెట్టినట్లు శుక్రవారం తెలిపింది. కొత్త ఉత్పత్తి అభివృద్ధి, దేశంలో అదనపు అమ్మకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కంపెనీ ఇప్పటికే 600 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెట్టుబడి దీనికి అదనం.2026 నాటికి దేశీయంగా విక్రయాలను మూడింతలు చేయడం ద్వారా ఒక లక్ష యూనిట్లకు, అదే స్థాయిలో ఎగుమతులను చేయాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. భారత్ పట్ల సంస్థ నిబద్ధతకు అదనపు పెట్టుబడి నిదర్శనమని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. మాగ్నైట్ కొత్త వర్షన్ను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.మాగ్నైట్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ సైతం తయారీ చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 20 మార్కెట్లకు మాగ్నైట్ ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ తయారీతో 65 మార్కెట్లకు ఎగుమతి చేయడానికి వీలు కలుగుతోందని వివరించారు. నిస్సాన్కు ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్గా ఉందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని టోరెస్ తెలిపారు.మూడు మోడళ్ల విడుదల..వచ్చే 30 నెలల్లో కంపెనీ మరో మూడు మోడళ్లను విడుదల చేయాలని భావిస్తోంది. మాస్ మార్కెట్ సెగ్మెంట్లో రెండు మిడ్–సైజ్ ఎస్యూవీలను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఒకటి ఐదు సీట్లు, ఇంకొకటి ఏడు సీట్ల సామర్థ్యంతో రానుంది. అలాగే ఒక ఎలక్ట్రిక్ ఎస్యూవీని పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది.2026 చివరి నాటికి ఎలక్ట్రిక్ ఎస్యూవీని తీసుకురావాలన్నది ప్రణాళిక అని టోరెస్ వెల్లడించారు. ఆ సమయానికి ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. దేశీయ మార్కెట్ కోసం హైబ్రిడ్, సీఎన్జీతో సహా వివిధ పవర్ట్రెయిన్స్ను కంపెనీ అధ్యయనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో ఏటా 32,000 యూనిట్లను విక్రయిస్తున్నట్టు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. 30 నెలల్లో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం ఉన్న ఒక శాతం నుంచి మూడు శాతానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
నిస్సాన్ మాగ్నైట్ మళ్లీ వచ్చేసింది.. సరికొత్తగా..
సరికొత్త రూపం సంతరించుకున్న నిస్సాన్ మాగ్నైట్ ఎట్టకేలకు భారత్లో విడుదలైంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది విసియా, విసియా ప్లస్, ఏసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ అనే ఆరు వేరియంట్లలో, రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్ తొలిసారిగా 2020లో పరిచయమైంది. అప్పటి నుంచి కంపెనీలో ప్రధాన మోడల్ కారుగా ఉంటూ వచ్చింది. 2023 ఏప్రిల్లో ఈ మోడల్ను కంపెనీ నిలిపేసింది. ఎగుమతులతో కలుపుకొని మొత్తం 1.5 లక్షల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు కంపెనీ చెబుతోంది. ఆకర్షణీయమైన లుక్తో ఉండే ఈ కారును మరింత ఆకర్షణీయంగా ఫేస్లిఫ్ట్ చేసి 2024 మోడల్గా కంపెనీ విడుదల చేసింది.తాజా నిస్సాన్ మాగ్నైట్ పాత ఫీచర్లతోనే వచ్చినప్పటికీ డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ముందుభాగంలో సరికొత్త ఫ్రంట్ బంపర్తోపాటు ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. అలాగే ఆటోమెటిక్ ఎల్ఈడీ హెడ్లైట్లు బై ఫంక్షనల్ ప్రొజెక్టర్తో ఇచ్చారు. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్లో ఉన్నాయి. వెనకవైపు టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేకమైన డీటైలింగ్, స్మోక్డ్ ఎఫెక్ట్తో ఇచ్చారు. రియర్ బంపర్ డిజైన్ కూడా మార్చారు.ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ మొత్తానికి మార్చకుండా చిన్నపాటి మార్పులు చేశారు. లోపలవైపు లెదర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, వైర్లెస్ చార్జర్ సరికొత్త ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మరోవైపు సేఫ్టీ ఫీచర్లలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగులు, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
వరద బాధిత కస్టమర్లకు ఉచిత సేవలు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల వల్ల నష్టపోయిన వినియోగదారుల కోసం నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక సహాయక చర్యలు ప్రకటించింది. వరదలతో సతమవుతున్న కంపెనీ వినియోగదారులకు ఉచితంగా తమ వాహనాల కోసం రోడ్సైడ్ అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.వరద ప్రభావిత ప్రాంతాల్లోని కంపెనీ కస్టమర్లకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా నిస్సాన్ హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసింది. వరదల్లో చిక్కుకున్న వాహనాలను సమీపంలోని కంపెనీ సర్వీస్ వర్క్షాప్కు తీసుకెళ్లడానికి వీలుగా ఉచిత రోడ్సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) సేవలను ప్రారంభించింది. దాంతోపాటు బీమా వాహనాలకు క్లెయిమ్ ప్రాసెస్ ఫీజు రూ.1000 మినహాయించినట్లు పేర్కొంది. బీమా క్లెయిమ్ చేయాలనుకునే కస్టమర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కంపెనీ లక్ష్యమని తెలిపింది.ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో కంపెనీ కస్టమర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. వినియోగదారులకు సహాయం చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అందుకోసం ప్రత్యేకంగా హెల్ప్డెస్క్(1800 209 3456)ను ఏర్పాటు చేశాం. కస్టమర్లు సత్వర చర్యల కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: టోల్ ప్లాజాల ‘లైవ్ ట్రాక్’వరద బాధిత కస్టమర్లకు నిస్సాన్ మోటార్ ఇండియా ఇంజిన్ ఆయిల్ / ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్పై 10%, ఫ్లోర్ కార్పెట్ రీప్లేస్మెంట్పై 10% ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దాంతోపాటు వరద ప్రభావిత వాహనాలన్నింటికీ కంపెనీ సర్వీస్ వర్క్షాప్ల్లో ఫిట్నెస్ టెస్ట్ వివరాలు అందిస్తామని పేర్కొంది. -
భారతీయ మార్కెట్లో జపాన్ బ్రాండ్ కారు లాంచ్ - పూర్తి వివరాలు
నిస్సాన్ కంపెనీ తన ఎక్స్-ట్రైల్ SUVని రూ. 49.92 లక్షల ప్రారంభ ధర వద్ద దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు 7 సీటర్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని సంస్థ సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది.కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్తో వస్తుంది. ఇది 163hp పవర్, 300Nm టార్క్ అందిస్తుంది. ఇది సీవీటీ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.నిస్సాన్ ఎక్స్-ట్రైల్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, ఆటో-హోల్డ్ ఫంక్షన్, క్రూయిజ్ కంట్రోల్తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు దేశీయ విఫణిలో ప్రధానంగా టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
నిస్సాన్ కొత్త కారు 'ఎక్స్-ట్రైల్' ఇదే.. విశేషాలేంటో తెలుసా?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ప్రస్తుతం భారతదేశంలో మాగ్నైట్ SUVని మాత్రమే విక్రయిస్తోంది. అయితే దేశీయ విఫణిలో తన ఉనికిని చాటుకోవడానికి, వాహన ప్రియులకు చేరువ కావడానికి ఎక్స్-ట్రైల్ లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ధరలను మాత్రమే వెల్లడికావాల్సి ఉంది.నాల్గవ తరం నిస్సాన్ ఎక్స్-ట్రైల్.. పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ అనే మూడు మోనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లేకు సపోర్ట్ చేసే 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్రూఫ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ కారు.. భారతదేశంలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12 వోల్ట్స్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని పొందుతుంది. ఇంజిన్ 163 పీఎస్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD) కాన్ఫిగరేషన్లో మాత్రమే వస్తుంది.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఏడు ఎయిర్బ్యాగ్లు, ఆటో హోల్డ్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, ముందు అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారు ధర రూ. 40 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే ధరలు అధికారికంగా ఆగష్టు 1న వెల్లడవుతాయి. -
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా నిస్సాన్ కంపెనీ తయారుచేసిన మ్యాగ్నైట్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2023 మధ్య తయారైన ఈ మోడళ్లలో ముందు డోరు హ్యాండిల్ సెన్సార్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ఈవీ పాలసీపై చర్చకు హాజరైన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు ఎన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ, గతేడాది డిసెంబర్ తర్వాత తయారైన మోడళ్లలో ఈ సమస్య లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ కస్టమర్లకు చేరవేశామని కంపెనీ చెప్పింది. కంపెనీ గుర్తింపు పొందిన సర్వీస్ కేంద్రాల్లో ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని సంస్థ పేర్కొంది. -
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు..
భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో చాలా వాహన తయారీ సంస్థలు కొత్త కార్లను & బైకులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కియా కారెన్స్ ఎక్స్-లైన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా కంపెనీకి చెందిన కారెన్స్ ఇప్పుడు ఎక్స్-లైన్ రూపంలో విడుదలైంది. ఈ కొత్త కారు ధరలు రూ. 18.94 లక్షల నుంచి రూ. 19.44 వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ తాజాగా ఇండియన్ మార్కెట్లో అడుగెట్టిన నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ధరలు ఈ రోజు అధికారికంగా వెలువడ్డాయి. దీని ధర రూ. 8.27 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది పెట్రోల్ ఎమ్టీ, టర్బో పెట్రోల్ ఎమ్టీ, టర్బో-పెట్రోల్ సీవీటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫోక్స్వ్యాగన్ వర్టస్ జిటి ప్లస్ మ్యాట్ వర్టస్ వెర్షన్ ఇటీవల జిటి ప్లస్ మ్యాట్ ఎడిషన్ రూపంలో విడుదలైంది. దీని ధరలు రూ. 17.62 లక్షల నుంచి రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కేవలం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో మాన్యువల్ అండ్ DSG ఆటోమేటిక్ గేర్బాక్స్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి లాంబోర్గినీ రెవెల్టో ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ విఫణిలో 'రెవెల్టో' అనే కొత్త కారుని విడుదల చేసింది. దీని ధర రూ. 8.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & 3.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇందులోని 6.5 లీటర్ వి12 ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. -
నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
Nissan Magnite Geza Special Edition: ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న 'నిస్సాన్ మాగ్నైట్' ఇప్పుడు సరికొత్త స్పెషల్ ఎడిషన్లో విడుదలైంది. జపనీస్ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు ఇప్పుడు కొత్త అప్డేట్స్ పొందింది. ఈ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ భారతదేశంలో విడుదలైన నిస్సాన్ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ పేరు 'గెజా'. నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది ఒనిక్స్ బ్లాక్, సాండ్స్టోన్ బ్రౌన్, స్టార్మ్ వైట్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, బ్లేడ్ సిల్వర్ అనే ఐదు కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్ కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దాదాపు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. అయితే ఫీచర్స్ కొన్ని అప్డేట్ పొందాయి. ఇందులోని 9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ టచ్స్క్రీన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. ఇందులో JBL స్పీకర్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: అత్యంత ఖరీదైన మెక్లారెన్ సూపర్కార్ - 330 కిమీ/గం స్పీడ్) ఇప్పటికే నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ మార్కెట్లో విడుదలైంది. కాగా ఇప్పుడు గెజా ఎడిషన్ అడుగు పెట్టింది. ఇందులో యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. దీనిని నిస్సాన్ ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో బేజ్ కలర్ సీట్ కవర్స్ ఉండటం కూడా చూడవచ్చు. ఇందులో రియర్ కెమెరా, షార్క్ న్ యాంటెన్నా వంటివి కూడా ఉన్నాయి. ఇంజిన్ కంపెనీ అందించిన సమాచారం మాగ్నైట్ గెజా స్పెషల్ ఇంజిన్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కావున అదే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 hp పవర్ ప్రోడీసు చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. కావున పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు) ప్రత్యర్థులు కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యువి300, మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనాల్ట్ కిగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా ఇది గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
నిస్సాన్ కస్టమర్లకు భారీ షాక్: 8 లక్షల కార్లు రీకాల్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ తన కస్టమర్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. అమెరికా, కెనడాలో దాదాపు 8 లక్షల కార్లను రీకాల్ చేస్తోంది. ఇంజీన్లో లోపం కారణంగా ఈ భారీ రీకాల్ చేపట్టింది. 2014 నుండి 2020లో కొన్న రోగ్ మోడల్ కార్లను, అలాగే 2017 నుండి 2022 వరకు విక్రయించిన రోగ్ స్పోర్ట్స్ కార్లను వెనక్కి తీసుకోనుంది. ఈ కార్లలో జాక్నైఫ్ ఫోల్డింగ్ కీ పూర్తిగా తెరుచుకోక పోవచ్చని, కీని పాక్షికంగా తిప్పి, డ్రైవ్ చేస్తే, డ్రైవర్ ఫోబ్ను తాకడం, లేదా ఇంజీన్ ఆగిపోవడం లాంటివి జరగవచ్చని నిస్సాన్ తెలిపింది. అంతేకాదు దీని కారణంగా ఇంజిన్ పవర్ , పవర్ బ్రేక్లను కోల్పోయేలా చేస్తుంది. కారు క్రాష్ అవవ్వొచ్చు. ఎయిర్బ్యాగ్లు ఓపెన్ కాకపోవచ్చు అని తెలిపింది. అయితే ప్రమాద తీవ్రతపై స్పష్టత లేదని పేర్కొంది. ఫలితంగా అమెరికా, కెనడాలో 809,000 కంటే ఎస్యూవీలను రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది.అలాగే సంబంధిత కారు యజమానులకు ఈ మార్చి నెలలో సమాచారం అందిస్తున్నట్టు తెలిపింది. -
భారత్ నుంచి మళ్లీ డాట్సన్ ‘గో’..
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ .. భారత్లో తమ డాట్సన్ బ్రాండ్ కార్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ‘చెన్నై ప్లాంటులో (రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా) డాట్సన్ రెడీ–గో ఉత్పత్తి నిలిపివేశాం. అయితే, స్టాక్ ఉన్నంత వరకూ వాటి విక్రయాలు కొనసాగుతాయి. డాట్సన్ కొనుగోలు చేసిన ప్రస్తుత, భవిష్యత్ కస్టమర్లకు యథాప్రకారంగా దేశవ్యాప్త డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, విడిభాగాలు అందుబాటులో ఉంచడం, వారంటీపరమైన సపోర్ట్ అందించడం కొనసాగిస్తాం‘ అని నిస్సాన్ ఇండియా తెలిపింది. కంపెనీ ఇప్పటికే డాట్సన్ బ్రాండ్లో ఎంట్రీ లెవెల్ చిన్న కారు గో, కాంపాక్ట్ మల్టీపర్పస్ వాహనం గో ప్లస్ మోడల్స్ ఉత్పత్తి ఆపేసింది. డాట్సన్ బ్రాండ్ను నిస్సాన్ నిలిపివేయడం ఇదే తొలిసారి కాదు. 1986లో ఆపేసే నాటికి డాట్సన్ భారత్ సహా 190 దేశాల్లో అమ్ముడయ్యేది. మళ్లీ చాలాకాలం తర్వాత 2013లో డాట్సన్ బ్రాండ్ భారత మార్కెట్కు తిరిగి వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేదు. మిగతా మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో 2020లోనే రష్యా, ఇండోనేసియా మార్కెట్లలో డాట్సన్ను ఆపేసిన నిస్సాన్ అటు పై క్రమంగా భారత్, దక్షిణాఫ్రికాలో కూడా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. -
కారు కొనాలనుకునే వారికి తీపికబురు
ప్రముఖ కారు తయారీ కంపెనీలు మారుతి సుజుకి, మహీంద్రా ఈ ఫిబ్రవరి నెలలో కార్లపై భారీ తగ్గింపును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్సాన్, డాట్సన్ కంపెనీలు కూడా ఇప్పుడు తమ కార్లపై రూ.95 వేల వరకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. డాట్సన్ తన వాహన శ్రేణిలో మూడు కార్లపై ఆఫర్లు ప్రకటిస్తే, నిస్సాన్ కిక్స్పై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు అన్ని ఫిబ్రవరి 2021నెలలో బుకింగ్ చేసుకున్న వాటికీ మాత్రమే వర్తిస్తుంది. ఆ కార్ల వివరాలు ఇలా ఉన్నాయి. నిస్సాన్ కిక్స్: ఈ కారు ధర రూ.9.49 లక్షల నుంచి రూ.14.64 లక్షల వరకు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో కంపెనీ రూ.25వేల నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.50 వేలు, రూ. 20 వేలు లాయల్టీ బెనిఫిట్లతో పాటు మొత్తం రూ.95 వేల డిస్కౌంట్ కస్టమర్లకు అందిస్తోంది. డాట్సన్ రెడి-గో: ఈ కారు ధర రూ.2.86 లక్షల నుంచి రూ.4.82 లక్షల వరకు ఉంటుంది. ఈ నెలలో కంపెనీ రూ.15 వేల నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.15 వేల, రూ.4 వేల లాయల్టీ బెనిఫిట్లతో కలుపుకొని మొత్తం రూ.34 వేల వరకు డిస్కౌంట్ కస్టమర్లకు అందిస్తోంది. డాట్సన్ గో: ఈ కారు ధర రూ.4.02 లక్షల నుంచి రూ.6.51 లక్షల వరకు ఉంటుంది. ఈ డిస్కౌంట్లు డాట్సన్ గో యొక్క అన్ని వేరియంట్లలో వర్తిస్తాయి. ఈ కారుపై రూ.20వేల నగదు తగ్గింపు, రూ.20వేల ఎక్స్ఛేంజ్ బోనస్తో కలుపుకొని మొత్తం రూ.40 వేల డిస్కౌంట్ అందిస్తుంది. డాట్సన్ గో ప్లస్: ఈ కారు ధర రూ.4.25 లక్షల నుంచి రూ.6.99 లక్షల వరకు ఉంటుంది. ఈ నెలలో కంపెనీ రూ.20వేల నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.20వేలతో మొత్తం రూ.40 వేల వరకు మొత్తం డిస్కౌంట్ కస్టమర్లకు అందిస్తోంది. చదవండి: అమెజాన్ ఇండియాను బహిష్కరించాలి -
నిస్సాన్ సెల్ఫ్డ్రైవింగ్ కారు జీటీ-ఆర్(ఎక్స్)
ప్రపంచంలోని స్పోర్ట్స్ రేసింగ్ బెస్ట్ కార్లలో నిస్సాన్ జీటీ-ఆర్ ఒకటి. దీనిని మొదటిసారిగా 2007లో జపాన్లో తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వినియోగదారులను ఆకట్టుకుంటింది.ఈ సూపర్ కార్ చరిత్ర చాలా పెద్దది. 2020లో తీసుకొచ్చిన నిస్సాన్ జిటి-ఆర్ కార్ లగ్జరీ స్పోర్ట్స్ కార్లలో ది బెస్ట్ వన్. ఇది జిటి-ఆర్ శక్తివంతమైన ట్విన్-టర్బో ఇంజిన్, హైటెక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ తో వస్తుంది. ఇప్పుడు నిస్సాన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను భవిష్యత్ లో తీసుకురావాలని భావిస్తుంది. దీనిలో భాగంగా ఆర్ 35-జనరేషన్ నిస్సాన్ జీటీ-ఆర్ ఆధారంగా పనిచేసే నిస్సాన్ జీటీ-ఆర్(ఎక్స్) 2050 ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కారును తీసుకు రాబోతున్నారు.(చదవండి: యాపిల్ నుంచి సెల్ఫ్డ్రైవింగ్ కారు!) నిస్సాన్ జీటీ-ఆర్(ఎక్స్)ని 2050 నాటికీ తీసుకురావాలని భావిస్తున్నారు. దీనికి సంబందించిన డిజైన్ ని కాలిఫోర్నియాలోని పసాదేనాలోని ఆర్ట్సెంటర్ కాలేజ్ ఆఫ్ డిజైన్ విద్యార్థి జేబమ్ చోయ్ రూపొందించారు. ఇది మెదడు కదలికలతో పనిచేస్తుంది. అమెరికాలోని నిస్సాన్ డిజైన్ కి సంబందించిన డిపార్ట్మెంట్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు చోయ్. ఈ ఇంటర్న్షిప్ లో భాగంగా మెదడు ఆధారంగా పనిచేసే సూపర్ కార్ జిటి-ఆర్ (ఎక్స్) 2050 డిజైన్ ని రూపొందించాడు. ఈ డిజైన్ చుస్తే మాత్రం సాధారణ కారు డిజైన్ లాగా మాత్రం కనిపించడం లేదు. జీటీ-ఆర్ 4.5 అడుగుల ఎత్తుతో పోలిస్తే ఇది 2 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది. ఇందులో డ్రైవ్ చేసే వ్యక్తికీ ఒక సూట్ ధరిస్తారు. ఈ సూట్ మెదడు కదలికల ఆధారంగా కారును ఆటోమేటిక్ గా ఆపరేట్ చేస్తుంది. ఇది మానవ మెదడును కంప్యూటర్తో అనుసంధానించే "సాధారణ" సెల్ఫ్-డ్రైవింగ్ కార్ల కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది అని సమాచారం. ఈ డిజైన్ చివరిది కాదు. దీనిలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. -
నిస్సాన్ తొలి కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాహన రంగంలో అధిక పోటీ ఉండే కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలోకి నిస్సాన్ మోటార్ అడుగుపెట్టింది. ప్రారంభ ధర రూ.4.99 లక్షలతో బుధవారం తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘మాగ్నైట్’ మోడల్ను ఆవిష్కరించింది. మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఆప్షన్లలో ఇది లభ్యమవుతుంది. ఈ మోడల్ దేశంలోని మారుతీ విటారా, బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యూవీ 300 హోండా డబ్ల్యూఆర్–వీలతో పోటీ పడనుంది. ఈ కారు రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఒక లీటరు పెట్రోల్ వేరియంట్లో లభ్యమయ్యే మోడల్ ధరలు రూ.4.99– రూ.7.55 లక్షల మధ్య ఉండగా.., ఒక లీటరు టర్బో పెట్రోల్ వేరియంట్ మోడల్ ధరలు రూ.6.99–రూ.8.45 లక్షల మధ్య ఉన్నాయి. ఈ ధరలు ఈ ఏడాది చివరి తేది డిసెంబర్ 31 నాటి వరకే వర్తిస్తాయి. ఇందులో 8 అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ యాపిల్ కార్డ్ప్లే, అండ్రాయిడ్ ఆటో, టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఏసీ, పుష్బటన్ స్టార్ట్, క్రూజ్కంట్రోల్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
10 వేల ఉద్యోగాలకు ఎసరు
టోక్యో: జపాన్కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. ఆర్థిక సంక్షోభం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గ్లోబల్గా 4వేల 800 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించిన కంపెనీ తాజాగా ఈ సంఖ్యను రెట్టింపు చేసిందట. కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ జపాన్ మీడియా బుధవారం అందించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. అమెరికా, ఐరోపాలో అమ్మకాలు పడిపోవడంతో ఈ సంస్థ దెబ్బతినడంతోపాటు, ఆర్థిక కుంభకోణం ఆరోపణలపై మాజీ బాస్ కార్లోస్ ఘోస్న్ అరెస్ట్ తరువాత నిస్సాన్ మరింత కుదేలైంది. అలాగే 43 శాతం వాటా ఉన్న ఫ్రెంచ్ భాగస్వామి రెనాల్ట్తో వివాదం ముదిరి సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ ఉద్యోగుల్లో లక్షా 39వేల ఉద్యోగాల్లో 4,800 ఉద్యోగాల కోత పెట్టనున్నామని కంపెనీ మేలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా కథనాలపై వ్యాఖ్యానించేందుకు నిస్సాన్ ప్రతినిధి నిరాకరించారు. కాగా నిస్సాన్ లాభాలు గత ఏడాది దశాబ్దం కనిష్టానికి పడిపోయింది. అలాగే భవిషత్తు మరింత కష్టంగా ఉండనుందని కూడా వ్యాఖ్యానించింది. 2019 మార్చి లో 319 బిలియన్ యెన్ల (2.9 బిలియన్ డాలర్లు) నికర లాభాలను నివేదించింది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 57 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లాభాలు 170 బిలియన్లకు పడిపోవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది. -
రూ.19 లక్షల కారు రూ. 2 లక్షలకే..?!
సాక్షి, బెంగళూరు : చోర కళలో నేరగాళ్లు రోజు రోజుకు ఆరి తేరి పోతున్నారు. బెంగళూరు లోని నిస్సాన్ షోరూంకి కుచ్చు టోపీ పెట్టి ఖరీదైన కారుతో చల్లగా జారుకున్నాడు. డౌన్ పేమెంట్ చెల్లించి మరీ యజమానిని నమ్మించి ఉడాయించాడు. సుమారు 19లక్షల విలువ చేసేకారును కేవలం రూ. 2 లక్షల రూపాయలకు ఎగరేసుకుపోయాడో ప్రబుద్దుడు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. విలాసవంతమైన ఎస్యూవీ నిస్సాన్ కిక్స్ను కొనుగోలు చేస్తానంటూ షోరూంకి వచ్చాడు జోస్ థామస్ అకా జోసెఫ్. షోరూం మేనేజర్ని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. ధర రూ 18.6 లక్షలని చెప్పగానే వెంటనే రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కట్టి.. పూజా కార్యక్రమాలను చేయించుకుంటానని చెప్పి బురిడీ కొట్టించి కారును తీసుకెళ్లాడు. అంతే ఇక అక్కడనుంచి పత్తా లేకుండాపోయాడు. ఎన్ని ఫోన్లు చేసినా సమాధానం లేదు. అతని ఆఫీసుకు వెళ్లినా.. ఫలితం శూన్యం. చివరికి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇందులో ట్విస్టు ఏంటంటే...ఈ సంఘటన జరిగి నాలుగు నెలలైంది. జనవరి 23న బెంగళూరులోని దొడ్డనకుంది సూర్య నిస్సాన్ షోంరూంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు నాలుగు నెలల తరువాత అంటే మే 21వ తేదీన షోరూం యజమాని గణేశ్ కుమార్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారన్నదానిపై స్పందించేందుకు గణేష్ తిరస్కరించారు. గణేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని సంబంధిత డీసీపీ అబ్దుల్ అహద్ తెలిపారు. నిందితుడు ఇచ్చిన ఫోన్ నెంబర్, ఆఫీస్ అడ్రస్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. సంఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు చేశారు కాబట్టి కేసు దర్యాప్తునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
ప్రపంచకప్ టోర్నీకి నిస్సాన్ వినియోగదారులు
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ అభిమానుల ఆదరణ పొందే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఓ వినూత్న ప్రణాళికతో ముందుకొచ్చింది. తమ సంస్థ నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నిస్సాన్ కిక్స్ కారు యజమానులకు ప్రపంచకప్ మ్యాచ్లు చూసే అవకాశాన్ని కల్పించింది. నిస్సాన్ కిక్స్ కారును సొంతం చేసుకున్న 15 మంది యజమానులకు జూన్ 16న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లను అందించనున్నట్లు నిస్సాన్ యాజమాన్యం ప్రకటించింది. టికెట్లతో పాటు ఇంగ్లండ్ వెళ్లేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామంటూ తెలిపింది. వీరితో పాటు మరో 250 మంది క్రికెట్ అభిమానులను నిస్సాన్ ఇండియా ఎంపిక చేసింది. ప్రపంచకప్లో భారత్ తలపడే ఇతర మ్యాచ్లకు వీరిని పంపిస్తామని పేర్కొంది. ఎర్నాకులం, షిమోగ, ముజఫర్నగర్, గుంటూరు, కోటలకు చెందిన నిస్సాన్ కంపెనీ వినియోగదారులు ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో జతకట్టిన నిస్సాన్ కంపెనీ... గతేడాది ఆగస్టులో నిర్వహించిన ‘ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీ’ టూర్లో భాగస్వామిగా వ్యవహరించింది. -
అమ్మకానికి కస్టమర్ల డేటా!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ తన వినియోగదారుల సమాచారాన్ని విక్రయించాలని 2012లో అనుకుందని ఓ మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది. ఫేస్బుక్కు చెందిన గ్రాఫ్ ఏపీఐలో వినియోగదారుల సమాచారం భారీస్థాయిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ గ్రాఫ్ ఏపీఐలోని వివరాలు/సమాచారాన్ని పొందేందుకు కంపెనీల నుంచి కనీసం రెండున్నర లక్షల డాలర్లు వసూల చేయాలని ఫేస్బుక్ 2012లో భావించిందని అర్స్టెక్నికా అనే సంస్థ బయటపెట్టింది. 2014లో ఫేస్బుక్ ఆ నిర్ణయానికి కొన్ని మార్పులు చేసిందనీ, 2015 నాటికి గ్రాఫ్ ఏపీఐలోని కొద్ది సమాచారం మాత్రమే కంపెనీలకు అందుబాటులో ఉండేలా మార్పులు చేసిందని తెలిపింది. కోర్టుకు చేరిన ఓ పత్రం నుంచి సమాచారాన్ని సేకరించి అర్స్టెక్నికా ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రాఫ్ ఏపీఐ నుంచి విస్తృత స్థాయిలో సమాచారం పొందేందుకు నిస్సాన్, కెనడా రాయల్ బ్యాంక్, ఎయిర్బీఎన్బీ, నెట్ఫ్లిక్స్, లైఫ్ట్, క్రైస్లర్/ఫియట్ తదితర కంపెనీలు ఉన్నాయని అర్స్టెక్నికా తెలిపింది. ఓ కేసులో బ్రిటన్ పార్లమెంటు ఫేస్బుక్ అంతర్గత పత్రాలను పరిశీలన నేపథ్యంలో తాజా వార్త ఫేస్బుక్కు మరింత ఆందోళన కలిగించనుంది. -
నిస్సాన్ ఛైర్మన్పై వేటు
టోక్యో: ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో ప్రపంచం ఆటోదిగ్గజం నిస్సాన్ ఛైర్మన్ కార్లోస్ ఘోన్ వేటుపడింది. రెండురోజులక్రితం గోన్ను టోక్యో విచారణ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిస్సాన్ బోర్డునుంచి ఆయన్ను తొలగించాలని బోర్డు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని నిస్సాన్ గురువారం వెల్లడించింది. అలాగే మరో ఎగ్జిక్యూటివ్ రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీని కూడా తొలగించినట్టు తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత నివేదికను పూర్తిగా పరిశీలించిన అనంతరం బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. యోకోహామాలో సంస్థ ప్రధాన కార్యాలయంలో బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. మరోవైపు ఘోన్ స్థానంలో సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఒక ఎడ్వైజరీ కమిటీని నియమించినట్టు నిస్సాన్ ప్రకటించింది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీలో జపనీస్ మహిళా రేసింగ్ డ్రైవర్ కైకో ఇహారా కూడా ఉన్నారు. -
నిస్సాన్ చీఫ్ ఘోన్ అరెస్ట్
టోక్యో: ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ చైర్మన్ కార్లోస్ ఘోన్ అరెస్టయ్యారు. తన ఆదాయాన్ని తక్కువగా చూపించటం సహా పలు అవకతవకలకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్ల విచారణలో వెల్లడైందని, దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారని జపాన్ వార్తా సంస్థ ఎన్హెచ్కే వెల్లడించింది. ‘ఆర్థిక సాధనాలు, విదేశీ మారక చట్టం నిబంధనల్ని ఉల్లంఘించారన్న అభియోగాలతో నిస్సాన్ చైర్మన్ ఘోన్ను టోక్యో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అరెస్టు చేసింది‘ అని ఈ సంస్థ తెలియజేసింది. మరోవైపు, ప్రజావేగు నివేదిక మేరకు ఘోన్పై గత కొద్ది నెలలుగా అంతర్గతంగా విచారణ సాగిస్తున్నట్లు నిస్సాన్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా ఏళ్లుగా మరో అధికారితో కలిసి అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలొచ్చాయని వివరించింది. దీంతో ఘోన్, రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ‘ఘోన్ అందుకునే జీతభత్యాలను తక్కువగా చేసి చూపించేందుకు ఆయన, కెల్లీ కలిసి టోక్యో స్టాక్ ఎక్సే్చంజీకి పలు సంవత్సరాలుగా తప్పుడు సమాచారం అందిస్తున్నారని మా విచారణలో వెల్లడైంది. అంతేగాకుండా ఘోన్పై దుష్ప్రవర్తన ఆరోపణలూ ఉన్నాయి. కంపెనీ ఆస్తుల్ని సొంతానికి వాడుకోవడం వంటివి చేశారు. ఈ వ్యవహారాల్లో కెల్లీ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాలన్నీ జపనీస్ ప్రాసిక్యూటర్లకు తెలియజేశాం. ఆయనతో పాటు కెల్లీని తక్షణం అన్ని హోదాల నుంచి తొలగించాలంటూ డైరెక్టర్ల బోర్డు ముందు ప్రతిపాదించనున్నాం’’ అని నిస్సాన్ తన ప్రకటనలో వివరించింది. ఘోన్ను ప్రాసిక్యూటర్స్ ప్రశ్నిస్తున్నారన్న వార్త అసాహి షింబున్ అనే స్థానిక వార్తాపత్రిక ద్వారా బైటికొచ్చింది. అటుపై యోకోహామాలోని నిస్సాన్ ప్రధాన కార్యాలయంపై టోక్యో ప్రాసిక్యూటర్స్ దాడులు నిర్వహించనున్నట్లు ఎన్హెచ్కే వెల్లడించింది. ప్రశ్నార్థకంగా రెనో–మిత్సుబిషి కూటమి.. ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో– నిస్సాన్– మిత్సుబిషిలను ఒకే తాటిపైకి తెచ్చిన ఘోన్ అరెస్టయిన నేపథ్యంలో ఈ కూటమి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారవచ్చని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి బ్రాండ్ ఇమేజ్పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. బ్రెజిల్కి చెందిన ఘోన్ (64) 1996– 99 మధ్య కాలంలో ఫ్రాన్స్ ఆటోమొబైల్ సంస్థ రెనోలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేసి కంపెనీ పునరుద్ధరణలో కీలకపాత్ర పోషించారు. వ్యయాల్లో కోత పెట్టడంలో నిరంకుశంగా వ్యవహరిస్తారనే పేరుపొందారు. 1999లో ఘోన్.. జపాన్కి చెందిన నిస్సాన్ను పునరుద్ధరించే బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కఠిన వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేశారు. అయిదు ఫ్యాక్టరీలను మూసివేసి, 21,000 ఉద్యోగాలను తగ్గించి, తద్వారా మిగిలిన నిధులను మూడేళ్లలో కొత్తగా 22 కార్లు, ట్రక్ మోడల్స్ను ప్రవేశపెట్టడంపై ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద ఫోక్స్వ్యాగన్, టయోటాలకు దీటైన పోటీనిచ్చే సంస్థలుగా నిస్సాన్, రెనోలను తీర్చిదిద్దారు. 2016లో మిత్సుబిషి సంస్థను గట్టెక్కించేందుకు నిస్సాన్ 2.2 బిలియన్ డాలర్లతో మూడో వంతు వాటాలు కొనుగోలు చేసింది. దానికి కూడా సారథ్య బాధ్యతలు చేపట్టిన ఘోన్... రెనో, నిస్సాన్,మిత్సుబిషిలతో ఒక కూటమి తయారుచేశారు. ఈ క్రమంలో ఆయన అందుకుంటున్న జీత భత్యాలపై చాన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. రెనో–నిస్సాన్–మిత్సుబిషి కూటమి చైర్మన్గా, రెనో సీఈవోగా, నిస్సాన్..మిత్సుబిషి సంస్థల చైర్మన్గా ఆయన వివిధ హోదాల్లో జీతభత్యాలు అందుకునేవారు. కానీ నియంత్రణ సంస్థలకు మాత్రం వీటిని తగ్గించి చూపేవారని ఆరోపణలున్నాయి. ఈ వివాదమే తాజాగా ఆయన అరెస్టుకు దారితీసింది. ఘోన్ను చైర్మన్ హోదా నుంచి తొలగించే ప్రతిపాదనపై గురువారం బోర్డు సమావేశం కానున్నట్లు నిస్సాన్ సీఈవో హిరోటో సైకావా తెలిపారు. రెనో, మిత్సుబిషితో తమ లావాదేవీలపై ఘోన్ అరెస్టు, తొలగింపు ప్రభావమేమీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ఒకే ఎగ్జిక్యూటివ్కి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. -
అతి సురక్షితమైన ఎలక్ట్రిక్ కారు ‘నిస్సాన్ లీఫ్’
-
నిస్సాన్ కారుకు.. సెఫ్టీలో 5 స్టార్..!!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో ఎంతోమంది కోరిన కారది. ప్రపంచంలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు కూడా అదే. ప్రస్తుతం ప్రపంచంలో అతి సురక్షితమైన ఎలక్ట్రిక్ కారుగా కూడా నిలిచింది ‘నిస్సాన్ లీఫ్’ . యూరో ఎన్క్యాప్ సురక్షిత పరీక్షలో ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ మేరకు నిస్సాన్ ఓ ప్రకటన చేసింది. కారుకు టెస్టు నిర్వహిస్తున్న వీడియోను కూడా విడుదల చేసింది. యూరో ఎన్క్యాప్ పరీక్షలో 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి ఎలక్ట్రిక్ కారు కూడా నిస్సాన్ లీఫే. 2011లో తొలిసారి నిస్సాన్ లీఫ్ను నిస్సాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ముందు వెళ్లే సైకిస్టు, పాదచారులను గుర్తించి ఆటోమేటిక్ బ్రేక్ సదుపాయాన్ని కూడా కొత్తమార్పుల్లో లీఫ్కు నిస్సాన్ జోడించింది. -
నిస్సాన్ + రెనో = ....?
ఆటోమొబైల్ పరిశ్రమలో మరో పెద్ద డీల్కు తెరలేవబోతోంది. ఒకటేమో ఫ్రెంచ్కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో. మరొకటేమో జపాన్కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ నిస్సాన్. పైపెచ్చు రెండింటికీ ఒకదానిలో మరొక దానికి వాటాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇవి రెండూ పరస్పరం విలీనానికి చర్చలు మొదలెట్టాయి. ఈ రెండూ కలిసి కొత్త సంస్థ ఏర్పాటవుతుందని విలీన అంశంతో సంబంధమున్న వర్గాలు తెలియజేశాయి. విలీన డీల్తో రెండు కంపెనీల మధ్య ప్రస్తుతమున్న భాగస్వామ్యం పోయి ఓ పెద్ద సంస్థ ఆవిర్భవిస్తుంది. రెనోకు ప్రస్తుతం నిస్సాన్లో 43 శాతం వాటా ఉంది. అలాగే నిస్సాన్కు రెనోలో 15 శాతం వాటా ఉంది. రెనో, నిస్సాన్ కంపెనీల చైర్మన్ కార్లోస్ ఘోసన్ ఈ విలీన చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, విలీనానంతరం ఏర్పాటు కానున్న సంస్థకు కూడా ఈయనే నాయకత్వం వహిస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రెనో, నిస్సాన్ విలీన డీల్ పూర్తి కావడం కష్టమేనని ఆ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఫ్రెంచ్ ప్రభుత్వానికి రెనోలో 15 శాతం వాటా ఉంది. దీన్ని వదులుకోవడానికి, తన నియంత్రణను కోల్పోవడానికి ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు. అలాగే కొత్త కంపెనీ ఏర్పాటు ఎక్కడనేది కూడా ప్రధానమైనదే’’ అని ఆ వర్గాలు చెప్పాయి. విలీనం జరిగితే లండన్ లేదా నెదర్లాండ్స్లో కంపెనీ ఏర్పాటుకు అవకాశాలున్నట్లు తెలిసింది. అయితే కంపెనీల ప్రతినిధులు కానీ, ఫ్రెంచ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ విలీన వార్తలపై స్పందించలేదు. ఇక రెనో మార్కెట్ క్యాప్ 33 బిలియన్ డాలర్లుగా, నిస్సాన్ మార్కెట్ క్యాప్ 43 బిలియన్ డాలర్లుగా ఉంది. -
టాటా, నిస్సాన్ ధరలు పెరుగుతున్నాయ్!
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ ప్రయాణికుల వాహన ధరలను పెంచుతోంది. వచ్చే నెల 1 నుంచి వాహన ధరలను రూ.60,000 వరకూ పెంచుతున్నామని టాటా మోటార్స్ తెలిపింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్) మయాంక్ పరీక్ చెప్పారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ధరలను పెంచుతున్నామని తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి జోరును కొనసాగించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తామందిస్తున్న టియాగో, హెక్సా, టైగర్, నెక్సాన్ మోడళ్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుండడమే దీనికి కారణమని పేర్కొన్నారు. కాగా ఇటీవలనే జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ తన కార్ల ధరలను రూ.1–9 లక్షల రేంజ్లో పెంచిన విషయం తెలిసిందే. టాటా మోటార్స్ రూ.2.28 లక్షల ధర ఉన్న జెన్ ఎక్స్ నానో మోడల్ నుంచి రూ.17.42 లక్షల ధర ఉన్న ప్రీమియమ్ ఎస్యూవీ హెక్సా వరకూ విక్రయిస్తోంది. నిస్సాన్ పెంపు 2 శాతం కార్ల కంపెనీలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కార్ల ధరలను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి ఈ కార్ల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలంటున్నాయి. ఇప్పటికే ఆడీ, టాటా మోటార్స్, నిస్సాన్ కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు వెల్లడించాయి. వచ్చే నెల 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నామని నిస్సాన్ ఇండియా తెలిపింది. ఈ పెరుగుదల 2 శాతం వరకూ ఉంటుందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎమ్డీ, జెరోమి సైగట్ చెప్పారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగానే ధరలను పెంచుతున్నామని పేర్కొన్నారు. -
ఈ చెప్పులకు కాళ్లున్నాయి!
డ్రైవర్లు లేకుండా నడిచే కార్ల గురించి విన్నాం. లారీలూ వచ్చేస్తున్నాయి. విమానాలనూ ఇలాగే నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి చెప్పుల మాటేంటి? నో ప్రాబ్లెమ్ వాటినీ మనిషి లేకుండానే నడిపించేస్తాం అంటున్నది అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్. అనగా మనిషి లేకపోయినా ఈ చెప్పులు నడుస్తాయన్నమాట. కార్లలో వాడే హైటెక్ ప్రో పైలెట్ టెక్నాలజీని ఈ చెప్పుల్లో వాడటం వల్ల అవి మనిషి లేకపోయినా చెప్పినట్టుగా నడిచి ఒక మూల చేరుకుంటాయి. మనిషి లేకపోయినా ఎలాగైతే పార్కింగ్ స్థలాల్లో కార్లు చక్కగా వాటంతట అవే ఎలా పార్క్ అవుతాయో అలాగే ఈ చెప్పులు కూడా బుద్ధిగా కొలువు తీరుతాయి. సాధారణంగా మీటింగుల సమయాల్లో, ప్రార్థనా స్థలాల బయట చెప్పులు చిందరవందరగా పడి ఉండటం ఆనవాయితీ. ఈ టెక్నాలజీని వాడిన చెప్పులు ఉంటే ఆ చిందరవందర ఉండదు. అవి వరుసగా ఒక పద్ధతిలో సర్దుకుంటాయన్న మాట. చెప్పులకే కాదు గదుల్లో వాడే చిన్న చిన్న వస్తువులకు కూడా ఈ టెక్నాలజీని జోడించడం ద్వారా గదులను సర్దడం చాలా సులువైపోతుందని చెబుతోంది నిస్సాన్ సంస్థ. ర్యోకాన్ అనే సంప్రదాయ జపనీస్ లాడ్జీల్లో ఈ హైటెక్ చెప్పులను ఇప్పటికే వాడేస్తున్నారు. చిన్న చిన్న బల్లలు, వాటి చుట్టూ కూర్చునేందుకు కుషన్లతో ఉండే ఈ రెస్టారెంట్లో అతిథులు భోజనం చేస్తూండగానే బయట వదిలేసిన చెప్పులు జతలవారీగా ఒక పద్ధతి ప్రకారం అమరిపోతూంటాయి. భోజనం ముగించుకుని అతిథులు బయటికి రావడం ఆలస్యం.. కుషన్లు, ఇతర పరికరాలు కూడా తమ తమ స్థానాల్లో పొందికగా అమరిపోతాయి. -
నిస్సాన్ బంపర్ ఆఫర్లు: కారు గెల్చుకోవచ్చు!
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల ఉత్పత్తిదారు నిస్సాన్ ఇండియా వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. నిస్సాన్, డాట్సన్ మోడల్ కార్ల కొనుగోళ్లపై భారీ ప్రయోజనాలను అందించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిస్సాన్ వెల్లడించిన ఈ పండుగ బొనాంజా ఆఫర్లో కారు కొనుగోలుపై ఒక బంగారు నాణాన్ని అందిస్తోంది. దీంతోపాటు ఉచితంగా కారు గెల్చుకునే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తోంది. దీంతోపాటు ఉచిత బీమా, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పోరేట్ ఆఫర్ సహా దాదాపు రూ. 71,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. నిస్సాన్, డాట్సన్ మోడళ్లపై వినియోగదారులకు అందిస్తున్న ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చినట్టు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. వినియోగదారులు నిస్సాన్ , డాట్సన్ కారును ఈ పండుగ ఆఫర్లో సెప్టెంబర్19వ తేదీ లోపు కొనుగోలు చేస్తే ఉచితంగా కారు గెలు చుకునే అవకాశం. ఇలా తొమ్మిదిమంది లక్కీ విజేతలను ఎంపిక చేయనుంది. ప్రతి నిస్సాన్, డాట్సన్ కారు కొనుగోలుపై కస్టమర్లకు ఒక బంగారు నాణాన్ని అందిస్తోంది. అలాగే 7.99 శాతం వడ్డీతో నిస్సాన్ రెనాల్ట్ ఫైనాన్షియల సర్వీసెస్ ఇండియా ద్వారా రుణ సదుపాయం కూడా ఉంది. ‘పిల్లర్స్ ఆఫ్ ఇండియా’ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు డాట్సన్ రెడి-గోపై అదనంగా రూ.6వేల డిస్కౌంట్ అందిస్తోంది. మైక్రా ఎంసీ పై 39,000 రూపాయల వరకు, మైక్రా యాక్టివ్పై రూ. 34000 వరకు తగ్గింపు. (ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10వేలు, రూ. 4వేల కార్పొరేట్ ఆఫర్ కలిపి) డాట్సన్ మోడళ్లలో గో ప్లస్ పై రూ.16,000, రెడి గోపై రూ.14, 500, రెడీ గో (800) సీసీపై 13వేల వరకు ప్రత్యేక ఆఫర్ అందించనుంది. వీటిలో ఉచిత బీమా, రూ. 2,000 కార్పోరేట్ ఆఫర్ తదితరాలు ఉండనున్నాయి. -
లీటర్ ఇంజిన్తో రెడీ-గో..ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ : జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ కొత్తగా ఒక లీటరు ఇంజిన్తో డాట్సన్ రెడీ-గో కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర ఎక్స్షోరూం ఢిల్లీలో రూ.3.57 లక్షలుగా నిస్సాన్ తెలిపింది. ఈ కొత్త వాహనం లీటరుకు 22.5 కిలోమీటర్లు వరకు ప్రయాణించే ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కారు టాప్-వేరియంట్ మోడల్ ధర రూ.3.72 లక్షలుగా ఉంది. గతేడాది విజయవంతంగా లాంచ్ చేసిన రెడీ-గోలో ప్రస్తుతం తీసుకొచ్చిన 1.0 లీటర్ ఇంజిన్ వేరియంట్ అత్యంత శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించనున్నట్టు నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా చెప్పారు. ఈ కొత్త మోడల్ అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుందని, కస్టమర్లకు స్టయిల్గా, అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఫైవ్ స్పీడు మాన్యువల్ ట్రాన్సమిషన్ ఇది కలిగిఉంది. గతేడాదే 800సీసీ రెడీ-గోను నిస్సాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత ఈ మోడల్ను లిమిటెడ్ ఎడిషన్లో స్పోర్ట్స్ వేరియంట్ను కూడా ప్రవేశపెట్టింది. 2014లో భారత్లో ఎంట్రీ లెవల్ డాట్సన్ గో లాంచ్ చేయడంతో నిస్సాన్, డాట్సన్ బ్రాండును గ్లోబల్గా రీలాంచ్ చేసింది. గో, గో ప్లస్ కార్ల తర్వాత డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ మూడో కారుగా రెడీ-గోను తీసుకొచ్చింది. చిన్న కార్ల మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ-గోను డాట్సన్ తీసుకొచ్చింది. డాట్సన్ బ్రాండులో ఇప్పటివరకు 90,000 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. -
మరిన్ని కంపెనీల వాహన ధరలు తగ్గాయ్
♦ జాబితాలో హ్యుందాయ్, ♦ నిస్సాన్, స్కోడా, ఇసుజు, కేటీఎం ♦ రూ.2.4 లక్షల వరకు తగ్గింపు న్యూఢిల్లీ: తాజాగా మరిన్ని కంపెనీలు వాటి వాహన ధరలను తగ్గించాయి. నిస్సాన్, హ్యుందాయ్, స్కోడా, ఇసుజు, కేటీఎం కంపెనీలు వాటి వాహన ధరల్లో రూ.2.4 లక్షల వరకు కోత విధించాయి. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ధరల తగ్గింపు ప్రాంతాన్ని, మోడల్ను బట్టి మారుతుందని పేర్కొన్నాయి. ధరల తగ్గింపును పరిశీలిస్తే.. ⇔ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వాహన ధరలను 5.9 శాతం వరకు తగ్గించింది. ⇔ నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్ సహా తన వాహన ధరలను 3 శాతం వరకు తగ్గించింది. జీఎస్టీ అమలు వల్ల అటు వాహన తయారీ కంపెనీలకు, ఇటు కస్టమర్లకు ఇరువురికీ లబ్ధి కలుగుతుందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. నిస్సాన్ మోటార్ ఇండియా భారత్లో నిస్సాన్, డాట్సన్ బ్రాండ్స్ కింద రెడిగో మొదలు టెర్రానో వరకు పలు మోడళ్లను విక్రయిస్తోంది. ⇔ స్కోడా ముంబై ప్రాంతంలో వాహన ధరలను 7.3% వరకు తగ్గించింది. అంటే కస్టమర్లు రూ.2.4 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. ⇔ టాటా మోటార్స్.. వాణిజ్య వాహన ధరలను 8.2 శాతం వరకు తగ్గించింది. ⇔ ఇసుజు మోటార్స్ ఇండియా వాహన ధరల్లో 12 శాతం వరకు కోత విధించింది. ⇔ కేటీఎం కంపెనీ తన బైక్స్ ధరలను రూ.8,600 వరకు తగ్గించింది. కాగా రెనో ఇండియా, మహీంద్రా, హోండా కార్స్, ఫోర్డ్, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ వంటి పలు కార్ల కంపెనీలు ఇప్పటికే ధరల తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ వంటి పలు టూవీలర్ కంపెనీలు కూడా వాహన ధరలను తగ్గించాయి. -
నిస్సాన్ కార్ల ధరలు కూడా తగ్గాయి
ముంబై : ఎస్టీ ఎఫెక్ట్తో వాహన దిగ్గజ కంపెనీలన్ని వరుసపెట్టి తన వాహనాల రేట్లను తగ్గించడంలో క్యూ కడుతున్నాయి. తాజాగా నిస్పాన్ ఇండియా కూడా తన వాహనాలపై రేట్లను తగ్గిస్తున్నట్టుప్రకటించింది. నిస్సాన్ తన ఎక్స్-షోరూమ్ వాహనాల ధరలు సగటున 3 శాతం తగ్గించింది. నిస్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్ర మాట్లాడుతూ, ఆటోమొబైల్ తయారీదారులు, కస్టమర్లకు జీఎస్టీ అమలు సానుకూలమని చెప్పారు. లాభాలను తమ వినియోగదారులకు లాభాలను అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. జూలై 1 జీఎస్టీ పరిధిలో ఆటోమొబైల్స్ ప్రభుత్వం 28 పన్నురేటును నిర్ణయించింది. దీంతో ఈ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంతో ఆటోమొబైల్ కంపెనీలు బైక్లు,కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, ఫోర్డ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, బిఎమ్డబ్ల్యూలు వంటి కార్ల కంపెనీలు ఇటీవలే కార్ల ధరలు తగ్గుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిన్సాన్ మైక్రా 2017 లాంచ్...ధర ఎంత?
న్యూఢిల్లీ: జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ మోటార్ ఇండియా శుక్రవారం తన కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ మైక్రాకు అప్ టేడెడ్ వెర్షన్ను లాంచ్ చేసింది. 2017 నిస్సాన్ మైక్రా ప్రారంభ ధరను రూ .5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజీన్, 1.5లీటర్ల డీజిల్ ఇంజీన్ రెండు వేరియంట్లలో కొత్త మైక్రాను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వేరియంట్ ధరను రూ .5.99 లక్షలు, రూ. 6.95 లక్షల మధ్య, డీజిల్ వేరియంట్ను రూ. 6.62 లక్షల నుంచి రూ.7.23 లక్షలుగాఉండనున్నట్టు కంపెనీ తెలిపింది. జపనీస్ టెక్నాలజీ, యూరోపియన్ స్టయిల్తో తన కొత్త ప్రీమియమ్ అర్బన్ హ్యాచ్బ్యాక్ మైక్రాను ఆకర్షణీయమైన ధరల్లో తీసుకొచ్చినట్టు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ మల్హోత్రా చెప్పారు. 1.2 పెట్రోల్ ఇంజన్ను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 1.5 లీటరు డీజిల్ వెర్షన్లో 5స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తున్న ఈ కారులో ఆటో హెడ్ లాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ తదితర ఇతర ఫీచర్లు ఉన్నాయి. కాగా 2010లో భారత్ లోలాంచ్ అయిన నిస్సాన్ మైక్రా కార్లు ఇప్పటివరకూ 80 వేల యూనిట్లు భారతదేశంలో నిస్సాన్ విక్రయించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. -
నిస్సాన్ సన్నీ ధర భారీ కోత
రూ. 1.99 లక్షల దాకా తగ్గింపు... న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ తాజాగా సన్నీ సెడాన్ కారు ధరను రూ. 1.99 లక్షల దాకా తగ్గించింది. ఇకపై దీని ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 8.99 లక్షల దాకా (ఢిల్లీ ఎక్స్షోరూం) ఉంటుందని నిస్సాన్ మోటార్ ఇండియా తెలిపింది. పెట్రోల్ వేరియంట్ ధర రూ. 1.01 లక్ష తగ్గి రూ. 6.99 లక్షలుగాను, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ రేటు రూ. 1.99 లక్షలు తగ్గి రూ. 8.99 లక్షలుగాను ఉండనుంది. మరోవైపు డీజిల్ ఆప్షన్లో బేస్ వేరియంట్ ధర రూ. 1.31 లక్షలు తగ్గి రూ. 7.49 లక్షలుగా, టాప్ ఎండ్ వేరియంట్ రూ. 94,000 తగ్గి రూ. 8.99 లక్షలుగా (అన్నీ ఢిల్లీ ఎక్స్–షోరూం ధరలు) ఉండనుంది. స్థానికంగా ఉత్పత్తి చేయడంతో రేట్లను గణనీయంగా తగ్గించేందుకు సాధ్యపడిందని, ఆ ప్రయోజనాలు కస్టమర్లకు బదలాయిస్తున్నామని సంస్థ ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. చాలా మటుకు విడిభాగాలను దేశీయంగానే ఉత్పత్తి చేస్తున్నందున నిస్సాన్ గతేడాది ప్రీమియం హ్యాచ్బాక్ మైక్రా కారులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ధరను రూ. 54,252 దాకా తగ్గించింది. -
రెండు లక్షలు ధర తగ్గిన నిస్సాన్ సన్నీ
న్యూఢిల్లీ: జపనీస్ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ తన లేటెస్ట్ కారుపై భారీ తగ్గింపును ప్రకటించింది. మిడ్ సైజ్ సెడాన్ సన్నీ ధరను గురువారం భారత మార్కెట్లో దాదాపు రెండు లక్షల మేర ధర తగ్గించింది. 2017 లో లాంచ్ అయిన సన్నీ మోడల్ ధరలో రూ.1.99 లక్షల రూపాయల మేర తగ్గింపు అనంతరం దీని ప్రారంభ ధర రూ.6.99 లక్షలనుంచి రూ.8.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అందుబాటులోకి తీసుకొచ్చినంది. ఉ త్పత్తిఖర్చులు తగ్గిన కారణంగా ఈ తగ్గింపు అని నిస్సాన్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ధరల ప్రకారం, నిస్సాన్ సన్నీ పెట్రోల్ వేరియంట్ ఇప్పుడు రూ 6.99 లక్షలు, టాప్-ఎండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ రూ 8.99 లక్షలకు అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా, డీజిల్ మోడల్పై రూ.1.31 లక్షల కోత అనంతరం ఇప్పుడు రూ.7.49 లక్షల ధరకే ఉంది. టాప్-ఎండ్ వేరియంట్ పై రూ.94వేల తగ్గింపు అనంతరం రూ.8.99 లక్షలకే విక్రయించనుంది. గత ఏడాది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మైక్రా ధరను రూ.54వేలు తగ్గించింది. లోకల్ ప్రొడక్షన్ కారణంగా ఈ తగ్గింపు ధరలను ప్రకటించినట్టు నిస్సాన్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా ప్రకటించారు. ఉత్పత్తి ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని భావించినట్టు చెప్పారు. అందుకే తమ పాపులర్ అండ్ ప్రీమియం మోడల్ సెడాన్ను తక్కువ ధరల్లో అందించనున్నట్టు తెలిపారు. -
ఇదిగో.. నిస్సాన్ కొత్త ‘టెరానో’..
ప్రారంభ ధర రూ.9.99 లక్షలు నోయిడా: జపాన్కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్’ తాజాగా తన ఎస్యూవీ ‘టెరానో’లో కొత్త వెర్షన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరల శ్రేణి రూ.9.99 లక్షల నుంచి 13.6 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్షోరూమ్ ఢిల్లీవి. ఇదివరకు వాహనంతో పోలిస్తే తాజా టెరానోలో 22 కొత్త ఫీచర్లను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది. భద్రతా ఫీచర్లకు అధిక ప్రాధాన్యమిచ్చామని తెలిపింది. తాజా వేరియంట్ రెనో డస్టర్, హ్యుందాయ్ క్రెటా మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా నిస్సాన్ కంపెనీ టెరానో ఎస్యూవీని 2013లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎస్యూవీ విభాగం మాత్రమే కాదు... నిస్సాన్ కంపెనీ కేవలం ఎస్యూవీ విభాగంపైనే కాకుండా ఇతర విభాగాలపైనా దృష్టి కేంద్రీకరించింది. ఎస్యూవీ మార్కెట్పై పట్టుకోసం కంపెనీ ఈ ఏడాదిలోనే తన టాప్ఎండ్ ఎస్యూవీ ఎక్స్ట్రైల్లో హైబ్రిడ్ వెర్షన్ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. తాము కేవలం ఎస్యూవీ విభాగంపైనే కాకుండా ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంపైనా దృష్టి కేంద్రీకరించామని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ గులౌమి సికార్డ్ తెలిపారు. ఇందులో భాగంగానే 2021 నాటికి ఎనిమిది కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. భారత్లో సెడాన్ విభాగంలో కూడా వృద్ధి అవకాశాలున్నాయన్నారు. నిస్సాన్, డాట్సన్ బ్రాండ్ల కింద పలు కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ ద్వారా 2021 నాటికి భారత్లోని కారు మార్కెట్లో 5% వాటాను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. -
నిస్సాన్ టెర్రానో కొత్త వెర్షన్, ధరెంతో తెలుసా?
జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ తన ఎస్యూవీ టెర్రానోలో కొత్త వెర్షన్ ను సోమవారం లాంచ్ చేసింది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి రూ.13.6 మధ్యలో(ఎక్స్ షోరూం ఢిల్లీలో) ఉండేటట్టు కంపెనీ నిర్ణయించింది. 2013 అక్టోబర్లో లాంచ్ చేసిన ఈ మోడల్కు పెద్దగా తేడా లేనప్పటికీ, 22 చిన్న చిన్న మార్పులతో దీన్ని ఆవిష్కరించింది. కాంపాక్ట్-ఎస్యూవీ సెగ్మెంట్ హ్యుందాయ్ క్రిటా, మారుతీ సుజుకీ విటారా బ్రిజాల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు నిస్సాన్ తన ఇంటీరియర్స్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వర్క్ చేస్తోంది. 2017 నిస్సాన్ టెర్రానో ఫేస్లిఫ్ట్లో చేసిన 22 కొత్త మార్పులు... నావిగేషన్తో కూడిన కొత్తగా 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్ గుర్తింపు, ఎలక్ట్రికల్గా ఆపరేట్ చేసే ఓఆర్వీఎమ్స్, హిల్ క్లింబ్, క్రూజ్ కంట్రోల్ వంటి వాటిని ఈ వెర్షన్లో జతచేర్చింది. అంతేకాక, ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా పరమైన ఫీచర్లతో ఈ కొత్త వెర్షన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 1.5 డీజిల్ ఇంజిన్ వంటి వాటిలో నిస్సాన్ ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త వేరియంట్ ధరలు... టెర్రానో ఎక్స్ఎల్ ధర - రూ.9.99 లక్షలు టెర్రానో ఎక్స్ఈడీ ధర - రూ.9.99 లక్షలు టెర్రానో ఎక్స్ఎల్డీ(ఓ) ధర -రూ. 11.92 లక్షలు టెర్రానో ఎక్స్వీడీ పీఆర్ఈ ధర - రూ.13.60 లక్షలు -
నిస్సాన్ సీఈవో రాజీనామా
జర్మన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నిస్సాన్ సీఈవో కార్లోస్ ఘోసన్ రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంపాటు సంస్థకు విశేష సేవలందించిన కార్లోస్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మిస్తుబిషి మోటార్స్ బాధ్యతలను ఇటీవల స్వీకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.అయితే నిస్సాన్-రెనాల్ట్-మిత్సుబిషి అలయన్స్ మిత్సుబిషి మోటార్స్ కి చైర్మన్ అండ్ సీఈవో గా ఉంటారు. ప్రస్తుతం కంపెనీ కో సీఈవోగా ఉన్న హిరోటా సయికావా ఏప్రిల్ 1, 2017 నుంచి సీఈవో బాధ్యతలు చేపడతారని నిస్సాన్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కంపెనీ ఛైర్మన్ గా ఘోసన్ కొనసాగుతారు. అలాగే రెనాల్ట్ గ్రూపునకు సీఈవోగా కూడా ఉంటారు. తాను గత 18 సంవత్సరాలుగా నిస్సాన్ అభివృద్ధి కోసం పాటుపడ్డానని ఘోసన్ చెప్పారు. తన టీంతో కలిసి ప్రతిభ, అనుభవంతో సంస్థ కార్యాచరణ, వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకున్నాననే విశ్వాసాన్ని ప్రకటించారు. ఇటీవల నిస్సాన్ సాధారణ వాటాదారులు సమావేశంలో మిత్సుబిషి మోటార్స్ కొత్త బాధ్యతలు తీసుకున్న తరువాత హిరోటా సయివాకా సీఈవోగా ఉండం సరైనదని తాను భావించాన్నారు. -
నిస్సాన్.. ‘సన్నీ’ కొత్త వేరియంట్
ప్రారంభ ధర రూ.7.91 లక్షలు న్యూఢిల్లీ: జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘నిస్సాన్’ తాజాగా తన సెడాన్ కారు ‘సన్నీ’లో కొత్త వేరియంట్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.91 లక్షలు (ఎక్స్షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. అధిక ఇంధన సామర్థ్యం, సౌకర్యవంతమైన డ్రైవింగ్, అదిరిపోయే ఇంటీరియర్ డిజైన్ వంటి పలు ప్రత్యేకతలతో ఈ కొత్త వేరియంట్ను తయారుచేశామని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్న ఈ కొత్త సన్నీలో 1.4 లీటర్ ఇంజిన్ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.7.91 లక్షలు–రూ.10.89 లక్షల శ్రేణిలో... డీజిల్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.8.8 లక్షలు–రూ.10.76 లక్షల శ్రేణిలో ఉందని తెలిపింది. కొత్త వేరియంట్లో పుష్ బటన్ స్టార్ట్ సహా యాంటీ–లాక్ బ్రేకింగ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), బ్రేక్ అసిస్ట్ (బీఏ), డ్యూయెల్ ఫ్రంట్/సైడ్ ఎయిర్బ్యాగ్స్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయని వివరించింది. కాగా కంపెనీ భారత్లో నిస్సాన్, డాట్సన్ అనే బ్రాండ్ల కింద కార్లను విక్రయిస్తోంది. -
నిస్సాన్ కార్ల ధరల పెంపు!
జనవరి 1 నుంచి అమల్లోకి.. న్యూఢిల్లీ: జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ కూడా టయోటా, రెనో, టాటా మోటార్స్ దారిలోనే పయనిస్తోంది. ఇది తాజాగా జనవరి 1 నుంచి వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు రూ.30,000 వరకు ఉంటుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరుగుదలే ధరల పెంపునకు కారణమని వివరించింది. కాగా కంపెనీ తన వాహనాలను నిస్సాన్, డాట్సన్ బ్రాండ్ల కింద మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధర రూ.3.28 లక్షల నుంచి రూ.13.75 లక్షల (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉంది. -
నిస్సాన్ కూడా పెంచేసింది...
న్యూఢిల్లీ: జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ కూడా కార్ల ధరలను పెంచేస్తోంది. భారీ ఉత్పత్తి వ్యయాల కారణంగా వచ్చే నెలనుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్టు నిస్పాన్ మోటార్ ఇండియా మంగళవారం ప్రకటించింది. నిస్సాన్ డాట్సన్ మోడల్ కార్ల ధరను దేశంలో జనవరి, 2017 నుంచి రూ 30,000 వరకు పెంచుతున్నట్టు నిస్సాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్పాదక వ్యయం ఫలితంగా ధరలను పెంచుతున్నామనీ, పరిశ్రమలో నెలకొన్న పోటీని తట్టుకోవడానికి సవరించిన ఈ ధరలు తమకు సాయపడనున్నాయని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా ప్రకటించారు. ఎంట్రీ లెవల్ చిన్న కారు డాట్సన్ గో (రూ.3.28 లక్షలు) మొదలు, నిస్సాన్, డాట్సన్ బ్రాండ్లతో నిస్సాన్ ఎస్యూవీ టెర్రానో (రూ.13.75లక్షలు) లాంటి వాహనాలను సంస్థ విక్రయిస్తోంది. కాగా టాటా మెటార్స్, టయోటా కూడా ఇటీవల తమ కార్లను ధరలను పెంచాయి. ప్యాసింజర్ వాహనాల ధరలను రూ .5,000 నుంచి రూ .25,000వరకుపెంచుతున్నట్టు వెల్లడించాయి. ఇన్పుట్ ఖర్చులు, విదేశీ మారక రేట్ల కారణగా టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం) ధరలను 3 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. -
కార్లను రీకాల్ చేస్తున్న రెనాల్డ్, నిస్సాన్
-
నిస్సాన్ నుంచి ‘డాట్సన్ రెడిగో స్పోర్ట్’
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన దిగ్గజ వాహన కంపెనీ ‘నిస్సాన్’ తాజాగా తన ప్రముఖ హ్యాచ్బ్యాక్ ‘రెడిగో’లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ‘డాట్సన్ రెడిగో స్పోర్ట్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.3.49 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త వేరియంట్లో రియర్ పార్కింగ్ సెన్సార్, బ్లాక్ ఇంటీరియర్స్, బ్లూటూత్ ఆధారిత మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, స్పోర్టీ రూఫ్ స్పాయిలర్ అండ్ గ్రాఫిక్స్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. తాజా కొత్త వేరియంట్కు ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మలిక్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారని తెలిపింది. కాగా కంపెనీ జూన్ నెలలో రెడిగో మోడల్ను మార్కెట్లోకి తెచ్చింది. -
సాక్షి లాంచ్ చేసిన నిస్సాన్ స్పోర్టీ కారు
న్యూఢిల్లీ: రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకున్న నిస్సాన్ తక్కువ బడ్జెట్ లో డాట్సన్ బ్రాండ్ స్పోర్ట్స్ వెర్షన్ కొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడున్నర లక్షల ధరలో 'రెడీ గో స్పోర్ట్ ' పేరుతో పరిమిత ఎడిషన్ ను లాంచ్ చేసింది. భారత రెజ్లర్ ఒలింపిక్ పతక విజేత సాక్షి మా లిక్ చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. దీని ధరను రూ 3,49,479లు(ఢిల్లీ ఎక్స్షో రూం) గా కంపెనీ నిర్ణయించింది. డాట్సన్ రెడీ -గో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త పండుగను సాక్షి మాలిక్ తో జరుపుకోవడం సంతోషంగా ఉందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. రుబీ, వైట్, అండ్ గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్నతమ అన్ని డాట్సన్ డీలర్ షిప్ లలో అందుబాటులో ఉండనుందని తెలిపారు. ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు ఒక స్పోర్టి-నేపథ్యాన్ని జోడిస్తుందని తెలిపారు. ఈ స్పోర్టీ రెడి-గో స్పోర్ట్ లో థీమ్ వీల్ కవర్, స్పోర్టి గ్రాఫిక్స్, స్పోర్టి రూఫ్ స్పాయిలర్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్, స్పోర్టి డాష్ బోర్డ్ లాంటి కొత్త ఫీచర్లు ఇందులోఉన్నాయని కంపెనీ తెలిపింది. -
అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ కట్
♦ మూడు జేవీల్లో నిస్సాన్ వాటాల కొనుగోలుకు అశోక్ లేలాండ్ ఓకే ♦ ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం... న్యూఢిల్లీ: జపాన్ వాహన దిగ్గజం నిస్సాన్తో ఎనిమిదేళ్ల అశోక్ లేలాండ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇరు కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన మూడు జాయింట్ వెంచర్ల(జేవీ) నుంచి వైదొలగాలని నిస్సాన్ మోటార్ కంపెనీ నిర్ణయించింది. ఈ మూడు జేవీల్లో తమ వాటాలను అశోక్ లేలాండ్కు విక్రయించేందుకు బుధవారం ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఒక సంయుక్త ప్రకటనలో ఇరు కంపెనీలు వెల్లడించాయి. 2008 మే నెలలో అశోక్ లేలాండ్ నిస్సాన్ వెహికల్స్(ఏఎల్ఎన్వీఎల్) పేరుతో వాహన తయారీ జేవీ, అదేవిధంగా ఇంజిన్ల ఉత్పత్తి కోసం నిస్సాన్ అశోక్ లేలాండ్ పవర్ ట్రెయిన్(ఎన్ఏఎల్పీటీ), సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి నిస్సాన్ అశోక్ లేలాండ్ టెక్నాలజీస్(ఎన్ఏఎల్) అనే మూడు జేవీలను ఈ కంపెనీలు నెలకొల్పాయి. వీటిలో ఈక్విటీ రూపంలో దాదాపు రూ.1,000 కోట్లను పెట్టుబడిగా పెట్టాయి. కాగా, ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మూడు జేవీలు ఇక అశోక్ లేలాండ్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లుగా మారతాయని, భారత్లోని వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతుల మేరకు ఈ డీల్ పూర్తవుతుందని సంయుక్త ప్రకటన తెలిపింది. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. దోస్త్, ఇతర ఎస్సీవీలకు తోడ్పాటు... అశోక్ లేలాండ్తో జేవీల నుంచి వైదొలగినప్పటికీ... కొన్ని వాహనాలకు సంబంధించి లెసైన్సింగ్కు ఇరు కంపెనీలు అంగీకరించాయి. ప్రధానంగా దోస్త్, ఇతర లైట్ కమర్షియల్ వాహనాల(ఎల్సీవీ)కు కొత్తగా లెసైన్సింగ్ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుంది. వీటికి ఇంజినీరింగ్, టెక్నాలజీ, డిజైన్ను నిస్సాన్ సమకూర్చింది. అదేవిధంగా కస్టమర్లకు సర్వీసింగ్, విడిభాగాల లభ్యత వంటివి కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయి. మరోపక్క, దేశీయంగా తయారైన విడిభాగాల కొనుగోలును నిస్సాన్ కొనసాగించేందుకు కూడా ఇరు కంపెనీలు అంగీకరించాయి. ఎందుకీ తెగదెంపులు... వాస్తవానికి మూడు జేవీల్లో ఒకదాని నుంచి వైదొలగుతామంటూ ఈ ఏడాది ఆరంభంలోనే నిస్సాన్ టెర్మినేషన్ నోటీసులను అశోక్ లేలాండ్కు పంపింది. యంత్రపరికరాల ఎగుమతి ప్రోత్సాహక స్కీమ్(ఈపీసీజీ) నిబంధనలను రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అశోక్ లేలాండ్ కోర్టుకెళ్లడంతో ఇరు కంపెనీల మధ్య విభేధాలు మొదలయ్యాయి. అంతేకాకుండా జేవీల ద్వారా విడుదల చేసిన పలు మోడల్స్ మార్కెట్లో అంతగా విజయవంతం కాకపోవడం కూడా దీనికి కారణంగా నిలిచింది. ఇవాలియా ఎంపీవీని నిస్సాన్ నిలిపివేయగా... స్టైల్ ఎంపీవీ ఉత్పత్తిని అశోక్ లేలాండ్ ఆపేసింది. ఈ రెండింటినీ ఒకే ప్లాట్ఫామ్పై అభివృద్ధి చేశారు. అయితే, విజయవంతంగా అమ్ముడవుతున్న దోస్త్ ఎల్సీవీని మాత్రమే ప్రస్తుతం అశోక్ లేలాండ్ కొనసాగిస్తోంది. అతేకాకుండా దోస్త్కు సంబంధించి నిస్సాన్ అధిక రాయల్టీని డిమాండ్ చేయడం కూడా అశోక్ లేలాండ్కు నచ్చలేదు. అయితే, జేవీ ద్వారా తమకంటే తమ భాగస్వామే ఎక్కువగా లాభపడుతోందని నిస్సాన్ భావిస్తూవచ్చింది. ఈ పరిణామాలన్నీ చివరకు భాగస్వామ్యం ముగిసేలా చేసింది. మూడు జేవీల్లో నిస్సాన్ వాటాను కొనుగోలు చేయడానికి మేం అంగీకరించాం. మా కీలక వాహన వ్యాపారంపై మరింత దృష్టిపెట్టేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయి. అదేవిధంగా తాజా లెసైన్సింగ్ ఒప్పందం మేరకు నిస్సాన్తో మా బంధం కొనసాగుతుంది’. - వినోద్ దాసరి, అశోక్ లేలాండ్ ఎండీ భారత్లో మా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తాం. వాహనాల తయారీ, పరిశోధన-అభివృద్ధితో పాటు సేల్స్ నెట్వర్క్ను విస్తరించేందుకు భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నాం. ఇక్కడి మార్కెట్లో ప్రధాన వాహన కంపెనీగా అవిర్భవించే సన్నాహాల్లో ఉన్నాం. అశోక్ లేలాండ్తో కొత్తగా కుదిరిన లెసైన్సింగ్ ఒప్పందం ప్రకారం ఎల్సీవీ కస్టమర్లకు నిస్సాన్ ఇంజనీరింగ్, సర్వీసింగ్, విడిభాగాల లభ్యతకు ఎలాంటి ఢోకా ఉండదు’. - ఫిలిప్ గురిన్-బౌటాడ్, స్సాన్ గ్లోబల్ ఎల్సీవీ బిజినెస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ -
నిస్సాన్ మైక్రా.. ఆటోమేటిక్ వేరియంట్
ముంబై: నిస్సాన్ ఇండియా తాజాగా తన ప్రముఖ హ్యాచ్బ్యాక్ ‘మైక్రా’లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో కొత్త వేరియంట్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కొత్త ఇంటీరియర్స్తో కూడిన ఈ ఆటోమేటిక్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు. ఈ కొత్త వేరియంట్లో నిస్సాన్ ఎక్స్-ట్రానిక్ సీవీటీని అమర్చామని, ఇది మాన్యువల్ వేరియంట్ కన్నా అధిక మైలేజ్ను అందిస్తుందని పేర్కొన్నారు. కాగా నిస్సాన్ కంపెనీ ఈ మోడల్ను చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. దేశం నుంచి ఎగుమతి అవుతోన్న హ్యాచ్బ్యాక్ కార్లలో మైక్రాదే అగ్రస్థానం. ప్రస్తుతం మైక్రా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మార్కెట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. -
భారీగా తగ్గిన నిస్సాన్ మైక్రా కార్ల ధరలు
న్యూఢిల్లీ: జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ తమ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ల ధరలు గణనీయంగా తగ్గించింది. భారతదేశం లో విక్రయించే మైక్రా ఆటో ట్రాన్స్మిషన్ రెండు వేరియంట్ కార్ల ధరల్లో యాభైవేలకు పైగా కోత పెడుతున్నట్టు ప్రకటించింది. మైక్రా సీవీటీ ఆటోమేటిక్ ఎక్స్ ఎల్ వేరియంట్ కార్ ను రూ 54, 252 లకు తగ్గించింది. దీంతో గతంలో రూ 6,53,252కు లభ్యమయ్యే ఈ కారు ప్రస్తుతం రూ 5,99,000 కే అందుబాటులో ఉంటుంది. మైక్రా ఆలోమేటిక్ సీవీటీ-ఎక్స్ వీ ని రూ రూ 45.713 మేర తగ్గించింది. దీంతో ఈ వెహికల్ ధర రూ 7,19,213 నుంచి కింది దిగి 6,73,500 దగ్గర లభ్యమవుతోంది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలని నిస్సాన్ ప్రకటించింది. దీనిపై నిస్సాన్ మోటార్ వ్యాఖ్యానిస్తూ మెరుగైన స్థానికీకరణ నేపథ్యంలో డెలివరీ పరంగా, మంచి వేగవంతమైన, మరింత సమర్థవంతమైన మార్కెట్ సేవలు అందించకలుగుతున్నామని పేర్కొంది.మైక్రా ఉత్పత్తి ఇపుడు ఇండియాలోనే సాధ్యమవుతోందని ,అందుకే తమ కస్టమర్ల సౌకర్యార్ధం రివైజ్డ్ ధరలను అందుబాటులోకి తెచ్చామని నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు. ఇక ముందు పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్స్ లో మరింత పోటీ ధరలను ప్రవేశపెట్టనున్నామన్నారు. ఏఆర్ఏఐ పరీక్షలు ప్రకారం తమ మైక్రా సీవీటీ 19.34 కెఎంపీల్ మైలేజ్ ఇస్తుందని పేర్కొన్నారు. కాగా నిస్సాన్ మోడల్ మైక్రా ఉత్పత్తి రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యంలో చెన్నై ప్లాంట్లో 2010 లో మొదలైన సంగతి తెలిసిందే. -
30 లక్షల కార్లు రీకాల్ చేస్తున్న నిస్సాన్
టోక్యో: జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ భారీ స్థాయిలో కార్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్ బ్యాగ్స్ లో లోపం కారణంగా 30 లక్షల , 80 వేల (3.8 మిలియన్ల)పైగా కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా నార్త్ అమెరికా లో తమ వివిధ మోడళ్ల కార్లను రీకాల్ చేయనుంది. సీటు సెన్సార్ లో లోపం కారణగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర అమెరికాలో 80 శాతం ఈ కార్లను విక్రయించినట్లు తెలిపింది. సీట్ సెన్సార్ లో లోపం కారణంగా ప్యాసెంజర్ ఉనికిని గుర్తించలేకపోతోందని, అందుకే ప్రమాదం సంభవించినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ విస్తరించలేక పోతున్నాయని పేర్కొంది. నిస్సాన్ అల్టిమా, లీఫ్,మాక్సిమా, మురానో, పాత్ ఫూండర్, సెంట్రా, రోగ్ తదితర మోడళ్ల కార్లు ఇందులో ఉన్నాయి. ఈ లోపాలను సవరించి, ఈ మే చివరలో డీలర్స్ కు తెలియజేస్తామని తెలిపింది. అయితే గతంలో ఎయిర్ బ్యాగ్ లోపం మూలంగా 11 మరణాలు సంభవించాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో దిగ్గజం టకాటా ఆటో భాగాలా కాదా అనేది స్పష్టత లేదు. -
డాట్సన్ ‘రెడి-గో’
ధర 2.5 లక్షలు రేపటి నుంచి బుకింగ్స్; జూన్లో డెలివరీ న్యూఢిల్లీ: జపాన్ దిగ్గజ వాహన కంపెనీ నిస్సాన్ తాజాగా తన ‘డాట్సన్ బ్రాండ్’ కింద మరొక కొత్త కాంపాక్ట్ కారు ‘రెడి-గో’ను మార్కెట్లోకి తీసుకురానున్నది. దీని ధర రూ.2.5 లక్షలు-3.5 లక్షల శ్రేణిలో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ‘రెడి-గో’ ముందస్తు బుకింగ్స్ మే నెల 1 నుంచి ప్రారంభమౌతాయని, వీటి డెలివరీ జూన్ నెల నుంచి ఉంటుందని తెలిపింది. వినియోగదారులు ‘రెడి-గో’ కార్లను ఆఫ్లైన్లోనైతే నిస్సాన్ డీలర్షిప్స్ వద్ద (రూ.5,000 డౌన్ పేమెంట్తో), ఆన్లైన్లో స్నాప్డీల్లో బుకింగ్ చేసుకోవచ్చని వివరించింది. ఇక ఎక్స్ షోరూమ్ ధర, వేరియంట్స్ తదితర వివరాలను కారు విడుదల సమయం(జూన్)లో వెల్లడిస్తామని తెలిపింది. ‘ముఖ్యంగా యువతకు చేరువకావడమే లక్ష్యంగా.. ఎప్పటికప్పుడు కొత్త కార్లు తీసుకొస్తున్నాం’ అని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. -
ఊరిస్తున్న నిస్సాన్ కాంపాక్ట్ కారు
న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం నిస్పాన్ కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్ లో తన మూడవ మోడల్ కారుని లాంచ్ చేసింది. 2014, 15 సం.రాల్లో గో, గో ప్లస్ రెండు కార్లను లాంచ్ చేసిన నిస్పాన్ తాజాగా డాట్సన్ బ్రాండ్ కింద ఓ కొత్తకారును ఆవిష్కరించింది. చిరు ఉద్యోగులకు, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా ఈ కాంపాక్ట్ కార్ తో వినియోగదారులను ఊరించేందుకు రడీ అవుతోంది. మారుతి ఆల్టో, హుందాయ్ ఇయాన్ లాంటి చిన్న కార్లకు పోటీగా ఈ ఏడాది జూన్ కల్లా మార్కెట్లలో హల్ చల్ చేయనుంది. రెడీ గో అనే పేరుతో వస్తున్న దీని ధరను అధికారికంగా ప్రకటించకపోయినప్నటికీ దీని ధర రూ.2.5 లక్షల నుంచి రూ.4.42 లక్షల(ఢిల్లీ ఎక్స్ షో రూం) వరకు ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మే నెలలో బుకింగ్ ప్రారంభిస్తామని కంపెనీ నిస్సాన్ ఎండీ అరుణ్ మల్హోత్రా వెల్లడించారు. జూన్ కల్లా దీన్ని వినియోగదారులకు తమ కారును డెలివరీ చేస్తామన్నారు. ఈ కార్లు కావాల్సిన వాళ్లు బుకింగ్ లు ప్రాంరభించవచ్చనీ ఈ మధ్యలో ధరని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ సీనియర్లు అంటున్నారు. మరోవైపు ఈ కార్లను కొనుక్కునేందుకు సామాన్య ప్రజానీకానికి రుణాలిచ్చే స్కీమ్ లను కూడా అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. కాగా గత ఏడాది గో ప్లస్ అనే కంపాక్ట్ అనే మల్టీ పర్పస్ కార్లను నిస్సాన్ , డాట్సన్ బ్రాండ్ తో లాంచ్ చేసింది. చిన్న చిన్ననగరాలను టార్గెట్ చేయడం ద్వారా తన కొనుగోళ్లను పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది. గత ఏడాది నిర్దేశించుకున్న 10 శాతం లక్ష్యాన్ని మిస్ అయిన నిస్సాన్, 2020 సం.రానికి కార్ల మార్కెట్ లో 5 శాతం వాటాను కొల్లగొట్టేందుకు ప్రణాళికలతో ముందు కెళుతోంది. -
మరిన్ని కంపెనీల కార్ల ధరలు పెంపు
* జాబితాలో టాటా మోటార్స్, నిస్సాన్, రెనో, స్కోడా * మోడళ్లను బట్టి 3 శాతం వరకూ వడ్డింపు న్యూఢిల్లీ: కార్ల ధరలను తాజాగా మరికొన్ని కంపెనీలు పెంచాయి. టాటా మోటార్స్, నిస్సాన్, రెనో, స్కోడా కంపెనీలు ధరలను 3 శాతం వరకూ (రూ.50,000 వరకూ) పెంచుతున్నట్లు తెలిపాయి. ఈ పెంపు వచ్చే నెల నుంచి వర్తిస్తుందని ఆ కంపెనీలు పేర్కొన్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు వివరించాయి. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల వచ్చిన ప్రతికూల ప్రభావాన్ని ఈ ధరల పెంపు కొంత ఉపశమనాన్ని ఇస్తుందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా చెప్పారు. ఈ కంపెనీ రూ.4.47 లక్షలున్న మైక్రా నుంచి రూ.12.91 లక్షలున్న ఎస్యూవీ టెర్రానో వరకూ వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. డాట్సన్ బ్రాండ్ కింద రూ.3.23 లక్షలున్న డాట్సన్ గో కారు నుంచి రూ.4.76 లక్షలున్న డాట్సన్ గో ప్లస్ కార్లను కూడా విక్రయిస్తోంది. ఇక రెనో కంపెనీ మొత్తం ఏడు మోడళ్లను భారత్లో విక్రయిస్తోంది. వీటి ధరలన్నింటినీ 3 శాతం వరకూ పెంచుతున్నామని రెనో కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ రూ.2.56 లక్షలు ఖరీదున్న క్విడ్ నుంచి రూ.23.47 లక్షల ఖరీదున్న కొలియోస్ మోడళ్లతో పాటు పల్స్, స్కేలా, డస్టర్, లాడ్జీ, ఫ్లూయెన్స్ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. మరోవైపు అన్ని మోడళ్ల ధరలను రూ. 14,000 నుంచి రూ.50,000 వరకూ పెంచుతున్నామని స్కోడా కంపెనీ పేర్కొంది. మోడళ్లను బట్టి ధరలను 2-3 శాతం రేంజ్లో పెంచుతున్నామని పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీ నాలుగు మోడళ్లను-రాపిడ్, ఆక్టేవియా, యెటి, సూపర్బ్ మోడళ్లను అమ్ముతోంది. కాగా ఇప్పటికే మారుతీ సుజుకీ,హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ కంపెనీలు కార్ల ధరలను జనవరి నుంచి పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. టాటా మోటార్స్... రూ.20,000 వరకూ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.20,000వరకూ పెంచుతున్నామని టాటా మోటార్స్ పేర్కొంది. వివిధ ఆర్థిక కారణాల వల్ల ధరలను పెంచకతప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ. 1.99 లక్షల ఖరీదున్న నానో జెనెక్స్ నుంచి రూ.15.51 లక్షల ఖరీదున్న ఆరియా వరకూ వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. -
నిస్సాన్తో ఓలా ఒప్పందం
హైదరాబాద్: వ్యక్తిగత రవాణా యాప్ ఓలా, నిస్సాన్ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా నిస్సాన్ కంపెనీ కార్లను తమ అనుబంధ సంస్థ ఓలా ఫ్లీట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెట్ కొనుగోలు చేస్తుందని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా కొనుగోలు చేసిన కార్లను తమ డ్రైవర్-భాగస్వాములకు లీజ్కు ఇస్తామని ఓలా వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ సప్లై ఇనీషియేటివ్స్) రాహుల్ మరోలి పేర్కొన్నారు. ఈ తరహా ఒప్పందాలను మరిన్ని కార్ల కంపెనీలతో కుదుర్చుకోనున్నామని తెలిపారు. -
దీపావళికల్లా డాట్సన్ 800 సీసీ
పరిశీలనలో ఎలక్ట్రిక్ కారు ‘ద లీఫ్’ కూడా... - 2020 నాటికి 5 శాతం వాటా లక్ష్యం - నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ నిస్సాన్... దేశంలో 800 సీసీ కారును దీపావళి నాటికి ఆవిష్కరించనుంది. డాట్సన్ బ్రాండ్లో ‘రెడీ గో’ పేరుతో రానున్న ఈ మోడల్ ధర వేరియంట్ను బట్టి రూ.3-5 లక్షల మధ్య ఉండొచ్చు. చైనె ్న సమీపంలో రెనో నిస్సాన్ల సంయుక్త ప్లాంటులో ఈ ఎంట్రీ లెవెల్ మోడల్ రెడీ అవుతోందని, చిన్న కార్ల తయారీకై ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్ఫామ్పై ఇది రూపుదిద్దుకుంటోందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా సోమవారం వెల్లడించారు. ఇదే ప్లాట్ఫామ్పై ఇటీవల క్విడ్ పేరుతో 800 సీసీ కారును రెనో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. నిస్సాన్ అనుబంధ బ్రాండ్ అయిన డాట్సన్ విక్రయిస్తున్న మోడళ్లు డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ రెండూ కూడా 1,198 సీసీ సామర్థ్యం గలవి. 2014-15లో భారత్లో నిస్సాన్ విక్రయించిన 50 వేల యూనిట్లలో డాట్సన్ మోడళ్ల వాటా సుమారు 18 వేల యూనిట్లుంది. లీఫ్కు సిద్ధమే కానీ.. ఎలక్ట్రిక్ కారు ‘ద లీఫ్’ మోడల్ను దేశీయ మార్కెట్లోకి తెచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు అరుణ్ మల్హోత్రా తెలియజేశారు. ఇక్కడి గచ్చిబౌలిలో వైబ్రాంట్ నిస్సాన్ షోరూంను ప్రారంభించిన అనంతరం ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ఆయన ఈ విషయాలు చెప్పారు. ద లీఫ్ విడుదలకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించటం లేదని ఆయన తెలియజేశారు. ‘చార్జింగ్ కేం ద్రాలు విరివిగా ఏర్పాటు కావాలి. అందుకు తగ్గ మౌలిక వసతులు ఉండాలి. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలి’ అని అన్నారు. ఇక కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కూడా రానుందని చెప్పారాయన. 2020 నాటికి మార్కెట్ వాటా 5 శాతం లక్ష్యంగా చేసుకున్నామని, షోరూంల సంఖ్యను మూడేళ్లలో 300 లకు విస్తరిస్తామని ఆయన వివరించారు. -
'డాట్సన్ గోను ఉపసంహరించండి'
భారతీయ మార్కెట్ల నుంచి 'డాట్సన్ గో' బ్రాండు కార్లను వెంటనే ఉపసంహరించాలని, అది ఏమాత్రం సురక్షితం కాదని అంతర్జాతీయ వాహన భద్రతా సంస్థ ఒకటి తెలిపింది. ఇటీవల జర్మనీలో డాట్సన్ గో, మారుతి స్విఫ్ట్ కార్లకు గ్లోబల్ ఎన్క్యాప్ అనే సంస్థ భద్రతకు సంబంధించిన పరీక్షలు నిర్వహించింది. కారు ముందువైపు నుంచి దేన్నయినా ఢీకొంటే పరిస్థితి ఎలా ఉంటుందో పరిశీలించారు. అయితే రెండు కార్లూ ఈ పరీక్షలో విఫలమయ్యాయి. దాంతో గ్లోబల్ ఎన్క్యాప్ నిర్వాహకులు నిస్సాన్ కంపెనీ సీఈవోకు ఓ లేఖ రాశారు. ఐక్యరాజ్యసమితి విధించిన భద్రతా ప్రమాణాలను ప్రస్తుతం ఉన్న ఈ కారు ఏమాత్రం అందుకోలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కారును భారతీయ మార్కెట్ల నుంచి వెంటనే ఉపసంహరించడమే మేలని ఆ లేఖలో సూచించారు. టాటా నానో సహా మరికొన్ని కార్లను కూడా పరీక్షించినా, ఏ ఇతర కంపెనీ సీఈవోకు ఇలా మార్కెట్ నుంచి ఉపసంహరించాలని మాత్రం సూచించలేదు. -
వ్యాపారాలకు అవరోధాలు తొలగించాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యం సాధ్యం కావాలంటే ముందుగా వ్యాపారాలకు ఆటంకాలు తొలగించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు అభిప్రాయపడ్డాయి. వ్యాపారాలకు అనువైన విధానాలు తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. వాహనాల తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) వార్షిక సదస్సులో పాల్గొన్న పలు దిగ్గజ కంపెనీలు ఈ మేరకు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. వ్యాపార అనుమతులు మొదలుకుని పన్నులు, మౌలిక సదుపాయాలు, రవాణా దాకా అనేక అంశాలు దేశీయంగా ఆటో పరిశ్రమ ఎదుగుదలకు అవరోధాలుగా ఉంటున్నాయని పేర్కొన్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించగలదని ఆశిస్తున్నట్లు జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థల అసోసియేషన్ (జేఏఎంఏ) చైర్మన్ ఫుమిహికో ఐకీ చెప్పారు. జపాన్కి చెందిన పలు ఆటోమొబైల్ విడిభాగాల సరఫరా సంస్థలు భారత్లో కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నాయని, అయితే.. ఇక్కడ అనుమతులపరమైన అంశాల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నాయన్నారు. ప్లాంటు నిర్మాణ అనుమతుల ప్రక్రియ కొన్ని సందర్భాల్లో చాలా సంక్లిష్టంగా ఉండటం వల్ల వ్యాపార ప్రణాళికలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పారు. పైగా అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పన్నుల విధానం ఉండటం కూడా సమస్యాత్మకంగా ఉంటోందని ఐకీ తెలిపారు. మరోవైపు, అన్ని రాష్ట్రాల్లో పన్నుల పరంగా ఒకే రకమైన ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వాహనాలను అందుబాటు ధరల్లో అందించడం సాధ్యపడుతుందని జనరల్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెఫాన్ జాకోబీ చెప్పారు. పారిశ్రామిక విధానాలు, నిబంధనలు దీర్ఘకాలిక ప్రాతిపదికన స్థిరంగా ఉంటే మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుందని చెప్పారు. టారిఫ్లను తగ్గించడం ద్వారా భారత్ మరిన్ని వాణిజ్యావకాశాలు అందిపుచ్చుకోవచ్చని జాకోబీ తెలిపారు. ఎల్లకాలం తోడ్పాటునివ్వలేం: వాణిజ్య శాఖ ప్రపంచవ్యాప్తంగా సుంకాలపరమైన అడ్డంకులు తొలగిపోతున్న నేపథ్యంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమకు ఎల్లకాలం టారిఫ్లపరమైన రక్షణ కల్పించడం సాధ్యం కాదని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు దేశీ కంపెనీలకు విదేశీ సంస్థల నుంచి పోటీ ఎదురవకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటోందన్నారు. ఆటో రంగం విషయంలోనే యూరోపియన్ యూనియన్తో ఎఫ్టీఏపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని ఖేర్ వివరించారు. అయితే, ఇలాంటి పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగగలదన్నది ఆలోచించాల్సిన అంశమని ఖేర్ పేర్కొన్నారు. మరోవైపు, ఆటో రంగానికి తోడ్పాటునివ్వడం కోసం ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కొనసాగించగలదని చెప్పారు. 2016 ప్రణాళిక లక్ష్యాలు మిస్.. గత మూడేళ్లలో ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ క్షీణించిన నేపథ్యంలో దేశీ ఆటోమొబైల్ సంస్థలు 2016 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో దాదాపు పాతిక శాతాన్ని సాధించలేకపోయే అవకాశాలు ఉన్నాయి. చిన్న కార్లు, ఆటో విడిభాగాలు మొదలైన వాటి ఎగుమతుల ఊతంతో ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ (ఏఎంపీ) 2006-2016 కింద 145 బిలియన్ డాలర్ల వార్షిక టర్నోవరు సాధించాలని దేశీ కంపెనీలు నిర్దేశించుకున్నాయి. అయితే ఇంకా మిగిలి ఉన్న కాలాన్ని బట్టి చూస్తే ఇందులో 20- 25 శాతం లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చని ఏసీఎంఏ, ఐసీఆర్ఏ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. డిమాండ్ పెరుగుదలకు ప్రభుత్వం గానీ తోడ్పాటు అందించగలిగితే.. ఇది 13-17 శాతానికి తగ్గొచ్చని నివేదికలో పేర్కొంది. -
డాట్సన్ మళ్లీ వచ్చెన్..
న్యూఢిల్లీ: జపాన్ వాహన దిగ్గజం, నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్ను మరలా అంతర్జాతీయ మార్కెట్లోకి తెచ్చింది. డాట్సన్ బ్రాండ్లో ఎంట్రీ లెవల్ కార్, డాట్సన్ గోను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్ తర్వాత ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ కార్లను నిస్సాన్ కంపెనీ విడుదల చేయనున్నది. ఈ కారు ధరలు రూ.3.12 లక్షల నుంచి రూ.3.70 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత డాట్సన్ బ్రాండ్ను నిస్సాన్ కంపెనీ మార్కెట్లోకి తెస్తోంది. నిస్సాన్ కంపెనీ 1980ల్లో డాట్సన్ బ్రాండ్ కార్లను విక్రయించడం ఆపేసింది. అప్పటికి 80 ఏళ్లుగా 190 దేశాల్లో 2 కోట్లకు పైగా డాట్సన్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ డాట్సన్ గో కారు రాకతో చిన్న కార్ల సెగ్మెంట్లో పోటీ తీవ్రం కానున్నదని నిపుణులంటున్నారు. ఈ కారు మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800(రూ.2.37లక్షలు-రూ.3.52 లక్షలు), ఆల్టో కే10(రూ.3.15 లక్షలు-రూ.3.31 లక్షలు), హ్యుందాయ్ ఈఆన్(రూ.2.83 లక్షలు-రూ.3.85 లక్షలు)లకు గట్టి పోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లలో మూడు మోడళ్లు.. భారత కార్ల మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్లోకి డాట్సన్ బ్రాండ్తో ప్రవేశిస్తున్నామని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో కెనిచిరో యోముర చెప్పారు. నిస్సాన్ కంపెనీ మొత్తం భవిష్యత్తు అమ్మకాల్లో డాట్సన్ అమ్మకాలు సగం నుంచి మూడో వంతు వరకూ ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. రెండేళ్లలో మూడు డాట్సన్ మోడళ్లను అందించనున్నామని, త్వరలో రెండో మోడల్ డాట్సన్ గో ప్లస్ను తేనున్నామని పేర్కొన్నారు. భారత్, రష్యా, బ్రెజిల్ వంటి అధిక వృద్ధి ఉన్న దేశాల్లో తొలిసారిగా కార్లను కొనుగోలు చేసే వినియోగదారుల కారణంగా కొత్త కార్లకు డిమాండ్ పెరుగుతోందని డాట్సన్ గ్లోబల్ ప్రోగ్రామ్ డెరైక్టర్ అశ్విని గుప్తా చెప్పారు. అందుకే తొలిసారిగా కార్లు కొనే వినియోగదారులు లక్ష్యంగా ఈ కారును అందిస్తున్నామని వివరించారు. కారు ప్రత్యేకతలు... ఐదు డోర్ల ఫ్రంట్ వీల్ డ్రైవ్ డాట్సన్ గో కారులో 1.2 లీటర్ల ఇంజిన్, 5 గేర్లు(మాన్యువల్), టిల్ట్ ఎడ్జెస్ట్మెంట్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోలు, మొబైల్ డాకింగ్ స్టేషన్, 4 ఏసీ వెంట్లు, ఫాలో మి హెడ్ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. పెట్రోల్ మోడల్ డాట్సన్ గో కారు డి, ఏ, టీ... మూడు వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. నిస్సాన్ మైక్రా ఇంజిన్నే దీంట్లోనూ వాడారు. 0-100 కి.మీ వేగాన్ని 15-16 సెకన్లలో అందుకోగల ఈ కారు 20.64 కిమీ మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది. ఈ సెగ్మెంట్ హ్యాచ్బాక్ కార్లలో విశాలమైన స్పేస్ (బూట్ స్పేస్ 296 లీటర్లు)ఉన్న కారు ఇదని కంపెనీ పేర్కొంది. ముందు సీట్లు కలిసి ఉండడం వల్ల స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఏబీఎస్, ఎయిర్బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు మాత్రం లేవు. -
ధరల తగ్గింపు బాటలో మరిన్ని వాహన కంపెనీలు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ కోత తగ్గింపు కారణంగా పలు వాహన కంపెనీల ధరలను తగ్గిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, వీఈ కమర్షియల్ వెహికల్స్, యమహా, టీవీఎస్లు చేరాయి. టాటా తగ్గింపు లక్షన్నర వరకూ టాటా మోటార్స్ కంపెనీ వాహనాల ధరలను రూ. 1.5 లక్ష వరకూ తగ్గించింది. తమ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.6,300-రూ.69,000 వరకూ తగ్గించామని, అలాగే వాణిజ్య వాహనాల ధరలను రూ.15,000-రూ.1,50,000 వరకూ తగ్గించామని కంపెనీ పేర్కొంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులందించడానికి ఈ ధరలు తగ్గించామని వివరించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోర్డ్ కోత రూ.1.07 లక్షల వరకూ తమ వాహనాలపై రూ. 23,399 నుంచి రూ.1.07 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నామని ఫోర్డ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఫోర్ట్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించింది. వీఈ కమర్షియల్..: ఐషర్ ట్రక్కులు, బస్సులపై ధరలను తగ్గిస్తున్నామని వీఈ కమర్షియల్ వెహికల్స్ పేర్కొంది. 4 శాతం ఎక్సైజ్ సుంకం పూర్తి తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తామని, ఈ తగ్గింపు ఈ నెల 18 (మంగళవారం) నుంచే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. యమహా ఇండియా... కంపెనీ టూవీలర్స్ ధరలను రూ.1, 033 నుంచి రూ. 3,066 వరకూ తగ్గించింది. ఎక్సైజ్ సుంకం పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించామని యమహా మోటార్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ శుక్రవారం తెలిపారు. ఈ కంపెనీ ఆల్ఫా, రే జడ్, రే స్కూటర్లను, వైబీఆర్ 110, ఎఫ్జడ్16, వైజడ్ఎఫ్ ఆర్15 మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. టీవీఎస్ తగ్గింపు రూ.3,500 వరకూ ఎక్సైజ్ సుంకం తగ్గింపును పూర్తిగా వినియోగదారులకే అందిస్తున్నామని, తమ టూవీలర్లు, త్రీ వీలర్ల ధరలను రూ.850 నుంచి రూ.3,500 వరకూ తగ్గిస్తున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్) జె. శ్రీనివాసన్ తెలిపారు. డీలర్ల దగ్గర ప్రస్తుతమున్న స్టాక్లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించారు. ఈ కంపెనీ స్టార్ సిటీ, అపాచీ ఆర్టీఆర్ బైక్లతో పాటు జూపిటర్, వెగో స్కూటర్లను విక్రయిస్తోంది. కాగా మారుతీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోక్స్వ్యాగన్, మహీంద్రా, ఫియట్, మెర్సిడెస్, ఆడి, హీరో, హోండా మోటార్ సైకిల్ కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించాయి. -
ఆన్లైన్లో నిస్సాన్ కార్లు
న్యూఢిల్లీ: నిస్సాన్ కంపెనీ ఆన్లైన్ విక్రయాలకు శ్రీకారం చుట్టింది. అన్ని నిస్సాన్ మోడళ్ల కార్లను ఇంటర్నెట్ ద్వారా విక్రయించనున్నామని హోవర్ ఆటోమోటివ్ ఇండియా డెరైక్టర్(మార్కెటింగ్) నితీష్ టిప్నిస్ సోమవారం తెలిపారు. భారత్లో నిస్సాన్ కార్లను ఈ కంపెనీయే విక్రయిస్తోంది. వినియోగదారులు ఆన్లైన్లో నచ్చిన నిస్సాన్ మోడళ్లను బుక్ చేసుకోవచ్చని, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చని నితీష్ పేర్కొన్నారు. వినియోగదారులు సమీపంలో ఉన్న నిస్సాన్ డీలర్ వద్ద డెలివరీ తీసుకోవచ్చని వివరించారు. వినియోగదారులు కార్లు కొనుగోలు చేసే ముందు ఆన్లైన్లో విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారని అందుకే ఆన్లైన్లో కొనుగోలు అవకాశాన్ని అందిస్తున్నామని తెలిపారు. కారు కొనుగోలు ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి ఆన్లైన్ కొనుగోలు ఉపకరిస్తుందని వివరించారు. ఆన్లైన్ బుకింగ్ కోసం ఆకర్షణీయమైన ఆఫర్లనందిస్తున్నామని తెలిపారు. నిస్సాన్ కంపెనీ భారత్లో మైక్రా, సన్నీ, ఇవలియా, ఎస్యూవీలు - టెర్రానో, ఎక్స్-ట్రయల్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.4.9 లక్షల నుంచి రూ.26.96 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. -
డాట్సన్ కార్లను సొంతంగానే విక్రయిస్తాం: నిస్సాన్
న్యూఢిల్లీ: త్వరలో రానున్న డాట్సన్ గో, డాట్సన్ ఇతర మోడళ్లను భారత్లో సొంతంగానే విక్రయిస్తామని నిస్సాన్ మోటార్ కంపెనీ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ కార్లను హోవర్ ఆటోమోటివ్ డీలర్లు విక్రయిస్తున్నారు. ముం దుగా డాట్సన్ గోను మార్కెట్లోకి తెస్తామని డాట్సన్ గ్లోబల్ హెడ్ విన్సెంట్ కోబీ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ మోడల్లో మరిన్ని వేరియంట్లను అందిస్తామని, వీటన్నింటినీ తాము ఏర్పాటు చేసే సొంత నెట్వర్క్ ద్వారా విక్రయిస్తామని వివరించారు. త్వరలో భారత్ మార్కెట్లోకి... నిస్సాన్ కంపెనీ డాట్సన్ గో మోడల్ను అంతర్జాతీయంగా జూలైలో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ. 4 లక్షల లోపు ఉంటుందని అంచనా. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ బ్రాండ్ను నిస్సాన్ కంపెనీ మళ్లీ మార్కెట్లోకి తెస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్లో ఈ కార్ల విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. -
అశోక్ లేలాండ్ దోస్త్ ఎక్స్ప్రెస్ వచ్చేస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ అశోక్ లేలాండ్ నెల రోజుల్లో దోస్త్ ఎక్స్ప్రెస్ను మార్కెట్లోకి తేనుంది. 13 మంది కూర్చునే వీలున్న ఈ వాహనం గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ధర రూ.5.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నిస్సాన్ మోటార్ భాగస్వామ్యంతో దోస్త్ పేరుతో తేలకపాటి రవాణా వాహనాన్ని అశోక్ లేలాండ్ రూపొందించిన సంగతి తెలిసిందే. దోస్త్ ప్లాట్ఫాంపైనే ఎక్స్ప్రెస్ను అభివృద్ధి చేశారు. అలాగే పార్ట్నర్ పేరుతో 5, 6 టన్నుల ట్రక్తోపాటు బస్లను ఆవిష్కరించనున్నారు. ఇవి జనవరిలో రోడ్లపైకి ఎక్కనున్నాయి. ఆధునిక తేలకపాటి వాణిజ్య వాహనంగా పార్ట్నర్కు ఇతర దేశాల్లో పేరుంది. ఎన్వీ 200 ప్లాట్ఫాంపై మరిన్ని వ్యాన్లను కంపెనీ ప్రవేశపెట్టనుంది. వాహనాలు కావాల్సిందే.. మాంద్యం వస్తుంది, పోతుంది. అది సహజం. వాహనాలనేవి ఎప్పటికీ అవసరమని అశోక్ లేలాండ్ లైట్ కమర్షియల్ వెహికిల్స్, డిఫెన్స్ ఈడీ నితిన్ సేథ్ అన్నారు. బుధవారమిక్కడ ‘స్టైల్’ మల్టీ పర్పస్ వాహనాన్ని రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్డీ రేట్లు తగ్గితే భారత వాహన మార్కెట్లో సంచలనాలు నమోదవుతాయని అన్నారు. కార్ల మార్కెట్లో తాము ప్రవేశించబోమని స్పష్టం చేశారు. వ్యాన్లు, ట్రక్కులు, బస్సులు మాత్రమే తయారు చేస్తామన్నారు. బీపీవో కార్యాలయాలు అధికంగా ఉన్న బెంగళురు, హైదరాబాద్లో స్టైల్ వాహనాలకు డిమాండ్ను ఆశిస్తున్నట్టు చెప్పారు. నిస్సాన్ తయారీ ఎన్వీ 200 వాహనం ఆధారంగా స్టైల్కు రూపకల్పన చేశారు. హైదరాబాద్ ఎక్స్షోరూంలో స్టైల్ ధర రూ.7.49-9.29 లక్షలుంది. బహుమతి చేరేనా.. స్టైల్ వాహనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి బహుమతిగా ఇవ్వాలని అశోక్ లేలాండ్ భావించింది. అయితే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వాహనాన్ని అందించలేకపోతున్నట్టు కంపెనీ వైస్ చైర్మన్ వి.సుమంత్రన్ చెప్పారు. అహ్మదాబాద్లో స్టైల్ విడుదల కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కంపెనీ గతంలో దోస్త్ వాహనాన్ని దేవస్థానానికి బహుమతిగా ఇచ్చింది. -
పండుగ షి'కారు'!
న్యూఢిల్లీ: వాహన మార్కెట్ మెల్లమెల్లగా పుంజుకుంటోంది. గత కొన్ని నెలలుగా అమ్మకాలు కుదేలై అల్లాడుతున్న వాహన మార్కెట్లో సెప్టెంబర్ మంచి అమ్మకాలనే సాధించింది. టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా, జనరల్ మోటార్స్ కంపెనీల అమ్మకాలు మినహా, మిగిలిన కంపెనీల అమ్మకాలు పుంజుకున్నాయి. వర్షాలు బాగా ఉండడంతో టూవీలర్ల అమ్మకాలు పెరిగాయి. హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, యమహా కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. రానున్న పండుగల సీజన్లో అమ్మకాలు బావుంటాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. ప్యాకేజీ కావాలి... రూపాయి పతనం, ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పతి వ్యయాలు పెరిగాయని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు. దీనిని తట్టుకోవడానికి మంగళవారం నుంచే ధరలు పెంచామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడం, మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండడం, తదితర కారణాల వల్ల వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉందని జీఎం ఇండియా వైస్-ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ వివరించారు. ప్రస్తుత మందగమనం నుంచి వాహన పరిశ్రమ గట్టెక్కాలంటే ప్యాకేజీ కావాల్సిందేనని ప్రవీణ్ షా పేర్కొన్నారు. ఫలితంగా వాహన పరిశ్రమతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా పురోగమిస్తుందని వివరించారు. ఇకోస్పోర్ట్ కారణంగా ఫోర్డ్ అమ్మకాలు బాగా పెరిగాయి. మారుతీ సుజుకి ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. హ్యుందాయ్ ఎగుమతులు 8 శాతం క్షీణించాయి. గత నెలలో గ్రాండ్ కారును మార్కెట్లోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది. హోండా కార్స్ దేశీయ అమ్మకాలు 88 శాతం పెరిగాయి. తమ అమేజ్, బ్రియో కార్లకు మంచి స్పందన లభిస్తోందని కంపెనీ వివరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫోర్ వీల్ వాణిజ్య వాహనాల అమ్మకాలు 2 శాతం, త్రీ వీలర్ల అమ్మకాలు 6 శాతం చొప్పున పెరిగాయి. ఎగుమతులు 12 శాతం క్షీణించాయి. మహీంద్రా ట్రాక్టర్ దేశీయ అమ్మకాలు 37 శాతం వృద్ధి చెందినప్పటికీ, ఎగుమతులు మాత్రం 39 శాతం తగ్గాయి. సెప్టెంబర్లో మంచి అమ్మకాలు సాధించామని హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్ సమీపంలోని కుకాస్లో రూ.450 కోట్లతో సెంటర్ ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డిజైన్ సంస్థ నిర్మాణాన్ని ప్రారంభించామని, ఇది 2015 మార్చికల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని వివరించారు. నిస్సాన్ ధరలు పెరిగాయ్ నిస్సాన్ కంపెనీ మైక్రా, సన్నీ మోడల్ కార్ల ధరలను 1.4 శాతం నుంచి 2.9 శాతం వరకూ పెంచింది. ఈ ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని హోవర్ ఆటోమోటివ్ ఇండియా డెరైక్టర్ (సేల్స్, మార్కెటింగ్) నితీష్ టిప్నిస్ మంగళవారం చెప్పారు. నిస్సాన్ కార్లను హోవర్ కంపెనీయే భారత్లో విక్రయిస్తోంది. రూపాయి పతనం, ముడి పదార్థాల ధరలు పెరగడం తదితర కారణాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందుకే ధరలు పెంచుతున్నామని నితీష్ వివరించారు. ధరలను స్వల్పంగానే పెంచామని.. ప్రపంచస్థాయి ప్రమాణాలున్న నిస్సాన్ కార్లను భారత్లో చౌక ధరలకే అందిస్తున్నామని పేర్కొన్నారు. రూపాయి పతనం, ఉత్పత్తి వ్యయం పెరగడం తట్టుకోలేక మారుతీ , టయోటా, జనరల్ మోటార్స్, మహీంద్రా హ్యుందాయ్ కంపెనీలు ధరలను పెంచాయి. -
మార్కెట్లోకి టెర్రానో కారు
రాజమండ్రి రూరల్, న్యూస్లైన్ : జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ రూపొందించిన టెర్రానో అనే ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ కారు గురువారం మార్కెట్లోకి విడుదలైంది. రాజమండ్రి కంటిపూడి నిస్సాన్ కార్ల షోరూమ్లో ఈ కారును రాజమండ్రి ఆర్టీవో హైమారావు చేతులమీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేతలు ఎం.జగన్, కె.వినయబాబు మాట్లాడుతూ ఈ కారు పెట్రోలు, డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతుందని చెప్పారు. డీజిల్ వెర్షన్లో లీటరుకు 20.45 కిలోమీటర్లు, పెట్రోలు వెర్షన్లో లీటరుకు 13.24 కిలో మీటర్ల మైలేజ్ వస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు వెర్షన్లలో 85 పీఎస్ ఇంజన్, 110 పీఎస్ ఇంజన్ ఆప్షన్లతో ఐదు వేరియంట్లలో ఆరు రంగుల్లో లభ్యమవుతుందని తెలిపారు. మిషన్కటింగ్ అలై వీల్స్, ఫుల్ఫంక్షనల్ టేల్ ల్యాంప్స్, స్టాండర్డ్ హెడ్ ల్యాంప్స్, కంప్లీట్ లెదర్ ఇంటీరియర్తో డిజైన్ చేయడం వలన టెర్రానో మరింత ఆకర్షణీయంగా ఉందన్నారు. టెర్రానో బుకింగ్స్ ఈనెల 9న ప్రారంభించామని తెలిపారు. కంటిపూడి నిస్సాన్ డెరైక్టర్ సీహెచ్వీ.సత్యనారాయణమూర్తి (చినబాబు), ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీరామ్మూర్తి, యర్రాప్రగడ రామకృష్ణ, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.