Parliament winter session
-
పార్లమెంట్ వద్ద గందరగోళం.. ఉభయ సభలు మధ్యాహ్ననికి వాయిదా
Parliament Session Live Updates..👉పార్లమెంట్ వెలుపల గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా. Rajya Sabha adjourned till 2 pm today amid uproar in the House over Union HM Amit Shah's statement in the House on Babsaheb Ambedkar. pic.twitter.com/j4ol3Ix4Ui— ANI (@ANI) December 19, 2024తోపులాట ఇలా జరిగింది.. 👉ఇండియా బ్లాక్, బీజేపీ నేతలు ఒకరిపైపు ఒకరు దూసుకెళ్లారు. నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో గుంపు ఏర్పడటంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతోనే ఆయన కింద పడిపోయినట్టు తెలుస్తోంది. #WATCH | MPs of INDIA bloc and BJP came to face at the Parliament premises earlier today while carrying out their respective protests over Dr BR Ambedkar.INDIA MPs are demanding an apology and resignation of Union Home Minister Amit Shah over his remarks on Babasaheb Ambedkar… pic.twitter.com/IhryQTbKoQ— ANI (@ANI) December 19, 2024 పార్లమెంట్ వద్ద తోపులాట.. బీజేపీ ఎంపీకి గాయంపార్లమెంట్ బయట కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ కింద పడిపోయారు. దీంతో, ఆయనకు కంటి వద్ద గాయమై స్వలంగా రక్తం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా బీజేపీ ఎంపీ సారంగి మాట్లాడుతూ.. తనను కాంగ్రెస్ నేత రాహుల్ తోసివేసినట్టు చెప్పారు. రాహుల్ కారణంగానే తాను గాయపడినట్టు ఆరోపించారు. #WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down...I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me..." pic.twitter.com/xhn2XOvYt4— ANI (@ANI) December 19, 2024అనంతరం, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్ లోపలికి వెళ్లే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నన్ను లాగే ప్రయత్నం జరిగింది. అనంతరం, లోపులాట చోటుచేసుకుంది. #WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "This might be on your camera. I was trying to go inside through the Parliament entrance, BJP MPs were trying to stop me, push me and threaten me. So this happened...Yes, this has happened (Mallikarjun Kharge being pushed). But we do not… https://t.co/q1RSr2BWqu pic.twitter.com/ZKDWbIY6D6— ANI (@ANI) December 19, 2024 లోక్సభ వాయిదాpic.twitter.com/Ng1cxNL4oI— LOK SABHA (@LokSabhaSectt) December 19, 2024రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేడ్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదాపడ్డాయి.పార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలుపార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటాపోటీ నిరసనలు కొనసాగుతున్నాయి.రాజ్యసభలో అంబేద్కర్పై అమిత్షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులుకాంగ్రెస్ పార్టీనే అంబేడ్కర్ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీల నిరసన#WATCH | Delhi | INDIA bloc holds protest march at Babasaheb Ambedkar statue in the Parliament complexThey will march to Makar Dwar, demanding an apology and resignation of Union Home Minister Amit Shah over his remarks on Babasaheb Ambedkar in Rajya Sabha. pic.twitter.com/4cmM90DWpY— ANI (@ANI) December 19, 2024 #WATCH | Delhi: BJP MPs protest in Parliament, alleging insult of Babasaheb Ambedkar by Congress party. pic.twitter.com/HRF2UFfucd— ANI (@ANI) December 19, 2024శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇంకా బీజేపీ చేసేదేమీ లేదు. అమిత్ షా దేశానికి హోంశాఖ మంత్రి. అంబేద్కర్పై అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన అంబేద్కర్కు క్షమాపణలు చెప్పడం నేరమేమీ కాదు కదా?. అంబేద్కర్ది దేవుడి లాంటి వ్యక్తిత్వం. దేశంలోని వెనుకబడిన వారికి గౌరవం అందించిన వ్యక్తి. అంబేద్కర్ విషయంలో అమిత్ షా తప్పుడు పదాలు ఉపయోగించారు. కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే. #WATCH | Shiv Sena (UBT) leader Sanjay Raut says, "BJP has no work left. BJP is a party which is sitting idle. Amit Shah is the Home Minister of the country. If he has made a mistake, if there was a slip of the tongue, he should apologise. There is no crime in apologising over Dr… https://t.co/JdVCWRpk0k pic.twitter.com/OTojRiNotq— ANI (@ANI) December 19, 2024 -
రాజ్యాంగాన్ని ద్వేషించినవాళ్లా పాఠాలు నేర్పేది?: ఖర్గే
రాజ్యాంగంపై చర్చ.. రాజ్యసభలోనూ నిప్పులు రాజేస్తోంది. సోమవారం పెద్దల సభలో రాజ్యాంగం చర్చ మొదలైంది. అయితే.. నెహ్రూ ప్రస్తావనతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.‘‘లోక్సభలో రాజ్యాంగ చర్చ ద్వారా ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారు. ఎలా మాట్లాడాలో ఈరోజు నేను వాళ్లకు(బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ..) చెప్పదల్చుకున్నా. నేను చదువుకుంది మున్సిపాలిటీ బడిలో. ఆమె(నిర్మలా సీతారామన్) జేఎన్యూ(జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లోనే కదా చదివింది. ఆమె హిందీగానీ, ఇంగ్లీష్గానీ మాట్లాడడం బాగుంది. ఆమె ఆర్థిక నిపుణురాలే కావొచ్చు. కానీ, ఆమె మాట్లాడే విధానమే అస్సలు బాగోలేదు... జాతీయ పతకాన్ని, అందులో అశోక చక్రాన్ని.. రాజ్యాంగాన్నే ద్వేషించినవాళ్లు.. ఇవాళ మాకు పాఠాలు చెబుతున్నారు. రాజ్యాంగం వచ్చిన కొత్తలో వాళ్లే దానిని తగలబెట్టారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన టైంలో.. రామ్లీలా మైదానంలో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ దిష్టిబొమ్మలను తగలబెట్టిన విషయాన్ని వాళ్లు మరిచిపోయారేమో!’’ అని ఆయన మండిపడ్డారు. అలాగే.. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని వాళ్లు కూడా.. ఆ పోరాటం ఎలా ఉంటుందో తమకు తెలుసంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఖర్గే సెటైర్లు వేశారు. 1949లో ఆరెస్సెస్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని, అది మనుస్మృతికి తగ్గట్లుగా లేదని ఆనాడు విమర్శించారని, రాజ్యాంగాన్నే కాకుండా మువ్వన్నెల జెండాను కూడా అంగీకరించలేదని, ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై 2002 రిపబ్లిక్ డేన తొలిసారి జాతీయ జెండా ఎగరేశారని, అదీ కోర్టు ఆదేశాల తర్వాతేనని ఖర్గే రాజ్యసభకు గుర్తు చేశారు. #WATCH | Constitution Debate | Rajya Sabha LoP #mallikarjunkharge says, “In 1949, #RSS leaders opposed the Constitution of #India because it was not based on #manusmriti. Neither did they accept the #Constitution nor the tricolour. On 26 January 2002, for the first time, the… pic.twitter.com/yLScuHkY3o— TheNews21 (@the_news_21) December 16, 2024 -
ప్రతిపక్షాల ప్రశ్నల వర్షం.. ఉభయ సభలు వాయిదా
ఢిల్లీ : గత వారం రాజ్య సభలో కరెన్సీ నోట్ల కలకలంతో వాయిదా పడ్డ ఉభయ సభలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, సభ ప్రారంభమైన కొద్ది సేపటికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరు అంశాలను లేవనెత్తడంతో స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్య సభలో సైతం ప్రతిపక్ష నేతలు ఆందోళన కొనసాగుతుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. సభాసంప్రదాయాలను పక్కన పెట్టి జగదీప్ ధనఖడ్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. జైరాం రమేష్ వ్యాఖ్యలపై జగదీప్ ధనఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను మద్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఉభసభ సమావేశాల్లో ఇవాళ మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాటిల్లో 2024 రైల్వే బిల్లు (సవరణ) , 2024 విపత్తు నిర్వహణ బిల్లు (సవరణ), 2024 బ్యాంకింగ్ చట్టాల బిల్లు (సవరణ)లు ఉన్నాయి. సభ చివరి రోజు చర్చలో తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కి కేటాయించిన సీటు వద్ద రూ.50వేల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు లభ్యమవ్వడం కలకలం రేపింది. సభలో భద్రతా అధికారుల తనిఖీల్లో ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి అంటూ భారత ఉపరాష్ట్ర పతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ప్రకటించారు. విచారణకు ఆదేశించింది. ఈ ప్రకటనపై ఉభసభల్లో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కరెన్సీ నోట్లు ఎవరివో తేల్చకుండా సింఘ్వీకి కేటాయించిన సీటు వద్ద కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని ఎలా చెప్తారంటూ ప్రశ్నించాయి. దీనిపై ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి మొదలై డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి. -
పార్లమెంట్లో అదే రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో చెలరేగిన హింస, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా పార్లమెంట్లో ఇదే పరిస్థితి కొనసాగింది. శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. భారత్-చైనా సరిహద్దు ఒప్పందం పురోగతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్సభలో ప్రకటన చేస్తారని ముందుగా భావించారు. కానీ ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభాల్లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటల వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు రేపటికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి. -
Parliament Session: ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి(శుక్రవారం) వాయిదా పడ్డాయి. అటు లోక్సభ, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అదాని గ్రూప్ అవినీతి ఆరోపణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను వాయిదావేశారు. పార్లమెంట్ ఉభయ సభలు 12గంటల వరకూ వాయిదా పడ్డాయి.లోక్సభ స్పీకర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో కేరళలోని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు వచ్చిన ఆమె.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. #WATCH | Delhi: Congress MP Shashi Tharoor says, " I am delighted as we had campaigned for her. I am happy that she won...as you can see, she is appropriately dressed in a Kerala saree" pic.twitter.com/MFoJPaf4dj— ANI (@ANI) November 28, 2024 కాగా తాజాగా వెలువడిన లోక్సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ నాలుగు లక్షలకుపైగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టనుండగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్సభలో కూర్చోనున్నారు. వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించేందుకు నవంబర్ 29న గడువును పొడిగిస్తూ ప్రతిపాదనను సమర్పించనుంది.ఇక నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజు నుంచి స్తంభిస్తూనే ఉన్నాయి. ఉభయ సభలు రోజంతా వాయిదా పడుతున్నాయి. మణిపూర్ హింస, సంభాల్ హింస సహా పలు సమస్యలపై ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో రోజు సభ జరగలేదు. మూడో రోజు ఉభయ సభలు గంట వ్యవధిలో వాయిదా పడ్డాయి. -
‘సోషల్ మీడియా నిర్బంధాలపై పార్లమెంట్లో చర్చిస్తాం’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. 41a నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయటంపై గట్టిగా నిలదీస్తామన్నారు. చట్టాలను అమలు చేయనప్పుడు ఇక ఆ చట్టాలు ఎందుకని గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు..గురువారం వైఎస్ జగన్తో వైఎస్సార్సీపీ రాజ్యసభ, లోక్సభ ఎంపీలు గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. పోలవరం ఎత్తును తగ్గించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళన చేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని, ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బలం ఉందని పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. పార్లమెంటును స్తంభింపచేయటానికి కూడా వెనుకాడమన్నారు. -
ఈనెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నవంబర్ 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం.. వక్ఫ్ బిల్లు ఆమోదానికి పెట్టే అవకాశం ఉంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 26న జాయింట్ పార్లమెంట్ సెషన్ ఉండనుంది. ఇక, డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లుకు ఆమోదానికి పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ప్రజాస్వామ్యం గొంతు నులిమారు: సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లో విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీల సస్పెన్షన్ వేటుపై కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ చర్య ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నులిమిందన్నారామె. బుధవారం ఉదయం సెంట్రల్ హాల్లో ఆమె అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పార్టమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఘటన పరిణామాలు, తదనంతరం రెండు సభల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ఈ సందర్భంగా ఆమె సభ్యులతో చర్చించారు. ‘‘సహేతుకమైన, న్యాయబద్ధమైన డిమాండ్ కోసం విపక్షాలు పోరాడుతున్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం సభ్యుల్ని సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమి ఖూనీ చేసింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు’’ అని అన్నారామె. డిసెంబర్ 13వ తేదీన జరిగిన అసాధారణ పరిస్థితులపై హోం మంత్రి అమిత్ షా నుంచి వివరణ కోరుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విజ్ఞప్తిలో కేంద్రానికి వచ్చిన అభ్యంతరం ఏంటన్నది అర్థం కావడం లేదని అన్నారామె. తెలంగాణలో విజయంపై శుభాకాంక్షలు: సోనియా ‘‘అసెంబ్లీ ఎన్నికలకు అంకితభావంతో, దృఢ సంకల్పంతో పని చేస్తున్నందుకు తెలంగాణలోని మనపార్టీ సహచరులకు అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలు మనకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెరవేర్చేందుకు మన శక్తిమేరకు కృషి చేయాలి. ఈ పార్లమెంట్ సెషన్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పొందుపరచింది. దాని గురించి గొప్పగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చడానికి తొమ్మిది సంవత్సరాల పాటు తీసుకుంది. -
లోక్సభ అలజడి ఘటన.. మరో అరెస్ట్
ఢిల్లీ: లోక్సభ అలజడి ఘటన కేసులో మరో వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన మహేష్ కుమావత్ అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. గంట సేపు ప్రశ్నించిన అనంతరం.. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ ప్రకటన చేశారు. ఈ కుట్రలో మహేష్ కూడా భాగం అయ్యాడని పేర్కొంటూ.. కేసులో ఆరో నిందితుడిగా అతని పేరును చేర్చారు. రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన మహేష్.. ఘటన జరిగిన తేదీన ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నలుగురిని తొలుత అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు సహకరించడం, వాళ్ల ఫోన్లను ధ్వంసం చేయడం లాంటి అభియోగాల మీద లలిత్ ఝా అనే వ్యక్తిని ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్ర కేసులో లలిత్నే కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ లొంగుబాటు గురువారం లలిత్తో పాటు మహేష్ కూడా లొంగిపోయినట్లు తెలుస్తోంది. లలిత్ అరెస్ట్ను శుక్రవారం పోలీసులు నిర్ధారించగా.. మహేష్ను, అతని బంధువు కైలాష్ను సైతం ప్రశ్నించిన పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అయితే శనివారం మరోసారి మహేష్ను ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాతే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. పార్లమెంటులో ఘటనల అనంతరం లలిత్ ఝా ఢిల్లీ నుంచి రాజస్థాన్కు పారిపోయాడు. అక్కడ మహేష్ అతనికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నలుగురు నిందితుల ఫోన్లను ధ్వంసం చేసేందుకు లలిత్కు మహేష్ సహకరించాడని పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. లలిత్తో పాటు మహేష్ను కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఢిల్లీ నుంచి రాజస్థాన్లో వాళ్లు తిరిగిన ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. అలాగే.. పార్లమెంట్లోనూ ‘సీన్ రీక్రియేషన్’ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో ప్లాన్తో.. పార్లమెంట్ శీతాకాల సమాశాల్లో భాగంగా.. డిసెంబర్ 13వ తేదీన లోక్సభలో జీరో అవర్ కొనసాగుతుండగా ఒక్కసారిగా అలజడి రేగింది. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి వెల్ వైపుగా దూసుకెళ్లే యత్నం చేశారు. అయితే నిలువరించిన ఎంపీలు.. వాళ్లను చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈలోపు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కలర్ స్మోక్ షెల్స్ను ప్రయోగించారు. అదే సమయంలో బయట కూడా ఇద్దరు నిరసన వ్యక్తం చేస్తూ కనిపించారు. వాళ్లనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నిందితులు విస్తూపోయే వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. లోక్సభలో అలజడి ఘటనలో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. చివరకు ఆ ప్రయత్నాలను విరమించి, బుధవారం అమలు చేసిన ప్లాన్తో ముందుకెళ్లినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ఇద్దరు నిందితులకు విజిటర్ పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. -
పార్లమెంట్ భద్రత ఎవరి బాధ్యతో తెలుసా?
అది దేశ చట్టసభ్యులు సమావేశం అయ్యే చోటు. అత్యున్నత చట్టాల రూపకల్పన.. పాత వాటికి సవరణలు జరిగే చోటు. కాబట్టి.. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని అంతా భావించడం సహజం. కానీ, రెండు దశాబ్దాల కిందట పార్లమెంట్ మీదే జరిగిన ఉగ్రదాడి భారత్కు మాయని మచ్చని మిగిల్చింది. మళ్లీ అదే తేదీన, కొత్తగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంట్ వద్ద మళ్లీ అలాంటి అలజడే ఒకటి చెరేగింది. ఏకంగా దిగువ సభ లోపల ఆగంతకులు దాడికి దిగడంతో ‘పార్లమెంట్లో భద్రతా తీవ్ర వైఫల్యం’ గురించి చర్చ నడుస్తోంది. ఇక్కడ దాడి జరిగింది లోక్సభలోనా? రాజ్యసభలోనా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం అనేది తీవ్రమైన అంశం. ఇంత విస్తృతమైన భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? భద్రతా ఉల్లంఘనకు ఎలా పాల్పడ్డారు? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.. లోక్సభ ఘటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసిన ఆందోళన. ఈ వాదనకు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ సైతం సానుకూల స్థాయిలోనే స్పందించడం గమనార్హం. ఇంతకీ పార్లమెంట్ భద్రతను పర్యవేక్షించాల్సింది ఎవరు?.. ఢిల్లీ పోలీసులా? కేంద్ర బలగాలా?.. మొత్తం దానిదే! తాజా పార్లమెంట్ దాడి ఘటన నేపథ్యంలో ఓ సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ఈ అంశంపై స్పందించారు. పార్లమెంట్ బయట వరకే భద్రత కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యత. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భద్రత మాత్రం ఢిల్లీ పోలీసుల పరిధిలోకి రాదు. అయితే లోపలి భద్రతను మొత్తం పర్యవేక్షించేది పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్(Parliament Security Services..PSS). పీఎస్ఎస్ సీఆర్పీఎఫ్గానీ, మరేయిత కేంద్ర బలగాల సమన్వయంతో అంతర్గత భద్రత పర్యవేక్షిస్తుంటుంది. బహుశా ఇవాళ్టి ఘటనలో నిందితుల్ని వాళ్లే అదుపులోకి తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. ఈ అధికారి వ్యాఖ్యలకు తగ్గట్లే.. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేదాకా నిందితులు పార్లమెంట్ భద్రతా సిబ్బంది అదుపులోనే ఉన్నారు. ఆపై వాళ్లకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకీ భద్రతా సంస్థల కలగలుపు పీఎస్ఎస్ ఎలా పని చేస్తుందంటే.. పీఎస్ఎస్ చరిత్ర పెద్దదే.. 1929 ఏప్రిల్ 8వ తేదీన అప్పటి పార్లమెంట్ భవనం సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి జరిగింది. ఆ దాడి తర్వాత అప్పుడు సీఎల్ఏకు అధ్యక్షుడిగా ఉన్న విఠల్భాయ్ పటేల్ చట్ట సభ, అందులోని సభ్యుల భద్రత కోసం సెప్టెంబర్ నెలలో ‘వాచ్ అండ్ వార్డ్’ పేరిట ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ సర్ జేమ్స్ క్రెరార్ ‘డోర్ కీపర్ అండ్ మెసేంజర్స్’ పేరిట 21 మంది సిబ్బందిని చట్టసభ కాంప్లెక్స్లో నియమించాలని ప్రతిపాదించారు. భద్రతతో పాటు చట్ట సభ్యులకు ఏదైనా సమాచారం అందించాలన్నా వీళ్ల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారాయన. అయితే.. ఆ ప్రతిపాదనకు తగ్గట్లే అప్పటి ఢిల్లీ మెట్రోపాలిటన్ పోలీస్ వ్యవస్థ నుంచి పాతిక మందిని సిబ్బందిగా, వాళ్లను పర్యవేక్షించేందుకు ఓ అధికారిని నియమించారు. అలా ఏర్పడిన భద్రతా విభాగం.. ఆ తర్వాత స్వతంత్ర భారతంలోనూ దశాబ్దాల తరబడి కొనసాగింది. క్రమక్రమంగా అందులో సిబ్బంది సంఖ్య పెరగడం, ఇతర బలగాలతో సమన్వయం వాచ్ అండ్ వార్డ్ తన విధుల్ని కొనసాగిస్తూ వచ్చింది. చివరకు.. అన్నింటా కీలకంగా.. .. 2009 ఏప్రిల్ 19వ తేదీన వాచ్ అండ్ వార్డ్ను పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్గా పేరు మార్చారు. భారతదేశ చట్ట సభ పార్లమెంట్ భవనం భద్రతను పూర్తిగా పర్యవేక్షించేది పీఎస్ఎస్. పార్లమెంట్ లోపలికి వచ్చే వాహనాలను.. వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం దగ్గరి నుంచి బయటకు వెళ్లేదాకా పూర్తి పనులు కూడా ఈ విభాగం పరిధిలోకే వస్తాయి. స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలో భారత సైన్యం, ఢిల్లీ పోలీసులతో కలిసి పీఎస్ఎస్ భద్రత కల్పిస్తుంది. రాష్ట్రపతుల ప్రమాణ స్వీకార సమయంలో రాష్ట్రపతి భవన్ వద్ద.. అలాగే ఎట్ హోమ్ కార్యక్రమాలకు భద్రత ఇచ్చేది పీఎస్ఎస్సే. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో దీని పాత్ర గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఎన్నికల సంఘం, విమానాయన శాఖ(చట్ట సభ్యుల రాకపోకలు.. బ్యాలెట్ బాక్సుల తరలింపు), భద్రతా బలగాలతో కలిసి రాష్ట్రపతి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో పీఎస్ఎస్దే కీలక పాత్ర. అలాగే.. ఎంపీలతో పాటు పార్లమెంట్కు వచ్చే వీఐపీలు, వీవీఐపీల భద్రత, స్టడీ టూర్ల మీద వచ్చే విద్యార్థులు, సందర్శించే విదేశీయులు, సాధారణ సందర్శకుల భద్రత కూడా పీఎస్ఎస్ చూసుకుంటుంది. స్వతంత్రంగా పని చేయదు.. పీఎస్ఎస్ అనేది పార్లమెంట్ భవనం పూర్తి కాంప్లెక్స్ భద్రతను పర్యవేక్షించే ఒక నోడల్ భద్రతా సంస్థ. ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్/సీఆర్పీఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్పీజీ, ఎన్ఎస్జీలు పార్లమెంట్ పరిధిలో పీఎస్ఎస్ సమన్వయంతోనే పని చేస్తుంటాయి. అలాగని ఇది స్వతంత్రంగా పని చేయదు. పార్లమెంట్ భద్రతా విభాగం సంయుక్త కార్యదర్శి పీఎస్ఎస్కు హెడ్గా ఉంటారు. లోక్సభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ (సెక్యూరిటీ), రాజ్యసభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ(సెక్యూరిటీ) విడివిడిగా వాళ్ల వాళ్ల పరిధిలో పీఎస్ఎస్ పనితీరును పర్యేవేక్షిస్తారు. పీఎస్ఎస్లో సిబ్బందిని డిప్యూటేషన్ మీద ఇతర విధులకు కూడా పంపిస్తుంటారు. అయితే అది పార్లమెంట్ పరిధిలోనే. పార్లమెంట్ విరామ సమయాల్లో సందర్శన కోసం వచ్చే విద్యార్థులకు, విదేశీయులకు పార్లమెంట్ చరిత్ర, గొప్పదనం గురించి, అలాగే అక్కడ ఏర్పాటు చేసే మహోన్నత వ్యక్తుల విగ్రహాల(వాళ్ల గురించి..) వివరించడం లాంటి బాధ్యతలు అప్పగిస్తుంటుంది. పార్లమెంటరీ గార్డ్ డైరెక్టరేట్తో పాటు సభ లోపలి మార్షల్స్ కూడా పీఎస్ఎస్ పరిధిలోకే వస్తారు. మూడంచెల తనిఖీలు.. పార్లమెంట్ భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్కు వచ్చే సిబ్బంది, విజిటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ భవనం వద్ద ఉన్న ఎంట్రీ గేట్ వద్ద మరోసారి చెకింగ్స్ నిర్వహిస్తారు. చివరగా విజిటర్స్ గ్యాలరీ వెళ్లే మార్గంలోని కారిడార్లో మూడోసారి తనిఖీలు చేస్తారు. ఇక, పార్లమెంట్లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా శిక్షణ ఇస్తారు. పార్లమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీకార్డులు ధరించాలి. ఇక, సమయానుసారం సిబ్బందికి కూడా భద్రతా తనిఖీలు చేస్తారు. ఇక మెటల్ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు, బాడీ స్కానర్ల వంటి అధునాతన గ్యాడ్జెట్స్తో పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేశారు. అలా ఎలా..? సాధారణ విజిటర్ పాస్ల మీదే సందర్శకులు పార్లమెంట్కు వస్తుంటారు. ఈ పాస్లు జారీ చేసేముందు బ్యాక్గ్రౌండ్ చెక్ కచ్చితంగా జరుగుతుంది. అందులో ఏమాత్రం లోటుపాట్లు కనిపించినా పాస్లు జారీ చేయరు. ప్రస్తుత దాడి ఘటనలో ఓ ఎంపీ పేరు మీద ఒక నిందితుడి పాస్ తీసుకున్నట్లు తేలింది. ఆ సంగతి పక్కన పెడితే.. పార్లమెంట్ భవనం లోపల సెక్యూరిటీ చెకింగ్లు, స్కానర్లు ఉండనే ఉంటాయి. హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉండే పార్లమెంట్ భవనం అన్ని వైపులా సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది. మరి ఇన్నీ దాటుకుని ఆ ఇద్దరు స్మోక్ షెల్స్తో ఎలా రాగలిగారనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. నాడు జరిగింది ఇదే.. 2001 డిసెంబర్ 13వ తేదీ గుర్తుందా?.. పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగిన రోజు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు. అప్పటి నుంచి పార్లమెంట్ భవనం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటోంది. అయితే డిసెంబర్ 13, 2023 నాటి ఘటన కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. అదీ హైటెక్ హంగులతో, అత్యాధునిక సెక్యూరిటీ ఏర్పాట్లతో ఉంది. అయినా ఈ దాడి జరగడంపైనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
Parliment Attack: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం..లోక్ సభలో కి దూకిన ఇద్దరు ఆగంతుకులు (ఫొటోలు)
-
లోక్సభ ఘటన.. పక్కా స్కెచ్తోనే ఎంట్రీ!
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఇద్దరు యువకులు.. లోక్సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో టియర్గ్యాస్ను ప్రయోగించారు వాళ్లు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. 👉పాస్లు ఎలా పొందారసలు? 🔺సభా కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ లోక్సభలోకి దూసుకొచ్చిన దుండుగులు 🔺సందర్శకులుగా వచ్చి దాడికి పాల్పడ్డ దుండగులు 🔺ప్రస్తుతానికి విజిటర్స్ పాస్ల జారీపై స్పీకర్ నిషేధం 🔺ఎవరైనా పార్లమెంట్ను సందర్శించాలనుకుంటే.. 🔺నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడి పేరు మీద అభ్యర్థన చేసుకోవాలి 🔺మొదట ఎంపీలు ఈ అభ్యర్థన చేసుకున్న వ్యక్తులు సమర్పించిన గుర్తింపు కార్డులు తనిఖీ చేస్తారు 🔺భద్రతాపరమైన పరిశీలన కూడా ఉంటుంది 🔺పార్లమెంట్ కార్యకలాపాలు వీక్షించేందుకు మూడు అంచెల భద్రతా వ్యవస్థను దాటాలి 🔺పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద మోహరించిన సిబ్బంది, ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా కఠినమైన భద్రతా తనిఖీ తర్వాతే వారు లోపలికి వెళ్తారు 🔺ప్రస్తుతం విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు దుండగులది కర్ణాటక 🔺మైసూర్ ఎంపీ ప్రతాప్ పేరు మీద జారీ అయిన పాస్లు 🔺దీంతో రాజకీయ విమర్శలు 🔺పాస్లు జారీ బాధ్యతారాహిత్యమని.. క్షమార్హమైంది కాదంటున్న విపక్షాలు 🔺పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వాదన వినిపించనున్న బీజేపీ ఎంపీ 🔺కొత్త పార్లమెంట్ వీక్షిస్తామనే వంకతో వారు పాస్లు పొందినట్లు సమాచారం 🔺మూడు నెలలపాటు ప్రయత్నించి ఈ పాస్ పొందినట్లు గుర్తింపు 👉రాజకీయం తగదు: కేంద్ర మంత్రి గోయల్ 🔺లోక్సభ ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటున్న విపక్షాలు 🔺రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ 🔺దాడి జరిగింది లోక్సభనా? రాజ్యసభనా? అని చూడొద్దంటున్న విపక్షాలు 🔺ఘటనపై ఎప్పటికప్పటి సమాచారం.. దర్యాప్తు వివరాలను తెలియజేస్తానని సభ్యులకు రాజ్యసభ చైర్మన్ హామీ 🔺అయినా తగ్గని సభ్యులు 🔺హోం మంత్రి ప్రకటనకై పట్టు 🔺విపక్ష సభ్యుల డిమాండ్ను తోసిపుచ్చిన పీయూష్ గోయల్ 🔺పెద్దల సభ.. హుందాగా ఉండాలని పిలుపు 🔺ఇలాంటి సమయాల్లో మనమంతా ఐక్యమనే సందేశాన్ని ఇవ్వాలన్న గోయల్ 🔺కాంగ్రెస్, విపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని మండిపాటు 🔺ఇది మంచి సందేశం కాదని విమర్శ 👉 దర్యాప్తులో కీలక విషయాలు 🔺పార్లమెంట్ దాడి ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి 🔺నిందితులు మొత్తం ఆరుగురిగా తేల్చిన అధికారులు 🔺పరారీలో మరో ఇద్దరు 🔺ఇప్పటికే పోలీసుల అదుపులో నలుగురు 🔺పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు 🔺నాలుగు నెలల కిందటే దాడికి ప్లాన్ గీసినట్లు సమాచారం 🔺పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం 👉 ఫుల్బాడీ స్కానర్లు పెట్టండి: లోక్సభ స్పీకర్ 🔺హోంశాఖకార్యదర్శికి స్పీకర్ ఓం బిర్లా లేఖ 🔺పార్లమెంట్ సెక్యూరిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలి 🔺ఎంట్రీ గేట్ల వద్ద ఫుల్ బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాలి 🔺పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను పెంచాలని లేఖలో కోరిన స్పీకర్ 🔺పార్లమెంట్ లోక్సభ దాడి ఘటనపై సన్సద్మార్గ్లోని పీఎస్లో కేసు నమోదు 👉 ముగిసిన అఖిలపక్ష సమావేశం 🔺పార్లమెంట్ సెక్యూరిటీపై సభ్యుల ఆందోళన 🔺హైపవర్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం 👉 లోపలా బయట ఆధారాల సేకరణ 🔺లోక్సభ ఘటన నేపథ్యంలో పార్లమెంట్కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం 🔺పార్లమెంట్ లోపలా, బయట ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం 🔺నలుగురు నిందితుల్ని విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు 🔺రాత్రికల్లా దాడి గురించి స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం 👉 పార్లమెంట్లో మొదలైన అఖిలపక్ష సమావేశం 🔺లోక్సభ ఘటన నేపథ్యంలో పార్లమెంట్లో జరుగుతున్న అఖిలపక్ష సమావేశం 🔺వివిధ పార్టీల నుంచి హాజరైన లోక్సభ, రాజ్యసభ నేతలు 🔺భద్రతా వైఫల్యం, ఘటన కారణాలపై సమీక్ష 🔺రాజ్యసభలోనూ దాడి ఘటనను ప్రముఖంగా చర్చించిన కాంగ్రెస్ 👉ఎత్తు తగ్గించడం వల్లే..: ఎంపీ గోరంట్ల మాధవ్ 🔺స్పీకర్ చైర్ వైపు అగంతకుడు దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు 🔺దాడి చేసే ప్రయత్నం చేశాడు 🔺అతను బెంచీలు దాటుకొని వచ్చే ప్రయత్నం చేశారు 🔺ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నా 🔺పట్టుకున్న వెంటనే బూట్ల నుంచి టియర్ గ్యాస్ బయటకు తీశారు 🔺సందర్శకుల గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్ల సులభంగా లోపలికి ప్రవేశించాడు 🔺సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలి 🔺ఇది కచ్చితంగా తీవ్రమైన భద్రత వైఫల్యమే 🔺లోక్సభలో అలజడి సృష్టించిన అగంతకుడిని పట్టుకున్న వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ 🔺ఎదురుగా వెళ్లి అగంతకుడిని పట్టుకున్న మాధవ్ 🔺మాధవ్తో పాటు ఎంపీ గుర్జిత్, ఇతర ఎంపీలు కూడా ఆగంతకుల్ని నిలువరించే యత్నం 🔺పార్లమెంట్కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం VIDEO | Forensics team arrives at Parliament following a security breach inside Lok Sabha earlier today. pic.twitter.com/4jnUIzmweP — Press Trust of India (@PTI_News) December 13, 2023 👉బీజేపీ ఎంపీ పేరు మీదే పాస్! 🔺మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పేరు మీద పాస్ తీసుకున్న సాగర్ శర్మ! 🔺వివేకానంద ఇనిస్టిట్యూట్లో చదువుతున్న సాగర్ శర్మ, మనోరంజన్లు 🔺బెంగళూరు వెళ్తున్నామని చెప్పి మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయల్దేరిన ఈ ఇద్దరూ 🔺బీజేపీ మైసూర్ ఎంపీ పేరు మీద విజిటర్స్ పాస్ తీసుకున్న వైనం 🔺విజిటర్స్ పాస్లు రద్దు చేసిన స్పీకర్ 👉లోక్సభ ఘటన నిందితుల గుర్తింపు 🔺పార్లమెంట్ లోపల దాడికి పాల్పడిన ఇద్దరు ఆగంతకుల్ని గుర్తించిన ఢిల్లీ పోలీసులు 🔺సాగర్ శర్మ, మనోరంజన్గా గుర్తింపు 🔺బయట రంగుల టియర్గ్యాస్తో నినాదాలు చేసింది నీలమ్కౌర్(హిస్సార్-హర్యానా), ఆమోల్ షిండే(లాతూర్-మహారాష్ట్ర)గా గుర్తింపు 🔺పోలీసుల అదుపులో ఈ నలుగురు 🔺ప్రశ్నిస్తున్న ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు 🔺దాడికి గల కారణాలపై ఆరా ఇదీ చదవండి: లోక్సభలో టియర్ గ్యాస్ అలజడి..పరుగులు తీసిన ఎంపీలు 👉 కాసేపట్లో అఖిలపక్ష భేటీ 🔺పార్లమెంట్లో దాడి ఘటనపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం 🔺భద్రతా వైఫల్యం, ఘటనకు కారణాలపై సమీక్ష 🔺ఇప్పటికే పార్లమెంట్కు చేరుకున్న ఢిల్లీ సీపీ, హోం సెక్రటరీ అజయ్భల్లా 🔺 దాడి ఘటనతో విజిటర్ పాస్స్ రద్దు చేసిన స్పీకర్ Lok Sabha Speaker Om Birla to meet with Floor leaders of different political parties at 4pm today, over the security breach incident. (file photo) pic.twitter.com/gdp5R6v3wL — ANI (@ANI) December 13, 2023 జీరో అవర్ జరుగుతుండగా గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే యత్నం చేశారు. బూట్లలో రంగుల టియర్గ్యాస్ బుల్లెట్లను బయటకు తీసి ప్రయోగించారు. లోక్సభలో ‘జైభీమ్, భారత్ మాతాకీ జై’ తానా షాహీ బంద్ కరో.. నినాదాలు చేస్తూ వెల్ వైపు వెళ్లేందుకు యత్నించారు. ఆగంతకుల చర్యతో బిత్తరపోయారు ఎంపీలంతా. అయితే అప్పటికే ఎంపీలు, భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యి వాళ్లను పట్టుకున్నారు. ఎంపీల ఆందోళనతో కాసేపు సభను వాయిదా వేశారు స్పీకర్. #WATCH | An unidentified man jumps from the visitor's gallery of Lok Sabha after which there was a slight commotion and the House was adjourned. pic.twitter.com/Fas1LQyaO4 — ANI (@ANI) December 13, 2023 లోక్సభలో లోపల దాడికి పాల్పడిన వాళ్ల గురించి తెలియాల్సి ఉంది. అదే సమయంలో పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ కనిపించిన ఇద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పసుపు రంగు టియర్గ్యాస్తో వీళ్లు ‘‘రాజ్యాంగాన్ని కాపాడాలి..’’, ‘‘నియంతృత్వం చెల్లదు’’ అంటూ నినాదాలు చేశారు. నిందితులను హర్యానాకు చెందిన నీలం కౌర్(42), మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే(25)గా గుర్తించారు. ఈ నలుగురు ఒకే గ్రూప్కు చెందిన వారై ఉంటారని.. ఇద్దరు లోపల, ఇద్దరు బయట నిరసనలు తెలియజేసే యత్నం చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. #WATCH | Delhi: Two protestors, a man and a woman have been detained by Police in front of Transport Bhawan who were protesting with colour smoke. The incident took place outside the Parliament: Delhi Police pic.twitter.com/EZAdULMliz — ANI (@ANI) December 13, 2023 మరోవైపు.. ఘటన తర్వాత కాసేపటికే సభ ప్రారంభమైంది. లోక్సభలో అలజడి సృష్టించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆగంతకులు వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తామని.. ఇప్పటికే ఢిల్లీ పోలీసులను ఆదేశించామని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఎంపీలతో స్పీకర్ అన్నారు. #WinterSession2023#LokSabha Speaker @ombirlakota's Remarks on Security Breach In Lok Sabha.@LokSabhaSectt @loksabhaspeaker pic.twitter.com/xhfMS1pQoo — SansadTV (@sansad_tv) December 13, 2023 సుమారు రూ.20వేల కోట్లతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవన్లో తాజా ఘటనతో భద్రతా వైఫ్యలం బయటపడింది. భద్రతా తనిఖీని తప్పించుకుని వాళ్లు లోపలికి టియర్గ్యాస్తో ఎలా వెళ్లారనే? ప్రశ్నలు లేవనెత్తుతున్నారు పలువురు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పేరిట పాస్లు తీసుకుని ఆగంతకులు లోపలికి ప్రవేశించినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. పోలీసులు దీనిని ధృవీకరించాల్సి ఉంది. Lok Sabha chamber of Parliament was attacked right now by 2 individuals who jumped from the visitors’ gallery into the House. Which MP approved their passes? Is he from the BJP? This is shocking especially on the day of the Parliament attack anniversary. BJP constantly has… pic.twitter.com/oPTaMfz1kx — Saket Gokhale (@SaketGokhale) December 13, 2023 ఈ ఘటనపై విపక్ష ఎంపీలు స్పందిస్తూ పార్లమెంట్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి వచ్చి పసుపు రంగు గ్యాస్ను వదిలారు. ఎంపీలు వెంటనే వారిని పట్టుకున్నారు. ఈ ఘటనతో కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి’’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగానే.. విపక్షాలు బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Delhi police commissioner Sanjay Arora reaches Parliament following the security breach incident pic.twitter.com/Hj4rWYzncC — ANI (@ANI) December 13, 2023 ఖలిస్థానీల పనేనా? పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్లు పూర్తైంది. ఇదే రోజున ఈ దాడి జరగడం గమనార్హం. మరోవైపు త్వరలో భారత్లో దాడులకు పాల్పడతామని కెనడాకు చెందిన ఖలీస్థానీ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇవాళ్టి దాడికి, ఖలీస్థానీకి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు. -
CEC bill: పంతం నెగ్గించుకున్న కేంద్రం
సాక్షి, ఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల నడుమ.. కేంద్రం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ నడుమే బిల్లుకు ఆమోదం లభించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు.. కేంద్ర మంత్రిని తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి బదులు కేబినెట్ మంత్రిని చేరుస్తూ బిల్లు రూపకల్పన చేసింది కేంద్రం. ఆ మంత్రి పేరును కూడా ప్రధానినే నామినేట్ చేస్తారు. తద్వారా 1991 చట్టాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు.. ‘‘ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని’’ తీర్పునిచ్చింది. అయినప్పటికీ కేంద్రం ముందుకే వెళ్లింది. అయితే, తాజాగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టి.. విపక్షాల అభ్యంతరాలు బదులు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక మీదటా స్వతంత్రంగానే పని చేస్తుందని అన్నారాయన. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పు దిశకు అనుగుణంగా ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార విభజనకు తగ్గట్లు ఉంది’’ అని తెలిపారు. రాజ్యసభ ఆమోదం పొందిన సీఈసీ బిల్లు ప్రకారం.. ఈసీ, ఈసీ సభ్యుల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య సంఘం ఏర్పాటవుతుంది. దీనిలో లోక్సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ప్రతిపాదిత కమిటీపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీనే రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని భావించినా.. అది సాధ్యపడలేదు. తాజాగా సవరణలతో కూడిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టడం.. చర్చ జరగడం.. విపక్షాల అభ్యంతరాల నడుమే ఆమోదం పొందడం జరిగాయి. #Centre proposes amendments in #CEC and #ECs Bill, brings CEC and ECs on par with SC Judges, also ‘Search Committee’ will comprise of Law Minister and two Secretaries of #Union Govt. pic.twitter.com/ieag9LVDtF — Suneel Veer (@sunilveer08) December 12, 2023 -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి..
సాక్షి, ఢిల్లీ: గందరగోళానికి తెర దించుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2023 నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలవడింది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో సందేశం ఉంచారు. సెలవులు మినహా డిసెంబర్ 22 దాకా.. మొత్తం 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనుంది కేంద్రం. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే.. వీటికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు అందాయి. దీంతో.. శీతాకాల సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. Winter Session, 2023 of Parliament will commence from 4th December and continue till 22nd December having 15 sittings spread over 19 days. Amid Amrit Kaal looking forward to discussions on Legislative Business and other items during the session.#WinterSession2023 pic.twitter.com/KiboOyFxk0 — Pralhad Joshi (@JoshiPralhad) November 9, 2023 -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నాలుగు బిల్లులపై చర్చ?
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు చెల్లుచీటి ఇస్తూ.. వాటి స్థానంలో కొత్త చట్టాలను తేవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల బిల్లులతో పాటు పెండింగ్లో ఉన్న మరో వివాదాస్పద బిల్లును సైతం పరిశీలించే యోచనలో ఉంది కేంద్రం. మొత్తం 12 రోజులపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు కాబోతున్నట్లు సమాచారం. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ముగిశాకనే ఈ సమావేశాలు మొదలుకానున్నాయి. క్రిస్మస్లోపు.. అదీ డిసెంబర్ 22 లోపే సమావేశాలు ముగించేయలని భావిస్తోంది కేంద్రం. దీంతో రెండు వారం నుంచి సెషన్ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం తీసుకురావాలనుకుంటోంది కేంద్రం. ఇప్పటికే వీటిని కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గత వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా విపక్షాల, మాజీ ఎన్నికల కమీషనర్ల వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల హోదాను కేబినెట్ కార్యదర్శికి సమానంగా తీసుకురావాలనేది ఈ బిల్లు ఉద్దేశ్యం. దాంతోపాటు ఎన్నికల కమీషనర్ల నియామక విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కమీషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంది. ఈ బిల్లు ఆమోదిస్తే కేబినెట్ సెక్రటరీ హోదా లభిస్తుంది. -
సరిహద్దు ఘర్షణ పార్లమెంట్ను కుదిపేయనుందా?
న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణ.. దేశ చట్ట సభను కుదిపేయనుందా?. అవుననే సంకేతాలు అందిస్తున్నాయి ప్రతిపక్షాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022లో భాగంగా.. ఇవాళ(మంగళవారం) చైనా-భారత్ సరిహద్దు ఘర్షణ అంశాన్ని లేవనెత్తి.. కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తోంది. డిసెంబర్ 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారత్-చైనా బలగాలు గొడవ పడ్డాయని, ఈ ఘనటలో ఇరు వర్గాలకు స్వల్ఫ గాయాలు అయ్యాయనేది సమాచారం. ఈ సమాచారం తెలియగానే.. కాంగ్రెస్ కేంద్రాన్ని ఏకిపారేయడం ప్రారంభించింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సీనియర్లు మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించడం ద్వారా ప్రభుత్వ తీరును దేశం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఇరు సభల్లో వాయిదా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ఎంఐఎం అధినేత, లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం వాయిదా తీర్మానం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని.. ఎందుకు బహిర్గత పర్చలేదని ఆయన అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు. సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే.. ఈ విషయంలో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట. కేంద్రం ఎప్పుడూ ఎలాంటి చర్చలకు వెనుకాడలేదని, వాస్తవాలతో సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. 2020లో లడఖ్లోని గాల్వాన్ వ్యాలీ వద్ద 20 మంది భారతీయ సైనికులు మరణించిన భీకర ఘర్షణ తర్వాత.. భారత్-చైనా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో ఐదుగురు చైనా సైనిక అధికారులు, సైనికులు మరణించారని చైనా ప్రకటించినా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న కథనాలు వినిపించాయి. Congress MP Randeep Singh Surjewala gives Suspension of Business Notice under Rule 267 in Rajya Sabha to discuss the India-China face-off in Tawang sector, Arunachal Pradesh on 9th December; urges the PM & Defence Minister to make a statement & have a discussion in the House. — ANI (@ANI) December 13, 2022 ఇదీ చదవండి: మోదీ సర్కారు మెతక వైఖరి వల్లే చైనా ఆగడాలు! -
రాజ్యసభలో 2 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన వైఎస్సార్సీపీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ రెండు కీలక ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టింది. బీసీ జనగణన చేసేలా రాజ్యాంగ సవరణ ప్రైవేటు మెంబర్ బిల్లు సహా సెస్, సర్ఛార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేలా మరో బిల్లును వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271, 278లను సవరించాలని ప్రతిపాదించారు. సభ అనుమతితో డిప్యూటీ చైర్మన్ హరివంశ్రాయ్ సమక్షంలో బిల్లును విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఆ డాక్యుమెంట్ ఆధారాలు లేనందునే జాప్యం.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు -
ములాయం, కృష్ణ, కృష్ణంరాజులకు పార్లమెంట్ నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల మరణించిన సమాజ్వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, టాలీవడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సహా తదితరులకు తొలుత లోక్సభ నివాళులర్పించింది. సంతాప సందేశం చదివిన తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు.. రాజ్యసభలోనూ వారికి నివాళులర్పించారు. మరోవైపు.. రాజ్యసభ ఛైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారానున్నారన్నారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్ఖడ్ సమర్థంగా నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: జీ20 నాయకత్వం.. భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం: ప్రధాని మోదీ -
‘భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు సువర్ణావకాశం’
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం రావటం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15కు ముందు సమావేశమయ్యామని, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. ‘శీతాకాల సమావేశాల తొలి రోజు ఇది. మనం ఆగస్టు 15కు ముందు సమావేశమైనందున చాలా ముఖ్యమైనది. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకున్నాం. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చిన తరుణంలో సమావేశమవుతున్నాం. గ్లోబల్ కమ్యూనిటీలో భారతదేశం చోటు సంపాదించిన తీరు, భారత్తో అంచనాలు పెరిగిన తీరు, గ్లోబల్ ప్లాట్ఫామ్లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం G20 ప్రెసిడెన్సీని అందుకోవడం చాలా గొప్ప అవకాశం. జీ20 సమ్మిట్ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదు. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయ తీసుకునేందుకు కృషి చేయాలి. అన్ని పార్టీలు చర్చకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నాను.’ అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఇదీ చదవండి: లఖీంపూర్ కేసులో 13 మందిపై అభియోగాలు -
‘ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు(మంగళవారం) కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ.. విభజన చట్టం పెండింగ్ అంశాలే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’ అని అన్నారు. -
Parliament : ముగిసిన శీతాకాల సమావేశాలు.. ఎన్నిగంటలు వృథా చేశారంటే..
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా పరిస్థితులతో పాటుగా ఎజెండాలో చర్చించాల్సిన అంశాలు పూర్తయిన నేపథ్యంలో వింటర్ సెషెన్ను ఒకరోజు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ముగించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29 న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 వరకు జరగాల్సి ఉండగా.. ఒక రోజు ముందుగానే డిసెంబరు 22)న ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. శీతాకాల సమావేశంలో భాగంగా లోక్సభ ముందుకు 13 బిల్లులు రాగా, 11 బిల్లులు ఆమోదం పొందాయి. దీనిలో కీలకమైన సాగుచట్టాల రద్దు బిల్లు, ఎన్నికల చట్టాల సవరణల బిల్లులు ఇందులో ఉన్నాయి. అదే విధంగా యువత వివాహా వయసు పెంపుదలకు సంబంధించిన బిల్లును కేంద్రం స్టాండింగ్ కమిటీకి పంపించింది. In the #WinterSession, 11 bills have been passed by both the Houses and 6 bills have been sent to Standing Committee. Opposition's conduct throughout the session was unfortunate and they repeatedly resorted to creating ruckus and disturbing the proceedings. — Pralhad Joshi (@JoshiPralhad) December 22, 2021 ఎంపీల నిరసనల కారణంగా శీతాకాల సమావేశాల్లో 18 గంటలు వృథా అయినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. అదే విధంగా రాజ్యసభను కూడా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, లఖీంపూర్ ఖేరీ ఘటన, 12 మంది ఎంపీల సస్పెన్షన్ పార్లమెంట్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
క్రిప్టోకరెన్సీ.. కీలక నిర్ణయం దిశగా ఆర్బీఐ
RBI On Cryptocurrency Control And Digital Currency: క్రిప్టోకరెన్సీ నియంత్రణ చట్టం విషయంలో కేంద్రం ఆచితూచీ వ్యవహరించాలని నిర్ణయించుకుంది. క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని ఓవైపు చెబుతూనే.. వాటిని ఆస్తులుగా పరిగణించే దిశగా చట్టంలో మార్పులు చేసినట్లు సంకేతాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో తన స్టాండర్డ్ను ప్రకటించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఈ మేరకు డిసెంబర్ 17న లక్నో(ఉత్తర ప్రదేశ్)లో జరగబోయే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్లో క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చింది ఆర్బీఐ. ఆర్బీఐ తరపు నుంచి డిజిటల్ కరెన్సీని(క్రిప్టో పేరుతో కాకుండా) జారీ చేయడం? దాని రూపు రేఖలు.. ఎలా ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయానికి రానుంది. ఇక ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?.. ఒకవేళ ప్రైవేట్ క్రిప్టో నియంత్రణ బాధ్యతల్ని ముందుగా అనుకున్నట్లు సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి కేంద్రం అప్పగిస్తే.. ఆ నిర్ణయాన్ని స్వాగతించాలా? లేదంటే వ్యతిరేకించాలా? అనే విషయాలపై బోర్డులో చర్చించనుంది ఆర్బీఐ. క్లిక్ చేయండి: క్రిప్టోతో పెట్టుకోవడం ఆర్బీఐకి మంచిది కాదు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం (13 డిసెంబర్, 2021)న ఆర్థిక మంత్రిత్వ శాఖ.. క్రిప్టోకరెన్సీ కోసం బిల్లు, నియంత్రణ మీద బిల్లు తుది రూపానికి వచ్చిందని, కేబినెట్ అంగీకారం ఒక్కటే మిగిలిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ వేగం పెంచింది. నిజానికి 17వ తేదీన జరగబోయే ఆర్బీఐ బోర్డు మీటింగ్ ఎజెండాలో ఈ కీలకాంశం ప్రస్తావనే లేదు!. కానీ, ఇలా ఎజెండాలో లేని కీలకాంశాలపై చర్చించడం బోర్డుకు కొత్తేం కాదని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. చదవండి: క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఎలా జరుగుతాయో తెలుసా? -
Indian Railways: ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల మోత
Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్ క్లాస్ ప్రయాణాలను రిజర్వేషన్ కేటగిరీలో కొనసాగించడంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్ రైళ్లలో ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్’ కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్ స్పెషల్’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్ రైళ్లను మెయిల్ ఎక్స్ప్రెస్లుగా, పండుగ స్పెషల్గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్. పైగా సెకండ్ క్లాస్ సహా అన్ని కేటగిరీలను రిజర్వేషన్ కోటాలోకి మార్చేసింది. అయితే.. తాజాగా కొవిడ్ స్పెషల్ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్ రేట్లు తగ్గుతాయని, సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్ రైళ్లలో సెకండ్క్లాస్ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్లో బదులిచ్చారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్ కింద భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్ప్రెస్ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ. సెకండ్ క్లాస్ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. సింగిల్ క్లిక్తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్ -
హెలికాప్టర్ ప్రమాదం.. లోక్సభలో రాజ్నాథ్ సింగ్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో దేశ ప్రథమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్తో పాటు మరో 11 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం లోక్సభలో ప్రకటన చేశారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. ►బుధవారం వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది ►సూలూరు ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 11:48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. ►మధ్యాహ్నం 12:08 గంటలకుహెలికాప్టర్కు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ►కాసేపటికి హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లారు. ►అప్పటికే హెలికాప్టర్ మంటల్లో ఉంది. ►గాయపడ్డవారిఇన సహాయక బృందాలు వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించాయి. ►హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. రావత్తో పాటు ఆయన భార్య మృతి చెందడం బాధాకరం. ►భౌతికకాయాలు గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరతాయి. ►హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది అని తెలిపారు. రాజ్నాథ్ సింగ్ ప్రకటన అనంతరం లోక్సభ స్పీకర్ హోం బిర్లా, సభ్యులు బిపిన్ రావత్ సహా మిగతా వారి మృతికి సంతాపం తెలిపారు. చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే -
3 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి
Live Updates: ► దేశంలో పెట్టుబడుల ఉపసంహరణపై లోక్సభలో టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న పీఎస్యూలను అమ్మేయడం వలన వందల మంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. నష్టాల్లో ఉన్న వాటిని అమ్మేసిన పర్వాలేదు.. కానీ లాభాల్లో ఉన్న వాటిని పీపీపీ మోడ్లోకి తీసుకురావాలంటూ నుస్రత్ కేంద్రాన్ని కోరారు. ► రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కుచట్ట సవరణ బిల్లు, గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లులను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. వీటితో పాటు ప్రార్థనా మందిరాలపై దాడులు చేసేవారికి విధించే గరిష్ట జైలు శిక్షను రెండేళ్ల నుంచి ఇరవై ఏళ్లకు పెంచేలా ఐపీసీ చట్ట సవరణ - 2021 బిల్లులను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. ► దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సీఎస్యూలను అమ్మేయడం సరికాదని.. దీనివల్ల వందలమంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్టేక్ అమ్మేయడం కాకుండా, వాటిని పీపీపీ మోడ్లోకి తీసుకురావాలని ఆమె కేంద్రానికి సూచించారు. కేంద్ర మంత్రి ఆక్షేపణ ► తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీలు కే. కేశవరావు, సురేష్రెడ్డి రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రతి గింజనూ కొంటామన్న మాటను మోదీసర్కార్ నిలబెట్టుకోవాలన్నారు. గతేడాది తరహాలోనే 94 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని డిమాండ్ చేశారు. దీనికి బదులిచ్చిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. గతంలో ఇచ్చిన టార్గెట్నే తెలంగాణ ఇంకా పూర్తిచేయలేదన్నారు. ఇచ్చిన టార్గెట్లో 29 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా పెండింగ్లో ఉందని తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ► తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకే ధాన్యం సేకరణ జరుగుతోందని రాజ్యసభలో స్పష్టంచేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. ఆయా రాష్ట్రాలు తినే బియ్యాన్నే తాము కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ సురేష్రెడ్డి లేవెనత్తిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి. భవిష్యత్లో పారా బాయిల్డ్ రైస్ పంపిణీ చేయబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందన్నారు. మళ్లీ ఇప్పుడీ అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తోందని విమర్శించారు. Time 12:00 PM డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతిని పురస్కరించుకుని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయనకు నివాళులు అర్పించారు. ► తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ వరుసగా నాలుగోరోజూ లోక్సభలో ఆందోళన కొనసాగించారు టీఆర్ఎస్ ఎంపీలు. వెల్లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ► పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలపై లోక్సభలో దుమారం రేగింది. విపక్షాలు ఆందోళన చేస్తున్న గాంధీ విగ్రహం వద్దకు బీజేపీ సభ్యులు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి. స్పీకర్ ఓంబిర్లా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ట్రెజరీ బెంచ్ దీటుగా స్పందించింది. గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టే హక్కు అధికారపక్షం ఎంపీలకు కూడా ఉందన్నారు కేంద్రమంత్రి అర్జున్సింగ్ మేఘ్వాల్. Time 11:00 AM పార్లమెంట్ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా లోక్సభ, రాజ్యసభ శుక్రవారం ప్రారంభమయ్యాయి. ► 12 సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేయాలని విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద మరోసారి నిరసన చేపట్టారు. అయితే, వారికి కౌంటర్గా బీజేపీ సభ్యులు కూడా అదే ప్రాంతంలో నిరసనకు దిగారు. #WATCH | Delhi: BJP Rajya Sabha MPs protest against the protesting Opposition over the suspension of 12 Rajya Sabha MPs for the winter Parliament, near the Gandhi statue pic.twitter.com/zngQpt1guj — ANI (@ANI) December 3, 2021 ► లఖింపూర్ ఖేరీ ఘటనపై, కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్కుమార్ మిశ్రా తొలగింపు అంశంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. Congress MP Manickam Tagore has moved an adjournment motion in Lok Sabha "to discuss the killing of innocent farmers through rash driving by the son of MoS Home in Lakhimpur Kheri district, to direct the govt to ensure the culprit punished, & ask the PM to dismiss the MoS Home." pic.twitter.com/AkxYKo1HiR — ANI (@ANI) December 3, 2021 సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఐదో రోజు ఉభయ సభలు కొలువుదీరాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు 2021, ఢిల్లీలో ప్రత్యేక పోలీసు వ్యవస్థ ఏర్పాటు (సవరణ) బిల్లు 2021, జాతీయ ఫార్మాస్యూటికల్ విద్య మరియు పరిశోధన (సవరణ) బిల్లు 2021 నేడు లోక్సభ ముందుకు రానున్నాయి. ఇక 12 మంది సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ సభలో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే డ్యామ్ సేఫ్టి బిల్లు 2019ను రాజ్యసభ గురువారం ఆమోదించింది. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: డ్యామ్ సేఫ్టి బిల్ను సెలక్ట్ కమిటీకి పంపాలి
Live Updates Time 18:17 ► డ్యామ్ సేఫ్టీ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు కేంద్రాన్ని కోరాయి. Time 16:00 ► దేశంలో వాయు కాలుష్య తీవ్రతను తగ్గించేందకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. Time 12:20 ►తెలంగాణలో వరి కొనగోలుకు సంబంధించిన అంశాన్ని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్సభలో లేవనెత్తారు. నామా మాట్లాడుతూ.. కేంద్రం తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో ధాన్యం సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. Time 11:40 ►లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన ►ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ నిరసన Time 11:20 ► మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా ► పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి సస్పెండ్ చేసిన 12 మంది రాజ్యసభ ఎంపీల అంశం సభను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు కూడా రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం నాలుగో రోజు ప్రారంభమైంది. లోక్సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన చేయడం మొదలుపెట్టారు. పోడియం వద్ద ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్నారు. #WATCH | Congress MP Rahul Gandhi joins the Opposition leaders' protest against the suspension of 12 Opposition members of Rajya Sabha, in Delhi pic.twitter.com/w7Y1gSLTym — ANI (@ANI) December 2, 2021 చదవండి: డుగ్గు డుగ్గు బండి కాదండి.. కానీ భలేగా ఉందండి ! -
పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయి. అధికారులు తక్షణమే స్పందించడంతో కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేయగలిగాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని, ఈ ఘటననై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. చదవండి: 5 లక్షల కంపెనీలు వ్యాపారం వదిలి వెళ్లిపోయాయ్ -
Bitcoin: బిట్కాయిన్పై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
క్రిప్టోకరెన్సీపై రకరకాల ఊహాగానాల నడుమ బిట్కాయిన్ భవితవ్యంపై పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. Parliament Winter Session 2021 సోమవారం మొదలైన విషయం తెలిసిందే. లోక్సభ కాసేపు వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన తరుణంలో బిట్కాయిన్కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం చేస్తోందా? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘అలాంటిదేం లేదు సర్’ అని సమాధానం ఇచ్చారు. బిట్కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది తమ ప్రభుత్వం చేయట్లేదని, అలాగే బిట్కాయిన్ ట్రాన్జాక్షన్స్కు సంబంధించి వివరాలు సేకరించామన్న రిపోర్టులు నిజం కాదని ఆమె స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న బిట్కాయిన్ విషయంలో కేంద్రం వైఖరి స్పష్టమైంది. ఇక ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తుందన్న కథనాలు నిజమేనని(వచ్చే ఏడాది నుంచి పైలట్ ప్రాజెక్ట్ మొదలు).. ఇందుకోసం 1934 చట్టానికి సవరణలు (డిజిటల్ కరెన్సీని ఫిజికల్ నోట్లతో సమానంగా గుర్తించాలనే!) ప్రతిపాదన ఆర్బీఐ, కేంద్రం ముందు ఉంచిదనే సమాచారం అందుతోంది. ఈ లెక్కన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు పంపింది. ఇక 2008 నుంచి చెలామణిలోకి వచ్చిన బిట్కాయిన్.. డిజిటల్ కరెన్సీగా చెలామణి అవుతోంది. బిట్కాయిన్తో వస్తువుల కొనుగోలు, సేవలు, బ్యాంకులతో సంబంధం లేకుండా మనీ ఎక్స్ఛేంజ్ ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటోంది. నిర్మలా సీతారామన్ తాజా ప్రకటనతో బిట్కాయిన్ ఇన్వెస్టర్లకు నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. చదవండి: బిట్కాయిన్పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్ -
Cyptocurrency : క్రిప్టోకరెన్సీ చట్టం.. అనూహ్య పరిణామం!
Coinstore Exchange India: క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వ నియంత్రణా? ఆంక్షలా? లేదా పూర్తి నిషేధమా?.. అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ తరుణంలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా మరో ప్రైవేట్ బిట్కాయిన్స్టోర్ భారత్లో అడుగుపెట్టింది. సింగపూర్కి చెందిన వర్చువల్ కరెన్సీ ఏజెన్సీ ఎక్సేంజ్ కాయిన్స్టోర్ భారత్లో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. క్రాస్టవర్(సెప్టెంబర్లో లాంఛ్ అయ్యింది) తర్వాత భారత్లో అడుగుపెట్టిన రెండో గ్లోబల్ ఎక్సేంజ్ కాయిన్స్టోర్ కావడం విశేషం. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై బ్రాంచ్లతో కాయిన్స్టోర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంతేకాదు 20 మిలియన్డాలర్ల బడ్జెట్తో భారత మార్కెట్లో పెట్టనున్నట్లు.. ప్రస్తుతానికి వంద మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు కాయిన్స్టోర్ మార్కెటింగ్ హెడ్ చార్లెస్ టాన్ వెల్లడించారు. అయితే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల పట్ల ఇవాళ్టి నుంచి(నవంబర్ 29, 2021) మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని తరుణంలో.. కాయిన్స్టోర్ వేసిన అడుగు సాహసోపేతమనే చెప్పాలి. అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశాభావంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, క్రిప్టోకరెన్సీల కోసం భారత ప్రభుత్వం హెల్తీ ఫ్రేమ్వర్క్తో ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు చార్లెస్ టాన్ తెలిపారు. భారత్తో పాటు జపాన్, కొరియా, ఇండోనేషియా, వియత్నాంలలోనూ కార్యకలాపాలకు Coinstore సిద్ధమైంది. Cryptocurrency.. దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదిలా ఉంటే ప్రపంచలోనే అతిపెద్ద(విలువైన) క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్కాయిన్.. ఈ ఏడాది ఆరంభంలో కంటే రెట్టింపు విలువతో భారత పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. కానీ, క్రిప్టోబిల్లు పరిణామాల తర్వాత వాటి విలువ పడుతూ.. లేస్తూ ఇన్వెస్టర్లను కంగారుపెడుతోంది. మరి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై కేంద్రం నిర్ణయం ఎలా ఉండబోతుందో అనేది మరికొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: క్రిప్టోకరెన్సీ ఎక్కడికీ పోదు -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: ఉభయ సభలు వాయిదా.. కుదిపేసిన రైతుల అంశం
Live Updates: Time 2:20 PM ►కుదిపేసిన రైతుల అంశం.. ఉభయ సభలు వాయిదా Time 2:17 PM ►సాగుచట్టాల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం Time 2:15 PM ► వాయిదా తర్వాత ప్రారంభమైన రాజ్యసభ ►సాగుచట్టాల రద్దు బిల్లుకు మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం. Time 2:01 PM ►వాయిదా అనంతరం లోక్సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. సాగు చట్టాల బిల్లు పై చర్చ తప్పనిసరేనని కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ►విపక్షాల ఆందోళన నడుమ కొనసాగని పార్లమెంట్ సమావేశాలు, మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉభయ సభలు వాయిదా. ఎంఎస్పీ బిల్లు కోసం పోరాడుతాం: రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ ►సాగుచట్టాల రద్దు బిల్లు లోక్సభలో ఆమోదం పొందినంత మాత్రన ఆందోళనలపై వెనక్కు తగ్గేది లేదని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ తేల్చి చెప్పారు. డిసెంబర్ 4 జరిగే సమావేశం తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఎంఎస్పీ బిల్లు కోసం పోరాటం సాగుతుందన్నారు. Time 12:28 PM ► మధ్యాహ్నం రెండింటి వరకు రాజ్యసభ వాయిదా రాజ్యసభలోనూ రద్దు బిల్లుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత, సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం, తెలంగాణలో వరి కొనుగోళ్లపై స్పష్టత సహా పలు అంశాలపై విపక్ష ఎంపీలు చర్చకు డిమాండ్ చేశాయి. ఛైర్మన్ వెంకయ్యనాయుడు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసనకు దిగాయి. క్వశ్చన్ అవర్లో గందరగోళం సృష్టిస్తున్న విపక్ష ఎంపీల తీరుపై ఛైర్మన్ వెంకయ్య సీరియస్ అయ్యారు. సభను 2 గంటలవరకూ వాయిదా వేశారు. Time 12:24 PM ► వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ Time 12:18 PM ► మధ్యాహ్నం రెండింటి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా ► వాయిదా అనంతరం కూడా విపక్షాల ఆందోళన కొనసాగడంతో రెండో సారి ప్రారంభమైన 5 నిమిషాల్లోనే లోక్సభ మళ్లీ వాయిదా. ► సాగుచట్టాల రద్దు బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదం. Time 12:05 PM ► వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్సభ ► లోక్సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన ఉభయ సభలు గంట పాటు వాయిదా Time 11:20 AM ►ఇటీవల మృతి చెందిన పలువురు సభ్యులకు రాజ్యసభలో నివాళులు. అనంతరం సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతికి సంతాపంగా రాజ్యసభను చైర్మన్ వెంకయ్య నాయుడు గంట వాయిదా వేశారు. Time 11:10 AM..విపక్షాల ఆందోళణ.. లోక్సభ గంట వాయిదా ►ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ ఓంబిర్లా లోక్సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. Time 11:03 AM.. ► లోక్సభలో.. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఇటీవల మరణించిన ప్రస్తుత, మాజీ ఎంపీలకు లోక్సభ సంతాపం తెలిపింది. తర్వాత ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు స్పీకర్ ఓంబిర్లా ప్రయత్నించగా.. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. సాగుచట్టాల రద్దుపై చర్చించాలంటూ వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు. Time 11.00 AM పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. Time 10.55 AM ►శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్కు చేరుకున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కేంద్రం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని... సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. Time 10.50 AM ►సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రైతు సమస్యలపై చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భంగం వాటిల్లకుండా చూసుకోవాలని ఎంపీలకు సూచించారు. ►పెగసస్ వ్యవహారం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లపై సభలో చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. బంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం నియంత్రణ పరిధిని పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీటిపై పార్లమెంట్లో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా సాగు చట్టాల రద్దు బిల్లు కాకుండా మరో 25 ముసాయిదా చట్టాలను పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది కేంద్రం. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించే బిల్లుతో పాటు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతన సవరణ బిల్లు 2021, దివాలా రెండో సవరణ బిల్లు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ సవరణ బిల్లు, 1983 నాటి ఇమ్మిగ్రేషన్ చట్టం స్థానంలో 2021 ఇమ్మిగ్రేషన్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు 2021, మనుషుల అక్రమ రవాణా నిరోధక, రక్షణ, పునరావాస బిల్లులపై చర్చ జరుగనుంది. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్లో మొత్తం 19 సెషన్స్ (పనిదినాలు) ఉంటాయి. క్రిప్టోకరెన్సీలపై నిషేధం పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కీలక బిల్లులివే.. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ల స్థానంలో నార్కోటిక్స్ డ్రగ్, సైకోటిక్ సబ్స్టాన్సెస్ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ పనితీరుపై సుప్రీం వ్యాఖ్యలు ఆందోళనకరం పార్లమెంట్తోపాటు ఇతర చట్టసభల పనితీరు, చట్టాలను రూపొందిస్తున్న విధానం పట్ల ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల హక్కులకు, మర్యాదలకు భంగం వాటిల్లకుండా, ఇతర రాజ్యాంగబద్ధ వ్యవస్థలు చట్టసభలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా సభాపతులే(ప్రిసైడింగ్ ఆఫీసర్లు) తగిన చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడి దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వెంకయ్య ఆదివారం తన నివాసంలో దాదాపు 40 పార్టీల నేతలతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘‘మీ ఆందోళనను అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో గమనించాలి. చట్టసభల్లో తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. చట్టసభల్లో మన ప్రవర్తన గౌరవంగా, హూందాగా ఉంటే ప్రజాబాహుళ్యం నుంచి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినిపించవు’’ అని సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 70 శాతం సమయం వృథా అయ్యిందని, శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని పలువురు నేతలు వెల్లడించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు తరచుగా కలిసి మాట్లాడుకుంటే, పార్లమెంట్లో గొడవలకు ఆస్కారం ఉండదని వెంకయ్యlనాయుడు తెలిపారు. ‘ఎంఎస్పీ’పై చర్యలు తీసుకోవాలి అఖిలపక్ష సమావేశంలో 15 అంశాలను లేవనెత్తాం. రైతుల సమస్యలను ప్రస్తావించాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని విన్నవించాం. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. ఎంఎస్పీకి చట్టబద్ధతపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పాం. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విన్నవించాం. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపాం. పార్లమెంట్ 19 రోజులపాటే పనిచేయనుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు సమయం సరిపోదు. లోక్సభ సక్రమంగా కొనసాగడానికి డిప్యూటీ స్పీకర్ను నియమించాలి. పార్లమెంట్లో మీడియాపై విధించిన ఆంక్షలను తొలగించాలి – మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లును చేపట్టాలి పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పార్లమెంట్లో ఈ బిల్లుపై చర్చించాలని కోరాయి. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు వారి వంతు భాగస్వామ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని సూచించారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గత 15 ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. చదవండి: భారత్లో ఒమిక్రాన్ ప్రకంపనలు.. అప్రమత్తమైన రాష్ట్రాలు -
రైతు అభీష్టానికి... రాజ్యం తలొగ్గిన వేళ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్లో మొత్తం 19 సెషన్స్ (పనిదినాలు) ఉంటాయి. క్రిప్టోకరెన్సీలపై నిషేధం పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు.పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కీలక బిల్లులివే.. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ల స్థానంలో నార్కోటిక్స్ డ్రగ్, సైకోటిక్ సబ్స్టాన్సెస్ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. -
బ్యాన్ ఎఫెక్ట్! బిట్కాయిన్కి భారీ దెబ్బ.. కుదేలవుతున్న క్రిప్టోకరెన్సీ
శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ద్వారా క్రిప్టోకరెన్సీ జోరుకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏకంగా బ్యాన్ చేస్తున్న కథనాల నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ భారీగా కుదేలు అయ్యింది. బిట్కాయిన్, ఎథెరియమ్, టెథర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పర్యవేక్షణలో డిజిటల్ కరెన్సీ నియంత్రణకు ఒక ప్రణాళిక రూపొందించాలని, బిట్కాయిన్లాంటి క్రిప్టోకరెన్సీలను నిషేధించడమో లేదంటే కఠిన నిబంధనలతో మినహాయింపులు ఇవ్వడమో లాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకోసం క్రిప్టోకరెన్సీ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని డిజిటల్ కరెన్సీలు, డిజిటల్ మార్కెట్లో పతనం చవిచూశాయి. ప్రపంచంలో అతిపెద్ద, విలువైన క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్కాయిన్18.53 శాతం, ఎథెరియమ్ 15.58 శాతం, టెథెర్ 18.29 శాతం పడిపోయాయి. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. తాజా పతనంతో వీళ్లకు పెద్ద దెబ్బే పడింది. నియంత్రణ సరిపోతుందా? గత పదేళ్లుగా ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ బాగా పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక క్రిప్టోకరెన్సీ అడ్వర్టైజ్మెంట్లు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. ఈజీగా, ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయవి. ఈ క్రమంలో భారీ మోసాలు సైతం వెలుగుచూస్తున్నాయి. అందుకే ఆర్బీఐ మాత్రం క్రిప్టోకరెన్సీ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకతనే వ్యక్తం చేస్తోంది. క్రిప్టోకరెన్సీ వల్ల దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం క్రిప్టోకరెన్సీ ప్రయోజనాలను సైతం పరిగనణలోకి తీసుకుంటోంది. కిందటి వారం బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో క్రిప్టో ఎక్సేంచెజ్, బ్లాక్ చెయిన్, క్రిప్టో ఎస్సెట్స్ కౌన్సిల్ BACC, ఇతరులు సమావేశం అయ్యారు. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని, వాటి మీద నియంత్రణ ఉంటే సరిపోతుందని ఈ భేటీలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించబోతోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ►ఇక వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులు మరియు దానిచే నియంత్రించబడే సంస్థలను నిషేధిస్తూ గతంలో(ఏప్రిల్ 6, 2018) RBI ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే మార్చి 4, 2021న సుప్రీంకోర్టు ఆ సర్క్యులర్ను పక్కన పెట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ►ప్రస్తుతం ఎల్ సాల్వడర్ దేశం ఒక్కటే బిట్కాయిన్కు చట్టబద్ధత ఇచ్చుకుంది. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సిడ్నీ డైలాగ్ సందర్భంగా నవంబర్ 18న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘‘క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి, జాగ్రత్త పడాల’’ని ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి అడుగు వేయబోతుందన్న ఆసక్తి నెలకొంది. Cryptocurrency: భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్.. చెల్లనే చెల్లదంటూ స్టేట్మెంట్ -
పార్లమెంట్ సమీపంలో అనూహ్య పరిణామం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమీపంలో అనూహ్య పరిణామం చేటుచేసుకుంది. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కాన్వాయ్కి ఓ వ్యక్తి అడ్డుపడ్డాడు. వాహనశ్రేణికి ఎదురుగా వచ్చి ప్రధాని మోదీని కలవాలంటూ నినాదాలు చేశాడు. హఠాత్ పరిణామంతో షాక్ తిన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం రాజ్నాథ్ కాన్వాయ్ ముందుకు సాగింది. దద్దరిల్లిన లోక్సభ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్పై కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై... లోక్సభ రెండోరోజూ దద్దరిల్లింది. అధిర్ క్షమాపణలకు బీజేపీ డిమాండ్ చేసింది. సభలో తమ స్థానాల్లో నిలబడి బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేశారు. అధిర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో లోక్సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రధాని మోదీ, అమిత్ షా వలసదారులని, నిర్మలా సీతారామన్ నిర్బల సీతారామన్ అని నిన్న లోక్సభలో వ్యాఖ్యానించారు అధిర్ రంజన్ చౌధురి. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ... ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నిరసనకు దిగింది. -
మంత్రి కారులో.. ఎంపీలు సైకిళ్లపై..
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు మొదటి రోజు సోమవారం పలువురు ఎంపీలు పర్యావరణహితమైన సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలలో వచ్చారు. ముఖానికి మాస్క్లు ధరించారు. బీజేపీ ఎంపీలు మన్సుఖ్ మాండవీయ, మనోజ్ తివారీ సైకిల్పై రాగా, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఎలక్ట్రిక్ కారులో వచ్చారు. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సోమవారం రాజధానిలో కాలుష్యం కొంత మేర తగ్గినప్పటికీ నాణ్యత మాత్రం దారుణంగానే ఉంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణాన్ని క్రమంగా ప్రోత్సహిస్తోందని ఈ సందర్భంగా మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు. ప్రజలు కూడా కాలుష్య నివారణకు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటం పట్ల నాయకులతో పాటు సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సైకిల్పై పార్లమెంట్కు వచ్చిన బీజేపీ ఎంపీ మన్సుఖ్ మాండవీయ -
అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోకసభ పక్ష నేత మిథున్రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు తదితరులు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశముంది. చొరబాటుదారులు ఏరివేత లక్ష్యంగా దేశమంతా ఎన్నార్సీ అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ భేటీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుకోసం గళమత్తారు. అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలివే.. విభజన చట్టంలో ప్రతిపాదించినట్టుగా ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన నిధుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి వెంటనే ఆమోదం తెలపాలి. రూ. 18,969 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ ఆ మేరకు ఏపీకి నిధులు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 700 కోట్ల గ్రాంట్ను తక్షణమే విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్కు ఏడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలి. రామాయపట్నంలో మేజర్ పోర్టును నిర్మించాలి. గిరిజన ప్రాంతమైన విజయనగరం జిల్లా సాలూరులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అనుమతించాలి. గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించి కేంద్రమే చేపట్టాలి -
రాజ్యసభ సమావేశాలు మరోరోజు పొడగింపు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలను కేంద్రం మరోరోజు పొడిగించింది. విపక్షాల ఆందోళనలతో శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగడం, పలు అంశాలపై చర్చలు పెండింగ్లో ఉండటంతో సభను బుధవారానికి పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే, రాజ్యసభను రేపటికి పొడగించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అజెండాలో ఏం పొందుపరుస్తున్నారో కూడా చెప్పడంలేదని .. వ్యవస్థలను నాశనం చేసినట్టే పార్లమెంట్నూ చేయాలని చూస్తున్నారని మండిపడ్డాయి. కేంద్రం తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగాయి. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. గులాంనబి అజాద్, ఆనంద్ శర్మ, డి. రాజా. కనిమొళి, సహా పలువురు రాజ్యసభ సభ్యులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం మాత్రం సమావేశాల పొడిగింపు అంశం ప్రభుత్వ విచక్షణాధికారమని స్పష్టంచేసింది. కీలకమైన ఈబీసీ కోటా బిల్లుతోపాటు పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చించాల్సి ఉన్నందున.. రాజ్యసభ గడువును పొడిగించినట్టు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి విజయ్ గోయెల్ తెలిపారు. -
గందరగోళం:పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా విపరీతమైన వేడిని పుట్టించిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు గందరగోళం నడుమ ఉభయసభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలోనే ఉండిపోయింది. లోక్సభలో మొత్తం 12 బిల్లులకు ఆమోదం లభించింది. మరికొద్దిరోజుల్లోనే అంటే, ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. -
ఆల్ ఈజ్ ఇన్ వెల్...
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజే పెద్దల సభ దద్దరిల్లింది. తమ పార్టీ రాజ్యసభ ఎంపీలపై జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అనర్హత వేటు వేసిన వ్యవహారంపై రాజ్యసభలో దుమారం రేగింది. సీనియర్ నేత శరద్ యాదవ్కు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు సభలో చర్చలేవనెత్తారు. శరద్ పై అనర్హత వేటు తప్పన్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్.. నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఒకదశలో సభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు(ఉపరాష్ట్రపతి) ఈ అంశంపై చర్చ అవసరం లేదని ప్రకటించటంతో అసంతృప్తికి లోనైన కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో ఆయన సభను కాసేపు వాయిదా వేశారు. కాగా, ఈ నేతలిద్దరూ తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి, ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు హాజరయ్యారని, తద్వారా వారు స్వచ్ఛందంగా తమ సభ్యత్వాలను వదులుకున్నారని రాజ్యసభ చైర్మన్కు జేడీయూ విన్నవించింది. దీని ఆధారంగా శరద్ యాదవ్తోపాటు అలీ అన్వర్ను రాజ్యసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ ఈ నెల 4న రాజ్యసభ ఆదేశాలు జారీ చేసింది. ఇక తమపై పడిన వేటు గురించి మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి తనను అనర్హుడిగా ప్రకటిస్తూ జారీ అయిన ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేసే ముందు తన వాదనను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని పిటిషన్లో ఆయన తెలిపారు. ప్రాసతో వెంకయ్య... ఈ గందరగోళం నడుమ కూడా చైర్మన్ వెంకయ్యనాయుడు తన వాక్ చాతుర్యం చూపించటం విశేషం. వెల్లోకి దూసుకొచ్చిన సభ్యులను ఉద్దేశించి.. ఆల్ ఇన్ వెల్.. నాట్ వెల్... (అంతా వెల్లోకి రావటం బాగా లేదు) అంటూ రైమింగ్తో సభను వాయిదావేశారు. తిరిగి సభ ప్రారంభం కాగా, ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల అంశం లేవనెత్తటంతో మరోసారి సభలో గందరగోళం చెలరేగి సభ మధ్యాహ్నాం 2గం.30ని. కి వాయిదా పడింది. గుజరాత్ ఎన్నికల కోసం మాజీ ప్రధాని మన్మోహన్, ఇతర కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్తో చేతులు కలిపారంటూ మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇవి సాధారణ ఆరోపణలు కాదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. Leader of Opposition GN Azad raises the issue of PM Modi's allegations against former PM (Manmohan Singh) & others of conspiring with Pakistan for #GujaratElection2017, says, 'ye sadharan aarop nahi hai.' House adjourned till 2:30 pm. pic.twitter.com/bMZ23wNWXK — ANI (@ANI) December 15, 2017 -
లోక్ సభ సోమవారానికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ రోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే గత సమావేశాల అనంతరం చనిపోయిన సభ్యుల మృతికి లోక్ సభ సంతాపం తెలిపింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు మౌనం పాటింంచారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... మంత్రివర్గంలో చేరిన సభ్యులను సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో...శరద్ పవార్ అనర్హత వ్యవహారంపై దుమారం రేగింది. దీనిపై చర్చించాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టారు. సభ్యులు వెల్లోకి దూసుకు వెళ్లడంతో సభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు సమావేశాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాల్లో 14 కొత్త బిల్లులతోపాటు 25 పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈసారి నెల ఆలస్యంగా సమావేశాలు మొదలయ్యాయి. అంతేకాదు, గత ఏడాది శీతాకాల సమావేశాలు 21 రోజులపాటు జరగ్గా ఈ సారి 14 రోజులే నడిచే అవకాశం ఉంది. ఆర్థిక మందగమనం, జీఎస్టీ పరిణామాలు, వ్యవసాయ రంగ సంక్షోభం వంటి అంశాలపై అధికార పక్షంపై దాడికి దిగేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెట్టుకున్నాయి. కాగా సోమవారం (18వ తేదీ) గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
విపక్షాలు సహకరించాలి: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం ప్రధాని మాట్లాడుతూ... పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. సభలో గొడవ కన్నా, చర్చలపై దృష్టి సారిస్తే మంచిదని ఆయన అన్నారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. -
పెద్దల సభలో వికసించనున్న కమలం!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల నాటికి రాజ్యసభలో తమకు బలం పెరుగుతుందని, సభా వ్యవహారాలు సజావుగా సాగుతాయని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేసింది. సభ చైర్మన్ కూడా అయిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థే గెలుస్తారని ఆ పార్టీ ధీమాతో ఉంది. వచ్చే ఏడాది సభలో తమ బలం పెరిగి, బడ్జెట్ సమావేశాల నుంచి పరిస్థితి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే రాజ్యసభ, లోక్సభల్లోని 790 మందికిగాను ప్రాంతీయ పార్టీల మద్దతుతో తమకు 550 మంది ఓట్లు వచ్చే అవకాశముందని తెలిపాయి. వచ్చే ఏడాది అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసుకుని ప్రభుత్వం బిల్లులతో ముందుకెళ్తుందన్నాయి. విపక్షానికి మెజారిటీ ఉన్న రాజ్యసభలో ప్రభుత్వం తెచ్చే తీర్మానాలు గట్టెక్కడం లేదు. ఇప్పటి నుంచి 2018 ఏప్రిల్లోగా ఎగువ సభలో 72 మంది పదవీ కాలం పూర్తవుతుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పార్టీకి పలువురు ఎంపీలు తోడై రాజ్యసభలో బలం పెరగనుంది. -
పెదవి విప్పనున్న ప్రధాని మోదీ!
-
పెదవి విప్పనున్న ప్రధాని మోదీ!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మళ్లీ అమీ-తుమీకి అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. బుధవారం నుంచి పునఃప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాలను ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నోట్ల రద్దుపై ప్రతిపక్షాల ఆందోళనలతో గతకొన్నిరోజులుగా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలందరూ పార్లమెంటుకు హాజరుకావాలని విప్ జారీ చేసింది. నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకు వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం అంశాన్ని అధికారపక్షం తెరపైకి తెచ్చే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సహా పలువురిపై ఆరోపణలు రావడం కాంగ్రెస్ను ఇరకాటంలో నెట్టుతోంది. మరోవైపు బీజేపీ కూడా తన ఎంపీలకు విప్ జారీచేసింది. రాజ్యసభలోనూ, లోక్సభలో ఫుల్బెంచ్ హాజరుకావాలని స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ప్రధాని మోదీ బుధవారం ఉదయం కీలక మంత్రులతో సమావేశం నిర్వహించే అవకాశముంది. అంతేకాకుండా తొలిసారి ప్రధాని మోదీ నోట్లరద్దుపై పార్లమెంటులో మాట్లాడే అవకాశముందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రానున్న మూడురోజులు ప్రధాని మోదీ పార్లమెంటుకు హాజరుకానున్నారని, సభలో జరిగే చర్చలో ఆయన పాల్గొంటారని అధికారపక్షం ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మోదీ పార్లమెంటులో మాట్లాడే అవకాశముందని చెప్తున్నారు. -
అదే విషయం పార్లమెంట్ లో చెప్పలేరా?
-
అదే విషయం పార్లమెంట్ లో చెప్పలేరా?
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. పాత పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. శుక్రవారం సమావేశమైన వెంటనే పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం మొదలైంది. ప్రధాని మోదీ సభకు రావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో చైర్మన్ ముందు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ లో తప్ప అనిచోట్ల ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు వెనుక రాజకీయ దురుద్దేశం లేదని మోదీ చెబుతున్నారని, అదే విషయాన్ని పార్లమెంట్ లో చొప్పొచ్చు కదా అని వ్యాఖ్యానిచారు. నల్లధనం ఎవరి దగ్గర ఉందే చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. నల్లధనానికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తప్పుబట్టారు. ’మోదీ వ్యాఖ్యలు చాలా తప్పు. ప్రధాని ఇలాంటి ఆరోపణలు ఎలా చేయగలుతున్నారు. మోదీ క్షమాపణలు చెప్పాల’ని ఆజాద్ మండిపడ్డారు. జేడీ(యూ), సమాజ్ వాదీ పార్టీ నాయకులు కూడా.. మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యులు కార్యకలాపాలు స్తంభింపజేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. -
ఇలాగేనా వ్యవహరించేది!: కురియన్
-
ఇలాగేనా వ్యవహరించేది!
- నఖ్వీ, ఆనంద్ శర్మలపై కురియన్ ఆగ్రహం - సభ నిర్వహణకు సహకరించాలని సూచన న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చ జరగకుండా వాయిదా పడుతున్నాయి. నోట్లరద్దుపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు, విపక్షాలపై చేయి అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నించటంతో బుధవారం కూడా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ పరిస్థితిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ మండిపడ్డారు. ఇరు పక్షాలు ఆందోళన పక్కనపెట్టాలని సూచించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మలపై మండిపడ్డారు. విపక్షాల ఆందోళనతో సభ మధ్యాహ్నం రెండు గంటలవరకు రెండుసార్లు వాయిదా పడింది. తర్వాత సభ ప్రారంభం కాగానే, ఆనంద్ శర్మను పారుుంట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు అనుమతిచ్చారు. శర్మ మైక్ తీసుకుంటూనే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ మొదలుపెట్టారు. అధికార సభ్యులు నినాదాలతో అడ్డుకున్నారు. కురియన్ పలుమార్లు చెప్పినా బీజేపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన నఖ్వీపై బీజేపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సభను అడ్డుకోవటం అధికార పక్షం ఉద్దేశం కాదని సభ జరుగుతున్న తీరుపై ఆవేదన కలుగుతోందని నఖ్వీ అన్నారు. ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ శర్మను ప్రశ్నించారు. శర్మ రాజ్యాంగం పేపర్లు తిరగేస్తూ కనిపించారు. దీనిపై కురియన్ మండిపడ్డారు. కాగా, గురువారం ప్రధాని రాజ్యసభలో ప్రసంగించే అవకాశం ఉంది. లోక్సభలో బుధవారం కూడా కార్యక్రమాలు స్తంభించాయి. విపక్షాలువారుుదా తీర్మానానికి పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాని మోదీ కాసేపు లోక్సభలో ఉన్నారు. -
మూడో రోజు... మారని తీరు
-
మూడో రోజు... మారని తీరు
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలపై వరుసగా మూడో రోజు పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం కొనసాగింది. అధికార, విపక్ష సభ్యుల వాదప్రతివాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు, రాజ్యసభ కూడా ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన పెద్దల సభ మధ్యాహ్నం 12 గంటల వరకు మరోసారి వాయిదా పడింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టాలని అధికార పక్షం డిమాండ్ చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పెద్దల సభలో గందరగోళం నెలకొంది. లోక్ సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు సభలో ఉండాలని తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తృణమూల్ ఎంపీలు ధర్నా చేశారు. -
లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ ప్రైవేటుబిల్లు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ (శుక్రవారం) లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ బిజినెస్ లో 9వ ఐటమ్గా ఆ బిల్లు లిస్ట్ అయింది. అలాగే పునర్ విభజన చట్టంలో ఇచ్చిన హమీలపై సభలోపట్టుబడతామని, పోలవరం,రైల్వే జోన్ సహా అన్ని అంశాలను పార్లమెంట్లో లేవనెత్తనున్నట్లు ఆపార్టీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. -
సోనియా ఆరోగ్యంపై మోదీ ఆరా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో విపక్ష నాయకులను పలకరించారు. లోక్ సభలోకి అడుగుపెట్టగానే ముందుగా బీజేపీ, మిత్రపక్ష నాయకులను విష్ చేశారు. ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాంవిలాస్ పాశ్వాన్, అశోక్ గజపతిరాజును పలకరించారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తో కలిసి ప్రతిపక్ష నాయలకు బెంచీలవైపు వెళ్లారు. సోనియాగాంధీని పలకరించి కుశలప్రశ్నలు వేశారు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సుదీప్ బందోపాధ్యాయ, కళ్యాణ్ బెనర్జీలతోనూ మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను ప్రధాని పలకరించారు. సోనియాతో రాజ్ నాథ్ చాలాసేపు మాట్లాడారు. సభ వాయిదా పడిన తర్వాత ప్రధాని మోదీని అభినందించేందుకు బీజేపీ ఎంపీలు పోటీ పడ్డారు. -
‘తొలిసారి నిజాయితీపరులకు గౌరవం’
న్యూఢిల్లీ: అవినీతి, నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోరాటం చేస్తున్నారని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో బుధవారం చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారి దేశంలో నిజాయితీపరులకు గౌరవం దక్కిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశం మొత్తం స్వాగతిస్తోందని, అవినీతిపరులు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ప్రధాని గౌరవించాలన్నారు. సరైన సమయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని పియూష్ గోయల్ అన్నారు. దేశంలో నిజాయితీపరులకు పండుగ అని ఆయన పేర్కొన్నారు. అవినీతిపరులు, నల్లధనంపైనే తమ యుద్ధమన్నారు. నోట్ల రద్దును తాము సర్జికల్ దాడిగా పోల్చలేదని, ఒకవేళ నల్లధనం, అవినీతి, ఉగ్రవాదంపై ఈ చర్యను సర్జికల్ దాడిగా భావిస్తే అదో సర్టిఫికెట్గా అంగీకరిస్తామన్నారు. కొన్ని సిరీస్ నోట్లు చెలామణిలో లేవని, ఆ నోట్లను ఎక్కడ దాచిపెట్టారని పియూష్ ప్రశ్నించారు. -
ఆ డబ్బంతా నల్లధనమేనా?
-
ఆ డబ్బంతా నల్లధనమేనా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో పెద్దనోట్లను రద్దు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం రూ.500, 1000 నోట్లేనని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. ఈ డబ్బంతా నల్లధనమేనా అంటూ ఆయన సూటిగా ప్రశించారు. నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీయడానికి మేం వ్యతిరేకం కాదు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్ పెరుగుతున్న కొద్ది నగదు విత్ డ్రాను కేంద్రం పెంచుతోంది నగదు రహిత దేశమన్న నేతలు సామాన్యుల కడుపులు నింపే దాబాల్లో కార్డులు చెల్లవని మర్చిపోయారు ఎలాంటి సమయం ఇవ్వకుండా, హెచ్చరిక చేయకుండా పెద్దనోట్లు రద్దు చేశారు రైతుల వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయా? దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నలు నల్లధనాన్ని ఇంటికి తీసుకువెళుతున్నారా? సామాన్యుల వద్ద ఉన్న రూ.500, 1000నోట్లు నల్లధనమా ప్రతి విషయాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. ఏమీ చదువుకోకుండానే మీరంతా డాక్టర్లు అయ్యారు నోట్ల రద్దుతో మీరు ఎంపిక చేసుకున్న 15-20మంది పారిశ్రామిక వేత్తలకు సాయం చేశారు రెండున్నరేళ్లలో అప్పు మాఫీ చేసింది ఎవరికీ, రైతులకా? పారిశ్రామికవేత్తలకా? మీకు నచ్చినవాళ్లను నెత్తిన పెట్టుకుంటున్నారు తప్పు చేశారని ప్రశ్నిస్తే నిందిస్తున్నారు ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది రంగుపోయే రూ.2వేల నోటును ఎవరూ నమ్మడం లేదు నల్లధనం సూట్కేసుల్లోనూ, కప్ బోర్డులోనూ లేదు వేలకోట్ల నల్లధనవంతులతో మోదీ విమానాల్లో తిరుగుతున్నారు స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పేర్లు బయటపెట్టాలి ఆస్తులు, పెట్టుబడుల రూపంలో నోట్ల రద్దు వల్ల శుభకార్యాలు నిలిచిపోయాయి దహన సంస్కారాలపై కూడా రద్దు ప్రభావం పడింది సామాన్యులకు ప్రధాని క్షమపణ చెప్పాలి 1946లో తొలిసారి, 1978లో రెండోసారి నోట్ల రద్దు జరిగింది అప్పుడు ఇలాంటి గందరగోళం ఏర్పడలేదు నోట్ల రద్దు పక్షపాతంతో తీసుకున్న నిర్ణయం దేశం మొత్తాన్ని మీరు క్యూలో నిలబెట్టారు బ్యాంకుల ముందు ఎవరైనా ధనికులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారా? -
లోక్ సభ సమావేశాలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: లోక్ సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డారు. తొలిరోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇటీవల మృతి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఎంపీ రేణుక సిన్హా మృతికి సభ సంతాపం తెలిపిన వెంటనే సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు రాజ్యసభలోనూ థాయ్లాండ్ రాజు మృతికి సంతాపం తెలిపింది. రాజ్యసభలో పెద్దనోట్లపై నిరసన అనంతరం నోట్ల రద్దును నిరసిస్తూ రాజ్యసభ సభ్యులు నిరసనకు దిగారు. ఈ అంశంపై చర్చ జరగాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై అజెండా ప్రకారమే చర్చకు అనుమతి ఇస్తామని డిప్యూటీ స్పీకర్ కురియన్ స్పష్టం చేశారు. నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారన్నారు. నల్లధనం వెలికి తీయడానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. ఒక్కమాటతో 86 శాతం కరెన్సీ పనికిరాకుండా పోయిందని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. -
ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ...ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపారు. నెలరోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో నోట్ల రద్దుతో పాటు సర్జికల్ దాడులు, జమ్మూకశ్మీర్, ఓఆర్ఓపీ, రైతుల సమస్యలు వంటి అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపిస్తూ, పార్లమెంట్ సమావేశాలలో తొలుత పెద్ద నోట్ల రద్దు, తదనంతరం ప్రజల అవస్థలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. నోట్ల రద్దుపై సంయుక్త పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో పార్లమెంటును స్తంభింపజేయనున్నాయి. అంతకు ముందు... ప్రధానమంత్రి పార్లమెంట్ మీడియా హౌస్ వద్ద మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. -
15న అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 16 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో 15న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు జీఎస్టీ బిల్లులుసహా పలు బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాల సహకారం కోరేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. ప్రధానిసహా ప్రధాన పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు, సైన్యం సర్జికల్ దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా, ట్రిపుల్ తలాఖ్ అంశాలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్తో సమావేశాలను స్తంభింపజేసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం, పోలవరం అంశాలపై ఏపీ ఎంపీలు పట్టుబట్టే వీలుంది. -
కాస్త ముందుగానే శీతాకాల సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈసారి కాస్త ముందుగానే ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న జీఎస్టీకి అనుబంధ బిల్లులైన సీజీఎస్టీ, ఐజీఎస్టీలకు ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్నాయి. వార్షిక బడ్జెట్ను కూడా సాధారణం కన్నా ఈ ఏడాది కొంచెం ముందుగానే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నవంబరు తొలి పక్షంలోనే సమావేశాలను ప్రారంభించేందుకు ఉన్న మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ సమావేశం నిర్వహిస్తుండగా, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ సంఘం 13వ తేదీన భేటీ అవుతోంది. రెండు భేటీల అనంతరం పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఎప్పటినుంచి మొదలుపెడతారో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబరు 3వ లేదా 4వ వారంలో ప్రారంభమవుతాయి. -
సోషల్ మీడియాలో ఎలా వచ్చాయి?
‘రోజా వీడియో’పై అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శిని ప్రశ్నించిన వైఎస్సార్సీఎల్పీ సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ నెల 18వ తేదీన సభలో జరిగిన ప్రొసీడింగ్స్ను తాము అడిగితే ఎవ్వరికీ ఇచ్చేది లేదని చెప్పిన తరువాత ఒక్క గంటకే అవి సోషల్ మీడియాకు లీకు అవ్వడంపై బుధవారం వైఎస్సార్ శాసనసభాపక్షం శాసనసభ ఇన్చార్జి కార్యదర్శిని నిలదీసింది. పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ నేత్వత్వంలోని పలువురు పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. ‘ఈ నెల 22వ తేదీన మేం మిమ్మల్ని కలిసి 18వ తేదీన సభలో జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్ కావాలని రాతపూర్వకంగా అడిగితే ‘ఎవ్వరికీ ఎటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేద’ని చెప్పారు. మీరు చెప్పిన ఒక్క గంటకే సోషల్ మీడియాలో శాసనసభ లోపల జరిగిన కొన్ని వీడియోలు (రోజా మాట్లాడిన మాటలు) మాత్రమే ఏ విధంగా బయటకు వచ్చాయో మీరు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. మీకు తెలియకుండా ఈ వీడియోలు బయటకు వస్తే.. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధం. ముందుగా మీరు రాతపూర్వకంగా మాకు వివరణ ఇచ్చి, ఆ వీడియోలు విడుదల చేసి సభా సంప్రదాయాలను మంట గలిపినవారు ఎంతటి వారైనా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాక్షం తరుపున కోరుతున్నాం’ అంటూ శాసనసభా పక్ష ఉప నేత జోత్యుల నెహ్రూ పేరుతో అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. శాసనసభ లోపల జరిగిన ప్రొసీడింగ్స్ను స్పీకర్ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీడియాకు విడుదల చేయడం జరిగితే తమకు అభ్యంతరం లేదని.. అయితే, స్పీకర్ కానీ, స్పీకర్ కార్యాలయం కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ లోపల జరిగిన ప్రొసీడింగ్స్ను అధికారికంగా విడుదల చేయడం జరగలేదని జోత్యుల నెహ్రూ పేర్కొన్నారు. అవి బయటకు పొక్కడానికి కారకులపై చర్యలు తీసుకోకుంటే.. శాసనసభ కార్యదర్శి, లేదంటే స్పీకర్ కార్యాలయం నుంచే అవి బయటకు వచ్చాయని అనుమానించాల్సి ఉంటుందని నెహ్రూ శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. -
శీతాకాలమూ మునిగింది
ముగిసిన పార్లమెంటు సమావేశాలు ♦ ఉభయ సభల్లో నిరసనలు, ఆందోళనలదే రాజ్యం ♦ లోక్సభలో 13, రాజ్యసభలో 9 బిల్లులకు ఆమోదం ♦ పెండింగ్లో జీఎస్టీ సహా పలు కీలక బిల్లులు న్యూఢిల్లీ: నిరసనలు, గందరగోళం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్జీవంగా ముగిశాయి. వర్షాకాల సమావేశాల్లాగే ఈసారీ విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. కీలక బిల్లులకు ఆమోదం పొందాలనుకున్న ప్రభుత్వానికి.. రాజ్యసభలో కాంగ్రెస్ ఊపిరిసలపనివ్వలేదు. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 26ను రాజ్యాంగ దినంగా ప్రకటిస్తూ.. రాజ్యాంగంపై చర్చతో ఈ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సెషన్లో తొలి రెండురోజులే సభ సజావుగా జరిగింది. మూడో రోజు నుంచీ గందరగోళమే రాజ్యమేలింది. 2016, ఏప్రిల్ 1 నుంచి అమలు చేద్దామనుకున్న కీలకమైన జీఎస్టీతోపాటు పలు బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఆత్మవిమర్శ చేసుకోవాలి: అన్సారీ రోజూ నిరసనలు, ఆందోళనలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంటు జరిగిన తీరుపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బుధవారం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 రోజుల సమావేశాల్లో రాజ్యసభ 47 గంటల సమయం విపక్షాల ఆందోళనలకే సరిపోయిందన్నారు. సమావేశాలను అడ్డుకోవటంపై సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. గతవారం ఒక్క గంట కూడా రాజ్యసభ నడవలేదని గుర్తుచేశారు. ‘ప్రజాసమస్యలపై మన చిత్తశుద్ధిని ఈ సమావేశాలు ప్రతిబింబిస్తాయి. సభ్యులు సహేతుకంగా వ్యవహరించాలి. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసే అవకాశాన్ని సభ్యులు కోల్పోవద్దు’ అన్నారు. సభ్యుల భాష, చేతల వల్ల పార్లమెంటు కార్యక్రమాలకు విఘాతం కలగటంతోపాటు వారి వ్యక్తిగత హక్కులకూ భంగం వాటిల్లుతుందన్నారు. లోక్సభే కాస్త మేలు.. సమావేశాల్లో రచ్చజరిగినా.. లోక్సభ పర్వాలేదన్నట్లుగా.. 13 బిల్లులను ఆమోదించింది. రాజ్యసభ 9 బిల్లులకే ఆమోదం తెలిపింది. అదీ చివరి రోజు మూడు బిల్లులను చర్చ లేకుండానే.. నిమిషాల్లోనే ఆమోదించింది. మంగళవారం కీలకమైన జువనైల్ జస్టిస్ బిల్లు విషయంలో.. ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని కాంగ్రెస్ ముందడుగేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరదలపై సభలో స్వల్పకాల చర్చ జరిగింది. కేంద్ర మంత్రి వీకే సింగ్ రాజీనామా డిమాండ్, నేషనల్ హెరాల్డ్కేసులో సోనియా, రాహుల్లకు ఢిల్లీ కోర్టు సమన్లు, డీడీసీఏ వివాదం తదితరాలు రాజ్యసభను కుదిపేశాయి. స్పీకర్ విచారం.. మంగళవారం కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై (స్వార్థ ప్రయోజనాల కోసమే సభను అడ్డుకుంటున్నారని) సమావేశాల చివరి రోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ‘కాంగ్రెస్ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. అయితే వారి చేతల ద్వారా ఇతరుల మనోభావాలు కూడా దెబ్బతింటున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నారు. అంతకుముందు ఉభయసభలు ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలిపాయి. ఆమోదం పొందిన ముఖ్యమైన బిల్లులు లోక్సభలో.. బోనస్ బిల్లు, దివాలా బిల్లు, మధ్యవర్తిత్వ-ఒప్పంద సవరణ బిల్లు, అణుశక్తి బిల్లు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ బిల్లు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిల్లు, పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు రాజ్యసభలో.. జువనైల్ జస్టిస్ బిల్లు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ బిల్లు, కమర్షియల్ కోర్టులు-కమర్షియల్ డివిజన్ బిల్లు, మధ్యవర్తిత్వ-ఒప్పంద సవరణ బిల్లు, బోనస్ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు. మోదీ పనిచేస్తే.. కాంగ్రెస్ ఔట్: వెంకయ్య మరోవైపు, పార్లమెంటు వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సభల్లో కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ సభలను స్తంభింపజేసిందన్నారు. ప్రధాని మోదీ సరిగా పనిచేస్తే.. వారికి భవిష్యత్తు ఉండదనే భయంతోనే.. సంస్కరణలను అడ్డుకుంటున్నారన్నారు. కాగా, ప్రభుత్వం దేశంలో తమ పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటు సమావేశాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారన్న బీజేపీ వార్తల్లో వాస్తవం లేదని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. బోనస్ బిల్లుపై దత్తాత్రేయ హర్షం ఉభయ సభల్లో బోనస్ చెల్లింపు సవరణల బిల్లు ఆమోదం పొందడంపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తన శాఖ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. దత్తాత్రేయకు బీఎంఎస్ నేతలు మిఠాయిలు తినిపించారు. ‘యూపీ’ కోసమే తెరపైకి అయోధ్య రాజ్యసభలో విపక్షాల ధ్వజం అధికార బీజేపీ, ఆరెస్సెస్లు దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయని బుధవారం రాజ్యసభలో విపక్షాలు ధ్వజమెత్తాయి. 2017లో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున మతప్రాతిపదికన చీలికతెచ్చి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్, బీఎస్పీ, జేడీయూ విమర్శించాయి. రామమందిర నిర్మాణ సన్నాహాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నాయి. మందిర నిర్మాణం ఇప్పుడే జరగాలని మోదీ సంకేతాలిచ్చినట్లు మహంత్ నృత్యగోపాల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించి, సభను అడ్డుకున్నాయి. అయితే.. మందిర విషయంలో కేంద్రం, బీజేపీ కట్టుబడిఉన్నాయని.. మంత్రి నఖ్వీ వివరించారు. అయినా విపక్షాలు ఆందోళన విరమించలేదు. ఇదిలా ఉండగా.. మందిర నిర్మాణానికి మోదీ ఆలోచనతో సంబంధం లేదని.. ధర్మాచార్యులు, ప్రజల సాయంతో మందిరాన్ని నిర్మిస్తామని వీహెచ్పీ తెలిపింది. శీతాకాల సమావేశాలు నవంబర్ 26 నుంచి ఈ నెల 23 వరకు సాగాయి. లోక్సభ 117గంటల 14 నిమిషాలు కొనసాగగా, రాజ్యసభ 60 గంటలకుపైగా కొనసాగింది. గొడవలు, వాయిదాలతో లోక్సభలో 8 గంటల 37 నిమిషాలకాలం, రాజ్యసభలో 47 గంటల సమయం వృథా అయింది. వాయిదాల తర్వాత ఆలస్యంగా మొదలవడంతో లోక్సభలో 17గంటల 10 నిమిషాలు, రాజ్యసభలో ఐదు గంటలుపైగా సమయం వృథా అయ్యింది. లోక్సభలో 9 ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టారు. 13 బిల్లులు ఆమోదం పొందాయి. 117 ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కేవలం ఒక ప్రభుత్వ బిల్లును ప్రవేశపెట్టారు. మూడు బిల్లులను ఉపసంహరించారు. ఆమోదం పొందిన, తిరస్కరణకు గురైన మొత్తం బిల్లులు తొమ్మిది ఉన్నాయి. రెండు బిల్లులను సంయుక్త కమిటీ, సెలక్ట్ కమిటీల పరిశీలనకు పంపించారు. -
'పార్లమెంటు సమావేశాలపై దేశమంతటికీ అసంతృప్తి'
-
'పార్లమెంటు సమావేశాలపై దేశమంతటికీ అసంతృప్తి'
న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని, ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగిన తీరుపై యావత్ భారతదేశం అసంతృప్తిగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత నవంబర్ 26న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు 112 గంటలు కేటాయించగా కేవలం సగం సేపు మాత్రమే సభ జరిగిందని, అందువల్ల దాదాపు రూ.10 కోట్ల ప్రజాధనం వృథా అయిందని వెంకయ్య వివరించారు. రాజ్యసభలో కేవలం 9 బిల్లులే ఆమోదం పొందాయని, తాము అనుకున్న దాంట్లో 46 శాతం మాత్రం చేయగలగడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. లోక్సభకు 114 గంటలు కేటాయించగా, 115 గంటల సమయం సభ కొనసాగిందని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి తప్పులు జరగలేదన్నారు. పార్లమెంట్ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. ఈ శీతాకాల సమావేశాలలో లోక్సభలో 14 బిల్లులు ఆమోదం పొందాయని చెబుతూ.. దీనిపై హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభను ఎందుకు సజావుగా సాగనివ్వలేదన్న దానిపై దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిందే అన్నారు. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించారని చెప్పారు. -
ఎపీకి ప్రత్యేక హోదా కల్పించాలి..
-
ముగిసిన పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ భేటీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై చర్చించేందుకు సమావేశమైన కేంద్ర కేబినెట్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ భేటీ ముగిసింది. శీతాకాల సమావేశాల తేదీలపై ఈ భేటీలో స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం కావాలని కేంద్ర కేబినెట్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. దీంతో త్వరలో మరోసారి ఈ కమిటీ భేటీ కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై చర్చించేందుకు ఈ కమిటీ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయిన సంగతి తెలిసిందే. -
సజావుగా పార్లమెంట్ సమావేశాలు: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ముఖ్యమైన అంశాలను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు కలిసిరావాలని ఆయన కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయనీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రభుత్వాన్ని నిలదేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీమా రంగంలో ఎఫ్ డీఐ పెంపు వ్యతిరేకిస్తామని జేడీ(యూ), సీపీఎం, బీఎస్పీ, ఎస్పీ ప్రకటించాయి. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ మద్దతు కోరతామని తెలిపాయి. -
నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్నాయి. పలు బిల్లుల ఎజెండాతో 30 రోజులపాటు సాగే సెషన్లో 22 సార్లు పార్లమెంట్ భేటీ కానుంది. ప్రైవేటు సభ్యుల బిల్లుల కోసం నాలుగు రోజులు కేటాయించనున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారమిక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ షెడ్యూలును ఖరారు చేసింది.తర్వాత షెడ్యూలును ఆమోదించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. కేబినెట్ కమిటీ భేటీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్లో ఉన్న 67 బిల్లుల్లో(లోక్సభలో 8, రాజ్యసభలో 59 బిల్లులు) 35 బిల్లులను ఆమోదం కోసం చేపడతారు. ఆర్థిక బిల్లులకు సమయం కేటాయించ ండి పార్లమెంటులో ముఖ్యమైన ఆర్థిక బిల్లులపై చర్చకు తగినంత సమయం దొరకడం లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మార్గాలు అన్వేషించాలని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను సూచించారు. ఆయన సోమవారమిక్కడ అకౌంటెంట్స్ జనరల్ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. మొదటి నాలుగు లోక్సభలతో పోలిస్తే తర్వాత లోక్సభలు ఆర్థిక బిల్లులకు తక్కువ సమయం కేటాయించాయన్నారు.డబ్బులు కేటాయించి పన్ను విధిస్తున్న పార్లమెంటు ఆర్థిక విషయాలకు తగిన సమయం కేటాయించడం లేదంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమిత్ర దృష్టికి తీసుకొచ్చారు. సుమిత్ర మాట్లాడుతూ.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) విమర్శలనే కాకుండా సంబంధిత సంస్థల విజయాలను కూడా గుర్తించాలని ప్రణబ్ అన్నారు. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు జరుగుతాయి. 22 పని దినాలలో సమావేశాలు నిర్వహిస్తారు. హొం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఉభయ సభలలో 67 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. రాజ్యసభలో 59, లోక్సభలో 8 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలో అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, అనంత కుమార్, ఎం.వెంకయ్య నాయుడు సభ్యులుగా ఉన్నారు. ప్రకాష్ జవదేకర్, సంతోష్ గ్యాంగ్వార్, స్మృతి ఇరానీలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ** -
ఎట్టకేలకు లోక్పాల్!
రెండున్నరేళ్లుగా లోక్పాల్ బిల్లుతో యూపీఏ ప్రభుత్వం సాగిస్తున్న దోబూచులాట ముగిసింది. ఆ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందుకు తీసుకు రావడంతో ఆగక మెరుపువేగంతో దాన్ని ఆమోదింపజేసుకుంది. ఉభయసభలూ ఆందోళనలతో అట్టుడికినా చర్చ, ఓటింగ్ జరిగిపోయాయి. సమాజ్వాదీ పార్టీ మినహా రాజకీయపక్షాలన్నీ ఒక్కటై అత్యుత్సాహంతో బిల్లుకు పచ్చజెండా ఊపాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఏదో వంకన బిల్లును దాటేయాలని చూస్తున్నాయని, అందువల్ల చర్చ అవసరం లేకుండానే ఆమోదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తొలుత బీజేపీ ప్రకటించింది. ఇన్నాళ్లూ ఉప్పు, నిప్పులా ఉన్న పాలకపక్షం, అన్నా హజారే బృందం సంబంధాలు కూడా ఊహించని రీతిలో కొత్త మలుపు తిరిగాయి. అవినీతిపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రంగా దీన్ని అభివర్ణించడంతో పాటు ఈ బిల్లు సాకారం కావడానికి కారణం మీరంటే మీరని ఇద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు. పొగడ్తల లేఖలు రాసుకున్నారు. బిల్లు విషయంలో ఎనలేని చొరవను ప్రదర్శించారని రాహుల్గాంధీని అన్నా హజారే అభినందిస్తే... ఈ సమస్యపై దేశం దృష్టి కేంద్రీకరించేందుకు అన్నా చేపట్టిన ఆందోళన దోహద పడిందని రాహుల్ పొగిడారు. వీరందరిలో ఇంత మార్పు రావడానికి కారణం ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలని వేరే చెప్పనవసరం లేదు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఊహించని రీతిలో 28 స్థానాలు గెలవడంతో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీల గుండెల్లో గుబులు మొదలైంది. వెనువెంటనే లోక్పాల్ బిల్లును గట్టెక్కించకపోతే దేశమంతా ఢిల్లీ ఫలితాలే పునరావృతమైనా ఆశ్చర్యంలేదన్న నిర్ణయానికొచ్చాయి. ఇంతకూ లోక్పాల్ నిజంగా బ్రహ్మాస్త్రమేనా? లేక అది అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నట్టు జోక్పాలేనా? పలువురు అంటున్నట్టు అది ఆరోవేలుగా మిగిలి పోతుందా? గతంలో ఇదే లోక్పాల్ బిల్లును యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దాన్ని ముక్తకంఠంతో తిరస్కరించిన అన్నా, కేజ్రీవాల్ ఇప్పుడు వేర్వేరు శిబిరాల్లో ఉన్నారు. అది సింహాన్ని సైతం ఒడిసిపట్టగలదని అన్నా అభివర్ణిస్తే... చిట్టెలుకను పట్టడానికి కూడా అది పనికిరాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అన్నా బృందంలో కేజ్రీవాల్ భాగంగా ఉన్నప్పుడు రూపొందిన జన్లోక్పాల్ బిల్లుపై అప్పట్లో వివిధ వర్గాలనుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అన్నా బృందం తక్కువచేసి చూస్తున్నదని, అది రూపొందించిన జన్లోక్పాల్ బిల్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమాంతరంగా ఎలాంటి బాధ్యతా లేని మరో వ్యవస్థను ప్రతిపాదిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తాయి. తమ బిల్లుతో పోలిస్తే తీసికట్టుగా ఉన్నదని చెప్పి అప్పట్లో లోక్పాల్ బిల్లును అన్నా బృందం తిరస్కరించింది. కానీ, ఇప్పుడు ఆ బిల్లునే అన్నా హజారే ప్రశంసిస్తున్నారు. లోక్పాల్ నియామకం, తొలగింపు దగ్గరనుంచి దాని పనితీరు వరకూ అన్నిటిలోనూ అన్నా బృందం అప్పట్లో ప్రతిపాదించిన అంశాలకూ, ఇప్పటి బిల్లుకూ పోలికలు లేవు. ప్రధాని, లోక్సభలో విపక్ష నేత, స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి... వీరంతా ఎంచుకున్న మరొకరూ కలిసి లోక్పాల్ను ఎంపికచేస్తారని ప్రభుత్వ బిల్లు పేర్కొంది. ఇలాగైతే, రాజకీయ నాయకుల మాటే నెగ్గుతుంది గనుక ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు...కాగ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉమ్మడిగా నామినేట్ చేసే సభ్యుడొకరు, వీరితోపాటు ప్రధాని, లోక్సభలో విపక్ష నేత ఉండాలని జన్లోక్పాల్ ప్రతిపాదించింది. లోక్పాల్ తొలగింపునకు ఏ పౌరుడు చేసే ఫిర్యాదు అయినా సుప్రీంకోర్టు పరిశీలించవచ్చునని జన్లోక్పాల్ చెప్పగా, ప్రభుత్వం లేదా 100మంది ఎంపీలు సుప్రీంకోర్టుకు ఫిర్యాదుచేసినప్పుడే ఆయనను తొలగించాలని ప్రభుత్వ బిల్లు నిర్దేశిస్తోంది. సీబీఐ డెరైక్టర్ నియామకం, ఆ సంస్థ పనితీరు కూడా ఇప్పటిలా ప్రభుత్వం కనుసన్నల్లోనే ఉంటాయి. దాన్ని స్వతంత్ర సంస్థగా ఉంచాలన్న జన్లోక్పాల్ ధ్యేయం నెరవేరలేదు. కాకపోతే దానికి ప్రభుత్వంతోపాటు లోక్పాల్ అనే మరో బాస్ తయారవుతారు. సంస్థ డెరైక్టర్ ఎంపికను ప్రధాని, లోక్సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కొలీజియం చూస్తుందని బిల్లు చెబుతోంది. లోక్పాల్తోపాటే అచ్చం అదే నిబంధనలతో రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పడాలన్న అన్నా బృందం సూచనకు గండికొట్టి ఏడాదిలోగా లోకాయుక్తలను రాష్ట్రాలు ఏర్పాటుచేయాలని కొత్త బిల్లు నిర్దేశించింది. లోక్పాల్ ఏర్పాటుకు ప్రాణమనదగ్గ సిటిజన్స్ చార్టర్ ప్రస్తావన కొత్త బిల్లులో లేదు. వాస్తవానికి అన్నా నిరాహారదీక్ష చేసినప్పుడు సిటిజన్స్ చార్టర్ను లోక్పాల్లో భాగం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పౌర సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యే అధికారుల ప్రాసిక్యూషన్కు వీలుకల్పించే ఆ నిబంధన లేకుండా సామాన్య జనానికి లోక్పాల్ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకోసం వేరే చట్టం తెస్తామని కేంద్రం అంటోంది. అదెంతవరకూ ఆచరణలోకొస్తుందో చూడాలి. న్యాయమూర్తులు, ఎంపీలతోసహా అందరినీ లోక్పాల్ పరిధిలోకి తీసుకురావాలన్న జన్లోక్పాల్ సంకల్పానికి కూడా బిల్లు గండికొట్టింది. బిల్లులో న్యాయమూర్తుల ప్రస్తావన లేదు. న్యాయమూర్తుల జవాబుదారీతనం బిల్లు ఆ సంగతిని చూస్తుందని ప్రభుత్వం అంటోంది. అలాగే, ఎంపీల విషయంలోనూ బిల్లు కొన్ని మినహాయింపులనిచ్చింది. తప్పుడు ఫిర్యాదులిచ్చే వారికి ఏడాది ఖైదు విధించవచ్చని పొందుపరిచిన నిబంధనవల్ల చిత్తశుద్ధితో ఫిర్యాదుచేసేవారు సైతం జంకుతారు. మొత్తానికి దాదాపు అయిదు దశాబ్దాలనుంచి రకరకాల రూపాల్లో పార్లమెంటు ముందుకొచ్చి కూడా ఆమోదానికి నోచుకోని లోక్పాల్ బిల్లు తొలిసారి చట్టం కాబోతున్నది. ఎన్ని లోటుపాట్లున్నా అది సాకారం కావడమే వర్తమాన అవసరం. ఆచరణలో ఎదురయ్యే సమస్యలనుబట్టి సవరణల ద్వారా కట్టుదిట్టం చేయడానికి ఎటూ వీలుంటుంది. ఆ కోణం నుంచి చూస్తే లోక్పాల్ రాకను స్వాగతించవలసిందే. -
రేపటితో ముగింపు?
-
రేపటితో ముగింపు?
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ముందుగానే ముగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ముగియాల్సిన తేదీ కంటే వారం ముందుగానే అంటే.. శుక్రవారం నుంచి ఉభయ సభలూ నిరవధికంగా వాయిదాపడే అవకాశాలున్నాయని పార్లమెంటు వర్గాలు చెబుతున్నాయి. ఉభయ సభల్లోనూ గురువారం సాయంత్రానికల్లా ఆర్థిక వ్యవహారాలను ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. అవి ముగిసిపోతే అసలు గురువారమే పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలూ లేకపోలేదని కొందరు నేతలు అంటున్నారు. మరోవైపు బుధ, గురు, శుక్రవారాల్లో పార్టీ ఎంపీలందరూ పార్లమెంటులో అందుబాటులో ఉండి.. ప్రభుత్వ వ్యవహారాలకు అనుగుణంగా ఓటేయాలంటూ కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసింది. ఈ నెల 5న మొదలైన పార్లమెంటు సమావేశాలు ఇంతకుముందు నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 20 వరకు సాగాల్సి ఉంది. వీటిని ముందే ముగిస్తారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ మండిపడింది. మూడోరోజూ స్తంభించిన ఉభయ సభలు: పలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మూకుమ్మడి దాడికి దిగడంతో వరుసగా మూడోరోజు పార్లమెంట్ ఉభయసభలు స్తంభించా యి. ఉదయం 11లకు లోక్సభ సమావేశమైనపుడు స్పీకర్ మీరాకుమార్ లోపలికి అడుగుపెట్టారో లేదో పలు పార్టీల సభ్యులు నినాదాలతో ఆందోళనకు దిగారు. వివిధ సమస్యలపై పెద్దపెట్టున నినదించారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో చలిపులి బారిన పడి మరణించిన 60మందికి సంతాపం తెలిపే ప్రకటనను ఈ నినాదాల మధ్యే స్పీకర్ చది వారు. మృతులకు అంజలి ఘటించడానికి సభ్యులందరూ తమ స్థానాల్లో నిలబడాలని ఆమె కోరారు. అయినా పలువురు సభ్యులు వెల్నుంచి వెళ్లకుండా అక్కడే ఉండటంతో ఆమె ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తంచేయడంతో సభ్యులందరూ తమ స్థానాలకు వెళ్లారు. మృతులకు అంజలి ఘటించడం పూర్తయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో ఆయా పక్షాల సభ్యులు మళ్లీ వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయసాగారు. టీడీపీ సహా పలు పార్టీలవారు వెల్లో గొడవ చేయగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఎంపీలు మేకపాటి, ఎస్పీవై రెడ్డి మొదటివరుస బెంచీలవరకు వెళ్లి అక్కడ నిలబడి ఆందోళన సాగించారు. ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’(ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగానే ఉంచండి) అనే నినాదం రాసివున్న ప్లకార్డులను మేకపాటి, ఎస్పీవై ప్రదర్శించారు. అవిశ్వాసానికి నోటీసిచ్చిన ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లోనే నిలబడగా అధికార పక్షానికే చెందిన తెలంగాణ ఎంపీలు కూడా మొదటివరుస బెంచీలవరకు వచ్చి పోటీ ఆందోళన జరిపారు. తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలీని పరిస్థితి ఉండటంతో స్పీకర్ సభను 12వరకు వాయిదావేస్తున్నట్టు 11.04 గంటలకు ప్రకటించారు. సభ తిరిగి మొదలైనపుడు ఉదయం దృశ్యాలే పునరావృతమయ్యాయి. గందరగోళం మధ్యే స్పీకర్ ఆదేశాల ప్రకారం మంత్రులు, కమిటీల సంబంధితులు తమ పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థికమంత్రి పి.చిదంబరం అనుబంధ పద్దులను సభలో ప్రవేశపెట్టారు. ఇదయ్యాక స్పీకర్ అవిశ్వాసం నోటీసుల అంశాన్ని ప్రస్తావించారు. మూడు నోటీసులు అందాయి: అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మూడు నోటీసులు తనకు అందాయని స్పీకర్ మీరాకుమార్ సభలో ప్రకటించారు. సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే తాను ఆ నోటీసులను సభ ముందుంచగలుగుతానన్నారు. దీంతో జగన్, మేకపాటి, ఎస్పీవై తమ స్థానాలకు తిరిగి వెళ్లగా వెల్లో ఆందోళన చేస్తున్న సభ్యులు అక్కడే ఉన్నారు. వారికి ఒకటికి రెండుసార్లు విజ్ఞప్తి చేసినా ఆందోళన సాగిస్తున్న ఇతర సభ్యులు తగ్గకపోవడంతో ఆమె 377వ నిబంధన కింద ప్రస్తావించే అంశాలను సభకు సమర్పించాల్సిందిగా సభ్యులను కోరారు. అనంతరం 12.07కు సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభదీ అదే తీరు: రాజ్యసభ ఉదయం 11లకు సమావేశమైన వెంటనే సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలను చేపట్టిన సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ ఆందోళన చేస్తున్న సభ్యులను శాంతింపచేయడానికి ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో రెండు నిమిషాలకే సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 12గంటలకు సభ తిరిగి ఆరంభమైనపుడు 2జీ స్కాంలో జేపీసీ నివేదికపై చర్చకు బీజేపీ పట్టుబట్టింది. మరోవైపు ఎస్పీ, బీఎస్పీ తమ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై నినాదాలు కొనసాగించాయి. సభలో గందరగోళం నెలకొనడం తో డిప్యూటీ చైర్మన్ సభను వాయిదావేశారు. 2 గంటలకు సభ సమావేశమైనపుడు కూడా ఇదేపరిస్థితి పునరావృతం కావడం తో 2 నిమిషాలకే సభను డిప్యూటీ చైర్మన్ మరుసటి రోజుకు వాయిదావేసేశారు. -
హాట్ హాట్గా పార్లమెంట్
-
విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్తా
-
రాయలతెలంగాణపైనే తర్జనభర్జన
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు కొత్తగా రాయలతెలంగాణపై తర్జన భర్జనపడుతోంది. ఈ రోజు సాయంత్రం జరిగిందే జిఓఎం తుది సమావేశం అనుకున్నారు. ఢిల్లీ నార్త్బ్లాక్ హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే సారధ్యంలో జరిగిన సమావేశానికి సభ్యులు అందరూ హాజరయ్యారు. జిఓఎం సభ్యులు చిదంబరం, ఎకె ఆంటోని,వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి, జైరాం రమేశ్లతోపాటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరాలు, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు. సమావేశం దాదాపు గంటన్నరసేపు కొనసాగింది. ఎక్కువగా రాయల తెలంగాణపైనే చర్చ జరిగింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపుగానీ, ఎల్లుండి గానీ మళ్లీ జిఓఎం సమావేశం జరిగే అవకాశం ఉంది. జిఓఎం ప్రతిపాదించిన అంశాలు: రాయల తెలంగాణకే మొగ్గు - ఇరురాష్ట్రాలకూ సమానంగా 21 చొప్పున లోక్సభ స్థానాలు - 147 చొప్పున శాసనసభ స్థానాలు - ఉమ్మడి రాధానిగా హైదరాబాద్ - జిహెచ్ఎంసి పరిధి వరకూ ఉమ్మడి రాజధాని - గవర్నర్ చేతికి శాంతి భద్రతల వ్యవహారం - రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా - ఇరురాష్ట్రాలకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) వర్తింపు- రాజ్యాంగ సవరణలేకుండానే విభజన - తెలంగాణకే భద్రాచలం - కృష్ణా జలాపంపిణీకి నీటి నిర్వహణ బోర్డు - పీపీఏల నుంచి తెలంగాణకు విద్యుత్ - కొన్నొళ్ల పాటు ఉమ్మడి సర్వీసుల విధానం అమలు. ఒకే సంస్కృతి, సంప్రదాయాలు గల రాయలసీమ ప్రాంతాన్ని రెండుగా విడదీయాలనుకోవడం బాధాకరం. సీమ నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలను వేరుచేసి రాయలతెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆ ప్రాంత నాయులు ఎవరూ అంగీకరించడంలేదు. రాజకీయ ప్రయోజనాల కోసంమే కాంగ్రెస్ అధిష్టానం ఈ దారుణానికి పాల్పడుతోందని స్పష్టపోయింది. పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణను ఒప్పుకోమని తెలంగాణవాదులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ జెఏసి నేతలు ఈరోజు బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కూడా కలిశారు. తాము రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని రాజ్నాథ్ సింగ్ వారికి చెప్పారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ రాయలతెలంగాణకు ఒప్పుకునేదిలేదని తెగేసి చెప్పారు. అలా చేస్తే మరో యుద్ధమేనని హెచ్చరించారు.ఈ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 5న తెలంగాణ బంద్కు కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 బిల్లుగా పేర్కొన్న తెలంగాణ బిల్లు ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీ ముందుకు వస్తుందని సమాచారం. జిఓఎం నివేదిక, బిల్లు ముసాయిదాపై కేంద్ర మంత్రి మండలి చర్చించి ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఈ ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటునుంచి అసెంబ్లీకి పంపుతారు. బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి అసెంబ్లీకి పది రోజుల గడువు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశాలు చాలా తక్కువని భావిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలన్న బిజెపి డిమాండ్ - అఖిలపక్ష సమావేశంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపధ్యంలో ఈ నెల 5 ప్రారంభమయ్యే సమావేశాలను 20వ తేదీ వరకు కొనసాగిస్తారు. ఒక వారం విరామం తరువాత ఈ నెల 27న తిరిగి ప్రారంభించేయోచనలో కేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అధిష్టానం సూచనల మేరకే ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ నిర్ణయం తరువాత, పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించేవిధంగా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అవసరాన్ని బట్టి ఎటూ సమావేశాల కాలాన్ని పొడిగిస్తారు. 2009 డిసెంబర్ నెల రాష్ట్ర రాజకీయాల్లో ఎంత కీలకంగా నిలిచిందో, రాష్ట్ర విభజన ప్రక్రియలో ఈ డిసెంబర్ నెల అంతే అత్యంత కీలకం కానుంది. -
తెలంగాణ బిల్లు ఇప్పుడే పెట్టండి
-
తెలంగాణ బిల్లు ఇప్పుడే పెట్టండి
* అఖిలపక్ష సమావేశంలో సుష్మా స్వరాజ్ డిమాండ్ * ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలి * ప్రక్రియ నడుస్తోందని నచ్చజెప్పిన హోంమంత్రి షిండే * ఈ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం లేదని విలేకరులకు వెల్లడించిన సుష్మా స్వరాజ్ * ప్రత్యేక భేటీలపై ఆలోచించలేదన్న కమల్నాథ్ * బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే పెట్టాలని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే, బిల్లుకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోందని, అది పూర్తయితే బిల్లును తీసుకొస్తామని లోక్సభలో సభానాయకుడు, హోంమంత్రి సుశీల్కుమార్ షిండే ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సుష్మా, సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంట్లో పెట్టాలని కోరారు. శీతాకాల పార్లమెంట్ ఎజెండాపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ సోమవారం రాత్రి పార్లమెంట్ ఆవరణలోని లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెలిసిన సమాచారం ప్రకారం... అన్నిపక్షాల నాయకులు హాజరైన ఈ భేటీలో శీతాకాల పార్లమెంట్ ఎజెండాను ప్రభుత్వం తరఫున సర్క్యులేట్ చేశారు. ఇచ్చిన ఎజెండాలో అనేక ఇతర బిల్లులున్నాయే తప్పించి తెలంగాణ బిల్లు లేకపోవడం చూసిన సుష్మా వెంటనే గళం విప్పారు. చాలా కీలకమైన విభజన బిల్లును ఎందుకు ఎజెండాలో చేర్చలేదని ప్రశ్నించడమే కాకుండా బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టితీరాలని డిమాండ్ చేశారు. దీనికి షిండే స్పందిస్తూ, ముసాయిదా బిల్లు ఇంకా కేంద్ర కేబినెట్ ముందుకు రాలేదని, అది రాగానే కేబినెట్ పరిశీలించి రాష్ట్రపతికి పంపుతుందని, అక్కడి నుంచి అసెంబ్లీకి బిల్లు వెళ్తుందని, ప్రస్తుతం బిల్లుకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోందని పరిస్థితిని ఏకరువుపెట్టారు. దీంతో సుష్మా, సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంట్లో పెట్టాలని మళ్లీ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కమల్నాథ్ చెప్పడంతో ఇతర అంశాలపై చర్చ సాగింది. సమావేశానంతరం వామపక్షాల నాయకులు విలేకరులతో మాట్లాడుతూ, ఎజెండాలో బిల్లు లేదని, ప్రభుత్వం పెట్టడం లేదని అన్నారు. బిల్లు పెట్టే అవకాశం లేదు: సుష్మా భేటీ అనంతరం సుష్మా స్వరాజ్ విలేకరులతో మాట్లాడుతూ, శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. బిల్లును తప్పనిసరిగా పెట్టాలని తాము డిమాండ్ చేశామని, ఆ బిల్లుకు ఆమోదం కావాలని అన్నారు. షిండే స్పందిస్తూ, బిల్లు కేబినెట్కు వెళ్తుందని, అక్కడి నుంచి సంతకం కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్తుందని, తర్వాత అసెంబ్లీకి పంపుతారని తనకు చెప్పారన్నారు. అసలు బిల్లును ఈ సమావేశాల్లో తెచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ సమావేశాల్లోనే బిల్లు తప్పకుండా రావాలన్నది తమ డిమాండన్నారు. ప్రత్యేక సమావేశాలపై ఆలోచించలేదు: కమల్నాథ్ రాష్ట్ర విభజన బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అంశంపై ఏ ఆలోచనా చేయలేదని కమల్నాథ్ తెలిపారు. అఖిలపక్ష భేటీ తర్వాత ఆయన విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ బిల్లును ఈ సమావేశాల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. సమావేశాలకు సంబంధించిన ఇతర ప్రశ్నలకు జవాబిస్తూ, ‘‘ఇవి స్వల్పకాలిక సమావేశాలు. ఢిల్లీ ఎన్నికల్లో అందరూ ప్రచారం చేయాల్సి ఉన్నందున ఎన్నికలయ్యాక నిర్వహించాలని నిర్ణయించిన మేరకు ఇవి స్వల్పకాలమే జరగనున్నాయి. ఇంతకుముందు ఒక సభలో ఆమోదం పొంది, మరో సభలో పెండింగ్లో ఉన్న బిల్లుల ఆమోదానికి మేం ప్రయత్నిస్తాం. ఇలాంటి బిల్లులకు మేం ప్రాధాన్యమిస్తాం. పలు అంశాలపై చర్చకు తమకు సమయం కేటాయించాలని పార్టీలు కోరాయి. తొలి బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో చర్చించి ఎవరికి ఎంత సమయం కేటాయించాలనేది నిర్ణయిస్తాం’’ అని వివరించారు. అంతేకాక, ‘‘ఈ సమావేశాల వ్యవధి స్వల్పం. అవసరమైతే అర్ధరాత్రివరకూ కూర్చుని అయినా బిల్లులను ఆమోదిస్తాం. వివాదాస్పద బిల్లులపై పలు పార్టీలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఆ పక్షాలతో మేం మాట్లాడుతున్నాం. ఏదో ఒకసాకు చూపి సమావేశాలకు అంతరాయం కల్పించడం సరికాదు’’ అని ఆయనన్నారు. -
శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు: షిండే
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. మీడియాతో మంత్రి షిండే మాట్లాడుతూ ఈ నెల 21 కేంద్ర మంత్రి మండలి సమావేశమవుతుందని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభమవుతాయి. శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టాలంటే ఈ నెల 21న జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలోనే తెలంగాణ బిల్లును ఆమోదించవలసి ఉంటుంది. -
‘శీతాకాలం’లోనే టీ-బిల్లు: షిండే
* పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెడతామని వెల్లడి * 18న కీలక సమావేశాలు జరపనున్న జీవోఎం * రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో, సీఎంతో భేటీలు * 20న ముసాయిదా నివేదికకు తుది మెరుగులు * వీలైతే అదే రోజున కేబినెట్కు తెలంగాణ బిల్లు! * శరవేగంగా సాగుతున్న విభజన ప్రక్రియ సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్కు ఎప్పుడు వస్తుందనే విషయమై సాగుతున్న ఊహాగానాలకు, నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది. బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే గురువారం స్వయంగా వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీవోఎం) కేబినెట్కు నివేదిక సమర్పించడానికి శరవేగంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇందుకోసం ఈ నెల 11 నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్న జీవోఎం తాజాగా గురువారం సాయంత్రం దాదాపు నాలుగు గంటల పాటు కార్యదర్శుల స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది. ఏడు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమై ఆయా శాఖల నివేదికలపై చర్చించింది. ప్రధానంగా ఆర్థిక, హోం, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షల్లో విభజనతో ముడిపడిన అత్యంత కీలకాంశాలు- హైదరాబాద్ ప్రతిపత్తి, 371-డి, ఆస్తులు-అప్పులు, రెవెన్యూ పంపకంపై విస్తృతంగా చర్చించింది. ముసాయిదా బిల్లు అంశాలపై న్యాయశాఖ ఉన్నతాధికారులతో లోతుగా మాట్లాడింది. ఇక్కడితో శాఖలన్నింటితో చర్చల కసరత్తును దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన జీవోఎం ఈ నెల 18న మూడు కీలక భేటీలు జరపనుంది. ఆ రోజు ఉదయం10.30కు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులతో, 11.30కు సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులతో, 12.30కు సీఎం కిరణ్కుమార్రెడ్డితో భేటీ కానుంది. విభజనపై వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను విన్న మీదట ముసాయిదా నివేదిక తయారు చేసి.. 20న తుది మెరుగులు దిద్దుతోంది. 21న కేంద్ర కేబినెట్ సమావేశంలోనే నివేదికను చర్చకు పెట్టవచ్చని, ఇందుకోసమే 20న జీవోఎం చివరి సమావేశాన్ని నిర్వహించనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 26కల్లా అసెంబ్లీకి బిల్లు అనుకున్న రీతిలోనే అన్నీ జరిగితే, కేబినెట్ సమావేశంలో నివేదికను ఆమోదించి బిల్లును ఒకటి రెండు రోజుల్లోపే రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి నుంచి బహుశా 26కల్లా రాష్ర్ట శాసనసభకు బిల్లు చేరుతుందని హస్తినలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ అభిప్రాయంతో బిల్లు వెనక్కి వచ్చిన వెంటనే అంతిమంగా శీతాకాల సమావేశాల్లో బిల్లును కచ్చితంగా ఏ రోజున పెట్టాలనేదానికి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఆదేశాల మేరకు ముహూర్తాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బాలల చిత్రోత్సవం వల్లే కిరణ్ రాలేకపోయారు హోం శాఖ కార్యాలయం ఉన్న నార్త్బ్లాక్లో ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొనడానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్న షిండే.. కార్యాలయం లోపల కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ బిల్లుపై నెలకొన్న సందిగ్ధతకు, ఉత్కంఠకు ఫుల్స్టాప్ పెట్టారు. జీవోఎం ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, బిల్లును ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్నించగా, తమకప్పగించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడతామని పునరుద్ఘాటించారు. గురువారం జీవోఎంతో చర్చలకు రావాల్సిన కిరణ్కుమార్రెడ్డి ఎందుకు రాలేదని అడగ్గా బాలల చలనచిత్రోత్సవమే కారణమని షిండే చెప్పారు. ‘‘ఆయన్ను మేం 18న కలుస్తాం. సీఎంతో భేటీ తర్వాత మా నివేదిక తయారీపై దృష్టి పెడతాం’’ అని చెప్పారు. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణపై మీ నివేదికను చర్చకు పెడతారా అని ప్రశ్నించగా, ఆ సంగతి తాను చెప్పలేనంటూ శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందని పునరుద్ఘాటించారు. అధికారులకు షిండే ఆదేశాలు జీవోఎంకు అప్పగించిన పని రానున్న కొద్ది రోజుల్లో పూర్తికానున్నందున కేబినెట్కు సమర్పించాల్సిన నివేదిక రూపకల్పనకు సన్నాహాలను చకచకా చేయాలని హోంశాఖ ఉన్నతాధికారులను షిండే ఆదేశించినట్టు తెలిసింది. దాంతో జీవోఎంకు వివిధ శాఖల నుంచి అందిన నివేదికలు, అభిప్రాయాలు, సూచనలన్నింటినీ వారు క్రోడీకరిస్తున్నారని సమాచారం. అధికారులు ఒక పద్ధతి ప్రకారం వాటికి సమగ్ర రూపమిస్తున్నారని, వీటి ఆధారంగానే ముసాయిదా నివేదిక తయారవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముసాయిదా నివేదిక తయారయ్యాక జీవోఎం దాన్ని పరిశీలించి చివరగా అవసరమనుకున్న మార్పుచేర్పులు చేస్తుందని, ఆ తుది మెరుగులు పూర్తయ్యాయంటే అది కేబినెట్కు వెళ్లిపోతుందని చెప్పాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని రానున్న వారంలోపే జీవోఎం పూర్తి చేస్తుందని ఆ వర్గాలు వివరించాయి. -
డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు
-
డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నెలపాటు నిర్వహిస్తారు. కాని ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా సమావేశాల వ్యవధిని ప్రభుత్వం తగ్గించింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. మరోవైపు మత హింస బిల్లుతో సహా వివిధ పెండింగ్ బిల్లులను ఈ సమావేశాలలోప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్దమవుతుంది. అలాగే కీలక సంస్కరణలు, ద్రవ్యోల్బణం, అధిక ధరలు, తెలంగాణ తదితర అంశాలు సమావేశాలో చర్చకు రానున్నాయి. మత హింస బిల్లుతో సహా వివిధ పెండింగ్ బిల్లులను ఈ సమావేశాలలోప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్దమవుతుంది. అలాగే కీలక సంస్కరణలు, ద్రవ్యోల్బణం, అధిక ధరలు, తెలంగాణ తదితర అంశాలు సమావేశాలో చర్చకు రానున్నాయి. - See more at: http://www.apstarnews.com/?p=12699#sthash.FDuBUsG8.dpuf మత హింస బిల్లుతో సహా వివిధ పెండింగ్ బిల్లులను ఈ సమావేశాలలోప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్దమవుతుంది. అలాగే కీలక సంస్కరణలు, ద్రవ్యోల్బణం, అధిక ధరలు, తెలంగాణ తదితర అంశాలు సమావేశాలో చర్చకు రానున్నాయి. - See more at: http://www.apstarnews.com/?p=12699#sthash.FDuBUsG8.dpuf -
ఆలస్యంగా పార్లమెంటు శీతాకాల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండు వారాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. సమావేశాల గడువు ఒక వారం తగ్గే సూచనలున్నాయి. ఈ సమావేశాలను మూడు వారాలే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే డిసెంబర్ 4న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మరుసటిరోజైన 5నుంచి పార్లమెంటు సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతిని కోరాలన్నది కేంద్ర భావనగా తెలుస్తోంది. సమావేశాలు డిసెంబర్ 23తో ముగుస్తాయని సవూచారం. వివాదాస్పద మత ఘర్షణల నిరోధక బిల్లును శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. కాగా, తెలంగాణ బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టగలుగుతుందా? అన్నది ఇప్పటికీ సందేహమేనని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఎంత త్వరగా తన నివేదిక సమర్పిస్తుంది, నివేదిక ప్రాతిపదికగా రూపొందే తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ద్వారా శాసనసభ, శాసనమండలికి వెళ్లి ఎప్పుడు తిరిగి వస్తుందన్న దానిపై బిల్లు శీతాకాల సమావేశాలలో వస్తుందా? రాదా? అన్నది ఆధారపడి ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి.