Payment
-
IPL 2025: దూసుకెళ్తున్న కోహ్లీ.. ఈసారి ట్యాక్స్ ఎంత?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ టాప్ పెర్ఫార్మర్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్ బెంగళూరు కీలక ఆటగాడైన కోహ్లీ ఐపీఎల్లో టాప్ పెర్ఫార్మర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతని ఆట, పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు కోహ్లీకి అత్యధిక ధర (కాంట్రాక్ట్ ఫీజు) చెల్లించి నిలుపుకొంది.ఈసారి రూ.21 కోట్లుఈ ఏడాది ఐపీఎల్ 18వ ఎడిషన్లో రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఆన్టైన్ టాక్స్ అండ్ బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ టాక్సాలజీ ఇండియా డేటా ప్రకారం.. 2008 నుండి 2010 వరకు విరాట్ కోహ్లీ పలికిన ధర కేవలం రూ .12 లక్షలు మాత్రమే. తన ఆకట్టుకునే ఆట, ఫ్యాన్స్లో ఉన్న క్రేజ్ కారణంగా 2025లో రూ .21 కోట్లకు పెరిగింది.2010 తర్వాత 2011-13 మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ధర రూ.8.28 కోట్లకు పెరిగింది. 2014 నుంచి 2017 వరకు రూ.12.5 కోట్లు, 2018 నుంచి 2021 వరకు రూ.17 కోట్లు. అయితే 2022 నుంచి 2024 వరకు ఆయన ధర రూ.15 కోట్లకు పడిపోగా, ఇప్పుడు 40 శాతం పెరిగి రూ.21 కోట్లకు చేరుకుందని టాక్సాలజీ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా విరాట్ కోహ్లీ రూ.179.70 కోట్లు అందుకున్నాడు.కట్టాల్సిన పన్ను ఎంత?2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ కోసం విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ పేమెంట్ రూ .21 కోట్లకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కోహ్లీ ఆర్సీబీ ఉద్యోగి కాదు కానీ ఐపీఎల్ కాంట్రాక్ట్ ఫీజు అందుకుంటున్నాడు కాబట్టి, ఈ ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28 కింద "వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం" గా వర్గీకరిస్తారు.పన్ను లెక్కింపురూ.5 కోట్లకు పైగా సంపాదిస్తున్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ అత్యధిక ఆదాయపు పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తాడు. అతను కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నాడనుకుంటే (ఇది అధిక ఆదాయం సంపాదించేవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది) సంపాదనపై 30% పన్ను వర్తిస్తుంది.సంపాదన రూ.21 కోట్లపై 30% పన్ను అంటే రూ.6.3 కోట్లు అవుతుంది. ఆదాయం రూ.5 కోట్లకు పైగా ఉంటే పన్ను మొత్తంపై 25 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది. అలా రూ.6.3 కోట్లపై ఇది రూ.1.575 కోట్లు అవుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ (ట్యాక్స్ + సర్ఛార్జ్పై 4%) రూ.0.315 కోట్లు. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.8.19 కోట్లు అవుతుందన్న మాట. అంటే పన్ను కింద పోయేది తీసేయగా విరాట్ కోహ్లీ అందుకునేది రూ.12.81 కోట్లు.ఒకవేళ వ్యాపార ఖర్చులు (ఏజెంట్ ఫీజులు, ఫిట్ నెస్ ఖర్చులు, బ్రాండ్ మేనేజ్ మెంట్ వంటివి) ఉంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ముందు సెక్షన్ 37(1) కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతర ఆదాయ మార్గాలు (ఎండార్స్ మెంట్లు, పెట్టుబడులు మొదలైనవి) కూడా విడిగా పన్ను విధించబడతాయి. -
సునీతకు ట్రంప్ సొంత డబ్బు ఇస్తానని ఎందుకు ప్రకటించారు?
వాషింగ్టన్: అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయి.. ఎట్టకేలకు నాసా-స్పేస్ఎక్స్ ప్రయోగం ద్వారా తిరిగి భూమ్మీదకు రాగలిగారు బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్లు. బైడెన్ హయాంలో వాళ్లను వెనక్కి రప్పించడంలో నాసా విఫలం కాగా.. ఆ పనిని తాము చేశామంటూ ట్రంప్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంది. అయితే వాళ్లకు చెల్లించాల్సిన జీతభత్యాలపై విమర్శలు రావడంతో స్వయంగా అమెరికా అధ్యక్షుడే స్పందించాల్సి వచ్చింది.వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్లు అంతరిక్షంలో అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు గడిపారని.. అందుకుగానూ వాళ్లకు జీతభత్యాలేవీ అందలేదని పాత్రికేయులు తాజాగా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన.. అవసరమైతే తన సొంత డబ్బును వాళ్లకు చెల్లిస్తానంటూ ప్రకటించారు. ఈ క్రమంలోనే వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సహాయపడిన స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్కు కృతజ్ఞతలు తెలిపారు.నాసా ఎంత జీతం ఇస్తోందంటే.. నాసా ఉద్యోగులు ఫెడరల్ ఉద్యోగుల కిందకు వస్తారు. శాలరీలు, అలవెన్స్లు.. ఇలాంటి వాటి విషయంలో వ్యోమగాములు భూమ్మీద విధుల్లో ఉన్నప్పుడు, అలాగే అంతరిక్ష ప్రయోగాల టైంలో నాసా ఒకేలా చూస్తుంది. ఈ లెక్కన ఐఎస్ఎస్లో సునీత, విల్మోర్లకు ఒకే తరహా జీతాలు ఉంటాయి. అదనంగా వాళ్లకు చెల్లించేది ఏదైనా ఉంటే.. అది డెయిలీ స్టైఫండ్ కొంత మాత్రమేనని(రోజుకి 4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.347) మాత్రమేనని నాసా వ్యోమగామి ఒకరు వెల్లడించారు. కాబట్టి.. 287 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్కు శాలరీ ప్రత్యేకంగా నాసా ఏమీ చెల్లించదు. కాకుంటే.. ఇరువురికి డెయిలీ స్టైఫండ్ కింద 1,148 డాలర్లు(లక్ష రూపాయలు) చెల్లిస్తారంతే.ఇప్పుడు వాళ్లకు వచ్చేది ఎంతంటే..అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(NASA)లో బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్లు జీఎస్(General Schedule)-15 పే గ్రేడ్ ఉద్యోగులుగా ఉన్నారు. నాసాలో అత్యధిక జీతం అందుకునే ఉద్యోగులు ఈ గ్రేడ్ కిందకే వస్తారు. వీళ్లకు ఏడాదికి 1,25,133 - $1,62,672 డాలర్ల జీతం (మన కరెన్సీలో Rs 1.08 కోట్ల నుంచి Rs 1.41 కోట్ల దాకా) ఉంటుంది. ఈ 9 నెలలు ఐఎస్ఎస్లో గడిపినందుకు రూ.81 లక్షల నుంచి రూ.కోటి 5 లక్షల దాకా ఇద్దరికీ అందుతుంది. అది డెయిలీ స్టైఫండ్ కలిపి చూస్తే రూ.82 లక్షల నుంచి రూ.కోటి 6 లక్షల దాకా ఉండొచ్చు. అయితే..నాసా డ్యూటీ అవర్స్ 8 గంటలు మాత్రమే. కానీ, అనివార్య పరిస్థితుల్లో ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్లు అదనపు పని గంటలు చేయాల్సి వచ్చింది. అయితే ఫెడరల్ ఉద్యోగుల మార్గదర్శకాల ప్రకారం.. వాళ్లకు ఆ అదనపు పని గంటలకుగానూ ఎలాంటి జీతం చెల్లించడానికి వీల్లేదు. దీనిపై విమర్శలు రావడం మొదలైంది. అందుకే ట్రంప్ ఆ సమయాన్ని ఓవర్ టైం కింద చెల్లిస్తానని ఇప్పుడు ప్రకటించారు.కిందటి ఏడాది జూన్లో నాసా మిషన్ కింద సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి రాగా.. నాసా క్రూ 10 మిషన్ ప్రయోగం ద్వారా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా.. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ వాళ్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను కూడా సేఫ్గా భూమ్మీదకు తీసుకొచ్చింది. -
డబ్బు లేకపోయినా ఫ్లైట్ బుకింగ్.. వినూత్న ఆఫర్
ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్ మేక్మైట్రిప్ (MakeMyTrip) దేశంలో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. విమానాల్లో విదేశాలకు (international flights) వెళ్లేవారికి పార్ట్ పేమెంట్ (part payment) ఆప్షన్ను ప్రవేశపెట్టింది. మొత్తం ఛార్జీలో తొలుత 10 నుండి 40 శాతం మధ్య చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా టికెట్ బుక్ చేసిన 45 రోజుల్లోగా పూర్తి చేయాలి.పార్ట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకునే కస్టమర్లు చార్జీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత నిబంధనల ప్రకారం ధృవీకరించిన బుకింగ్లను సవరించుకోవచ్చని మేక్మైట్రిప్ తెలిపింది. ‘పెద్ద కుటుంబాలు, బృందాలు ఒకేసారి మొత్తం టికెట్ చార్జీని చెల్లించడం భారం అవుతుంది. అటువంటి వారికి పార్ట్ పేమెంట్ ఆప్షన్ సౌకర్యవంతంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది’ అని కంపెనీ సీవోవో సౌజన్య శ్రీవాస్తవ తెలిపారు.కాగా, ఎక్కువ మందిని అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రోత్సహించేందుకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ దోహద పడుతుందని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. ‘ఇటువంటి సౌకర్యంతో విమానయాన సంస్థలకు క్యాష్ రొటేషన్ అవుతుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు చెల్లింపుల సౌలభ్యం ఉంటుంది’ అని వివరించారు. ఈ కొత్త ఫీచర్ సుదూర, స్వల్ప-దూర అంతర్జాతీయ విమానాలను, ముఖ్యంగా రూ. 1 లక్షకుపైగా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులను ఆకట్టుకుంటోందని కంపెనీ పేర్కొంది. దీనిపై సానుకూల ప్రారంభ స్పందన వచ్చిందని చెప్పిన కంపెనీ ఈ ఫీచర్ కస్టమర్లకు ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తోంది.ఇలా పని చేస్తుందంటే..కొత్తగా ప్రవేశపెట్టిన పార్ట్ పేమెంట్ ఆప్షన్ మొత్తం ఛార్జీలో కేవలం 10-40% ముందుగా చెల్లించడం ద్వారా నిర్ధారిత బుకింగ్లను పొందేందుకు ప్రయాణికులను అనుమతిస్తుంది. ఖచ్చితమైన శాతం విమానయాన సంస్థ, ప్రయాణ మార్గం, బుకింగ్ విండో వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.మిగిలిన మొత్తాన్ని ప్రయాణ తేదీకి ముందు లేదా బుకింగ్ చేసిన 45 రోజులలోపు, ఏది ముందు అయితే అది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. పూర్తి చెల్లింపు చేసిన తర్వాత, వినియోగదారులు ఛార్జీల నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన బుకింగ్లను సవరించవచ్చు.ఇది కాకుండా జీరో క్యాన్సిలేషన్, ఫేర్ లాక్ ఫీచర్లతో పాటు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును కూడా మేక్మైట్రిప్ కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు బయలుదేరడానికి రెండు గంటల ముందు వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది. -
ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపు వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రెడిట్ కార్డులు విస్తృతంగా పెరిగిపోయాయి. వీటికితోడు అనుకూలమైన, సురక్షితమైన చెల్లింపు ఎంపికగా వర్చువల్ క్రెడిట్ కార్డ్లు ఉద్భవించాయి. సాంప్రదాయ భౌతిక క్రెడిట్ కార్డ్ల మాదిరిగా చోరీకి గురవ్వడం, పోగొట్టుకోవడం వంటి సమస్యలు వర్చువల్ క్రెడిట్ కార్డ్లతో ఉండవు.ఏమిటీ వర్చువల్ క్రెడిట్ కార్డ్?వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది భౌతిక క్రెడిట్ కార్డుకు డిజిటల్ రూపం. 16-అంకెల కార్డ్ నంబర్, సీవీవీ (CVV), గడువు తేదీతో సహా భౌతిక కార్డుకు ఉన్న అన్ని ముఖ్యమైన వివరాలూ దీనికీ ఉంటాయి. సాధారణంగా వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక కార్డ్. ఇది మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్కి యాడ్-ఆన్గా పనిచేస్తుంది. పరిమిత సంఖ్యలో లావాదేవీలను అనుమతిస్తుంది.ఎలా పని చేస్తుంది?వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ లాగానే పని చేస్తుంది. అయితే మెరుగైన భద్రతా లక్షణాలను అందిస్తుంది. వర్చువల్ కార్డ్ని ఉపయోగించి చెల్లింపు చేసినప్పుడు, వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. మోసం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఉపయోగించండిలా..» వర్చువల్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించడం సూటిగా ఉంటుంది. ఫిజికల్ కార్డ్ని స్వైప్ చేయాల్సిన అవసరం లేదు.» మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న వెబ్సైట్కు వెళ్ళండి. » వర్చువల్ క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఎంపికను ఎంచుకోండి.» మీ వర్చువల్ క్రెడిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ, సీవీవీని నమోదు చేయండి.» తర్వాత, మీ రిజిస్టర్డ్ ఫోన్కు ఓటీపీ వస్తుతంది. ఇది కొన్ని నిమిషాలే చెల్లుబాటు అవుతుంది.» ఓటీపీని ఎంటర్ చేసి చెక్అవుట్ ప్రక్రియను పూర్తి చేయండి.వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు» వర్చువల్ క్రెడిట్ కార్డ్లను మీ ఫోన్ లేదా ఆన్లైన్ ఖాతాల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. భౌతిక కార్డ్ని తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.» భౌతిక కార్డ్ని కోల్పోయే ప్రమాదం ఉండదు. మోసపూరిత లావాదేవీల నుండి వినియోగదారులను రక్షించడానికి అనేక ప్లాట్ఫామ్లు అంతర్నిర్మిత డిజిటల్ మోస నివారణ సాధనాలను కూడా అందిస్తాయి.» వర్చువల్ క్రెడిట్ కార్డ్ కోసం ఖర్చు పరిమితులు, గడువు తేదీలను సెట్ చేయవచ్చు. ఇది మెరుగైన ఆర్థిక నిర్వహణకు అధిక వ్యయం చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.వర్చువల్ క్రెడిట్ కార్డ్ పరిమితులు» వర్చువల్ క్రెడిట్ కార్డ్లను ప్రధానంగా ఆన్లైన్ చెల్లింపుల కోసం రూపొందించారు. భౌతిక కార్డ్ల వంటి ఆఫ్లైన్ లావాదేవీల కోసం వీటిని ఉపయోగించలేరు.» ఆన్లైన్ రిటైలర్లందరూ వర్చువల్ క్రెడిట్ కార్డ్లను అంగీకరించరు. దీంతో ఆన్లైన్ కొనుగోళ్లకు ఇబ్బంది కలుగుతుంది.» వర్చువల్ క్రెడిట్ కార్డ్లు సాధారణంగా తాత్కాలిక చెల్లుబాటును కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది 24 నుండి 48 గంటల వరకు ఉంటుంది. అయితే ఇది జారీ చేసే సంస్థను బట్టి మారవచ్చు.టాప్ ఫ్రీ వర్చువల్ క్రెడిట్ కార్డ్లు ఇవే..దేశంలో వర్చువల్ క్రెడిట్ కార్డ్లను బ్యాంకులు అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) అందిస్తాయి. దేశంలోని ప్రధాన బ్యాంకులు అందించే కొన్ని టాప్ వర్చువల్ క్రెడిట్ కార్డ్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ హెచ్డీఎఫ్సీ నెట్సేఫ్ వర్చువల్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఫ్రీఛార్జ్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) నెట్ కార్డ్ (Netc@rd), హెచ్ఎస్బీసీ (HSBC) బ్యాంక్ అడ్వాంటేజ్ వర్చువల్ కార్డ్, ఎస్బీఐ (SBI) కార్పొరేట్ వర్చువల్ కార్డ్ పేరుతో వర్చువల్ కార్డులు అందిస్తున్నాయి. -
వాట్సప్ పేమెంట్ను ఇక అందరూ వాడొచ్చు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ యాప్ అయిన వాట్సాప్లో ఇంతకాలం కేవలం కొద్ది మందికి మాత్రమే ఇతరులకు నగదు బదిలీ వెసులుబాటు ఉండగా ఇకపై అందరికీ ఆ అవకాశం దక్కనుంది. అతి త్వరలోనే ఈ చెల్లింపుల సదుపాయం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. టెక్స్ మెసేజ్లు, ఫొటోలు, ఆడియోలు, వీడియోలు షేర్చేసుకోవడంలో భారత్లో అగ్రగామి సోషల్మీడియా యాప్గా వర్ధిల్లుతున్న వాట్సాప్ ఇకపై పేమెంట్ యాప్గానూ ఎదిగే అవకాశాలు మెరుగయ్యాయి. దేశంలో ఆన్లైన్ చెల్లింపులపై నియంత్రణ బాధ్యతలు చూసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) గతంలో వాట్సాప్కు కేవలం భారత్లోని 10 కోట్ల మంది యూజర్లకు మాత్రమే పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు.తాజాగా ఆ పరిమితిని ఎత్తేశారు. దీంతో ఇకపై యూజర్లు అందరూ వాట్సాప్ ద్వారా నగదు చెల్లింపుల సేవలను వినియోగించుకోవచ్చని ‘వాట్సాప్ పే’ బహిరంగంగా అధికారికంగా స్మార్ట్ఫోన్లలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మొదట్నుంచి చూస్తే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) చెల్లింపుల సేవలు విస్తరించుకోవడంపై వాట్సాప్కు ఎన్పీసీఐ దశలవారీగా పరిమితిని పెంచుతూ వచ్చింది. 2020 సంవత్సరంలో కేవలం 4 కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత రెండేళ్లకు ఆ పరిమితిని 10 కోట్ల మంది యూజర్లకు అనుమతి మంజూరు చేశారు. భారత్లో రోజురోజుకూ విస్తరిస్తున్న డిజిటల్ నగదు చెల్లింపుల వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఎన్పీసీఐ తాజాగా ఈ పరిమితిని ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 13 బిలియన్ల లావాదేవీలుభారత్లో ఇప్పుడు యూపీఐ లావాదేవీలు ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయాయి. నెలకు కనీసం 1300 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా గూగుల్ పే, ఫోన్పే యాప్లలోనే దాదాపు 85 శాతం లావాదేవీలను యూజర్లు పూర్తిచేస్తున్నారు. దేశంలో వాట్సాప్ యాప్ను ఏకంగా 50 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు. ఇంతపెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్న వాట్సాప్ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ను విస్తరిస్తే దేశంలోనే అగ్రగామి పేమెంట్ యాప్గానూ దూసుకుపోనుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. దీంతో వాట్సాప్ మాతృసంస్థ మెటాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇటీవల మెటా తమ కృత్రిమేథ ఉపకరణం అయిన ‘మెటా ఏఐ’ను అందుబాటులోకి తెచ్చింది.దీనికి భారత్లో చక్కటి ప్రజాదరణ దక్కింది. గతంలో మాదిరే వాట్సాప్ పే విభాగం యూపీఐ వారి థర్ట్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ నిబంధనావళిని పాటించాల్సి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, భారతీయ బ్యాంక్ల సమాఖ్య(ఐబీఏ)లు సంయుక్తంగా యూజర్లు అత్యంత వేగంగా నగదు బదిలీ చేసుకునేందుకు వీలుగా ఎన్పీసీఐను ఏర్పాటుచేశాయి. ఎన్పీసీఐ ఆధ్వర్యంలోనే యూపీఐ చెల్లింపుల వ్యవస్థ పనిచేస్తోంది. -
మైనింగ్పై కూటమి పిడుగు
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమపై మళ్లీ కూటమి ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. పెండింగ్లో ఉన్న కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని లీజుదారులకు ఆదేశాలు అందాయి. దీంతో మంగళవారం మైనింగ్ యజమానులు బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని రాయల్టీ చెక్పోస్టు వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని ఆన్లైన్లో ఆదేశించడంతో మైనింగ్ యజమానులు షాక్ గురయ్యారు. ఒక్కో లీజుదారుడు రూ.20 లక్షలు మొదలుకొని రూ.60 లక్షల వరకు చెల్లించాలని ఆన్లైన్లో చూపిస్తుండటంతో కంగుతిన్నారు. గతంలో రాయల్టీలు (పర్మిట్లు) తీసుకున్న వారంతా బల్క్గా కేటాయించిన అమౌంట్ను 2025 జనవరి 10వ తేదీలోగా చెల్లించాలని డెడ్లైన్ విధించారు. లేదంటే పర్మిట్లు రద్దవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కన్సిడరేషన్ మొత్తాన్ని బల్క్గా కాకుండా ప్రతి పర్మిట్పై వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది.మైనింగ్ లీజుదారులు ఆన్లైన్లో రాయల్టీ పొందాలంటే డీఎంఎఫ్తో కలిసి రూ.482 చెల్లించేవారు. ఇకపై ప్రతి రాయల్టీపై కన్సిడరేషన్ మొత్తాన్ని సైతం చెల్లించాల్సి వస్తోంది. అంటే రాయల్టీపై యజమానులకు అదనపు భారం పడనుంది. లక్షలాది రూపాయలు జరిమానా రూపంలో డెడ్లైన్ విధించి మరీ చెల్లించాలనడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు 1,150 హెక్టార్లలో మైనింగ్ జరుగుతుండగా.. 600 మందికిపై లీజుదారులు ఉన్నారు. ఈసీ, మైనింగ్ ప్లానింగ్ తదితర రికార్డులు ఉన్న లీజుదారులకు మాత్రమే రాయల్టీలు వస్తున్నాయి. మిగిలిన లీజుదారులకు కూటమి ప్రభుత్వం దాదాపు 3 నెలల నుంచి ఆన్లైన్ రాయల్టీలు విడుదల చేయకపోవడంతో చాలామంది యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆందోళనతో స్తంభించిన రవాణారాయల్టీ చెక్పోస్టు వద్ద మైనింగ్ యజమానులు ఆందోళనతో నాపరాళ్లను రవాణా చేసే ట్రాక్టర్లు, లారీలతో పాటు ఆర్టీసీ బస్సులు, కార్లు ఇతర వాహనాలు ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు రాయల్టీ చెక్పోస్టు వద్దకు చేరుకుని మైనింగ్ యజమానులతో చర్చించి నిలిచిపోయిన వాహనాలను పంపించారు. ధర్నాలో టీడీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కొసమెరుపు. -
గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థతిబంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.ప్రతిపాదిత విధానంబంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!అంతరాలు గుర్తించిన ఆర్బీఐతనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీపి కబురు అందించింది. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలున్న ఎన్నారైలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఇక నుంచి రోజుకు రూ.1 లక్ష వరకు భారత్లోని తమ కుటుంబ సభ్యులు, ఇతర చెల్లింపులకు నగదు పంపించవచ్చు.ఎన్నారైలు ఇక నుంచి అంతర్జాతీయ మొబైల్ నంబర్ను ఉపయోగించి నేరుగా వారి స్మార్ట్ఫోన్ నుండి ఉచిత లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించవచ్చు. తద్వారా విదేశాల నుండి లావాదేవీలను నిర్వహించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కొత్తగా నమోదైన యూపీఐ ఐడీల ద్వారా తొలి 24 గంటల్లో రూ.5,000 మాత్రమే పంపేందుకు వీలుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు రూ.1 లక్ష పంపొచ్చు.ఇవీ బ్యాంకులు..యూపీఐ కోసం అంతర్జాతీయ మొబైల్ నంబర్ల అనుసంధానానికి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ మద్దతు ఇస్తున్నాయి.అంతర్జాతీయ మొబైల్ నంబర్లకు అనుకూలమైన యూపీఐ అప్లికేషన్లలో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, భీమ్ ఏయూ, ఫెడ్మొబైల్, ఐమొబైల్, భీమ్ ఇండస్ పే, ఎస్ఐబీ మిర్రర్ ప్లస్ వంటివి ఉన్నాయి. ఎన్నారైలు తమ ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్వో ఖాతాల మధ్య, అలాగే భారత్లోని ఖాతాలకు యుపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఎన్ఆర్వో ఖాతా నుండి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులను బదిలీ చేయలేరు. విభిన్న బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్న ఎన్నారైలు ప్రతి ఖాతాకు ప్రత్యేక యూపీఐ ఐడీ అవసరం. ఖాతా ఉమ్మడిగా ఉంటే ప్రాథమిక ఖాతాదారు మాత్రమే యూపీఐని ఉపయోగించగలరు. -
మీ చేయి ఊపితే చాలు పేమెంట్ అయిపోతుంది
-
నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?
ప్రస్తుతం దేశంలో నగదు రహిత చెల్లింపుల హవా పెద్ద ఎత్తున నడుస్తుంది. పెద్ద పెద్ద మాల్స్ నుంచి రోడ్లపై ఉండే చిన్నా చితక దుకాణాల వరకు అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్లే. ఇప్పటి వరకు మనం ఫోన్ లేదా క్యూర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం చేశాం. వాటన్నింటిని తలదన్నేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మరో చెల్లింపు విధానం వచ్చేసింది. దీన్నిచూస్తే అంతకు మించి..!..అని అనకుండా ఉండలేరు. ఇంతకీ ఏంటా చెల్లింపు విధానం అంటే..సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న చైనాలో ఈ సరికొత్త చెల్లింపు విధానం కనిపిస్తుంది. సాంకేతికతకు సంబంధించిన విషయంలో చైనా సాధించిన పురోగతి ప్రపంచ దేశాలను బాగా ఆకర్షిస్తాయి. అందుకు ఉదాహారణే ఈ సరికొత్త డిజిటల్ చెల్లింపు విధానం. ఔను..! చైనాలోని ఓ దుకాణంలో 'పామ్ పేమెంట్ పద్ధతి'లో చెల్లింపులు చెయ్యొచ్చు.ఇదేంటీ ఫోన్ లేదా క్యూర్ కాకుండా ఏంటీ పామ్ అంటే..? . ఏం లేదు జస్ట్ మన చేతిని స్కాన్ చేసి చెల్లించేయొచ్చు. అందుకు సంబంధించిన వీడియోని పాకిస్తాన్ కంటెంట్ క్రియేటర్ రానా హంజా సైఫ్ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలా చేస్తారంటే..ఏం లేదు.. జస్ట్ పామ్ పామ్ ప్రింట్ డివైజ్లో మీ హ్యాండ్ని స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని మన పేమెంట్ ఇన్ఫర్మేషన్నికి లింక్ అప్ చేస్తే చాలు. అంటే ఇక్కడ..ఒట్టి చేతులను స్కాన్ చేసి చెల్లింపులు చేసేయొచ్చు అన్నమాట. ఇది కాస్త భద్రతతో కూడిన సాంకేతికత. పైగా ఎలాంటి సమస్యలు ఉండవు. దీన్ని చూస్తే కచ్చితంగా వాటే టెక్నాలజీ గురూ..! అనాలనిపిస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Rana Hamza Saif ( RHS ) (@ranahamzasaif) (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
దివ్యాంగుల కోసం ఆర్బీఐ..
దివ్యాంగులకు (పీడబ్ల్యుడీ) డిజిటల్ చెల్లింపు విధాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులు అన్ని వర్గాలలో బాగా ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ పేమెంట్ ప్రొవైడర్లు.. చెల్లింపులను సమీక్షించి, సవరించాలని ఆర్బీఐ ఆదేశించింది.పీడబ్ల్యుడీల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిస్టమ్లు, పరికరాలు.. పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్ల వంటి చెల్లింపు మౌలిక సదుపాయాలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇవన్నీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన యాక్సెసిబిలిటీ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.చెల్లింపు వ్యవస్థలకు అవసరమైన మార్పులను చేపడుతున్నప్పుడు, భద్రతా అంశాలలో రాజీ పడకుండా చూసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. అంతే కాకుండా.. ఆర్బీఐ ఈ సర్క్యులర్ను జారీ చేసిన ఒక నెలలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని పీఎస్పీలను ఆదేశించింది. నివేదికలో ఈ మార్పులను అమలు చేయడానికి సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను కూడా చేర్చాలి. -
Property Tax: ఇక నెలవారీగా ఆస్తి పన్ను చెల్లింపులు..!
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తి పన్ను సంవత్సరంలో రెండు దఫాలుగా ఆర్నెల్లకోసారి చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇకనుంచి అలా కాకుండా ఏకమొత్తంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్’ ద్వారా అయిదు శాతం రాయితీ సదుపాయం ఉంది. ఆస్తిపన్ను ఏడాదికో, ఆర్నెల్లకో కాకుండా కరెంటు బిల్లు మాదిరిగానే నెలనెలా చెల్లిస్తే తమకు సదుపాయంగా, పెద్ద భారంగా కనిపించకుండా ఉంటుందని భావిస్తున్నవారూ ఉన్నారు. అలాంటి వారికి సదుపాయంగా ఆస్తిపన్నును సైతం నెలనెలా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. ఆస్తిపన్ను, కరెంటు, నల్లా బిల్లులు వేర్వేరు పర్యాయాలు వేర్వేరు సంస్థలకు చెల్లించనవసరం లేకుండా ఒకే విండో ద్వారా, ఏకకాలంలో అన్ని పనులు నెలవారీగా చెల్లించే సదుపాయం కలి్పంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరించే వారికి చెల్లించే మొత్తాన్ని కూడా వాటితో పాటే చెల్లించే సదుపాయం అందుబాటులోకి తేవాలనుకుంటోంది. సీఎం ఆలోచనతో.. 👉 గ్రేటర్ పరిధిలో ప్రస్తుతమున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సిటీలో ప్రస్తుతం ఆస్తి పన్నులను జీహెచ్ఎంసీ, నల్లా బిల్లులను హైదరాబాద్ జలమండలి వసూలు చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతకు మించి నీటిని వాడుతున్న అపార్ట్మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను జలమండలి వసూలు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను ఆర్నెల్లకోసారి చెల్లించే సదుపాయం ఉండగా, జలమండలి నల్లా బిల్లులను నెలకోసారి జారీ చేస్తోంది. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు మరింత వెసులుబాటుగా ఉండేలా కొత్త విధానం ఉండాలనే తలంపులో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారు. ఇటీవల అధికారులతో చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉 డిస్కంలు ప్రతి నెలా కరెంట్ బిల్లు పద్ధతి ప్రకా రం జారీ చేస్తున్నాయి. గడువు తేదీలోగా చెల్లించే విధానం అనుసరిస్తున్నాయి. యూపీఐ ద్వారా ఆన్లైన్లోనే ప్రతి నెలా కరెంట్ బిల్లు చెల్లించే సదుపాయం అందుబాటు లో ఉంది. దీంతో వినియోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఇదే తరహాలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, చెత్త సేకరణ బిల్లు కూడా నెల వారీగా జారీ చేసే లా కొత్త విధానం పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలా చేయడంవల్ల ఒకేసారి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని, సులభ వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించినట్లు ఉంటుందని వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం నెల నెలా బిల్లుల జారీకి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. యూపీఐతో పాటు అన్ని ఈ పేమెంట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా నెల నెలా ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ప్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించారు.కరెంట్ బిల్లు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుము విధింపుతో పాటు కరెంటు కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అలాగే కొత్త గా జీహెచ్ఎంసీ, జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు కూడా నిరీ్ణత గడువు ఉండాలని, గడువు దాటితే ఒకదానికొకటి లింక్ ఉండేలా తగిన చర్యలకు అధికారులు కసరత్తు చేయనున్నారు.సక్రమంగా చెల్లించేవారికి ప్రోత్సాహకాలు.. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీలు ఇవ్వాలని, లేదా కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలనే ఆలోచనలున్నాయి. బిల్లుల చెల్లింపుల విషయంలో కచి్చతంగా ఉన్నట్లుగా అంతే బాధ్యతగా మున్సిపల్ సేవలను మహా నగర ప్రజలకు అందించే విషయంలో జవాబుదారీగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.భారీ బకాయిలకు అడ్డుకట్ట.. నెలనెలా ఆస్తిపన్ను విధానం వల్ల బకాయిలు పేరుకుపోకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బకాయిలపై నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ విధిస్తుండటంతో చాలామందికి అసలు కంటే పెనాలీ్టల భారం ఎక్కువ కావడంతో చెల్లించడంలేదు. ముఖ్యంగా, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు వీరిలో ఎక్కువగా ఉన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ల ద్వారా పెనాలీ్టల్లో 90 శాతం రాయితీలిచ్చినప్పటికీ చెల్లించని వారూ ఉన్నారు. నెలనెలా చెల్లించే విధానంతో, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోకుండా ఉంటాయనే అభిప్రాయాలున్నాయి. -
SmilePay: నగదు చెల్లింపునకు ఓ ‘నవ్వు’ చాలు!
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ సరికొత్త డిజిటల్ చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చింది. ‘స్మైల్ పే’ అనే ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు కేవలం కెమెరాను చూసి నవ్వుతూ చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవతో డబ్బు లావాదేవీల కోసం మీకు నగదు, కార్డ్ లేదా మొబైల్ అవసరం ఉండదు. రిలయన్స్ రిటైల్, అనన్య బిర్లాకు చెందిన ఇండిపెండెంట్ మైక్రో ఫైనాన్స్ ద్వారా కొన్ని ఎంపిక చేసిన శాఖలలో దీని వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది.పైలట్ ప్రాజెక్టుప్రస్తుతం ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ చెల్లింపు వ్యవస్థ 'భీమ్ ఆధార్ పే'పై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్మించిన అప్గ్రేడెడ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇది ఉపయోగించుకుంటుంది. యూజర్లు తమ ఫేస్ను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. దీంతో కార్డు లేదా మొబైల్ లేకుండా కూడా వ్యాపారులకు చెల్లింపులు చేయగలరు. మొత్తం లావాదేవీ ప్రక్రియ రెండు దశల్లో పూర్తవుతుంది.స్మైల్పే ఫీచర్లుస్మైల్పే ద్వారా నగదు, కార్డ్ లేదా ఫోన్ని తీసుకెళ్లకుండానే మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు. దీనితో పాటు, ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం వల్ల కౌంటర్ వద్ద రద్దీ నుండి ఉపశమనం లభిస్తుంది. సురక్షితమైన ఆధార్ ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ ఆధారంగా చేసే లావాదేవీలతో భద్రత చింత ఉండదు. స్మైల్పే ఫీచర్ ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. దీని కోసం వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ ఆ బ్యాంకులో ఖాతాలను కలిగి ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను మరింత విస్తరించాలని ఫెడరల్ బ్యాంక్ యోచిస్తోంది.ఎలా పనిచేస్తుందంటే..స్మైల్పేను వినియోగించాంటే మొబైల్లో ఫెడ్ మర్చెంట్ (FED MERCHANT) అనే యాప్ ఉండాలి.ఫెడరల్ బ్యాంక్తో అనుసంధానమైన దుకాణాల్లో షాపింగ్ చేసి బిల్లు చెల్లింపు సమయంలో స్మైల్ పే ఎంచుకోవాలి. తర్వాత దుకాణదారు.. కస్టమర్ ఆధార్ నంబర్ను నమోదు చేసి యాప్ ద్వారా చెల్లింపును ప్రారంభిస్తారు. దుకాణదారు మొబైల్ కెమెరా కస్టమర్ ఫేస్ను స్కాన్ చేస్తుంది. ఆధార్ సిస్టమ్ ఆధారంగా ఫేస్ రికగ్నిషన్ డేటాతో సరిపోల్చుకుని చెల్లింపు పూర్తవుతుంది. కస్టమర్ ఖాతా నుండి డబ్బు దుకాణదారుడి ఖాతాలో జమవుతుంది. -
హాయ్, నేను సీజేఐని... క్యాబ్కు రూ.500 పంపండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్ తనను తాను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్ ప్లేస్లో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్ చేశాడు. అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్ వైరల్గా మారింది. దాన్ని కైలాశ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఎక్స్లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్ చేశారు. ఈ వైరల్ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్కు ఫిర్యాదు చేసింది. -
18 నుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’ ఫీజు చెల్లింపు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్) రీ వెరిఫికేషన్కు రూ.1300, రీకౌంటింగ్కు రూ.260 చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.550, ప్రాక్టికల్స్కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే.. సైన్స్ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమతమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా, మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని, ఈ విషయం అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ గుర్తించాలని సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు. -
ఎఫ్డీ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంక్
ప్రైవేటు రంగంలో సేవలందిస్తున్న బంధన్ బ్యాంక్ తన వినియోగదారులకు మరింత సేవలందించేలా చర్యలు తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. 500 రోజుల ప్రత్యేక డిపాజిట్పై వయో వృద్ధులకు(సీనియర్ సిటిజన్లు) 8.35 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు తెలిపింది. సాధారణ వ్యక్తులకు 7.85 శాతం వడ్డీ ఇస్తోంది. ఏడాది నుంచి వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేటును 7.25 శాతంగా నిర్ణయించింది. 5-10 ఏళ్ల వ్యవధికి 5.85 శాతం వడ్డీని అందిస్తోంది. ఇదీ చదవండి.. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పసిడి రుణాలపై ఆర్బీఐ నిషేధం సీనియర్ సిటిజన్లకు 6.60 శాతంగా నిర్ణయించింది. పొదుపు ఖాతాలో రోజువారీ నిల్వ రూ.10 లక్షలకు మించి ఉన్న వారికి 7 శాతం వడ్డీనిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్లో కొత్తగా రెండు శాఖలను ప్రారంభించినట్లు బంధన్ బ్యాంక్ వెల్లడించింది. దీంతో తెలంగాణలో మొత్తం శాఖల సంఖ్య 142కు చేరినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుకు 1664 శాఖలున్నాయి. -
పేటీఎంలో చైనా పెట్టుబడులపై ప్రభుత్వ ఫోకస్
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్)లో చైనా నుంచి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పేమెంట్ అగ్రిగేటర్’ లైసెన్స్ కోసం పీపీఎస్ఎల్ 2020 నవంబర్లో దరఖాస్తు పెట్టుకుంది. 2022 నవంబర్లో ఈ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. ఎఫ్డీఐ మార్గదర్శకాల్లోని ప్రెస్నోట్ 3 నిబంధనలను పాటించడం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం కంపెనీలో ఎఫ్డీఐలకి కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్)లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్కు వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ సూచన మేరకు ఎఫ్డీఐ ప్రెస్ నోట్3 నిబంధనలను అనుసరించి, ఓసీఎల్లో చైనా ఎఫ్డీఐకి ఆమోదం కోసం పేటీఎం 2022 డిసెంబర్ 14న దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. పీపీఎస్ఎల్లో చైనా పెట్టుబడులను అంతర్మంత్రిత్వ శాఖ కమిటీ అధ్యయనం చేస్తోందని, సంప్రదింపులు, విస్తృత పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. భారత్తో భూ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్డీఐలకి ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ కేంద్ర సర్కారు లోగడ నిబంధనలు తీసుకువచి్చంది. 2020లో చైనా–భారత్ బలగాల మధ్య గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఈ కఠిన వైఖరికి మళ్లింది. యూజర్ల నుంచి పూర్తి మద్దతు: పేటీఎం మరోవైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) వివాదం ఎలా ఉన్నా .. యూజర్ల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తోందని పేటీఎం ఒక బ్లాగ్పోస్టులో తెలిపింది. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సరీ్వసులను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఫిబ్రవరి 29 నుంచి దాదాపు అన్ని సేవలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నాం.. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గతంలో పేటీఎంలోకి వచి్చన ఎఫ్డీఐకి సంబంధించి తప్పనిసరి అనుమతులు పొందాలని ఆర్బీఐ సూచించినట్టు తెలిపారు. ‘‘ఇది నియంత్రపరమైన ప్రక్రియ. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎవరైనా కానీ, ఎఫ్డీఐ ఆమోదం పొందాల్సిందే’’అని చెప్పారు. ఈ నిబంధనలను అనుసరించి అన్ని రకాల పత్రాలతో నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు సమరి్పంచినట్టు తెలిపారు. ఇది పరిష్కారం అయ్యేంత వరకు, కొత్త వరక్తులను చేర్చుకోకుండా, అప్పటికే చేరిన వర్తకులకు పేమెంట్ సేవలు అందించడానికి అనుమతి ఉంటుంది. ‘‘కంపెనీలో యాజమాన్య రూపం మారిపోయింది. పేటీఎం వ్యవస్థాపకుడు (శర్మ) ఇప్పడు కంపెనీలో 24.3 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ఓసీఎల్లో యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడి 10 శాతంలోపునకు తగ్గిపోయింది. కనుక పీపీఎస్ఎల్లో చైనా నుంచి ఎఫ్డీఐ అన్నదానికి ప్రస్తుతం అర్థం లేదు’’అని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
జొమాటో కొత్త అవతారం.. ఆర్బీఐ అనుమతి!
ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ జొమాటో (Zomato) అనుబంధ సంస్థ అయిన జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్ని మంజూరు చేసింది. దీంతో తన ప్లాట్ఫామ్ ద్వారా ఈ-కామర్స్ లావాదేవీల నిర్వహణకు జొమాటోకు అనుమతి లభించింది. దేశంలో పేమెంట్స్ అగ్రిగేటర్గా పనిచేయడానికి జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ZPPL)కు 2024 జనవరి 24న రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికార ధ్రువీకరణ పత్రం మంజూరైంద అని ఫుడ్టెక్ సంస్థ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. జొమాటోతోపాటు టాటా పే, రేజర్పే, క్యాష్ఫ్రీ సంస్థలకు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్ లైసెన్స్ మంజూరైంది. జొమాటో గత సంవత్సరం ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి తన సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకుంది. లావాదేవీలను సులభతరం చేయడానికి గూగుల్పే, ఫోన్పే, పేటీఎం వంటి ఇతర చెల్లింపు యాప్లపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఇందుకు కారణం. దీంతో థర్డ్-పార్టీ యాప్ల ద్వారా చేసే చెల్లింపులతో వచ్చే మర్చెంట్ ఛార్జీలు ఆదా అవుతాయి. కాగా గతంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్లను అందించడం కోసం RBL బ్యాంక్తో కూడా జొమాటో జతకట్టింది. అయితే గత ఏడాది మేలో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. -
TS: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై చలాన్ల మొత్తంలో 80 శాతం రాయితీ ఇచ్చింది. అలాగే కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్ల మొత్తంలో 60 శాతం రాయితీని, ఆర్టీసీ డ్రైవర్లకు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీని ప్రకటించింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో రాయితీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంగీకరించడంతో పోలీస్ అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. https://echallan. tspolice.gov.in/publicview/ వెబ్సైట్లో వాహనదారులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్ చలాన్ల విలువ రూ. 800 కోట్లు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఈ–చలాన్లు పెండింగ్లో ఉండగా వాటి విలువ సుమారు రూ. 800 కోట్ల వరకు ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. భారీ రాయితీలు కల్పించడం వల్ల పెండింగ్లో ఉన్న చలాన్లను వాహనదారులు చెల్లిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 30న తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో మెగా జాతీయ లోక్ అదాలత్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై ఇదే తరహాలో ఇచ్చిన డిస్కౌంట్ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు సద్వినియోగం చేసుకోగా జిల్లాల్లోని వాహదారులకు ఈ అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన లేక ఆశించినట్లు వినియోగించుకోలేకపోయారని అధికారులు తెలిపారు. అప్పట్లో సుమారు రూ. 350 కోట్ల మేరకు రాయితీలను ఉపయోగించుకొని వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. రాయితీలు ఇలా.. ద్విచక్ర వాహనాలు,ఆటోలు 80% కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు 60% ఆర్టీసీ డ్రైవర్లు,తోపుడు బండ్లకు..90% -
పేమెంట్ అగ్రిగేటర్గా ఎన్క్యాష్కు అనుమతి
న్యూఢిల్లీ: పేమెంట్ అగ్రిగేటర్గా వ్యవహరించేందుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి లభించినట్లు ఎన్క్యాష్ సంస్థ తెలిపింది. బిజినెస్–2–బిజినెస్ వ్యవస్థలో ఒలింపస్ బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. నిరంతరాయంగా, వినూత్నమైన, విశ్వసనీయమైన పేమెంట్ సొల్యూషన్స్ను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సంస్థ సహ–వ్యవస్థాపకుడు యద్వేంద్ర త్యాగి తెలిపారు. కార్పొరేట్ పేమెంట్స్ సొల్యూషన్స్ సంస్థగా ఎన్క్యాష్ 2018లో కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు 2,50,000 పైచిలుకు వ్యాపారాలు తమ కార్పొరేట్ పేమెంట్స్ వ్యవస్థను డిజిటలీకరించుకోవడంలో తోడ్పాటు అందించింది. ఎన్క్యాష్తోపాటు క్యాష్ఫ్రీ పేమెంట్స్, ఓపెన్, రేజర్పే వంటి ఇతర ఫిన్టెక్ స్టార్టప్లకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్లను మంజూరు చేసింది. -
వీటిని తెగవాడుతున్నారు..!
ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు కనిపిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్తో చెల్లింపులు సాగిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కచ్చితంగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. చిటికెలో ట్రాన్సాక్షన్ పూర్తి చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన క్రమంలో డిజిటల్ పేమెంట్లలో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాద్ పార్లమెంట్లో కీలక విషయాలు వెల్లడించారు. యూపీఐ పేమెంట్లు పెరగడంతో గతేడాది చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 7.8 శాతానికి తగ్గినట్లు చెప్పారు. 2017-18 ఏడాదిలో యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 92 కోట్లుగా ఉండగా.. అది 2022-23కు ఏకంగా 8,357 కోట్లకు చేరినట్లు చెప్పారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్యాపరంగా వార్షిక వృద్ధి 147 శాతంగా ఉందని పేర్కొన్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ 2017-18లో దాదాపు రూ.1 లక్ష కోట్లుగా ఉండగా.. అది 168 శాతం పెరిగి 2022-23లో రూ.139 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో డిసెంబర్ 11 వరకు యూపీఐ మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్య 8,572 కోట్లుగా తెలిపారు. 2022-23లో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్లలో యూపీఐ లావాదేవీలే 62 శాతంగా ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ.. చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 2021-22లో 9.9 శాతంగా ఉండగా.. 2022-23లో 7.8 శాతానికి తగ్గిందన్నారు. యూపీఐతో రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల క్రెడిట్ కార్డులను తమతో తీసుకెళ్లకుండానే చిన్న విక్రయ కేంద్రాల్లోనైనా చెల్లింపులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉండగా.. గత తొమ్మిదేళ్లలో 57 బ్యాంకులను మూసివేసినట్లు మంత్రి చెప్పారు. మూడు బ్యాంకులు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంకులను పునరుద్ధరించినట్లు చెప్పారు. -
కొత్త నిబంధన.. ఆ ఆన్లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..!
ఆన్లైన్ లావాదేవీల్లో జరుగుతున్న మోసాల గురించి ఎక్కడోచోట చూస్తూంటాం. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తీసుకొస్తోంది. తాజాగా మరో కొత్త నిబంధనను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీల్లో.. రూ.2,000 లోపు అయితే వెంటనే పేమెంట్ అవుతుంది. తొలి లావాదేవీలో అంతకుమించి డబ్బు పంపాలంటే కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో మొత్తం 13,530 ఆన్లైన్ మోసాలు నమోదైనట్లు తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం మోసాలు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించినవే. ఆన్లైన్ మోసాలను మరింత సమర్థంగా అడ్డుకునేందుకు.. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి విడతలోనే రూ.2,000కు మించి ఆన్లైన్లో నగదు బదిలీ చేయాలంటే.. కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు మించి చెల్లించినప్పుడు.. ఆ నాలుగు గంటల వ్యవధిలో వినియోగదారుడు లావాదేవీని రద్దు చేసుకోవచ్చు, లేదా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా మోసాలను సులభంగా అడ్డుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. యూపీఐ లావాదేవీలకే కాకుండా.. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) లావాదేవీలకూ ఈ షరతును వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి యూపీఐ లావాదేవీని నిర్వహించే వారు 24 గంటల వ్యవధిలో రూ.5,000 మించి చేయడానికి వీలుకాదు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) లావాదేవీల్లో ఒకసారి అవతలి వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, 24 గంటల పాటు రూ.50,000 వరకే బదిలీ చేసే వీలుంటుంది. -
ఏఐ ఎతిహాద్ పేమెంట్స్తో ఎన్పీసీఐ ఒప్పందం
న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, ఏఐ ఎతిహాద్ పేమెంట్స్తో ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 5, 6 తేదీల్లో అబుదాబిలో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరువైపులా సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందంతో సీమాంతర చెల్లింపులకు వీలు కలుగనుంది. పెట్టుబడులకు సంబంధించి భారత్–యూఏఈ 11వ అత్యున్నత స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశానికి మంత్రి పీయూష్ గోయల్ సహాధ్యక్షత వహించనున్నారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం సహాధ్యక్షత వహిస్తారు. ముబదాలా ఎండీ, సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్తో మంత్రి గోయల్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇరుదేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ సమావేశం కానున్నారు. ఇరు దేశాల్లో మరో దేశం పెట్టుబడులకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాలపై రెండు దేశాలు చర్చించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జాయింట్ టాస్క్ఫోర్స్ రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నట్టు పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా రెండు దేశాల మధ్య 2013లో జాయింట్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు కావడం గమనార్హం. -
విద్యుత్ బకాయిల చెల్లింపుపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ ఏపీ.. దీనిపై ఇప్పటికే ఇచ్చిన స్టేను పొడించాలంటూ తెలంగాణ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. హైకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి తమకు తెలంగాణ నుంచి రూ.6,756.92 కోట్లు (అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) రావాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఏపీకి 30 రోజుల్లోగా రూ.6,756.92 కోట్లు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు 2022 సెప్టెంబర్లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బకాయిల విషయంలో తెలంగాణ సర్కార్పై ఒత్తిడి తేవొద్దని స్టే ఇచ్చింది. ఈ వ్యవహారం ఇలా కోర్టులో ఉండగానే.. విద్యుత్ బకాయిలు తప్పకుండా చెల్లించాలని ఆదేశించినా తెలంగాణ ఇవ్వడం లేదని.. అందువల్ల రిజర్వు బ్యాంకులోని తెలంగాణ ఖాతా నుంచి సొమ్మును మినహాయించుకుని ఏపీకి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. దీనితో కేంద్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, చెల్లింపులపై స్టేను పొడిగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులోని ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. బకాయిల వల్ల ఇబ్బందుల్లో ఏపీ డిస్కమ్లు తెలంగాణ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ విద్యుత్ డిస్కమ్లు ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చిందని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. పునర్విభజన తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఈ బకాయిలకు, పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు కూడా ఏపీ డిస్కమ్లు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయన్నారు. బకాయిలు చెల్లించక బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని గుర్తు చేశారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని, బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ల ధర్మాసనం మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. -
పేటీఎం నుంచి పాకెట్ సౌండ్ బాక్స్.. దీంతో ఏం చేయొచ్చంటే
హైదరాబాద్: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వర్తకుల కోసం రెండు వినూత్న చెల్లింపుల సాధనాలను విడుదల చేసింది. 4జీ ఆధారిత పేటీఎం పాకెట్ సౌండ్ బాక్స్, పేటీఎం మ్యూజిక్ సౌండ్ బాక్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పేటీఎం పాకెట్ సౌండ్బాక్స్ అనేది చెల్లింపుల ఆధారిత తొలి పోర్టబుల్ పరికంగా కంపెనీ పేర్కొంది. డెబిట్ కార్డ్ పరిమాణంలో పాకెట్లో పట్టేస్తుందని, డ్రైవర్లు, డెలివరీ, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఇప్పటికే మార్కెట్లో ఉన్న పేటీఎం సౌండ్బాక్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. దీన్ని వెంట తీసుకెళ్లడం సౌకర్యంగా ఉండదు. తరచూ వాహనాలపై ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని పేటీఎం పాకెట్ సౌండ్బాక్స్ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, పేటీఎం మ్యూజిక్ సౌండ్బాక్స్ అనేది వర్తకులకు చెల్లింపుల సమాచారాన్ని వాయిస్ రూపంలో వినిపించడమే కాకుండా, బ్లూటూత్తో ఫోన్ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మ్యూజిక్ వినడం, మ్యాచ్ కామెంటరీ వినొచ్చని పేటీఎం తెలిపింది. వర్తకుల సౌకర్యం కోసమే ఈ రెండు ఉత్పత్తులను తీసుకొచ్చినట్టు పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. ఇందులో పాకెట్ సౌండ్బాక్స్ చెల్లింపుల పరిశ్రమలో ఎంతో మార్పును తీసుకొస్తుందన్నారు. ఈ ఏడాది జూన్ చివరికి పేటీఎంకు 79 లక్షల సౌండ్బాక్స్, పేటీఎం కార్డ్ మెషిన్ల చందాదారులు ఉన్నారు. -
ఫోన్పే యూజర్లకు గుడ్న్యూస్.. సరికొత్త ఫీచర్ వచ్చింది, అదనపు బెనిఫిట్స్ కూడా
ఫోన్పే... ఈ పేరు తెలియని వారుండరు. చెల్లింపుల వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది ఈ సంస్థ. తాజాగా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్ తమ యూజర్లకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆదాయ పన్ను చెల్లింపు' అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR)ఫైలింగ్తో పాటు చెల్లించడానికి జూలై 31 గా నిర్ణయించింది. ఈ తేదీకి మించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై చాలా ఈజీ ఇదిలా ఉండగా కొన్ని సార్లు పన్ను చెల్లింపు చేస్తుండగా సర్వర్లు యూజర్ల సంఖ్య పెరగడంతో మొరాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ఫోన్పే తెలిపింది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఉపయోగించి నేరుగా యాప్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్కు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త సేవను తీసుకొచ్చేందుకు ఫోన్ పే సంస్థ ప్రముఖ బీ2బీ పేమెంట్స్, సర్వీసెస్ సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కొత్తగా వచ్చిన ఫీచర్లో యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐని ఉపయోగించి సులభంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం అదనపు ప్రయోజనాలతో వస్తుంది, ఫోన్ పే తెచ్చిన ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపైనా రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్పేలో బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "ఫోన్పేలో, మా యూజర్లు అవసరాలను తీర్చడానికి మా యాప్ను నిరంతరం అప్డేట్ చేస్తూ వారికి అనుగుణంగా మార్పులు చేస్తూనే ఉంటాం. మా సరికొత్త ఫీచర్ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఫోన్పేలో ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం తరచుగా ఉంటుంది. పన్నులు కట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ, చాలా సమయం పడుతుంది కూడా. ఇకపై మా యూజర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితమైన పన్ను చెల్లింపు ప్రక్రియను అందిస్తోందని అన్నారు. చదవండి: EPFO: వేతన జీవులకు గుడ్న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం -
ఇక ‘క్యాష్లెస్’ చెక్పోస్టులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రవాణాశాఖలో ఇప్పటికే అన్ని రకాల లైసెన్సులను ఆన్లైన్ విధానంలో అందిస్తున్న రవాణాశాఖ.. ఇక సరిహద్దుల్లో కూడా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్రాష్ట్ర రవాణా చెక్పోస్టులను ఇక క్యాష్లెస్గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. రవాణాశాఖకు చెందిన అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో యూపీఐ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించింది. తద్వారా చెక్పోస్టుల్లో అవినీతిని కట్టడికి ఉపయోగపడుతుందని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 రవాణాశాఖ చెక్పోస్టుల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. అన్ని చెక్పోస్టుల్లో క్యాష్లెస్ విధానం అమలు కావడంతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అన్ని ట్యాక్స్లూ ఆన్లైన్లోనే.. వాస్తవానికి రవాణాశాఖ చెక్పోస్టుల్లో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. క్యాష్లెస్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. బోర్డర్ ట్యాక్స్, టెంపరరీ పర్మిట్ ట్యాక్స్, వలంటరీ ట్యాక్స్, కంపౌండింగ్ ఫీజు ఇలా అన్నింటినీ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేయడం ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా హెచ్టీ టీపీఎస్://ఏపీఆర్టీఏసిటిజెన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్ విధానంతో అవినీతి కట్టడితో పాటు చెక్పోస్టుల వద్ద లైన్లలో నిలబడి చెల్లించే బాధ తప్పనుంది. తద్వారా వాహనాలను ఎక్కువ సమయం నిలిపి ఉంచే సమయం కూడా తగ్గడం ద్వారా వాహన రవాణా ప్రయాణ సమయం కూడా తగ్గనుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రవాణాశాఖ చెక్పోస్టులివే.. రాష్ట్రానికి అటు కర్ణా్ణటక, ఇటు తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య అంతర్రాష్ట్ర చెక్పోస్టులను రవాణాశాఖ నిర్వహిస్తోంది. మొత్తం 15 చెక్పోస్టులు.. ఇచ్ఛాపురం, జీలుగువిుల్లి, పంచలింగాల, పెనుకొండ, సున్నిపెంట, తిరువూరు, గరికపాడు, పలమనేరు, తడ, బీవీ పాలెం, రేణిగుంట, నరహరిపేట, దాచేపల్లి, మాచర్ల, బెండపూడి ప్రాంతాల్లో రవాణాశాఖ నిర్వహిస్తోంది. సీఎం ఆదేశాలతో చెక్పోస్టుల వద్ద క్యాష్లెస్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇక నుంచి చెక్పోస్టుల్లో నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేశాం. అవినీతిరహిత పరిపాలన దిశగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎటువంటి మధ్యవర్తులకు తావులేకుండా ఈ విధానం తోడ్పడనుంది. ట్రాఫిక్ ఇబ్బందులకు కొత్త విధానంతో చెక్ పడుతుంది. – మనీష్కుమార్ సిన్హా, రవాణాశాఖ కమిషనర్ -
7లక్షలు అప్పు చేసి కారు కొన్నా.. లోన్ త్వరగా తీర్చేందుకు ఏమైనా ఫండ్స్ ఉన్నాయా?
నేను ఇటీవలే ప్రత్యామ్నాయ రుణ సాధనాల గురించి వింటున్నాను. ముఖ్యంగా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ల గురించి తెలిసింది. వీటికి మంచి చరిత్ర ఉందా? అవి 12 శాతం వరకు రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. వీటితో ఏదైనా రిస్క్ ఉంటుందా? – శ్రీరామ్ రామనాథన్ ఈక్విటీలన్నవి సంపద సృష్టికి అనుకూలమైనవి. ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) సాధనాలు పెట్టుబడి రక్షణ, క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఉద్దేశించినవి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ (ప్రత్యామ్నాయ సాధనాలు) సంప్రదాయ ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్, నగదుకు అదనపు వ్యూహాలు మాత్రమే. ఇవి ప్రధానంగా ఐదు విభాగాలు. హెడ్జ్ ఫండ్స్, ప్రైవేటు క్యాపిటల్, నేచురల్ రీసోర్సెస్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటన్నింటిలోనూ లిక్విడిటీ తక్కువ. నియంత్రణలు తక్కువ. పారదర్శకత తక్కువ. వ్యయాలు ఎక్కువ. రిస్క్, రాబడులకు సంబంధించి చారిత్రక డేటా తక్కువగా ఉంది. అందుకుని ఈ అస్సెట్ క్లాస్ (ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్) అనేది రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సూచనీయం కాదు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారాలకు స్వల్పకాల రుణ సదుపాయమే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్. సాధారణంగా వీటిని బ్యాంకులు సమకూరుస్తుంటాయి. ప్రైవేటు క్యాపిటల్ పరిధిలోకి ఇవి వస్తాయి. ఇది చాలా పూర్వం నుంచి ఉన్న సాధనం. బ్యాంకులే దీనికి సారథ్యం వహిస్తున్నాయి. ఇందులో రాబడులు పరిమితం. నూరు శాతం నష్టానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. మీరు ఏదైనా కంపెనీకి రుణంపై వస్తువులు సరఫరా చేశారనుకుందాం. దానికి బిల్లు జారీ చేస్తారు. రుణ కాల వ్యవధి ముగిసిన తర్వాత ఆ బిల్లు మొత్తాన్ని కొనుగోలుదారుడు చెల్లిస్తాడు. ఈ రుణం కాల వ్యవధి సాధారణంగా 30–90 రోజులుగా ఉంటుంది. అంటే మీరు సరఫరా చేసిన వస్తువుల బిల్లు మొత్తం మీకు తిరిగి వచ్చేందుకు ఇన్ని రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లోపే మీకు డబ్బులు అవసరపడ్డాయని అనుకుంటే అప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లి ఈ బిల్లును ఇచ్చి దాన్ని నగదుగా మార్చుకోవచ్చు. మరి బ్యాంకులకు ఇందులో ప్రయోజనం ఏమిటి? బ్యాంకులు ఈ బిల్లు మొత్తంలో కొంత తగ్గించి మిగిలినది ఇస్తాయి. అందుకే దీనికి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అనే పేరు వచ్చింది. నూరు సంవత్సరాలకు పైగా బ్యాంకులు ఈ వ్యాపారం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం ఇది అందుబాటులోకి వచ్చింది. పలు ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇన్వాయిస్కు మీరు ఫండ్ సమకూర్చిన తర్వాత, డబ్బులు తిరిగి రాకపోతే పరిస్థితి ఏంటి? అన్నది ఆలోచించుకోవాలి. ఇన్వెస్టర్గా రాబడుల కంటే రిస్క్ను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. అదే బ్యాంకులు అయితే డిఫాల్ట్ ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. ఇందులో లిక్విడిటీ ఉండదు. మీరు విక్రయించాలనుకుంటే కొనుగోలు చేసే వారు లభించడం కష్టం. వీటికంటే ఈక్విటీలు మెరుగైన సాధనం. కారు కొనుగోలుకు రూ.7 లక్షల రుణం తీసుకున్నాను. దీన్ని ఏడేళ్ల కంటే ముందుగా తీర్చేసేందుకు ఏవైనా ఫండ్స్ను సూచించగలరా? – ఆదిత్య కారు రుణాన్ని ముందుగా చెల్లించేయాలన్న మీ ఆలోచన మంచిది. అయితే కారు వంటి తరిగిపోయే ఆస్తి కొనుగోలుకు రుణం తీసుకోవడాన్ని సాధారణంగా ప్రోత్సహించం. మీరు ఏడేళ్లలోపు రుణం తీర్చేయాలని అనుకుంటున్నారు కనుక.. మీరు స్వల్పకాలం నుంచి మధ్యకాలిక మ్యూచువల్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. దీనివల్ల మీరు పెట్టుబడిని రక్షించుకోవడంతోపాటు రాబడులు సొంతం చేసుకోగలరు. మూడు నుంచి నాలుగేళ్ల తర్వాత కారు రుణాన్ని చెల్లించేద్దామని అనుకుంటే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఇవి ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేసి, అచ్చమైన డెట్ కంటే మెరుగైన రాబడులు ఇస్తాయి. మూడు నాలుగేళ్లలోపే తీర్చేయాలని భావిస్తే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. -
ఆర్టీసీ ఎండీకి హైకోర్టు షోకాజ్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి నిధుల చెల్లింపుపై తాము ఆదేశించినా ఆ మేరకు ఎందుకు చెల్లింపులు చేయలేదో చెప్పాలని ఆర్టీసీ ఎండీకి, చీఫ్ మేనేజర్ (ఎఫ్అండ్ఏ)కు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఒకవేళ ఎవరూ హాజరుగాని పక్షంలో ఎక్స్పార్టీగా పేర్కొంటామని చెప్పింది. సీసీఎస్కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి. ఈ సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తానికి సంబంధించి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా, మే 15వ తేదీలోగా రూ.50 కోట్లు, మరో రూ.100 కోట్లను నవంబర్ 25లోగా సీసీఎస్కు డిపాజిట్ చేయాలని ఏప్రిల్లో హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలిచి్చనా ఆర్టీసీ యాజమాన్యం పాటించడం లేదని, కావాలనే ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ ఉద్యోగులు జూన్లో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్ను పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ పి.మాధవీ దేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్రావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎండీ, చీఫ్ మేనేజర్ హాజరుకావాలంటూ ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. చదవండి: తెలంగాణలో భిన్నంగా ఓటరు నాడి.. ఆ పార్టీకే మెజారిటీ సీట్లు! -
బిల్లు కట్టకుండా ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే!
ఫైవ్ స్టార్ హోటల్ అంటేనే విలాసవంతమైన వసతులకు కేరాఫ్ అడ్రస్. విశాలమైన గదులు, హై క్లాస్ ఫుడ్, కళ్లు చెదిరే స్మిమ్మింగ్ ఫుల్ ఇలా ప్రతి ఒక్కటి లగ్జరీస్గా ఉంటాయి. సామన్యులు ఈ హోటల్లో ఉండటం ఎంతో ఖరీదైన వ్యవహారం. ఒక్క రోజు ఇక్కడ బస చేయాలన్న లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి దాదాపు రెండేళ్లుగా ఫైవ్ స్టార్ హోటల్లోనే గడిపాడు. అది కూడా బిల్లు చెల్లించకుండ.. వినడానికి కొంచెం ఆశ్యర్యంగా అనిపించినా ఈ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఎరోసిటీలో రోసేట్ హౌస్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. అయితే ఆ హోటల్ సిబ్బందితో కుమ్మక్కై రెండేళ్లపాటు ఓ వ్యక్తి ఎలాంటి బిల్లు కట్టకుండా ఉండటంతో రూ. 58 లక్షల నష్టం వాటిల్లిందని సదరు హోటల్ యాజమాని వినోద్ మల్హోత్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. అంకుశ్ దత్తా అనే వ్యక్తి 2019 మే 30న ఒకరోజు నిమిత్తం హోటల్లో దిగాడు. మరుసటి రోజు ఖాళీ చేయాల్సి ఉంది. కానీ దాన్ని ఆయన 2021 జనవరి 22 వరకు పొడిగించుకుంటూ వచ్చాడు. మొత్తం 603 రోజులు ఉన్నాడు. చివరకు బిల్లు చెల్లించకుండానే తప్పించుకోవడంతో అతను హోటల్కు రూ.58 లక్షలు బకాయిపడ్డాడు. ఆడిట్లో రికార్డుల తనిఖీల సందర్భంగా ఇటీవల ఈ మోసం బయటపడింది.హోటల్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి బిల్లు చెల్లించకుండా 72 గంటలకు పైగా ఉంటే. ఆ విషయాన్ని వెంటనే సిబ్బంది హోటల్ సీఈఓ, ఫైనాన్షియల్ కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పై స్థాయికి అధికారులకు తీసుకెళ్లలేదని సదరు వ్యక్తి వెల్లడించారు. చదవండి: ఇదేంటండీ..! ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు చేస్తారా..? అయితే హోటల్ సిబ్బంది కొంతమంది అంకుశ్ దత్తాకు సహకరించినట్లు హోటల్ ప్రతినిధి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రేమ్ ప్రకాష్, మరి కొందరు కలిసి హోటల్ గదులను యాక్సెస్ చేసే సాఫ్ట్వేర్ సిస్టమ్ను మార్చి, అకౌంట్స్లో భారీ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. హోటల్ నిబంధలు ఉల్లంఘించి దత్తాను హోటల్లో బస చేయించాడని ఆరోపించారు. దీనికి ప్రకాష్, దత్తా నుంచి కొంత మొత్తంలో నగదు పొంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం మొత్తంలో ప్రేమ్ ప్రకాష్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ప్రకాష్ మే 30 2019 నుంచి అక్టోబరు 25 2019 వరకు ఎలాంటి పేమెంట్ రిపోర్ట్లు చేయలేదని అయితే అక్టోబరు 25 తర్వాత అతను దత్త బాకీ ఉన్న పేమెంట్ రిపోర్ట్ను రూపొందించినప్పుడు కావాలనే ఇతర పెండింగ్ బిల్లులతో కలిపి రిపోర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే బిల్లులను ఫోర్జరీ చేసి నిందితుడికి అనుకూలంగా అనేక నకిలీ బిల్లులను సృష్టించినట్లు చెప్పారు. అయితే దత్తా మూడు వేర్వేరు తేదీల్లో మూడు సార్లు వరుసగా రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షలు విలువ చేసే చెక్కులను ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ, అవి బౌన్స్ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కూడా ప్రకాశ్ దాచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో హోటల్ ప్రతినిధి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..నేరం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: గురుగ్రామ్లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు.. -
క్షణాల్లో చెల్లింపులు చేసే క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుందంటే..
క్యూఆర్ కోడ్ ఫుల్ పార్మ్ క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇది మెషీన్ రీడబుల్ లేబుల్ వంటిది. దీనిని కంప్యూటర్.. టెక్స్ట్ కన్నా సులభంగా అర్థం చేసుకుంటుంది. డిజిటల్ యుగం వైపు పయనిస్తున్న భారతదేశం అభివృద్ధి పథంలోనూ దూసుకుపోతోంది. నేడు ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా, వారిలో భారతీయుల సహకారం అధికంగా ఉండటం విశేషం. అయితే దీని వెనుక పలువురు ఇంజినీర్ల సహకారం దాగుంది. వారు పలు యాప్లను రూపొందించి, డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేశారు. డిజిటల్ చెల్లింపులలో అత్యంత ముఖ్యమైనది క్యూఆర్ కోడ్. దీని సాయంతో ఎవరికైనా నగదును సులభంగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం ద్వారా ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించారా? క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి? ఈ రోజుల్లో ప్రతిచోటా క్యూఆర్ కోడ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిని ట్రాక్ చేయడం, దానిని గుర్తించడంలో దీని వినియోగం అధికంగా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అడ్వర్టైజ్మెంట్, బిల్బోర్డ్, బిజినెస్ విండోలో అధికంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది ఉత్పత్తి డేటాను సేవ్ చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే క్యూఆర్ కోడ్ డేటాను నిల్వ చేసేందుకు ఎన్కోడింగ్ మోడ్లను ఉపయోగిస్తుంది. క్యూఆర్ కోడ్ ఎలా పని చేస్తుంది? బార్కోడ్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా క్యూఆర్ కోడ్ కోడ్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది చూసేందుకు దానికన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మనకు క్యూఆర్ కోడ్లో అనేక చుక్కలు కనిపిస్తాయి. బార్కోడ్లో గీతలు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది స్టాటిక్ క్యూఆర్ కోడ్. రెండవది డైనమిక్ క్యూఆర్ కోడ్. స్టాటిక్ క్యూఆర్ కోడ్ స్థిరంగా ఉంటుంది. అంటే అది ఒకసారి రూపొందించిన తరువాత దానిని మార్చలేరు. డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే అందులో ఉన్న సమాచారాన్ని తిరిగి అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
యూనియన్ బ్యాంకులో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులు
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులు, అన్ని రకాల యూజర్ చార్జీలను ఇకపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లోనూ చెల్లించొచ్చు. అన్ని రకాల స్టాంప్ పేపర్లు కూడా ఈ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి. ఇప్పటివరకు ఈ సేవలు ఎస్బీఐ ట్రెజరీ బ్యాంకుల్లోనే ఉన్నాయి. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూబీఐ శాఖల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులో ఇచ్చే ఈ స్టాంప్ పేపర్ ఆధారంగా రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో యూబీఐ శుక్రవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ సత్యేంద్రకుమార్ తివారీ, యూబీఐ స్టేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ల మధ్య విజయవాడలో ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో యూబీఐ ఉన్నతాధికారులు మురళీపార్థసారథి, శారదామూర్తి, పీవీజేఎన్ మూర్తి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 120 యూబీఐ బ్రాంచ్లలో శనివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని యూబీఐ ఎఫ్జీఎం నవనీత్ కుమార్ వివరించారు. చదవండి: Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం -
ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ
చైనీస్ ఇంటర్నెట్, టెక్ దిగ్గజం టెన్సెంట్ తన వుయ్చాట్ పే సేవ కోసం పామ్ రికగ్నేషన్ సర్వీస్ను ఇటీవల ప్రారంభించింది. ఇది మెట్రో ప్రయాణికులు స్కానర్పై అరచేతిని చూపి చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. వినియోగదారులు మెట్రో స్టేషన్ టర్న్స్టైల్స్లో స్కానర్పై చేతులు పెట్టి రాజధానిలోని డాక్సింగ్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో రైడ్ల కోసం చెల్లించవచ్చు. ప్రత్యేకమైన పామ్ ప్రింట్ రికగ్నేషన్ యూజర్ వుయ్చాట్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపును ప్రేరేపిస్తుందని నివేదిక పేర్కొంది. టెన్సెంట్ ప్రకారం.. ఈ పేమెంట్ సర్వీస్ కోసం మెట్రో స్టేషన్లోని నిర్దేశిత యంత్రం వద్ద ప్రయాణికులు తమ అరచేతి ముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సాంకేతికత ఉపరితల స్థాయి అరచేతి ముద్రలు, చేతి సిరలు రెండింటినీ గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. కంపెనీకి చెందిన యూటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. టెన్సెంట్ త్వరలో కార్యాలయాలు, క్యాంపస్లు, రిటైల్ అవుట్లెట్లు, రెస్టారెంట్లలో పామ్ పేమెంట్లను ప్రారంభించనుంది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ కూడా తన అలిపే సేవ కోసం ఇలాంటి టెక్నాలజీపై పని చేస్తోంది. యూఎస్లో అమెజాన్ 2020లో ఆఫ్లైన్ స్టోర్లలో అమెజాన్ వన్ అనే తన సొంత హ్యాండ్ స్కాన్ టెక్నాలజీని ప్రారంభించింది. -
గూగుల్కు భారీ షాక్.. రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే!
న్యూఢిల్లీ: పోటీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు విధించిన పెనాల్టీని నిర్ణీత గడువులోపు చెల్లించనందుకు గూగుల్కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిమాండ్ నోటీసులు జారీ చేసింది. గూగుల్కు వ్యతిరేకంగా సీసీఐ అక్టోబర్ చివర్లో రెండు ఆదేశాలు జారీ చేసింది. రెండు కేసుల్లోనూ మొత్తం రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందు గూగుల్ సవాల్ చేసింది. వీటిపై ట్రిబ్యునల్ ఇంకా విచారణ నిర్వహించాల్సి ఉంది. పెనాల్టీ చెల్లించేందుకు గూగుల్కు ఇచ్చిన 60 రోజుల గడువు ఈ నెల 25నే ముగిసింది. దీంతో గూగుల్కు సీసీఐ డిమాండ్ నోటీసులు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి సీసీఐ నిబంధనల కింద జరిమానా చెల్లించేందుకు 30 రోజుల గడువే ఉంటుంది. సీసీఐ ఆదేశాలపై అప్పీల్కు వెళ్లామని, స్టే రాకపోతే చెల్లించాల్సి వస్తుందని గూగుల్ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనుచిత వ్యాపార విధానాలను అనుసరిస్తోందంటూ సీసీఐ అక్టోబర్ 20న రూ.1337.76 కోట్ల జరిమానాను విధించడం గమనార్హం. ప్లేస్టోర్ విధానాలపరంగా తనకున్న అధిక మార్కెట్ వాటాతో అనైతిక విధానాలు అనుసరిస్తున్నందుకు రూ.936 కోట్ల జరిమానా విధించాలంటూ అక్టోబర్ 25న మరో కేసు విషయంలో సీసీఐ ఆదేశించింది. చదవండి: న్యూ ఇయర్లో లేఆఫ్స్ బాంబ్.. భారీ ఎత్తున గూగుల్,అమెజాన్ ఉద్యోగుల తొలగింపు! -
పేటీఎంకు ఆర్బీఐ భారీ షాక్
ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. పేమెంట్ ఆగ్రిగేటర్ సర్వీసుల కోసం కొత్తగా లైసెన్స్ అప్లయ్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించినట్లు పేటీఎం తన రెగ్యులరేటరీ ఫైలింగ్లో తెలిపింది. పేటీఎం బ్రాండ్తో వన్97 కమ్యూనికేషన్స్ చెల్లింపు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 2020లో పేమెంట్ ఆగ్రిగేటర్ సర్వీసుల్ని పేటీఎం పేమెంట్స్ సర్వీస్కు (పీపీఎస్ఎల్)కు బదిలి చేయాలని ఆర్బీఐని కోరింది. అందుకు సంబంధిత డాక్యుమెంట్లను 2021లో సబ్మిట్ చేసింది. ఆ డాక్యుమెంట్లపై ఆర్బీఐ తాజాగా స్పందించింది. Update: Our 100% subsidiary, Paytm Payments Services Limited will be resubmitting application to RBI for authorization to provide payment aggregator services for online merchants. This has no material impact on our business and revenues. More details: https://t.co/TXh2ABvdBH — Paytm (@Paytm) November 25, 2022 పేటీఎం బదిలీ అనుమతి పొందాలంటే వన్ 97 కమ్యూనికేషన్ గతంలో పెట్టిన పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్డీఐ) చట్టాలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. అప్పటి వరకు అనుమతులు మంజూరయ్యే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేర్కొంది. దీనిపై పేటీఎం స్పందించింది. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తమ వ్యాపారంపై పెద్దగా ప్రభావం ఉండబోదని పేర్కొంది. -
ఇంటర్నెట్ లేకుండానే UPI పెమెంట్స్
-
హేయనీయం: ‘పైసలొద్దు.. నన్ను వదిలేయండయ్యా!’
క్రైమ్: పని చేసి.. దానికి ప్రతిఫలం అడిగిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాదు.. అతనిపై దాష్టికానికి పాల్పడ్డారు కొందరు. వద్దని వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆ వ్యవహారమంతా వీడియో తీసి.. సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. ఓ దళితుడిని కులం పేరిట దూషించడమే కాదు.. అతనిపై దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా అతనితో బలవంతంగా వాళ్ల మూత్రం తాగించి, మెడలో చెప్పుల దండ వేశారు. నవంబర్ 23వ తేదీన రాజస్థాన్ సిరోహిలో హేయనీయమైన ఈ ఘటన చోటు చేసుకుంది. భరత్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా నగరంలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. ఓ దాబాలో కరెంట్ వైరింగ్ పని చేసి.. రూ. 21వేలు బిల్లుగా వేశాడు. కానీ, ఆ దాబా ఓనర్ ఐదు వేలు మాత్రమే చెల్లించి.. మిగతా పేమెంట్ కోసం భరత్ను చాలాసార్లు తిప్పించుకున్నాడు. సహనం కోల్పోయిన భరత్ ఓ రాత్రి.. దాబా వద్దకు వెళ్లి మిగతా డబ్బు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. దీంతో.. కోపంతో ఆ దాబా ఓనర్, అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి భరత్పై దాడి చేశారు. వద్దని వేడుకున్నా.. అతనిపై వికృత చేష్టలకు పాల్పడి వీడియోలు తీశారు. తనకు డబ్బులు వద్దని, వదిలేయాలంటూ బతిమాలుకున్నాడు. కులం పేరుతో అతన్ని దూషిస్తూ తమ మూత్రం తాగించారు ఆ ముగ్గురు. ఆపై తమ చెప్పులను దండగా చేసి అతని మెడలో వేశారు. ఐదు గంటలపాటు సాగింది వాళ్ల దాడి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాళ్లు.. భరత్ కేకలు విని కూడా పట్టనట్లు వెళ్లిపోయారు. ఆపై నిందితులు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది చూసి అవమానం భరించలేక పోలీసులను ఆశ్రయించాడు భరత్. దీంతో అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. Video Credits: First India News -
COP27: కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే
ఈజిప్టులో జరిగిన ‘కాప్ 27’ సమావేశాలు వాడిగా వేడిగా జరిగాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. ‘పేమెంట్ ఓవర్డ్యూ’ ఈసారి హాట్ టాపిక్! వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావన ఈ పేమెంట్ ఓవర్డ్యూ. అయితే ఈ దేశాలు తాము అంగీకరించిన విషయాల్లోనూ వెనకడుగు వేస్తుండటంతో వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉండటం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు తమ కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించే విధానాలు రావాలి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి స్పష్టం చేసినట్టు, కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే! ఈజిప్టులోని షర్మ్ అల్–షేఖ్లో నవంబరు ఆరున మొదలైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) 27వ సమావేశాలు ముగిశాయి. ఐక్యరాజ్య సమితి సంస్థ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైౖమేట్ ఛేంజెస్ (యూఎన్ఎఫ్సీసీసీ) ఆధ్వర్యంలో నడిచిన ఈ సమావేశాల్లో తీవ్ర చర్చోపచర్చలు, వాదోప వాదాలు జరిగి, ఒక్కరోజు పొడిగింపు తరువాత నవంబరు 20వ తేదీ తెల్లవారుజామున ముగిశాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేదెలా అన్న అంశంపై ఏటా జరిగే ‘కాప్’ సమావేశాల్లో ఈసారి ‘పేమెంట్ ఓవర్డ్యూ’ అంశంపై తీవ్రస్థాయి ప్రతిష్టంభన ఏర్ప డింది. వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావనను సంక్షి ప్తంగా పేమెంట్ ఓవర్డ్యూ అని పిలుస్తున్నారు. ఈ అంశంపై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. నవంబరు 18నే ముగియాల్సిన చర్చలు ఇరు వర్గాల విమర్శలు, ప్రతి విమర్శలతో రోజంతా కొనసాగాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెరస్ కలుగచేసుకుని, కార్యాచరణకు దిగాల్సిన సమయ మిదేనని స్పష్టం చేయాల్సి వచ్చింది. ‘‘కాప్27 సమావేశాలు నవం బరు 18నే ముగియాల్సి ఉండింది. అయితే చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఒక రోజుపాటు పొడిగించారు’’ అని భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వాతావరణ మార్పులపై ఏళ్లుగా జరుగుతున్న చర్చలు తరచూ ఆయా దేశాలు, వర్గాల మధ్య కలహాలు, జగడాలతో అర్ధంతరంగా ముగుస్తున్నాయి. ఈ దేశాలు, వర్గాలు సంకుచితమైన భావాలతో... ఇతరులపై పైచేయి సాధించేందుకు ఈ సమావేశాలు వేదికలుగా మారిపోయాయి. ‘‘వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పెరిగిపోకుండా స్థిరీకరించాల్సి ఉంది’’ అన్న యూఎన్ ఎఫ్సీసీసీ ఆర్టికల్ 2 లక్ష్యాన్ని 30 ఏళ్లయినా అందుకోలేకపోవడం ఇందుకు ప్రత్యక్ష తార్కాణమని చెప్పాలి. ఈ ఏడాది జూన్ రెండున స్టాక్హోమ్+ 50 సమావేశాల్లోనూ ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రపంచ వాతావరణ అత్యయిక పరిస్థితిపై మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మూప్పేట ముప్పు ఎదుర్కొంటూ ఉన్నాం. ఏటికేడాదీ ప్రజ లను చంపేయడమే కాకుండా... నిరాశ్రయులను చేస్తున్న వాతావరణ అత్యవసర పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు మనం మన తీరుతెన్నులు మార్చుకోవాలి. ప్రకృతిపై చేస్తున్న మతిలేని ఆత్మహత్యా సదృశమైన పోరును ఆపాలి’’ అని ఆంటోనియో గుటెరస్ విస్పష్టంగా పేర్కొ న్నారు. ఈ హెచ్చరికలు 1992లో యూఎన్ఎఫ్సీసీసీ... రియో సద స్సులో ఆమోదించిన తీర్మానాన్ని ధ్రువీకరించాయని చెప్పాలి. ‘‘ప్రపం చంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి... ఎక్కువ కాలం కొనసాగేది కాదు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ప్రకృతిని జయించాలన్న మానవ కాంక్ష మన మనగడనే ప్రశ్నార్థకం చేసే స్థితికి తీసుకొచ్చింది’’ అన్నది ఆ రియో సదస్సు తీర్మానం. ‘ఎన్విజనింగ్ అవర్ ఎన్విరాన్ మెంటల్ ఫ్యూచర్’ పేరుతో 2002లో వెలువడ్డ ఓ పుస్తకంలోనూ ‘‘పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన హెచ్చరికలు వెలువడు తున్న ఈ తరుణంలో మన భవిష్యత్తును కాపాడుకునేందుకు తీసు కోవాల్సిన చర్యలకు తగినంత సమయం లేదన్నది గుర్తించాలి’’ అని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. యూఎన్ఎఫ్సీసీసీలో దాదాపు 198 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వాతావరణ మార్పులన్నవి మానవాళికి అత్యంత ఆందోళ నకారి అని అంగీకరిస్తూ అందరితోనూ తొలినాళ్లలోనే ఒక ఒప్పందం చేసింది ఈ సంస్థ. 1997 నాటి క్యోటో ప్రోటోకాల్, 2015 నాటి ప్యారిస్ ఒప్పందాల ద్వారా యూఎన్ఎఫ్సీసీసీ వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు మూడు చట్టపరమైన ఆయుధాలు కలిగి ఉంది. రియో సదస్సు జరిగి ముప్ఫై ఏళ్లయిన సందర్భం ఇది. 2050 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలన్న శాస్త్రీయ లక్ష్యాన్ని సాధించేందుకు ఇదే అవకాశం. ఎందుకంటే... ఈ ఏడాది ఏప్రిల్లో ‘ద ఇంటర్ గవర్న మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైౖమేట్ ఛేంజ్’ విడుదల చేసిన ఆరవ అంచనా నివేదిక కూడా... గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించింది. గత నెలలోనే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్కు చెందిన ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ కూడా ప్యారిస్ ఒప్పందం అమలులో వెనుకబడుతున్నామనీ, లక్ష్యాన్ని అందుకు నేందుకు నమ్మ దగ్గ మార్గమేదీ లేని నేపథ్యంలో వాతావరణ పెను విపత్తును నివారిం చేందుకు అత్యవసరంగా ఓ విస్తృతమైన మార్పు అనివార్యం అవు తుందనీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల సమస్య అనేది ఇప్పుడు కేవలం ఒక ఆందోళనకరమైన అంశం మాత్రం కాదు. ప్రపంచం మొత్తాన్ని పీడించగలదని అందరూ గుర్తించాలి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకూ చేసిన కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించేలా విధానాలు లేకుండా పోయాయి. భూమ్మీద అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికా వాతావరణ మార్పులపై పోరు విషయంలో కప్పదాట్లు వేయడం, 2019లో ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం, ఆ తరువాత 2021లో మళ్లీ చేరుతున్నట్లు ప్రకటించడం అభివృద్ధి చెందిన దేశాల తీరుకు తార్కాణంగా నిలుస్తోంది. అంతేకాకుండా... వాతా వరణ మార్పులపై జరిగిన ఒప్పందాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపు తుంది కూడా. అంతర్జాతీయ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఒడిదుడుకులకు గురయ్యేందుకు యూఎన్ఎఫ్సీసీసీ తన ప్రధాన సిద్ధాంతం నుంచి కొంత పక్కదారి పట్టడమే కారణమని అనిపిస్తుంది. వాతావరణ మార్పుల సమస్య అందరిదైనా... బాధ్యతలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని చెప్పే సిద్ధాంతం మాత్రమే కాకుండా... క్యోటో ప్రోటో కాల్లోని కొన్ని కీలకాంశాల్లో సడలింపులు, ప్యారిస్ ఒప్పందంలోనూ బాధ్యతల విషయంలో ఆయా దేశాలు తమకు తగ్గ నిర్ణయం తీసు కుంటాయని చెప్పడం... వెరసి వాతావరణ మార్పులపై మనిషి పోరు నిర్వీర్యం అని చెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన ప్రతి విషయంలోనూ వెనకడుగు వేయడం వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పెద్దగా పురోగతి లేకపోయేందుకు కారణమని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన అంశాల నుంచి వెనక్కు వెళ్లడం... వాతావరణ మార్పులు, దాని దుష్ప్రభావాలను ఎదుర్కొనే విషయంలో ధనిక దేశాలు నేతృత్వం వహించాలని యూఎన్ఎఫ్సీసీసీ చేసిన ప్రకటనను వెక్కిరించేదిగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల తీరు యూఎన్ఎఫ్సీసీసీ లక్ష్యాలకు పూర్తిగా భిన్నమన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. యూఎన్ ఎఫ్సీసీసీ నిబంధనల ప్రకారం... అభివృద్ధి చెందిన దేశాలు నేతృత్వం వహించేందుకూ; అవసరమైన అంశాల్లో తామిచ్చిన హామీల అమలు జరుగుతున్నదా లేదా అన్నది సమీక్షించేందుకూ తగిన ఏర్పాట్లు చేయాలి. అయితే ఇవేవీ జరగడం లేదు. ఈజిప్టులో ఇటీవల ముగిసిన కాప్ 27 సమావేశాల సారాంశమూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తగిన చర్యలు తీసుకోకపోతే ప్యారిస్ ఒప్పందం ప్రకారం జాతీయంగా నిర్దే శించుకున్న కంట్రిబ్యూషన్స్ వల్ల తమకేమీ ప్రయోజనం ఉండబోదని అభివృద్ధి చెందుతున్న దేశాలూ త్వరలో గుర్తిస్తాయి. ఈ విషయాల న్నింటినీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పటివరకూ వాతావరణ మార్పులపై చర్చలను నిర్వహించడానికి మాత్రమే పరిమితమైన జనరల్ అసెంబ్లీ సమస్య మరింత తీవ్రమైనది అన్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. యూన్ఎఫ్సీసీసీతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలుకు, భవిష్యత్తు కార్యాచరణకు తగిన తీర్మానాలు చేయాలి. భరత్ హెచ్. దేశాయి, వ్యాసకర్త ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, జేఎన్యూ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇన్సూరెన్స్ రంగంలో ‘బీమా సుగమ్’ గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: బీమా సుగమ్ అన్నది బీమా రంగం స్వరూపాన్నే మార్చేస్తుందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా అన్నారు. బీమా పాలసీల విక్రయం, కొనుగోలు, రెన్యువల్ (పునరుద్ధరణ), క్లెయిమ్ల పరిష్కారం సహా అన్ని రకాల సేవలను అందించే ఏకీకృత ప్లాట్ఫామ్గా ఉంటుందన్నారు. దేశంలో బీమా వ్యాప్తి విస్తరణకు ఈ టెక్నాలజీ పోర్టల్ సాయంగా నిలుస్తుందన్నారు. కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందన్నారు. యూపీఐ విప్లవం వంటిది... బీమా రంగానికి బీమా సుగమ్ అన్నది యూపీఐ విప్లవం వంటిదని వ్యాఖ్యానించారు. బీమా కంపెనీలు ఈ ప్లాట్ఫామ్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. బీమా ఏజెంట్లు, వెబ్ అగ్రిగేటర్లు సహా అన్ని రకాల మధ్యవర్తులకూ ఈ పోర్టల్ యాక్సెస్ ఉంటుందని చెప్పారు. పాలసీదారులు ఈ పోర్టల్ నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. బీమాకు సంబంధించి దీన్నొక షాపింగ్ మాల్గా పాండా అభివర్ణించారు. -
చికోటి ప్రవీణ్ వాట్సాప్లో కీలక సమాచారం
-
ఏజీఆర్ బకాయిలు: వొడాఫోన్ ఐడియాకు ఊరట
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016-17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్ 15న డిమాండ్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునే ఆప్షన్ను టెలికం శాఖ ఆఫర్ చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018-19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
తెలంగాణలో జోరందుకున్న పెండింగ్ చలానాల చెల్లింపులు
-
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు.. బంఫర్ ఆఫర్ 30 రోజులే!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహనాల పెండింగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 30 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. (చదవండి: వాట్సాప్ యూనివర్సిటీ వైద్యం.. వారి సలహాలు వింటే సరి.. లేదంటే ప్రాణాలు హరీ! ) హైదరాబాద్లో ఇప్పటివరకు 1.75 లక్షల చలాన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఈ-చలాన్ సిస్టమ్ ద్వార పెండింగ్ చలాన్లను చెలించాలని అన్నారు. ఆర్టీసీ బస్లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు గతంలో నో మాస్క చలాన్లు రూ.1000 ఫైన్ ఉండగా, ప్రస్తుతం అవి రాయితీ అనంతరం రూ.100 కడితే సరిపోతుందన్నారు. కాగా దీనిపై నేటి రాత్రిలోపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
నేడు రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత నిధుల జమ
-
కరోనా దెబ్బకు డిమాండ్, భలే స్కెచ్చేసిన మార్క్ జుకర్ బర్గ్..!
కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల్లో యూపీఐ, క్యూఆర్ కోడ్ పేమెంట్స్ వినియోగం పెరిగిపోతుంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా సంస్థలు యూపీఐ Unified Payments Interface (UPI) పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే ఫోన్పే, పేటీఎం, గూగుల్పే, వాట్సాప్లు ఉండగా.. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్(మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ సైతం ఈ యూపీఐ సర్వీసుల్ని ఫేస్బుక్ మెసెంజర్లో అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో బీటా వెర్షన్ పై పనిచేస్తున్నట్లు, మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఆ తరువాత ఇతర దేశాల్లో సైతం ఈ ఫీచర్ను వినియోగించేకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఫేస్బుక్ ప్రతినిధులు చెప్పారు. వచ్చే వారం యూఎస్యూలోని మెసేంజర్ యూజర్లు వినియోగించేలా పేమెంట్ ఆప్షన్పై టెస్ట్ చేయనున్నట్లు ఫేస్బుక్ తన బ్లాగ్లో పేర్కొంది. స్ప్లిట్ పేమెంట్ పేరుతో మెసెంజర్లో ఫేస్బుక్ పరిచయం చేయనున్న ఈ ఫీచర్తో నిత్యవసర సరుకులు, రెంట్, హోటల్ బిల్లుల్ని ఒకేసారి సెండ్ చేయొచ్చు. అదే సమయంలో నోటిఫికేషన్ సైతం పంపిచుకోవచ్చు. చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తులకు ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు గ్రూప్లో ఒక చాట్లా కనిపిస్తుంది. ఫీచర్ ఎలా పనిచేస్తుంది ►స్ప్లిట్ పేమెంట్స్ ఫీచర్ని ఉపయోగించడానికి గ్రూప్ చాట్లో “గెట్ స్టార్ట్” అనే బటన్పై క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే పేమెంట్స్ ఎవరెవరికి ఎంత పంపించాలో డివైడ్ చేయాలి ►ఆ వివరాల్ని ఎంటర్ చేసిన అనంతరం మీరు మీ ఫేస్బుక్ పేమెంట్ వివరాల్ని కన్ఫాం చేయాల్సి ఉంటుంది. ►కన్ఫామ్ చేసిన తరువాత.. మీ పంపిన మెసేజ్ వెళ్లిందా లేదా చెక్ చేయాలి. చదవండి: జుకర్ బర్గ్ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా? -
రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తమ ఆన్లైన్ పేమెంట్స్ వ్యాపారాన్ని కొత్త అనుబంధ సంస్థకు బదలాయించాలని భావిస్తోంది. పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్కు దీన్ని బదిలీ చేయడానికి షేర్హోల్డర్ల అనుమతి తీసుకునేందుకు సెప్టెంబర్ 23న అసాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్హోల్డర్లకు ఈజీఎం నోటీసు పంపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం తెలిపింది. కొత్త సంస్థ బుక్ వేల్యు సుమారు రూ. 275–350 కోట్లుగా ఉంటుందని, ఈ నిధులను అయిదేళ్ల పాటు వార్షిక చెల్లింపుల కింద మాతృసంస్థ వన్9 కమ్యూనికేషన్స్కు చెల్లించనున్నట్లు వివరించింది. అక్టోబర్లో రూ. 16,600 కోట్ల పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు పేటీఎం కసరత్తు చేస్తోంది. -
Telangana: ఆరోగ్యశ్రీ అందట్లే!
రాష్ట్రవ్యాప్తంగా వందల ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అందడం లేదు. సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల దాకా ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏడాదిన్నరగా బకాయిలు రావడం లేదని, అందువల్ల నగదు రహిత సేవలు అందించలేకపోతున్నామని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం వస్తున్నవారిని ఏదో ఒక కారణం చెప్తూ తిప్పి పంపేస్తున్నాయి. దీంతో చివరికి అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రుల తీరుపై ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద కూడా నగదు రహిత వైద్య సేవలు అందడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ మేడ్చల్కు చెందిన గొరుకంటి యాదగిరి కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. శని వారం ఉదయం ఆయనకు భరించలేని నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డును చూపించి ఔట్పేషెంట్ విభాగం (ఓపీడీ)లో న్యూరాలజీ వైద్యులను కలిశారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సీటీ స్కాన్ చేయాలని, ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసుకోవాలని రిఫర్ చేశారు. కానీ సాయంత్రం దాకా వేచిచూసినా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఇదేమిటని అడిగితే ముందు రూ.10 వేలు కడితే జాయిన్ చేసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా డబ్బులు కట్టాలంటే ఎలాగని నిలదీస్తే.. ‘ఆరోగ్యశ్రీ నుంచి వచ్చేదే తక్కువ. ఇప్పటికే బకాయిలు రావడం లేదు. నిమ్స్ ఎలా నడవాలి’ అని సిబ్బంది ప్రశ్నించ డంతో చేసేది లేక డబ్బులు కట్టి అడ్మిట్ అయ్యారు. నల్లగొండకు చెందిన రాజేందర్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల మలక్పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనను పరీక్షించి, సర్జరీ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, దాని కింద అడ్మిట్ చేసుకుని చికిత్స చేయాలని రాజేందర్ కోరగా.. ఆస్పత్రి నిర్వాహకులు నిరాకరించారు. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రావడం లేదని, డబ్బు కడితే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు రూ. 900 కోట్లకుపైగా బకాయిలు రాష్ట్రంలో 329 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. వాటిలో 41,398 పడకలు ఉన్నాయి. మొత్తం 77.19 లక్షలమంది పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)ను కూడా ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రం లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా, ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. 949 వ్యాధులకు నగదు రహిత వైద్యం అందజేయాలి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఒక్క 2018–19 ఏడాదిలోనే ఆరోగ్యశ్రీ కింద రూ.720 కోట్ల విలువై న చికిత్సలు జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ చెల్లింపులు నిలిచిపోయాయని..ప్రభుత్వం నుంచి రూ.900 కోట్లు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రులు వాపోతున్నాయి. దీంతో రోగులకు సేవలు అందించలేని పరిస్థితి ఉందని చెప్తున్నాయి. చదవండి: హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం..! రోగులకు తీవ్ర అవస్థలు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఇన్పేషెంట్ సేవలేకాకుండా.. ఔట్పేషెంట్ (ఓపీ), వైద్య పరీక్షలూ సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రులు కరోనా చికిత్సల్లో ఉన్నామని, ఆరోగ్యశ్రీ కింద ఇతర చికిత్సలు చేయడం లేదని చెప్తూ రోగులను తిప్పి పంపేస్తున్నాయి. ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ గందరగోళంతోనూ.. ఆరోగ్యశ్రీతోపాటు కేంద్ర సార్వత్రిక ఆరోగ్య పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రపథకంలో 1,393 వ్యాధులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి రూ.175 కోట్ల వరకు నిధులు వస్తాయని అంచనా. ఈ రెండు పథకాలను కలిపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఆచరణలో స్పష్టత ఇవ్వలేదని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ వద్దు బాబోయ్! ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది నెట్వర్క్ ఆస్పత్రులు ఈ విషయంగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ కింద నగదు రహిత చికిత్సలు చేసి, బకాయిలు రాక అప్పుల్లో కూరుకుపోయామని.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలంటూ ఆస్పత్రుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తేవని.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తీసేయాలని కోరుతుండటం విస్మయం కలిగిస్తోందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సీఈవోలుగా ఇన్చార్జులే.. ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) పోస్టును కొన్నేళ్లుగా ఇన్చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీ సీఈవోగా నాన్ ఐఏఎస్ను నియమించారు. తర్వాత నిమ్స్ డైరెక్టర్ మనోహర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఆయన్ను తొలగించి ఐఏఎస్ అధికారి మాణిక్రాజ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ దీనికి ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను రెండింటినీ కలిపి నిర్వహించాలన్న నిర్ణయం నేపథ్యంలో.. పూర్తిస్థాయి సీఈవోను నియమించాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిస్థాయి సీఈవో లేకపోవడం వల్ల రోజువారీగా నెట్వర్క్ ఆస్పత్రుల సమస్యలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆరోగ్యశ్రీ సమస్యల విషయంగా వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని ‘సాక్షి’ప్రతినిధి సంప్రదించగా.. కావాల్సిన వివరాలేమిటో వాట్సాప్లో పంపాలని సూచించారు. ఈ మేరకు ఆయన వాట్సాప్కు సమస్యల వివరాలను పంపినా.. స్పందించలేదు. ఏడాదిన్నరగా సంక్షోభం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.900 కోట్లు బకాయి పడింది. దీనితో సాధారణ ఆస్పత్రులు ఏడాదిన్నరగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బకాయిల విషయంగా ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. ఇక ఆరోగ్యశ్రీ కింద వివిధ వ్యాధులకు ఏళ్లకింద ప్యాకేజీలను నిర్ధారించారు. ఆ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్యాకేజీ ధరలను ఏటా ఐదు శాతం పెంచాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి రాలేదు. దీనివల్ల చికిత్సలు అందించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. – డాక్టర్ వద్దిరాజు రాకేశ్, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 3 కోట్లు బకాయిలు రావాలి మా ఆస్పత్రికి సుమారు రూ.3 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. చాలారోజులుగా బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రి నిర్వహణ కష్టంగా మారింది. అప్పులు తెచ్చి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నాం. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడ్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ చికిత్సలు అందించలేని పరిస్థితి నెలకొంది. – జి.వెంకటేశ్వర్లు, ఎండీ, శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం -
పేటీఎమ్ నుంచి ఆల్-ఇన్-వన్ పీవోస్ చెల్లింపుల వ్యవస్థ
ప్రముఖ డిజటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ వ్యాపారుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేటీఎమ్ ఆల్-ఇన్-వన్ పీవోఎస్ మెషిన్ తో చిన్నవ్యాపారులు ఈ-కామర్స్ సహచరులైపోతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పీవోఎస్ మెషిన్తో చిన్న వ్యాపారులు ఈ-కామర్స్ సంస్ధల తరహాలో నో-కాస్ట్, ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను తమ కస్టమర్లకు అందించవచ్చును. తన ఆల్-ఇన్-వన్ పీవోఎస్ ఉపకరణాలతో ఈఎమ్ఐ ఆఫర్లు, ప్రముఖ బ్యాంక్ లు, భాగస్వామి బ్రాండ్ ల నుంచి క్యాష్ బ్యాక్ లతో దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు, రిటైలర్లతో సహా వ్యాపా రులందరికీ సాధికారికత కల్పిస్తున్నట్లు భారతదేశ అగ్రగామి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ పేటీఎమ్ ప్రకటించింది. పేటీఎమ్ వాలెట్, క్యూఆర్ కోడ్స్ ద్వారా అన్ని యూపీఐ యాప్స్, క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వా రా చెల్లింపులు స్వీకరించేందుకు ఆల్-ఇన్-వన్ పీవోఎస్ వీలు కల్పిస్తుంది. ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లోని ఎంతో మంది దుకాణదారులు, చిన్న వ్యాపారాల యజమానులు ఇప్పటికే పేటీఎమ్ ఆల్-ఇన్-వన్ పీవోఎస్ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. పలు అగ్రగామి బ్యాంకులతో పేటియం ఒప్పందాలను కుదుర్చుకుంది. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పాదనలపై ఆ కర్షణీయ డిస్కౌంట్లు అందించేందుకు ప్రముఖ బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చకుంది. ఈ సందర్భంగా పేటీఎమ్ అధికారప్రతినిధి మాట్లాడుతూ, ‘‘ఆఫ్ లైన్ దుకాణదారులు, రిటైల ర్లతో సహా వ్యాపారులంతా కూడా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవ స్థలో అతి ముఖ్యభాగంగా ఉన్నారు. పేటీఎమ్ ఆల్-ఇన్-వన్ పీవోఎస్ ఉపకరణంతో మేం వారికి ఈ-కామర్స్ సంస్థలు ఆన్ లైన్ లో అందించే డిస్కౌంట్లు, బ్యాంక్ డీ ల్స్ అందించేలా చేయగలుగుతున్నాం. అంతేకాకుండా వారు, సాంకేతికతపై లేదా బ్యాక్ ఎండ్ మౌలిక వసతులపై ఎలాంటి పెట్టుబడి లేకుండానే తమ వ్యాపార కార్యకలాపాలను సులభంగా డిజిటైలైజ్ చేసుకోవచ్చును. వ్యాపారులు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, డిజిటల్ ఇండియా మిషన్ లో వారు చేరేందుకు తోడ్పడేందుకు ఎంతో అవసరమైన డిజిటైలైజేషన్కు మా ఉపకరణాలు తోడ్పడతాయ’’ని అన్నారు. ఈ ఆల్ –ఇన్-వన్ పీవోఎస్ ఉపకరణం కార్డ్ స్వైప్ నుంచి, క్యూఆర్ కోడ్స్ నుంచి చెల్లింపు లను ఆమోదిస్తుంది. జీఎస్టీ కాంప్లియెంట్ బిల్లులను అందించేందుకు అది ‘పేటీఎమ్ ఫర్ బిజి నెస్’ యాప్ తో ఇంటిగ్రేట్ చేశారు. అన్ని లావాదేవీలను, సెటిల్ మెంట్స్ ను కూడా వ్యాపారులు నిర్వహించుకోగలుగుతారు. అంతేకాకుండా రుణాలు, బీమా వంటి వివిధ వ్యాపార సేవలు, ఆర్థిక పరిష్కారాలను పొందడంలో ‘పేటీఎమ్ ఫర్ బిజి నెస్’ యాప్ వ్యాపారులకు తోడ్పడుతుంది. క్రెడిట్ సేల్స్, నగదు విక్రయాలు, కార్డు విక్రయాలతో సహా తమ లావాదేవీలన్నింటినీ నిర్వహించుకునేందుకు ‘బిజినెస్ ఖాతా’ ను కూడా ఉపయోగించుకోవచ్చు. -
క్యూఆర్ కోడ్తో చెల్లింపులు
హైదరాబాద్: క్యూఆర్ కోడ్ ఆధారంగా నగదు చెల్లించే విధానాన్ని ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ అమల్లోకి తెచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువు కవర్పై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కస్టమర్లు డిజిటల్ పేమెంట్ చేయోచ్చు. పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యూపీఐ యాప్ను వినియోగించవచ్చు. చెల్లింపుల విషయంలో క్యూఆర్ కోడ్ విధానంతో వినియోగదార్లలో విశ్వాసం పెరుగుతుందని వివరించింది. సీఓడీ ఆప్షన్తో కరోనా కారణంగా టచ్ తగ్గించడం ప్రధానంగా మారింది. అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు నగదు చెల్లింపు కొంత రిస్క్గా మారింది. దీంతో సీఓడీ ఆప్షన్లో క్యూఆర్ కోడ్ పేమెంట్ ఆప్షన్ని ఫ్లిప్కార్ట్ అమల్లోకి తెచ్చింది. -
ఐపీఎల్ 2021: ఆడిన మ్యాచ్లకు మాత్రమే డబ్బు చెల్లించండి
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒకవేళ లీగ్ను నిర్వహించలేకపోతే బీసీసీఐకి రూ.2,500 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. లీగ్ వాయిదా నిర్ణయాన్ని ఐపీఎల్ ప్రసారదారు స్టార్స్పోర్ట్స్ సమర్థించింది. ఈ టోర్నీ వాయిదా వల్ల స్టార్ స్పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని బీసీసీఐ కోల్పోతుంది. మరోవైపు స్పాన్సర్లు, అడ్వటైజర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో స్టార్స్పోర్ట్స్ స్పందించింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లకు మాత్రమే డబ్బులు చెల్లించాలని స్పాన్సర్లు, ప్రకటనకర్తలను కోరింది. వాయిదా పడిన ఐపీఎల్ 2021ను బీసీసీఐ తిరిగి నిర్వహిస్తే ప్రకటనకర్తలు వారి ప్రకటన ఒప్పందాల నుంచి వైదొలిగే వెసులుబాటు కూడా ఉంటుంది. ఐపీఎల్ 2021 కోసం వివిధ కేటగిరీల్లో 18 స్పాన్సర్లు ఉండగా, మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసే ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ+హాట్స్టార్కు 14 మంది స్పాన్సర్లు ఉన్నారు. టోర్నీ నిరవధికంగా వాయిదా పడటంతో తాము తీవ్రంగా నష్టపోయినట్లు అడ్వటైజర్లు ప్రకటించాయి. ప్రస్తుత సీజన్లో మే 30 వరకు అంటే 52 రోజుల పాటు 60 మ్యాచ్లు జరగాల్సి ఉంది. వాయిదా కారణంగా కేవలం 29 మ్యాచ్లు జరిగాయి. స్టార్స్పోర్ట్స్ 2018-2022 వరకు ఐపీఎల్ టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులను రూ.16,348కోట్లకు దక్కించుకుంది. సీజన్లో మొత్తం 60 మ్యాచ్లు ఉండగా ఒక్కో మ్యాచ్కు 54.5కోట్లను బీసీసీఐకి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 29 మ్యాచ్లకు స్టార్ స్పోర్ట్స్ దాదాపు రూ.1,580 కోట్లు చెల్లించాలి. చదవండి: ఐపీఎల్ నిర్వహణ ఇప్పట్లో కష్టమే: గంగూలీ -
వాహన పన్ను చెల్లింపు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: మోటారు వాహన పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించింది. ప్రస్తుత త్రైమాసిక పన్నును ఏప్రిల్ 30లోగా చెల్లించాల్సి ఉంది. కాగా, కరోనా తీవ్రత నేపథ్యంలో పన్ను చెల్లింపు తేదీని పొడిగించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పన్ను చెల్లింపు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: కరోనా: ప్రయాణికులు లేకపోవడంతో 10 రైళ్లు రద్దు ఏపీ: వాహన విక్రయాల్లో జోష్ -
ఈపీఎఫ్ఓ నుంచి 15 రోజుల్లో రూ. 3,601 కోట్ల ఉపసంహరణ
న్యూఢిల్లీ: కరోనా అడ్వాన్సులను వేగవంతంగా పూర్తిచేస్తున్నట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. దాదాపు 90 శాతం ముందస్తు చెల్లింపులను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరించినట్లు వివరించింది. కరోనా మహమ్మారి ప్రభావాన్ని అధిగమించడం కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీలో భాగంగా ఈపీఎఫ్ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు ప్రభుత్వం వీలుకల్పించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో రూ. 3,601 కోట్ల ఉపసంహరణ జరిగిందని వివరణ ఇచ్చింది. -
సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక చేయూత కావాలి...
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని దేశీయ పరిశ్రమలు కేంద్రాన్ని కోరాయి. రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం, పన్నుల తగ్గింపు, ప్రజలకు రూ.2లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు అందించాలని సూచించాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ రాకముందే మందగమనంలో ఉంది. గత డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయి 4.7 శాతానికి పడిపోయింది. తాజాగా కరోనా వైరస్తో దేశవ్యాప్తంగా అన్నీ మూతేయాల్సి వస్తుండడంతో ఆర్థిక వృద్ధి మరింత పడిపోయే ప్రమాదం ఉంది. విధానపరమైన చర్యలను ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురాకపోతే 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపునకు పడిపోవచ్చంటూ దేశీయ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి. ద్రవ్య, పరపతి పరమైన ఉద్దీపన చర్యలను తక్షణమే ప్రకటించాలని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కోరారు. దేశ జీడీపీలో ఒక శాతానికి సమానమైన రూ.2 లక్షల కోట్లను పేదలకు ఆధార్ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించాలని సీఐఐ కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను తగ్గించేందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తొలగించడాన్ని పరిశీలించాలని.. అలాగే, డివిడెండ్ పంపిణీ పన్నును 25 శాతంగా నిర్ణయించాలని కోరింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతోపాటు, వసూలు కాని రుణాలను ఎన్పీఏలుగా గుర్తించడానికి ప్రస్తుతమున్న 90 రోజుల గడువును తాత్కాలికంగా అయినా 180 రోజులకు పెంచాలని సీఐఐ సూచనలు చేసింది. ఏడాది చివరి వరకు విరామం.. కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులకు రుణ చెల్లింపులపై ఈ ఏడాది చివరి వరకు మారటోరియం (విరామం) ప్రకటించాలని అసోచామ్ కోరింది. ఎల్ఐసీ ద్వారా వెంటనే ఎన్బీఎఫ్సీలకు నిధులను అందించాలని సూచించింది. మన దేశంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అసోచామ్.. దురదృష్టవశాత్తూ దేశ రుణ మార్కెట్ బలహీనంగా ఉన్న, ఆర్థిక వ్యవస్థ మందగమనం సమయంలో ఈ సంక్షోభం వచ్చిందని వ్యాఖ్యానించింది. -
బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా?
కారణాలేవైనా కానీ మీరు తీసుకున్న బీమా పాలసీని కొనసాగించలేకపోతున్నారా..? ప్రీమియం చెల్లింపును భారంగా భావిస్తున్నారా..? దీంతో పాలసీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ ముందు ఓ చక్కని మార్గం ఉంది. పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. దీనికంటే పెయిడప్ పాలసీగా మార్చుకుంటే సరి. ఈ అవకాశం ఎండోమెంట్ పాలసీల్లో ఉంటుంది. ఎండోమెంట్ పాలసీలు బీమా రక్షణతోపాటు, పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. ఈ ఎండో మెంట్ పాలసీ కాల వ్యవధి ముగియక ముందే దాన్ని నిలిపివేయాలని భావిస్తే రెండు మార్గాలు ఉన్నాయి. దాన్ని పెయిడప్ పాలసీగా మార్చుకోవడం ఒకటి. ఇలా చేస్తే బీమా కవరేజీ కొనసాగుతుంది. లేదా పాలసీని బీమా సంస్థకు స్వాధీనం చేసి సరెండర్ వ్యాల్యూని పొందడం. ఈ రెండు మార్గాల్లో ఉన్న మంచి చెడులను తెలియజేసే కథనమే ఇది. పెయిడప్ పాలసీ పెయిడప్ పాలసీ ఆప్షన్లో జీవిత బీమా నిర్ణీత కాలం వరకు కొనసాగడం అనుకూలతగా చెప్పుకోవాలి. అంటే ప్రీమియం చెల్లించకపోయినా కానీ, ఈ కవరేజీ కొనసాగుతుంది. అలాగే, పాలసీ కాల వ్యవధి సమయంలో పాలసీదారు మరణిస్తే సమ్ అష్యూరెన్స్ (బీమా మొత్తం)ను నామినీకి చెల్లించడం జరుగుతుంది. పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. కాకపోతే పాలసీని పెయిడప్గా మార్చుకుంటే చివర్లో వచ్చే ప్రయోజనాలు కొంత తగ్గిపోతాయి. ఎందుకంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక. దాంతో కాల వ్యవధి తీరిన తర్వాత పాలసీదారుకు లభించే మొత్తం తగ్గుతుంది. పెయిడప్గా మార్చిన నాటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక వార్షికంగా తాజా బోనస్లు కూడా నిలిచిపోతాయి. అప్పటి వరకు సమకూరిన బోనస్లను కాల వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తారు. ‘‘ఇటీవలి ఐఆర్డీఏఐ నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ నిబంధనలు 2019 ప్రకారం పెయిడప్కు అర్హమైన పాలసీల్లో చెల్లించాల్సిన కనీస ప్రీమియం రెండు సంవత్సరాలుగా నిర్దేశించడం జరిగింది. అంటే ఇంకా మిగిలి ఉన్న కాలంతో సంబంధం లేకుండా అన్ని పాలసీలకు పెయిడప్ విషయంలో రెండేళ్ల ప్రీమియం చెల్లిస్తే చాలు’’ అని హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీ తెలిపింది. యూనిట్ లింక్డ్ ప్లాన్ (యులిప్)లను కూడా పెయిడప్ పాలసీలుగా మార్చుకోవచ్చు. అయితే, లాకిన్ పీరియడ్ వరకు (ఐదేళ్ల పాటు) అందులో కొనసాగాల్సి ఉంటుంది. పాలసీదారుపై చార్జీల భారం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే యులిప్లలో జీవిత బీమా కవరేజీ రిస్క్ చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఫండ్ నిర్వహణ చార్జీలు కొనసాగుతాయి. నాన్ లింక్డ్ ఎండోమెంట్ పాలసీల్లో పెయిడప్గా మారిన తర్వాత ఎటువంటి చార్జీలను విధించడం జరగదు. స్వాధీనం చేస్తే..? ఒకవేళ పాలసీలో కొనసాగకూడదని భావిస్తే దాన్ని స్వాధీనం చేసి స్వాధీన విలువను (సరెండర్ వ్యాల్యూ) పొందొచ్చు. సరెండర్ చేసినట్టయితే ఆ తర్వాత బీమా కవరేజీ కూడా ముగిసినట్టే. ఈ ఆప్షన్లోనూ కనీసం కొంత కాలం పాటు ప్రీమియం చెల్లింపు తర్వాతే సరెండర్ చేయడానికి వీలుంటుందని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ అక్షయ వైద్య తెలిపారు. యులిప్లలో కనీసం ఐదేళ్లు కొనసాగిన తర్వాతే సరెండర్కు వీలుంటుంది. యులిప్లలో ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు తర్వాత ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసే నాటికి ఉన్న ఫండ్ విలువ ను చెల్లించడం జరుగుతుంది. ముందుగా వైదొలిగినందుకు ఎటువంటి చార్జీల విధింపు ఉండదు. అదే నాన్ లింక్డ్ ప్లాన్లలో అయితే రెండేళ్ల తర్వాత స్వాధీనం చేయవచ్చు. సరెండర్ చార్జీలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. పాలసీ స్వాధీనం విషయంలో చెల్లించాల్సిన కనీస మొత్తాలను ఐఆర్డీఏఐ నిర్దేశించింది. అయితే, పాలసీ తొలి నాళ్లలో స్వాధీనం చేసినట్టయితే, చెల్లించిన ప్రీమియంలో 50%వరకు నష్టపోవాల్సి రావచ్చు. నాన్లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్ను రెండో ఏడాది స్వాధీనం చేస్తే చెల్లించిన మొత్తం ప్రీమియంలో 30 శాతమే వెనక్కి వస్తుంది. మూడో ఏడాది స్వాధీనం చేస్తే 35% లభిస్తుంది. పాలసీ తొలినాళ్లలో స్వాధీనం చేయడం ద్వారా ఎక్కువ మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. పాలసీ తొలి ఏడేళ్ల కాలంలో స్వాధీనం చేస్తే ఎంత చెల్లించాలన్న దానిని ఐఆర్డీఏఐ పేర్కొంది. పెయిడప్, సరెండర్... ఏది నయం? ఒక్కసారి ఎండోమెంట్ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత కనీసం రెండేళ్లు అయినా ప్రీమియం చెల్లిచాలి. అప్పుడే దాన్నుంచి పెద్దగా నష్టం రాదు. బీమాతోపాటు పొదుపు కలసిన పాలసీల్లో రెండేళ్లలోపే బయటపడితే వచ్చేదేమీ పెద్దగా ఉండదు. కనీసం రెండేళ్లు చెల్లించిన తర్వాత పెయిడప్, సరెండర్ ఆప్షన్లను పరిశీలించొచ్చు. అయినా కానీ తొలినాళ్లలో ఇలా చేయడం వల్ల అంత ప్రయోజం ఉండదు. పెయిడప్, సరెండర్ ఈ రెండింటిలో ఏది నయం? అన్న ప్రశ్నే ఎదురైతే పెయిడప్గా మార్చుకోవడమే మంచిది. ఎందుకంటే, ఇందులో జీవిత బీమా కొనసాగుతుంది. కాల వ్యవధి తీరాక కొంత వెనక్కి వస్తుంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీకి పరిహారం దక్కుతుంది. మరో జీవిత బీమా పాలసీ తీసుకున్నా తర్వాతే ఒక పాలసీ నుంచి వెదొలగడాన్ని పరిశీలించాలి. -
మా డబ్బులిస్తేనే ఆడతాం!
బ్రాంప్టన్ (కెనడా): ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టి20 లీగ్ల నిర్వహణలో ఇది మరో కోణం! ప్రముఖ క్రికెటర్లు ఎంతో మంది పాల్గొంటున్న కెనడా గ్లోబల్ టి20 లీగ్లో బుధవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్లో భాగంగా మాంట్రియల్ టైగర్స్, టొరంటో నేషనల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే హోటల్ నుంచి స్టేడియంకు బయల్దేరే సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ ఆడమంటూ ఒక్కసారిగా తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించారు. లీగ్ నిర్వాహకులు తమకు భారీ మొత్తం బాకీ ఉన్నారని, తమ డబ్బుల విషయం తేలిస్తే తప్ప టీమ్ బస్సు ఎక్కమని వారంతా భీష్మించుకున్నారు! గ్లోబల్ లీగ్కు చెందిన కొందరు వ్యక్తులు క్రికెటర్లను ఒప్పించే ప్రయత్నం చేసినా వారంతా గట్టిగా పట్టుబట్టారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆటగాళ్లంతా హోటల్లోనే ఆగిపోవడంతో అంతా గందరగోళంగా మారిపోయింది. టోర్నీ ప్రసారకర్తలు ‘సాంకేతిక కారణాలతో మ్యాచ్ ఆలస్యం’ అంటూ తమ చానల్లో స్క్రోలింగ్ నడిపిస్తూ పాత మ్యాచ్లను ప్రసారం చేస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. చివరకు సుదీర్ఘ చర్చల అనంతరం సమస్య పరిష్కృతమైంది. టొరంటో టీమ్లో యువరాజ్ సింగ్, బ్రెండన్ మెకల్లమ్, పొలార్డ్, మెక్లీనగన్ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కాగా, మాంట్రియల్ జట్టులో జార్జ్ బెయిలీ, డిక్వెలా, సునీల్ నరైన్, తిసార పెరీరావంటి గుర్తింపు పొందిన క్రికెటర్లు ఉన్నారు. ఈ టోర్నీకి ఐపీఎల్ తదితర లీగ్ల తరహాలో కనీసం దేశవాళీ టి20 మ్యాచ్ గుర్తింపు కూడా లేదు. -
వాట్సాప్ ‘పేమెంట్స్’కు లైన్ క్లియర్!
బెంగళూరు: మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపుల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించినట్లుగా పేమెంట్ డేటాను భారత్లోనే భద్రపర్చేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ఆధారిత వ్యవస్థ ద్వారా వాట్సాప్ ఈ సేవలు అందించనుంది. ఈ సర్వీసుల కోసం ముందుగా ఐసీఐసీఐ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రోజుల్లో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లతో పాటు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా జట్టు కట్టనున్నట్లు సమాచారం. ‘డేటా లోకలైజేషన్కి సంబంధించిన పనులన్నీ వాట్సాప్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆడిట్ ప్రక్రియ నడుస్తోంది. ఆడిటర్లు తమ నివేదికను రిజర్వ్ బ్యాంక్కు సమర్పించిన తర్వాత వాట్సాప్ తన పేమెంట్ సర్వీసులను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు అవకాశం ఉంటుంది‘ అని సంబంధిత వర్గాలు వివరించాయి. గతేడాదే పైలట్ ప్రాజెక్టు.. అమెరికన్ సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్ 2018లోనే ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో యూజర్లకు పేమెంట్ సేవలు అందించడం ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో తమ యాప్లో పేమెంట్స్ ఫీచర్ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై వివాదం రేగింది. నియంత్రణ సంస్థ ఆదేశాలకు విరుద్ధంగా డేటాను భారత్లో కాకుండా విదేశాల్లో భద్రపరుస్తుండటం, యూజర్ల డేటా భద్రతపై అనుమానాలు, వాట్సాప్లో తప్పుదోవ పట్టించే వార్తలు వైరల్గా మారుతుండటం తదితర అంశాలు ఈ ప్రాజెక్టుకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ప్రధానమైన డేటా లోకలైజేషన్ అంశంతో పాటు ఇతరత్రా సమస్యలన్నింటినీ వాట్సాప్ పరిష్కరించుకోవడంతో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం కాగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెనక్కి తగ్గని ఆర్బీఐ .. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. చెల్లింపుల సేవలు అందించే సంస్థలు ముందుగా భారత్లో డేటా స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆడిట్ నివేదికను కూడా సమర్పించిన తర్వాతే సర్వీసులు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే విదేశాల్లోని సర్వర్లలో డేటా నిల్వ, ప్రాసెస్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు..మళ్లీ భారత్లో కూడా ప్రత్యేకంగా డేటా స్టోరేజీ చేయాలంటే శ్రమ, వ్యయాలతో కూడుకున్న వ్యవహారమని, తమకు మినహాయింపునివ్వాలని ఆర్బీఐని కోరాయి. కానీ భారత యూజర్ల డేటా భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించి తీరాల్సిందేనంటూ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కావాలంటే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేసుకోవచ్చని, అయితే ఆ తర్వాత 24 గంటల్లోగా భారత్లోని సిస్టమ్స్లోకి బదలాయించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో దారికొచ్చిన అంతర్జాతీయ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ డేటా లోకలైజేషన్ నిబంధనల ప్రకారం భారత్లో తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ కూడా డేటా స్థానికత మార్గదర్శకాలను పాటిస్తూ ఈ మద్యే యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీసులు ప్రారంభించింది. ఇందుకోసం యాక్సిస్ బ్యాంక్తో జట్టు కట్టింది. తాజాగా వాట్సాప్ కూడా అదే బాటలో స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. ఇలా అంతర్జాతీయ దిగ్గజాలు నిర్దేశిత నిబంధనలు పాటించేలా చేయడంలో రిజర్వ్ బ్యాంక్ విజయం సాధించినట్లయిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజా గణాంకాల ప్రకారం దేశీయంగా మొత్తం 39 థర్డ్ పార్టీ యాప్స్.. పేమెంట్స్ సర్వీసులు అందిస్తున్నాయి. గూగుల్ పే, అమెజాన్, ఉబెర్, ఓలా వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. -
ఆర్కామ్ దివాలా పిటీషన్పై ఎన్సీఎల్ఏటీ దృష్టి
న్యూఢిల్లీ: రుణభారం పేరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) దివాలా అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దివాలా పిటీషన్పై విచారణ కొనసాగించాలా లేదా అన్న దానిపై తానే తుది నిర్ణయం తీసుకుంటామని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. తమకు రావాల్సిన రూ. 550 కోట్ల బాకీల కోసం స్విస్ టెలికం సంస్థ ఎరిక్సన్ గతంలో ఈ పిటీషన్ వేసింది. అయితే, ఆ తర్వాత బాకీలు వసూలు కావడంతో పిటీషన్ను ఉపసంహరించుకుంటామని తెలిపింది. కానీ, ఇతర రుణదాతలకు బాకీలు చెల్లింపులు జరిపే పరిస్థితుల్లో తాము లేమని, దివాలా పిటీషన్పై ప్రొసీడింగ్స్ కొనసాగించాలని ఎన్సీఎల్ఏటీని ఆర్కామ్ కోరుతోంది. ఎరిక్సన్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. రూ.550 కోట్లు ఎరిక్సన్ తిరిగి ఇచ్చేయాలా? ఈ నేపథ్యంలో ఎన్సీఎల్ఏటీ తాజాగా సోమవారం తన అభిప్రాయం వెల్లడించింది. ఒకవేళ ఆర్కామ్ దివాలా ప్రక్రియకు అనుమతించిన పక్షంలో ఎరిక్సన్ తనకు దక్కిన రూ. 550 కోట్లు కూడా వాపసు చేయాల్సి ఉంటుందని ద్విసభ్య బెంచ్ చైర్మన్ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. ‘రుణాలిచ్చిన మిగతావారందరినీ కాదని ఒక్కరే మొత్తం బాకీ సొమ్మును ఎలా తీసుకుంటారు‘ అని ప్రశ్నించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా ప్రొసీడింగ్స్ కొనసాగించడమా లేదా నిలిపివేయడమా అన్నదానిపై ఎన్సీఎల్ఏటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఎన్సీఎల్ఏటీ ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఐఎల్ఎఫ్ఎస్ 4 సంస్థల వివరాలివ్వండి.. మరో నాలుగు గ్రూప్ కంపెనీల వివరాలు సమర్పించాల్సిందిగా రుణ సంక్షోభం ఎదుర్కొంటున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ను ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. వాటిల్లో పెన్షను, ప్రావిడెంట్ ఫండ్స్ పెట్టుబడులు, వాటి రుణాల వివరాలు ఇవ్వాల్సిందిగా సూచించింది. ఉద్యోగులకు చెందాల్సిన పింఛను నిధులను తొక్కిపెట్టి ఉంచకూడదని, ఆ మొత్తాన్ని ముందుగా విడుదల చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హజారీబాగ్ రాంచీ ఎక్స్ప్రెస్వే, జార్ఖండ్ రోడ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కంపెనీ, మొరాదాబాద్ బరైలీ ఎక్స్ప్రెస్వే, వెస్ట్ గుజరాత్ ఎక్స్ప్రెస్వే సంస్థలు వీటిలో ఉన్నాయి. చెల్లింపులు జరపగలిగే సామర్థ్యాలను బట్టి ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలను మూడు వర్ణాలుగా వర్గీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కాషాయ వర్ణం (నిర్వహణపరమైన చెల్లింపులు జరిపే సామర్థ్యం ఉన్నవి) కింద వర్గీకరించిన నాలుగు సంస్థల విషయంలో ఎన్సీఎల్ఏటీ ఆదేశాలిచ్చింది. మొత్తం 13 కాషాయ వర్ణ సంస్థల్లో మిగతా తొమ్మిది సంస్థలు తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్ 16లోగా రుణాల చెల్లింపు ప్రణాళికను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉండాలని పేర్కొంది. -
ఫ్లిప్కార్ట్లో కొత్త పేమెంట్ ఆప్షన్
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్, అంతర్జాతీయ కంపెనీ అమెజాన్ను అనుసరిస్తోంది. ఈ రెండు కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, అమెజాన్ ప్రవేశపెడుతున్న కొన్ని వినూత్న ఫీచర్లను, ఫ్లిప్కార్ట్ కూడా లాంచ్ చేస్తోంది. అమెజాన్ ఇండియా ‘అమెజాన్ పే ఈఎంఐ క్రెడిట్ ఆప్షన్’ను లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఫ్లిప్కార్ట్ కొత్త పేమెంట్ ఆప్షన్ కార్డ్లెస్ క్రెడిట్ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ కొత్త పేమెంట్ ఆప్షన్ కార్డ్లెస్ క్రెడిట్ కింద కొనుగోలుదారులకు ఇన్స్టాంట్ క్రెడిట్గా రూ.60వేల వరకు అందించనుంది. కొత్త కార్డ్లెస్ క్రెడిట్ సిస్టమ్.. సరియైన సమయంలో క్రెడిట్ అందించే ప్రక్రియను సరళీకృతం చేయడంతో పాటు, క్రెడిట్ అంచనాను, దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తుందని కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్పై 45 మిలియన్ కస్టమర్లకు క్రెడిట్ యాక్సస్ లేదని గుర్తించిన తర్వాతనే కార్డ్లెస్ క్రెడిట్ను తీసుకొచ్చామని తెలిపింది. క్రెడిట్ కార్డులు లేదా క్రెడిట్ లిమిట్స్ యాక్సస్ పొందలేని మధ్యతరగతి మొబైల్ యాక్టివ్ రుణగ్రహీతలు తమ కార్డ్లెస్ క్రెడిట్ కస్టమర్లని పేర్కొంది. వీరి షాపింగ్ ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకుని, పరిశీలించిన అనంతరం, వారి షాపింగ్ అనుభవాన్ని చౌకగా అందించేందుకు సాధారణ, పారదర్శకత మార్గంలో క్రెడిట్ను ఆఫర్ చేయడం చేస్తోంది. 60 సెకన్లలోనే రూ.60వేల వరకు ఇన్స్టాంట్ క్రెడిట్ను ఫ్లిప్కార్ట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తమ ప్లాట్ఫామ్పై వినియోగదారుల ప్రవర్తన బట్టి క్రెడిట్ను అందించనుంది. ఈ క్రెడిట్ పొందిన నెల తర్వాత లేదా 3-12 నెలల్లో ఈఎంఐ చెల్లించేలా ఈ ఇన్స్టాంట్ క్రెడిట్ యాక్సస్ను ఆఫర్ చేస్తోంది. -
వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు ’యోనో’ యూజర్లు!
ముంబై: డిజిటల్ ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఒకే యాప్ ద్వారా నిర్వహించుకునేలా ’యోనో’ (యూ ఓన్లీ నీడ్ వన్) పేమెంట్ యూప్ను అందుబాటులో ఉంచిన ఎస్బీఐ... ఈ యాప్ వినియోగాన్ని వేగంగా విస్తృత పరుస్తోంది. నగదు బదిలీ, డిపాజిట్లపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం, డిజిటల్గానే బ్యాంక్ ఖాతా ప్రారంభం వంటివి ఇపుడు యోనో ప్రత్యేకతలుగా ఉన్నాయి. ప్రస్తుతం 25 లక్షల మంది యూజర్లు ఉన్న ఈ యాప్ వినియోగదారుల సంఖ్యను వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు చేర్చడానికి లకి‡్ష్యంచామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. యోనో ప్రస్తుతం ప్రత్యేక ప్లాట్ఫామ్గా ఉందని, దీన్ని త్వరలోనే బడ్డీతో అనుసంధానం చేస్తామని తెలియజేశారు. బుధవారమిక్కడ మోప్యాడ్ (మల్టీ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైస్) పేరిట పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్ పరికరాన్ని ఆరంభించారు. కార్డులు, భారత్ క్యూఆర్, యూపీఐ, ఎస్బీఐ బడ్డీ (ఈ– వాలెట్) ద్వారా ఈ పీఓఎస్ వద్ద చెల్లింపులు చేయొచ్చు. -
వాట్సాప్ పేమెంట్ సేవలకు 24 గంటల కస్టమర్ సపోర్ట్
న్యూఢిల్లీ: త్వరలో ప్రవేశపెట్టనున్న పేమెంట్ సేవలకు 24 గంటల కస్టమర్ సపోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న పేమెంట్ సేవలను వచ్చే కొద్ది వారాల్లో భారత్లో ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ ముమ్మరంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్లో వాట్సాప్ మెసెంజర్ యాప్కు 20 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నారు. ‘పేమెంట్ సేవల కోసం రోజంతా అందుబాటులో ఉండే కస్టమర్ సపోర్ట్ను ఏర్పాటు చేయనున్నాం. సేవలను ప్రవేశపెట్టిన తర్వాత యూజర్లు ఈ–మెయిల్, టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సంప్రతించవచ్చు’ అని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. ఇంగ్లిష్తో పాటు హిందీ, మరాఠీ, గుజరాతీ ఈ మూడు ప్రాంతీయ భాషల్లో కస్టమర్ సర్వీస్ సేవలను పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) ఆధారిత పేమెంట్ సర్వీసుల ప్రారంభ తేదీ, ఇతరత్రా వివరాలను మాత్రం వెల్లడించలేదు. గడిచిన కొద్ది నెలలుగా పది లక్షల మందికిపైగా వాట్సాప్ యూజర్లు భారత్లో ఈ సర్వీసులను ప్రయోగాత్మకంగా వాడుతున్నట్లు అంచనా. తమ పేమెంట్ సర్వీస్ ఎలా పనిచేస్తుంది, ఇతరత్రా వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ), భాగస్వామ్య బ్యాంకులు, భారత ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశామని వాట్సాప్ ప్రతినిధి చెప్పారు. -
‘చెల్లింపు’ల్లోకి ట్రూకాలర్..!
(సాక్షి, బిజినెస్ విభాగం):అంతర్జాతీయ డిజిటల్ టెలిఫోన్ డైరెక్టరీగా ఎదుగుతున్న ‘ట్రూ కాలర్’... రెవెన్యూ ఆర్జించటంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అంతర్జాతీయంగా తనకు అతిపెద్ద మార్కెట్గా ఉన్న భారత్లో చెల్లింపుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. దేశంలో మల్టీ–బ్యాంక్ పేమెంట్స్ యాప్గా పేరొందిన ‘చిల్లర్’ యాప్ను కొనుగోలు చేసినట్లు ట్రూకాలర్ బుధవారం ప్రకటించింది. చిల్లర్ వ్యవస్థాపకులు సోని జాయ్, అనూప్ శంకర్, మొహమ్మద్ గాలిబ్, లిషయ్ భాస్కరన్తో పాటు ఇతర ఉద్యోగులు ఇకపై తమ సంస్థలో భాగంగా ఉంటారని ట్రూ కాలర్ సహ వ్యవస్థాపకుడు నమీ జారింగ్లామ్ తెలియజేశారు. ట్రూకాలర్ పే విభాగానికి సోని జాయ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటారన్నారు. మొబైల్ పేమెంట్స్ కార్యకలాపాల విభాగానికి చిల్లర్ ఇంజినీర్లు, డిజైనర్ల అనుభవం తోడ్పడగలదని ఆశిస్తున్నట్లు జారింగ్లామ్ చెప్పారు. అయితే చిల్లర్ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. చిల్లర్ 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. భారత్లో 15 కోట్ల మంది యూజర్లు, 300కు పైగా సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఇక ట్రూకాలర్కి భారత్లో 65 మంది సిబ్బంది ఉన్నారు. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) కింద మరిన్ని బ్యాంకులను తమ పేమెంట్ యాప్ ప్లాట్ఫాంపైకి తేనున్నట్లు సోనీ జాయ్ తెలియజేశారు. ఇండియానే ఎందుకంటే... ట్రూకాలర్ను స్వీడన్కు చెందిన ట్రూ సాఫ్ట్వేర్ స్కాండనేవియా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 2009లో ఆరంభమైన ట్రూకాలర్కు గతేడాది చివరకు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది యూజర్లున్నారు. వీరిలో దాదాపు 15 కోట్ల మంది ఒక్క భారత్లోనే ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ట్రూకాలర్కు ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇక ట్రూకాలర్ వద్ద దాని యూజర్లకు సంబంధించి రకరకాల డేటా ఉందని, తన సర్వీసులకు సంబంధం లేని డేటాను సైతం అది సేకరిస్తోందని కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ట్రూకాలర్ యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్లోని సమాచారమంతా బేషరతుగా అందజేస్తున్నట్లే లెక్క. మన ఫోన్లో సేవ్ చేసుకున్న పేర్లతో పాటు ఫోన్కి వచ్చే, పోయే కాల్స్, మెసేజీల వివరాలన్నీ ట్రూకాలర్కి చేరుతున్నాయి. మనం ఇవ్వడానికి ఇష్టపడని సమాచారాన్ని కూడా ఈ యాప్ సేకరిస్తోంది. ఇది ఒక రకంగా గుర్తింపునకు సంబంధించిన వివరాల చౌర్యమే’’ అనేది ఐటీ నిపుణుల మాట. కాకపోతే ఇవన్నీ ట్రూకాలర్ యాప్ రహస్యంగా ఏమీ సేకరించటం లేదు. యాప్ను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే అందులోని షరతులు, నిబంధనలను మనం ఓకే చెయ్యాల్సి ఉంటుంది. కానీ యాప్ను ఇన్స్టాల్ చేసుకునే హడావుడిలో యూసేజీ పాలసీని చదవకుండానే అన్ని అనుమతులూ ఇచ్చేసి ఓకే చేసేస్తారు. మనం చూసే కంటెంట్ మొదలుకుని, సెర్చి చేసే అంశాలు, వెబ్సైట్ల దాకా మొత్తం కంటెంట్ సమాచారాన్ని సేకరిస్తామని ట్రూకాలర్ తన పాలసీలో చెబుతోంది. నిజానికి ఇది అందించే సర్వీసులకు ఇలాంటివన్నీ అవసరం లేదన్నది నిపుణుల మాట. అయితే ఇలా సేకరించిన కాంటాక్ట్స్ సమాచారంతో ట్రూకాలర్ భారీ పబ్లిక్ టెలిఫోన్ డైరెక్టరీ వంటి డేటాబేస్ను తయారు చేసుకుంటోంది. ఇండియా అతిపెద్ద మార్కెట్ కనక ఇక్కడే పేమెంట్ సర్వీసులను ఆరంభిస్తోంది. పర్మిషన్స్ ముసుగులో నిఘా..! ఇన్స్టలేషన్ సమయంలో... ఫోన్ మైక్రోఫోన్కు యాక్సెస్ ఇవ్వాలని, మన ఫోన్బుక్లోని కాంటాక్ట్స్ వివరాలను తమ సర్వర్స్ సేకరించేందుకు అనుమతించాలని ట్రూకాలర్ అడుగుతోంది. ఇవి హానికరమైనవి కావనే ఉద్దేశంతో పర్మిషన్స్ ఇచ్చేస్తాం. కానీ.. ఈ పర్మిషన్స్ సాయంతో మనం ఫోన్ లిఫ్ట్ చేశామా లేదా, లాక్ అయి ఉందా.. అన్లాక్ అయి ఉందా వంటి వివరాలన్నీ కూడా ట్రూకాలర్ యాప్కి చేరిపోతున్న సంగతి మనకు తెలియదు. చాలామంది ఫోన్లలో కుటుంబసభ్యులు, చుట్టాలు, ఫ్రెండ్స్ తదితరుల పేర్లను సేవ్ చేసుకునేటప్పుడు వారితో ఉన్న బంధుత్వాన్ని సూచించేలా చివర్లో చుట్టరికాన్ని కూడా చేరుస్తుంటారు. కృష్ణ మామయ్యనో, రాజూ చాచా అనో రకరకాలుగా చేస్తారు. ఇలా సేవ్ చేయడం వల్ల కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని ట్రూకాలర్ చేతికిచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రైవసీకి కాకుండా స్నేహితులు, ఇతరత్రా మనకు తెలిసినవారి ప్రైవసీకి కూడా భంగం కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ‘‘కాలర్ ఐడీని తెలుసుకోవటానికి, అనవసర కాల్స్ను బ్లాక్ చేయటానికి ట్రూకాలర్ ఉపయోగపడుతుందనే భావనతోనే చాలా మంది ఉన్నారు. కానీ వారి ఫోన్లో ఉన్న డేటా కూడా కంపెనీ చేతికి చేరుతోందనే సంగతి వారికి తెలియదు’’ అని సైబర్ క్రైమ్ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అసలు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలనుకుంటే.. ఆన్లైన్ సర్వీసులందించే ఏ సంస్థతోనూ వివరాలు పంచుకోకపోవటమే ఉత్తమమనేది వారి సూచన. -
‘చెల్లింపు’ల్లోకి ట్రూకాలర్..!
(సాక్షి, బిజినెస్ విభాగం) : అంతర్జాతీయ డిజిటల్ టెలిఫోన్ డైరెక్టరీగా ఎదుగుతున్న ‘ట్రూ కాలర్’... రెవెన్యూ ఆర్జించటంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అంతర్జాతీయంగా తనకు అతిపెద్ద మార్కెట్గా ఉన్న భారత్లో చెల్లింపుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. దేశంలో మల్టీ–బ్యాంక్ పేమెంట్స్ యాప్గా పేరొందిన ‘చిల్లర్’ యాప్ను కొనుగోలు చేసినట్లు ట్రూకాలర్ బుధవారం ప్రకటించింది. చిల్లర్ వ్యవస్థాపకులు సోని జాయ్, అనూప్ శంకర్, మొహమ్మద్ గాలిబ్, లిషయ్ భాస్కరన్తో పాటు ఇతర ఉద్యోగులు ఇకపై తమ సంస్థలో భాగంగా ఉంటారని ట్రూ కాలర్ సహ వ్యవస్థాపకుడు నమీ జారింగ్లామ్ తెలియజేశారు. ట్రూకాలర్ పే విభాగానికి సోని జాయ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటారన్నారు. మొబైల్ పేమెంట్స్ కార్యకలాపాల విభాగానికి చిల్లర్ ఇంజినీర్లు, డిజైనర్ల అనుభవం తోడ్పడగలదని ఆశిస్తున్నట్లు జారింగ్లామ్ చెప్పారు. అయితే చిల్లర్ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించారనేది వెల్లడించలేదు. చిల్లర్ 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. భారత్లో 15 కోట్ల మంది యూజర్లు, 300కు పైగా సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఇక ట్రూకాలర్కి భారత్లో 65 మంది సిబ్బంది ఉన్నారు. ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) కింద మరిన్ని బ్యాంకులను తమ పేమెంట్ యాప్ ప్లాట్ఫాంపైకి తేనున్నట్లు సోనీ జాయ్ తెలియజేశారు. ఇండియానే ఎందుకంటే... ట్రూకాలర్ను స్వీడన్కు చెందిన ట్రూ సాఫ్ట్వేర్ స్కాండనేవియా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 2009లో ఆరంభమైన ట్రూకాలర్కు గతేడాది చివరకు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది యూజర్లున్నారు. వీరిలో దాదాపు 15 కోట్ల మంది ఒక్క భారత్లోనే ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ట్రూకాలర్కు ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇక ట్రూకాలర్ వద్ద దాని యూజర్లకు సంబంధించి రకరకాల డేటా ఉందని, తన సర్వీసులకు సంబంధం లేని డేటాను సైతం అది సేకరిస్తోందని కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ట్రూకాలర్ యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్లోని సమాచారమంతా బేషరతుగా అందజేస్తున్నట్లే లెక్క. మన ఫోన్లో సేవ్ చేసుకున్న పేర్లతో పాటు ఫోన్కి వచ్చే, పోయే కాల్స్, మెసేజీల వివరాలన్నీ ట్రూకాలర్కి చేరుతున్నాయి. మనం ఇవ్వడానికి ఇష్టపడని సమాచారాన్ని కూడా ఈ యాప్ సేకరిస్తోంది. ఇది ఒక రకంగా గుర్తింపునకు సంబంధించిన వివరాల చౌర్యమే’’ అనేది ఐటీ నిపుణుల మాట. కాకపోతే ఇవన్నీ ట్రూకాలర్ యాప్ రహస్యంగా ఏమీ సేకరించటం లేదు. యాప్ను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే అందులోని షరతులు, నిబంధనలను మనం ఓకే చెయ్యాల్సి ఉంటుంది. కానీ యాప్ను ఇన్స్టాల్ చేసుకునే హడావుడిలో యూసేజీ పాలసీని చదవకుండానే అన్ని అనుమతులూ ఇచ్చేసి ఓకే చేసేస్తారు. మనం చూసే కంటెంట్ మొదలుకుని, సెర్చి చేసే అంశాలు, వెబ్సైట్ల దాకా మొత్తం కంటెంట్ సమాచారాన్ని సేకరిస్తామని ట్రూకాలర్ తన పాలసీలో చెబుతోంది. నిజానికి ఇది అందించే సర్వీసులకు ఇలాంటివన్నీ అవసరం లేదన్నది నిపుణుల మాట. అయితే ఇలా సేకరించిన కాంటాక్ట్స్ సమాచారంతో ట్రూకాలర్ భారీ పబ్లిక్ టెలిఫోన్ డైరెక్టరీ వంటి డేటాబేస్ను తయారు చేసుకుంటోంది. ఇండియా అతిపెద్ద మార్కెట్ కనక ఇక్కడే పేమెంట్ సర్వీసులను ఆరంభిస్తోంది. పర్మిషన్స్ ముసుగులో నిఘా..! ఇన్స్టలేషన్ సమయంలో... ఫోన్ మైక్రోఫోన్కు యాక్సెస్ ఇవ్వాలని, మన ఫోన్బుక్లోని కాంటాక్ట్స్ వివరాలను తమ సర్వర్స్ సేకరించేందుకు అనుమతించాలని ట్రూకాలర్ అడుగుతోంది. ఇవి హానికరమైనవి కావనే ఉద్దేశంతో పర్మిషన్స్ ఇచ్చేస్తాం. కానీ.. ఈ పర్మిషన్స్ సాయంతో మనం ఫోన్ లిఫ్ట్ చేశామా లేదా, లాక్ అయి ఉందా.. అన్లాక్ అయి ఉందా వంటి వివరాలన్నీ కూడా ట్రూకాలర్ యాప్కి చేరిపోతున్న సంగతి మనకు తెలియదు. చాలామంది ఫోన్లలో కుటుంబసభ్యులు, చుట్టాలు, ఫ్రెండ్స్ తదితరుల పేర్లను సేవ్ చేసుకునేటప్పుడు వారితో ఉన్న బంధుత్వాన్ని సూచించేలా చివర్లో చుట్టరికాన్ని కూడా చేరుస్తుంటారు. కృష్ణ మామయ్యనో, రాజూ చాచా అనో రకరకాలుగా చేస్తారు. ఇలా సేవ్ చేయడం వల్ల కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని ట్రూకాలర్ చేతికిచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రైవసీకి కాకుండా స్నేహితులు, ఇతరత్రా మనకు తెలిసినవారి ప్రైవసీకి కూడా భంగం కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ‘‘కాలర్ ఐడీని తెలుసుకోవటానికి, అనవసర కాల్స్ను బ్లాక్ చేయటానికి ట్రూకాలర్ ఉపయోగపడుతుందనే భావనతోనే చాలా మంది ఉన్నారు. కానీ వారి ఫోన్లో ఉన్న డేటా కూడా కంపెనీ చేతికి చేరుతోందనే సంగతి వారికి తెలియదు’’ అని సైబర్ క్రైమ్ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అసలు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలనుకుంటే.. ఆన్లైన్ సర్వీసులందించే ఏ సంస్థతోనూ వివరాలు పంచుకోకపోవటమే ఉత్తమమనేది వారి సూచన. -
ఇక ‘సౌండ్’తో పేమెంట్..!
న్యూఢిల్లీ: కొత్త చెల్లింపుల విధానం త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులను పెంచే లక్ష్యంతో శబ్దం ఆధారిత చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రయత్నాలు మొదలు పెట్టింది. శబ్దం ఆధారిత చెల్లింపుల విధానాన్ని పరీక్షించేందుకు ఫోన్పే, టోన్ట్యాగ్, అల్ట్రా క్యాష్ అనే మూడు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2016 నవంబర్లో డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, వర్తకులు ఇప్పటికీ యూపీఐ ఆధారిత చెల్లింపుల పట్ల విముఖంగానే ఉన్నారు. దీంతో ఎన్పీసీఐ ఆ తర్వాత యూపీఐతో అనుసంధానించిన క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. అయినా కానీ, ఈ విధానం కూడా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో మరింత సులభతరంగా డిజిటల్ చెల్లింపులను సుసాధ్యం చేసేందుకు ప్రత్యామ్నాయాలపై ఎన్పీసీఐ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే శబ్దం ఆధారిత చెల్లింపుల విధానం ముందుకు వచ్చింది. ఐసీఐసీఐ పాకెట్స్కు టోన్ట్యాగ్ అనుసంధానం టోన్ట్యాగ్కు చెందిన ‘సౌండ్పే’ను ఐసీఐసీఐ బ్యాంకు ‘పాకెట్స్’ యాప్తో ప్రయోగాత్మకంగా అనుసంధానించారు. దీంతో ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు పాకెట్స్ యాప్ నుంచి దుకాణాల్లో ప్రస్తుతమున్న పేమెంట్ మెషీన్ల ద్వారానే చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ‘‘దుకాణాల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులకు భద్రతా పరమైన సవాళ్లున్నాయి. క్యూఆర్ కోడ్లు మారకుండా స్టాటిక్గా ఉంటాయి. వాటికి సులభంగా నకిలీలను రూపొందించొచ్చు’’ అని టోన్ట్యాగ్ వ్యవస్థాపకుడు కుమార్ అభిషేక్ తెలిపారు. శబ్దం ఆధారిత చెల్లింపుల విధానం అటు క్యూఆర్ కోడ్ ఇంటరాపరబిలిటీ ఫీచర్, ఇటు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ పేమెంట్స్ ఫీచర్ల సంయుక్తంగా పనిచేస్తుందని తెలిపారు. శబ్దం ఆధారిత చెల్లింపులకు సంబంధించి టోన్ట్యాగ్కు ఏడు అంతర్జాతీయ పేటెంట్లు ఉండడం గమనార్హం. అంతేకాదు దేశవ్యాప్తంగా 1,20,000 వ్యాపారులు టోన్ట్యాగ్తో భాగస్వామ్యం కాగా, 4.2 కోట్ల మంది కస్టమర్లు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతమున్న కార్డు స్వైపింగ్ మెషిన్లలోనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం ద్వారా వాటిని శబ్ధ తరంగాల ఆధారిత చెల్లింపులు స్వీకరించేందుకు అనువుగా మారుస్తోంది. ఇలా పనిచేస్తుంది... అధిక ఫ్రీక్వెన్సీతో కూడిన శబ్దం కస్టమర్ ఫోన్ నుంచి విడుదల కాగానే, దాన్ని దుకాణంలోని మెషీన్లో ఏర్పాటు చేసిన స్పీకర్ క్యాప్చర్ చేస్తుంది. అదే ఆథెంటికేషన్గా పనిచేస్తుంది. దాంతో కార్డు, పిన్లు అక్కర్లేకుండానే చెల్లింపులు పూర్తవుతాయి. ఇంకో వెసులుబాటు ఏంటంటే శబ్దం ఆధారిత చెల్లింపుల విధానాన్ని ఇప్పుడున్న ఏ చెల్లింపుల వ్యవస్థతోనయినా సులభంగా అనుసంధానించుకోవచ్చు. అంటే బ్యాంకు కార్డులు, బ్యాంకు ఖాతాలు, యూపీఐ, ప్రీపెయిడ్ వ్యాలెట్లతోనూ అనుసంధానికి వీలవుతుందని చెబుతోంది టోన్ట్యాగ్. ఈ సంస్థ కర్ణాటక రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భాగస్వామ్యంతో టోల్ చార్జీల చెల్లింపులకు శబ్దం ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. -
కంది.. చెల్లింపులేవి..!
సాక్షి, ఆదిలాబాద్ : కందులు కొనుగోలు చేసిన వారం రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 15,270 మంది రైతులు సుమారు రెండు లక్షల క్వింటాళ్ల కందులు విక్రయించారు. డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.100 కోట్లకు పైగా రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కంది బకాయిలు కొండంత పేరుకపోయాయి. రైతుల నుంచి కొనుగోలు చేసినప్పటికీ చెల్లింపులను పెండింగ్లో పెట్టడంతో వారు లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు రూ.వంద కోట్లకు పైగా బకాయిలు ఏర్పడ్డాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు విజ్ఞప్తితోనైనా ఆ డబ్బులు విడుదలయ్యేనా అని రైతులు ఎదురుచూస్తున్నారు. మంత్రి సోమవారం కేంద్ర మంత్రికి ఈ డబ్బులు విడుదల చేయాలని లేఖ రాసిన విషయం విదితమే. రైతులకు వారంలో పంట సొమ్మును అందజేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు కంది మూటలయ్యాయి. గోరంత చెల్లింపు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికి వందల కోట్ల రూపాయల కందులు కొనుగోలు చేయగా, గోరంత చెల్లింపులు మాత్రమే చేశారు. పంట కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేక పోయింది. జనవరి 22న ఆదిలాబాద్తోపాటు నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో కంది కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మంచిర్యాలలో ఇటీవల ప్రారంభం అయ్యాయి. ఆదిలాబాద్లో ఆరు, నిర్మల్లో ఆరు, కుమురంభీంలో మూడు, మంచిర్యాలలో రెండు చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో మార్క్ఫెడ్ అధికంగా కొనుగోలు చేస్తుండగా, కొన్ని కేంద్రాల్లో డీసీఎంఎస్, పీఏసీఎస్లో కూడా కొనుగోలు చేస్తున్నాయి. నిర్మల్లో పీఏసీఎస్లు, డీసీఎంఎస్, కుమురంభీం జిల్లాలో మార్క్ఫెడ్, పీఏసీఎస్, మంచిర్యాలలో పీఏసీఎస్ల ఆధ్వర్యంలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. మద్దతు ధర నేపథ్యంలోనే.. కందులకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5450 ధర ప్రకటించిన విషయం తెలిసిందే. బయట మార్కెట్లో కందులకు క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.4500 లోపే ఇస్తున్నారు. దీంతో రైతులు మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థలకే విక్రయిస్తున్నారు. జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 9,675 మంది రైతులు, కుమురంభీం జిల్లాలో 1,997, నిర్మల్లో 3,566, మంచిర్యాలలో 32 మంది రైతులు కంది పంటను విక్రయించారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో సుమారు 2లక్షల క్వింటాళ్ల వరకు కంది కొనుగోళ్లు జరిగాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే కంది పంట 19,447 హెక్టార్లలో సాగు కాగా, 2లక్షల 43వేల 090 క్వింటాళ్లు దిగుబడి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో లక్షా 36,022 క్వింటాళ్ల కంది కొనుగోళ్లు జరిగాయి. మిగతా జిల్లాలోనూ ఇంకా మార్కెట్కు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. ప్రధానంగా మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కందులను తీసుకొస్తున్నారు. చెల్లింపులు మాత్రం ఆలస్యంగా జరుగుతుండడంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పంటను అమ్మి సొమ్ము కోసం ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. -
‘ఉపాధి’ లెక్క పక్కా
నిర్మల్రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనుల్లో అవకతవకలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా గ్రామాల్లో ఇటీవల చేపట్టిన పనులకు సంబంధించిన జియో ట్యాగింగ్ అమలు చేసిన ఉపాధి హామీలో అక్రమాలు తగ్గడం లేదు. దీంతో మరిన్ని కొత్త సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల్లో జవాబుదారి తనంగా ఉండేలా అధికారులు ఈ పథకంలో మరిన్ని మార్పులు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఇటీవలే నిర్వహించిన ఉపాధి హామీ పనుల సమాచారం అందరికి అందుబాటులో ఉండాలని, పూర్తి సమాచారంతో కూడిన నోటీసు బోర్డులను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా గ్రామంలోని ఓ ముఖ్య కూడళ్లి వద్ద బోర్డులు ఏర్పాటు చేసి పూర్తి సమాచారాన్ని పొందుపర్చుస్తున్నారు. పనుల వివరాలు మొత్తం జాబ్కార్డులు – 13,450 మొత్తం కూలీలు – 20,140 పనిచేసే కూలీలు – 10,280 శ్రమశక్తి సంఘాలు – 240 మొత్తం 20,140 కూలీలు... నిర్మల్రూరల్ మండలంలో మొత్తం 20,140మంది కూలీలు ఉన్నారు. అదేవిధంగా 13,450మందికి జాబ్కార్డులు ఉన్నాయి. ఇందులో 10,280 మంది ప్రతీ రోజు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. మొత్తం 240 శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. ఉపాధి నిధులు వృధాకాకుండా చేసిన పనుల్లో నాణ్యత లోపాన్ని సైతం సామాజిక తనిఖీల్లో గుర్తిస్తున్నారు. సామాజిక తనిఖీల ద్వారా గు ర్తించి లోపాలను సంబంధిత ఫీల్డ్ అసిస్టె ంట్లు, మెటకు జరిమానా విధిస్తున్నారు. ఏడు రికార్డులు నిర్వహణ... ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతను మరింత పెంపొందించడానికి ఏడు రకాల రికార్డులను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సిబ్బందికి సూచించింది. ఇప్పటివరకు పనుల గుర్తింపు, కూలీ సంఖ్య నమోదు చేయడం, మస్టర్లను వేయడానికి రికార్డులు నిర్వహించే వారు. రికార్డుల నిర్వాహణను పర్యవేక్షించే బాధ్యతలను సంబంధిత ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. పనుల గుర్తింపు, వేతనాల చెల్లింపు, ఫిర్యాదులు ఇలా ఏడు రకాల దస్త్రాలను నిర్వహించాల్సి ఉంటుంది. పనుల్లో పారదర్శకం కోసమే.. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత కోసమే ప్రతీ గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. ఈ బోర్డుపైన ఆయా గ్రామాల్లో చేపట్టిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. దాదాపు అన్ని గ్రామాల్లో ఈ పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు నిరోధించడానికే ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. – లక్ష్మారెడ్డి, ఏపీవో, నిర్మల్రూరల్ -
క్లారిటీ ఇచ్చిన ఐఆర్సీటీసీ
సాక్షి, న్యూఢిల్లీ: డెబిట్ కార్డు లావాదేవీలను బ్లాక్ చేసిందంటూ వచ్చిన వార్తలపై భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) స్పందించింది. తాము ఎలాంటి పేమెంట్ గేట్వేను రద్దు చేయలేదని ప్రకటించింది. డెబిట్ కార్డ్ పేమెంట్లను నిలిపివేసిందన్న చేసిన వార్తలు అవాస్తవమని ఖండించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లతో స్పష్టత ఇచ్చింది. అన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలు యథాతథంగా కొనసాగుతాయని, నిలిపేయలేదని స్పష్టం చేసింది. పలు బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డు ద్వారా అన్ని లావాదేవీలు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని తెలిపింది. ఏ పేమెంట్ గేట్వే నుంచి అయినా అన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులను చేసుకోవచ్చని తెలిపింది. కాగా కన్వీనియన్స్ ఫీజు వివాదం నేపథ్యంలో పలు బ్యాంకుల డెబిట్కార్డుల పేమెంట్ను రద్దు చేసిందని దీంతో డెబిట్కార్డ్ వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలగనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే No truth in news of having blocked any card of any bank. 5/5 — IRCTC (@IRCTC_Ltd) September 23, 2017 -
ఇక భిమ్ ద్వారా ఉబెర్ చెల్లింపులు
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాకు మద్దతుగా మరో క్యాబ్ అగ్రిగేటర్ చేరిపోయింది. తాజాగా అంతర్జాతీయ క్యాబ్ సర్వీస్ సంస్థ ఊబెర్ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి , భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ ( భిమ్ ) ద్వారా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది. భారత వినియోగదారులకు భిమ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యాప్ల ద్వారా ఈ చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తోంది ఈ వారాంతం నుంచి ఈ పేమెంట్ సదుపాయం అందుబాటులోకి రానుంది. మరో క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పటికే ఈ సెగ్మెంట్లో చేరింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ సహాయంతో యుపిఐ అనుసంధానం జరిగిందనీ, అయితే రైడర్లు ఈ ఫ్లాట్ఫాంలో ఉన్న ఇతర 52 బ్యాంకుల్లో దేనితోనైనా సైన్ ఇన్ కావచ్చని ఉబెర్ తెలిపింది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిఢ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, రాబోయే నెలల్లో మిగతా ఐఓఎస్లను అందించనున్నట్టు చెప్పింది. నగదురహిత సమాజాన్ని సృష్టించడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని ఉబెర్ గ్లోబల్ బిజినెస్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ డేవిడ్ రిచర్ వెల్లడించారు. ఉబెర్ లాంటి గ్లోబల్ బ్రాండ్ల ద్వారా భిమ్, యూపీఊ సేవల ఉపయోగంలో ప్రజల సంఖ్యను పెంచే లక్ష్యాన్ని కేంద్రం ఆశిస్తోందన్నారు. కాగా ఊబెర్కు దేశవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వీరంతా వారానికి 9.4 మిలియన్ల రైడ్లను నిర్వహిస్తోంది.. యూపీఐ, భిమ్ సౌకర్యాల ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఊబెర్ ప్రధాన ప్రత్యర్థి ఓలా క్యాబ్ తమ యాప్లో యూపీఐ సదుపాయాన్ని ఆరునెలల క్రితమే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
క్రెడిట్కార్డు చెల్లింపులపై డబుల్ పన్ను?
కొత్త పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి రావడంతో క్రెడిట్ కార్డులు లేదా ఎలక్ట్రానిక్ విధానం జరిపే చెల్లింపులకు రెట్టింపు పన్ను భరించాల్సి వస్తుందనే రూమర్లకు ప్రభుత్వం చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మద్దని సూచించింది. రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా సోషల్ మీడియాలో వచ్చే రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే యుటిలిటీ బిల్లుల పేమెంట్లకు జీఎస్టీ రెండు సార్లు చెల్లించాల్సి వస్తుందనే వార్తలు పూర్తిగా అవాస్తవం అని అధియా ట్వీట్ చేశారు. అథారిటీల వద్ద చెక్ చేసుకోకుండా.. ఇలాంటి మెసేజ్లను సోషల్ మీడియాలో రీ-సర్క్యూలేట్ చేయవద్దని చెప్పారు. నేషనల్ పేమెంట్ల కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ హోటా కూడా ఈ డబుల్ పన్నుల రూమర్లపై స్పందించారు. ఆయన కూడా ఈ రూమర్లు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. 18 శాతం జీఎస్టీ మినహా మిగతా ఎలాంటి ఛార్జీలను తాము వేయడం లేదని స్పష్టీకరించారు. అంతకముందున్న సేవాపన్ను 15 శాతం, కొత్తగా వచ్చిన పన్నుల విధానంతో 18 శాతమైన సంగతి తెలిసిందే. కాగ, జీఎస్టీ ప్రభావంతో ఫైనాన్సియల్ సెక్టార్ పన్నులు మూడు శాతం పాయింట్లు పెరగనున్నట్టు కొన్ని బ్యాంకర్లు చెప్పాయి. కాగ, వీటిని ప్రస్తుతం కూడా సర్వీసు పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. అయితే తాము అదనంగా ఎలాంటి లావాదేవీల పన్ను వేయడం లేదని సీనియర్ బ్యాంకర్ చెప్పారు. -
హైక్లో వాలెట్, పేమెంట్
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ హైక్ తాజాగా వాలెట్, చెల్లింపు సేవల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. యాప్ ద్వారానే మొబైల్ ఫోన్ బిల్లులు కట్టడం నుంచి నగదు బదిలీ దాకా వివిధ సర్వీసులకు ఇవి ఉపయోగపడగలవని సంస్థ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా నగదును వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసేందుకు హైక్ కొత్త అప్డేటెడ్ వెర్షన్ (5.0) తోడ్పడగలదని హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు కవిన్ భారతి మిట్టల్ తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు జూన్ 25 నాటికి, యాపిల్ ఫోన్ యూజర్లకు జూలై ఆఖరు నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాగలదని పేర్కొన్నారు. అలాగే యస్ బ్యాంక్తో కలిసి వాలెట్ సేవలు కూడా అందిస్తున్నట్లు కవిన్ వివరించారు. ప్రస్తుతం హైక్కు 10 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారు. హైక్ వేల్యుయేషన్ ప్రస్తుతం 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. -
‘చెల్లింపు’ లైసెన్స్లు టిక్ పెట్టి ఇచ్చేవి కావు: గాంధీ
ముంబై: చెల్లింపుల (పేమెంట్) సేవలకు లైసెన్స్లు అన్నవి టిక్ పెట్టి ఇచ్చే తరహావి కావని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ అన్నారు. ఆయా సంస్థల చేతికి డబ్బులు అప్పగించడం కనుక లైసెన్స్ల జారీకి తగిన, నిర్దేశిత ప్రమాణాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ముంబైలో భారత్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా గాంధీ మాట్లాడారు. ‘‘చెల్లింపుల రంగాన్ని లైసెన్స్ల ప్రక్రియ నుంచి మినహాయించాలని, అర్హతలు ఉన్న వాటిని కార్యకలాపాల నిర్వహణకు అనుమతించాలన్న సూచన ఉంది. కానీ, ఈ ఆలోచనతో మేము విభేదిస్తున్నాం. అలా ఉచిత ప్రవేశం అన్నది చెల్లింపుల రంగానికి సముచితం కాదు. ఎందుకంటే చెల్లింపుల సేవలు అందించే సంస్థల చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక తగిన, నిర్దేశిత ప్రమాణాలు అన్నవి చాలా అవసరం. టిక్ చేసి ఉచితంగా అనుమతించే విధానం ఈ రంగానికి సరైనది కాదు. ఇలా చేస్తే మొత్తం వ్యవస్థకే ప్రమాదం తలెత్తుతుంది’’ అని గాంధీ వివరించారు. చెల్లింపుల సేవల విషయంలో బ్యాంకింగేతర సంస్థల పట్ల వివక్ష ఉందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేశారు. -
చెల్లింపులుగా అమ్మాయిలు
మిర్పూర్ ఖాస్: తీసుకున్న అప్పు కింద దక్షిణ పాకిస్తాన్ లో అమ్మాయిలను చెల్లింపుగా తీసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా దక్షిణ పాకిస్తాన్ లో వేళ్లూకుపోయిన ఈ వ్యవస్ధ ఇప్పుడు తారాస్ధాయికి చేరింది. అప్పు తీసుకుని చెల్లించలేని కుటుంబాల్లోని ఆడపిల్లలను అప్పు ఇచ్చిన వారు బానిసలుగా చేసుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే అప్పులు తీర్చలేక అమ్మాయిలను బానిసలుగా పంపుతున్నారు. అప్పు కింద యువతులను తీసుకుంటున్న వారిలో కొందరు వచ్చే అమ్మాయిని రెండో భార్యగా చేసుకుంటుండగా, మరికొందరు డబ్బు కోసం వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. అమ్మాయిలను వివాహం చేసుకోదలచిన వారు వారిని ముస్లిం మతంలోకి మారుస్తున్నారు. పోలీసులు, కోర్టులకు ఈ విషయాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఓ తండ్రి వాపోయాడు. దక్షిణ పాకిస్తాన్ మొత్తంలో దాదాపు 20లక్షలకు పైగా అమ్మాయిలు బానిసలుగా జీవనం సాగిస్తున్నారని గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్-2016 పేర్కొంది. సౌత్ ఏసియా పార్ట్నర్ షిప్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఏటా వెయ్యికి పైగా క్రిస్టియన్, హిందూ బాలికలను ఇస్లాం మతంలోకి మార్చుతున్నట్లు పేర్కొంది. -
త్వరగా ఐటీ చెల్లించాలి: ఆర్బీఐ
ముంబై: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పన్ను బకారుులను సాధ్యమైనంత ముందుగానే చెల్లించాలని, చివరి నిముషం వరకూ వేచి చూడవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విజ్ఞప్తి చేసింది. ఇందుకు 29 నిర్దిష్ట గుర్తింపు బ్యాంకు బ్రాంచీలనూ వినియోగించుకోవాలని సూచించింది. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ, డిసెంబర్ త్రైమాసికంలో చివరి నిముషంలో కొంత ఒత్తిడి, హడావుడి నెలకొంటున్న విషయాన్ని ఆర్బీఐ తన తాజా నోటిఫికేషన్లో ప్రస్తావించింది. -
మాల్యాకు ఝలకిచ్చిన యూబీఎల్
న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్, యూబీఎల్ ఛైర్మన్ విజయ్ మాల్యాకు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఝలకిచ్చింది. మాల్యా పేరును స్పష్టంగా పేర్కొనని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రూ.1.64 కోట్ల రూపాయల చెల్లింపులను నిలిపివేసినట్టు తెలిపింది. టీడీఎస్ శాఖ ఆదేశాల కనుగుణంగా చెల్లింపులను నిలిపి వేసినట్టు పేర్కొంది. మాల్యాపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసు విచారణ నడుస్తున్న కారణంగా రూ.1.64 కోట్ల రూపాయల చెల్లింపును నిలిపివేసినట్టు చెప్పింది. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ కమిషనర్ నుంచి తమకు లేఖ అందిందని కంపెనీ తెలిపింది. జీతం, వేతనం, భత్యాలు తదితర చెల్లింపులను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డర్ జూన్ 28, 2016 న తమకు అందిందని కంపెనీ తెలిపింది. అయితే దీనిపై స్పందించడానికి కంపెనీ ప్రతినిధి తిరస్కరించారు. -
‘పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపు’
జి.సిగడాం: విశాఖ డివిజన్ ప రిధిలో ఉన్న శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖపట్నంలో నీరు చెట్టు కింద 6803 చెరువుల్లో పనులు చేపడుతున్నారని, ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లింపులు చేస్తామని విశాఖ డివిజినల్ నాణ్యతా ప్రమాణాల శాఖ ఈఈ బి.గోపాలరాజు అన్నారు. ఆయన శనివారం మండల పరిధిలోని ఆనందపురం, అబోతులపేట, నిద్దాం, జి.సిగడాం గ్రామాల్లో గెడ్డలు, చెరువుల పనులను పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లాలో 2,957 చెరువులు మంజూరు చేయగా వీటిలో 2035 చెరువుల పనులు పూర్తి చేశామన్నారు. జి.సిగడాం మండలంలో ఆనందపురం వద్ద ఉన్న రెల్లి గెడ్డ పనుల అక్రమాలను తొలగించడంతోపాటు రైతులకు సకాలంలో సాగునీరు ఇవ్వడం, నాణ్యతా ప్రమాణాలపై సంతృప్తి చెందారు. డివిజన్లో ఇంత వరకు సుమారుగా 80 శాతం వరకు పనులు పూర్తి చేశామని వెల్లడించారు. ఆయనతోపాటు శ్రీకాకుళం క్వాలటీ కంట్రోల్ డిఈఈ పి, నూకరాజు, ఏఈఈ రవికూమార్, నీటిపారుదలశాఖ ఏ.ఈ.ఈ బి.గోవిందరావు, సిబ్బంది ఎ మహేశ్వరరావు మీసాల సీతారాం తదితరులు ఉన్నారు. -
కొత్త బ్యాంకులు వచ్చేస్తున్నాయ్..!
మరింత మందికి సేవలు... ♦ తలా పది పేమెంట్, చిన్న బ్యాంకులకు లెసైన్సు ♦ వచ్చే రెండు మూడు నెలల్లో కొన్ని మొదలు ♦ భారీ సక్సెస్ చూసిన చిన్న బ్యాంకుల ఐపీఓలు ♦ మారనున్న బ్యాంకింగ్ ముఖచిత్రం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండల్లా పేరుకుపోయిన ఎన్పీఏలతో నిత్యం వార్తల్లో ఉంటున్న భారతీయ బ్యాంకింగ్ రంగం... సమూలంగా మారబోతోంది. ఒకవైపు పేమెంట్ బ్యాంకులు, మరోవైపు చిన్న బ్యాంకులు రానుండగా... కొత్తగా యూనివర్సల్ బ్యాంకులకు కూడా లెసైన్సులిస్తామంటూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్బీఐ జారీ చేసింది. పేమెంట్ బ్యాంకు లెసైన్సులు పొందిన ఎయిర్టెల్, పేటీఎం కార్యకలాపాలను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా... చిన్న బ్యాంకుల లెసైన్సులు పొందిన ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు కూడా వచ్చి దుమ్మురేపాయి. పరిస్థితి చూస్తుంటే త్వరలో ఊరికో బ్యాంకు స్థాయి నుంచి వీధికో బ్యాంకు వచ్చేలా కనిపిస్తోంది. పేమెంట్ బ్యాంకుల్లో దిగ్గజాలు... గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రిజర్వ్ బ్యాంక్ 10 పేమెంట్ బ్యాంకులకు, 10 చిన్న బ్యాంకులకు సూత్రప్రాయ లెసైన్సులిచ్చింది. ఎయిర్టెల్, పేటీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటివి పేమెంట్ బ్యాంకు లెసైన్సులు పొందగా... ఉజ్జీవన్ ఫైనాన్షియల్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఈఎస్ఏఎఫ్ మైక్రోఫైనాన్స్ వంటివి చిన్న బ్యాంకుల లెసైన్సులు పొందాయి. చిన్న బ్యాంకు లెసైన్సు పొందిన వాటిలో 8 సంస్థలు ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ రంగంలో ఉన్నవే. వీటిలో అన్నింటికన్నా ముందు.. జలంధర్కు చెందిన క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఏప్రిల్లోనే 10 శాఖలతో కార్యకలాపాలు ప్రారంభించేసింది. ప్రస్తుతం రూ.3,000 కోట్లుగా ఉన్న వ్యాపారాన్ని .. చిన్న బ్యాంకు కార్యకలాపాలతో అయిదేళ్లలో రూ. 12,000 కోట్లకు, శాఖల సంఖ్యను 216కు పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇక, చెన్నై సంస్థ ఈక్విటాస్ హోల్డింగ్స్ ఈ మధ్యే ఐపీవోకి వచ్చి రూ.2,170 కోట్లు సమీకరించింది. ఈ ఐపీవో ఏకంగా 17 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యిందంటే... వీటి భవిష్యత్పై మదుపరులకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ రూ.885 కోట్ల ఐపీవోకి రాగా ఇది ఏకంగా 41 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. బ్యాంకింగ్ సేవలు లేని ప్రాంతాల్లో కొత్తగా 100 శాఖలు ఏర్పాటు చేయాలని ఉజ్జీవన్ యోచిస్తోంది. ఇప్పటికే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్- మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో దీనికి 11.15% మార్కెట్ వాటా ఉంది. 24 రాష్ట్రాల్లో సుమారు 470 శాఖలు ఉన్నాయి. తొలి దశలో వీటిలో 40 శాతాన్ని బ్యాంకు శాఖలుగా మార్చాలని ఉజ్జీవన్ భావిస్తోంది. టెక్నాలజీపైనే పేమెంట్ బ్యాంకుల దృష్టి... పేమెంట్ బ్యాంకు లెసైన్సు పొందిన ఎయిర్టెల్... ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్యలో కార్యకలాపాలు ఆరంభించనుంది. ప్రస్తుతం 800 పట్టణాల్లో ఎయిర్టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్ సంస్థ... మనీ ట్రాన్స్ఫర్, సెమీ క్లోజ్డ్ వాలెట్ సేవలు అందిస్తోంది. అటు డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కూడా ఆగస్టులో కార్యకలాపాలు ఆరంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతో ప్రారంభించి మిగతా ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి కావాల్సిన టెక్నాలజీ ఇన్ఫ్రా కోసం విప్రోతో చేతులు కలిపింది. ఆదిత్య బిర్లా నువో, పోస్టల్ విభాగం, ఫినో పేటెక్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్), ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, వొడాఫోన్ ఎం-పెసా, దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా వ్యవస్థాపకుడు), విజయ్ శేఖర్ శర్మ (పేటీఎం సీఈవో) తదితరులకు పేమెంట్ బ్యాంకు లెసైన్సులొచ్చాయి. ఇలాంటి కొత్త బ్యాంకులు రాక ఆహ్వానించ దగ్గదేనని, వీటివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ పరిధి పెరిగి మరింత మందికి సేవలు అందుబాటులోకి వస్తాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బ్యాంకుల్లో తేడాలివీ... ♦ చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల లక్ష్యాలు, సర్వీసుల్లో తేడాలుంటాయి. చిన్న బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించడం, వాణిజ్య బ్యాంకుల నుంచి పెద్దగా రుణాలు పొందలేని వర్గాలకు రుణాలివ్వడం వంటివి చేస్తాయి. చిన్న రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, చిన్న తరహా వ్యాపార సంస్థలకు రుణ సదుపాయం కల్పిస్తుంటాయి. ♦ పేమెంట్ బ్యాంకుల సంగతి తీసుకుంటే... ఇవి పరిమితమైన బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. డిపాజిట్లు, విత్డ్రాయల్స్, రెమిటెన్సులు మొదలైన సర్వీసులు అందిస్తాయి. టర్మ్ డిపాజిట్లు స్వీకరించడం, రుణాలివ్వడం వంటివి చేయవు. ఇవి గరిష్టంగా ఒకో ఖాతాదారు నుంచి రూ.లక్ష దాకా మాత్రమే డిపాజిట్లు స్వీకరించగలవు. ఇవి ప్రభుత్వ బాండ్లు మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాబడులు పొందుతాయి. ♦ వాణిజ్య బ్యాంకులైతే ఖాతాలు, టర్మ్ డిపాజిట్లు, పెద్ద మొత్తాల్లో రుణాలు, ఓవర్ డ్రాఫ్టులు, రెమిటెన్సులు మొదలైన పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. -
ఏటీఎంలలో కరెంటు బిల్లు చెల్లించవచ్చు
కేకే.నగర్: ఇకపై ఏటీఎంలలో డబ్బులు తీసుకోవడమే కాదు చెల్లించవచ్చునని అంటున్నారు విద్యుత్ బోర్డు అధికారులు. ఏటీఎంలలో కరెంటు బిల్లు చెల్లించే సేవను ప్రారంభించే దిశగా రాష్ట్ర విద్యుత్ బోర్డు విస్తృత చర్యలు చేపట్టనుంది. సా ధారణంగా ఇళ్లలో మీటర్ రీడింగ్ తీసిన తేదీ నుంచి 20 రోజుల లోపు సొమ్ము చెల్లించాలని, అలా చెల్లించని పక్షంలో కరెంటు కనెక్షన్ను కట్ చేయడం విద్యుత్ బోర్డుకు పరిపాటి. జరిమానాతో వారు చార్జీలు చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ తిరిగి ఇస్తున్నారు. ప్రతినెలా కరెంటు చార్జీల కింద రూ.2,500 కోట్లు వరకు వసూలు చేస్తున్నారు. కరెంటు చార్జీలను చెల్లించే కేంద్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండడం వలన వృద్ధులు చాలా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా చోరీ సంఘటనలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో క్రెడిట్కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్, పోస్టాఫీసు, ప్రభుత్వ సేవా కేంద్రాల్లో చార్జీలను చెల్లించే సౌకర్యాన్ని విద్యుత్బోర్డు ప్రవేశపెట్టింది. అదే వరుసలో ప్రస్తుతం ఏటీఎం కేంద్రాల్లో కరెంటు చార్జీలు చెల్లించే సేవను పరిచయం చేయడానికి విద్యుత్ బోర్డు నిర్ణయించింది. దీనిపై అధికారి ఒకరు మాట్లాడుతూ ఏటీఎంల ద్వారా కరెంటు చార్జీలను చెల్లించే సేవను ప్రారంభించడంపై ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రయోగాత్మక పద్ధతి ద్వారా ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎం కేంద్రంలో కరెంటు చార్జీలు చెల్లించే సౌకర్యాన్ని ప్రారంభించామని తెలిపారు. త్వరలో 15 బ్యాంకుల్లోని ఏటీఎంల ద్వారా ఈ సేవలను విస్తరింప చేయనున్నట్లు చెప్పారు. -
వాల్యూయేషన్లో తప్పిదాలకు మూల్యం
-
24/7 విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు
25 ప్రదేశాల్లో ఎనీటైం పేమెంట్ మిషన్ల ఏర్పాటుకు కసరత్తు సబ్సిడీపై 3 వేల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు ఐపీడీఎస్ ప్రోగ్రాం కింద *208 కోట్లతో పనులు పేదలకు *125 కే విద్యుత్ కనెక్షన్ 80 లక్షల మందికి ఎల్ఈడీ బల్బులు లో ఓల్టేజీ నివారణకు ప్రత్యేక చర్యలు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్వై దొర విద్యుత్ వినియోగదారులు ఎప్పుడైనా, అంటే 24 గంటల పాటు బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఎనీటైం పేమెంట్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్వై దొర పేర్కొన్నారు. రైతులకు సైతం సబ్సిడీపై 3వేల సోలార్ పంపు సెట్లను అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. తిరుపతి: ఐపీడీఎస్ పథకం కింద 3 జిల్లాల్లో రూ.208 కోట్లతో పనులు చేపడుతున్నట్టు తెలిపారు. దీనికి తోడు దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనవథకం కింద పేదలకు రూ.125లకే విద్యుత్ కనెక్షన్, వైరింగ్ చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. విద్యుత్ను ఆదా చేసేందుకు డిస్కం పరిధిలో పూర్తిస్థాయిలో ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. లో ఓల్టేజీ నివారణలో భాగంగా ఈఏడాది 208 విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షిప్రతినిధి’తో పలు విషయాలను ముచ్చటించారు. ప్రశ్న: ఎనీటైం పేమెంట్ మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? జవాబు: ఈ మిషన్లను ఏర్పాటు చేయడం వల్ల 24గంటల పాటు విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించవచ్చు. ఇంతకు మునుపులా క్యూలో నిలబడి వేచివుండే అవసరం ఉండదు. ఇక్కడే చెక్పేమెంట్లతో పాటు, క్రెడిట్ కార్డు సౌకర్యంతో కూడా బిల్లులు చెల్లించే సౌలభ్యం ఉంటుంది. ఇప్పటికే విజయవాడ, తిరుపతిలో వీటిని ఏర్పాటుచేశాం. వీటితోపాటు మరో 23చోట్ల ఈ మిషన్లు ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విద్యుత్ వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్లో మరిన్ని చోట్ల ఈమిషన్లు ఏర్పాటు చేస్తాం. ప్రశ్న: సోలార్ పంపుసెట్లపై రైతులకు ఎలాంటి రాయితీ ఉంది? జవాబు: సోలార్ 5హెచ్పీ పంపు సెట్ విలువ రూ.5లక్షలు. అయితే ఇందులో రైతు రూ.55వేలు చెల్లిస్తే చాలు.. పంపుసెట్ మొత్తం విలువలో 30 శాతం కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన మొత్తం రూ.2.8లక్షలు డిస్కమే భరిస్తోంది. ఇందుకోసం ఈఏడాది రూ.150 కోట్లను వెచ్చిస్తున్నాం. ఇప్పటికే రైతుల నుంచి 150 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి వెంటనే రైతులకు పంపు సెట్లను అందించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశించాం. ఈ ఏడాది ఎస్పీడీసీఎల్ పరిధిలో 3వేల మంది రైతులకు సోలార్ పంపుసెట్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రశ్న ః ఐపీడీఎస్ పోగ్రామ్ కింద ఏయే పనులు జరుగుతున్నాయి? జవాబుః ఐపీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్) కింద విజయవాడ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో రూ.208 కోట్లతో విద్యుత్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం. ఇందుకోసం అయ్యే ఖర్చులో 60 శాతం నిధులను కేంద్రమే భరిస్తోంది. ఈపనులు రెండేళ్ల లోపు పూర్తయితే కేంద్రం అదనంగా 15శాతం బోనస్ కూడా ఇస్తుంది. అదే రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే 90 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తాయి. ప్రస్తుతం ఈనిధులతో 36 చోట్ల, 33/11 కెవీఎస్ఎస్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నాం 11 కెవీలకు సంబంధించి భూగర్భ లైన్లు 44.8 కిలోమీటర్ల మేర వేస్తున్నాం. ప్రశ్న: విద్యుత్ ఆదాకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జవాబు: విద్యుత్ ఆదాకు సంబంధించి డిస్కం పరిధిలోని 80లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయనున్నాం. మొదటి విడతలో గుంటూరు జిల్లాలో 9.5లక్షలు, అనంతపురం జిల్లాలో 14లక్షల మందికి బల్బులు పంపిణీ చేశాం. మిగతా ఆరు జిల్లాల్లో పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం రూ.150 కోట్లను వెచ్చిస్తున్నాం. ప్రశ్న: లో ఓల్టేజీ నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జవాబుః లో ఓల్టేజీ నివారణ కోసం ఈ ఏడాది కొత్తగా 208 సబ్ స్టేషన్లను నిర్మించాం. మరో 42 సబ్ స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. విద్యుత్తు లైన్లను పునరుద్ధరిస్తున్నాం. ప్రశ్న: పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఏ స్కీమ్ కింద ఇస్తున్నారు? జవాబు: ప్రస్తుతం దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కింద రూ.230 కోట్లతో పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపాం. ఈ పథకం కింద రూ.125లకే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు విద్యుత్ వైరింగ్ కూడా చేస్తాం. దీని ద్వారా రూ.4లక్షల మంది లబ్ధి చేకూరనుంది. -
పోస్టాఫీసుల్లోనూ...
* ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లించే సదుపాయం * నేటి నుంచి అందుబాటులోకి... సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి.. ఈ-చలాన్ బారిన పడిన వాహనదారులు ఇక నుంచి పోస్టాఫీసుల్లోను డబ్బులు చెల్లించవచ్చు. ఈ మేరకు పోస్టల్, ట్రాఫిక్ శాఖ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. నగరంలోని 250 పోస్టాఫీసుల్లో పెండింగ్ చలాన్ రుసుం చెల్లించే అవకాశాన్ని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ కల్పించారు. సోమవారం నుంచి ఈ సదుపాయం అందు బాటులోకి తెస్తున్నారు. నగరంలో సుమారు 40 లక్షల పెండింగ్ చలానాలున్నాయి. వీరి నుంచి సుమారు రూ.80 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. ఇటీవలే నగదు రహిత చలాన్ విధానాన్ని ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు నగదు చెల్లించనవసరం లేదు. తమకు నగదు చెల్లించమని ట్రా ఫిక్ సిబ్బంది లేదా ఏ అధికారైనా అడిగితే 9010203626 నెంబర్కు ఫిర్యాదు చేయొచ్చు. చలాన్లను సెల్ఫోన్ల ద్వారా చెల్లించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా యాప్ను సైతం రూపొందించారు. ఈ యాప్ను ప్లేస్టోర్లోకి వెళ్లి ఈ-చలాన్ తెలంగాణ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మీ వాహనంపై ఏమైనా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా ? అనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే వారు ఠీఠీఠీ.జ్టిఞ.జౌఠి.జీ వెబ్సైట్ తెరచి, అందులో ఈ-చలాన్ స్టాటస్పై క్లిక్ చేయాలి. చలాన్ ఇలా కూడా చెల్లించవచ్చు... * డెబిట్, క్రెడిట్ కార్డులు, ఎస్బీహెచ్, ఐసీఐసీఐ,ఆంధ్రబ్యాంక్ ద్వారా. * ఈ-సేవా, మీ-సేవా సెంటర్లు * ఏపీ ఆల్లైన్ సెంటర్లు * పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ * కంపౌండింగ్ బూత్ నెట్ బ్యాంకింగ్ ... -
'అగ్రిగోల్డ్పై కుట్ర జరుగుతోంది'
-
క్రెడిట్ స్కోరు కొట్టండిలా..
ప్రస్తుతం రుణం తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా మంచి క్రెడిట్ స్కోరు, చెల్లింపుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉండటం తప్పని సరిగా మారింది. క్రెడిట్ లిమిట్ను నిర్ణయించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ రిపోర్టునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దరఖాస్తుదారుకి భారీ ఆదాయం, విలువైన ఆస్తులు, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఇలా ఎన్ని ఉన్నా.. ట్రాక్ రికార్డు సరిగ్గా లేకపోతే ఏవీ పనిచేయవు. ఇంతటి కీలకమైన క్రెడిట్ రిపోర్టు, క్రెడిట్ స్కోరు గురించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (సిబిల్)పై ఆధారపడుతుంటాయి. ఈ సంస్థ నిర్వహించే రికార్డుల్లో ఎగవేతదారులుగా (డిఫాల్టర్లు) గానీ ముద్రపడితే రుణాలు పొందాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలో సిబిల్ రికార్డుల్లో డిఫాల్టర్లుగా ఎక్కకూడదంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. వాటిపైనే ఈ కథనం. సిబిల్ దగ్గర ప్రత్యేకంగా డిఫాల్టర్ల జాబితా అంటూ ఒకటి ఉంటుంది, అందులో ఉన్నవారిని బ్యాంకులు నిర్ద్వంద్వంగా దూరం ఉంచుతాయన్న అపోహలు కొన్ని ఉన్నాయి. వాస్తవానికి సిబిల్ ఇలాంటి ప్రత్యేక జాబితా ఏమీ తయారు చేయదు. తమ దగ్గర సభ్యులైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే సమాచారాన్ని క్రోడీ కరించి, మంచి..చెడు అనే భేదం లేకుండా వ్యక్తుల క్రెడిట్ రికార్డును రూపొందిస్తుంది. దీని ఆధారంగా స్కోరు ఇస్తుంది. సాధారణంగా క్రెడిట్ ట్రాక్ రికార్డు సరిగ్గా లేని వారిని మాత్రమే బ్యాంకులు డిఫాల్టర్లుగా పరిగణిస్తుంటాయి. అలాగని, ట్రాక్ రికార్డు సరిగ్గా లేని ప్రతీ ఒక్కరు ఎగవేతదారులని భావించడానికీ లేదు. డిఫాల్టర్లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటారు. కావాలని ఎగ్గొట్టే వారు కొందరైతే, పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు, నిబంధనలు తెలియక మరికొందరు ఈ కోవలో పడిపోతుంటారు. కావాలని ఎగ్గొట్టిన వారిని పక్కన పెట్టి మిగతా వారి సంగతి పరిశీలిద్దాం. ఆర్థిక సమస్యల కారణంగా గడువులోగా కొన్ని వాయిదాలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన వారు రెండో రకానికి చెందుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పాటించే నిబంధనలు తెలియక ఇరుక్కునే అమాయక రుణగ్రస్తులు మూడో కోవకి చెందినవారు. నిజానికి ఈ రెండు వర్గాల వారు తెలియనితనం కారణంగానే డిఫాల్టర్లుగా మారతారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. కనుక, ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఉంది, దాన్ని ఎలా ఎదుర్కొనాలి అన్నది తెలుసుకుంటే ఇలాంటి సమస్యలో చిక్కుకోవాల్సిన పరిస్థితి తలెత్తదు. వన్ టైమ్ సెటిల్మెంట్ .. బ్యాంకులకు భారీ మొత్తం బకాయిపడినప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీమ్ చాలా మధురంగా అనిపిస్తుంది. ఎంతో కొంత కట్టేసి బైటపడొచ్చు కదా అనిపిస్తుంది. తీరా సెటిల్ చేసుకున్న తర్వాత ఇక మన పేరున ఎటువంటి బకాయిలు లేవని బ్యాంకు ఒక లెటరు ఇచ్చినంత మాత్రాన అకౌంటు క్లోజ్ అయినట్లు కాదు. ఈ ఓటీఎస్ విషయం మీ క్రెడిట్ రిపోర్టులో సెటిల్డ్ అనో ‘పోస్ట్ (డబ్ల్యూఓ) సెటిల్డ్’ అనో కనిపిస్తుంది. ఇది కూడా మీ క్రెడిట్ హిస్టరీకి మచ్చలాంటిదే. కనుక, సెటిల్ చేసుకోవడం కన్నా పూర్తి స్థాయి క్లోజర్ కోసం బేరమాడుకోవడం మంచిది. మరో విషయం, ఈ రెండింటికీ బ్యాంకులు ఇచ్చే లెటర్లు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి, ఏది ఇచ్చారన్నది సరిగ్గా చూసుకోవాలి. గడువు తేదీ.. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న క్రెడిట్ అకౌంటును సెటిల్ చేసుకునేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని సార్లు ఆఫర్ లెటరు పంపిస్తుంటాయి. ఒకవేళ సెటిల్ చేసుకుని, అకౌంటు మూసేద్దామనుకున్న పక్షంలో ఆ లెటర్లో పేర్కొన్న ఆఖరు తేదీలోగా చెల్లించేయాలి. ఇక్కడ ఆఖరు తేదీ (డ్యూ డేట్) అంటే మీరు కట్టే డబ్బు బ్యాంకు చేతికి అందాల్సిన రోజని గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా డ్యూ డేట్ రోజున చెక్కు వేస్తే కుదరదు. బ్యాంకు దగ్గరికి చెక్కు చేరి, దాన్ని మార్చుకునేలోగా ఆఖరు తేదీ దాటిపోతుంది. ఫలితంగా గడువులోగా మీరు చెల్లించలేదని రికార్డులకు ఎక్కుతుంది. సెటిల్మెంట్ ఆఫర్ రద్దయి, మీ అకౌంటు కొనసాగుతూనే ఉండే అవకాశమూ ఉంది. మీరు కట్టిన మొత్తాన్ని బ్యాంకు.. బకాయిలో కొంత భాగం కింద జమ వేసుకుంటుందే తప్ప అకౌంటును మూసేయదు. కనుక, లెటర్లో పేర్కొన్న ఆఖరు తేదీకి సాధ్యమైనంత ముందుగానే కట్టేయడం ఉత్తమం. ఒకవేళ తప్పని పరిస్థితుల కారణంగా సరిగ్గా ఆఖరు తేదీనే కట్టాల్సి వస్తే.. నగదు చెల్లింపు జరిపి, రసీదు దగ్గర పెట్టుకోవడం మంచిది. రుణం పునర్వ్యవస్థీకరించడం.. ఊహించని ఆర్థిక సమస్యల కారణంగా ఈఎంఐల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో కొన్నిసార్లు రీషెడ్యూలిం గ్కి వెళ్లడం మంచిదనకుంటూ ఉంటాం. దీనికి బ్యాంకు కూడా అంగీకరించవచ్చు. అయితే, సదరు బ్యాంకు ఈ రుణాన్ని ‘రీస్ట్రక్చర్డ్’ పేరిట సిబిల్కి సమాచారం ఇస్తుంది. ఇలాంటివి కూడా క్రెడిట్ రికార్డుకు ప్రతికూలమైన అంశాలు. కాబట్టి లోన్ తీసుకునేటప్పుడే తక్కువ ఈఎం ఐలు ఉండేలా కాస్త దీర్ఘకాలానికి దరఖాస్తు చేసుకోవడం మంచిది. సాధారణంగా ప్రతి నెలా కట్టే ఈఎంఐలు.. నెల జీతంలో 40% దాటకుండా చూసుకోవడం శ్రేయస్కరం. మరీ తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే, తక్కువ ఈఎంఐ ఆఫర్లు అందిస్తున్న బ్యాంకుకు మీ రుణాన్ని బదలాయించుకునే అంశాన్ని పరిశీలించుకోవచ్చు. దీని వల్ల మాత్రం క్రెడిట్ రికార్డుకు ఎటువంటి ఢోకా ఉండదు. క్రెడిట్ అకౌంటు మూసేస్తే సరిపోదు.. రుణం సెటిల్మెంట్ ప్రక్రియకు సంబంధించి.. మనం ఎంత తక్కువ కట్టేలా బేరమాడితే అంత మంచిదనుకుంటాం. నిజానికి ఎంత తక్కువ కట్టామన్నదానికన్నా సరైన మొత్తం కట్టామా లేదా అన్నదే ముఖ్యం. రుణం లేదా క్రెడిట్ కార్డు బకాయి సెటిల్మెంట్ ఆఫర్ విషయంలో ‘అసలు బాకీ’ అంటూ ఒకటి ఉంటుంది. మొత్తం బకాయి ఎంత ఉందన్నది తెలుసుకుని, సాధ్యమైనంత వరకూ అసలు మొత్తమే క్లియర్ అయ్యేలా చూసుకునేందుకు ప్రయత్నించాలి. లేకపోతే ఇది కూడా క్రెడిట్ రిపోర్టులో ప్రతిబింబిస్తుంది. కార్డు అకౌంటు క్లోజింగ్ ఇలా.. సిబిల్ రిపోర్టుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో క్రెడిట్ కార్డు అకౌంట్ను రద్దు చేయడం ఒకటి. ఉపయోగంలో ఉన్న క్రెడిట్ కార్డు అకౌంటును మూసేయడం అంటే.. బకాయిలు చెల్లించేసి, కార్డును ధ్వంసం చేస్తే చాలు అనుకుంటారు చాలా మంది. కానీ ఇది సరికాదు. నిజంగా అకౌంటు క్లోజింగ్ అన్నది పేపరు రూపంలో కనిపించాలి. కాబట్టి మొత్తం చెల్లింపులు చేసేసిన తర్వాత అకౌంటును మూసేయదల్చుకుంటున్నట్లు బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు కంపెనీకి తెలియజేయాలి. ఖాతా మూసివేసినట్లు వాటి దగ్గర్నుంచి అధికారికంగా లెటరు వచ్చే దాకా వేచి చూడాలి. అది వచ్చిన వెంటనే, ‘నో డ్యూస్’ లెటరు ఇవ్వాలని కోరాలి. భవిష్యత్లో ఎప్పుడైనా అవసరమైతే ఖాతా క్లోజ్ అయిందని చూపేందుకు వీటి కాపీలను భద్రపర్చుకోవాలి. ఒకవేళ దీర్ఘకాలంగా నలుగుతున్న క్రెడిట్ ఖాతాను మూసివేస్తున్నా లేదా సెటిల్ చేసుకుంటున్నా, మీరు చెల్లించిన రసీదులతో పాటు ఆఫర్ లెటర్ల కాపీలను కూడా భద్రంగా ఉంచుకోవాలి. భవిష్యత్లో ఎప్పుడైనా అవసరమైతే ఆధారాలుగా ఇవే ఉపయోగపడతాయి. క్రెడిట్ కార్డు ఖాతాలను రద్దు చేసుకున్న తర్వాత ఎటువంటి బకాయిలు లేవంటూ తెలిపే నో డ్యూస్ లెటర్ తీసుకోవడం మరవొద్దు. -
పంచాయతీలకు సర్కార్ ‘షాక్’
కరీంనగర్ సిటీ: గ్రామపంచాయతీలు బకాయిపడ్డ విద్యుత్ బిల్లుల చె ల్లింపులో ప్రభుత్వం తిరకాసు పెట్టింది. బిల్లుల చెల్లింపు నుంచి తెలివిగా తప్పుకున్న సర్కారు... బకాయిల భారాన్ని పంచాయతీలపైనే వేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలు మంజూరు చేస్తున్న 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధుల్లోంచి 25 శాతం విద్యుత్ బిల్లుల కోసం వినియోగించుకోవాలని ఆదేశించింది. అసలే అంతంతమాత్రంగా వస్తున్న నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలా? కరెంటు బిల్లులు చెల్లించాలా? అని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సర్కారు విడుదల చేస్తున్న అరకొర నిధుల్లోంచి 25 శాతంతో సగం బకాయిలు కూడా తీర్చే పరిస్థితి లేదని అంటున్నారు. జిల్లాలో 1207 పంచాయతీలు ఉండగా, పలుచోట్ల ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. జిల్లావ్యాప్తంగా రూ.64 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్కో అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేసినా.. ప్రభుత్వమే చెల్లిస్తుందని పంచాయతీలు స్పందించలేదు. ఈ బకాయిలు రాబట్టుకునేందుకు విద్యుత్ అధికారులు పంచాయతీల్లో వీధిదీపాలు, తాగునీటి పథకాలకు కరెంట్ కట్ చేశారు. దీంతో స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి విద్యుత్ బకాయిలు చెల్లించడానికి గ్రామపంచాయతీలకు అనుమతిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆ బకాయిలను ప్రభుత్వం నేరుగా చెల్లించకుండా, గ్రామపంచాయతీలే తమకు వస్తున్న నిధుల నుంచి చెల్లించాలంటూ మెలిక పెట్టారు. ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి కేటాయిస్తున్న 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల నుంచి 25 శాతం వాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, వీధిదీపాలు తదితర అవసరాల కోసం గ్రామపంచాయతీలు విద్యుత్ను వినియోగిస్తుంటాయి. ఈ చార్జీలను మేజర్ పంచాయతీలు భరిస్తుండగా, మైనర్ పంచాయతీల బిల్లులన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు ఆ భారాన్ని పంచాయతీల నెత్తిన వేసింది. అసలే అంతంతమాత్రంగా నిధులు వస్తుంటే, అందులోంచి విద్యుత్ చార్జీలు చెల్లిస్తే పంచాయతీలకు చిల్లిగవ్వ కూడా మిగిలే పరిస్థితి లేదని సర్పంచులు పేర్కొంటున్నారు. కొన్ని పంచాయతీల్లో మంజూరయ్యే నిధులకంటే విద్యుత్ బకాయిలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తోంది. -
నేటితో ఖజానా చెల్లింపులకు బ్రేక్
- ప్రభుత్వ ఆదేశాలు జారీ విభజన నేపథ్యంలో చెల్లింపులపై కొరవడిన స్పష్టత - పింఛన్ల పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు అభివృద్ధి పనుల బిల్లుల మంజూరుకు ఆటంకాలు సాక్షి, గుంటూరు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖజానా శాఖ నుంచి చెల్లింపులకు నేటితో బ్రేకులు పడనున్నాయి. శనివారం సాయంత్రం తర్వాత ఎలాంటి బిల్లులకు చెల్లింపులు జరపరాదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉద్యోగులకు జీతాలు, డీఏలు, పెన్షన్దారులకు పింఛన్లు ముందస్తుగానే చెల్లించేందుకు ట్రెజరీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం గడువు కావడంతో ట్రెజరీ అధికారులు నానా హైరానా పడుతున్నారు. ఉద్యోగులు,పన్షన్దారులకు చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల మంజూరుకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఈ నెల 19 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. రోడ్లు, మంచినీటి పథకాలు, గోడౌన్లు, స్త్రీ శక్తి భవనాలు, అంగన్వాడీ, పాఠశాల భవనాలు తదితరాలకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మెడికల్, హాస్టల్ డైట్స్కు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. జూన్ 2 రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డేట్ కావడంతో ఆ తర్వాతైనా బిల్లుల చెల్లింపులు చేస్తారా అన్న అంశంపై ఖజానా అధికారులకు స్పష్టత లేదు. ఆర్నెల్ల నుంచి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. అభివృద్ధి పూర్తిగా పడకేసింది. ఈ సమయంలో ట్రెజరీ నుంచి విడుదల కావాల్సిన నిధులు అందకపోవడంతో జిల్లాలో ముఖ్యంగా తాగునీటికి సమస్యలు ఏర్పడనున్నాయి. ప్రతి నెలా ట్రెజరీ ద్వారా రూ.536 కోట్ల చెల్లింపులు.. జిల్లాలో ప్రతి నెలా ట్రెజరీ ద్వారా రూ.536 కోట్లు చెల్లింపులు జరుగుతున్నాయి. రూ.236 కోట్లు ట్రెజరీకి ఆదాయం జమ అవుతోంది. జిల్లాలో 42 వేల మంది ప్రభుత్వోద్యోగులు, 40 వేల మంది పెన్షన్దారులున్నాయి. వీరికి ప్రతి నెలా రూ.252 కోట్ల మేర జీతాలు, డీఏ, పింఛన్లు చెల్లింపులు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రంతో ఖజానాకు తాళం పడనుండటంతో ట్రెజరీ అధికారులు బిజీగా మారారు. జూన్ 2 తర్వాత యథావిధిగా చెల్లింపులు జరిపేందుకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు.