play offs
-
పాక్తో సిరీస్ కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బాగుండేది..!
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్వదేశీ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. సహజంగా ఇతర దేశాల ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఈసారి ఓ విషయంలో స్వదేశీ బోర్డుపై దుమ్మెత్తిపోశాడు.వివరాల్లోకి వెళితే.. టీ20 వరల్డ్కప్ 2024 దృష్ట్యా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా నిషేధాజ్ఞలు విధించింది. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ మెగా టోర్నీకి ముందు స్వదేశంలో పాక్తో జరిగే టీ20 సిరీస్లో తప్పక పాల్గొనాలని అల్టిమేటం జారీ చేసింది. దీంతో జోస్ బట్లర్ (రాజస్థాన్), విల్ జాక్స్ (ఆర్సీబీ), ఫిల్ సాల్ట్ (కేకేఆర్) లాంటి ఆటగాళ్లు కీలకమైన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడకుండా స్వదేశానికి వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. టీ20 వరల్డ్కప్కు ముందు ఇంగ్లండ్ క్రికెటర్లను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడనీయకుండా ఈసీబీ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడ్డాడు. మెగా టోర్నీకి ముందు పాక్ లాంటి జట్టుతో స్వదేశంలో సిరీస్ ఆడేకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటేనే ఇంగ్లండ్కు మంచి జరిగి ఉండేదని అభిప్రాయపడ్డాడు. ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బట్లర్, జాక్స్, సాల్ట్లకు భారీ జనసమూహాల మధ్య ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలిసుండేదని అన్నాడు.ప్రపంచకప్కు ముందు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని ఈసీబీ చేజేతులారా జారవిడ్చుకుందని ధ్వజమెత్తాడు. స్వదేశీ ఆటగాళ్ల విషయంలో ఈసీబీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యిందో అర్దం కావట్లేదని మండిపడ్డాడు.కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ స్వదేశంలో పాక్తో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పాక్పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్లు 28, 30 తేదీల్లో జరుగనున్నాయి. జూన్ 1 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్లో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరు గ్రూప్ల్లో పోటీపడుతున్నాయి. పాక్.. భారత్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్లతో పాటు గ్రూప్-ఏలో, ఇంగ్లండ్.. ఆసీస్, ఒమన్, నమీబియా, స్కాట్లాండ్లతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ తీవ్రనిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో మాక్స్వెల్ డకౌటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన మాక్సీ.. అశ్విన్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో మాక్స్వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్ కార్తీక్తో కలిసి సమంగా నిలిచాడు. ఈ క్యాష్రిచ్ లీగ్లో మాక్స్వెల్ 18 సార్లు డకౌట్ కాగా.. కార్తీక్ కూడా 18 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(17) ఉన్నాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాక్సీ(32) నాలుగో స్ధానంలో నిలిచాడు. -
అదే మా కొంపముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్
హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఊదిపడేసింది. కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫయర్1లో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. మే 24న జరగనున్న క్వాలిఫయర్-2లో ఆర్సీబీ లేదా రాజస్తాన్తో తలపడనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్, బ్యాటింగ్లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మాకు ఇంకా ఫైనల్స్కు చేరేందుకు ఛాన్స్ ఉంది. సెకెండ్ క్వాలిఫయర్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.ప్రస్తుత టీ20 క్రికెట్లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్లో తొలుత బ్యాట్తో, అనంతరం బౌలింగ్లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్పై బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్కు ఛాన్ప్ ఇచ్చాం. కానీ మా ప్లాన్ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ప్రారంభంలో పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్కు సహకరించింది. ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
సన్రైజర్స్ చిత్తు.. ఫైనల్కు దూసుకెళ్లిన కేకేఆర్
IPL 2024: KKR vs SRH ipl qualifier 1 live updates:సన్రైజర్స్ చిత్తు.. ఫైనల్కు దూసుకెళ్లిన కేకేఆర్ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన క్వాలిఫయర్-1లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్.. 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 58 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(51 నాటౌట్), గుర్భాజ్(23) పరుగులతో రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు.రెండో వికెట్ డౌన్... నరైన్ ఔట్67 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సునీల్ నరైన్.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రెహ్మతుల్లా గుర్భాజ్.. నటరాజన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(12), నరైన్(12) పరుగులతో రాణించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(12), సునీల్ నరైన్(9) పరుగులతో ఉన్నారు.నామమాత్రపు స్కోర్కే పరిమితమైన ఎస్ఆర్హెచ్..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(32), కమ్మిన్స్(30) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు , రస్సెల్,నరైన్, హర్షిత్ రనా, ఆరోరా తలా వికెట్ సాధించారు.14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 123/7సన్రైజర్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 14వ ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్లో తొలుత రాహల్ త్రిపాఠి(55) రనౌట్ కాగా.. ఆ తర్వాతి బంతికే సన్వీర్ సింగ్ ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.ఐదో వికెట్ డౌన్హెన్రిచ్ క్లాసెన్ రూపంలో సన్రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన క్లాసెన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 115/5నిలకడగా ఆడుతున్న క్లాసెన్, త్రిపాఠి10 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(30), రాహుల్ త్రిపాఠి(45) పరుగులతో ఉన్నారు.నిప్పులు చెరుగుతున్న స్టార్క్.. కష్టాల్లో ఎస్ఆర్హెచ్టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ దాటికి కేవలం 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(24), హెన్రిచ్ క్లాసెన్(5) ఉన్నారు.రెండో వికెట్ డౌన్.. అభిషేక్ ఔట్అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అబిషేక్.. ఆరోరా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. 4 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(220, నితీష్ కుమార్(4) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్.. హెడ్ ఔట్టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్.. తొలి ఓవర్ వేసిన స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. తొలి ఓవర్ ముగిసే సరికి సన్రైజర్స్ వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.ఐపీఎల్-2024లో తొలి క్వాలిఫయర్కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1లో కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కేకేఆర్ ఒక మార్పుతో బరిలోకి దిగగా.. సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. కేకేఆర్ జట్టులోకి ఫిల్ సాల్ట్ స్ధానంలో గుర్భాజ్ వచ్చాడు. ఈ మ్యాచ్లో విజయంలో సాధించిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తోంది. తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిసన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్ -
IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
అహ్మదాబాద్: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 17వ సీజన్ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్లో జోరు మీదున్న సన్రైజర్స్ హైదరాబాద్... రెండుసార్లు (2012, 2014) చాంపియన్ అయిన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. 2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్రైజర్స్ ప్రస్తుత సీజన్లో భీకరమైన ఫామ్ దృష్ట్యా టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్లే ఓడిన నైట్రైడర్స్ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్లో సమతూకంగా ఉన్న కేకేఆర్ రెండో క్వాలిఫయర్దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది. సన్ తుఫాన్కు ఎదురేది? సన్రైజర్స్ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్ హెడ్ డకౌటైన గత మ్యాచ్లో సన్రైజర్స్ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే సన్రైజర్స్కు విజయం సులువవుతుంది. ఫైట్ రైడర్స్ ఫిల్ సాల్ట్–సునీల్ నరైన్ ఓపెనింగ్ జోడీ మెరుపులతో కోల్కతా నైట్రైడర్స్ కాస్తా ఫైట్రైడర్స్గా మారింది. కీలకమైన మ్యాచ్లో సాల్ట్ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్దీప్ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కోల్కతా. ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్దీప్లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్లతో పాటు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు నైట్రైడర్స్ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్రైడర్స్ మ్యాచ్ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్లతో జరగాల్సిన రెండు మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! జట్లు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్. కోల్కతా: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్, అనుకుల్/వైభవ్. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్ల్ని పరిశీలిస్తే... పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్ (గుజరాత్ 89 ఆలౌట్; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్కు వర్ష సూచన లేదు.26: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్రైజర్స్, నైట్రైడర్స్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్ల్లో నైట్రైడర్స్... 9 మ్యాచ్ల్లో సన్రైజర్స్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్రైడర్స్పై సన్రైజర్స్ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్రైజర్స్పై నైట్రైడర్స్ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101. -
అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ సునాయసంగా చేధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ రెండో స్ధానంలో నిలిచింది. దీంతో మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్లో కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఇక పంజాబ్పై విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."మా హోం గ్రౌండ్లో చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టును సపోర్ట్ చేసేందుకు మైదానంకు వచ్చిన అభిమానులందరికి ధన్యవాదాలు. ఇంత ఫ్యాన్ కలిగి ఉన్న టీమ్ను ఎక్కడ నేను చూడలేదు. మేము మా సొంత మైదానంలో 7 మ్యాచ్ల్లో ఆరింట విజయాలు సాధించాము. ఈ సీజన్లో ఇప్పటివరకు మా కుర్రాళ్లు అద్బుతంగా రాణించారు. ప్రతీ ఒక్కరూ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసానికి ప్రతీ ఒక్క బౌలర్ భయపడాల్సిందే. నేను కూడా అభిషేక్కు బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. పేసర్లకే కాదు స్పిన్నర్లపై కూడా అతడు స్వేచ్ఛగా ఆడుతాడు. ఇక నితీష్ ఒక యువ సంచలనం. అతడొక ఒక క్లాస్ ప్లేయర్. అతడి తన అనుభవానికి మించి ఆడుతున్నాడు. అతను మా టాప్-ఆర్డర్లో కీలక ఆటగాడు. నాకౌట్ మ్యాచ్ల్లో కూడా ఇదే రిథమ్ను కొనసాగించడానికి ప్రయత్నిస్తామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
బెంగళూరు అద్భుతం
బెంగళూరుతో మ్యాచ్లో చెన్నై విజయలక్ష్యం 219 పరుగులు...కానీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే 201 పరుగులే చేస్తే చాలు...తడబడుతూనే సాగిన ఛేదన చివరిలో ఉత్కంఠను పెంచింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేస్తే చాలు... ఐపీఎల్ ప్రమాణాలు, ఈ సీజన్లో ఆట చూస్తే ఇది సునాయాసమే అనిపించింది. యశ్ దయాళ్ వేసిన తొలి బంతినే ధోని సిక్సర్గా మలచడంతో చెన్నై బృందంలో ఆనందం. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా నిలిచింది. కానీ రెండో బంతికి ధోని అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. తర్వాతి రెండు బంతుల్లో శార్దుల్ సింగిల్ మాత్రమే తీయగా...చివరి రెండు బంతులకు జడేజా బ్యాట్ కూడా తగిలించలేకపోయాడు! దాంతో ఆర్సీబీ సంబరాలు షురూ అయిపోయాయి. టోర్నీ తొలి 8 మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచి వరుసగా 6 ఓడి అందరూ లెక్కలోంచి తీసేసిన తర్వాత బెంగళూరు అద్భుతం చేసింది. ఇప్పుడు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆర్సీబీ సమష్టితత్వం ముందు ఓడిన సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైంది. ఇక మిగిలింది ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడా అనే చర్చ మాత్రమే! బెంగళూరు: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి లీగ్ దశలో నిష్క్రమించింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయాల పోరాటం చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 27 పరుగులతో గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్లు), జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. కోహ్లి, డుప్లెసిస్ దూకుడు రెండో ఓవర్ నుంచే ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. మూడో ఓవర్లో కోహ్లి రెండు భారీ సిక్సర్లు బాదగా... వర్షం వచ్చి మ్యాచ్ను ఆపేసింది. అప్పుడు ఆర్సీబీ స్కోరు 31/0. తర్వాత తెరిపినిచ్చాక స్పిన్ ప్రయోగంతో వేగం తగ్గింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది. జడేజా, సాన్ట్నర్ బౌలింగ్లో సిక్స్లు బాదిన కోహ్లి అదే ఊపులో మరో సిక్సర్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మిచెల్కు క్యాచ్ ఇచ్చాడు. పటిదార్ క్రీజులోకి రాగా డుప్లెసిస్... జడేజా వేసిన 11వ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లు బాదాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరగా డుప్లెసిస్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే సందేహాస్పద రనౌట్తో డుప్లెసిస్ క్రీజ్ వీడాడు. ఈ దశలో లైఫ్ వచ్చిన గ్రీన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) పటిదార్తో కలిసి ధనాధన్ ఆటతీరుతో బెంగళూరు ఇన్నింగ్స్ను వేగంగా నడిపించాడు. 15 ఓవర్లలో 138/2 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటర్ల జోరు మరింత పెరిగింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 80 పరుగులు రాబట్టడం విశేషం. రాణించిన రచిన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మ్యాక్స్వెల్ తొలి బంతికే కెప్టెన్ రుతురాజ్ (0)ను డకౌట్ చేశాడు. తర్వాత మిచెల్ (4) కోహ్లి క్యాచ్తో వెనుదిరిగాడు. ఈ దశలో రహానే, రచిన్ రవీంద్ర వికెట్కు ప్రాధాన్యమివ్వడంతో వేగం మందగించింది. మూడో వికెట్కు 66 పరుగులు జోడించాక రహానె (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) నిష్క్రమించాడు. రచిన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్వల్ప వ్యవధిలో రచిన్ రనౌట్ కాగా, దూబే (7)ను గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. సాన్ట్నర్ (3)ను డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్తో పంపించాడు. ఈ దశలో జడేజా, ధోని (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆశలు రేపారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 47; డుప్లెసిస్ రనౌట్ 54; పటిదార్ (సి) మిచెల్ (బి) శార్దుల్ 41; గ్రీన్ నాటౌట్ 38; దినేశ్ కార్తీక్ (సి) ధోని (బి) తుషార్ 14; మ్యాక్స్వెల్ (సి) ధోని (బి) శార్దుల్ 16; మహిపాల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–78, 2–113, 3–184, 4–201, 5–218. బౌలింగ్: తుషార్ 4–0–49–1, శార్దుల్ 4–0–61–2, తీక్షణ 4–0–25–0, సాన్ట్నర్ 4–0–23–1, జడేజా 3–0–40–0, సిమర్జీత్ 1–0–19–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) యశ్ (బి) మ్యాక్స్వెల్ 0; రచిన్ రనౌట్ 61; మిచెల్ (సి) కోహ్లి (బి) యశ్ 4; రహానె (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 33; దూబే (సి) ఫెర్గూసన్ (బి) గ్రీన్ 7; జడేజా నాటౌట్ 42; సాన్ట్నర్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 3; ధోని (సి) స్వప్నిల్ (బి) యశ్ 25; శార్దుల్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–85, 4–115, 5–119, 6–129, 7–190. బౌలింగ్: మ్యాక్స్వెల్ 4–0–25–1, సిరాజ్ 4–0–35–1, యశ్ 4–0–42–2, స్వప్నిల్ 2–0–13–0, కరణ్ శర్మ 1–0–14–0, ఫెర్గూసన్ 3–0–39–1, గ్రీన్ 2–0–18–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X పంజాబ్వేదిక: హైదరాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచిరాజస్తాన్ X కోల్కతావేదిక: గువహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024- SRH: ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన దెబ్బ ఐపీఎల్ మ్యాచ్పై కూడా పడింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. వాన తెరిపినివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. మధ్యాహ్నం తర్వాత కురిసిన వానకు నగరం మొత్తం జలమయమైంది. రాజీవ్గాంధీ స్టేడియంలో కూడా అవుట్ఫీల్డ్ను కవర్స్తో కప్పేశారు. అయితే ఏ దశలోనూ వాన పూర్తిగా ఆగలేదు. టాస్ కాస్త ఆలస్యం కాగా... నిర్ణీత రాత్రి 7:30 గంటల సమయంలో కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ వెంటనే చిరు చినుకులతో మొదలై మళ్లీ విరామం లేకుండా కురిసింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా రాత్రి 10:15 గంటలకు పూర్తిగా వాన ఆగాలి. కానీ అలా జరగలేదు. దాంతో అంపైర్లు గ్రౌండ్ను పరిశీలించి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గుజరాత్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా రద్దు కావడం గమనార్హం. ఈ ఫలితంతో సన్రైజర్స్ 13 మ్యాచ్ల తర్వాత 15 పాయింట్ల వద్ద మూడో స్థానంలో నిలిచింది. దాంతో టీమ్కు ప్లే ఆఫ్స్ స్థానం ఖాయమైంది. ఆదివారం సన్రైజర్స్ సొంతగడ్డపైనే పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచి... అదే రోజు రాత్రి కోల్కతా నైట్రైడర్స్తో తమ చివరి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓడితే సన్రైజర్స్కు రెండో స్థానం ఖాయమవుతుంది. 2020లో చివరిసారి ప్లే ఆఫ్స్కు అర్హత పొందిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 2021, 2022, 2023 సీజన్లలో వరుసగా 8వ, 8వ, 10వ స్థానాల్లో నిలిచింది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. ఈ ఏడాది సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించి తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఢిల్లీకు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించింది.ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖారారు చేసుకోవడంతో ఢిల్లీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఒక ఈ మ్యాచ్ జరిగి ఎస్ఆర్హెచ్ ఓటమి పాలై ఉంటే మాథ్యమేటికల్గా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో పంత్ సేన ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ ఏడింట విజయాలు, ఏడింట ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 5వ స్ధానంతో సరిపెట్టుకుంది. -
ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోయిన రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. పంజాబ్ కింగ్స్తో బుధవారం నాటి మ్యాచ్లో ఓటమితో వరుసగా నాలుగో పరాజయం నమోదు చేసింది.ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనేలీగ్ దశలో రాజస్తాన్కు ఇంకొక్క మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్తో సంజూ సేన మే 19న తలపడనుంది. అయితే, కేకేఆర్తో పాటు రాజస్తాన్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరినా.. ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే రాజస్తాన్ రెండో స్థానంలో నిలవగలుగుతుంది.అప్పుడు నేరుగా కేకేఆర్తో క్వాలిఫయర్-1 ఆడుకోవచ్చు. లేదంటే ఎలిమినేటర్ గండం దాటాల్సి ఉంటుంది. ఇక రాజస్తాన్ ఇలా చిక్కుల్లో పడటం సన్రైజర్స్ హైదరాబాద్ పాలిట వరంలా మారింది.సన్రైజర్స్ పాలిట వరం.. ఎందుకంటే?లీగ్ దశలో హైదరాబాద్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్(మే 16), పంజాబ్ కింగ్స్(మే 19)న ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ రెండింటికి రెండూ గెలిస్తే రైజర్స్ ఖాతాలో 18 పాయింట్లు చేరతాయి.సొంతమైదానం ఉప్పల్లో ఈ మ్యాచ్లు జరుగనుండటం, ఇప్పటికే సొంతగడ్డపై ఆరెంజ్ ఆర్మీకి ఉన్న విధ్వంసకర రికార్డు చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది.ఒక్కటి ఓడినా కూడాఅలా కాకుండా.. రాజస్తాన్ తమ ఆఖరి మ్యాచ్లో ఓడి.. సన్రైజర్స్ కూడా ఈ రెండింటిలో ఒకటి ఓడితే.. అప్పుడు కూడా హైదరాబాద్ జట్టు టాప్-2తో ముగించే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో రెండు జట్లకు సమానంగా పాయింట్లు(16) వచ్చినా రన్రేటు పరంగా సన్రైజర్స్ ముందుంటే రాజస్తాన్ను వెనక్కినెట్టడం ఖాయం. అప్పుడు పట్టికలో సన్రైజర్స్ రెండో స్థానానికి చేరితే క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది.అలా అయితే మొదటికే మోసం మరి!అలా కాకుండా ఆఖరి రెండు మ్యాచ్లూ ఓడిపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. కేకేఆర్- రాజస్తాన్, చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదీ సంగతి!ఐపీఎల్-2024 పాయింట్ల పట్టిక(మే 15 నాటికి)లో టాప్-5 ఇలా:1. కేకేఆర్- ఆడినవి 13.. గెలిచినవి 9.. పాయింట్లు 19.. నెట్ రన్రేటు 1.428(ప్లే ఆఫ్స్నకు అర్హత)2. రాజస్తాన్- ఆడినవి 13.. గెలిచినవి 8.. పాయింట్లు 16.. నెట్ రన్రేటు 0.273(ప్లే ఆఫ్స్నకు అర్హత)3. చెన్నై సూపర్ కింగ్స్- ఆడినవి 13.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్రేటు 0.5284. సన్రైజర్స్- ఆడినవి 12.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్రేటు.. 0.406.5. ఆర్సీబీ- ఆడినవి 13.. గెలిచినవి 6.. పాయింట్లు 12.. నెట్ రన్రేటు.. 0.387.విజేతకు దారిలా👉 క్వాలిఫయర్-1(మే 21): టాప్-2 జట్ల మధ్య.. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి..👉ఎలిమినేటర్(మే 22): టాప్-3, 4 లో ఉన్న జట్ల మధ్య.. ఓడిన జట్టు ఇంటికి.. 👉గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడుతుంది.👉క్వాలిఫయర్-2(మే 24): గెలిచిన జట్టు ఫైనల్లో అడుగుపెడుతుంది.👉ఫైనల్(మే 26): క్వాలిఫయర్-1- క్వాలిఫయర్-2 మధ్య పోరు. గెలిచిన జట్టు చాంపియన్.చదవండి: Virat Kohli: కోహ్లి నోట రిటైర్మెంట్ మాట.. ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే! -
IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్రైజర్స్ నెట్ రన్రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్రైజర్స్ మ్యాచ్ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్రేటు పరంగా సన్రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్రైజర్స్ గురువారం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.ఇక సమిష్టి ప్రదర్శనతో లక్నోపై గెలుపుతో లీగ్ దశను ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఓవరాల్గా ఈ సీజన్లో ఏడు విజయాలు సాధించింది. వెళ్తూ వెళ్తూ లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసింది.వాళ్లిద్దరు పట్టుదలగా నిలబడ్డారుఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ చేతిలో ఓటమిపై స్పందించాడు. ‘‘40 ఓవర్ల పాటు వికెట్ ఒకే విధంగా ఉంది. తొలి ఓవర్లోనే మేము జేక్ ఫ్రేజర్ మెగర్క్ను అవుట్ చేసి శుభారంభం అందుకున్నాం.అయితే, దానిని మేము నిలబెట్టుకోలేకపోయాం. షాయీ హోప్, అభిషేక్ పోరెల్ పట్టుదలగా నిలబడ్డారు. ఇక్కడ 200 పెద్ద స్కోరేమీ కాదు. అయినా, లక్ష్య ఛేదనలో మేము తడబడ్డాం.సీజన్ మొత్తం మాకు అదే సమస్యనిజానికి ఇది పూర్తి చేయదగిన టార్గెట్. ఈ సీజన్ ఆసాంతం పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా మాకు ఎప్పుడూ శుభారంభం లభించలేదు.స్టొయినిస్, పూరన్లకు మేము సహకారం అందించలేకపోయాం. అందుకే మేము ఇప్పుడిలా విపత్కర పరిస్థితిలో కూరుకుపోయాం’’ అని కేఎల్ రాహుల్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.ఢిల్లీ వర్సెస్ లక్నో స్కోర్లు👉వేదిక: అరుణ్జైట్లీ స్టేడియం.. ఢిల్లీ👉టాస్: లక్నో.. బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 208/4 (20)👉లక్నో స్కోరు: 189/9 (20)👉ఫలితం: 19 పరుగుల తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:ఇషాంత్ శర్మ(3/34).చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!A clinical win at home to finish off their season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/kekvx9uuZK— IndianPremierLeague (@IPL) May 15, 2024 -
IPL 2024 RCB Vs DC: భళా బెంగళూరు...
బెంగళూరు: ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఐదో విజయంతో ఆశలు సజీవం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 47 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన ఆర్సీబీ ఈ టోరీ్నలో ఆరో విజయం నమోదు చేసుకుంది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ జాక్స్ (29 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. పంత్పై ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. పటిదార్ ఫటాఫట్... డుప్లెసిస్ (6) విఫలమవగా, కోహ్లి (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) ఎంతో సేపు నిలువలేదు. ఢిల్లీ ఫీల్డర్లు పదేపదే క్యాచ్లు నేలపాలు చేయడంతో బతికిపోయిన జాక్స్, పటిదార్ ధాటిగా పరుగులు రాబట్టారు. దీంతో 9.1 ఓవర్లో బెంగళూరు 100 పరుగులకు చేరగా, పటిదార్ 29 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కానీ స్వల్పవ్యవధిలో అతనితో పాటు జాక్స్ అవుటయ్యాక స్కోరు మందగించింది. గ్రీన్ (24 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్లు), మహిపాల్ సిక్స్లతో 17 ఓవర్లలో 169/4 స్కోరు చేసిన ఆర్సీబీ తర్వాత ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది. అక్షర్ ఒక్కడే! లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చెత్తగా ఆడటంతో ఆరంభం నుంచి ఆలౌట్ దాకా ఏ దశలోనూ గెలిచేలా కని్పంచలేదు. ఫ్రేజర్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తర్వాత కెపె్టన్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షై హోప్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) కాసేపు అండగా నిలిచాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) అభిõÙక్ (బి) ఇషాంత్ 27; డుప్లెసిస్ (సి) ఫ్రేజర్ (బి) ముకేశ్ 6; జాక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 41; పటిదార్ (సి) అక్షర్ (బి) రసిఖ్ 52; గ్రీన్ (నాటౌట్) 32; మహిపాల్ (సి) అభిషేక్ (బి) ఖలీల్ 13; దినేశ్ కార్తీక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 0; స్వప్నిల్ (సి) కుషాగ్ర (బి) రసిఖ్ 0; కరణ్ శర్మ (రనౌట్) 6; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–23, 2–36, 3–124, 4–137, 5–174, 6–174, 7–176, 8–185, 9–187. బౌలింగ్: ఇషాంత్ 3–0–31–1, ఖలీల్ 4–0–31–2, ముకేశ్ 3–0–23–1, అక్షర్ 3–0–24–0, కుల్దీప్ 4–0–52–1, రసిఖ్ 3–0–23–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జాక్స్ (బి) స్వప్నిల్ 1; ఫ్రేజర్ (రనౌట్) 21; అభిõÙక్ (సి) ఫెర్గూసన్ (బి) యశ్ 2; షై హోప్ (సి) కరణ్ (బి) ఫెర్గూసన్ 29; కుశాగ్ర (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; అక్షర్ (సి) డుప్లెసిస్ (బి) యశ్ 57; స్టబ్స్ (రనౌట్) 3; రసిఖ్ (సి) జాక్స్ (బి) గ్రీన్ 10; కుల్దీప్ (బి) యశ్ 6; ముకేశ్ (సి) మహిపాల్ (బి) ఫెర్గూసన్ 3; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–24, 4–30, 5–86, 6–90, 7–127, 8–128, 9–135, 10–140. బౌలింగ్: స్వప్నిల్ 1–0–9–1, సిరాజ్ 4–0–28–1, యశ్ దయాళ్ 3.1–0–20–3, కరణ్ శర్మ 2–0–19–0, ఫెర్గూసన్ 4–0–23–2, గ్రీన్ 4–0–19–1, జాక్స్ 1–0–16–0. -
IPL 2024 CSK Vs RR: గెలిచి నిలిచిన చెన్నై
చెన్నై: రాజస్తాన్ రాయల్స్... చెన్నై సూపర్కింగ్స్! మొదటి జట్టు గెలిస్తే నేరుగా ‘ప్లే ఆఫ్స్’ చేరుతుంది. రెండో జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ వేటలో ముందడుగు వేస్తుంది. అలా కీలకమైన ఈ పోరులో సొంతగడ్డపై చెన్నై... పేస్ బౌలింగ్తో కట్టడి చేసి... అనంతరం బ్యాటింగ్లోనూ రాణించి రాయల్స్కు చెక్ పెట్టి... ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులే చేయగలిగింది. రియాన్ పరాగ్ (35 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా... మరెవరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. చెన్నై పేస్ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిమర్జీత్ సింగ్ (3/26), తుషార్ దేశ్పాండే (2/30) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనలో చెన్నై 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్) కుదురుగా ఆడాడు. రాజస్తాన్ స్పిన్నర్ అశి్వన్కు 2 వికెట్లు దక్కాయి. జోరు తగ్గిన రాజస్తాన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో వరుస విజయాలతో హోరెత్తించింది. కానీ ఈ మ్యాచ్లో బోర్ కొట్టించింది. యశస్వి (21 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు), కెప్టెన్ సంజూ సామ్సన్ (19 బంతుల్లో 15) ఇలా టాపార్డర్ వన్డేను తలపించే ఆటే ఆడటంతో పరుగుల్లో వెనుకబడింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (18 బంతుల్లో 28; 1 ఫోర్లు, 2 సిక్స్)లు కొట్టిన ఆ కాస్తా సిక్సర్లతో ఓ మోస్తరు స్కోరే చేసింది. కనీసం 150 పరుగుల మార్క్ అయిన దాటలేకపోవడంతో చెన్నైకి వారి సొంతగడ్డపై సులువైన లక్ష్యం అయ్యింది. నడిపించిన నాయకుడు రచిన్ రవీంద్ర (18 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్లు)లో ఇన్నింగ్స్ ఆరంభించిన కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ అసాంతం ఒపిగ్గా ఆడాడు. వేగంగా ఆడే క్రమంలో మిచెల్ (13 బంతుల్లో 22; 4 ఫోర్లు), శివమ్ దూబే (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటైనా... లక్ష్యం చిన్నదైనా... రుతురాజ్ మాత్రం గెలిచేదాకా జాగ్రత్త పడ్డాడు. రిజ్వీ (8 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో 10 బంతులు మిగిలుండగానే చెన్నై లక్ష్యాన్ని చేరింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) రుతురాజ్ (బి) సిమర్జీత్ 24; బట్లర్ (సి) తుషార్ (బి) సిమర్జీత్ 21; సామ్సన్ (సి) రుతురాజ్ (బి) సిమర్జీత్ 15; పరాగ్ (నాటౌట్) 47; జురెల్ (సి) శార్దుల్ (బి) తుషార్ 28; శుభమ్ (సి) దూబే (బి) తుషార్ 0; అశి్వన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–43, 2–49, 3–91, 4–131, 5–131. బౌలింగ్: తుషార్ 4–0–30–2, తీక్షణ 4–0–28–0, శార్దుల్ 4–0–32–0, సిమర్జీత్ 4–0–26–3, జడేజా 4–0–24–0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి అండ్ బి) అశి్వన్ 27; రుతురాజ్ (నాటౌట్) 42; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 22; మొయిన్ అలీ (సి) అవేశ్ ఖాన్ (బి) బర్గర్ 10; దూబే (సి) పరాగ్ (బి) అశి్వన్ 18; జడేజా (అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్) 5; సమీర్ రిజ్వీ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.2 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–32, 2–67, 3–86, 4–107, 5–121. బౌలింగ్: బౌల్ట్ 2.2–0–24–0, సందీప్ శర్మ 3–0–30–0, అశ్విన్ 4–0–35–2, బర్గర్ 3–0–21–1, చహల్ 4–0–22–1, అవేశ్ ఖాన్ 2–0–12–0. -
‘ప్లేఆఫ్స్’కు కోల్కతా
కోల్కతా: ఈ సీజన్ ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ చేరిన తొలి జట్టుగా కోల్కతా నైట్రైడర్స్ నిలిచింది. శనివారం జరిగిన పోరులో కోల్కతా 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచింది. భారీ వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా మొదలవడంతో 16 ఓవర్లకు కుదించారు. ముందుగా కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్లు), నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అనంతరం ముంబై ఇండియన్ 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు), తిలక్వర్మ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మెరిపించిన వెంకటేశ్ ఇన్నింగ్స్ తొలిబంతికే సిక్సర్ బాదిన సాల్ట్ (6)ను ఐదో బంతికే తుషార అవుట్ చేయగా, మరో ప్రమాదకర ఓపెనర్ సునీల్ నరైన్ (0) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో వెంకటేశ్ 4, 6, 4 బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7)ను అన్షుల్ బౌల్డ్ చేసి ముంబై శిబిరాన్ని మురిపించాడు. పవర్ప్లే 5 ఓవర్లలో నైట్రైడర్స్ 45/3 స్కోరు చేసింది. ఆరో ఓవర్లో జట్టు స్కోరు 50 దాటగా... నితీశ్ రాణా, వెంకటేశ్ల దూకుడుతో కోల్కతా ఇన్నింగ్స్ పుంజుకుంది. వెంకటేశ్ ధాటికి చావ్లా అడ్డుకట్ట వేయగా, రసెల్ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాకతో నైట్రైడర్స్ 10.2 ఓవర్లలో వంద పరుగులు దాటింది. అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోరును పెంచుతున్న నితీశ్ రాణాను తిలక్ వర్మ చక్కని త్రో రనౌట్ చేయగా, ఓవర్ వ్యవధిలో రసెల్ మెరుపులకు చావ్లా కళ్లెం వేశాడు. తర్వాత ఆఖరి ఓవర్లలో రింకూ సింగ్ (12 బంతుల్లో 20; 2 సిక్స్లు), రమణ్దీప్ సింగ్ (8 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)లు కూడా ధాటిని ప్రదర్శించడంతో ప్రత్యర్థి ముందు కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన ఇషాన్ ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (24 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ముంబైకి చక్కని ఆరంభాన్నే ఇచ్చారు. ఓ వైపు రోహిత్ కుదురుగా ఆడుతుంటే మరోవైపు కిషన్ చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. 5 ఓవర్ల పవర్ప్లేలో ముంబై 59/0 స్కోరు చేసింది.అయితే ఇంత చక్కని శుభారంభానికి కోల్కతా స్పిన్నర్లు తూట్లు పొడిచారు. వరుస ఓవర్లలో నరైన్, ఇషాన్ను... రోహిత్ను వరుణ్ అవుట్ చేయడంతో ముంబై రూటు మారింది. రసెల్ బంతినందుకొని హిట్టర్లు సూర్యకుమార్ (11), టిమ్ డేవిడ్ (0)లను అవుట్ చేయడంతోనే ముంబై లక్ష్యానికి దూరమైంది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అన్షుల్ (బి) తుషార 6; నరైన్ (బి) బుమ్రా 0; వెంకటేశ్ (సి) సూర్యకుమార్ (బి) చావ్లా 42; శ్రేయస్ (బి) అన్షుల్ 7; నితీశ్ రనౌట్ 33; రసెల్ (సి) అన్షుల్ (బి) చావ్లా 24; రింకూ సింగ్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 20; రమణ్దీప్ నాటౌట్ 17; స్టార్క్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (16 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–6, 2–10, 3–40, 4–77, 5–116, 6–125, 7–148. బౌలింగ్: తుషార 3–0–31–1, బుమ్రా 4–0–39–2, అన్షుల్ 3–0–24–1, హార్దిక్ 3–0–32–0, పియూశ్ చావ్లా 3–0–28–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) రింకూ (బి) నరైన్ 40; రోహిత్ (సి) నరైన్ (బి) వరుణ్ 19; సూర్యకుమార్ (సి) రమణ్దీప్ (బి) రసెల్ 11; తిలక్వర్మ (సి) సాల్ట్ (బి) హర్షిత్ 32; హార్దిక్ (సి) వైభవ్ (బి) వరుణ్ 2; డేవిడ్ (సి) శ్రేయస్ (బి) రసెల్ 0; నేహల్ రనౌట్ 3; నమన్ (సి) రింకూ (బి) హర్షిత్ 17; అన్షుల్ నాటౌట్ 2; చావ్లా నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–65, 2–67, 3–87, 4–91, 5–92, 6–117, 7–136, 8–137 బౌలింగ్: వైభవ్ 2–0–16–0, స్టార్క్ 1–0–11–0, హర్షిత్ 3–0–34–2, నరైన్ 3–0–21–1, వరుణ్ 4–0–17–2, రసెల్ 3–0–34–2. ఐపీఎల్లో నేడుచెన్నై X రాజస్తాన్వేదిక: చెన్నైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి బెంగళూరు X ఢిల్లీవేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
అలా అయితేనే ప్లే ఆఫ్స్లో సన్రైజర్స్.. ఆ రెండు జట్లు కన్ఫామ్!?
చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాప్-4 రేసు నుంచి నిష్క్రమించగా.. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సీఎస్కేపై తాజా విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆశలను సజీవం చేసుకున్నాయి.మరోవైపు ఈ రెండు జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్పై కన్నేశాయి. ఇక ఇప్పటికే రన్రేటు పరంగా అన్ని జట్ల కంటే పటిష్ట స్థితిలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్(16 పాయింట్లు) రెండో స్థానం ఆక్రమించింది.మూడో స్థానం కోసం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్(12 పాయింట్లు)ను వెనక్కి నెట్టి.. సన్రైజర్స్ హైదరాబాద్(14 పాయింట్లు) ముందుకు దూసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్నకు సంబంధించిన కొన్ని సమీకరణలు ఇలా ఉన్నాయి.కేకేఆర్.. టాప్ఇప్పటికే టాప్-1లో ఉన్న కేకేఆర్ శనివారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది. సొంతమైదానంలో జరిగే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సేన ముంబైని ఓడించిందంటే మరో రెండు పాయింట్లు ఖాతాలో పడతాయి.ఫలితంగా 18 పాయింట్లతో కేకేఆర్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలా కాక ముంబైతో కాకుండా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్తో మిగిలిన మ్యాచ్లలో ఏ ఒక్కటి గెలిచినా బెర్తు ఖాయమే!అయితే, ఇక్కడో మెలిక ఉంది. రాజస్తాన్, సీఎస్కే, సన్రైజర్స్ లేదా లక్నో ఈ జట్లలో మూడు 18 పాయింట్లు సాధిస్తేనే కేకేఆర్ ప్రయాణం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ముంబైతో మ్యాచ్లో ఓడినా రాజస్తాన్పై మాత్రం కచ్చితంగా గెలవాలి.రాజస్తాన్.. రైట్ రైట్చెన్నై, పంజాబ్, కేకేఆర్ రూపంలో రాజస్తాన్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి గెలిచినా, కేకేఆర్, సీఎస్కే, లక్నో/సన్రైజర్స్లలో ఏ జట్టు 18 పాయింట్లు సాధించినా రాజస్తాన్ బెర్త్ ఖరారవుతుంది.టాప్-2లో నిలవాలంటే కేకేఆర్ను మాత్రం ఓడించడం తప్పనిసరి.సన్రైజర్స్ రైజ్ అవ్వాలంటే!సన్రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ల రూపంలో ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్లలో సన్రైజర్స్ గెలిస్తే సన్రైజర్స్ టాప్-4కు అర్హత సాధిస్తుంది. ఏ ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పని దుస్థితి ఎదురవుతుంది.చెన్నై చమక్ అనాలంటే!డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత పడుతూ లేస్తూ ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో ఓటమి తర్వాత సీఎస్కే కాస్త డీలా పడింది. ప్రస్తుతం సీఎస్కేకు రాజస్తాన్, ఆర్సీబీలతో మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.ఈ రెండింటిలోనూ గెలిస్తేనే సీఎస్కే ప్రయాణా సాఫీగా సాగుతుంది. లేదంటే.. లేదంటే ఢిల్లీ, లక్నోతో సీఎస్కే పోటీపడాల్సి ఉంటుంది. అయితే, రన్రేటు పరంగా సీఎస్కే ప్రస్తుతం ఆ రెండు జట్ల కంటే మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం.ఢిల్లీ దబాంగ్ అనిపించుకోవాలంటే..ఆరంభంలో అపజయాలు ఎదురైనా తిరిగి పుంజుకుని ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్తో మిగిలిన మ్యాచ్లలో గెలవడం సహా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే..ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్తో మ్యాచ్లలో తప్పక గెలవాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో చెన్నై, ఢిల్లీతో సమానంగా ఉన్నా రన్రేటు పరంగా వెనుకబడి ఉంది రాహుల్ సేన.కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్లలో గెలవడంతో పాటు ప్రస్తుతం టాప్-4లో ఉన్న కేకేఆర్, రాజస్తాన్, సన్రైజర్స్, చెన్నై వీలైనన్ని మ్యాచ్లు ఓడిపోతేనే లక్నో ఆశలు సజీవంగా ఉంటాయి.ఆర్సీబీ, గుజరాత్ పరిస్థితి ఇదీ!ఆర్సీబీకి ఢిల్లీ, సీఎస్కేలతో మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ రెండూ కచ్చితంగా గెలిచి.. నెట్ రన్రేటు పరంగా మిగతా జట్ల కంటే మెరుగపడటం సహా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే!గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. కేకేఆర్, సన్రైజర్స్తో మ్యాచ్లలో ఏ ఒక్కటి ఓడినా ప్రయాణం ముగిసినట్లే. రెండూ గెలిస్తే అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేటు తదితర అంశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. సన్రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం మ్యాచ్ ఫలితంతో పాండ్యా సేన టాప్-4 ఆశలు గల్లంతయ్యాయి. లక్నోను సన్రైజర్స్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్లో ముంబై ప్రయాణం ముగిసినట్లయింది.ఎలా అంటే?ఉప్పల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ లక్నోను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే ఛేదించింది.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024తద్వారా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్లో ఏడో విజయం(పన్నెండు మ్యాచ్లకు గానూ) నమోదు చేసి.. మొత్తంగా 14 పాయింట్లు సాధించింది. నెట్ రన్రేటు(0.406) కూడా మెరుగుపరచుకుని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. టాప్-2లో తిష్ట వేసిన కేకేఆర్, రాజస్తాన్మరోవైపు.. కోల్కతా నైట్ రైడర్స్(రన్రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్రేటు 0.476) పదకొండేసి మ్యాచ్లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(రన్రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్(రన్రేటు -0.769) వచ్చే వారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా 14 పాయింట్లతో పైకి ఎగబాకుతుంది.పాండ్యా సేనకు తప్పని పరాభవంమరోవైపు.. ఆర్సీబీ(11 మ్యాచ్లు- 8 పాయింట్లు- మిగిలినవి 3), పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్లు- 8 పాయింట్లు- మిగిలినవి 3) ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడేసింది. కేవలం నాలుగింట గెలిచి 8 పాయింట్లతో ఉంది.మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లు వస్తాయి. కాబట్టి టాప్-4లో అడుగుపెట్టేందుకు ముంబైకి దారులు మూసుకపోయినట్లే! ఇక అట్టడుగున ఉన్న గుజరాత్ టైటాన్స్కు ఇంకో మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.చదవండి: #KL Rahul: కెప్టెన్పై కోపంతో ఊగిపోయిన లక్నో ఓనర్.. అందరూ చూస్తుండగానే అలా.. -
Play Offs: స్టార్ ఓపెనర్ దూరం?... కేకేఆర్కు ఓ గుడ్న్యూస్!
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్ అయ్యర్ సేన.కేకేఆర్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్రౌండర్ నరైన్ 11 ఇన్నింగ్స్లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.అతడు దూరం!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ స్టార్ ఫిలిప్ సాల్ట్ త్వరలోనే కేకేఆర్ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్తో మే 22 నుంచి టీ20 సిరీస్ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశలో కేకేఆర్కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్తో చేరనున్నట్లు వెల్లడించాడు.PC: IPLతల్లి అనారోగ్యం కారణంగానేకాగా 2023లో కేకేఆర్లో అడుగుపెట్టిన గుర్బాజ్ 11 మ్యాచ్లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్- నరైన్ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్.త్వరలోనే వస్తాను‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్ పేర్కొన్నాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఐపీఎల్ 2024 సీజన్లో అత్యంత కీలక దశ నడుస్తుంది. లీగ్ మొత్తంలో 70 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. 54 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ టాప్లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 8 విజయాలు (16 పాయింట్లు, 1.453 రన్రేట్) సాధించి అగ్రస్థానంలో నిలిచింది.కేకేఆర్ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (10 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్రేట్), సీఎస్కే (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్రేట్), సన్రైజర్స్ (10 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.072 రన్రేట్), లక్నో (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్రేట్), ఢిల్లీ (11 మ్యాచ్ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్రేట్), ఆర్సీబీ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్రేట్), పంజాబ్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్రేట్), గుజరాత్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్రేట్), ముంబై ఇండియన్స్ (11 మ్యాచ్ల్లో 3 విజయాలు 6 పాయింట్లు -0.356 రన్రేట్) వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇలా..ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఏ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుతానికి ఏ జట్టూ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ కానప్పటికీ.. ముంబై మాత్రం నిష్క్రమించే జట్ల జాబితాలో ముందువరుసలో ఉంది. ఈ జట్టు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించినా ప్లే ఆఫ్స్కు చేరదు. ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సున్నా అని చెప్పాలి.ప్లే ఆఫ్స్ ఛాన్స్లు దాదాపుగా గల్లంతు చేసుకున్న జట్ల జాబితాలో ముంబై తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. ఈ జట్టు కూడా తదుపరి ఆడే మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇలా జరిగి మిగతా జట్లు తమతమ తదుపరి మ్యాచ్ల్లో ఓడితే సమీకరణలు మారతాయి. ఈ జట్టుకు మినుకుమినుకు మంటూ ఒక్క శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.ఇక ముంబై, గుజరాత్ తర్వాత ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించేందుకు రెడీగా ఉన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ ఉన్నాయి. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్లు కూడా ప్లే ఆఫ్స్కు చేరలేవు. పంజాబ్కు 2 శాతం, ఆర్సీబీకి 3 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. మిగతా జట్ల విషయానికొస్తే.. రాజస్థాన్, కేకేఆర్ జట్లు ఫైనల్ ఫోర్ బెర్త్లు దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్రైజర్స్, సీఎస్కే, లక్నో మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఢిల్లీకి సైతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నా ఆ జట్టుకు కేవలం 12 శాతం ఛాన్స్లు మాత్రమే ఉన్నాయి. కేకేఆర్కు 99, రాజస్థాన్కు 98 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండగా.. సన్రైజర్స్కు 75, సీఎస్కేకు 60, లక్నోకు 50 శాతం అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అత్యద్భుతాలు జరగకపోతే పై సమీకరణలన్నీ యధాతథంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. -
ప్లే ఆఫ్స్కు బెంగళూరు
న్యూఢిల్లీ: ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్లో స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఏడు వికెట్లతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించిన బెంగళూరు చివరిదైన మూడో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ముందుగా ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్కాగా... బెంగళూరు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఆ్రస్టేలియా స్టార్ ఆల్రౌండర్ ఎలీస్ పెరీ అద్భుత ఆటతీరుతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా బంతితో మెరిసిన పెరీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాట్తో అదరగొట్టి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో అజేయంగా 40 పరుగులు సాధించింది. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే 12 పాయింట్లతో లీగ్ టాపర్గా నిలిచి నేరుగా ఫైనల్కు అర్హత పొందుతుంది. ఫైనల్లో స్థానం కోసం ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓడిపోతే... ఢిల్లీ, ముంబై రెండు జట్లలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ముంబైతో మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు), సజన (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) 43 పరుగులు జోడించి ముంబైకు శుభారంభం ఇచ్చారు. అయితే ఆరో ఓవర్ చివరి బంతికి సోఫీ డివైన్ బౌలింగ్లో హేలీ అవుటవ్వడంతో ముంబై పతనం మొదలైంది. అనంతరం పెరీ తన పేస్ బౌలింగ్తో సజన, హర్మన్ప్రీత్ (0), అమెలియా కెర్ (2), అమన్జ్యోత్ (4), పూజ వస్త్రకర్ (6), నటాలీ సీవర్ బ్రంట్ (10)లను అవుట్ చేసింది. దాంతో ఒకదశలో 43/0తో ఉన్న ముంబై 82/7తో కష్టాల్లో పడింది. చివర్లో ప్రియాంక బాలా (19 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో ముంబై స్కోరు 100 దాటింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. స్మతి (11; 2 ఫోర్లు), సోఫీ మోలినెక్స్ (9; 2 ఫోర్లు), సోఫీ డివైన్ (4) తక్కు వ స్కోరుకే వెనుదిరిగారు. అయితే రిచా ఘోష్ (28 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), పెరీ నాలుగో వికెట్కు 76 పరుగులు జోడించి బెంగళూరును విజయతీరాలకు చేర్చారు. -
ఆర్సీబీకి శుభవార్త
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదివరకే రెండు ప్లేఆఫ్స్ బెర్త్లు ఖరారైపోయాయి. ఇక మిగిలింది ఓ బెర్త్. ఈ బెర్త్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో మహాద్భతం జరిగితే తప్ప ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరదు. ఇవాళ (మార్చి 12) ముంబై ఇండయన్స్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ ఓడినా ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. అయితే భారీ తేడాతో ఓడితే మాత్రం సమీకరణలు మారిపోతాయి. ఇవాల్టి మ్యాచ్లో ఆర్సీబీ ముంబై చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఆర్సీబీ తర్వాత యూపీ వారియర్జ్కు మాత్రమే ప్లేఆఫ్స్కు చేరుకునే ఛాన్స్ ఉందని అనుకోవడానికి వీల్లేదు. గుజరాత్ జెయింట్స్ తమ చివరాఖరి గ్రూప్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను కనీసం 57 పరుగుల తేడాతో ఓడిస్తే ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ బరిలో ఉంటుంది. ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే.. ఆర్సీబీ ముంబై ఇండియన్స్నూ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే మాత్రం యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. గుజరాత్ ఢిల్లీ క్యాపిటల్స్ను 57 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించి, ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే గుజరాత్ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయ్యే మూడో జట్టు మార్చి 15న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. తదుపరి జరుగబోయే రెండు గ్రూప్ మ్యాచ్ల ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు నిర్దారించబడతాయి. ప్రస్తుతానికి రన్రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్లో ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నా ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే జట్టుతో మార్చి 17న జరిగే అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనుంది. -
WPL 2024: సూపర్ షబ్నమ్...
న్యూఢిల్లీ: వరుసగా మూడో మ్యాచ్లోనూ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగినా... యూపీ వారియర్స్ను గెలిపించలేకపోయింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెపె్టన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లౌరా వోల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకెల్స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షబ్నమ్ షకీల్ (3/11) కీలక వికెట్లతో ఆరంభంలోనే యూపీని దెబ్బ తీసింది. దాంతో స్కోరు 35/5 వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా, దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులే వచ్చాయి. పట్టికలో మూడో స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ, బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా, యూపీ మ్యాచ్లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లున్న గుజరాత్ చివరి మ్యాచ్లో గెలవడంతో పాటు భారీ రన్రేట్ సాధించాలి. -
ప్రొ కబడ్డీ ‘ప్లే ఆఫ్స్’కు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పదో సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) కీలక దశ మ్యాచ్లకు హైదరాబాద్ వేదికవుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమ, బుధ, శుక్రవారాల్లో ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్లు జరుగుతాయి. ఈ సందర్భంగా శనివారం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి టోర్నీ విశేషాలను వెల్లడించారు. గత తొమ్మిదో సీజన్లతో పోలిస్తే ఈ సారి టోర్నీ ఇంకా ఎక్కువ సంఖ్యలో అభిమానులకు చేరువైందని... 12 ఫ్రాంచైజీలకు చెందిన నగరాలు అన్నింటిలో మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన అన్నారు. గ్రూప్ దశలో టాప్–2లో నిలిచిన పుణేరీ పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే సెమీఫైనల్కు చేరుకున్నాయి. సెమీస్లో తలపడే ఇతర రెండు జట్లను ఖరారు చేసేందుకు రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో ఢిల్లీని పటా్న, గుజరాత్ను హర్యానా ఢీకొంటాయి. ఈ నెల 26న ఎలిమినేటర్ మ్యాచ్లు, 28న సెమీఫైనల్స్, మార్చి 1న ఫైనల్ నిర్వహిస్తారు. హైదరాబాద్ నగర అభిమానులు ఈ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసేందుకు రూ. 250 – రూ. 3000 మధ్య ‘బుక్మైషో’లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. -
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్ అర్హత
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత పొందిన ఐదో జట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది. తెలుగు టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–36తో గెలిచింది. పట్నా తరఫున మంజీత్ 8 పాయింట్లు, సందీప్ 7 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీలో 21 మ్యాచ్లు ఆడి 11 విజయాలు అందుకున్న పట్నా 68 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 20 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 18వ పరాజయంతో 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానాన్ని ఖరారు చేసుకుంది. మిగిలి ఉన్న తమ చివరి రెండు మ్యాచ్ల్లో టైటాన్స్ గెలిచినా 29 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్న యూపీ యోధాస్ను దాటే అవకాశం లేదు. ఇప్పటికే జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్కు చేరుకోగా... చివరిదైన ఆరో బెర్త్ కోసం హరియాణా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ జట్లు రేసులో ఉన్నాయి. అయితే స్టీలర్స్ ఒక మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. -
ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్, ఫైనల్కు హైదరాబాద్ ఆతిథ్యం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని పీకేఎల్ నిర్వాహకులైన మషాల్ స్పోర్ట్స్ తెలిపింది. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్లో పాయింట్ల పట్టికలో టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. టాప్–2 జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్లు లభిస్తాయి. మిగతా నాలుగు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ల్లో తలపడతాయి. ఫిబ్రవరి 26న ఎలిమినేటర్–1లో ఆరో స్థానం పొందిన జట్టుతో మూడో స్థానంలో నిలిచిన జట్టు... ఎలిమినేటర్–2లో ఐదో స్థానంలో నిలిచిన జట్టుతో నాలుగో స్థానం పొందిన జట్టు ఆడతాయి. ఫిబ్రవరి 28న ఎలిమినేటర్–1 విజేత తొలి సెమీఫైనల్లో లీగ్ ‘టాపర్’తో... ఎలిమినేటర్–2 విజేత లీగ్లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీపడతాయి. ఫైనల్ మార్చి 1న జరుగుతుంది. -
ప్లే ఆఫ్స్కు చేరిన సన్రైజర్స్.. ఆ రెండు జట్లు కూడా!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. ఈ లీగ్లో భాగంగా బుధవారం జోబర్గ్ సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సన్రైజర్స్.. వరుసగా రెండో సారి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఈ లీగ్లో 8 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచింది. సన్రైజర్స్తో పాటు పార్ల్ రాయల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్తో కూడా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యాయి. నాలుగో స్ధానం కోసం సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, ఏంఐ కేప్టౌన్ పోటీపడతున్నాయి. నిప్పులు చేరిగిన సన్రైజర్స్ పేసర్లు.. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సన్రైజర్స్ పేసర్లు నిప్పులు చేరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. సన్రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. ఈస్టర్న్ కేప్ బౌలర్లలో డానియల్ వోరల్, కుర్గర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, స్వాన్పోయెల్, జానెసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో మాడ్సెన్ (32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ 11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(40 నాటౌట్), టామ్ అబెల్(26) పరుగులతో మ్యాచ్ ముగించారు. -
#MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్కు వచ్చిందో అంతే!
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పటివరకు ఫైనల్లో అడుగుపెట్టిన ఆరు సందర్భాల్లో ఐదుసార్లు టైటిల్ను గెలిచి కానీ వెళ్లలేదు. అత్యధికసార్లు ఫైనల్ చేరిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించినా.. ఆ జట్టు నాలుగుసార్లు ఛాంపియన్గా.. ఐదుసార్లు రన్నరప్గా నిలిచింది. కానీ ముంబై అలా కాదు.. నిష్క్రమిస్తే లీగ్ స్టేజీ.. లేదా ప్లేఆఫ్స్లో.. కానీ ఒక్కసారి ఫైనల్కు వచ్చిందా కప్ కొట్టకుండా మాత్రం పోదు. గత రికార్డులు కూడా అవే చెబుతున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్గా.. ఐపీఎల్లో ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్ది ఒకేరకమైన ఆటతీరు. తొలి రెండు సీజన్లలో పెద్దగా ప్రభావం చూపని ముంబై 2010లో మాత్రం తొలిసారి ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత 2011, 2012ల్లో ప్లేఆఫ్స్కు పరిమితమైంది. 2013లో తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్స్గా అవతరించిన ముంబై ఇండియన్స్ ఆటతీరు అక్కడి నుంచి పూర్తిగా మారిపోయింది. అలా 2015, 2017, 2019 ఇలా బేసి సంఖ్య విధానంలో నాలుగుసార్లు ఛాంపియన్గా అవతరించిన ముంబై ఇండియన్స్.. ODD Yearsలోనే కప్ కొడుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకం కరెక్ట్ కాదని చెబుతూ 2020లో ఐదోసారి ఛాంపియన్గా నిలిచింది ముంబై ఇండియన్స్. ఆరంభంలో వరుస ఓటములు.. తర్వాత ఫుంజుకొని ఛాంపియన్గా ఏ సీజన్ అయినా ముంబై ఇండియన్స్ తొలి అంచె పోటీల్లో ఎక్కువగా ఓటములను చవిచూస్తూనే వచ్చింది. ఛాంపియన్గా నిలిచిన ఐదు సందర్భాల్లో నాలుగుసార్లు సీజన్ను ఓటములతోనే ఆరంభించింది. మొదట వరుసగా ఓటములు.. మధ్యలో ఫుంజుకొని విజయాలతో బలంగా తయారవుతుంది. ప్రతీ సీజన్లో ఇదే స్ట్రాటజీతో కనిపించే ముంబై ఇండియన్స్ ఈసారి కూడా అదే ఆటతీరు కనబరిచింది. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రెండో అంచె పోటీల్లో ముంబైకి ఎక్కడలేని బలం వస్తోంది. ఏ జట్టైనా ఆది నుంచి ఓటమలు ఎదురైతే డీలా పడడం చూస్తాం. కానీ ముంబై అలా కాదు.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో అంచె పోటీల్లో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఆర్సీబీ లక్నో చేతిలో ఓడిపోవడం.. అదే సమయంలో ముంబై ఎస్ఆర్హెచ్పై గెలవడంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్లో అడుగుపెట్టింది. ప్లేఆఫ్కు వస్తే చాలు ఎక్కడలేని బలం.. ప్లేఆఫ్కు వచ్చిందంటే ముంబైలో ఎక్కడలేని బలం వస్తోంది. ప్రత్యర్థి జట్టు బలహీనతను ఆసరాగా చేసుకొని వారిని కోలుకోలేని దెబ్బతీసి విజయం సాధించడం ముంబై స్ట్రాటజీ. లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై అదే చేసింది. క్వాలిఫయర్-2లో గుజరాత్ను ఓడించి ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరిందో ఆరోసారి టైటిల్ కొట్టేందుకు శతవిధాల ప్రయత్నిచడం ఖాయం. అందుకే ముంబై ఇండియన్స్ను క్వాలిఫయర్-2లోనే గుజరాత్ ఆపాలని సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నట్లు తెలిసింది. A MI-ghty special victory! 😎 The Mumbai Indians win by 81 runs and progress to the #Qualifier2 of #TATAIPL 2023 👏🏻👏🏻 Scorecard ▶️ https://t.co/CVo5K1wG31#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/77zW6NmInn — IndianPremierLeague (@IPL) May 24, 2023 📍Next Stop: Ahmedabad ✈#LSGvMI #TATAIPL #IPLonJioCinema #MumbaiIndians | @mipaltan pic.twitter.com/TRp8f0vugT — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: జాఫర్కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్కార్డ్; భలే దొరికాడు కోహ్లితో కదా వైరం.. రోహిత్ ఏం చేశాడు! -
CSK VS GT: ఎవరి తరం కాలేదు.. సీఎస్కే చేసి చూపించింది..!
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ మెడలు వంచిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. నిన్న (మే 23) జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ను తొలిసారి ఆలౌట్ చేయడం ద్వారా సీఎస్కే ఈ ఘనత సాధించింది. ఐపీఎల్లో గుజరాత్ ఇప్పటివరకు 31 మ్యాచ్లు ఆడగా, ఈ మ్యాచ్కు ముందు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు. ఆలౌట్ విషయంలో గుజరాత్ అన్ బీటన్ రికార్డును సీఎస్కే చెరిపివేసింది. 30 మ్యాచ్ల్లో ఎవరికీ సాధ్యం కాని పనిని సీఎస్కే చేసి చూపించడంతో నెట్టింట వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్.. తమ 30 మ్యాచ్ల ఐపీఎల్ ప్రస్థానంలో (ఈ మ్యాచ్కు ముందు వరకు) కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే 9 వికెట్లు కోల్పోయింది. అలాగే ఆ జట్టు ఛేదనలో కేవలం నాలుగు మ్యాచ్ల్లో (నిన్నటి ఓటమితో) మాత్రమే ఓడింది. అందులో మూడు మ్యాచ్లు (ముంబై, ఢిల్లీ, సీఎస్కే) ఈ సీజన్లో ఓడినవే. హార్ధిక్ సేనకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఇది తొలి ఓటమి కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో సీఎస్కే సమష్టి ప్రదర్శనతో గుజరాత్ను 15 పరుగుల తేడాతో ఓడించింది. ఫలితంగా ఆ జట్టు 10వ సారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. చదవండి: CSK VS GT: ధోని తొండాట.. మ్యాచ్ 4 నిమిషాలు ఆలస్యం -
CSK VS GT: ధోని తొండాట.. మ్యాచ్ 4 నిమిషాలు ఆలస్యం
మిస్టర్ కూల్ కెప్టెన్, నిజాయితీకి మారు పేరుగా చెప్పుకునే మహేంద్ర సింగ్ ధోని.. నిన్న (మే 23) గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్స్ 1 మ్యాచ్ సందర్భంగా ఒకింత అసహనానికిలోనై, పరోక్షంగా తొండాట ఆడాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లతో కాసేపు వాగ్వాదానికి కూడా దిగాడు. ఫలితంగా మ్యాచ్ 4 నిమిషాలు ఆలస్యమైంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు మతీష పతిరణ సిద్దంగా ఉన్న సమయంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆ సమయంలో గుజరాత్ ఛేదనలో చాలా వెనుకబడి ఉంది. 24 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. పతిరణకు తన కోటాలో ఇంకా 3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయితే, పతిరణ 16వ వేసే ముందు మైదానంలో నిర్దిష్ట సమయం గడపకుండా, నేరుగా డగౌట్ నుంచి వచ్చి బౌలింగ్ వేసేందుకు సిద్దపడ్డాడు. నిబంధనల ప్రకారం బౌలింగ్ వేయడానికి ముందు బౌలర్ కచ్చితంగా 9 నిమిషాల పాటు మైదానంలో గడపాలి. So Dhoni Stopped the game until Pathirana became eligible to bowl again.. Bizarre 🤣 #IPL2023 #CSKvsGT pic.twitter.com/qSjSwrfYTW — MaahiWay (@Soham9907) May 23, 2023 అలా కాకుండా పతిరణ డగౌట్ నుంచి నేరుగా వచ్చి బౌలింగ్ వేసేందుకు సిద్దపడటంతో అంపైర్లు అతన్ని అనుమతించలేదు. ఆ సమయంలో పతిరణ బౌలింగ్ ప్రాధాన్యత తెలిసిన ధోని.. అంపైర్లతో వాదించి మరీ అతనితో బౌలింగ్ చేయించాడు. ధోని నుంచి ఈ తరహా బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయని జనం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ధోని మ్యాచ్ అయితే గెలిచాడు కాని.. అభిమానుల మనసుల్లో వంచకుడిగా మిగిలిపోతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Pathirana was out of the field for more than 9 minutes and came suddenly to bowl. Here the rule is that Pathirana should present atleast 9 minutes on the field to bowl his over but what Dhoni was chatting with umpires?? This isn't acceptable at all. pic.twitter.com/NML3LikBc3 — Priyansh (@priyansh_45) May 23, 2023 జట్టు గెలిపించుకోవడంలో భాగంగా ఇవన్నీ మామూలేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో ధోని ఇలాంటి సాహసోపేతమైన, వ్యూహాత్మకమైన చర్యలకు పాల్పడి సీఎస్కేను రికార్డు స్థాయిలో 10వ సారి ఐపీఎల్ ఫైనల్కు చేర్చాడు. MS Dhoni Intentionally wasted time so that pathirana can bowl even though being off the field for certain period of time.. No wonder why they were banned 🚫#CSKvsGT pic.twitter.com/2pkzAnA42a — Cric8ly 🏏 (@MR_Alpha_21) May 23, 2023 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో సీఎస్కే సమష్టి ప్రదర్శనతో గుజరాత్ను 15 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. చదవండి: ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా? -
ప్లే ఆఫ్స్లో ధోనికి తిరుగులేని రికార్డు.. గుజరాత్కు దబిడిదిబిడే..!
ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో సీఎస్కే సారధి మహేంద్ర సింగ్ ధోనికి తిరుగులేని రికార్డు ఉంది. మహేంద్రుడు ఇప్పటివరకు 21 ప్లే ఆఫ్స్ ఇన్నింగ్స్ల్లో 522 పరుగులు బాదాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమం. ప్లే ఆఫ్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు చిన్న తలా సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా.. 24 ఇన్నింగ్స్ల్లో 714 పరుగులు చేశాడు. రైనా, ధోని తర్వాత షేన్ వాట్సన్ (12 ఇన్నింగ్స్ల్లో 389 పరుగులు), మైక్ హస్సీ (11 ఇన్నింగ్స్ల్లో 388 పరుగులు), ఫాఫ్ డుప్లెసిస్ (14 ఇన్నింగ్స్ల్లో 373 పరుగులు) ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఉన్నారు. ఈ జాబితాలో టాప్-5 ఆటగాళ్లంతా సీఎస్కే సభ్యులే కావడం విశేషం. ప్లే ఆఫ్స్లో ధోని గణాంకాలు చూసి, నేటి (మే 23, క్వాలిఫయర్-1) మ్యాచ్లో సీఎస్కే ప్రత్యర్ధి అయిన గుజరాత్కు వణుకుపుడుతుంటుంది. అసలే మహేంద్రుడు గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో ధాటిగా ఆడుతున్నాడు. దానికి తోడు అతని ప్లే ఆఫ్స్ గణాంకాలు మరింత బయపెట్టేవిగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నేటి మ్యాచ్లో ధోని అత్యంత ప్రమాదకర బ్యాటర్గా మారే అవకాశం ఉంది. ధోనిని కట్టడి చేసేందుకు గుజరాత్ బౌలింగ్ విభాగం ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. మ్యాచ్ ధోని వరకు వచ్చిందో అతన్ని ఆపడం కష్టమేనని అభిమానులు భావిస్తున్నారు. ఛేదనలో అయినా.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా పాత ధోనిని చూడటం ఖాయమని అతని అభిమానులు పందెలు కాస్తున్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోని భీకర ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. అతను ఆడిన 10 ఇన్నింగ్స్ల్లో 51.50 సగటున 190.74 స్ట్రయిక్ రేట్తో 103 పరుగులు చేశాడు. సీఎస్కే టాపార్డర్ ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో ధోనికి సరైన అవకాశాలు రాలేదు. వచ్చిన దాంట్లో మహేంద్రుడు తనదైన స్టయిల్లో బ్యాట్ను ఝులిపించాడు. ఇదిలా ఉంటే, చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్, సీఎస్కే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7: 30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు ఓడినా తదుపరి వెళ్లేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. లక్నో-ముంబై జట్ల మధ్య రేపు (మే 24) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో ఇవాళ ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో (మే 26) తలపడే అవకాశం ఉంటుంది. ఆ మ్యాచ్లో విజేత.. ఇవాళ జరిగే మ్యాచ్లో విజేతతో ఫైనల్స్లో (మే 28) తలపడుతుంది. చదవండి: కోహ్లి ఒక్కడితోనే వేగలేకుంటే మరొకరు తయారయ్యారు.. ప్రపంచ దేశాల్లో వణుకు..! -
SRH VS MI: ముంబై 11.4 ఓవర్లలో ఛేజ్ చేస్తేనే..!
సన్రైజర్స్ ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2023 భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచ్లో ముంబై ఒకవేళ గెలిచినా నెట్ రన్రేట్ కీలకం కానుంది. ఎందుకంటే.. గుజరాత్తో ఇవాళ రాత్రి జరుగబోయే మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే, మెరుగైన రన్రేట్ కారణంగా ఆ జట్టే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ గుజరాత్పై ఆర్సీబీ గెలిచినా ముంబై ప్లే ఆఫ్స్కు చేరాలంటే.. సన్రైజర్స్పై సాదాసీదాగా గెలిస్తే సరిపోదు. సన్రైజర్స్ నిర్ధేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 11.4 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. ఇది అంత ఆషామాషీ విషయం కాదు కాబట్టి, గుజరాత్- ఆర్సీబీ మ్యాచే ప్లే ఆఫ్స్ నాలుగో బెర్తును డిసైడ్ చేస్తుంది. మరోవైపు గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్కు వరుణుడు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ సమయానికి ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని యాక్యూ వెదర్ చూపిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది (సన్రైజర్స్పై ముంబై గెలిచి). మ్యాచ్ రద్దైతే ఆర్సీబీ, గుజరాత్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. సన్రైజర్స్పై ముంబై గెలిస్తే.. ఆ జట్టు 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. గుజరాత్ (18),సీఎస్కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరుకోగా.. నాలుగో ప్లేస్ కోసం ముంబై, రాజస్థాన్, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే, ముంబైతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ (83) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. క్లాసెన్ (18), ఫిలిప్స్ (1), బ్రూక్ (0) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు. 7 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 73/1గా ఉంది. ఇషాన్ కిషన్ విఫలం కాగా.. కెమారూన్ గ్రీన్ (15 బంతుల్లో 42) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. రోహిత్ (16 బంతుల్లో 16) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. చదవండి: MI VS SRH: ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..! -
‘ప్లే ఆఫ్స్’కు సూపర్ కింగ్స్... జెయింట్స్
ఐపీఎల్–2023లో మరో రెండు ‘ప్లే ఆఫ్స్’ స్థానాలు ఖరారయ్యాయి... గత సీజన్లో తొమ్మిదో స్థానంతో ముగించిన నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి మళ్లీ పైకెగసింది... చివరి లీగ్లో ఢిల్లీని చిత్తు చేసి రెండో స్థానంతో క్వాలిఫయర్–1కు అర్హత సాధించింది... సొంత గడ్డపై మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకుంది. మరో వైపు గత ఏడాదిలాగే ఈ సారి కూడా లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్కు చేరింది... ఉత్కంఠభరితంగా సాగిన చివరి పోరులో పరుగు తేడాతో కోల్కతాను ఓడించి ఊపిరి పీల్చుకుంది... నాలుగో స్థానం ఎవరిదనేది నేడు జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్లతో తేలుతుంది. ఈ స్థానం కోసం ప్రధానంగా ముంబై, బెంగళూరు పోటీ పడుతుండగా... ఈ రెండూ ఓడితే రాజస్తాన్కు అవకాశం ఉంటుంది. న్యూఢిల్లీ: నాలుగుసార్లు ఐపీఎల్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ ప్లేఆఫ్స్కు చేరింది. ఇప్పటికే రేసుకు దూరమైన ఢిల్లీని సులువుగా చిత్తుచేసింది. సొంతగడ్డపై గెలుపుతో ముగిద్దామనుకున్న వార్నర్ సేన ఆశలపై నీళ్లుచల్లింది. ధోని సేన 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవాన్ కాన్వే (52 బంతుల్లో 87; 11 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 79; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) శివమెత్తారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ వార్నర్ (58 బంతుల్లో 86; 7 ఫోర్లు, 5 సిక్స్లు) పోరాడాడు. ఓపెనర్ల వీరవిహారం ఆట మొదలవగానే చెన్నై ఓపెనర్లు పరుగుల బాట పట్టారు. ప్రత్యర్థి జట్టు పేస్, స్పిన్ మార్చిమార్చి ప్రయోగించినా రుతురాజ్, కాన్వే జోరును అడ్డుకోలేకపోయారు. పవర్ప్లేలో 52/0 స్కోరు చేసిన చెన్నై ఆ తర్వాత ఇంకాస్త వేగంగా ఆడారు. అక్షర్ పదో ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాదిన రుతురాజ్ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. కాసేపటికే కుల్దీప్ 12వ ఓవర్లో ‘హ్యాట్రిక్’ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు స్కోరు వంద దాటాక కాన్వే ఫిఫ్టీ 33 బంతుల్లో పూర్తయ్యింది. 14 ఓవర్ల పాటు దుర్బేధ్యంగా సాగిన 141 పరుగుల ఓపెనింగ్ జోడీకి 15వ ఓవర్లో సకారియా ముగింపు పలికాడు. రుతురాజ్ నిష్క్రమించగా, శివమ్ దూబే (9 బంతుల్లో 22; 3 సిక్సర్లు), కాన్వే ధాటిగా ఆడారు. ఆఖర్లో జడేజా (7 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించాడు. వార్నర్ ఒంటరిగా... ఢిల్లీ ముందున్న లక్ష్యం అతి కష్టమైంది. టాపార్డర్ దంచేస్తే తప్ప ఛేదన సాధ్యం కానేకాదు. కానీ టాపార్డరే కాదు... మిడిల్, లోయర్ ఆర్డర్, టెయిలెండర్లు అంతా చేతులెత్తేయడంతో చెన్నై గెలుపు సులువైంది. పృథ్వీ షా (5), సాల్ట్ (3), రోసో (0) ఇలా ధాటిగా ఆడే సత్తా వున్న బ్యాటర్లు పవర్ప్లే వరకైనా ఆడలేకపోయారు. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్ను కెప్టెన్ వార్నర్ ఒంటరిగా నడిపించాడు. సహచరులు ధుల్ (13), అక్షర్ (15), అమన్ (7), లలిత్ యాదవ్ (6) చెన్నై బౌలర్ల ఉచ్చులో పడటంతో వార్నర్ ఎంత పోరాడినా జట్టు స్కోరు 150 పరుగులు దాటలేదు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) రోసో (బి) సకారియా 79; కాన్వే (సి) అమన్ (బి) నోర్జే 87; దూబే (సి) లలిత్ (బి) ఖలీల్ 22; ధోని (నాటౌట్) 5; జడేజా (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–141, 2–195, 3–195. బౌలింగ్: ఖలీల్ 4–0–45–1, లలిత్ 2–0–32–0, అక్షర్ 3–0–32–0, నోర్జే 4–0–43–1, సకారియా 4–0–36–1, కుల్దీప్ 3–0–34–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్విషా (సి) రాయుడు (బి) తుషార్ 5; వార్నర్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 86; సాల్ట్ (సి) రహానె (బి) చహర్ 3; రోసో (బి) చహర్ 0; ధుల్ (సి) తుషార్ (బి) జడేజా 13; అక్షర్ (సి) రుతురాజ్ (బి) చహర్ 15; అమన్ (సి) అలీ (బి) పతిరణ 7; లలిత్ (సి) అలీ (బి) తీక్షణ 6; నోర్జే నాటౌట్ 0; కుల్దీప్ (ఎల్బీ) (బి) తీక్షణ 0; సకారియా నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–5, 2–26, 3–26, 4–75, 5–109, 6–131, 7–144, 8–146, 9–146. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–22–3, తుషార్ 4–0–26–1, తీక్షణ 4–1–23–2, జడేజా 4–0–50–1, పతిరణ 4–0–22–2. ♦ ఎలిమినేటర్కు లక్నో ♦ పరుగు తేడాతో కోల్కతాపై విజయం కోల్కతా: విజయలక్ష్యం 177 పరుగులు...కీలక బ్యాటర్లంతా వెనుదిరగ్గా, కోల్కతా విజయానికి చివరి 12 బంతుల్లో 41 పరుగులు కావాలి...క్రీజ్లో రింకూ సింగ్ ఉండటంతో కొంత ఆశ...దానిని వమ్ము చేయకుండా ఈ సీజన్లో పలు మార్లు ఆడినట్లుగా రింకూ మళ్లీ తన జోరు మొదలు పెట్టాడు. నవీనుల్ వేసిన 19వ ఓవర్లో 4, 4, 4, 2, 6, 0లతో 20 పరుగులు రాబట్టాడు. అంతే ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. 6 బంతులకు 21 పరుగులు కావాల్సి ఉండగా భారీ షాట్లమీదే దృష్టిపెట్టిన రింకూ సింగిల్స్ తీయలేదు. తీవ్ర ఒత్తిడిలో యశ్ ఠాకూర్ 2 వైడ్లు వేశాడు. ఆఖరి మూడు బంతుల్లో 18 పరుగులు అవసరం కాగా, రింకూ వరుసగా 6, 4, 6 కొట్టినా ఈ సారి గెలిపించలేకపోయాడు. చివరకు పరుగు తేడాతో లక్నో గట్టెక్కింది. మొదట లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్స్లు) దంచేశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. రింకూ సింగ్ (33 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అలుపెరగని పోరాటం చేశాడు. జేసన్ రాయ్ (28 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆదుకున్న పూరన్ డికాక్తో కరణ్ శర్మ (3) ఓపెనింగ్ కుదరలేదు. ఆ తర్వాత వచ్చిన వారితో లక్నో ఆట కూడా తీసికట్టుగానే ఉంది. ప్రేరక్ మన్కడ్ (20 బంతుల్లో 26; 5 ఫోర్లు)ను, స్టొయినిస్ (0)ను వైభవ్ అరోరా ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ కృనాల్ పాండ్యా (9) నరైన్ ఉచ్చులో పడగా... డికాక్ (27 బంతుల్లో 28; 2 సిక్స్లు) భారీ షాట్కు యతి్నంచి నిష్క్ర మించాడు. 73 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆయుశ్ బదోని (21 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన పూరన్ జట్టు బాధ్యత మోశాడు. క్రీజులోకి వచి్చనప్పటినుంచే సిక్సర్లు, ఫోర్లతో ఇన్నింగ్స్కు ఊపిరిపోశాడు. శుభారంభం దక్కినా... కోల్కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, జేసన్ రాయ్ లక్ష్యానికి దీటైన పునాది వేశారు. 4.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. అయితే వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్)ను గౌతమ్ అవుట్ చేయడంతోనే ఆట మలుపు తిరిగింది. నితీశ్ రాణా (8), రాయ్, గుర్బాజ్ (10) పెవిలియన్కు వరుస కట్టారు. 27 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో రసెల్ అవుట్ కావడంతో కోల్కతా ఛేదన కష్టంగా మారిపోయింది. స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: కరణ్ శర్మ (సి) శార్దుల్ (బి) హర్షిత్ 3; డికాక్ (సి) రసెల్ (బి) వరున్ 28; ప్రేరక్ (సి) హర్షిత్ (బి) వైభవ్ 26; స్టొయినిస్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 0; కృనాల్ (సి) రింకూ (బి) నరైన్ 9; బదోని (సి) శార్దుల్ (బి) నరైన్ 25; పూరన్ (సి) వెంకటేశ్ (బి) శార్దుల్ 58; గౌతమ్ నాటౌట్ 11; బిష్ణోయ్ (బి) శార్దుల్ 2; నవీనుల్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–14, 2–55, 3–55, 4–71, 5–73, 6–147, 7–159, 8–162. బౌలింగ్: హర్షిత్ 3–0–21–1, వైభవ్ 4–0–30–2, వరుణ్ 4–0–38–1, నితీశ్ రాణా 1–0–3–0, శార్దుల్ 2–0–27–2, నరైన్ 4–0–28–2, సుయశ్ 1–0–12–0, రసెల్ 1–0–12–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: రాయ్ (బి) కృనాల్ 45; వెంకటేశ్ (సి) బిష్ణోయ్ (బి) గౌతమ్ 24; నితీశ్ రాణా (సి) కృనాల్ (బి) బిష్ణోయ్ 8; గుర్బాజ్ (సి) బిష్ణోయ్ (బి) యశ్ 10; రింకూసింగ్ (నాటౌట్) 67; రసెల్ (బి) బిష్ణోయ్ 7; శార్దుల్ (సి) ప్రేరక్ (బి) యశ్ 3; నరైన్ రనౌట్ 1; వైభవ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–61, 2–78, 3–82, 4–108, 5–120, 6–134, 7–136. బౌలింగ్: మొహసిన్ 1–0–15–0, నవీనుల్ 4–0–46–0, కృనాల్ 4–0–30–1, గౌతమ్ 4–0–26–1, రవి బిష్ణోయ్ 4–0–23–2, యశ్ ఠాకూర్ 3–0–31–2. ఐపీఎల్లో నేడు కీలక మ్యాచ్లు ముంబై VS హైదరాబాద్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) బెంగళూరు VS గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
నిలకడకు నిలువుటద్దం.. ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్కు
ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ ఆడడం దాదాపు ఖరారైనట్లే. ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ని 77 పరుగుల భారీ తేడాతో ఓడించిన సీఎస్కే సీజన్లో 8వ విజయాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో 12వ సారి ప్లేఆఫ్స్ ఆడనున్న ధోని సేన అత్యధికసార్లు ప్లేఆఫ్స్కు వెళ్లిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 17 పాయింట్లతో సీఎస్కే గుజరాత్ టైటాన్స్తో మొదటి క్వాలిఫైయర్ ఆడడం దాదాపు ఖాయమే. సీఎస్కే క్వాలిఫైయర్ ఆడకుండా ఆపాలంటే లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్పై 100+ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇది అసాధ్యమైనప్పటికి టి20 క్రికెట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం ఐపీఎల్లో ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్కు.. ఇక ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ప్లేఆఫ్ చేరడం ఇది 12వ సారి. 2008 ఆరంభ సీజన్ మొదలుకొని 2023 వరకు జరిగిన 16 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్ చేరడం అంటే మాటలు కాదు. ధోని లాంటి నాయకుడు జట్టులో ఉండడం.. నిలకడకు నిలువుటద్దంలా నిలిచింది సీఎస్కే. మధ్యలో రెండు సీజన్లలో(2016,2017) సీఎస్కే బ్యాన్కు గురైన సంగతి తెలిసిందే. ఇక 2020, 2022లో రెండు సీజన్లు మాత్రమే దారుణంగా ఆడిన సీఎస్కే ఏడో స్థానానికి పరిమితమైంది. ఇది మినహా మిగతా అన్నిసార్లు ప్లేఆఫ్ చేరిన జట్టుగా నిలిచింది. ఇందులో నాలుగుసార్లు ఛాంపియన్గా(2010, 2011, 2018, 2021), ఇక 2008, 2012, 2013, 2015, 2019లో రన్నరప్గా నిలవడం విశేషం. 2009లో నాలుగోస్థానం, 2014లో మూడో స్థానానికి పరిమితమైంది. A terrific victory in Delhi for the @ChennaiIPL 🙌 They confirm their qualification to the #TATAIPL 2023 Playoffs 😎 Scorecard ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/OOyfgTTqwu — IndianPremierLeague (@IPL) May 20, 2023 CSK qualifies for the 12th time in 14 seasons of the IPL. - The most consistent side under the leadership of MS Dhoni! pic.twitter.com/UKtIMwQdvY — Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2023 చదవండి: #JadejaVsWarner: బుట్టబొమ్మ వర్సెస్ పుష్ప -
అది కూడా కీలకమే.. పాపం రాజస్తాన్ ఆ విషయం మర్చిపోయినట్టుంది!
IPL 2023- PBKS Vs RR: ‘‘మూడు ప్లే ఆఫ్ బెర్త్ల కోసం ఐదు జట్లు ఇంకా బరిలో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకోవడంతోపాటు టాప్ ర్యాంక్తో లీగ్ దశను ముగించనుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్ల్లో గెలిస్తే చెన్నై, లక్నో జట్లకు రెండో స్థానంతో లీగ్ను ముగించే అవకాశం ఉంది. ఇందులో రన్రేట్ కూడా ముఖ్యపాత్ర పోషించనుంది. రన్రేట్ వ్యత్యాసం వల్ల అందుకే లీగ్ మ్యాచ్ల్లో విజయ వ్యత్యాసం కీలకంగా మారింది. బెంగళూరుతో మ్యాచ్లో ఈ విషయం రాజస్తాన్ మర్చిపోయినట్టుంది. ఒకవేళ రాజస్తాన్ లీగ్ దశలో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిస్తే రన్రేట్ వ్యత్యాసం వారి ప్లే ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. టి20 ఫార్మాట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో కచ్చితంగా చెప్పలేం. వికెట్లు పారేసుకున్నారు అయితే మ్యాచ్ చేజారిపోతున్న దశలో ఓటమి వ్యత్యాసం సాధ్యమైనంత తగ్గించేందుకు ఆయా జట్ల బ్యాటర్లు కృషి చేయాలి. కానీ బెంగళూరుతో మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్లు అలా చేయలేదు. క్రీజులో వచ్చిన ప్రతి బ్యాటరు భారీ షాట్లకు యత్నించి వికెట్లు పారేసుకున్నారు. రాజస్తాన్పై భారీ విజయంతో బెంగళూరుకు ఒక్కసారిగా ప్లే ఆఫ్నకు అర్హత పొందే అవకాశాలు పెరిగాయి. అర్ష్దీప్ సింగ్ తేలిపోయాడు ఈ అవకాశాన్ని బెంగళూరు ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఢిల్లీతో మ్యాచ్లో పంజాబ్ జట్టుకు ఆడిన అనుభవజ్ఞులైన విదేశీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. గత సీజన్లో ఆకట్టుకున్న అర్ష్దీప్ సింగ్ ఈసారి మాత్రం తేలిపోయాడు. అతడిని ఎలా ఎదుర్కోవాలో అన్ని జట్ల బ్యాటర్లకు తెలిసిపోయింది. తాను ఎందుకు విఫలమవుతున్నానో అర్ష్దీప్ సింగ్ తెలుసుకొని మళ్లీ గాడిలో పడాల్సిన అవసరముంది. భవిష్యత్లో భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడే సత్తా అర్ష్దీప్లో ఉంది. ఢిల్లీతో మ్యాచ్లో లివింగ్స్టోన్ అద్భుతంగా ఆడినా విజయం మాత్రం దక్కలేదు. అయితే మిగతా ఆటగాళ్లు కూడా పోరాటపటిమను కనబర్చాల్సిన అవసరముంది. మొత్తానికి నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ కోసం ఐపీఎల్ లీగ్ దశకు అద్భుతమైన ముగింపు లభించనుంది’’ అని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తన విశ్లేషణలో పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే పంజాబ్ కింగ్స్తో శుక్రవారం నాటి మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్కు అత్యంత కీలకంగా మారింది. చదవండి: ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్క రియల్ కింగ్.. అది కోహ్లి మాత్రమే: పాకిస్తాన్ మాజీ పేసర్ -
IPL 2023: సన్రైజర్స్తో ఆర్సీబీ మ్యాచ్.. గెలిచిందా నిలుస్తుంది..!
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ (మే 18) మరో కీలక మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తప్పక గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఆర్సీబీ ఓడిందా.. ఢిల్లీ (అధికారికంగా ఔట్), సన్రైజర్స్, పంజాబ్, కేకేఆర్ (ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్లే) బాటలోనే ప్లే ఆఫ్స్కు చేరకుండా లీగ్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. నేటి మ్యాచ్లో ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడినా మరో అవకాశం ఉంటుంది. అయితే మే 21న గుజరాత్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పటికీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుందని చెప్పలేని పరిస్థితి. రేపు (మే 19) జరుగబోయే మ్యాచ్లో రాజస్థాన్పై పంజాబ్, మే 20న జరిగే రెండు మ్యాచ్ల్లో ఢిల్లీపై సీఎస్కే, కేకేఆర్పై లక్నో, మే 21న (మధ్యాహ్నం) జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో ముంబై ఓడితే అప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. అప్పటికి కూడా నెట్ రన్రేట్ కీలకంగా మారుతుంది. గుజరాత్పై ఆర్సీబీ సాధారణ విజయం సాధించినా ముంబైతో సమానంగా ఇరు జట్ల ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు గుజరాత్ (18), సీఎస్కే (17), లక్నో (17)లతో పాటు ప్లే ఆఫ్స్కు చేరుతుంది. ఒకవేళ పంజాబ్పై రాజస్థాన్ గెలిచినా.. సన్రైజర్స్పై ముంబై గెలిచినా.. ఢిల్లీ చేతిలో సీఎస్కే, కేకేఆర్ చేతిలో లక్నో ఓడినా సమీకరణలన్నీ మారిపోతాయి. అప్పుడు 2, 3, 4 స్థానాల కోసం సీఎస్కే, లక్నో, ముంబై, ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు పోటీపడాల్సి ఉంటుంది. నెగిటివ్ రన్రేట్ కారణంగా 12 పాయింట్లు ఉన్నప్పటికీ కేకేఆర్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే. చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? -
టైటాన్స్ క్వాలిఫై... సన్రైజర్స్ అవుట్
ఐపీఎల్–2023లో హైదరాబాద్ టీమ్ సన్రైజర్స్ ఆట ముగిసింది. 2021, 2022లలో ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించలేకపోయిన జట్టు వరుసగా మూడో ఏడాదీ విఫల ప్రదర్శనతో ముందంజ వేసే అవకాశాలు కోల్పోయింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో తాజా ఓటమితో జట్టు అధికారికంగా రేసు నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో డిఫెండింగ్ చాంపియన్ టైటాన్స్ అందరికంటే ముందుగా ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు టాప్–2లో చోటును ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్: ఐపీఎల్లో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు దూరమైంది. సోమవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 34 పరుగుల తేడాతో సన్రైజర్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (58 బంతుల్లో 101; 13 ఫోర్లు, 1 సిక్స్) ఐపీఎల్లో తన తొలి సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్ (36 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు 84 బంతుల్లో 147 పరుగులు జోడించగా, భువనేశ్వర్ (5/30) ఐదు వికెట్లతో రాణించాడు. గుజరాత్ జట్టు 40 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 8 వికెట్లు చేజార్చుకుంది. భువీ వేసిన ఆఖరి ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయింది. ఇందులో ఒక రనౌట్ కూడా ఉంది. అనంతరం సన్రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా... షమీ, మోహిత్ శర్మ చెరో 4 వికెట్లు తీశారు. క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమంలో భాగంగా గుజరాత్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో ‘లావెండర్’ రంగు జెర్సీలు ధరించారు. ఛేదనలో రైజర్స్ ఏమాత్రం పోరాటం కనబర్చలేకపోయింది. క్లాసెన్ మినహా ఇతర ఆటగాళ్లు కనీస స్థాయి ప్రదర్శన కూడా చూపలేదు. తొలి 6 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ జట్టు తర్వాతి మూడు ఓవర్లలో మరో మూడు వికెట్లు చేజార్చు కొని విజయంపై ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) అభిషేక్ (బి) భువనేశ్వర్ 0; శుబ్మన్ గిల్ (సి) సమద్ (బి) భువనేశ్వర్ 101; సుదర్శన్ (సి) నటరాజన్ (బి) జాన్సెన్ 47; హార్దిక్ పాండ్యా (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్ 8; మిల్లర్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 7; తెవాటియా (సి) జాన్సెన్ (బి) ఫారుఖీ 3; షనక (నాటౌట్) 9; రషీద్ (సి) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 0; నూర్ (రనౌట్) 0; షమీ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–0, 2–147, 3–156, 4–169, 5–175, 6–186, 7–186, 8–186, 9–187. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–30–5, జాన్సెన్ 4–0– 39–1, ఫారుఖీ 3–0–31–1, నటరాజన్ 4–0– 34–1, మార్క్రమ్ 1–0–13–0, మయాంక్ మార్కండే 3–0–27–0, అభిషేక్ శర్మ 1–0–13–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అన్మోల్ (సి) రషీద్ (బి) షమీ 5; అభిషేక్ (సి) సాహా (బి) యశ్ 5; మార్క్రమ్ (సి) షనక (బి) షమీ 10; త్రిపాఠి (సి) తెవాటియా (బి) షమీ 1; క్లాసెన్ (సి) మిల్లర్ (బి) షమీ 64; సన్విర్ (సి) సుదర్శన్ (బి) మోహిత్ 7; సమద్ (సి) (సబ్) మావి (బి) మోహిత్ 4; జాన్సెన్ (సి) పాండ్యా (బి) మోహిత్ 3; భువనేశ్వర్ (సి) రషీద్ (బి) మోహిత్ 27; మార్కండే (నాటౌట్) 18; ఫారుఖీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–6, 2–11, 3–12, 4–29, 5–45, 6–49, 7–59, 8–127, 9–147. బౌలింగ్: షమీ 4–0–21–4, యశ్ దయాళ్ 4–0–31–1, రషీద్ 4–0–28–0, మోహిత్ శర్మ 4–0–28–4, నూర్ 2.5–0–35–0, తెవాటియా 1.1–0–7–0. ఐపీఎల్లో నేడు లక్నో vs ముంబై (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2023: ఢిల్లీ ఔట్.. ఆ జట్లకు ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక మిగిలింది 9 జట్లు. వీటిలో సన్రైజర్స్, కేకేఆర్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించాయి. అయితే టెక్నికల్గా వారి అవకాశాలను కొట్టిపారేయడానికి వీల్లేదు. సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు: 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న సన్రైజర్స్ తాము ఆడాల్సిన మూడు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిచి నెట్రన్రేట్ను భారీగా మెరుగుపర్చుకోవడమే కాకుండా, మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది. కేకేఆర్: 12 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిచి నెట్రన్రేట్ను భారీగా మెరుగుపర్చుకోవడమే కాకుండా, మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది. ఆర్సీబీ: 11 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు (-0.345) సాధించి, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. తాము ఆడాల్సిన మూడు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిచి, నెట్ రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్, ముంబై, పంజాబ్, లక్నో జట్ల గెలుపోటములు కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. పంజాబ్: 12 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు (-0.268) సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిస్తే నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్లో ఓడితే ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై, లక్నో జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రన్రేట్ కీలకంగా మారుతుంది. రాజస్థాన్: 12 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు (0.633) సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్లో ఓడినా రన్రేట్ కీలకంగా మారుతుంది. లక్నో: 12 మ్యాచ్ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు (0.309) సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లక్నో.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్లో ఓడినా ప్లే ఆఫ్స్కు చేరాలంటే.. రాజస్థాన్, పంజాబ్, ఆర్సీబీ, ముంబై జట్లు తలో మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే లక్నో 15 పాయింట్లతో ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది. రాజస్థాన్, పంజాబ్, ఆర్సీబీ టీమ్లు 14 పాయింట్లతో లీగ్ నుంచి నిష్క్రమిస్తాయి. ముంబై: 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు (-0.117) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ముంబై.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్లో ఓడినా ప్లే ఆఫ్స్కు చేరాలంటే.. రాజస్థాన్ కంటే మెరుగైన రన్రేట్ సాధించడమో లేక రాజస్థాన్ ఆడబోయే రెండు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో ఓటమిపాలయ్యేందుకు ఎదురు చూడాలి. సీఎస్కే: 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో 15 పాయింట్లు (0.493) సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సీఎస్కే.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. అదే రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్కు చేరే రెండో జట్టుగా నిలుస్తుంది. గుజరాత్: 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు (0.761) సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా టేబుల్ టాపర్గా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. చదవండి: లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ అసభ్య ప్రవర్తన -
ఐపీఎల్ 2023 తొలి దశ పూర్తైంది.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంది..?
ఐపీఎల్-2023 తొలి దశ మ్యాచ్లు నిన్నటితో (ఏప్రిల్ 25) పూర్తయ్యాయి. లీగ్లో పాల్గొంటున్న మొత్తం 10 జట్లు ఇప్పటివరకు ఏడేసి మ్యాచ్లు ఆడాయి. 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ (0.662) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ సైతం 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ, చెన్నైతో పోలిస్తే కాస్త తక్కువ రన్రేట్ (0.580) ఉన్న కారణంగా రెండో స్థానంలో నిలిచింది. 7 మ్యాచ్ల్లో తలో 4 విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ (0.844), లక్నో సూపర్ జెయింట్స్ (0.547), ఆర్సీబీ (-0.008), పంజాబ్ కింగ్స్ (-0.162) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. 7 మ్యాచ్ల్లో మూడింట గెలిచిన ముంబై (-0.620) ఏడులో, 7 మ్యాచ్ల్లో తలో 2 మ్యాచ్ల్లో నెగ్గిన కేకేఆర్ (-0.186), సన్రైజర్స్ (-0.725), ఢిల్లీ క్యాపిటల్స్ (-0.961) 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. 2 గ్రూపులుగా 10 జట్లు.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పాల్గొంటున్న 10 జట్లు 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. అన్ని జట్లు సొంత మైదానంలో 7 మ్యాచ్లు, ప్రత్యర్ధి సొంత వేదికలపై 7 మ్యాచ్లు ఆడతాయి. ఓ జట్టు ఇతర గ్రూప్లోని ప్రతి జట్టుతో రెండేసి మ్యాచ్లు (ఇంట, బయట) ఆడుతుంది. అలాగే సొంత గ్రూప్లోని మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఐపీఎల్ టీమ్లు.. గ్రూపులు గ్రూప్ ఏ: ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ గ్రూప్ బి: చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ టాప్లో ఉండే నాలుగు జట్లు ప్లే ఆఫ్స్కు.. ఒక్కో జట్టు 14 మ్యాచ్లు ఆడిన అనంతరం లీగ్ మ్యాచ్లు పూర్తవుతాయి (మే 21). పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్లో ఉండే జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మొదటి క్వాలిఫయర్లో (మే 23).. మూడు, నాలుగు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో (మే 24) తలపడతాయి. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో (మే 26) పోటీపడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు మే 28న క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. -
హర్మన్ ధనాధన్ హాఫ్ సెంచరీ.. ప్లే ఆఫ్స్కు ముంబై
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఓటమెరుగని ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన పోరులో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 55 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. ముంబైకిది వరుసగా ఐదో విజయం. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ అర్ధసెంచరీ బాదింది. ఓపెనర్ యస్తిక భాటియా (37 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, గుజరాత్ బౌలర్లలో ఆష్లే గార్డ్నెర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులే చేయగలిగింది. హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 22; 3 ఫోర్లు), కెపె్టన్ స్నేహ్ రాణా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) కష్టంగా రెండు పదుల స్కోరు దాటారు. మిగతావారంతా చేతులెత్తేశారు. నట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు తీయగా, అమెలియా కెర్కు 2 వికెట్లు దక్కాయి. నేడు జరిగే మ్యాచ్లో యూపీ వారియర్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (రనౌట్) 44; హేలీ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; నట్ సీవర్ (ఎల్బీ) (బి) గార్త్ 36; హర్మన్ప్రీత్ (సి) హర్లీన్ (బి) గార్డ్నెర్ 51; అమెలియా (సి) గార్త్ (బి) కన్వార్ 19; ఇసి వాంగ్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 0; హుమైరా (రనౌట్) 2; ధార (నాటౌట్) 1; అమన్జోత్ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; కలిత (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–75, 3–84, 4–135, 5–136, 6–145. బౌలింగ్: గార్డ్నెర్ 4–0–34–3, కిమ్ గార్త్ 4–0–31–1, స్నేహ్ రాణా 4–0–17–1, తనూజ 4–0–32–1, అనాబెల్ 4–0–42–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: సోఫియా (ఎల్బీ) (బి) నట్ సీవర్ 0; మేఘన (సి) నట్ సీవర్ (బి) హేలీ 16; హర్లీన్ (ఎల్బీ) (బి) వాంగ్ 22; అనాబెల్ (ఎల్బీ) (బి) హేలీ 0; గార్డ్నెర్ (సి) కలిత (బి) అమెలియా 8; స్నేహ్ (ఎల్బీ) (బి) నట్ సీవర్ 20; హేమలత (సి) వాంగ్ (బి) అమెలియా 6; సుష్మ (నాటౌట్) 18; గార్త్ (సి) హర్మన్ (బి) నట్ సీవర్ 8; తనూజ (సి) యస్తిక (బి) హేలీ 0; మాన్సి (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–0, 2–34, 3–34, 4–48, 5–48, 6–57, 7–85, 8–95, 9–96. బౌలింగ్: నట్ సీవర్ 4–0–21–3, సయిక 4–0–20–0, ఇసి వాంగ్ 3–0–19–1, హేలీ మాథ్యూస్ 4–0–23–3, అమెలియా కెర్ 4–0–18–2, అమన్జోత్ 1–0–6–0. -
IPL 2022 Playoffs: రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు.. ఫైనల్లో గుజరాత్తో ఢీ
ఆర్సీబీను చిత్తు చేసిన రాజస్తాన్ రాయల్స్.. ఫైనల్లో గుజరాత్తో ఢీ ఐపీఎల్-2022 ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ అడుగు పెట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫైయర్-2లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ సెంచరీతో చేలరేగాడు. 60 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజల్వుడ్ రెండు వికెట్లు,హాసరంగా ఒక వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. బౌల్ట్, అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఆదివారం(మే29) అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ తలపడనుంది. 15 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 126/2 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(75), పడిక్కల్(7), పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 113 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన శాంసన్.. హాసరంగా బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. క్రీజులో బట్లర్(69), పడిక్కల్(1)ఉన్నారు. 8 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 81/1 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(56), శాంసన్(4), పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 61 పరుగుల వద్ద రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన జైశ్వాల్.. హాజిల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 68/1. క్రీజులో బట్లర్(45), శాంసన్ ఉన్నారు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 22/0 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(16), బట్లర్(6) పరుగులతో ఉన్నారు. తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్తాన్ టార్గెట్ 158 పరుగులు 20 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. బౌల్ట్, అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు. 19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 154/7 ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో దినేష్ కార్తీక్, హాసరంగా పెవిలియన్కు చేరారు. 19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 154/7 142 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ను కోల్పోయింది. 8 పరుగులు చేసిన పాటిదార్.. మెకాయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 139/4 17 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో కార్తీక్(5),లోమ్రోర్(7) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 130 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ను కోల్పోయింది. 58 పరుగులు చేసిన పాటిదార్.. అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి దినేష్ కార్తీక్ వచ్చాడు. పాటిదార్ హాఫ్ సెంచరీ 15 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో పాటిదార్ 52, లామోర్ 2 ఉన్నారు. 40 బంతుల్లోనే పాటిదార్ హాఫ్ సెంచరీ సాధించాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 14 వ ఓవర్లో ఆర్సీబీ కీలకమైన మాక్స్వెల్ వికెట్ను కోల్పోయింది. ఇప్పటికే కోహ్లి, డుప్లెసిస్ పెవిలియన్ చేరగా.. బౌల్ట్ బౌలింగ్లో మెకాయ్ క్యాచ్ పట్టడం ద్వారా మాక్సీ (24) వికెట్ సమర్పించుకున్నాడు. సెంచరీకి చేరువగా ఆర్సీబీ 12 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు (కోహ్లి 7, డుప్లెసిస్ 25) వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో పాటిదార్ 41, మాక్స్వెల్ 9 ఉన్నారు. డుప్లెసిస్ (25) ఔట్ ఆర్సీబీ కీలక బ్యాట్స్మన్ డుప్లెసిస్ 11 ఓవర్లో పెలివియన్కు చేరాడు. ఒబెద్ మెకాయ్ బౌలింగ్లో అశ్విన్కు క్యాచ్ ఇచ్చి తన వ్యక్తిగత స్కోరు 25 వద్ద డుప్లెసిస్ ఔట్ అయ్యాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 74-1 డుప్లెసిస్, రజత్ పాటిదార్ కీలకమైన 65 పరుగుల భాగస్వామ్యంతో ఆర్సీబీ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. డుప్లెసిస్ 25 , రజత్ పాటిదార్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 58-1 ఆర్సీబీ బ్యాటర్లు నిలకడగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి బెంగళూరు 58 పరుగులు చేసింది. డుప్లెసిస్ 22, రజత్ పాటిదార్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 37/1 5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(17), పాటిదార్(5) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి ఔట్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఆదిలోనే విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన కోహ్లి.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 13/1 ఐపీఎల్-2022లో భాగంగా క్వాలిఫైయర్-2లో అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్వుడ్, మహ్మద్ సిరాజ్ రాజస్తాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్కాయ్, యుజ్వేంద్ర చాహల్ -
వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే!
ఐపీఎల్ 2022 సీజన్లో లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఇవాళ(మే 24న) క్వాలిఫయర్-1 జరగనుంది. కోల్కతా వేదికగా జరగనున్న మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. గత నాలుగు రోజులుగా కోల్కతా నగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా వర్షం పడే చాన్స్ ఉండడంతో మ్యాచ్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరగనున్న ఈడెన్ గార్డెన్స్లో ఆధునాతన డ్రైనేజీ సౌకర్యం ఉన్నప్పటికి.. మ్యాచ్ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడితే ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నప్పటికి సాయంత్రం వర్షం పడే అవకాశాలు 65 శాతం ఉన్నాయని.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి రెండు గంటల పాటు కుండపోత వర్షం పడే చాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇదే నిజమైతే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారి మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారుతుంది. సమయం లేకపోవడంతో క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే కూడా కేటాయించలేదు. దీంతో మ్యాచ్ రద్దు అయితే ఫైనల్ ఎవరు వెళతారు అనేది ఆసక్తికరంగా మారింది. వర్షం ముప్పుతో ఆటకు అంతరాయం ఏర్పడితే మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. ఎవరికి ఫైనల్ అవకాశాలు ఉంటాయి అనేది పరిశీలిద్దాం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ప్లే ఆఫ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే.. ఏ జట్టు ఫైనల్కు వెళ్లాలనే దానిపై మూడు దారులు ఉన్నాయి. ►మొదటిది.. ఇరుజట్ల మధ్య ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్కు చేరుకుంటారు. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 మ్యాచ్ ద్వారా మరో చాన్స్ ఉంటుంది. ►రెండోది.. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసి.. ఆ తర్వాత మ్యాచ్కు అవకాశం ఉంటే సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేలుస్తారు. ►భారీ వర్షం వల్ల సూపర్ ఓవర్ కూడా సాధ్యపడకపోతే లీగ్లో అత్యధిక విజయాలు సాధించి గ్రూఫ్ టాపర్గా నిలిచిన జట్టు ఫైనల్కు వెళుతుంది. ఇదే జరిగితే గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు.. రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2కు సిద్ధమవుతుంది. ►ఇక ఎలిమినేటర్ మ్యాచ్లోనూ వర్షం అంతరాయం కలిగిస్తే ఇదే పద్దతిని అనుసరిస్తారు. కాకపోతే ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తే.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. వర్షం వల్ల సూపర్ ఓవర్ సాధ్యపడకపోతే.. మూడో స్థానంలో ప్లేఆఫ్కు చేరిన లక్నో సూపర్ జెయింట్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. చదవండి: IND Vs SA T20 Series: ధావన్ ఎంపికలో అన్యాయం.. కేఎల్ రాహుల్ జోక్యంలో నిజమెంత? IPL 2022: ప్లేఆఫ్స్లో మాత్రం ఖచ్చితంగా రాణిస్తాను: జోస్ బట్లర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అరుదైన రికార్డు సాధించిన ఆర్సీబీ.. చెన్నై, ముంబై తర్వాత..!
ఐపీఎల్ 2022 సీజన్లో ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడి అతికష్టం మీద ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన ఆర్సీబీ ఓ అరుదైన రికార్డును సాధించింది. క్యాష్ రిచ్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ (11), ముంబై ఇండియన్స్ (9) తర్వాత అత్యధిక సార్లు (8) ప్లే ఆఫ్స్కు చేరిన మూడో జట్టుగా రికార్డుల్లో నిలిచింది. సీఎస్కే 2008 నుంచి 2015 వరకు వరుసగా 8 సీజన్లు, ఆతర్వాత 2018, 2019, 2021 సీజన్లలో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. ముంబై 2010-2015 వరకు వరుసగా ఆరు సీజన్లు, ఆతర్వాత 2017, 2018, 2021 సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఆర్సీబీ.. 2009-2011 వరకు వరుసగా 3 సీజన్లు, ఆతర్వాత 2015, 2016 సీజన్లు, తిరిగి 2020-2022 వరుసగా మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరుకంది. ఐపీఎల్లో ఆర్సీబీతో సమానంగా సన్రైజర్స్ కూడా 8 సార్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. అయితే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ మినహా మిగిలిన మూడు జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. కాగా, ఐపీఎల్ 2022 సీజన్లో నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన ఆర్సీబీ.. ఎలిమినేటర్ మ్యాచ్లో మూడో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే, ఆతర్వాత రెండో క్వాలిఫైయర్, చివరిగా ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే లీగ్ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన జట్లు, టైటిల్ నెగ్గడం ఒకే ఒక్కసారి జరిగింది. 2016 సీజన్లో లీగ్ స్టేజ్లో మూడో స్థానంలో నిలిచిన సన్రైజర్స్, ఎలిమినేటర్లో కేకేఆర్ని, రెండో క్వాలిఫైయర్లో గుజరాత్ లయన్స్ని ఓడించి ఫైనల్ చేరింది. అనంతరం ఫైనల్లో ఆర్సీబీని మట్టికరిపించి టైటిల్ను సాధించింది. ఐపీఎల్లో సన్రైజర్స్ మినహా ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడిన మిగిలిన జట్లన్నీ రన్నరప్ లేదా మూడు, నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఆర్సీబీ ఇదే రికార్డును తిరగరాయాలని కంకణం కట్టుకుంది. 8 సార్లు ఫ్లేఆఫ్స్ ఆడిన ఆర్సీబీ.. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్కి దూసుకెళ్లినప్పటికీ డెక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: టిమ్ డేవిడ్పై ప్రేమను ఒలకబోస్తున్న ఆర్సీబీ.. వీ లవ్ యు అంటూ..! -
తుఫాను దాటికి ఈడెన్ గార్డెన్స్ కుదేలు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్లేమో అక్కడే!
కోల్కతా నగరాన్ని తుఫాన్ ముంచెత్తింది. శనివారం రాత్రి ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ కుదేలైంది. 90 కిమీ వేగంతో వీసిన ఈదురుగాలుల దాటికి స్టేడియంలోకి ప్రెస్బాక్స్ అద్దాలు, పలు హోర్డింగ్స్, మైదానంలో కప్పి ఉంచిన టార్ఫులిన్ కవర్ ధ్వంసమయ్యాయి. పరిస్థితిని పర్యవేక్షించిన స్టేడియం అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాగా కోల్కతా వేదికగానే ఐపీఎలో రెండు ప్లేఆఫ్ మ్యాచ్లు జరగనున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 24న) గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తొలి క్వాలిఫయర్.. మే 25న(బుధవారం) ఆర్సీబీ, లక్నో సూపర్జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్నాయి. కాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధికారులతో కలిసి ఈడెన్ గార్డెన్ను పరిశీలించారు. ''మ్యాచ్లకు మరో రెండురోజులు సమయం ఉంది. అప్పటివరకు స్టేడియాన్ని రెడీ చేస్తాం. ప్రెస్ బాక్స్లో పగిలిన అద్దాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం వర్షం లేదు.. మాములుగానే ఉంది. మైదానంలోని టార్ఫులిన్ కవర్ను తొలగించి డ్రెయిన్ సిస్టం ఆన్చేశాం. పరిస్థితి పూర్తిగా కంట్రోల్లో ఉంది'' అని క్యాబ్ అధికారులు తెలిపారు. కాగా వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్ విమానం కాస్త ఆలస్యంగా కోల్కతాకు చేరుకుంది. వాస్తవానికి శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో కోల్కతాకు రావాల్సిన విమానం.. భారీ వర్షం కారణంగా ఆటగాళ్లు ప్రయాణించిన విమానం బంగ్లాదేశ్ ఎయిర్స్పేస్లో ల్యాండ్ అయింది. వర్షం ఆగిపోయాకా రెండు గంటల ఆలస్యంగా.. అంటే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కోల్కతా ఎయిర్పోర్ట్కు చచేరుకుంది. ఆటగాళ్లను బస్లో సురక్షితంగా హోటల్ రూంకు తరలించారు. ఇక క్వాలిఫయర్ -2 సహా ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. చదవండి: Jasprit Bumrah: ఐపీఎల్లో తొలి భారత బౌలర్గా బుమ్రా అరుదైన ఫీట్ Eden Gardens damaged after a thunderstorm #Kolkata #Edengardens pic.twitter.com/I2cXOXsCbS — Akash Kharade (@cricaakash) May 22, 2022 -
అశ్విన్, జైశ్వాల్ మెరుపులు.. రాజస్తాన్ రాజసంగా ప్లేఆఫ్స్కు
ముంబై: రాజస్తాన్ రాయల్స్ లక్ష్యఛేదనకు దిగిన తొలి ఓవర్ పూర్తవడంతోనే నెట్ రన్రేట్తో ఈ ఐపీఎల్ సీజన్లో ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల విజయంతో రాజస్తాన్ లీగ్ దశను రెండో స్థానంతో ముగించింది. మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ (57 బంతుల్లో 93; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ప్రదర్శన చేశాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవిచంద్రన్ అశ్విన్ (23 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఆడింది అలీ ఒక్కడే! ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (2), కాన్వే (16) సహా... జగదీశన్ (1), అంబటి రాయుడు (3), ధోని (28 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) ఇలా చెన్నై బ్యాటర్లంతా నిరాశపరిస్తే వన్డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ ఒంటరి పోరాటం చేశాడు. ఇక చెన్నై జోరంతా 4, 5, 6 ఓవర్లలోనే కనిపించింది. ఆ తర్వాత బోర్ కొట్టించింది. ఆ మూడు ఓవర్లయితే అలీ జూలు విదిల్చాడు. ప్రసిధ్ కృష్ణ నాలుగో ఓవర్లో 4, 4, 0, 6, 4, 0లతో 18 పరుగులు పిండుకున్న అలీ... అశ్విన్ ఐదో ఓవర్లో రెండు బౌండరీలు, ఒక సిక్సర్ బాదాడు. ఇక బౌల్ట్ ఆరో ఓవరైతే బంతి ఆరుసార్లూ బౌండరీ లైను దాటింది. 6, 4, 4, 4, 4, 4లతో అలీ శివమెత్తాడు. ఈ ఓవర్లో 26 పరుగులొచ్చాయి. 19 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయింది. పవర్ ప్లేలో చెన్నై స్కోరు 75/1 అయితే అలీ ఒక్కడివే 59 పరుగులుండటం విశేషం. ఆ తర్వాత 14 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి మరో 75 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్ తొలిబంతికే మొయిన్ అవుట్ కావడంతో సెంచరీ చేజారింది. యశస్వి అర్ధ శతకం భారీ లక్ష్యం కాకపోయినా ఛేదించేందుకు రాజస్తాన్ కష్టపడింది. ఆరంభంలోనే బట్లర్ (2) పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సామ్సన్ (15) రెండో వికెట్కు 51 పరుగులు జోడించాక స్వల్ప వ్యవధిలో సామ్సన్తో పాటు పడిక్కల్ (3) కూడా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచిన జైస్వాల్ 39 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. అయితే జట్టు స్కోరు 100 పరుగులు దాటాక జైస్వాల్ను, హెట్మైర్ (6)ని అవుట్ చేసిన సోలంకి రాయల్స్ శిబిరంలో గుబులు రేపాడు. ఈ దశలో అశ్విన్ సిక్సర్లతో ఆపద్భాంధవుడి పాత్ర పోషించి.. పరాగ్ (10 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు. Playoffs Qualification ✅ No. 2⃣ in the Points Table ✅ Congratulations to the @IamSanjuSamson-led @rajasthanroyals. 👏 👏 Scorecard ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK pic.twitter.com/PldbVFTOXo — IndianPremierLeague (@IPL) May 20, 2022 -
IPL 2022 Playoffs: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్.. ఇక ఢిల్లీ గెలిచిందో!
IPL 2022 Playoffs Qualification Scenarios In Telugu: ఐపీఎల్-2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడున ఉండగా.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ రెండింటితో పాటు కోల్కతా నైట్రైడర్స్ ప్రస్థానం కూడా ముగిసింది. ఈ మూడు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అదరగొట్టిన కొత్త జట్లు ఇదిలా ఉంటే.. తాజా ఎడిషన్తో క్యాష్ రిచ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా 20 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. మరో కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్జెయింట్స్ 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో గెలిచి నిలిచింది. రాజస్తాన్ ఎలాగైనా! ఇక ఆది నుంచి మంచి విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రాయల్స్ పదమూడింట 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. రన్రేటు పరంగానూ మెరుగ్గా ఉన్న రాజస్తాన్.. చెన్నై సూపర్కింగ్స్తో శుక్రవారం(మే 20) నాటి మ్యాచ్లో గెలిస్తే టాప్-4లో అడుగుపెట్టడం ఖాయమే! ఇదిలా ఉండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు.. గుజరాత్తో గురువారం(మే 19) జరిగిన మ్యాచ్లో గెలుపొంది.. 16 పాయింట్లు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుని.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. సన్రైజర్స్, పంజాబ్ అవుట్! ఇక ఆర్సీబీ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని ఆశపడిన పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆశలు దాదాపు గల్లంతయినట్లే. ఇప్పటికే పదమూడేసి మ్యాచ్లు ఆడిన పంజాబ్, హైదరాబాద్ ఆరేసి విజయాలతో 12 పాయింట్లు సాధించి వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్రేటు పరంగానూ ఇరు జట్లు(పంజాబ్: -0.043)(హైదరాబాద్:-0.230) వెనుకబడే ఉన్నాయి. కాబట్టి తమకు మిగిలిన మ్యాచ్(హైదరాబాద్ వర్సెస్ పంజాబ్)లో ఏ ఒక్క జట్టు భారీ తేడాతో గెలిచినా.. ఇప్పటికే మిగిలిన జట్లు పటిష్ట స్థితిలో నిలిచిన నేపథ్యంలో ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే! అలా అయితే ఆర్సీబీ కూడా అవుట్! ఇక ఆర్సీబీ విషయానికొస్తే... ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్తో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఎనిమిదో విజయంతో 16 పాయింట్లు సాధించగలిగినా నెట్ రన్రేటు మైనస్(-0.253)లలో ఉండటం డుప్లెసిస్ బృందాన్ని కలవరపరుస్తోంది. ఒకవేళ ముంబైతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గనుక గెలిస్తే ఆర్సీబీని వెనక్కి నెట్టి టాప్-4లో అడుగుపెట్టడం ఖాయం. ఎందుకంటే నెట్ రన్రేటు పరంగా రిషభ్ పంత్ సేన.. ఆర్సీబీ కంటే ఎంతో మెరుగ్గా(0.255)ఉంది. మరోవైపు రాజస్తాన్ సీఎస్కే చేతిలో ఓడినా రన్ రేటు పరంగా పటిష్ట స్థితిలో ఉన్నందున టాప్-4లో చోటు మాత్రం ఖాయం. కాబట్టి ఢిల్లీ.. ముంబై చేతిలో ఓడితేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో అడుగుపెడుతుంది. అలా కాకుండా రాజస్తాన్.. చెన్నై చేతిలో ఓడినా.. ఢిల్లీ గెలిచినా(16 పాయింట్లు వస్తే) నెట్ రన్రేటు పరంగా వెనుకబడి ఉన్న ఆర్సీబీ కథ ముగుస్తుంది. చదవండి👉🏾IPL 2022 RR Vs CSK: సీఎస్కే తుదిజట్టులో అతడిని చూడాలని ఉంది.. ధోని ఒక్క ఛాన్స్ ఇస్తే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 67 as #RCB win by 8 wickets and are now 4th on the #TATAIPL Points Table. Scorecard - https://t.co/TzcNzbrVwI #RCBvGT #TATAIPL pic.twitter.com/K7uz6q15qQ — IndianPremierLeague (@IPL) May 19, 2022 -
IPL 2022: ముంబైపై ఢిల్లీ గెలిచిందా.. ఆ నాలుగు జట్ల పని గోవిందా..!
ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ సమీకరణలు రసవత్తరంగా మారాయి. నిన్న (మే 16) పంజాబ్ను ఢిల్లీ మట్టికరిపించడంతో సమీకరణలు మారిపోయాయి. 20 పాయింట్లు కలిగిన గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫర్మ్ చేసుకున్న ఏకైక జట్టు కాగా.. టెక్నికల్గా రాజస్థాన్ (16), లక్నో (16), ఢిల్లీ (14), ఆర్సీబీ (14), కేకేఆర్ (12), పంజాబ్ (12), సన్రైజర్స్ (10) జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. షెడ్యూల్ ప్రకారం ఈ జట్లన్నీ మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. సన్రైజర్స్ ఒక్కటే రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో రాజస్థాన్ (0.304), లక్నో (0.262) జట్లు మెరుగైన రన్రేట్తో పాటు 16 పాయింట్లు కలిగి సేఫ్ సైడ్లో ఉండగా.. మిగతా ఐదు జట్ల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొని ఉంది. ఈ ఐదు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆర్సీబీతో సమానంగా 14 పాయింట్లు కలిగిన ఢిల్లీకే ప్లే ఆఫ్స్కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్సీబీ (-0.323)తో పోలిస్తే ఢిల్లీ (0.255) రన్రేట్ మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. - ఇవాళ (మే 17) ముంబై చేతిలో ఓడితే సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ముంబైపై సన్రైజర్స్ భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. - మే18న లక్నోపై కేకేఆర్ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఒక వేళ ఓడిందా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. - మే 19న గుజరాత్పై ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తేనే రన్రేట్ మెరుగుపర్చుకోవడంతో పాటు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. - మే 20న సీఎస్కేపై రాజస్థాన్ గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్కు చేరుతుంది. ఒకవేళ రాజస్థాన్ ఓ మోస్తరు తేడాతో ఓడినా మెరుగైన రన్రేట్ కారణంగా సేఫ్ సైడ్లోనే ఉంటుంది. - మే 21న ముంబైపై ఢిల్లీ భారీ తేడాతో విజయం సాధిస్తే.. మెరుగైన రన్రేట్ కారణంగా ఆర్సీబీని వెనక్కునెట్టి ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఈ దెబ్బతో ఆర్సీబీ సహా కేకేఆర్, పంజాబ్, సన్రైజర్స్ జట్లు ఇంటికి చేరతాయి. ఒక వేళ ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరుతుంది. - ఒకవేళ ముంబైపై సన్రైజర్స్ గెలిచి, లక్నోపై కేకేఆర్ గెలిచి, గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓడి, ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే మాత్రం మే 22న జరిగే సన్రైజర్స్- పంజాబ్ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే ఢిల్లీ, ఆర్సీబీ, కేకేఆర్లతో సమానంగా (14 పాయింట్లు) నిలుస్తుంది. సన్రైజర్స్ నిష్క్రమిస్తుంది. - ఆఖరి మ్యాచ్తో సంబంధం లేకుండా 16 పాయింట్లతో రాజస్థాన్, లక్నోలు దర్జాగా ప్లే ఆఫ్స్కు చేరుకుంటే.. ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, కేకేఆర్ జట్లలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు చివరి ప్లే ఆఫ్స్ బెర్తును దక్కించుకుంటుంది. చదవండి: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్.. ఇరు జట్లలో భారీ మార్పులు..! -
ఆర్సీబీ ఫైనల్స్కు చేరడం పక్కా.. ఆధారాలివిగో అంటున్న ఫ్యాన్స్..!
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి యేటా ‘గో గ్రీన్’ నినాదంతో ఓ మ్యాచ్కు గ్రీన్ కలర్ జెర్సీలతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రంగు జెర్సీలు తమ ఆటగాళ్లకు అచ్చి రావట్లేదన్న సెంటిమెంట్ను ఆ జట్టు అభిమానులు బలంగా నమ్ముతారు. ఈ సీజన్కు ముందు వరకు ఆర్సీబీ గ్రీన్ జెర్సీల్లో ఆడిన 10 మ్యాచ్ల్లో ఏడింటిలో (2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020) ఓటమిపాలవ్వగా.. రెండు మ్యాచ్ల్లో (2011, 2016) విజయాలు, మరో మ్యాచ్ (2015) వర్షం కారణంగా రద్దైంది. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గ్రీన్ కలర్ జెర్సీల్లో బరిలో దిగిన ఆర్సీబీ.. ఆరెంజ్ ఆర్మీని 67 పరుగుల తేడాతో చిత్తు చేసి సీజన్లో ఏడో విజయంతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఆ జట్టు అభిమానులు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతంలో తమ జట్టు గ్రీన్ కలర్ జెర్సీల్లో గెలిచిన సీజన్లలో ఫైనల్స్కు చేరిందని, దీంతో ఈ సీజన్లోనూ డుప్లెసిస్ సేన పక్కాగా ఫైనల్స్కు చేరుతుందని బల్ల గుద్ది చెబుతున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది తమ జట్టు పాత ఆనవాయితీకి కూడా చరమగీతం పాడి టైటిల్ను ఎగురేసుకుపోతుందని ధీమాగా ఉన్నారు. కాగా, ఆర్సీబీ తొలిసారి గ్రీన్ కలర్ జెర్సీల్లో బరిలోకి దిగిన 2011 సీజన్లో డేనియల్ వెటోరీ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్స్కు చేరింది. అయితే ఫైనల్స్లో సీఎస్కే చేతుల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2016 సీజన్లోనూ విరాట్ కోహ్లి నేతృత్వంలో ఫైనల్స్కు చేరినప్పటికీ తుది సమరంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో కనీసం ఓ మ్యాచ్లోనైనా గెలవాల్సి ఉంటుంది. ఇతర జట్లతో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్రేట్ తక్కువగా ఉండడంతో మిగిలిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్కి అర్హత సాధిస్తుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ల్లో మే 13న పంజాబ్ కింగ్స్తో, మే 19న గుజరాత్ టైటాన్స్తో తలపడాల్సి ఉంది. చదవండి: T20 WC 2021: రిజ్వాన్కు ఆ నిషేధిత మెడిసిన్ ఇచ్చాం: పీసీబీ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్లే ఆఫ్స్లో చోటు దక్కేది ఎవరికి?
ఐపీఎల్ 2022 సీజన్ ముగింపుకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే సీజన్లో పది జట్లు కనీసం 9 లేదా 10 మ్యాచ్లు ఆడాయి. పోటీలో 10 జట్లు ఉన్నప్పటికి.. ఆఖరికి ప్లే ఆఫ్స్ చేరేది నాలుగు జట్లు మాత్రమే. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఆడిన 9 మ్యాచ్ల్లో ఒకటి మాత్రమే గెలిచి.. మిగతా ఎనిమిదింటిలో ఓడి ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. ఇక సీఎస్కే కూడా 10 మ్యాచ్ల్లో 3 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. సీఎస్కే కూడా దాదాపు ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయినట్లే. మిగిలిన జట్ల పరిస్థితి ఒకసారి పరిశీలిద్దాం. గుజరాత్ టైటాన్స్: టాప్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది. 10 మ్యాచ్ల్లో 8 విజయాలు.. రెండు ఓటములతో 16 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్.. తాను ఆడే నాలుగు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు దర్ఝాగా ప్లేఆఫ్ చేరుతుంది. లక్నో సూపర్జెయింట్స్: లక్నో సూపర్ జెయింట్స్ 10 మ్యాచ్ల్లో ఏడు విజయాలు.. మూడు ఓటములతో 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లక్నో ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఒకటి గెలిస్తే చాలు.. అయితే రెండు అంతకంటే ఎక్కువ గెలిస్తే తొలి రెండు స్థానాల్లోనే ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. తొలి ప్లేఆఫ్లో ఓడినప్పటికి ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా రెండో ప్లే ఆఫ్ ఆడే అవకాశం ఉంటుంది. రాజస్తాన్ రాయల్స్: రాజస్తాన్ రాయల్స్ 10 మ్యాచ్ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. లక్నో ప్లే ఆఫ్ చేరాలంటే కచ్చితంగా మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కనీసం రెండు మ్యాచ్లు గెలవాల్సిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్ల్లో ఆరు విజయాలు.. ఐదు ఓటములతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఆర్సీబీ ప్లేఆఫ్ చేరాలంటే నాలుగు మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలవాల్సిందే. ఎస్ఆర్హెచ్: ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్ల్లో ఐదు విజయాలు.. 4 ఓటములతో 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్లో చేరాలంటే ఎస్ఆర్హెచ్ మూడు మ్యాచ్లు గెలవాల్సిందే. పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో ఐదు విజయాలు, ఐదు ఓటములతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ చేరాలంటే నాలుగు మ్యాచ్ల్లో కనీసం మూడు గెలవాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 9 మ్యాచ్లో నాలుగు విజయాలు, ఐదు ఓటములతో 8 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు గెలవాల్సిందే. కేకేఆర్: కేకేఆర్కు ప్లేఆఫ్ అవకాశాలు చాలా తక్కువ. 10 మ్యాచ్ల్లో 4 విజయాలు.. ఆరు ఓటములతో 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కచ్చితంగా అన్నీ గెలవాల్సిందే. -
ఐపీఎల్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పిన బీసీసీఐ..!
IPL 2022: ఐపీఎల్-2022 ప్లే ఆఫ్స్కు సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మే 24న క్వాలిఫయర్–1 మ్యాచ్... మే 25న కోల్కతాలోనే ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతాయి. ఒక రోజు విరామం తర్వాత మే 27న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్–2 మ్యాచ్... మే 29న ఫైనల్ నిర్వహిస్తారు. మరోవైపు ప్లే ఆఫ్ దశ మ్యాచ్లకు 100 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నామని బీసీసీఐ తెలిపింది. ఇక ఐపీఎల్ సీజన్ 15వ ఆసక్తికరంగా సాగుతోంది. ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి, రెండు స్థానాల్లో గుజరాత్, లక్నో నిలిచాయి. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కే, 5 సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఈసారి తీవ్రంగా నిరాశ పరిచాయి. చదవండి: IPL 2022: లివింగ్స్టోన్ విధ్వంసం.. ఐపీఎల్ 2022లోనే భారీ సిక్సర్.. వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెండో స్థానానికి ఎగబాకిన లక్నో.. ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు
LSG VS DC: వాంఖడే వేదికగా ఇవాళ (మే 1) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలక సమరంలో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో రాహుల్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ హుడా (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, సిక్స్), బౌలింగ్లో మోహిసిన్ ఖాన్ (4/16) రాణించడంతో లక్నో సూపర్ విక్టరీ సాధించడంతో పాటు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన రాహుల్ సేన 7 విజయాలు, 3 పరాజయాలతో 0.397 రన్రేట్ కలిగి ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లక్నో.. మ్యాచ్ మ్యాచ్కు రాటు దేలుతూ టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. ఇక లక్నో తరహాలోనే అండర్ డాగ్గా బరిలోకి దిగిన మరో న్యూ ఎంట్రీ గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో అద్భుతాలు జరిగి ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్ల్లో ఓటమిపాలైతే తప్ప ఈ సమీకరణలు మారకపోవచ్చు. గుజరాత్.. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 8 విజయాలు, ఓ పరాజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో కొనసాగుతుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్, లక్నో జట్ల తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (9 మ్యాచ్ల్లో 6 విజయాలు, 3 పరాజయాలతో 12 పాయింట్లు), సన్రైజర్స్ (8 మ్యాచ్ల్లో 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు), ఆర్సీబీ (10 మ్యాచ్ల్లో 5 విజయాలు, 5 పరాజయాలతో 10 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (9 మ్యాచ్ల్లో 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు), పంజాబ్ (9 మ్యాచ్ల్లో 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు), కేకేఆర్ (9 మ్యాచ్ల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో 6 పాయింట్లు), చెన్నై (8 మ్యాచ్ల్లో 2 విజయాలు, 6 పరాజయాలతో 4 పాయింట్లు), ముంబై (9 మ్యాచ్ల్లో ఓ విజయం, 8 పరాజయాలతో 2 పాయింట్లు) జట్లు వరుసగా ఉన్నాయి. చదవండి: అమెరికాలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్న కింగ్ ఖాన్ -
గుజరాత్ ఘనంగా...
ముంబై: ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఏ సీజన్లో కూడా ఏ జట్టయిన ఆడిన తొలి 9 మ్యాచ్లలో 8 విజయాలు సాధించలేదు! కానీ తొలిసారి గుజరాత్ టైటాన్స్ దానిని చేసి చూపించింది. మరోసారి సమష్టి ప్రదర్శనతో చక్కటి ఆటతీరు కనబర్చిన గుజరాత్ వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. తొలి మూడు మ్యాచ్లు గెలిచాక సన్రైజర్స్ చేతిలో ఓడిన టీమ్ ఆ తర్వాత మళ్లీ ఓటమి రుచి చూడకుండా సత్తా చాటుతూ ఇప్పుడు 8వ గెలుపును తమ ఖాతాలో వేసుకొని ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వరుస వైఫల్యాలకు ఫుల్స్టాప్ పెడుతూ కోహ్లి (53 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా ఆకట్టుకున్నాడు. మ్యాక్స్వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. అనంతరం టైటా న్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ తెవా టియా (25 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. కోహ్లి అర్ధ సెంచరీ... నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ప్రదీప్ సాంగ్వాన్ తన తొలి ఓవర్లోనే డుప్లెసిస్ (0)ను వెనక్కి పంపాడు. ఈ దశలో కోహ్లి, పటిదార్ రెండో వికెట్కు 99 పరుగులు (74 బంతుల్లో) జోడించి జట్టును ఆదుకున్నారు. ఒత్తిడిలో ఉన్న కోహ్లికంటే పటిదార్ స్వేచ్ఛగా, వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 45 బంతుల్లో కోహ్లి, 29 బంతుల్లో పటిదార్ అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... షమీ ఓవర్లో రెండు సిక్స్లతో మ్యాక్స్వెల్ దూకుడు ప్రదర్శించాడు. రాణించిన ఓపెనర్లు... ఛేదనలో గుజరాత్కు శుభారంభం లభించింది. వృద్ధిమాన్ సాహా (22 బంతుల్లో 29; 4 ఫోర్లు), గిల్ కలిసి తొలి వికెట్కు 45 బంతుల్లో 51 పరుగులు జోడించారు. అయితే బెంగళూరు బౌలర్లు రాణించడంతో తక్కువ వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్ స్కోరు 95/4 వద్ద నిలిచింది. 43 బంతుల్లో 76 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో ఆర్సీబీ గెలుపుపై కన్నేసింది. అయితే ధాటిగా ఆడిన మిల్లర్, తెవాటియా ఆ అవకాశం ఇవ్వలేదు. ఒత్తిడిలోనూ తగ్గకుండా చక్కటి షాట్లతో ఈ ద్వయం 40 బంతుల్లోనే అభేద్యంగా 79 పరుగులు జోడించి మరో 3 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ను గెలిపించింది. ఈ భాగస్వామ్యంలో వీరిద్దరు కలిసి 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదడం విశేషం. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) షమీ 58; డుప్లెసిస్ (సి) సాహా (బి) సాంగ్వాన్ 0; పటిదార్ (సి) గిల్ (బి) సాంగ్వాన్ 52; మ్యాక్స్వెల్ (సి) రషీద్ (బి) ఫెర్గూసన్ 33; దినేశ్ కార్తీక్ (సి) షమీ (బి) రషీద్ 2; షహబాజ్ (నాటౌట్) 2; లోమ్రోర్ (సి) మిల్లర్ (బి) జోసెఫ్ 16; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–11, 2–110, 3–129, 4–138, 5–150, 6–170. బౌలింగ్: షమీ 4–0–39–1, సాంగ్వాన్ 4–0–19–2, జోసెఫ్ 4–0–42–1, రషీద్ 4–0–29–1, ఫెర్గూసన్ 4–0–36–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) పటిదార్ (బి) హసరంగ 29; గిల్ (ఎల్బీ) (బి) షహబాజ్ 31; సుదర్శన్ (సి) (సబ్) రావత్ (బి) హసరంగ 20; హార్దిక్ (సి) లోమ్రోర్ (బి) షహబాజ్ 3; మిల్లర్ (నాటౌట్) 39; తెవాటియా (నాటౌట్) 43; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–51, 2–68, 3–78, 4–95. బౌలింగ్: మ్యాక్స్వెల్ 1–0–10–0, సిరాజ్ 4–0–35–0, హాజల్వుడ్ 3.3–0–36–0, షహబాజ్ 3–0–26–2, హర్షల్ 4–0–35–0, హసరంగ 4–0–28–2. ఐపీఎల్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ X చెన్నై సూపర్ కింగ్స్ వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
IPL 2022: ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు..
ఐపీఎల్ 15వ సీజన్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే సీజన్లో 35 మ్యాచ్లు పూర్తవ్వగా.. మరో 35 లీగ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆదివారం ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ జరగబోయే వేదికలను ఖరారు చేసింది. మే 24, 26 తేదీల్లో జరగనున్న క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లకు కోల్కతా ఆతిథ్యమివ్వనుండగా.. మే 27న జరగనున్న క్వాలిఫయర్ 2తో పాటు.. మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని అధ్యక్షుడు గంగూలీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్కు వంద శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. మే 22 వరకు జరగనున్న లీగ్ మ్యాచ్లకు ముందుగా నిర్ణయించినట్లుగానే 50శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంది. ఇక మహిళల టి20 చాలెంజర్స్పై కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మే 24-28 మధ్య లక్నో వేదికగా మూడు జట్లతో మహిళల టి20 చాలెంజర్స్ టోర్నీ నిర్వహించనుంది. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో 35 మ్యాచ్లు జరగ్గా.. మరో 35 లీగ్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ తొలి నాలుగు స్థానాల్లో నిలవగా.. లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు, ఆరు.. కేకేఆర్, పంజాబ్.. ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఇక ముంబై ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడి ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేక ఆఖరి స్థానానికి పరిమితం కాగా.. గతేడాది చాంపియన్ సీఎస్కే తొమ్మిదో స్థానంలో ఉంది. మరో 35 మ్యాచ్లు మిగిలిఉన్న నేపథ్యంలో తొలి నాలుగు స్థానాల్లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉంది. చదవండి: IPL 2022: ఏప్రిల్ 23.. ఆర్సీబీకి కలిసిరాని రోజు Kohli Golden Duck: మేము చూస్తున్నది కోహ్లిని కాదు.. ఇంకెవరో! -
వరుసగా ఐదు ఓటములు.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు చేరాలంటే.?
ఐపీఎల్ చరిత్రలో తిరుగులేని జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 15వ సీజన్లో ఘోరంగా విఫలమైంది. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో ముంబై బోణి కొట్టలేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ముంబై బ్యాటింగ్ పరంగా రాణిస్తున్నప్పటికీ.. బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపడంలేదు. ఇక ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందా అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. కాగా ఐపీఎల్-2014లో కూడా వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓటమి చెందిన ముంబై ... పడి లేచిన కెరటంలా వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్స్కు చేరుకుంది.. అయితే ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందని కొంత మంది అభిప్రాయపడుతుండగా... మరి కొంత మంది ముంబై పని అయిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్లకు అర్హత సాధించాలంటే.. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మరో 9 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. 9 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు విజయం సాధిస్తానే ముంబై ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. కాగా ముంబై మరో ఓటమి చవిచూస్తే.. వారి ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఇక పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. ముంబై జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ సింగ్, అన్మోల్ప్రీత్ , సంజయ్ యాదవ్, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే, టిమ్ డేవిడ్, ఆర్యన్ జుయల్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, రాహుల్ బుద్ధి, అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్ చదవండి: IPL 2022 PBKS Vs MI: దటీజ్ జానియర్ 'ఏబీ'.. ఐపీఎల్ 2022లోనే భారీ సిక్సర్.. వైరల్ -
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తెలుగు టైటాన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా 38–30 పాయింట్ల తేడాతో గెలిచింది. 19 మ్యాచ్లు ఆడిన పట్నా 14 మ్యాచ్ల్లో గెలిచి 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్లో 15వ పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్ 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. పట్నాతో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ మరోసారి రాణించి 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో అతను వంద వ్యక్తిగత రెయిడింగ్ పాయింట్లను పూర్తి చేసుకున్నాడు. పట్నా పైరేట్స్ తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 44–28తో దబంగ్ ఢిల్లీపై నెగ్గగా... గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ 31–31తో ‘టై’గా ముగిసింది. -
CSK Vs DC Qualifier 1: ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్..ఫైనల్స్కు చేరిన చెన్నై..
ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్..ఫైనల్స్కు చేరిన చెన్నై.. ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి చెన్నై ఫైనల్లో అడుగు పెట్టింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే డుప్లిసిస్ వికెట్ కోల్పోయింది. ఆనంతరం బ్యాటింగ్ వచ్చిన రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఊతప్ప 44 బంతుల్లో 7 ఫోర్లు, 63 పరుగులు చేసి టామ్ కుర్రాన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అనంతరం 4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్ కరన్ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్కు చేరగా, రబాడా బౌలింగ్లో అంబటి రాయుడు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో మొయిన్ ఆలీ ఓ ఫోర్, ధోనీ ఓ సిక్సర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. టామ్ కరన్ వేసిన అఖరి ఓవర్లో 13 పరుగుల కావల్సిన సమయంలో తొలి బంతికి మొయిన్ ఆలీ ఔట్ అవ్వగా, వరుసగా 3 ఫోర్లు బాది ధోని చెన్నైను విజయతీరాలకు చేర్చాడు. ధోని కేవలం 6 బంతుల్లో 3ఫోర్లు 1 సిక్స్తో 18 పరుగులు సాధించాడు. అంతక ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్లతో 60 పరుగులు సాధించాడు. పృథ్వీ ఔటయ్యాక రిషబ్ పంత్(50), షిమ్రాన్ హెట్మైర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ సాధించారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన చెన్నై.. 4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్ కరన్ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్కు చేరగా, రబాడా బౌలింగ్లో అంబటి రాయుడు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 15 ముగిసే సరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(52),మొయిన్ అలీ(1) పరుగులతో ఉన్నారు. కాగా చెన్నై విజయానికి 30 బంతుల్లో 52 పరుగులు కావాలి. రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. ఊతప్ప(63) ఔట్ 113 పరుగుల వద్ద ఊతప్ప రూపంలో చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. టామ్ కరన్ బౌలింగ్లో ఊతప్ప(63) శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నిలకడగా ఆడుతున్న చెన్నై.. 10 ఓవర్లకు 94/1 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిలకడగా ఆడుతుంది. ఆదిలోనే డుప్లెసిస్ వికెట్ కోల్పోయినప్పటకీ రాబిన్ ఉతప్ప(51), రుతురాజ్ గైక్వాడ్(43) ఇద్దరూ నిలకడగా ఆడుతూ చెన్నై స్కోర్ బోర్డును చక్కదిద్దారు. 11.3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. చెన్నైకు బిగ్ షాక్.. డు ప్లెసిస్(1) ఔట్ 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ కేవలం 1 పరుగుకే నోర్జ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాబిన్ ఉతప్ప(10), రుతురాజ్ గైక్వాడ్(3) పరుగులతో ఉన్నారు. Photo Courtesy: IPL మెరిసిన పృథ్వీ షా.. చెన్నై టార్గెట్ 173 ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్లతో 60 పరుగులు సాధించాడు. పృథ్వీ ఔటయ్యాక రిషబ్ పంత్(50), షిమ్రాన్ హెట్మైర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో జోష్ హాజెల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ సాధించారు. నాలగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా (60) ఔట్ సీఎస్కే జరగుతున్న మ్యాచ్లో అర్ధసెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న పృథ్వీ షా వికెట్ను ఢిల్లీ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన పృథ్వీ షా, డు ప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కాగా పృథ్వీ 34 బంతుల్లో 7 ఫోర్లు , 2 సిక్స్లతో 60 పరుగులు సాధించాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(7), షిమ్రాన్ హెట్మైర్(7) పరుగలుతో ఉన్నారు మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. అక్షర్ పటేల్ (10) ఔట్ 77 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.మొయిన్ అలీ బౌలింగ్లో అక్షర్ పటేల్ (10), సాంటినర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..అయ్యర్(1) ఔట్ 51 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ కేవలం (1) పరుగు మాత్రమే చేసి జోష్ హాజెల్వుడ్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 7 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 60 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42), అక్షర్ పటేల్(6) పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధావన్(7) ఔట్ ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్లో భాగంగా సీఎస్కే జరగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ధావన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ధావన్, హాజెల్వుడ్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కాగా మరో ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 42 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42),శ్రేయస్ అయ్యర్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. Chennai Super Kings & Delhi Qualifier 1 Highlights: ఐపీఎల్ 2021లో భాగంగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ ఆసక్తికరమైన సమరానికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి అర్హత సాధించనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో రెండు జట్లు ఇప్పటి వరకూ 25 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడ్డాయి. 15మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. మిగిలిన 10 మ్యాచ్ల్లో ఢిల్లీ గెలిచింది. కాగా ప్రస్తుత సీజన్ లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్ల్లోను చెన్నైని ఢిల్లీ చిత్తుగా ఓడించింది. తుది జట్లు: చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్వుడ్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), టామ్ కరన్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్ చదవండి: 'ప్లీజ్ అన్న.. ఎస్ఆర్హెచ్లోనే ఉండవా'.. వార్నర్ ఫన్నీ రిప్లై -
పంజాబ్కో గెలుపు
విజయానికి అత్యంత చేరువగా రావడం... చివరకు ఒత్తిడిలో ఓటమిని ఆహా్వనించడం అలవాటుగా మార్చుకున్న పంజాబ్ జట్టు ఈసారి అలాంటి క్షణాలను అధిగమించి బయటపడింది. ఆఖర్లో కొంత అదృష్టం కూడా కలిసి రావడంతో కింగ్స్ ఖాతాలో ఒక విజయం చేరింది. శుభారంభం లభించినా కోల్కతా నైట్రైడర్స్ సాధారణ స్కోరుకే పరిమితం కాగా... కెపె్టన్ కేఎల్ రాహుల్ ముందుండి పంజాబ్ టీమ్ను నడిపించాడు. అతనికి షారుఖ్ ఇచి్చన సహకారం ప్రీతిజింటా టీమ్లో ఆనందం నింపింది. మరోవైపు పంజాబ్ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైంది. దుబాయ్: ఐపీఎల్లో ని్రష్కమణకు చేరువగా వచ్చిన దశలో పంజాబ్ కింగ్స్కు కీలక గెలుపు దక్కింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్లతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. ముందుగా కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (49 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రాహుల్ త్రిపాఠి (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అర్ష్దీప్ 3 వికెట్లు, రవి బిష్ణోయ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (55 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. కీలక భాగస్వామ్యం... అలెన్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో వెంకటేశ్ శుభారంభం అందించినా... తర్వాతి ఓవర్లోనే శుబ్మన్ గిల్ (7) బౌల్డ్తో కోల్కతా తొలి వికెట్ కోల్పోయింది. అయితే వెంకటేశ్, త్రిపాఠి రెండో వికెట్ భాగస్వామ్యంతో జట్టు స్కోరు వేగంగా సాగింది. ఎలిస్ వేసిన మూడు ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టడం విశేషం. రెండో వికెట్కు 55 బంతుల్లో 72 పరుగులు జోడించిన అనంతరం త్రిపాఠి డగౌట్ చేరాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంకటేశ్ కొద్ది సేపటికే భారీ షాట్కు ప్రయతి్నంచి అవుటయ్యాడు. మోర్గాన్ (2), దినేశ్ కార్తీక్ (11), సీఫెర్ట్ (2) విఫలం కావడంతో చివర్లో కోల్కతా ఎక్కువ పరుగులు సాధించలేకపోయింది. రాహుల్ అర్ధ సెంచరీ... తాను ఎదుర్కొన్న తొలి బంతికే మోర్గాన్ సులువైన క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మయాంక్ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. సౌతీ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన అతను నరైన్ ఓవర్లో కూడా మరో సిక్సర్ కొట్టడంతో 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి బంతితో మయాంక్కు బోల్తా కొట్టించిన వరుణ్, తన తర్వాతి ఓవర్లోనే పూరన్ (12)ను కూడా అవుట్ చేశాడు. మార్క్రమ్ (18), హుడా (3) ప్రభావం చూపలేకపోయారు. గత మ్యాచ్లలో జట్టు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాహుల్ వేగంగా ఆడకపోయినా చివరి వరకు క్రీజ్లో నిలిచి జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. విజయానికి 4 పరుగుల దూరంలో రాహుల్ వెనుదిరిగినా... మిగిలిన పనిని షారుఖ్ ఖాన్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) హుడా (బి) బిష్ణోయ్ 67; గిల్ (బి) అర్ష్దీప్ 7; త్రిపాఠి (సి) హుడా (బి) బిష్ణోయ్ 34; రాణా (సి) మయాంక్ (బి) అర్ష్దీప్ 31; మోర్గాన్ (ఎల్బీ) (బి) షమీ 2; కార్తీక్ (బి) అర్ష్దీప్ 11; సీఫెర్ట్ (రనౌట్) 2; నరైన్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 8, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–18, 2–90, 3–120, 4–124, 5–149, 6–156, 7–165. బౌలింగ్: అలెన్ 4–0–38–0, షమీ 4–0–23–1, అర్ష్దీప్ 4–0–32–3, ఎలిస్ 4–0–46–0, రవి బిష్ణోయ్ 4–0–22–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మావి (బి) అయ్యర్ 67; మయాంక్ (సి) మోర్గాన్ (బి) వరుణ్ 40; పూరన్ (సి) మావి (బి) వరుణ్ 12; మార్క్రమ్ (సి) గిల్ (బి) నరైన్ 18; హుడా (సి) త్రిపాఠి (బి) మావి 3; షారుఖ్ (నాటౌట్) 22; అలెన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6, మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–70, 2–84, 3–129, 4–134, 5–162. బౌలింగ్: సౌతీ 4–0–40–0, శివమ్ మావి 4–0–31–1, వరుణ్ 4–0–24–2, నరైన్ 4–0–34–1, వెంకటేశ్ 2.3–0–30–1, రాణా 1–0–7–0. -
మహిళల టి20 చాలెంజ్ వాయిదా!
ముంబై: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో జరగాల్సిన మహిళల టి20 చాలెంజ్ టోర్నీ ఈసారి నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్గత సమాచారం ప్రకారం ఈ టోర్నీని వాయిదా వేయనున్నారు. భారత్లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో ఈ టోర్నమెంట్ను నిర్వహించడం సాధ్యం కాదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్కు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు ఎవరూ ఈ టోర్నీకి వచ్చే అవకాశాలు లేవు. ఆస్ట్రేలియా ఇప్పటికే విమానాలు రద్దు చేయగా, ఇంగ్లండ్ కూడా తమ రెడ్లిస్ట్లో భారత్ను పెట్టింది. మహిళల చాలెంజ్ టోర్నీ వేదికగా నిర్ణయించిన న్యూఢిల్లీలో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడితే తగిన అవకాశాన్ని బట్టి టోర్నీ జరగవచ్చని బోర్డు కీలక సభ్యుడొకరు వెల్లడించారు. 2019, 2020లలో మూడు జట్లు వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీలో గత ఏడాది 12 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొన్నారు. దుబాయ్ వేదికగా గత ఏడాది జరిగిన ఈ టోర్నీలో స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజేతగా నిలిచింది. -
ఐపీఎల్ 2020: ఫైనల్ దారిలో...
ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగుసార్లు చాంపియన్గా నిలిచిన జట్టు ఒకవైపు... పుష్కర కాలం ప్రయత్నించినా కనీసం ఒక్కసారి కూడా ఫైనల్కు చేరని జట్టు మరోవైపు... ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ అగ్రస్థానానికి చేరిన జట్టుకు, తడబడుతూనే చివరకు రెండో స్థానంలో నిలవగలిగిన టీమ్కు మధ్య కీలక మ్యాచ్... 56 మ్యాచ్ల లీగ్ దశ తర్వాత ఐపీఎల్లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. టైటిల్ పోరుకు అర్హత సాధించే తొలి జట్టు ఏదో తేల్చే మ్యాచ్లో నేడు ముంబై, ఢిల్లీ తలపడనున్నాయి. గెలిచిన టీమ్ ఫైనల్ చేరితే... ఓడిన జట్టుకు వెంటనే నిష్క్రమించకుండా ఆదివారం రెండో క్వాలిఫయర్లో ఆడే మరో అవకాశం మిగిలే ఉంటుంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2020) లీగ్ దశను దాటి ప్లే ఆఫ్స్కు చేరింది. నేడు జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఒకసారి పరాజయం సహా ముంబై జట్టు ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐదుసార్లు ఫైనల్ చేరగా... తొలి సీజన్ నుంచి ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్కే పరిమితమైంది. తాజా ఫామ్, బలాబలాలపరంగా చూస్తే ముంబైదే పైచేయిగా కనిపిస్తున్నా... లీగ్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఢిల్లీని కూడా తక్కువగా అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరం ఖాయం. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ప్రదర్శన: సీజన్లో ఢిల్లీ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగింది. 14 లీగ్ మ్యాచ్లలో 8 గెలిచి, 6 ఓడింది. అయితే తొలి 9 మ్యాచ్లలో 7 గెలిచి ఊపు మీద కనిపించిన టీమ్ ఒక్కసారిగా తడబడింది. వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైన తర్వాత చివరకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చాటి ముందంజ వేసింది. బలం: తొలి మ్యాచ్ నుంచి కూడా ఢిల్లీ సమష్టి ప్రదర్శనతోనే నెగ్గింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ప్రధాన ఆటగాళ్లంతా తమ వంతు పాత్ర పోషించారు. 525 పరుగులతో ధావన్ అగ్రస్థానంలో నిలవగా, వేర్వేరు మ్యాచ్లలో అయ్యర్, స్టొయినిస్, పంత్ సహకరించారు. బౌలింగ్లో రబడ, నోర్జే ప్రదర్శన జట్టుకు విజయాలు అందించాయి. రబడ 25 వికెట్లతో టోర్నీలోనే టాపర్గా ఉన్నాడు. అక్షర్ పటేల్ లీగ్లో అత్యంత పొదుపైన బౌలర్లలో ఒకడిగా నిలవగా, సీనియర్ అశ్విన్ ఏ రోజైనా తన అనుభవంతో ప్రత్యర్థిని పడగొట్టగలడు. బలహీనత: నాలుగు వరుస పరాజయాలు ఢిల్లీ బ్యాటింగ్ బలహీనతను చూపించాయి. ప్రత్యర్థిపై ఒక్కసారిగా విరుచుకుపడే విధ్వంసక ఆటగాళ్లు జట్టులో లేరు. ముఖ్యంగా టోర్నీ ఆసాంతం ఓపెనింగ్ పేలవంగా సాగింది. పంత్, పృథ్వీ షా అనుకున్న స్థాయిలో ఆడకపోగా, స్టొయినిస్ ఆరంభ మ్యాచ్ల తర్వాత వరుస వైఫల్యాలు కొనసాగించాడు. వికెట్లు తీసినా, రబడ బౌలింగ్లో భారీగా పరుగులు కూడా వచ్చాయి. రహానే స్ట్రయిక్రేట్ మరీ పేలవంగా ఉండటంతో జట్టు అతడిని నమ్మలేని పరిస్థితి. తుది జట్టు (అంచనా): శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, ధావన్, రహానే, పంత్, స్టొయినిస్, అక్షర్, అశ్విన్, స్యామ్స్/హెట్మైర్, రబడ, నోర్జే. ముంబై ఇండియన్స్ టోర్నీలో ప్రదర్శన: 14 లీగ్ మ్యాచ్లలో 9 గెలిచి, 5 ఓడింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చివరి మ్యాచ్లో ఎదురైన పరాజయాన్ని తప్పిస్తే... ముంబై రెండుసార్లు సూపర్ ఓవర్లోనే ఓటమి పాలైంది. మిగిలిన రెండు మ్యాచ్లలో కూడా ఆ జట్టు మెరుగైన స్కోర్లే సాధించింది. బలం: పటిష్టమైన బ్యాటింగ్ లైనప్... ప్రధాన ఆటగాళ్లంతా ఫామ్లో ఉన్నారు. ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకొని భారీ స్కోరు అందించగలరు. డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్లపై ప్రధానంగా జట్టు ఆధారపడుతోంది. ఈ ముగ్గురు టోర్నీలో 400కు పైగా పరుగులు సాధించారు. చివర్లో అలవోకగా సిక్సర్లు బాదే పొలార్డ్, హార్దిక్ పాండ్యా చెలరేగిపోతే తిరుగుండదు. బౌలింగ్లో బుమ్రా, బౌల్ట్ల ఎనిమిది ఓవర్లను ఎదుర్కోవడం ఎలాంటి బ్యాట్స్మెన్కైనా కష్టమే. వీరిద్దరిని మ్యాచ్ను ముంబైవైపు తిప్పేయగల సమర్థులు. బుమ్రా 23 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్కు 20 వికెట్లు దక్కాయి. బలహీనత: నిజానికి ముంబై జట్టును టోర్నీలో ఇబ్బంది పెట్టిన బలహీనతలు పెద్దగా ఏమీ లేవు. కొన్ని లోపాలు కనిపించినా... ఓవరాల్ ప్రదర్శనతో జట్టు వాటి ప్రభావం కనపడకుండా చేసింది. అయితే రోహిత్ శర్మ ఇప్పటి వరకు తన స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. రోహిత్ ‘టచ్’ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడని, దీనిని తాము అనుకూలంగా మలచుకుంటామని ధావన్ చెప్పడం మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నమే. అన్ని మ్యాచ్లు ఆడిన కృనాల్ ఒక్కసారి కూడా ప్రభావం చూపలేకపోయాడు. తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, ప్యాటిన్సన్, రాహుల్ చహర్, బుమ్రా, బౌల్ట్. ముఖాముఖి ఈ సీజన్లో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్లలోనూ ముంబై జట్టే విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఢిల్లీ 162 పరుగులు చేయగా... ముంబై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. గత శనివారం జరిగిన తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ పేలవంగా ఆడి 110 పరుగులు చేయగా, ముంబై 14.2 ఓవర్లలోనే గెలిచింది. రబడ, ధావన్, ఇషాన్ కిషన్, డికాక్, బుమ్రా -
క్యాపిటల్స్కు వరుసగా నాలుగో ఓటమి
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతోంది...ప్లే ఆఫ్స్ స్థానం ఖరారైన తర్వాత కూడా ఏమాత్రం తీవ్రత తగ్గించని ఆ జట్టు ఢిల్లీని సునాయాసంగా ఓడించి తమ స్థాయిని ప్రదర్శించింది. భారీ రన్రేట్ కారణంగా ఆ జట్టు టాప్–2లో నిలవడం కూడా దాదాపుగా ఖాయమైంది. మరో వైపు పేలవ ప్రదర్శనతో క్యాపిటల్స్ మరింత దిగజారింది. బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా నాలుగో మ్యాచ్లో ఓడిన ఆ టీమ్ రన్రేట్ కూడా మైనస్లోకి పడిపోయింది. ముందంజ వేసే అవకాశాలు ఇంకా ఉన్నా... పరిస్థితిని మాత్రం క్లిష్టంగా మార్చుకుంది. దుబాయ్: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో పెద్ద విజయం చేరింది. పేస్ ద్వయం బుమ్రా (3/17), బౌల్ట్ (3/21) అద్భుత ప్రదర్శన చేయడంతో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ను 9 వికెట్లతో ముంబై చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ధావన్ మళ్లీ సున్నా... భారీ స్కోరు సాధించాలనే లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ ధాటికి వరుసగా రెండో మ్యాచ్లోనూ శిఖర్ ధావన్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. కాసేపటికే రెండు ఫోర్లతో జోరు కనబరిచిన పృథ్వీ (10) కూడా పెవిలియన్ చేరాడు. పరుగులు చేసేందుకు శ్రమించిన ఢిల్లీ పవర్ప్లేలో కేవలం 22 పరుగులు చేసింది. ఈ సీజన్లో పవర్ప్లేలో నమోదైన రెండో అత్యల్ప స్కోరు ఇదే. పంత్ (24 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో కలిసి అయ్యర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే 12 పరుగుల వ్యవధిలో అయ్యర్, స్టొయినిస్ (2), పంత్ వికెట్లను కోల్పోయి 62/5తో కష్టాల్లో పడింది. మరోసారి చెలరేగిన బుమ్రా... హర్షల్పటేల్ (5)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, హెట్మైర్ (11) విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ తడాఖా... భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై స్వల్ప లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఇషాన్ కిషన్ నాలుగు బౌండరీలతో రాణించడంతో వికెట్ కోల్పోకుండా పవర్ప్లేలో 41 పరుగులు సాధించింది. ఇషాన్కు సహకరించిన డికాక్ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు)... నోర్జే బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సూర్యకుమార్ (12) అండతో ఇషాన్ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత చెలరేగిన ఇషాన్ సిక్సర్తో మరో 34 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ను ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డికాక్ (బి) బౌల్ట్ 10; ధావన్ (సి) సూర్యకుమార్ (బి) బౌల్ట్ 0; శ్రేయస్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చహర్ 25; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 21; స్టొయినిస్ (సి) డికాక్ (బి) బుమ్రా 2; హెట్మైర్ (సి) కృనాల్ (బి) కూల్టర్ నీల్ 11; హర్షల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 5; అశ్విన్ (సి) కృనాల్ (బి) బౌల్ట్ 12; ప్రవీణ్ దూబే (నాటౌట్) 7; రబడ (రనౌట్) 12; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–50, 4–57, 5–62, 6–73, 7–78, 8–96, 9–110. బౌలింగ్: బౌల్ట్ 4–0–21–3, కృనాల్ 3–0–13–0, జయంత్ యాదవ్ 3–0–18–0, బుమ్రా 4–0–17–3, కూల్టర్నీల్ 2–0–14–1, రాహుల్ చహర్ 4–0–24–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (నాటౌట్) 72; డికాక్ (బి) నోర్జే 26; సూర్యకుమార్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 1; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 111. వికెట్ల పతనం: 1–68. బౌలింగ్: రవిచంద్రన్ అశ్విన్ 4–0–18–0, రబడ 3–0–27–0, నోర్జే 2.2–0–25–1, స్టొయినిస్ 1–0–4–0, ప్రవీణ్ 3–0–29–0, హర్షల్ పటేల్ 1–0–8–0. -
సూపర్ సన్దీప్.. బెంగళూరు విలవిల
హైదరాబాద్ ప్లే ఆఫ్స్ దారిలో పడింది. ముందుకెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో సీమర్ సందీప్ శర్మ (2/20) చెలరేగి బెంగళూరు పని పట్టాడు. మరోవైపు కోహ్లి సేన ‘హ్యాట్రిక్’ పరాజయాలతో 14 పాయింట్ల దగ్గరే ఆగిపోయింది. ఇప్పటికైతే రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఆఖరి మ్యాచ్ ఫలితంపైనే ఆర్సీబీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. షార్జా: వారెవ్వా సన్రైజర్స్... ఈ మ్యాచ్ టాస్ వేయక ముందు పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. హోల్డర్ సిక్సర్తో విన్నింగ్ షాట్ కొట్టగానే టాప్లో నాలుగో స్థానానికి వచ్చేసింది. ఈ ఫలితం జట్టు రాతను ఇంతలా మార్చేసింది. ప్లేఆఫ్స్కు చేరువ చేసింది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఫిలిప్ (31 బంతుల్లో 32; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సందీప్ శర్మ (2/20) బెంగళూరును కోలుకోలేనంత దెబ్బతీశాడు. తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ 14.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ సాహా (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, చివర్లో జేసన్ హోల్డర్ (10 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్) ధనాధన్గా ముగించేశాడు. కోహ్లి విఫలం... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వార్నర్ నిర్ణయానికి సీమర్ సందీప్ శర్మ న్యాయం చేశాడు. అతని దెబ్బకు బెంగళూరు ఆట ప్రారంభమైన మూడో ఓవర్లో కష్టాల్లో పడింది. మ్యాచ్ సాగే కొద్దీ ఆ కష్టాల్లోనే చిక్కుకుపోయింది. సందీప్ శర్మ లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేసి తొలి ఓవర్లో మూడే పరుగులిచ్చాడు. తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 3వ)లో ఫామ్లో ఉన్న దేవ్దత్ పడిక్కల్ (5)ను క్లీన్బౌల్డ్ చేశాడు. దీన్నుంచి రాయల్ చాలెంజర్స్ తేరుకోక ముందే మరో దెబ్బ తీశాడు. సందీపే తన మరుసటి ఓవర్లో కెప్టెన్ కోహ్లి (7)ని కూడా అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 28/2. ఇక తర్వాత ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) వచ్చినా, మోరిస్ (3)) దిగినా, గుర్కీరత్ (24 బంతుల్లో 15 నాటౌట్)) అజేయంగా నిలిచినా చేసేదేమీ లేకపోయింది. ఆడేవారిని నిలువనీకుండా... నిలిచిన వారిని ఆడనీకుండా సన్రైజర్స్ బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. ఆరంభం నుంచి అందరికంటే మెరుగ్గా ఆడుతున్న ఓపెనర్ ఫిలిప్ పెవిలియన్ చేరాక బెంగళూరు కష్టాలు రెట్టింపు అయ్యాయి. రషీద్ఖాన్ బౌలింగ్లో భారీషాట్కు ప్రయత్నించిన ఫిలిప్ డీప్ మిడ్వికెట్లో మనీశ్ చేతికి చిక్కాడు. వాషింగ్టన్ సుందర్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు), గుర్కీరత్ సింగ్ కాసేపు నిలబడటంతో 17వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. సుందర్ అవుటయ్యాక సన్రైజర్స్ పేసర్ హోల్డర్... ఒకే ఓవర్లో హిట్టర్ మోరిస్ (3)తో పాటు ఉదన (0)ను ఔట్ చేయడంతో ఆఖరి మెరుపులు కరువయ్యాయి. డివిలియర్స్ క్యాచ్ వదిలేసినా... అప్పటికే పడిక్కల్, కోహ్లి అవుటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ 4 పరుగుల వద్దే అవుట్ కావాల్సింది. నదీమ్ తన తొలి ఓవర్లోనే (ఇన్నింగ్ 7వ) ఆ అవకాశాన్ని జారవిడిచాడు. ఏడో ఓవర్ ఆఖరి బంతిని ఏబీ నేరుగా బౌలర్ దిశగా ఆడాడు. నదీమ్ ఆ రిటర్న్ క్యాచ్ను వదిలేశాడు. తిరిగి 3 ఓవర్ల తర్వాత తనే డివిలియర్స్ను పెవిలియన్ చేర్చాడు. ‘మిస్టర్ 360’ బ్యాట్స్మన్ ప్రమాదకరంగా మారకముందే అతన్ని 24 పరుగుల వద్ద అవుట్ చేయడంతో సన్రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. దీంతో ఇన్నింగ్స్లోనే కాస్త మెరుగైన 43 పరుగుల భాగస్వామ్యం కూడా ముగిసింది. వార్నర్ అవుటైనా... స్వల్ప లక్ష్యఛేదనే అయినా... కెప్టెన్, ఓపెనర్ వార్నర్ (8) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. సుందర్ అతన్ని పెవిలియన్ చేర్చడంతో బెంగళూరు శిబిరంలో ఎక్కడలేని ఆనందాన్ని నింపింది. కానీ మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా, వన్డౌన్ బ్యాట్స్మన్ మనీశ్ పాండే (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరు బౌలింగ్ను అలవోకగా ఎదుర్కోవడంతో బెంగళూరు ఆనందం అంతలోనే ఆవిరైంది. 5.2 ఓవర్లలో సన్రైజర్స్ స్కోరు 50 పరుగులకు చేరింది. తొలివికెట్కు సరిగ్గా 50 పరుగులు జోడించాక జట్టు స్కోరు 60 పరుగుల వద్ద ధాటిగా ఆడే ప్రయత్నంలో పాండే అవుటయ్యాడు. ఇతన్ని స్పిన్నర్ చహల్ పెవిలియన్ చేర్చాడు. విలియమ్సన్ జతకాగా కాసేపటికే కుదురుగా ఆడుతున్న సాహాను కూడా చహలే బోల్తా కొట్టించాడు. ఉదాన 13వ ఓవర్ తొలిబంతికి విలియమ్సన్ (8) అవుటయ్యాడు. 87 పరుగుల వద్ద నాలుగో వికెట్గా అతను వెనుదిరిగాడు. అప్పుడు సన్రైజర్స్ గెలిచేందుకు 34 పరుగుల దూరంలో ఉన్నా... బంతులు (48) బోలెడున్నాయి. అయితే పంజాబ్తో జరిగిన మ్యాచ్ తాలూకు కష్టాలు హైదరాబాద్ కళ్లముందు కదిలాయి. ఈ దశలో వరుసలో ముందుగా బ్యాటింగ్కు దిగిన హోల్డర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఉదన బౌలింగ్లోనే లాంగాన్లో సిక్స్ కొట్టాడు. తర్వాత సైనీ బౌలింగ్ను ఓ పట్టుపట్టాడు. హోల్డర్ 6, 4 కొట్టగా, అభిషేక్ శర్మ (8) మరో సిక్సర్ కొట్టి తర్వాత బంతిని కూడా సిక్సర్గా మలిచేందుకు భారీ షాట్ ఆడాడు. కానీ లాంగాఫ్లో గుర్కీరత్ చేతికి చిక్కాడు. 36 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో చహల్ వేసిన 15వ ఓవర్ తొలి బంతినే సిక్సర్గా తరలించి మ్యాచ్ను హోల్డర్ ఎంతో ముందుగానే ముగించేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫిలిప్ (సి) పాండే (బి) రషీద్ ఖాన్ 32; దేవదత్ (బి) సందీప్ 5; కోహ్లి (సి) అభిషేక్ (బి) నదీమ్ 24; సుందర్ (సి అండ్ బి) నటరాజన్ 21; గురుకీరత్ సింగ్ (నాటౌట్) 15; మోరిస్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 3; ఉదాన (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 0; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1–13, 2–28, 3–71, 4–76, 5–106, 6–113, 7–114. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–20–2, హోల్డర్ 4–0–27–2, నటరాజన్ 4–0–11–1, నదీమ్ 4–0–35–1, రషీద్ ఖాన్ 4–0–24–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఉదాన (బి) సుందర్ 8; సాహా (స్టంప్డ్) డివిలియర్స్ (బి) చహల్ 39; మనీశ్ పాండే (సి) మోరిస్ (బి) చహల్ 26; విలియమ్సన్ (సి) కోహ్లి (బి) ఉదాన 8; అభిషేక్ శర్మ (సి) గురుకీరత్ (బి) సైనీ 20; హోల్డర్ (నాటౌట్) 26; సమద్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (14.1 ఓవర్లలో 5 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–10, 2–60, 3–82, 4–87, 5–114. బౌలింగ్: మోరిస్ 2–0–19–0, సుందర్ 3–0–21–1, సైనీ 2–0–30–1, సిరాజ్ 1–0–12–0, చహల్ 3.1–0–19–2, ఉదాన 3–0–20–1. -
రాయల్స్ రేసులోనే...
రాజస్తాన్ రాయల్స్ ఊపిరి పీల్చుకుంది. ‘యూనివర్సల్ బాస్’ గేల్ విధ్వంసాన్ని తట్టుకొని నిలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో సమష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా ధనాధన్ ఇన్నింగ్స్తో స్టోక్స్ గెలుపునకు పునాది వేయగా... సంజూ సామ్సన్, స్మిత్, బట్లర్ జట్టును గమ్యానికి చేర్చారు. దీంతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకేసింది. కీలక సమయంలో బౌలర్లు చేతులెత్తేయడంతో పంజాబ్ ఓటమి పాలై తమ అవకాశాలను కాస్త సంక్లిష్టం చేసుకుంది. అబుదాబి: అసలైన సమయంలో రాజస్తాన్ రాయల్స్ సత్తా చాటింది. సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని ముంచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ సామ్సన్ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో... శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై రాజస్తాన్ రాయల్స్ జట్టు ఏడు వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు) రాణించారు. ఆర్చర్, స్టోక్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు), బట్లర్ (11 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) నాలుగో వికెట్కు అజేయంగా 19 బంతుల్లో 41 పరుగుల్ని జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలి ఓవర్లోనే వికెట్... ఆరంభంలోనే పంజాబ్కు షాక్ తగిలింది. ఆర్చర్ బౌలింగ్లో స్టోక్స్ చక్కటి క్యాచ్కు ఓపెనర్ మన్దీప్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. తర్వాత రాహుల్కు గేల్ జతకూడటంతో రాయల్స్ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పరాగ్, ఉతప్ప సమన్వయలేమితో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న గేల్... కార్తీక్ త్యాగి ఓవర్లో వరుసగా 4, 6, 4 రెచ్చిపోయాడు. ఆరోన్ బౌలింగ్లో రాహుల్ కూడా 6, 4 బాదడంతో పవర్ ప్లేలో పంజాబ్ 53/1తో నిలిచింది. పటిష్ట భాగస్వామ్యం... తర్వాత కూడా వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడారు. ప్రతీ బంతిపై ఎదురుదాడి చేయకుండా ఆచితూచి బౌండరీలు బాదారు. మిడిల్ ఓవర్లలో రన్రేట్ 8కి తగ్గకుండా పరుగులు సాధించారు. రాహుల్ తేవటియా బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన గేల్ 33 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఆడిన ఆరు మ్యాచ్ల్లో అతనికిది మూడో ఫిఫ్టీ. ఈ దశలో గేల్ మరోసారి బతికిపోయాడు. మరోవైపు అర్ధసెంచరీకి చేరువవుతోన్న రాహుల్ను స్టోక్స్ పెవిలియన్ పంపాడు. దీంతో రెండో వికెట్కు 82 బంతుల్లో 120 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సిక్సర్ల హోరు... చివరి ఐదు ఓవర్లలో పూరన్, గేల్ ఆరు సిక్సర్లతో అలరించారు. ఆరోన్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, త్యాగి బౌలింగ్లో మరొకటి కొట్టి పూరన్ ప్రమాదకరంగా కనిపించాడు. బౌండరీ వద్ద తేవటియా క్యాచ్కు అతను ఔటైనా... గేల్ 4, 6తో 14 పరుగులు రాబట్టాడు. తర్వాత మరో రెండు సిక్సర్లు కొట్టి సెంచరీకి సమీపించిన గేల్ను ఆర్చర్ అద్భుత యార్కర్తో నిలువరించాడు. చివరి 30 బంతుల్లో పంజాబ్ 62 పరుగులు రాబట్టింది. స్టోక్స్ విధ్వంసం... ఉతప్పతో కలిసి ఛేదనకు దిగిన స్టోక్స్ కసిగా ఆడాడు. తొలి 3 ఓవర్లలో నాలుగు ఫోర్లు బాదాడు. నాలుగో ఓవర్లో వరుసగా 4, 6, 6తో 16 పరుగులు పిండుకున్నాడు. తర్వాత 4, 6 బాదిన స్టోక్స్ 24 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతోన్న స్టోక్స్ను జోర్డాన్ పెవిలియన్ పంపాడు. అనంతరం సామ్సన్ బ్యాట్ ఝళిపించడంతో 10 ఓవర్లకు రాజస్తాన్ 103/1తో నిలిచింది. తర్వాతి ఓవర్లోనే ఉతప్ప (30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఔటైనా... స్మిత్తో కలిసి సామ్సన్ ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ 21 బంతుల్లో 34 పరుగులు జోడించాక సామ్సన్ రనౌట్గా వెనుదిరిగాడు. అప్పటికే జట్టు ç146/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. బట్లర్, స్మిత్ జోరు భారీ విజయంపై కన్నేసిన స్మిత్, బట్లర్ చివర్లో చెలరేగారు. 30 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉండగా సిక్సర్తో బట్లర్ జోరు పెంచాడు. షమీ వేసిన 17వ ఓవర్లో స్మిత్ 3 ఫోర్లు, బట్లర్ మరో బౌండరీతో 19 పరుగులు రాబట్టారు. జోర్డాన్ ఓవర్లో మరో సిక్సర్ బాదిన బట్లర్ 15 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు. వీరిద్దరూ చివరి 10 బంతుల్లో 30 పరుగులు చేశారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రాహుల్ తేవటియా (బి) స్టోక్స్ 46; మన్దీప్ సింగ్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 0; క్రిస్ గేల్ (బి) ఆర్చర్ 99; నికోలస్ పూరన్ (సి) రాహుల్ తేవటియా (బి) స్టోక్స్ 22; మ్యాక్స్వెల్ (నాటౌట్) 6; దీపక్ హుడా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–1, 2–121, 3–162, 4–184. బౌలింగ్: ఆర్చర్ 4–0–26–2; వరుణ్ ఆరోన్ 4–0–47–0; కార్తీక్ త్యాగి 4–0–47–0; శ్రేయస్ గోపాల్ 1–0–10–0; స్టోక్స్ 4–0–32–2; రాహుల్ తేవటియా 3–0–22–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రాబిన్ ఉతప్ప (సి) పూరన్ (బి) మురుగన్ అశ్విన్ 30; స్టోక్స్ (సి) దీపక్ హుడా (బి) జోర్డాన్ 50; సామ్సన్ (రనౌట్) 48; స్మిత్ (నాటౌట్) 31; బట్లర్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో మూడు వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–60, 2–111, 3–145. బౌలింగ్: అర్ష్దీప్ సింగ్ 3–0–34–0, షమీ 3–0–36–0, మురుగన్ అశ్విన్ 4–0–43–1, క్రిస్ జోర్డాన్ 3.3–0–44–1, రవి బిష్ణోయ్ 4–0–27–0. -
నేటి నుంచి వైజాగ్ ప్లే ఆఫ్ మ్యాచ్ల టికెట్ల అమ్మకాలు
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరుగనున్న రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లకు సంబంధించి ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు శుక్రవారం ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈనెల 8న ఎలిమినేటర్ మ్యాచ్... 10న క్వాలిఫయర్–2 మ్యాచ్ జరుగుతాయి. టికెట్లను www.eventsnow.com వెబ్సైట్లోకి లాగిన్ అయి కొనుగోలు చేయాలి. బీసీసీఐ టికెట్ల ధరలను రూ. 500, 1000, 1500, 1750, 3500, 7500గా నిర్ణయించింది. తొలి అంతస్తులోని కార్పొరేట్ బాక్స్లో ఒక్కో టికెట్ రూ. 9000కు.. రెండో అంతస్తులోని కార్పొరేట్ బాక్స్లో ఒక్కో టికెట్ రూ. 5000కు లభిస్తాయి. -
అటెన్షన్ ప్లీజ్ : ఐపీఎల్ టైమింగ్స్లో మార్పు
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11 సీజన్లో ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ల సమయాల్లో మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత సమయం కంటే ఓ గంట ముందుగానే మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అభిమానుల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం మీడియాకు తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా ఐపీఎల్కు వస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. టీవీ, మైదానాల్లో చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్లను ఓ గంట ముందు ప్రారంభించాలని నిర్ణయించాం. దీంతో మ్యాచ్లు 7 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఇది కేవలం మైదానంలోని అభిమానుల కోసమే కాకుండా టీవీ ప్రేక్షకులను సైతం దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం. మ్యాచ్లు ఆలస్యం కావడంతో మైదాన, టీవీ ప్రేక్షకులకు ఉదయం లేచి, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లడం కష్టంగా ఉంటుంది. దీంతో మ్యాచ్ సమయాలను మార్చాం’ అని శుక్లా పేర్కొన్నాడు. ప్రస్తుతం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతున్న మ్యాచ్లు రాత్రి 11.30 ముగుస్తున్నాయి. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా కొన్ని మ్యాచ్లు అర్థరాత్రి 12 తర్వాత ముగుస్తున్నాయి. వర్షం అంతరాయం కలిగిస్తే ఇక అంతే సంగతులు. దీంతో ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
ప్లే ఆఫ్లో ఎవరితో ఎవరు?
రాయ్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రేక్షకులకు, వీక్షకులకు గట్టి మజా అందించిన పొట్టి క్రికెట్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం నాటి మ్యాచ్ లతో లీగ్స్ రౌండ్ ముగిసింది. మంగళవారం నుంచి మొదలయ్యే ప్లే ఆఫ్స్ కు గుజరాత్ లయన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిచిచిన గుజరాత్, బెంగళూరులు 24న జరిగే మొదటి క్వాలిఫయర్ లో పోటీపడతాయి. ఇందులో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ 1లో విన్ అయిన టీమ్ తో తలపడుతుంది. 25న జరగనున్న తొలి ఎలిమినేటర్ లో హైదరాబాద్, కోల్ కతాలు తలపడతాయి. 27న క్వాలిఫయర్ 2 జరుగుతుంది. 29 ఆదివారం ఫైనల్స్ జరుగుతుంది. ఇక ముందు జరిగే మ్యాచ్ లు అన్ని రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతాయి. లీగ్స్ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టిక, ప్లే ఆఫ్ షెడ్యూల్ ఇలా ఉన్నాయి.. -
'ఐపీఎల్.. మాకు ప్లే ఆఫ్ చాన్స్ కష్టమే'
బెంగళూరు: బీకర్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఐపీఎల్ జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకూ 10 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు కేవలం నాలుగు విజయాలతో ఆరో స్థానంలో ఉంది. టీమ్ ప్రస్తుత పరిస్థితి గురించి బెంగళూరు ఆటగాడు యుజువేంద్ర చాహల్ కొన్ని విషయాలు చెప్పాడు. తమ తదుపరి నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ కు వెళ్లే 4 జట్లలో తమ జట్టుకు స్థానం ఉంటుందన్నాడు. అయితే ప్లే ఆఫ్స్ పై మాకు ఇంకా ఆశలున్నాయని ధీమా వ్యక్తం చేయడం కాస్త ఆసక్తికరంగా మారింది. ఇక మిగిలిన నాలుగు లీగ్ మ్యాచులలో ఒక్కటి ఓడినా ఇంటి బాట పట్టడం ఖాయమని చెబుతున్నాడు. జట్టు సమిష్టిగా రాణిస్తే రాయల్ చాలెంజర్స్ కు అసాధ్యమంటే ఏదీ లేదని ప్లే ఆప్స్ అవకాశాలపై బెంగళూరు లెగ్ స్పిన్నర్ చాహల్ అభిప్రాయపడ్డాడు. టీమ్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న విషయాన్ని అంగీకరించాడు. అయితే టీ20లలో ఏ ఒక్కరో ఆడితే నెగ్గుకురావడం కష్టమని, సమిష్టిగా మంచి ఇన్నింగ్స్ లు వస్తేనే విజయాలు సాధ్యమన్నాడు. కప్పు నెగ్గాలన్న బెంగళూరు టీమ్ కల గత ఎనిమిది సీజన్లుగా కలగానే మిగిలిపోయింది. బెంగళూరు స్థానిక చిన్నస్వామి స్డేడియంలో గుజరాత్ లయన్స్ తో నేటి సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.