Poonam Pandey
-
రెండో పెళ్లి.. ఊహిస్తేనే భయంగా ఉంది: పూనమ్ పాండే
పెళ్లి మాట ఎత్తితేనే భయపడుతోంది బోల్డ్ బ్యూటీ, నటి పూనమ్ పాండే (Poonam Pandey). విడాకుల తర్వాత తన జీవితం సంతోషంగా సాగుతోందని, మళ్లీ ఎవర్నైనా నమ్మాలంటే భయంగా ఉందని చెప్తోంది. పూనమ్ పాండే 2020లో ప్రియుడు సామ్ బాంబేను పెళ్లి చేసుకుంది. అతడితో గోవాకు హనీమూన్కు కూడా వెళ్లింది. ఆ సమయంలో సామ్ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్టు కూడా చేశారు. అదే సమయంలో పూనమ్ కళ్లు, ముఖంపై గాయాలతో ఆస్పత్రిలో చేరింది.రెండేళ్లుగా ఒంటరిగానే..అవన్నీ గుర్తు చేసుకుంటేనే భయపడిపోతోంది పూనమ్ పాండే. రెండేళ్లుగా ఒంటరిగా ఉన్నాను. ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నాను. వైవాహిక జీవితం నాకు కలిసిరాదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడైతే హాయిగా జీవిస్తున్నాను. నాకు అందమైన కుటుంబం, మంచి కెరీర్ ఉంది. ఈ రెండింటితో నేను సంతృప్తిగా ఉన్నాను. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉందని. ఎవరేంటో తెలుసుకోలేకపోతున్నాను. ఎవర్నీ నమ్మలేకున్నాను అని చెప్పుకొచ్చింది.వివాదాలతో సావాసం..గతేడాది గర్భాయ ముఖద్వార క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఏకంగా తాను చనిపోయినట్లు ప్రచారం చేసుకుంది. ఆ వార్తలు వైరలయ్యాక తాను బతికే ఉన్నానని, క్యాన్సర్పై అవగాహన పెంచేందుకే అలాంటి ప్రాంక్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. 2011లో వరల్డ్కప్లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద నూలుపోగులేకుండా తిరుగుతానని ప్రకటించింది. ఇలాంటి సంచలన కామెంట్లు, డ్రామాలతోనే పూనమ్ ఎక్కువ పాపులర్ అయింది.చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
హీరోయిన్కి అభిమానితో చేదు అనుభవం..వీడియో వైరల్
సినీ తారలు బయట కనిపించడం చాలా అరుదు. ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప బయటకు రారు. అందుకే అలా బయట కనిపించినప్పుడు వాళ్లను చూసేందుకు జనాలు ఎగబడతారు. కొంతమంది సెల్ఫీలు దిగుతూ సంబరపడిపోతారు. హీరోహీరోయిన్లు కూడా తమ కోసం వచ్చిన అభిమానులను నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు ఇస్తుంటారు. కొంతమంది హీరోలు సెల్ఫిలు అడిగినా కొడుతారను..అది వేరే విషయం. కానీ చాలా మంది అయితే అడగ్గానే సెల్ఫీకి ఒప్పేసుకుంటారు. అలాంటి వారిలో నటి పూనం పాండే(Poonam Pandey) కూడా ఒకరు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఫ్యాన్స్తో టచ్లో ఉండే బోల్డ్ బ్యూటీ.. ఇప్పుడు సెల్ఫీ అంటేనే భయపడిపోతుందట.ఫోటో కోసం వచ్చి..తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఫొటో సెషన్లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీనే కదా అని ఆమె నవ్వుతూ ఫోటోకి పోజులివ్వగానే ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో పూనమ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యింది.వెంటనే తేరుకున్న పూనమ్ అతడిని బలంగా నెట్టివేసింది. అలాగే, ఫొటో జర్నలిస్టు ఒకరు వెంటనే అప్రమత్తమై అతడి నుంచి ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.స్క్రిప్టెడా?ఇలాంటి ఘటన పూనమ్ కాకుండా ఇతర హీరోయిన్లలలో ఎవరికి జరిగినా అంతా నిజమనే నమ్మేవారు. కానీ పూనమ్ చరిత్ర తెలిసివాళ్లు ఇది ఫేక్ అని అంటున్నారు. ఇదంత స్క్రిప్టెడ్ అని.. అటెన్షన్ కోసమే పూనమ్ ఇలాంటి పని చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీడియోను గమనిస్తే మొదటి నుంచీ ఆమె తీరు అనుమానాస్పదంగా ఉందని ఒకరు, ఆమె అంత బాగా నటించలేదని కామెంట్ చేస్తున్నారు.గతంలో ఇంతకు మించి.. పూనమ్కి వివాదాలు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి డ్రామాలు చాలానే ఆడింది. క్యాన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఏకంగా తాను చనిపోయినట్లు వార్తలు రాయించుకుంది. అనంతరం తాను బతికే ఉన్నానని, క్యాన్సర్పై అవగాహన పెంచడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చింది.2011లో వరల్డ్ కప్లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. సినిమాల కంటే ఇలాంటి డ్రామాలే పూనమ్కి ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ముద్దు వీడియో కూడా ఫేకే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Poonam Pandey కాంట్రోవర్సీ క్వీన్ పూనమ్ పాండేకు మరో భారీ షాక్
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్పై అవగాహన కల్పించేందుకు పూనం పాండేను ప్రచార కర్తగా నియమించనుందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. సర్వైకల్ కేన్సర్పై అవగాహనకు గాను ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాండే సర్వైకల్ కేన్సర్పై అవగాహనకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యే అవకాశం ఉందని, ఈమేరకు చర్చలు జరుగుతున్నాయన్న ఆమె, ఆమె టీం చేస్తున్న ప్రచారం నేపథ్యంలో మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయని వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కేన్సర్ రోగులు, వారి బంధువులతో పాటు ఇతరులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసిందంటూ కోల్కతాకు చెందిన అమిత్ రాయ్ పూనమ్ పాండేకు లీగల్ నోటీసులు పంపారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వైకల్ కేన్సర్తో బాధపడుతూ నటి పూనం పాండే చనిపోయిందంటూ ఆమె అధికారిక ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ మరునాడే తాను బతికే ఉన్నానని, సర్వైకల్ కేన్సర్ ప్రమాదకరంగా మారుతున్న నేపత్యంలో కేవలం దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రకటన అంటూ ఒక వీడియో రిలీజ్ చేయండం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. -
ఇన్ స్టా వేదికగా పూనమ్ పాండే మరో వీడియో
-
నేను జీవించే ఉన్నాను!
‘‘సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) కారణంగా నేను చనిపోలేదు... బతికే ఉన్నాను. దురదృష్టం ఏంటంటే.. అనేక మంది మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల వారు వారి జీవితాలను కోల్పోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ల మాదిరి కాదు. ఇందుకు మెరుగైన చికిత్స ఉంది. హెచ్పీవీ వ్యాక్సిన్, వైద్య పరీక్షలతో వెంటనే ఈ క్యాన్సర్ను గుర్తించి, చికిత్స తీసుకోవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ ్రపాణాలు కోల్పోకుండా ఉండేందుకు మార్గాలు ఉన్నాయి. వాటిపై అవగాహన కల్పిద్దాం’’ అని పేర్కొన్నారు నటి, మోడల్ పూనమ్ పాండే. ఫిబ్రవరి 2న సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓపోస్ట్ షేర్ అయింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు మరణ విషయాన్ని ధృవీకరించలేదు. అలాగే కాన్పూర్పోలీసులకు, అక్కడి మీడియాకు పూనమ్ పాండే మరణంపై సరైన స్పష్టత లేదు. దీంతో పూనమ్ జీవించే ఉన్నారని, పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా తాను మృతి చెందినట్లు ఫేక్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. ఫైనల్గా ఇదే నిజమైంది. సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగానే తన చావును ఫేక్ చేసినట్లుగా పూనమ్ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వీడియోలు షేర్ చేశారు. నేడు (ఫిబ్రవరి 4) వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగానే పూనమ్ ఇలా చేశారని తెలుస్తోంది. అయితే పూనమ్ ఈ విధంగా చేయడం వివాదాస్పదంగా మారడంతో మరికొన్ని వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ‘‘అవును.. నా చావును ఫేక్ చేశాను. కానీ సడన్గా అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. సైలెంట్గా జీవితాలను ముగించే వ్యాధి అది. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాల్సి ఉంది. నా చావు వార్త సర్వైకల్ క్యాన్సర్ గురించిన చర్చను పైకి తెచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఓ సెలబ్రిటీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిందన్న వార్త దేశవ్యాప్తంగా ఆ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేలా చేసింది. నేను చేయాలనుకున్నది ఇదే. నేను ఎవర్నైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అంటూ వీడియోలు షేర్ చేశారు పూనమ్. -
నేను చనిపోలేదు, బతికే ఉన్నా: పూనమ్ పాండే
బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే మరణించిందనే షాకింగ్ న్యూస్ శుక్రవారం నుంచి వైరల్ అవుతుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పీఆర్ టీమ్ షేర్ చేసిన నోట్ నిజమా కాదా అని అభిమానులు అభిప్రాయపడుతున్న సమయంలో తాజాగా ఆమె నుంచి ఒక షాకింగ్ మెసేజ్ వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని పేర్కొంది. సర్వైకల్(గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) గురించి అవగాహన కల్పించడం కోసమే అలా చేశానని పూనమ్ సోషల్ మీడియాలో ఓ వీడియోని రిలీజ్ చేసింది. పూనమ్ పాండే మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆమె ఇలా వివరణ ఇచ్చింది. 'మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను.- నేను బతికే ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. కానీ విషాదకరంగా, ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళల నేడు దేశంలో ప్రాణాలను వదులుతున్నారు. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా.. సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది. (ఇదీ చదవండి: ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి నాకు ద్రోహం చేశారు: నటి) HPV వ్యాక్సిన్ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కొనవచ్చు . ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు నేడు వ్యైద్యశాస్త్రంలో ఉన్నాయి. గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దాం.' అని పూనమ్ పాండే తెలిపింది. తన మరణవార్త విషయంలో అందరూ క్షమించాలని పూనమ్ పాండే కోరింది. మహిళలలో ఎంతో నిశ్శబ్ధంగా వ్యాపిస్తున్న గర్భాశయ క్యాన్సర్ గురించి అందరికీ తెలిసేలా చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని ఆమె తెలిపింది. ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే కావడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పూనమ్ ఇలాంటి చర్యకు పాల్పడిందని చెప్పవచ్చు. దీంతో ఆమెపై సోషల్ మీడియా నుంచి వ్యతిరేఖత కూడా వస్తుంది. ఇంతదానికి మరణించినట్లు పోస్ట్ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. View this post on Instagram A post shared by HAUTERRFLY | A Fork Media Group Co. (@hauterrfly) -
పూనమ్ ఇంట్లో అంతా బాగానే ఉందే!: నటి బాడీగార్డు
బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్తో మరణించింది. ఆమె మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు. పూనమ్ దగ్గర 11 ఏళ్లుగా బాడీగార్డుగా పని చేస్తున్న ఆమిన్ ఖాన్ నటి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు మాట్లాడుతూ.. పూనమ్ మరణించారన్న వార్తను నేను నమ్మను. ఆమె సోదరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తను స్పందించడం లేదు. నటి ఇక లేరన్న విషయాన్ని మీడియాలో చూసే తెలుసుకున్నాను. ఆమె రిప్లై ఇవ్వట్లేదు జనవరి 31 వరకు ఆమెతోనే ఉన్నాను. ఒక మాల్లో ఫోటోషూట్ కూడా చేశాం. తను ఎప్పుడూ ఫిట్గా ఉండేది. ఆరోగ్యంగా కనిపించేది. తన అనారోగ్య సమస్య గురించి ఎన్నడూ బయటకు చెప్పలేదు. తనకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని కూడా ఎప్పుడూ అనిపించలేదు. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. తన సోదరి రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను. పూనమ్ ఈ మధ్య తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మద్యపానం అలవాటు కూడా మానేసింది. నేను తన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు అన్నీ సాధారణంగా ఉన్నట్లే అనిపించాయి' అని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు కాగా మోడల్గా కెరీర్ మొదలుపెట్టిన పూనమ్ నటిగానూ కొన్ని సినిమాలు చేసింది. అయితే ఎప్పుడూ ఏదో ఒకరకంగా నిత్యం ఆమె పేరు వార్తల్లో నానుతూ ఉండేది. అశ్లీల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉండేది. గతంలో ప్రియుడిని పెళ్లాడిన కొద్ది రోజులకే అతడిపై గృహహింస కేసు పెట్టింది. తర్వాత ఇద్దరూ కలిసిపోయారు, కానీ ఎక్కువకాలం కలిసి కొనసాగలేకపోయారు. పూనమ్ లాకప్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. చదవండి: పూనమ్ పాండే: చనిపోయేంత వరకు విమర్శలు, వివాదాలే! సౌందర్య టూ పూనమ్ పాండే... చిన్న వయసులో తనువు చాలించిన తారలు వీళ్లే! -
అనారోగ్యంతో బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి
-
Poonam Pandey: ఎంతకు తెగించావ్ పూనమ్? ఇక మారవా?
బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండే(32) గర్భాశయ క్యాన్సర్తో కన్నుమూసిందంటూ మొదట్లో ఓ వార్త బయటకు వచ్చింది. పూనమ్ సొంత ఖాతాలోనే ఆమె మరణ వార్తను తెలియజేస్తూ పోస్ట్ ఉండటంతో అది నిజమే అనుకున్నారంతా! ఇంత చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండాయా? అని అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. సెలబ్రిటీలు నివాళులు అర్పించారు. కానీ అంతలోనే అందరికీ పెద్ద ఝలక్ ఇచ్చింది పూనమ్. కాంట్రవర్సీలు మనకు కొత్త కాదన్నట్లుగా బతికే ఉన్నానని చెప్పింది. క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ డ్రామా ఆడినట్లు తెలిపింది. అందరినీ బకరా చేసిన పూనమ్ జీవితంలోని విమర్శలు, వివాదాలు ఈ కథనంలో చూద్దాం.. వరల్డ్ కప్ సమయంలో మార్మోగిపోయిన పేరు పూనమ్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించింది. మోడల్గా కెరీర్ ఆరంభించింది. ప్రతిభకు ఆత్మస్థైర్యం తోడవడంతో మోడలింగ్లో రాణించింది. తక్కువ కాలంలోనే ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలో మెరిసింది. కానీ టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలనుకుందో ఏమో కానీ 2011లో సంచలన ప్రకటన చేసింది. వరల్డ్ కప్లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. ఈ మాట విని ఆమెను తల్లి చితకబాదింది. అటు భారత్ వరల్డ్ కప్ సాధించింది.. కానీ ఆమె అలా బట్టల్లేకుండా తిరిగేందుకు బీసీసీఐ అనుమతించలేదు. మాట నిలబెట్టుకోవడం కోసం.. అయినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కొన్ని వారాల తర్వాత వాంఖడే స్టేడియంలో దుస్తుల్లేకుండా తిరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాతి ఏడాది కూడా ఇలాంటి పిచ్చి పనే చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈమె తనకంటూ సొంతంగా ఓ యాప్ కూడా తయారు చేయించుకుంది. కానీ గూగుల్ దాన్ని బ్యాన్ చేసింది. తన ప్రేమ వ్యవహారం కూడా వివాదాలతోనే నడిచింది. ప్రియుడు సామ్బాంబే సన్నిహితంగా మెదిలిన క్షణాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో పూనమ్పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో సదరు వీడియోను ఆమె డిలీట్ చేయక తప్పలేదు. భర్తతో గొడవలు, విడాకులు 2020 సెప్టెంబర్ 1న సామ్ బాంబేను పెళ్లాడింది పూనమ్. అప్పుడు కరోనా టెన్షన్ వల్ల ఈ వివాహాన్ని సింపుల్గా జరిపించారు. కానీ పెళ్లయిన పది రోజులకే పూనమ్.. భర్తపై గృహహింస కేసు పెట్టింది. అత్యాచార వేధింపులు, బెదిరింపుల కింద అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే భార్యాభర్తలిద్దరూ కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఎన్నోసార్లు గొడవలు, కలిసిపోవడాలు తర్వాత చివరకు విడాకులు తీసుకున్నారు. అదే ఏడాదిలో పోలీసులు పూనమ్నూ అరెస్ట్ చేశారు. గోవాలోని ప్రభుత్వ స్థలంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకుగానూ జైల్లో పెట్టారు. పోర్నోగ్రఫీ కేసులో కూడా ఈమె పేరు ప్రధానంగా వినిపించింది. సినిమాలు.. రియల్ లైఫ్లో బోల్డ్గా ఉండే పూనమ్ సినిమాలు కూడా ఆ జానర్లోనే చేసేది. అలా నషా సినిమాలో ఓ విద్యార్థితో సంబంధం పెట్టుకునే టీచర్లా కనిపించింది. పోస్టర్లలో అసభ్యత శృతి మించడంతో పెద్ద రచ్చే జరిగింది. హిందీలోనే కాకుండా భోజ్పురి, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్ కో అనే మూవీ చేసింది. 'పెళ్లి చేసుకున్నాక టార్చర్ చూశాను. తల్లిదండ్రులూ ఏ కారణం లేకుండానే ఇంట్లో నుంచి గెంటేశారు. అందరూ కేవలం నన్ను డబ్బు సంపాదించే యంత్రంగానే చూశారు. నన్ను తిట్టుకునేముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి' అని లాకప్ షోలో కన్నీటిపర్యంతమైంది నటి. కానీ ఇలా ఏకంగా చనిపోయానంటూ డ్రామాలాడితే ఎవరు మాత్రం తిట్టుకోరంటున్నారు జనాలు. చదవండి: అనారోగ్యంతో బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి -
సర్వైకల్ కేన్సర్.. మహిళలకు ఓ శాపం!
కేన్సర్ అంటేనే హడలిపోతాం. ఎందుకంటే ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా వచ్చేస్తుంది. దాని స్టేజ్ని బట్టి సులభంగా ఆ వ్యాధి నుంచి బయటపడగలం లేదంటే ఇక అంతే సంగతులు. ఆ కేన్సర్లలో మహిళలకు వచ్చే గర్భాశయ కేన్సర్(సెర్వికల్) మరింత ప్రమాదకరమైంది. బాలీవుడ్ ప్రముఖ నటీ పూనమ్ పాండ్ మృతికి కారణమైంది కూడా ఈ కేన్సరే. దీనికి చికిత్సా విధానం కూడా కాస్త క్రిటికలే. లక్షణాలను ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స ద్వారా పరిస్థితిని అదుపు చేయవచ్చు కానీ.. ఒక దశ దాటిన తరువాత చికిత్సలతో లాభం తక్కువే. అందువల్లే ఏటా కొన్ని వేలమంది మహిళలు ఈ కేన్సర్ బారిన పడే చనిపోతున్నారు. అసలు ఎందుకు వస్తుంది? ముందుగా ఎలా గుర్తించాలి? సెర్వికల్ కేన్సర్ ఎందుకు వస్తుందంటే.. ఈ కేన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, విచ్చలవిడి లైంగిక సంబంధాలు, స్త్రీ, పురుషులిద్దరికీ బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ కేన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలకు ఈ రకమైన కేన్సర్ సోకే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు ఇవీ.. మొదటి దశ సర్వైకల్ కేన్సర్ ఎటువంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరితే... కలయిక తర్వాత, పీరియడ్స్ మధ్య, మెనోపాజ్ తర్వాత యోని రక్తస్రావం దుర్వాసనతో కూడిన నీటి, రక్తపు యోని ద్రవాలు కలయిక సమయంలో పెల్విక్ నొప్పి సర్వైకల్ కేన్సర్లో రకాలు: పొలుసుల కణ కేన్సర్.. ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయం బయటి భాగాన్ని కప్పి ఉంచే సన్నని, చదునైన కణాలలో పొలుసుల కణాలు ప్రారంభమవుతాయి. ఇది యోనిలోకి ప్రవేశిస్తుంది. చాలా గర్భాశయ కేన్సర్లు పొలుసుల కణ క్యాన్సర్. అడెనోకార్సినోమా. . ఈ గర్భాశయ క్యాన్సర్ కాలమ్ ఆకారపు గ్రంధి కణాలలో ప్రారంభమవుతుంది. కారణాలు.. గర్భాశయ ముఖద్వారంలోని ఆరోగ్యకరమైన కణాలు వాటి డీఎన్ఏలో మార్పులు (మ్యుటేషన్లు) జరిగినప్పుడు గర్భాశయ కేన్సర్ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన కణాలు నిర్ణీత రేటుతో పెరుగుతాయి. కొద్ది సమయంలో చనిపోతాయి. కేన్సర్ కణాలు దీనికి భిన్నం. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూనే ఉంటాయి. పేరుకుపోయిన అసాధారణ కణాలు ఒక కణితిని ఏర్పరుస్తాయి. కేన్సర్ కణాలు సమీపంలోని కణజాలాలపై దాడి చేస్తాయి. శరీరంలోని ఇతర చోట్ల వ్యాప్తి చెందడానికి కణితి నుంచి విడిపోతాయి. గర్భాశయ కేన్సర్కు కారణమేంటో స్పష్టంగా తెలియదు, కానీ హెచ్పీవీ పాత్ర పోషిస్తుంది. హెచ్పీవీ చాలా సాధారణం. ఈ వైరస్ ఉన్న ప్రతి ఒక్కరికి కేన్సర్ రాదు. లైఫ్స్టైల్, ఇతర కారకాల కారణంగా వచ్చే అవకాశం ఉంది. చికిత్స.. నయం కాని గర్భాశయ ముఖద్వార కేన్సర్కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా చేస్తే నివారణ సాధ్యం.. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్పీవీ వైరస్కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. (చదవండి: ముక్కు లేకుండానే జన్మ..ఇప్పుడెలా ఉన్నాడంటే?) -
బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి
బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ పాండే (32) మృతి చెందారు. గత రాత్రి మరణించినట్లు ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా ఆమె అనుచరులు ఒక పోస్ట్ చేశారు. ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన పోస్ట్లో ఆమె మరణ వార్త మొదటగా వెల్లడైంది. ఆమె మరణ వార్త గురించి పూనమ్ పాండే పీఆర్ టీమ్ ఇలా తెలిపింది. 'ఈ ఉదయం మాకెంతో చాలా కఠినమైనది. మా ప్రియమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్తో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిపట్ల స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను పంచారు. ఈ దుఃఖ సమయంలో, ఈ విషయాన్ని మేము షేర్ చేసేందుకు ఎంతో చింతిస్తున్నాము. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాం.' అని అందులో ఉంది. పూనమ్ ఉత్తరప్రదేశ్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూనమ్ మరణ వార్తను ఆమె పీఆర్ టీమ్ మాత్రమే ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని వారు తెలిపారు. పూనమ్ పాండే ప్రముఖ మోడల్గా గుర్తింపు పొందారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్కు ముందు ఒక వీడియో సందేశంలో భారత్ ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే తన దుస్తులు తొలగిస్తానని ఆమె కామెంట్ చేసి వైరల్ అయ్యారు. 2013లో 'నాషా' చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన పూనమ్ తెలుగులో 'మాలిని అండ్ కో'లో నటించింది. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఢిల్లీలో జన్మించిన పూనమ్. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010లో గ్లాడ్రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో ఆమె నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అక్కడ పాపులారిటీ రావడంతో ఎక్కువగా అర్ధనగ్న ఫోటోలు షేర్ చేస్తూ వివాదాస్పద నటిగా మిగిలింది. ఆమె వైవాహిక జీవితం చుట్టూ కూడా అనేక గొడవలు జరిగాయి. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించడమే కాకుండా అతని నుంచి విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగానే పూనమ్ జీవిస్తుంది. (పూనమ్ పాండే అరుదైన చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) -
చిక్కుల్లో నటి పూనమ్ పాండే
ముంబై: మోడల్, నటి పూనం పాండే మళ్లీ చిక్కుల్లో పడ్డారు. పూనంతో పాటు ఆమె మాజీ భర్త శాం బాంబేపై కెనకొనా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కెనకొనా ప్రాంతంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చాపోలి డ్యామ్ వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ప్రసారం చేసినందుకు గాను వారిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు పోలీసుల తెలిపారు. 2020లో కనకొనా ప్రాంతంలో ఆమె న్యూడ్ పోటోషూట్లో పాల్గొన్నారని కొందరు పాండేపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చార్జిషీట్ పేర్కొన్నారు.అశ్లీల వీడియోగ్రఫీ, అందరిముందే అభ్యంతరకర నృత్యాలు, పాటల పాడారని వారిపై అభియోగాలు మోపారు. ఇక 2021లో పాండే ఆమె భర్తకు మధ్య విభేదాలు రావడంతో అప్పటి నుంచి వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. తనను శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శాంబాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: Salman Khan: సింగర్ సిద్ధూ హత్య.. సల్మాన్కు గ్యాంగ్స్టర్ లారెన్స్ వార్నింగ్.. అప్రమత్తమైన పోలీసులు -
ఫ్యాన్స్కు పూనమ్ పాండే ఆఫర్
Lock Upp: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్గా వ్యవహరిస్తున్న రియాలిటీ సో ‘లాకప్’. ఇందులో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ షోలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే కంటెస్టెంట్స్ ఓ పెద్ద సీక్రెట్ బయట పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ నుంచి సంచలన రహస్యాలను బయటకు వస్తున్నాయి. అది విని నోళ్లు వెళ్లబెట్టడం ప్రేక్షకుల వంతు అవుతోంది. ఈ సీక్రెట్స్ పలువురు బాలీవుడ్ టీవీ, సినిమా నటినటులకు సంబంధించినవి కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ రియాలిటీ షోలో బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూనమ్ ఈ షోలో తన వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన చేదు అనుభవాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ ప్రేక్షకులకు సంచలన ఆఫర్ ఇచ్చింది. తనని నామినేషన్స్ నుంచి కాపాడితే బంపర్ ఆఫరిస్తానంటూ ప్రామిస్ చేసింది. ఈ వారం తనని చార్జ్ షీట్లోకి వెళ్లకుండా ఓటింగ్తో కాపాడాలని ప్రేక్షకులను కోరుతూ.. ఒకవేళ అలా చేస్తే తాను లైవ్లో టీ షర్ట్ను తొలగిస్తానని కామెంట్స్ చేసింది. చదవండి: రష్మికకు బంపర్ ఆఫర్, ఐటెం సాంగ్ కాదు.. ఏకంగా హీరోయిన్ చాన్స్.. కాగా ఈసారి పూనమ్తో పాటు మునావర్, అజంలి, అజ్మా, అలీ మర్చంట్, వినీత్ కాకర్ పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పూనమ్ కెమెరాలతో ‘ఇప్పుడు నన్ను చూస్తున్న వారిని నేను కోరేది ఒక్కటే. ఈ వారం చార్జ్షీట్ నుంచి నన్ను బయటపడేయండి. నేను మీకు కెమెరా ముందు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను’ అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రకటన విన్న సహా కంటెస్టెంట్స్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకునేందుకు ఉత్సుకత చూపించారు. అంతేకాదు తన ఆఫర్ ఏంటో ప్రేక్షకులకు, ఫ్యాన్స్కు చెప్పాలంటూ ఆమెకు సవాలు విసిరిరారు. దీనికి పూనమ్ అది సర్ప్రైజ్ అని, లైవ్లోనే చెప్తానని అనడంతో పోటీదారుల్లో ఒకడైన వినీత్ కాకర్.. ఆమె చెప్పేవన్ని ఒట్టి మాటలే అంటూ విమర్శించాడు. దీనికి పూనమ్ స్పందిస్తూ.. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని, ఒకవేళ నన్ను నామినేషన్స్ నుంచి రక్షిస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపింది. దీంతో ఆమె కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. మరి దీనిపై హోస్ట్ కంగనా ఎలా రియాక్ట్ అవుతుంది, మరి ప్రేక్షకులు ఆమెను రక్షిస్తారో లేదో వీకెండ్ లైవ్ షో వరకు వేచి చూడాల్సిందే. చదవండి: సర్కారు వారి పాట.. మహేష్బాబు ఫ్యాన్స్కు కిక్కిచ్చే అప్డేట్.. -
మీరు చాలా హాట్గా ఉన్నారు.. మాకు కోచింగ్ ఇవ్వండి: కంటెస్టెంట్తో కంగనా
Kangana Ranaut Praises Poonam Pandey For Seductress Task: బీటౌన్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'లాకప్'. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి వారి రహస్యాలు బయటపెట్టారు. అవి విన్న ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే లాకప్లోని జడ్జిమెంట్ డే ఎపిసోడ్లు సాధారణంగా వివాదాలతో , ఆసక్తికరంగా సాగుతాయి. ఈసారి కూడా కంగానా జడ్జిమెంట్ ఎపిసోడ్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ షో ఇదివరకు ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు విభిన్నమైన టాస్క్లు ఇచ్చారు. అందులో హాట్ బ్యూటీ పూనమ్ పాండేకు 'సమ్మోహనురాలు (సెడక్ట్రస్/సెడ్యూస్)' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో పూనమ్ అదరగొట్టిందని కంగనా ప్రశంసలు కురిపించింది. టాస్క్కు తన బెస్ట్ ఇచ్చిందని పొగడ్తలతో ముంచెత్తింది. చదవండి: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాను.. 4 కేసులు కూడా ఉన్నాయి: లాకప్ కంటెస్టెంట్ 'పూనమ్ మీరు చాలా బాగా ఆడారు. నిజంగా చాలా హాట్గా కవ్వించి అదరగొట్టారు. నాకే హాట్గా అనిపించింది అంటే మీరు ఎంతలా యాక్ట్ చేశారో అర్థమవుతుంది. సెడక్షన్ అనేది ఒక కళ. 64 కళల్లో సమ్మోహన కళ కూడా ఒకటి. మీరు అందులో ఒక మంచి కళాకారిణి. ఇతర మహిళలకు సమ్మోహన కళను నేర్పించేందుకు ఒక పాఠశాలను తెరవండి. మాకు కూడా ఆ కళలో కోచింగ్ ఇవ్వండి.' అంటూ పూనమ్ పాండేను ప్రశంసలతో ముంచెత్తింది కంగనా రనౌత్. ఆమె పొగడ్తలు విని సిగ్గు పడుతూ నవ్వింది పూనమ్. ఇతర కంటెస్టెంట్లు కూడా ఆసక్తిగా ఈ సంభాషణను విన్నారు. ఈ రియాలిటీ షోలో కరణ్వీర్ బోహ్రా, నిషా రావల్, మునావర్ ఫరూఖీ, సారా ఖాన్, అలీ మర్చంట్, సైషా షిండే, పాయల్ రోహత్గీ, బబిదా ఫోగట్, అంజలి అరోరా మిగతా కంటెస్టెంట్లు. చదవండి: 'లాకప్'లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఎందుకంటే ? -
హనీమూన్లో అత్యాచారం చేశానట, ఆమె చెప్పేదంతా చెత్త!
బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఎవరికీ ఓ పట్టాన అర్థం కాదు. సెన్సేషనల్ కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉండే ఆమె, అందరి చూపు తనవైపు తిప్పుకోవడానికే అలా ప్రవర్తించానని ఇటీవల క్లారిటీ ఇచ్చింది. సామ్ బాంబేను పెళ్లాడిన ఆమె వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు. గొడవలు, కొట్లాటలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వీళ్లు చివరికి ఇద్దరూ విడివిడిగా బతుకుతున్నారు. ప్రస్తుతం పూనమ్.. కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వివాదాస్పద షో 'లాకప్'లో కంటస్టెంట్గా పాల్గొంది. చదవండి: హీరో సూర్యను కలిసిన షణ్ముఖ్ జశ్వంత్ ఈ సందర్భంగా షోలో పూనమ్ మాట్లాడుతూ.. 'నాలుగంతస్థులు ఉండే మా ఇంట్లో ప్రైవేట్ గార్డెన్, టెర్రస్.. ఇలా అన్నీ ఉండేవి. ఎప్పుడైనా నేను ఒంటరిగా ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లినా, నాతో నేను టైం స్పెండ్ చేద్దామనుకున్నా అతడు ఒప్పుకునేవాడే కాదు. ఒక్కదానివే ఏం చేస్తున్నావ్ అంటూ తన వెంటే ఉండమనేవాడు. కనీసం నా ఫోన్ కూడా ముట్టుకోనిచ్చేవాడు కాదు. కుక్కపిల్లలను నాతో పడుకోబెట్టుకుంటే నన్ను కొట్టేవాడు. నన్ను హింసించడం, మందు తాగడం వంటివి నాకు అస్సలు నచ్చకపోయేది ' అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై సామ్ బాంబే తీవ్రంగా స్పందించాడు. 'నాలుగేళ్ల నుంచి నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు పెదవి విప్పాల్సిన అవసరం వచ్చింది. నిజానికి మా పెళ్లి మర్చిపోలేని మధురమైన అనుభూతి. సాధారణంగా ఏ రిలేషన్లో అయినా పది శాతం గొడవలు, మనస్పర్థలు వంటివి ఉంటాయి. కానీ అందరూ వాటినే ఎక్కువ ఫోకస్ చేస్తారు. మా విషయంలోనూ అదే జరిగింది. పూనమ్ చెప్పేదంతా పనికిరాని చెత్త. ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉండాలని ఇదంతా చేస్తోంది! గృహ హింస పేరుతో అమాయకులైన ఎంతోమంది మగవాళ్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళ ఒక్క ఫోన్ కాల్ కొట్టిందంటే చాలు పోలీసులు వచ్చి ఆమె భర్తను తీసుకెళ్లి కస్టడీలో ఉంచుతున్నారు. నన్ను అలా సుమారు 20 సార్లు పోలీసులు పట్టుకెళ్లారు, కానీ ఏమీ చేయలేకపోయారు. అంటే మీరే అర్థం చేసుకోండి. అంతదాకా ఎందుకు? మేము హనీమూన్కు వెళ్లినప్పుడు కూడా మాలిస్టేషన్ (అత్యాచారం) చేశానని, లైంగిక వేధింపులకు పాల్పడ్డానని ఫిర్యాదు చేసింది. అది కూడా పెళ్లైన వారం రోజులకే! హనీమూన్లో ఉన్నప్పుడు భర్త అత్యాచారం చేశాడని ఎలా అంటారో నాకైతే అర్థం కాదు. ఆ తర్వాత ఆమె తప్పు తెలుసుకుని మాలిస్టేషన్ అంటే ఏంటో కూడా తెలీదని చెప్తూ ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. కానీ మగవాడి మాటలను ఎవరూ పట్టించుకోరు. అతడు చెప్పేది నిజమైనా సరే, ఎవరూ నమ్మరు' అని సామ్ బాంబే చెప్పుకొచ్చాడు. -
'లాకప్'లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఎందుకంటే ?
Poonam Pandey As Third Contestant In Kangana Lock Upp Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్, మోస్ట్ డేరింగ్ హీరోయిన్ హోస్ట్గా 'లాకప్' అనే రియాల్టీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. మోస్ట్ ఫియర్లెస్ షో అని ప్రచారం చేసిన 'లాకప్' షో ఫిబ్రవరి 27 నుంచి ఆల్ట్ బాలాజీ ఓటీటీ, ఎమ్ఎక్స్ ప్లేయర్లలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో షో నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలను వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మొదటి కంటెస్టెంట్గా నిషా రావల్, రెండో కంటెస్టెంట్గా కాంట్రవర్సీ కమెడియన్ మునవర్ ఫరూఖీని రివీల్ చేశారు. తాజాగా ఈ షోలో మూడో పార్టిస్పెంట్గా బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండేను పరిచయం చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన వీడియోను పూనమ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియోకు 'నేను హాట్గా ఉన్నందుకే లాకప్ చేశారు.' అని రాసుకొచ్చింది పూనమ్. పాండే షేర్ చేసిన ఈ టీజర్ వీడియోలో పూనమ్ ఆరెంజ్ డ్రెస్లో హాట్గా కనిపించింది. ఈ వీడియోతోపాటు లాకప్లో ఉన్న ఒక పిక్ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్లు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) -
'పెళ్లయ్యాక ఏమైందో చూశారుగా, ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి రావొద్దు'
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి పూనమ్ పాండే కంగనా రనౌత్ హోస్ట్గా వ్యవహరించనున్న సెన్సేషనల్ షో లాకప్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ వైవాహిక జీవితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 'పెళ్లి తర్వాత ఇన్ని ఇబ్బందులు రావడం నా దురదృష్టం. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. నేను సామ్ బాంబేను పెళ్లాడాక ఏమైందో చూశారుగా. ఇది అనుకోకుండా జరిగిపోయింది. ప్రస్తుతం నేను సింగిల్గా ఉన్నాను. నాకిప్పుడు ఏ భాగస్వామి తోడు అవసరం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా గతంలోనూ పూనమ్.. తనను భర్త కొడుతున్నాడని గృహహింస కేసు పెట్టిన విషయం తెలిసిందే! ఇదిలా ఉంటే వీరిద్దరూ 2000వ సంవత్సరంలో సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత సామ్ తనను కొట్టడం ప్రారంభించాడని, ఒకసారైతే హత్య చేసినంత పని చేశాడని తీవ్ర ఆరోపణలు గుప్పించింది. కానీ అంతలోనే వైవాహిక జీవితమన్నాక చిన్నచిన్నగొడవలు జరుగుతూనే ఉంటాయని మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. ఆ మరుసటి ఏడాదే సామ్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పూనమ్ గృహహింస కేసు పెట్టగా సామ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. -
అదంతా పబ్లిసిటీ స్టంట్, ఇప్పుడు బాధపడుతున్నా: వివాదాస్పద నటి
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే పూనమ్ పాండే తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రతి ఒక్కరినీ తనవైపుకు తిప్పుకునేందుకు బోల్డ్ స్టేట్మెంట్స్ చేశానని, అదంతా పబ్లిసిటీ స్టంట్ అని తెలియజేసింది. అలా ప్రవర్తించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. సుమారు 17 ఏళ్ల వయసులోనే బాలీవుడ్లో అడుగుపెట్టిన పూనమ్ ఆ సమయంలో ఇండస్ట్రీ గురించి ఎలాంటి అవగాహన లేదంది. అందరికంటే విభిన్నంగా ఉండేందుకు, మీడియాను తనవైపు తిప్పుకోవడం కోసం చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశానంది. ఆ స్టేట్మెంట్స్ చేసినందుకు ప్రస్తుతం బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది తన కెరీర్ పట్ల పేరెంట్స్ కూడా సంతోషంగా లేరని తెలిపింది. కొన్నిసార్లు తను చేస్తున్న పాత్రల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఆమెను కొట్టారని పేర్కొంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలాకాలానికి మంచి అవకాశాలు వస్తున్నాయన్న పూనమ్ ఇప్పుడిక పని మీదే దృష్టి పెడతానని స్పష్టం చేసింది. తనను తాను అక్షయ్ కుమార్లా ఊహించుకుంటున్నట్లు వివరించింది. ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారికి ఓ సలహా కూడా ఇచ్చింది. చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని చెప్పింది. -
భర్తతో గొడవలు..మరోసారి డేటింగ్ చేస్తారా? నటి రిప్లై ఏంటంటే
భర్త సామ్ బాంబే టార్చర్ పెడుతున్నాడంటూ ఆ మధ్య వార్తల్లో నిలిచిన నటి పూనమ్ పాండే తాజాగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. 'సామ్ బాంబే గురించి నేనిప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ప్రస్తుతం ఓ థెరపిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఎవరితోనైనా డేటింగ్ చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఛాన్సే లేదని కుండ బద్ధలు కొట్టింది. ఐదేళ్ల వరకు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోనని స్పష్టం చేసింది. కాగా పూనమ్.. దర్శకుడు సామ్ బాంబేను 2019 సెప్టెంబర్ 1న పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది. ఆ తర్వాత మరోసారి సామ్ తన మీద చేయి చేసుకున్నాడని పూనమ్ ఆరోపించిన విషయం తెలిసిందే! ఈ గొడవ తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. -
భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే
Poonam Pandeys Husband Sam Bombay Arrested: బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం..సామ్బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే..పూనమ్ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్1న పూనమ్-శామ్ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్ బాంబే.. పూనమ్పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది.అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే చేసిన దాడిలో పూనమ్ తీవ్ర గాయాలపాలైంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. 'ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్ నన్ను కొట్టడం..ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను చావబాదాడు. దాదాపు సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. -
Raj Kundra: ఈజీ మనీ కోసం కక్కుర్తి!
Raj Kundra Arrest: పెగాసస్ వివాదం కుదిపేస్తున్న టైంలో.. ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ ఫైనాన్సర్ రాజ్ కుంద్ర(46) పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముంబై పోలీసులు ఇప్పటిదాకా ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ముంబై: లండన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెబ్ సిరీస్ల పేరుతో పోర్న్, సెమీ పోర్న్ కంటెంట్ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటూ ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీస్కు రప్పించుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అటు నుంచి అటే కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ మొత్తం పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత నగ్రాలే నిర్ధారించారు. ఆ లింక్తో.. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఉత్తర ముంబై మలాద్లో మదా ఐల్యాండ్లోని ఓ భవనంలో బూతు సినిమాలు తీస్తున్న ఓ ముఠాను ముంబై ప్రాపర్టీ సెల్(స్పెషల్ పోలీస్) అరెస్ట్ చేసింది. మొత్తం 9 మందిలో నటి కమ్ మోడల్స్ గెహానా వశిష్ఠ్, రోవా ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో యూకే ప్రొడక్షన్ కంపెనీ కెన్రిన్ ఉండడం, దానికి ఉమేశ్ కామత్ హెడ్ కావడం, ఉమేశ్ ఇదివరకు కుంద్రా దగ్గర పని చేయడంతో ప్రాపర్టీ సెల్ విభాగం ఇన్స్పెక్టర్ కేదార్ పవార్, కుంద్రాపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో గతంలో ఓసారి కుంద్రాని పోలీసులు ప్రశ్నించారు కూడా. ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించాకే రాజ్ కుంద్రాని సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై కమిషనర్ తెలిపారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం కుంద్రాను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. Actress Shilpa Shetty's husband & businessman Raj Kundra has been taken for medical examination at JJ hospital by Property Cell of Mumbai Police's Crime Branch.He was later taken to Mumbai Police Commissioner's office.#shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/KeM346ZUzd — MBC TV ODISHA (@MBCTVODISHA) July 20, 2021 ఈజీ మనీ కోసం.. లైవ్ స్రీ్టమింగ్ యాప్లు, ఐపీఎల్లు పెద్దగాకలిసి రాకపోవడంతో తప్పుడు దారిలో సంపాదన కోసమే ఆయన ఈ పని చేసినట్లు ముంబై పోలీసులు నిర్ధారించుకున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజ్ కుంద్రా యువతులను తన మీడియేటర్ల ద్వారా ట్రాప్లోకి దించాడని తెలుస్తోంది. ఈ మేరకు తమతో అగ్రిమెంట్లు చేయించుకున్నాక బలవంతంగా పోర్న్ సినిమాలు తీయించినట్లు బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. హాట్షాట్స్, హాట్హిట్మూవీస్ లాంటి బీ, సీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో ఆ వీడియోలను అప్లోడ్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లలో సైతం వాటిని పోస్ట్ చేయాలని సదరు నటీమణులను ఒత్తిడి చేయడం, ట్విటర్ పేజీలతో ప్రమోట్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు నిర్ధారించారు. శాలువా బిజినెస్ నుంచి.. పంజాబీ కుటుంబానికి చెందిన రాజ్ కుంద్రా స్వస్థలం లూథియానా. చిన్నతనంలోనే అతని ఫ్యామిలీ లండన్కు వలస వెళ్లింది. కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. 18 వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా.. శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. 2004లో బ్రిటిష్-ఏషియన్ రిచ్చెస్ట్ పర్సన్ లిస్ట్లో 198వ ర్యాంక్ దక్కించుకున్నాడు కూడా. 2007కి తిరిగి దుబాయ్కు వెళ్లి.. కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్లో అడుగుపెట్టాడు. ఆ టైంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ మొదలుపెట్టాడు. సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ల పరిచయాలతో పలు స్పోర్ట్స్ బిజినెస్, లైవ్-బ్రాడ్కాస్ట్, గేమింగ్ సంబంధిత వ్యవహారాలతో లెక్కలేనంత సంపాదించాడు. 2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు(కుంద్రాకు రెండో వివాహం). ఆపై ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. 2019లో రాజ్ కుంద్రాకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవార్డు కూడా దక్కింది. ఇక తనకు సంబంధించిన న్యూడ్ ఫొటోలు, వీడియోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ నటి, మోడల్ పూనమ్ పాండే సైతం రాజ్ కుంద్రాపై ఓ దావా వేయగా, ఆ కేసు బాంబే హైకోర్టులో నడుస్తోంది కూడా. -
WTC Final: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్ పాండే
2011 ప్రపంచ కప్ సమయంలో బాలీవుడ్ నటి పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారత్ జట్టు గెలిస్తే బట్టలు విప్పి మైదానమంతా తిరుగుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసి మరోసారి పూనమ్ వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుతున్న సంగతి తెలిసిందే. సౌథాంప్టన్లో జరుగుతున్న ఈ మ్యాచ్పై తన అభిప్రాయం చెప్పాల్సిందిగా తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ అడగ్గా ఆమె స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు పూనమ్ మాట్లాడుతూ.. ‘క్రికెట్ మొదలైందా? జనం క్రికెట్ ఆడుతున్నారా? ఈసారి కూడా భారత జట్టు గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా? అయితే.. ఈ మ్యాచ్ గురించి నాకు తెలియదు’ అంటూ వ్యాఖ్యానించింది. ఇక ఆమె వ్యాఖ్యలపై పూనమ్ భర్త సామ్ బాంబే స్పందిస్తూ.. తనకు బదులుగా ఈ సారి తాను నగ్న ప్రదర్శన చేస్తానని సమధానం ఇచ్చాడు. దానికి ‘వద్దులే నువ్వు చేస్తే ఇండియా ఓడిపోతుంది’ అంటూ పూనమ్ చమత్కారంగా బుదులిచ్చింది. చివరకు తను ఇండియా గెలవాని కోరుకుంటున్నానని పేర్కొంది. కాగా తెలుగులో పూనమ్ ‘మాలిని అండ్ కంపెనీ’ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన ఆమె గతేడాది సెప్టెంబర్ 1న దర్శకుడు సామ్ బాంబేను పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది. చదవండి: గర్భం దాల్చడం నా విషయంలో బాధాకర వార్త: పూనమ్ -
ప్రెగ్నెన్సీ రూమర్లు: నన్ను అడగండి అంటున్న నటి
అమ్మా అని పిలిపించుకోవాలని పెళ్లైన ప్రతి మహిళా కోరుకుంటుంది. పొత్తిళ్లలో పాపాయిని పడుకోబెట్టి ఆడించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటుంది. గర్భవతి అయ్యానన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆమె ఆనందం చెప్పతరం కాదనుకోండి. కానీ తనకు మాత్రం గర్భం దాల్చానని తెలుసుకోవడం బాధించే వార్త అంటోంది బాలీవుడ్ నటి పూనమ్ పాండే. పూనమ్-సామ్ బాంబే దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన నటి ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ తప్పుడు కథనాల ద్వారా తనను అనవసరంగా గర్భవతిని చేసేయకండి అని వ్యాఖ్యానించింది. ప్రెగ్నెంట్ అని తెలియగానే ప్రతి మహిళ సంబరపడుతుంది కానీ తన విషయంలో అలా జరగడం లేదని ఎందుకంటే ఇప్పుడు తాను గర్భవతిని కాదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటివి రాసేముందు కనీసం ఒక మాటైనా తనను అడగమని కోరింది. తన జీవితం తెరిచిన పుస్తకం అన్న పూనమ్ నిజంగా గర్భం దాల్చిన రోజు మిఠాయిలు పంచుతానని పేర్కొంది. కాగా పూనమ్.. దర్శకుడు సామ్ బాంబేను గతేడాది సెప్టెంబర్ 1న పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది. చదవండి: ఎక్కువ కాలం హీరోయిన్గా ఉండాలంటే సమంతలా రాణించాల్సిందే -
మిలింద్ సోమన్ అరెస్ట్, వారు శాంతించారు!
పనాజీ: మోడల్, యాక్టర్ మిలింద్ సోమన్ మీద అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలతో గోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. బుధవారం నాడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన ఫిట్నెస్ను ప్రపంచానికి చూపించడం కోసం బీచ్లో బట్టులు లేకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా మిలింద్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలో మిలింద్ ఫిట్నెస్ను చూసి నెటిజన్లందరూ వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ మిలింద్ అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని గోవా సురక్షా మంచ్ ఆయన మీద ఫిర్యాదు చేసింది. దీంతో గోవా పోలీస్ స్టేషన్లో ఆయన మీద సెక్షన్ 294( పబ్లిక్ ప్లేస్లో అశ్లీలంగా ప్రవర్తించడం), ఐటీ యాక్ట్ 67 కింద ఆయన మీద కేసు నమోదయ్యింది. ఇదిలా వుండగా మిలింగ్ తన న్యూడ్ ఫోటోలను షేర్ చేసినప్పుడు పూనమ్ పాండే గవర్నమెంట్ ఆస్తులలో ఆశ్లీలమైన ఫోటో షూట్లో పాల్గొందని ఆమెపై కేసు నమోదయ్యింది. అనంతరం చాలా మంది ఆమె అభిమానులు పాండేకు ఒక న్యాయం, మిలింద్కు ఒక న్యాయమా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పుడు మిలింద్ మీద కూడా కేసు నమోదు కావడంతో దీనికి సంబంధించి మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మిలింద్ ఫోటో పెట్టి సమానమంటే సమానమే అని కొందరు మీమ్స్ క్రియేట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు పూనమ్కు మద్దతుగా నిలిచిన వారి మనసు ఇప్పుడు చల్లబడి ఉంటుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: బర్త్డే స్పెషల్.. బీచ్లో బట్టలు లేకుండా.. -
అశ్లీల వీడియో షూట్.. పూనమ్ పాండే అరెస్ట్
హాట్ మోడల్, వివాదస్పద నటి పూనమ్ పాండేను గోవా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పూనమ్ ఇటీవల గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆమెపై ఫిర్యాదు చేసింది. దీనికి తోడు పూనమ్ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిపై మరో కేసు నమోదైంది. గోవా సంస్కృతి, చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకే కేసు పెట్టామని గోవా ఫార్వర్డ్ మహిళా విభాగం పేర్కొంది. ఫార్వర్డ్ పార్టీ ఫిర్యాదు మేరకు పూనమ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వీడియో షూట్కు అనుమతి ఇచ్చినందుకు ఇద్దరు పోలీసులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. కాగా, గతంలో పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబే పై దక్షిణ గోవాలోని కెనకోనా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే.సామ్ అహ్మద్ తనపై దాడి చేసి, చెంపదెబ్బ కొట్టినట్లు పూనమ్ ఆరోపించింది. ఆ తర్వాత సామ్ బాంబే బెయిల్ పై విడుదలయ్యాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే పూనమ్ మనసు మార్చుకొని భర్తతో కలిసిపోయి అందరినీ ఆశ్చర్య పరిచింది. -
అశ్లీల వీడియో: పూనమ్ పాండేపై కేసు
పనాజి: హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచారు. నిత్యం వివాదాల్లో నానుతూ ఉండే ఆమెపై తాజాగా కేసు నమోదైంది. గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద పూనమ్ అశ్లీల వీడియోను చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీడియో చిత్రీకరించిన వ్యక్తితో సహా పూనమ్పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోవా సంస్కృతి, చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకే కేసు పెట్టామని గోవా ఫార్వర్డ్ మహిళా విభాగం పేర్కొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పోర్న్ వీడియో గోవాలో వైరల్గా మారింది. (చదవండి: టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) కాగా పూనమ్ లాక్డౌన్లో తన ప్రియుడు సామ్బాంబేను పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్ 1న వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టిన ఆమె భర్త వేధిస్తున్నాడంటూ అదే నెలలో కేసు పెట్టారు. దీంతో గోవా పోలీసులు సెప్టెంబర్ 22న సామ్బాంబేను అరెస్టు చేయగా మరుసటి రోజే అతడికి బెయిల్ మంజూరైంది. ఇది జరిగిన వారం రోజులకే పూనమ్ మనసు మార్చుకున్నారు. మేమిద్దరం పిచ్చి ప్రేమలో ఉన్నామంటూ మళ్లీ భర్తతో కలిసిపోయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. (చదవండి: భర్త గురించి భయంకర విషయాలు చెప్పిన పూనమ్) -
మరో ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే
ముంబై : మోడల్, నటి పూనమ్ పాండే వైవాహిక జీవితం ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకు సాగిపోతోంది. తన భర్త సామ్ బాంబే వేధిస్తున్నాడంటూ కేసు పెట్టిన ఆమె వారం రోజుల్లోనే మనసు మార్చుకుంది. భర్తతో కలిసిపోయి వైవాహిక జీవితాన్ని మళ్లీ కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు శనివారం రాత్రి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాకుండా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్తో ఆమె మాట్లాడుతూ..‘‘మా మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకున్నాం. మళ్లీ కలిసి ఉండబోతున్నాం. మీకు తెలుసా? మేమిద్దం ఒకరిని ఒకరం చాలా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం పిచ్చి ప్రేమలో ఉన్నాం. వైవాహిక జీవితంలోని హెచ్చు, తగ్గులు మమ్మల్ని ఆపలేవ’’ని తెలిపారు. సామ్ బాంబే కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇద్దరూ కలిసి ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు.( ముఖంపై పిడికిలితో గుద్దాడు.. జుట్టు పట్టుకొని! ) కాగా, గత కొన్ని సంవత్సరాలుగా సామ్ అహ్మద్ బాంబే అనే దర్శకుడితో ప్రేమలో ఉన్న ఆమె ఈ నెల 1వ తేదీన అతడ్ని పెళ్లాడింది. పెళ్లయి నెల కూడా తిరగకుండానే సామ్ తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 22వ తేదీన సామ్ బాంబే బెయిల్పై రిలీజ్ అయ్యారు. (పూనమ్ భర్తకు బెయిల్ మంజూరు) -
ముఖంపై పిడికిలితో గుద్దాడు.. జుట్టు పట్టుకొని!
ముంబై: పెళ్లి అయి పట్టుమని నెల రోజులు కాలేదు అప్పుడే భర్త వేధిస్తున్నాడంటూ కేసు పెట్టి రచ్చకెక్కారు నటి, మోడల్ పూనమ్ పాండే. కొంత కాలంగా తన భాయ్ఫ్రెండ్ సామ్ బాంబేను గాఢంగా ప్రేమించిన పూనమ్ పామ్ ఈనెల 1వ తేదిన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తన భర్త వేధిస్తున్నాడని, శారీరక దాడికి పాల్పడుతున్నాడని పూనమ్ సామ్పై గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడే స్థానిక పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు భర్త సామ్ బాంబేను గోవా పోలీసులు సెప్టెంబర్ 22న అరెస్టు చేశారు. అయితే ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 23న బాంబేకు గోవా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భర్తపై ఫిర్యాదు చేయడంపై వివరణ ఇచ్చారు పూనమ్. (పూనమ్ భర్తకు బెయిల్ మంజూరు) సామ్తో బంధం ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేదని. అయితే పెళ్లి చేసుకోవడం వల్ల అతనిలో మార్పు వస్తుందేమోనని భావించినట్లు వెల్లడించారు. సామ్ తన విషయంలో ఆధిపత్యం చేలాయించేవాడని, చిన్న విషయాలకే ఆవేశపడుతుంటాడని పేర్కొన్నారు. గోవాలో జరిగిన విషయాల గురించి పూనమ్ మాట్లాడుతూ.. ‘సామ్కు నాకు ఓ విషయంలో వాదన మొదలైంది. అది మెల్లమెల్లగా పెరిగి గొడవలా మారింది. ఈ క్రమంలో అతను నన్ను కొట్టడం ప్రారంభించాడు. నన్ను అనేక రకాలుగా హింసించాడు. నా ముఖంపై పిడికిలితో గుద్దాడు. నా జుట్టు పట్టుకొని లాకెళ్లి మంచం మూలపై తలతో కొట్టాడు. ఆ సమయంలో నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ ఏదో విధంగా అక్కడి నుంచి బయటపడగలిగాను. హోటల్ సిబ్బంది సహాయంతో పోలీసులను సంప్రదించాను. అప్పుడు అతన్ని తీసుకెళ్లాను. నేను సామ్పై కేసు పెట్టాన’ని తెలిపారు. (పెళ్లి విషయం దాచాలనుకోలేదు) తనను ఓ జంతువులా కొట్టడంతో ఇక తన వైవాహిక జీవితాన్ని ముగించుకుంటానని ఆమె తెలిపారు. ఇక తన దగ్గరకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘నన్ను జంతువులాగా కొట్టిన వ్యక్తి దగ్గరికి తిరిగి వెళ్లాలన్న ఆలోచన లేదు. మా బంధాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి రిలేషన్లో ఉండటం కంటే నేను ఒంటరిగా ఉండటం మేలు. ఇక్కడితో మా పెళ్లికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను’ అని వెల్లడించారు. కాగా మోడల్గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో ‘నాషా’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. ఈ ఏడాది జూలై 27న బాయ్ప్రెండ్ సామ్తో పూనమ్ నిశ్చితార్థం చేసుకున్నారు. సుమారు రెండేళ్లుగా సామ్తో సహజీవనం చేసి పూనమ్ బాంద్రాలోని వారి ఇంటిలో వివాహం చేసుకున్నారు. (ఏడడుగులు వేసిన వేళ) -
పూనమ్ భర్తకు బెయిల్ మంజూరు
పనాజీ: పూనమ్ పాండే భర్త సామ్ బాంబేకు కోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన గోవా కోర్టు.. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కాగా, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే పూనమ్ పాండే ప్రేమించి పెళ్లి చేసుకున్న మూన్నాళ్లకే పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చంపుతానంటూ బెదిరింపులకు దిగాడని భర్త సామ్ బాంబేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని సోమవారం సాయత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ గోవాలోని కానకోన గ్రామంలో పూనమ్ ఓ సినిమా షూటింగ్కు వెళ్లిన క్రమంలో వేధించాడని, లైంగికంగా దాడికి చేశాడని పూనమ్ తన పిర్యాదులో పేర్కొంది. (చదవండి: ఏడడుగులు వేసిన వేళ) కాగా, కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్ పాండే పెళ్లి చేసుకున్నారు. మోడల్ నుంచి నటిగా ఎదిగిన పూనం ఈనెల 10న తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిస్టర్ అండ్ మిసెస్ బాంబే అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చిన పూనం ఇంతలోనే భర్తపై ఫిర్యాదు చేయడం, సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక మోడల్గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో నాషాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో ఇమేజ్ సంపాదించారు. (చదవండి: బన్నీని కలిసేందుకు అభిమాని పాదయాత్ర) -
పెళ్లి విషయం దాచాలనుకోలేదు: పూనమ్
పూనమ్ పాండే.. సోషల్ మీడియా నెటిజన్లకు ఈ పేరు సుపరిచితం. అందాల ఆరబోత, వివాదాస్పద కామెంట్లు, వీడియోలతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఈ భామ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్ పాండే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను గురువారం ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. 'నీతో ఏడు జన్మలు కలిసి నడవాలనుకుంటున్నాను' అనే క్యాప్షన్ కూడా జత చేశారు. ఈ ఇద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఏడడుగులు వేసిన వేళ) ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ తన ప్రేమ ప్రయాణాన్ని,పెళ్లి గురించి మాట్లాడారు. సామ్తో పెళ్లి జరిగిన విషయాన్ని దాచి ఉంచడం తన ఉద్ధేశ్యం కాదని అన్నారు. ‘సామ్ నేను చాలా పేరు పొందిన జంట. కరోనా పరిస్థితి కారణంగా మా వివాహం ప్రైవేటుగా ఉంచాలి అనుకున్నాం అంతే. ఒక ప్రాజెక్ట్ షూటింగ్ సందర్భంగా సామ్ను కలిశాను. అతని ప్రేమలో పడేందుకు నాకు మూడు నెలలు పట్టింది. అప్పటి నుంచి మా ప్రేమ ఓ రొమాంటిక్ బాలీవుడ్ సినిమా లాగా సాగింది. నా దృష్టిలో సామ్ చాలా తెలివైన వాడు. గొప్పవాడు కూడా. మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు దగ్గరగా ఉంటాయి. అతను నా బెస్ట్ ఫ్రెండ్. మా బంధం బలమైనది అందుకే ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం. మహమ్మారి కారణంగా హనీమూన్ ట్రిప్ ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడ్డాక లాస్ఏంజెలెస్కు వెళ్లాలి అనుకుంటున్నాం’ అని చెప్పారు. (బాయ్ ఫ్రెండ్తో పూనమ్ నిశ్చితార్థం!) ఇక మోడల్గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో నాషాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ సంపాదించారు. జూలై 27న బాయ్ప్రెండ్ సామ్తో పూనమ్ నిశ్చితార్థం చేసుకున్నారు. సుమారు రెండేళ్లుగా సామ్తో సహజీవనం చేసి పూనమ్ బాంద్రాలోని వారి ఇంటిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నిశ్చితార్థం చేసుకున్న రెండు నెలల్లోనే పెళ్లి పీటలు ఎక్కి అతనితో ఏడడుగులు వేశారు. -
ఏడడుగులు వేసిన వేళ
ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్తో హల్చల్ చేస్తూ మీడియాలో కనిపించే బాలీవుడ్ భామ పూనమ్ పాండే శుక్రవారం మరోసారి వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈసారి ఆమె తన పెళ్లి వార్తతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పటినుంచో శామ్బాంబేతో ప్రేమలో ఉన్న పూనమ్ శుక్రవారం అతనితో కలిసి ఏడడుగులు వేశారు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ‘‘ఫైనల్గా మేం పెళ్లి చేసుకున్నాం’’ అని ఆనందం వ్యక్తం చేశారు పూనమ్ పాండే. -
బాయ్ ఫ్రెండ్తో పూనమ్ నిశ్చితార్థం!
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవల తన బాయ్ఫ్రెండ్ సామ్ బాంబెతో పూనమ్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. వారిద్దరు రింగ్లు మార్చుకున్న ఫొటోను సామ్ షేర్ చేశారు. ‘చివరకు మేము.. పూర్తి చేసాం’ అని పేర్కొన్నారు. దీనిపై కామెంట్ చేసిన పూనమ్.. బెస్ట్ ఫీలింగ్ అని అన్నారు. (సాయంత్రం నితిన్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్) కాగా, సామ్, పూనమ్లు గత కొద్దికాలంగా డేటింగ్లో ఉన్నారు. ఈ క్రమంలోనే పూనమ్ కూడా తనదైన వ్యాఖ్యలతో పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మే నెలలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఖండిచిన పూనమ్.. తాను సమయంలో ఇంట్లో సినిమా చూస్తూ ఉన్నట్టు తెలిపారు. (‘శభాష్ సైబరాబాద్ పోలీస్.. ఎస్సీఎస్సీ’ ) -
ఫ్రెండ్తో కలిసి పట్టుబడ్డ నటి
ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే, ఆమె స్నేహితుడిపై ముంబై పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై ఈ చర్య తీసుకున్నారు. వారి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి తర్వాత విడిచిపెట్టారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి ఆదివారం రాత్రి 8.05 గంటల సమయంలో బిఎమ్డబ్ల్యూ కారులో తిరుగుతున్నట్టు గుర్తించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. పూనమ్ స్నేహితుడిని బాంద్రా (వెస్ట్)లో నివాసం ఉంటున్న చిత్ర దర్శకుడు సామ్ అహ్మద్ బాంబే(46)గా గుర్తించారు. పూనమ్ పాండే, ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జోన్ 1 డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్సింగ్ నిశందర్ ధ్రువీకరించారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో వీద్దరిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 188, 269, జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. (టాప్లో ప్రియాంక... సల్మాన్!) అయితే పూనమ్ పాండేకు వివాదాలు కొత్త కాదు. గతంలో సంచలన ప్రకటనలతో ఆమె వార్తల్లో నిలిచారు. తన నటనతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువ పాపులర్ అయ్యారు. 2011లో టీమిండియా వన్డే క్రికెట్ ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా నిలబడతానని ప్రకటించి మొదటిసారి ఆమె వెలుగులోకి వచ్చారు. తర్వాత కూడా చాలాసార్లు వివాదాస్పద ప్రకటనలతో మీడియా దృష్టిని ఆకర్షించారు. నాషా, లవ్ ఈజ్ పాయిజన్, మాలిని అండ్ కో, ఆగయా హీరో, ది జర్నీ ఆఫ్ కర్మ తదితర సినిమాల్లో ఆమె నటించారు. కాగా, కొంతకాలంగా పూనమ్, సామ్ అహ్మద్ డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్లో ఊహాగానాలు విన్పిస్తున్నాయి. -
పాక్ మీకు కావాల్సిన కప్ ఇదే : పూనమ్ ఫైర్
ముంబై : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను అవమానిస్తూ పాక్ మీడియా రూపొందించిన యాడ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్ ఇరు దేశాల మధ్య ఉన్న విద్వేషాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇప్పటికే ఈ యాడ్పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. భారత టెన్నిస్ స్టార్, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సతీమణి సానియా మీర్జా సైతం మండిపడింది. మతిలేని ప్రకటనలతో మితిమీరిన ప్రచారం అక్కర్లేదని చివాట్లుపెట్టింది. ఇక తాజాగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఈ యాడ్పై తీవ్రంగా మండిపడింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ‘నిన్ననే నా వాట్సాప్లో పాకిస్తాన్కు సంబంధించిన ఈ యాడ్ను చూశాను. ఓ హీరో చేసిన పనిని వారు అపహాస్యం చేశారు. పాకిస్తాన్ ఇది మంచిది కాదు. ఈ యాడ్పై నా సమాధానం ఏంటంటే? టీ కప్పులపై సెటైర్లు ఎందుకు. వాస్తవానికి మీకు కావాల్సింది. ఈ కప్( తన లోదుస్తులు చూపిస్తూ) డబుల్ కప్’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక పూనమ్ చర్యపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమె చేసిన పనిని మెచ్చుకోగా మరికొందరు తప్పుబడుతున్నారు. (వైరల్ : కప్పు లాక్కెళ్లిపోయిన పాకిస్తాన్..!) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దాదాపు 60 గంటల పాటు పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. గన్స్లింగర్ మీసంతో ఉండే అభినందన్ ఆహార్యం అందరికీ సుపరిచితమే. అయితే అతని ఆహర్యంతో ఉన్న వ్యక్తితో భారత వ్యూహాలపై వ్యంగ్యమైన ప్రకటన పాక్కు చెందిన జాజ్ టీవీ చానెల్ రూపొందించింది. ఆ యాడ్లో పాక్ వర్గాలు మీ ఎత్తుగడలేంటని అడిగితే ఆ వ్యక్తి ‘క్షమించాలి. నేను ఆ విషయాలు చెప్పదల్చుకోలేదు’ అని ముందుకు కదలగా అతని చేతిలోని టీకప్పును లాక్కుంటారు. ఈ యాడ్ ప్రతి భారతీయుడికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ చరిత్రలో పాక్పై భారత్ ఓడి సందర్భాలు లేవు. ప్రస్తుత జట్ల బలబలగాలను గమనిస్తే పాక్ కన్నా భారత జట్టే అభేద్యంగా కనిపిస్తోంది. -
హాట్ స్టార్తో సంపూ
సెటైరికల్ డైలాగులతో సంపూర్నేష్ బాబు సునామీలా దూసుకొచ్చిన ‘సింగం 123’ విడుదలై ఏడాదిపైనే అయ్యింది. ఆ సినిమా తర్వాత ‘కొబ్బరిమట్ట’లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. భవానీ మస్తాన్ దర్శకత్వంలో హాట్ స్టార్ పూనమ్ పాండే ప్రధాన పాత్రధారిగా ఫకృద్దీన్ ఖాన్, విజయ్భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాలో సంపూ అతిథి పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న ఈ సినిమాలో సంపూ క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఈ నెలాఖరున ముంబైలో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఆశిష్ విద్యార్థి, తాగుబోతు రమేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: ఆనెం వెంకటరావు. -
కామెడీ పూనమ్!
‘ఇండియా క్రికెట్ టీమ్ 2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలో తిరుగుతా’ అని స్టేట్మెంట్ ఇచ్చిన మోడల్, నటి పూనమ్ పాండే ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఆమె మాటలపై అప్పట్లో పెను దుమారమే రేగింది. హాట్ ఫొటోలు, కామెంట్స్తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పూనమ్ ‘మాలిని అండ్ కో’ తర్వాత తాజాగా మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. భవానీ మస్తాన్ దర్శకత్వంలో వీబీఆర్ క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాతలు విజయ్భాస్కర్ రెడ్డి, ఫక్రుద్దీన్ షా మాట్లాడుతూ- ‘‘వినోదమే ప్రధానంగా సాగే చిత్రమిది. ట్రయాంగిల్ లవ్స్టోరీ. పూనమ్ పాండే నటన, అందచందాలు యువతను ఆకట్టుకుంటాయి. ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరో కూడా కనిపిస్తారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్. -
ఈ సెలబ్రిటీలు.. అలా నిద్రపోతారట!
సెలబ్రిటీలు దగ్గినా, తుమ్మినా వార్తే అవుతుంది. అభిమానుల్లో వాళ్లకుండే క్రేజ్ అలాంటిది మరి. కొంతమంది సినీతారలు వ్యక్తిగత జీవితం విషయంలో చాలా గోప్యత పాటిస్తారు. కానీ మరికొంతమంది ఓపెన్గా అన్నీ చెప్పేస్తుంటారు. అలా కొందరు తారలు ఓపెన్గా చెప్పిన ఓ చిత్రమైన అలవాటేంటో తెలుసా.. దుస్తులు లేకుండా నిద్రపోవడం. బాలీవుడ్ మ్యాన్లీ హీరో జాన్ అబ్రహాం నటించిన 'డిష్యూం' సినిమా ఇటీవలే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యన జాన్ కేవలం టవల్ మాత్రమే కట్టుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జాన్ పక్కన వరుణ్ ధావన్ కూడా అదే పోజ్లో ఉన్నాడనుకోండి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. తనకి దుస్తులు లేకుండా నిద్రపోవడం ఇష్టమంటూ ఫ్యాన్స్ను పరేషాన్ చేశాడు ఈ డిష్యూం స్టార్ అలాగే 'డిష్యూం' బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా అదే మాట చెప్పి అభిమానులను ఆశ్చర్యపరచింది. నిద్రపోయేటప్పుడు దుస్తులు వేసుకోవడం చాలా చిరాకుగా ఉంటుందంటూ టాప్ సీక్రెట్ను చల్లగా రివీల్ చేసింది. నేనేమైనా తక్కువా అంటూ మరో అడుగు ముందుకేసింది మోడల్, నటి పూనమ్ పాండే. ఈమె నటనతో కన్నా నోటితోనే పాపులర్ అయ్యింది. నగ్నంగానే నిద్రపోవాలి.. ఏమో ఎవరికి తెలుసు, కలలో ఎవరిని కలుసుకుంటామో అంటూ తనకలవాటైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాకెక్కింది. అంతేనా.. ఇంత 'ఓపెన్'గా నిద్రపోయే సెలబ్రిటీలు చాలామందే ఉన్నారట. ఇలాంటి వార్తలు ఎంతమంది ఫ్యాన్స్కు నిద్ర లేకుండా చేస్తాయో! అయినా వ్యక్తిగత విషయాన్ని చిత్రంగా వాళ్లే చెప్పుకున్నప్పుడు.. విచిత్రంగా మనం మాట్లాడుకోమా ఏంటి? -
ప్రెగ్నెన్సీ అని రాస్తారా.. వంద కోట్లు ఇవ్వండి!
అందాల ఆరబోతతో వెలుగులోకి వచ్చిన వివాదాస్పద నటి, మోడల్ పూనం పాండేకు నిత్యం వార్తల్లో ఉండటం ఎలాగో బాగా తెలిసినట్టు ఉంది. ఈ భామ ఇప్పుడు ఓ వెబ్సైట్పై అక్షరాల రూ. వందకోట్ల పరువు నష్టం దావా వేసింది. తాను గర్భం దాల్చి అబార్షన్ చేయించుకున్నట్టు లేనిపోని అసత్యాలను ఆ వెబ్సైట్ ప్రచురించిందని, ఈ కథనాలను తనను తీవ్రంగా బాధించాయని 'నషా' నటి చెప్తోంది. తన గురించి రాసిన కథనం పచ్చి బూటకమని, అందుకే ఆ వెబ్సైట్పై తాను చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నట్టు పూనం తాజాగా ట్విట్టర్లో ప్రకటించింది. 'నేను షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు ఈ కథనం గురించి తెలిసింది. దీంతో తీవ్రంగా మథనపడ్డా. అసలు వాస్తవాలేమిటో తెలుసుకోవాలని నా మేనేజర్ను ఆదేశించా' అని ఆమె పేర్కొంది. 'ఎలాంటి ఆధారం లేకుండా ఆ కథనాన్ని ఎందుకు రాశావని నేను ఆ రిపోర్టర్ను అడిగాను. ఆమె చెప్పింది విని బిత్తరపోయాను. తన వద్ద ఎలాంటి ఆధారం లేకపోయినా.. ఎవరో చెప్పింది విని తాను అది రాసినట్టు ఆమె చెప్పింది. ఇలాంటి జర్నలిజం చూసి నేను షాక్ తిన్నాను' అని రాసుకొచ్చింది 'నషా' నటి. -
మళ్లీ వస్తున్న ‘యోగా’ పాండే...
పూనమ్ యోగం పోతపోసిన సౌందర్యం... యోగాసనాల బాట పట్టింది. అయితేఆధ్యాత్మిక భావనలు మేలుకొల్పుతూ ఆరోగ్యసాధన చేయించే సహజసిద్ధమైన యోగాకు ఇది విభిన్నం. ఆమె యోగా వీడియో ఒక ఆనందసారం. సమ్మోహనాస్త్రం. ఆమె ఇప్పుడు తెలుగు నటి కూడా. ఆమె పూనమ్ పాండే. మాలిని అండ్ కో సినిమా ద్వారా మనకు పరిచయమైన బ్యూటీ క్వీన్ పూనమ్ పాండే క్రికెట్ మ్యాచ్ గెలిస్తే న్యూడ్గా కనిపిస్తా అనే ప్రకటనతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత టీనేజ్ కుర్రాడితో ఆమె చేసిన నషా సినిమా ఓ సంచలనం. గ్లాడ్రాగ్స్ పోటీలు వేదికగా గ్లామర్ రంగంలోకి అరంగేట్రం చేసిన పూనమ్ సృష్టించిన సంచలనాలన్నీ ఒకెత్తయితే తను రిలీజ్ చేసిన యోగా వీడియో ఒక్కటే ఒకెత్తు. వంపు సొంపుల ప్రదర్శన సహితంగా పూనమ్ రూపొందించిన యోగాసనాల వీడియో ఇంటర్నెట్లో ఈ వీడియో హాట్ టాపిక్ అయిపోయింది. మొత్తం మీద యోగా తోడుగా పూనమ్ పాపులారిటీ మరింత పెరిగింది. తన తొలి యోగా వీడియోకి వచ్చిన స్పందనతో మురిసిపోయిన పూనమ్ మరో యోగా వీడియో రూపొందిస్తానని అప్పుడే ప్రకటించింది. ఇప్పుడామె ఆ వీడియో చిత్రీకరణ పూర్తయిందని, దానిని రేపే విడుదల చేయనున్నానని తాజాగా ట్వీట్ చేసింది. తొలి వీడియో చిలకరించిన ఆనందానుభూతుల్ని నెమరువేసుకుంటున్న పూనమ్ అభిమానులు రెండో వీడియో కోసం ఇంకెక్కువ రోజులు నిరీక్షించనక్కర్లేదు. ఎందరో సాధకులు... కొందరే శిక్షకులు పూనమ్ ఒక్కరనే కాదు... అసలు యోగా సాధన అనేది ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లకు నిత్యకృత్యంగా మారిపోయింది. కరీనా, సోనమ్, బిపాసా... తదితర సీనియర్ స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి నిన్నకాక మొన్న వచ్చిన ఆలియాభట్ వంటి క్యూట్ గాళ్స్ దాకా ప్రతి ఒక్కరూ యోగా స్మరణం చేస్తూన్నారు. తమ సౌందర్య రహస్యం ఆసనాలే అంటూ స్పష్టం చేస్తున్నారు. విపరీతమైన ఒత్తిడికి లోను చేసే సినీ పరిశ్రమలో యువతులకు అత్యంత విశ్వసనీయ నేస్తంగా సేదతీర్చే సాధనంగా యోగా స్థిరపడిపోయింది. దాదాపు అందరు హీరోయిన్లూ యోగా సాధనలో మునిగితేలుతున్నప్పటికీ... కొందరు మాత్రమే శిక్షకులుగా మారి వీడియో, డీవీడీలు రూపొందించి విడుదల చేస్తున్నారు. ఈ ట్రెండ్కు మన దగ్గర శ్రీకారం చుట్టింది బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి. మూడున్నర పదులు వయసు దాటుతున్నా చెక్కు చెదరని అందంతో మెరిసిపోయే సార్థక నామధేయురాలైన శిల్ప రిలీజ్ చేసిన డీవీడీ మంచి హిట్ అవడంతో మరికొందరు కూడా అదే బాట పట్టారు. అలాంటివారిలో చెప్పుకోవాల్సిన పేరు లారాదత్తా. బ్యూటీ క్వీన్ కిరీటంతో సినీరంగంలోకి ప్రవేశించిన లారా... యోగా డీవీడీ కూడా మంచి హిట్టయింది. సహజంగానే అందమైన అమ్మాయిలు యోగాసనాలు సాధన చేయడంలో ఉన్న అందం ఈ వీడియోలకు ప్లస్గా మారుతోంది. అయితే వీరి వీడియోల కన్నా మరింత హాట్గా రూపొందించి లాంచ్ చేస్తోంది పూనమ్. -
తొమ్మిది భాషల్లో... పూనమ్ మసాలా
బాలీవుడ్ హాట్గాళ్ పూనమ్ పాండే తెలుగు ప్రేక్షకులను ‘మాలిని’గా అలరించడానికి సిద్ధమవుతున్నారు. వీరు.కె దర్శకత్వంలో పూనమ్ పాండే ప్రధాన పాత్రలో మహేశ్ రాఠీ నిర్మించిన ‘మాలినీ అండ్ కో’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. పూనమ్ పాండే మాట్లాడుతూ - ‘‘ఇదొక మాస్ మసాలా ఎంటర్టైనర్ . ఇందులో నాది విభిన్నమైన పాత్ర’’ అన్నారు. ‘‘పూనమ్ పాండే ఫైట్స్, యాక్షన్ ఈ చిత్రానికే హైలెట్గా నిలుస్తాయి. తెలుగుతో పాటు తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రవి హార్ కూట్, కెమెరా: సి. రామ్ప్రసాద్. -
మాలిని వచ్చేస్తోంది!
పూనమ్ పాండే ఇప్పటివరకూ తెలుగు చిత్రాల్లో నటించకపోయినప్పటికీ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యల ద్వారా ఇక్కడ కూడా బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్నారు. త్వరలో ఆమె మాలినిగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. పూనమ్పాండే, మిన్ ముఖ్యతారలుగా వీరు.కె దర్శకత్వంలో మహేశ్ రాఠి నిర్మించిన చిత్రం ‘మాలిని అండ్ కో’. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కచ్చితంగా అందరినీ అలరించే చిత్రం అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సహ నిర్మాత: రవిహార్ కూట్. -
సల్మాన్కు షాక్ ఇచ్చిన పూనమ్పాండే
-
పూనం పాండే.. 'హాట్' యోగ!
ఒకవైపు ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం వైపు చూస్తుంటే.. వివాదాస్పద మోడల్, నటి పూనం పాండే దీన్ని కూడా క్యాష్ చేసుకోడానికి సిద్ధమైపోయింది. సరికొత్త పోజులతో యోగా చేసి చూపిస్తానంటూ ఓ హాట్ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేసింది. దీన్ని డాగీ స్టైల్ అని చెబుతోంది. అయితే.. ఇలా ఏదైనా ఒక విషయం బాగా ప్రచారంలో ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడం పూనం పాండేకు కొత్తేమీ కాదు. గతంలో భారత జట్టు క్రికెట్ ప్రపంచకప్ గెలుచుకుంటే తాను దుస్తులు విప్పేసి వాళ్లను ఆనందింపజేస్తానని గతంలో ఒకటికి రెండుసార్లు ప్రకటించిందీ అమ్మడు. ఇప్పుడు ప్రపంచ యోగ దినోత్సవాన్ని ఇలా వాడుకుంటోందన్న మాట. -
కౌన్ బనేగా పూనమ్ కా హీరో
‘నా సరసన హీరోగా నటించే అవకాశం ఎవరు కొట్టేస్తారు?’ అని పూనమ్ పాండే లాంటి హాట్ గాళ్ పిలుపు ఇస్తే ఇంకేమన్నా ఉందా? కుర్రకారు రంగంలోకి దిగి, ఆ అవకాశం కోసం అప్లికేషన్ పెట్టేసుకుంటారు. విషయం ఏంటంటే... పూనమ్ కథానాయికగా ‘హెలెన్’ చిత్రం రూపొందనుంది. కానీ, ప్రముఖ నటి హెలెన్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రం కాదిది. పూర్తిగా వేరే కథ. ఇందులో పూనమ్ సరసన కొత్త అబ్బాయిని హీరోగా నటింపజేయాలని నిర్మాతలు అనుకున్నారట. అందుకని ‘కౌన్ బనేగా పూనమ్ కా హీరో’ అనే పోటీ నిర్వహించారు. ‘కౌన్ బనేగా పూనమ్ కా హీరో’ అని వీడియో పొందుపరిచారు. ఈ అవకాశం సంపాదించాలంటే రెండు నిమిషాల వీడియో చిత్రీకరించి, పంపించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పోటీదారులు వందల్లో ఉంటారు. సునాయాసంగా ఎంపిక చేసేయొచ్చు అనుకున్న నిర్మాతల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంకా 25 వేల వీడియోలు వచ్చాయి. మరి.. పూనమ్మా? మజాకానా? -
నాట్ ఏ బయోపిక్!
సినిమాల కంటే వివాదాలు, సెక్సీ పోజులతోనే బాగా పాపులర్ అయిన బాలీవుడ్ గుమ్మ పూనమ్ పాండే ‘నషా’ తరువాత మరో సినిమాకు ఓకే చేసింది. ‘హెలెన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అప్పుడే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలనాటి ఐటెమ్ బాంబ్ ‘హెలెన్’ బయోగ్రాఫికల్ మూవీ ఇదని ప్రచారం జరిగిపోతోంది. వీటికి ఫుల్స్టాప్ పెడుతూ... దీనిపై ఈ చిన్నది క్లారిటీ ఇచ్చింది. ‘హెలెన్జీ బయోపిక్ కాదీ చిత్రం. గ్రేట్ డ్యాన్సింగ్ నటి ఇన్స్పిరేషన్తో కనిపించే ఓ రోల్ అంతే. ఇంతకు మించి ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు బయటపెట్టలేను’ అంటూ చెప్పుకొచ్చింది పూనమ్ పాండే. బయోపిక్ కాదంటున్నా... ఇందులో హెలెన్ సూపర్ హిట్ నెంబర్ ఒకదానికి పూనమ్ స్టెప్పులేస్తుందనేది బీటౌన్ సమాచారం. -
బ్యాంకాక్లో ఫైట్
పూనమ్ పాండే టైటిల్ రోల్లో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా అధినేత కిషోర్ రాఠీ నిర్మిస్తున్న చిత్రం ‘మాలినీ అండ్ కో’. చిత్రనిర్మాత తనయుడు మిలన్ హీరోగా నటిస్తున్నారు. వీరు. కె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫైట్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా వీరు. కె మాట్లాడుతూ -‘‘పూనమ్ పాండే అంటే గ్లామరస్ ఆర్టిస్ట్ అని అందరూ అనుకుంటారు. అది వాస్తవమే అయినా.. శక్తిమంతమైన పాత్రలను కూడా ఆమె అద్భుతంగా చేయగలరని నిరూపించే చిత్రం ఇది. ఈ నెలాఖరున బ్యాంకాక్లో ఓ భారీ ఫైట్ని చిత్రీకరించనున్నాం. హాలీవుడ్ నటుడు జాకీచాన్ చిత్రాలకు ఫైట్ మాస్టర్గా చేసిన రోనీ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ చిత్రీకరణ జరగనుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
పూనమ్ హంగామా!
సంచలన వ్యాఖ్యలకు చిరునామా అనిపించుకున్న పూనమ్ పాండే ఇప్పటివరకు హిందీ చిత్రాలు మాత్రమే చేశారు. ఇప్పుడు తెలుగులో ఆమె ‘మాలినీ అండ్ కో’ చిత్రంలో టైటిల్ రోల్ చేశారు. వీరు .కె దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా అధినేత కిషోర్ రాఠీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పూనమ్ జోరుగా పాల్గొననున్నారు. ఈ నెల 17న వైజాగ్, 18న విజయవాడ, 19న తిరుపతిలో ఆమె ఈ చిత్రవిశేషాలు పంచుకోనున్నారు. 18న గుంటూరులో ఆడియో ఆవిష్కరణ వేడుక జరపనున్నామని నిర్మాత తెలిపారు. -
పూనంపాండే నటిస్తున్న మైథిలి అండ్కో
క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో ఇండియా గెలిస్తే నగ్నంగా ఫోజులిస్తానని ప్రకటించి కలకలం సృష్టించిన బాలీవుడ్ బ్యూటీ పూనం పాండే నటిస్తున్న తమిళ చిత్రం మైథిలి అండ్ కో. కింగ్స్ ప్రైజస్, డి.జి.పోప్ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు.కె దర్శకత్వం వహిస్తున్నారు. పాండియరాజన్, సుమన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తుపాకీ చిత్రం ఫేమ్ జాకీర్ హుస్సేన్ విలన్గా నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ హీరోయిన్ ఓరియంటెడ్ ఇతివృత్తంతో రూపొందిస్తున్న ఈ చిత్రం కథ, కథనం చాలా వైవిధ్యంగా ఉంటాయన్నారు. ఒక సినీ కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రం ఇదని పేర్కొన్నారు. ఒక స్త్రీ తలిస్తే ఏదైనా సాధించగలదన్న విషయాన్ని చెప్పే విధంగా మైథిలి అండ్ కో చిత్రం ఉంటుందన్నారు. నాయకి నివసించే వీధిలో ఒక టైస్టు గ్రూప్ బాంబు పేల్చి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఆ విషయం హీరోయిన్కు తెలియడంతో ఆమె ఎలా సాహసించి వారి దుశ్చర్యలను అరికట్టిందన్నదే చిత్రం కథ అని తెలిపారు. చిత్రంలో ఐదు బ్రహ్మాండమైన పోరాట దృశ్యాలు ఉంటాయని చెప్పారు. చిత్రాన్ని అమెరికా, జర్మనీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై నగరాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. -
హైదరాబాద్లో పూనమ్ పాండే సందడి
-
పూనమ్ పాండే హైదరాబాద్లో ఏం చేస్తుందో!
హైదరాబాద్: బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ పూనమ్ పాండే హైదరాబాద్ వచ్చింది. పూనమ్ పాండే పేరు వినగానే యువకులకు చిత్ర విచిత్ర విన్యాసాలు గుర్తుకొస్తాయి. ఏదో ఒక విధంగా వార్తలలోకి ఎక్కాలని, ప్రచారం పొందాలని అనుకునే ఓ ముద్దు గుమ్మ కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ మధ్య ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన క్రికెటర్ల కోసం నగ్న ప్రదర్శన చేస్తానని పూనమ్ తెగ గొడవచేసిన విషయం తెలిసిందే. సభ్య సమాజం ఒప్పుకోదు కాబట్టి నగ్న ప్రదర్శన చేయలేదు. లేదంటే ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు పూనమ్ పాండే అన్నంత పని చేసి ఉండేది. ఎలాగైతేనేం ఆ రకంగా కావలసినదానికంటే ఎక్కువగానే ప్రచారం పొందింది. వెండితెర అవకాశం దక్కించుకుంది. నషా అనే సినిమాతో యువతకు నిషా ఎక్కించింది. మాలిని అనే తెలుగు సినిమాలో కూడా నటించిన పూనమ్ కొత్త సంవత్సరం వేడుకలలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ 31 రాత్రి నగరంలో జరిగే తన కార్యక్రమాలకు రావాలని హైదరాబాదీలను కోరింది. -
హైద్రాబాదీలకు పూనమ్ పాండే 'కొత్త' కిక్కు!
-
సన్నీ లియోన్ వర్సెస్ పూనం పాండే
మరికొన్ని గంటలు.. కొన్ని వేల వాట్ల సౌండుతో మ్యూజిక్ హోరెత్తుతుంది. బీర్లు బుస్సు బుస్సుమంటూ పొంగుతాయి. హైదరాబాద్ వాసులకు ఆ మద్యం కంటే కొన్ని వేల రెట్లు కిక్కు ఎక్కించేందుకు ఇద్దరు సుందరీమణులు పోటీ పడుతున్నారు. అవును.. ఒకవైపు సన్నీ లియోన్, మరోవైపు పూనం పాండే కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ వచ్చేశారు!! ముంబై.. ఢిల్లీ కంటే మన హైదరాబాదే బెస్టంటూ వీళ్లిద్దరూ కట్టగట్టుకుని మరీ అడుగు పెట్టేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ వెన్యూలో సన్నీ లియోన్ కాలు కదుపుతోందన్న విషయం అందరికీ ఇప్పటికే తెలుసు గానీ, ఆమెకు పోటీగా పూనం పాండే కూడా దిగుతోందన్నది మాత్రం కచ్చితంగా కొత్త విషయమే. చిట్ట చివరి నిమిషంలో ఆమె కార్యక్రమం ఖరారైంది. వాస్తవానికి మాలిని అండ్ కో అనే తెలుగు సినిమాలో పాట షూటింగ్ కోసం పూనం పాండే వస్తున్న విషయం తెలుసుకుని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వాహకులు వెంటనే అమ్మడిని బుక్ చేసేశారట. ఇక ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడుతూ డాన్సులు చేస్తుంటే.. కుర్రకారుకు కిర్రెక్కదా మరి!! -
అభినయానికి ఆస్కారమున్న పాత్ర చేశా!
ఉగ్రవాదం నేపథ్యంలో సాగే రొమాంటిక్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మాలిని అండ్ కో’. ఇటీవలి కాలంలో వివాదాలతో బాగా ప్రాచుర్యం పొందిన పూనమ్ పాండే ఇందులో కథానాయిక. వీరు కె. దర్శకుడు. యమలీల, వినోదం తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కిశోర్రాఠీ నిర్మాత. మంగళవారంతో సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్ర ఇందులో చేశాననీ, తప్పకుండా తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందనీ పూనమ్ పాండే నమ్మకం వెలిబుచ్చారు. కేరళ, హైదరాబాద్ల్లో నిరవధికంగా ఇరవై రోజులు చిత్రీకరణ జరిపామనీ, స్టార్ హీరో సినిమాకు ఉండాల్సిన హంగులన్నీ ఇందులో ఉన్నాయనీ కిశోర్ రాఠీ తెలిపారు. సామ్రాట్, మిలన్, కుషి, ఫరా, కావ్యాసింగ్ తదితరలు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రామ్ప్రసాద్, మాటలు: మరుదూరి రాజా. -
మాలిని అండ్ కో. మూవీ ప్రెస్ మీట్
-
ఒకరు బికినీలో.. ఒకరు నగ్నంగా ఐస్ బకెట్ ఛాలెంజ్
ఏఎల్ఎస్ వ్యాధి నివారణ పరిశోధనల కోసం మొదలుపెట్టిన ఐస్ బకెట్ ఛాలెంజ్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. సెక్సిణి పూనమ్ పాండే బికినీ ధరించి ఈ ఛాలెంజ్లో పాల్గొనాలని నిర్ణయించుకుంటే.. సోఫియా హయత్ ఆమెను మించిపోయింది. తాను పూర్తి నగ్నంగా మారి ఈ ఛాలెంజిని స్వీకరించింది. ఒక బీచ్ కుర్చీ మీద నగ్నంగా పడుకొని ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసింది. తాను ఈ ఛాలెంజ్ని స్వీకరించిన తర్వాత.. గౌహర్ఖాన్ను సవాలు చేస్తూ నామినేట్ చేసింది. అయితే, ఆ తర్వాత గౌహర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, తన సవాలును వెనక్కి తీసుకుంది. పూనమ్ పాండే టూ పీస్ బికినీ ధరించి ఐస్ బకెట్ ఛాలెంజ్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్.. ఈ ఖాన్ల త్రయాన్ని సవాలు చేసింది. ఎప్పుడూ హాట్గా పోజులిచ్చే పూనమ్ పాండే.. ఈ ఛాలెంజ్ స్వీకరించే సమయంలో మాత్రం చాలా చల్లగా అనిపించిందట. -
‘హీట్’ బకెట్..!
‘ఐస్’ బకెట్ చాలెంజ్ నానాటికీ వేడెక్కుతోంది. అసలు ఉద్దేశం తెరవురుగైపోరుు... బాలీవుడ్ తారల అందాల ఆరబోతకు వేదికగా మారిపోతోంది. నిన్న పూనమ్పాండే బికినీలో కిర్రెక్కిస్తే... తాజాగా సొగసరి భావు సోఫియూ హయుత్ ఇంకాస్త వుుందుకెళ్లి నగ్నంగా ఐస్ బకెట్ను మీద గువ్మురించుకుని పిచ్చెక్కించింది. ఓ బీచ్లో ఈ సవాలును స్వీకరించినట్టు సవూచారం. మొత్తానికి ఐస్ బకెట్ చాలెంజ్ కూడా ‘ఎ’ సర్టిఫికెట్ సినివూను తలపించేస్తున్నారు బీ-టౌన్ భావులు. -
ఫూనమ్ పాండే అకౌంట్ ను తొలగించిన ఫేస్ బుక్!
దైనందిక జీవితంలో సోషల్ మీడియా వినియోగం చెప్పలేనంతగా పెరిగిపోయిందనడంలో సందేహం అక్కర్లేదు. సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు పలువురు సోషల్ మీడియా ఆధారంగా అభిమానులకు, కార్యకర్తలకు తమ సందేశాన్ని చేరవేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో బాలీవుడ్ తార పూనమ్ పాండే కూడా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కాని పూనమ్ పాండేకు సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ షాకిచ్చింది. పూనమ్ పాండే అకౌంట్ ను ఫేస్ బుక్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2.1 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించడం వెనుక కారణాలను ఫేస్ బుక్ సంస్థ తెలుపలేదు. తన ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించారంటూ పూనమ్ పాంటే ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. నిజంగా బాధగా ఉంది. నా అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ ను ఫేస్ బుక్ తొలగించింది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఏం చేస్తే ఫేస్ బుక్ అకౌంట్ మళ్లీ వెనక్కి వస్తోందో చెప్పండి అంటూ ట్విటర్ లో పూనమ్ ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఎవరైనా సరే అసభ్యకరమైన, అశ్లీలకరంగా ఉండే అంశాలను పోస్ట్ చేస్తే ఫేస్ బుక్ అకౌంట్లను సాధారణంగా నిలిపివేస్తోంది. పూనమ్ పాండే అకౌంట్ నిలిపివేయడం వెనుక కారణాల తెలియాల్సి ఉంది. కావున ఎవరైనా సోషల్ మీడియాను హద్దు మీరి ప్రవర్తిస్తే ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది.. జాగ్రత్త! -
ఆమె అందమే హైలైట్!
పూనమ్పాండే కథానాయికగా అమిత్ సక్సేనా దర్శకత్వంలో బాలీవుడ్లో రూపొందిన చిత్రం ‘నషా’. ఈ చిత్రం ‘తేరా నషా’గా తెలుగులో విడుదల కానుంది. ఇ.వి.ఎన్.చారి ఈ అనువాద చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాలను ఇటీవల హైదరాబాద్లో విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్గౌడ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. పూనమ్పాండే అందం, అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ఈ శనివారం చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు
సంచలన తార పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘నషా’, తెలుగులో ‘తేరా నషా’గా అనువాదమవుతోంది. నిర్మాత ఈవీఎన్ చారి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘జిస్మ్’ ఫేమ్ అమిత్ సక్సేనా ఈ సినిమాకు దర్శకుడు. ఈవీఎన్ చారి మాట్లాడుతూ -‘‘ఈ తరహా కథాంశాన్ని ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు. పూనమ్ పాండే తన అందచందాల్ని ఆవిష్కరించడంతో పాటు చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. సంగీత్-సిద్దార్థ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హిందీలో విజయం సాధించినట్టుగానే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం’’ అని చెప్పారు. -
ఫిట్నెస్ అంటే నాదే
నాలాంటి ఫిట్నెస్ గల హీరోయిన్లు దక్షిణాదిలోనే లే రు అంటోంది బాలీవుడ్ బ్యూటీ పూనం పాండే. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే ఈ అమ్మడి కన్ను ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడింది. ముఖ్యంగా తమిళ చిత్రాల్లో నటించాలనే ఆకాంక్షను ఈ భామ చెప్పకనే చెబుతోంది. ఇటీవల కన్నడ చిత్ర పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసిన పూనం పాండే ఐటమ్ సాంగ్ కోసం బెంగుళూరు వచ్చింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ ఇలాంటి ఐటమ్సాంగ్స్ ఆడటం తనకిదే తొలిసారి అని వెల్లడించింది. అయితే తనకు బాలీవుడ్లో బికినీ భామ, స్విమ్ సూట్ బ్యూటీ అనే పేరు ఉందని పేర్కొంది. అయితే ఐటమ్సాంగ్లో నటించడం వినూత్న అనుభవం అని చెప్పుకొచ్చింది. తాను చిన్న వయసు నుంచే హిందీలోకి అనువాదం అయ్యే తమిళ, కన్నడ చిత్రాలను అధికంగా చూస్తుంటానని తెలిపింది. ఆయా చిత్రాల్లోని పాటల సన్నివేశాలను, పోరాట దృశ్యాలను ఇష్టంగా తిలకిస్తానని చెప్పింది. ముఖ్యంగా దక్షిణాది హీరోయిన్లంటే ప్రత్యేక అభిమానం అని అంది. అయితే తనలా డాన్స్ చేయడానికి ఫిట్ అయిన శరీరం లేకపోయినా వాళ్లు చాలా ఎనర్జీతో డాన్స్ చేస్తున్నారని చెప్పింది. తనకు ప్లస్పాయింట్ వ్యక్తిత్వమేనని, దాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారని పూనంపాండే సొంత డబ్బా కొట్టుకుంటోంది. -
బ్రెజిల్ గెలిస్తే మళ్లీ.. సెక్సీ బాంబ్ పూనం ఆఫర్
మైసూరు (కర్ణాటక): ‘నా ఫేవరేట్ బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ ఫుట్బాల్లో గెలిస్తే.. ఏం చేస్తానో చెప్పాలని ఉంది. అయితే గుడి ముందు చెప్పలేకపోతున్నా..’ అని బాలీవుడ్ నటి, సెక్సీ బాంబ్ పూనం పాండే మళ్లీ బాంబ్ పేల్చింది. క్రికెట్లో ప్రపంచ కప్ను భారత్ గెలుచుకుంటే నగ్నంగా పోజులిస్తానని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె బుధవారం మైసూరుకు వచ్చింది. చాముండేశ్వరి మాత గుడిలో కొంత భక్తిపూర్వకంగా కనిపించిం ది. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రెజిల్ గెలిస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటానో... ఇదివరకే ఓ వీడియోను విడుదల చేశానని, త్వరలోనే మరో వీడియో విడుదల చేస్తానని ప్రకటించింది. -
పూనమ్ పాండే అసభ్య ప్రవర్తన.. అరెస్టు
టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే చాలు.. బట్టలిప్పేస్తానంటూ బహిరంగంగా ప్రకటనలు చేసి, బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నటీమణి పూనం పాండేను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ముంబైలోని మీరా రోడ్డులో ఆమెకు అరదండాలు వేశారు. బహిరంగం ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పూనమ్ పాండేపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం పోలీసులు ఆమెను గట్టిగా హెచ్చరించి, వదిలిపెట్టారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చిట్టచివరిసారిగా పూనమ్ పాండే బాలీవుడ్లో నటించిన సినిమా.. నషా. ఆ తర్వాత ఆమెకు సినిమా ఛాన్సులు కూడా ఏమీ రాలేదు. దాంతో ఇలా ఏదో ఒక పిచ్చిపని చేసి వార్తల్లో ఉండాలన్నదే ఆమె లక్ష్యంలా కనిపిస్తోంది. -
పూనమ్ పాండే పీఎం అయితే...!
-
అర్ధనగ్నంగా 'నమో'నమః
-
అర్ధనగ్నంగా 'నమో'నమః
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశమంతా చుట్టేస్లూ ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై వ్యంగ్య వాగ్బాణాలు సంధిస్తూ దూసుకుపోతున్నారు. పదుదైన మాటలతో రాజకీయ వాతావరణాన్ని వేడిక్కిస్తున్నారు. మోడీకి మద్దతుగా ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రచారం చేస్తుంటే గుజరాత్కు చెందిన మోడల్ మేఘనా పటేల్ మాత్రం వినూత్న ప్రచారానికి దిగింది. అర్ధనగ్నంగా ఫొటోలకు పోజిచ్చి.. మోడీకి ఓటేయమని అర్థించింది. పలు సినిమాలతోపాటు సీరియళ్లలో నటించిన మేఘన ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ఈ ఫొటోలు నెట్లో, ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా రావడంతో మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మద్దతు తమకక్కర్లేదని, ప్రచారం కోసమే మేఘన ఇలా అసభ్యకర చర్యలకు దిగిందని మండిపడింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే, తన చర్యలను అసభ్యకరమనడాన్ని మేఘన ఖండించింది. తాను శరీర వర్ణంలో కలిసిపోయేలా ఉన్న దుస్తులు వేసుకున్నానని, మోడీకి తాను మద్దతు తెలిపే విధానం ఇదేనని గడుసుగా సమాధానం ఇచ్చింది. మోడీకి మద్దతు తెలిపే అందాల భామల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ కూడా కొద్ది రోజుల క్రితం మోడీకి మద్దతు ప్రకటించింది. ‘ద బ్యాచిలరెట్ ఇండియా- మేరే ఖయాలోంకీ మల్లిక’ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్లిక... తన షోలో నరేంద్ర మోడీ పాల్గొంటే ఆయన కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అక్కడితే ఆగకుండా మోడీని ‘పర్ఫెక్ట్ బ్యాచిలర్’గా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మల్లిక అభివర్ణించింది. తాజాగా మేఘనా పటేల్ తన అభిమాన నాయకుడికి 'అర్ధనగ్న' ప్రదర్శనతో ప్రచారం కల్పించింది. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా నిలబడతానని ప్రకటించి అప్పట్లో పూనమ్ పాండే సంచలనం రేపింది. దాంతో రాత్రికి రాత్రే ఆమె పాపులరయింది. ఇప్పుడు మేఘన కూడా ఇదే దారిలో వెళుతున్నట్టు కనిపిస్తోంది. 'అర్ధనగ్న' ప్రచారాన్ని పాలిటిక్స్లో ప్రవేశపెట్టి ఇప్పటికే వార్తల్లో నిలిచింది మేఘన. మున్ముందు ఆమె ఇంకా ఎన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి. -
పూనమ్ పాండే వెబ్సైట్ హ్యాక్.. పాకిస్థానీ పాత్ర
ముంబై: హాట్ హాట్ ఫోజులు, సంచలన వ్యాఖ్యలు, ట్వీట్లతో ఎలాగోలా వార్తల్లో నిలిచే బాలీవుడ్ ముద్దుగుమ్మ, మోడల్ పూనమ్ పాండేకు ఈసారి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. పూనమ్ వెబ్సైట్ ‘www.poonampandey.in’ ను ఆదివారం పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. దీంతో అవాక్కయిన పూనమ్ ముంబై సైబర్ క్రైం సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెబ్సైట్ను హ్యాక్ చేశారని తెలియగానే షాక్కు గురయ్యానని ఈ మోడల్ భామ చెప్పింది. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పుకొచ్చింది. హ్యాక్ చేసిన వ్యక్తి పాకిస్థాన్, కాశ్మీర్ సంబంధిత విషయాల్ని పూనమ్ సైట్లో రాశాడు. ఈ విషయాల్ని పూనమ్ ట్వీట్ చేసింది. షాక్ నుంచి తేరుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే వెబ్సైట్ తన నియంత్రణలోకి వస్తుందని పేర్కొంది. కొత్త లుక్, మరింత మసాల వార్తలతో ముందుకొస్తానంటూ ముక్తాయించింది. -
నన్ను బలిపశువును చేయకండి: పూనమ్
ముంబై: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు తనను బాధ్యురాలిని చేయడం తగదని బాలీవుడ్ నటి పూనమ్ పాండే పేర్కొన్నారు. ఫోటోషూట్లలో అసభ్యకరంగా ఫోజులిస్తూ, మ్యాగజైన్ ముఖ చిత్రాలపై అర్ధ నగ్నంగా కనబడే పూనమ్ లాంటి తారల వల్లే దేశంలో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని విమర్శల నేపథ్యంలో ఆమె పెదవి విప్పారు. అత్యాచార ఘటన లు జరగడానికి తాను ఎంత మాత్రం బాధ్యరాలిని కాదన్నారు. ఐఎన్ఎస్తో మంగళవారం మాట్లాడిన ఆమె..’ రేప్ ఘటనలపై నన్ను బలిపశువుని చేస్తున్నారని, నా సినిమాలు ఎప్పుడు మహిళలను కించపరిచే విధంగా ఉండవన్నారు. ఇటువంటి దురాఘాతాలకు నా చిత్రాలు వ్యతిరేకమన్నారు. రెండు రోజుల క్రితం ముంబై ఫోటో జర్నలిస్ట్పై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకిత్తించడంతో పూనమ్పై విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అత్యాచార ఘటనకి తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా .. బాధ్యురాలిని చేయడం బాధ కల్గిస్తుందన్నారు. అంతకముందు కూడా ఇటువంటి ఉదంతాలు జరగలేదా అని పూనమ్ ప్రశ్నించారు. గతంలో ఢిల్లీలో నిర్భయపై జరిగిన రేప్ ఘటనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని ఎదురు ప్రశ్నించారు. దేశంలో చట్టాలు విఫలం చెందడం వల్లే ఇటువంటి ఘటనలు పునారావృతమవుతున్నాయని ఆమె మండిపడ్డారు. -
హైదరాబాద్ లో ఫూనమ్ పాండే