semifinals
-
Ranji Trophy: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
నాగ్పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ కీలక ఘట్టానికి చేరింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్ మ్యాచ్ల్లో మాజీ చాంపియన్ గుజరాత్తో కేరళ జట్టు... విదర్భతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు తలపడుతున్నాయి. గత ఏడాది టైటిల్ కోసం తుదిపోరులో పోటీపడిన విదర్భ, ముంబై ఈసారి సెమీఫైనల్లోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై మరోసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని చూస్తుంటే... ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న విదర్భ ముంబైకి చెక్ పెట్టాలని భావిస్తోంది. అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి టీమిండియా ఆటగాళ్లు ఉన్న ముంబై ఫేవరెట్గా బరిలోకి దిగనుండగా... విదర్భ జట్టు సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్పై ఎక్కువ ఆధార పడుతోంది. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ సెమీఫైనల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ‘నాన్ ట్రావెలింగ్ రిజర్వ్’గా ఎంపికైన యశస్వి జైస్వాల్ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగుతాడనుకుంటే... గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. జైస్వాల్ ప్రస్తుతం బీసీసీఐ పర్యవేక్షణలో బెంగళూరులో ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నాడు. జైస్వాల్ అందుబాటులో లేకపోయినా... ముంబై జట్టు బ్యాటింగ్ విభాగానికి వచి్చన ఇబ్బందేమీ లేదు. ఆయుశ్ మాత్రే, ఆకాశ్ ఆనంద్, సిద్ధేశ్ లాడ్, రహానే, సూర్యకుమార్, దూబే, షమ్స్ ములానీ, శార్దుల్, తనుశ్ రూపంలో ముంబై జట్టుకు తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది. తాజా సీజన్లో అత్యధిక మ్యాచ్ల్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లే ముంబై జట్టును ఆదుకున్నారు. హరియాణాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ ఎనిమిదో వికెట్కు 183 పరుగులు జోడించి పటిష్ట స్థితికి చేర్చారు. ఈ సీజన్లో వీరిద్దరితో పాటు శార్దుల్ బ్యాటింగ్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ నేపథ్యంలో టాపార్డర్ కూడా రాణిస్తే ముంబైకి తిరుగుండదు. జోరు మీదున్న కరుణ్ నాయర్.. ఫార్మాట్తో సంబంధం లేకుండా మైదానంలో అడుగు పెడితే సెంచరీ చేయడమే తన కర్తవ్యం అన్నట్లు విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ దూసుకెళ్తున్నాడు. విజయ్ హజారే టోర్నీలో వరుస సెంచరీలతో హోరెత్తించిన ఈ సీనియర్ బ్యాటర్ రంజీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై కూడా భారీ శతకం నమోదు చేశాడు. నాయర్ మినహా విదర్భ జట్టులో స్టార్లు లేకపోయినా... సమష్టి ప్రదర్శనతో ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. అథర్వ తైడె, ధ్రువ్ షోరే, ఆదిత్య ఠాక్రె, యశ్ రాథోడ్, కెపె్టన్ అక్షయ్ వాడ్కర్తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ సీజన్లో 728 పరుగులు చేసిన యశ్ రాథోడ్ విదర్భ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కరుణ్ నాయర్ (591), అక్షయ్ వాడ్కర్ (588) కూడా భారీగా పరుగులు సాధించి మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, ఆదిత్య ఠాక్రె, నచికేత్ భట్ కీలకం కానున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే తాజా సీజన్లో 59 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై టాపార్డర్ నిలకడలేమిని సొమ్ము చేసుకుంటూ డిఫెండింగ్ చాంపియన్పై పైచేయి సాధించాలని విదర్భ యోచిస్తోంది.కేరళ నిరీక్షణ ముగిసేనా!అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానున్న మరో సెమీఫైనల్లో గుజరాత్తో కేరళ తలపడనుంది. జమ్మూ కశీ్మర్తో క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా కేరళ జట్టు ముందంజ వేయగా... సౌరాష్ట్రతో ఏకపక్షంగా సాగిన క్వార్టర్స్ మ్యాచ్లో గెలిచి గుజరాత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 2016–17లో చాంపియన్గా నిలిచిన గుజరాత్ జట్టు ఆ తర్వాత 2019–20 సీజన్లో మాత్రమే సెమీస్కు చేరింది. మరోవైపు కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రంజీ ట్రోఫీలో ఫైనల్కు చేరుకోలేకపోయింది. గుజరాత్ జట్టు తరఫున కెపె్టన్ చింతన్ గాజా, ప్రియాంక్ పంచాల్, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, మనన్ హింగ్రాజియా, జైమీత్ పటేల్, ఉర్విల్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా మిడిలార్డర్లో జైమీత్, ఉర్విల్, మనన్ కీలక ఇన్నింగ్స్లతో గుజరాత్ జట్టు సునాయాసంగా సెమీస్కు చేరింది. ఈ సీజన్లో 582 పరుగులు చేసిన జైమీత్ గుజరాత్ తరఫున ‘టాప్’ స్కారర్గా కొనసాగుతున్నాడు. మనన్ 570 పరుగులు చేశాడు. బౌలింగ్లో అర్జాన్ నాగ్వస్వల్లా, చింతన్ గాజా, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు. మరోవైపు సచిన్ బేబీ సారథ్యంలోని కేరళ జట్టు... క్వార్టర్స్లో జమ్మూకశ్మీర్పై చూపిన తెగింపే సెమీస్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్లో సల్మాన్ నిజార్, మొహమ్మద్ అజహరుద్దీన్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, రోహన్ కున్నుమ్మల్ కీలకం కానున్నారు. క్వార్టర్స్లో నిజార్, అజహరుద్దీన్ పోరాటం వల్లే కేరళ జట్టు సెమీస్కు చేరగలిగింది. ని«దీశ్, బాసిల్ థంపి, జలజ్, ఆదిత్య, అక్షయ్ బౌలింగ్ భారం మోయనున్నారు.48 తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీలో ముంబై జట్టు ఇప్పటి వరకు 48 సార్లు ఫైనల్లోకి ప్రవేశించింది. ఇందులో 42 సార్లు విజేతగా నిలువగా... 6 సార్లు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. -
ఫైనల్ బెర్త్ కోసం...
కౌలాలంపూర్: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తూ అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ టైటిల్ నిలబెట్టుకునే అర్హత కోసం సెమీఫైనల్స్కు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు ఒక ఎత్తయితే... ఈ రోజు ఆడే మ్యాచ్ ఒక ఎత్తు! ఎందుకంటే ఇన్నాళ్లు లీగ్ దశలో, సూపర్ సిక్స్లో తన గ్రూపులోని ప్రత్యర్థుల్ని చిత్తు చేసిన నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత్ ఇప్పుడు అసలైన సెమీఫైనల్ సవాల్కు రె‘ఢీ’ అయ్యింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ ఆడుతుంది. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. ఈ ప్రపంచకప్లో భారత్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ టీనేజ్ సంచలనం గొంగడి త్రిష ఫామ్ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు రేపుతోంది. బౌలింగ్లో వైజాగ్ సీమర్ షబ్నమ్ సహా ఆయుష్ , మిథిల, వైష్ణవి నిలకడగా రాణిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా ఆడుతున్న ప్పటికీ భారత్ను నిలువరిస్తుందో లేదో చూడాలి. చదవండి :తాలిబన్లను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు -
తగ్గేదేలే...
టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్గా రికార్డు సృష్టించేందుకు నొవాక్ జొకోవిచ్ రెండు విజయాల దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఈ సెర్బియా దిగ్గజం 12వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రికార్డుస్థాయిలో 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన జొకోవిచ్ కేవలం గత ఏడాది మాత్రమే తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గత ఏడాది వింబుల్డన్ టోర్నీలో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ రికార్డు నెలకొల్పేందుకు జొకోవిచ్కు అవకాశం లభించింది. కానీ తుదిపోరులో స్పెయిన్ యువతార కార్లోస్ అల్కరాజ్ అద్వితీయ ఆటతీరుతో జొకోవిచ్ ఆశలను వమ్ము చేశాడు. తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే ‘గ్రాండ్’ రికార్డు అందుకోవాలనే లక్ష్యంతో జొకోవిచ్ ఈసారి పక్కా ప్రణాళికతో వచ్చాడు. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఐదుసార్లు రన్నరప్గా నిలిచిన బ్రిటన్ స్టార్, తన చిరకాల ప్రత్యర్థి ఆండీ ముర్రేను కోచ్గా నియమించుకున్నాడు. ముర్రే నియామకం సరైనదేనని ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్ ఆటతీరును పరిశీలిస్తే తెలుస్తోంది. క్వార్టర్ ఫైనల్లో పెద్ద అడ్డంకి అల్కరాజ్ను నాలుగు సెట్ల పోరులో జొకోవిచ్ అధిగమించాడు. సెమీఫైనల్లో జొకోవిచ్ జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ రూపంలో మరో కీలక పరీక్షకు సిద్ధంకానున్నాడు. అయితే గ్రాండ్స్లామ్ టోర్నీల్లో జ్వెరెవ్తో పోటీపడ్డ మూడుసార్లూ జొకోవిచే గెలుపొందడం గమనార్హం. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 2023, 2024లలో విజేతగా నిలిచిన సబలెంకాకు ఈ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లో గట్టిపోటీ ఎదురైంది. అయితే సబలెంకా తన ఆధిపత్యం చాటుకొని ‘హ్యాట్రిక్’ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మెల్బోర్న్: ‘ఈసారి కాకపోతే మరెప్పుడూ కాదు’ అన్న తరహాలో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన శక్తినంతా ధారపోస్తూ, అపార అనుభవాన్ని రంగరిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్లో పోరాడుతున్నాడు. 37 ఏళ్ల వయస్సులో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ అందుకోవాలనే పట్టుదలతో మెల్బోర్న్లో అడుగు పెట్టిన జొకోవిచ్ ఎంతో ప్రమాదకరమైన అల్కరాజ్ అడ్డంకిని దాటేశాడు. కొత్త కోచ్ ఆండీ ముర్రే రచించిన వ్యూహాలను కోర్టులో అమలు చేసిన జొకోవిచ్... నాలుగు సెట్లలో స్పెయిన్ స్టార్ అల్కరాజ్ ఆట కట్టించేశాడు. 12వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 4–6, 6–4, 6–3, 6–4తో మూడో సీడ్ అల్కరాజ్ను ఓడించాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఆట అబ్బురపరిచింది. జొకోవిచ్ను నిలువరించేందుకు 21 ఏళ్ల అల్కరాజ్ అన్ని అస్త్రాలను ప్రయోగించినా...సెర్బియా స్టార్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ర్యాలీ హోరాహోరీగా సాగుతుంటే హఠాత్తుగా దానిని డ్రాప్ షాట్గా మలిచి పాయింట్లు నెగ్గడం అల్కరాజ్కు అలవాటు. అయితే ఈసారి అల్కరాజ్ ఈ ‘డ్రాప్ షాట్’ల వ్యూహానికి పక్కాగా సిద్ధమై వచ్చిన జొకోవిచ్ సమర్థంగా అడ్డుకున్నాడు. 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో మూడో గేమ్లో, తొమ్మిదో గేమ్లో జొకోవిచ్ సర్వీస్లను అల్కరాజ్ బ్రేక్ చేశాడు. అదే జోరులో తొలి సెట్ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ కోల్పోవడంతో జొకోవిచ్పై ఒత్తిడి పెరిగింది. అయితే ఒత్తిడిలోనే జొకోవిచ్లోని మేటి ఆటగాడు మేల్కొన్నాడు. అల్కరాజ్ కంటే అద్భుతంగా ఆడుతూ ముందుకు వెళ్లాడు. రెండో సెట్లోని రెండో గేమ్లోనే అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలో వచ్చాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన అల్కరాజ్ ఐదో గేమ్లోనే జొకోవిచ్ సర్వీస్ను బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను కాపాడుకున్నారు. అయితే పదో గేమ్లో అల్కరాజ్ సర్వీస్లో ఒక్కసారిగా దూకుడు పెంచిన జొకోవిచ్ ఒక్క అవకాశం ఇవ్వకుండా సర్వీస్ను బ్రేక్ చేసి 50 నిమిషాల్లో రెండో సెట్ను నెగ్గాడు. మూడో సెట్లో కూడా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఆరో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను జొకోవిచ్ బ్రేక్ చేయగా... ఏడో గేమ్లో జొకోవిచ్ సర్వీస్ను అల్కరాజ్ బ్రేక్ చేశాడు. ఎనిమిదో గేమ్లో మళ్లీ అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్లో తన సర్వీస్ను కాపాడుకొని 50 నిమిషాల్లో సెట్ను 6–3తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్లోని తొలి గేమ్లోనే అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన అన్ని సర్వీస్లను కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 3 గంటల 28 నిమిషాల్లో 7–6 (7/1), 7–6 (7/0), 2–6, 6–1తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)పై గెలిచి మూడోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఫైనల్లో చోటు కోసం జొకోవిచ్తో జ్వెరెవ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 8–4తో జ్వెరెవ్పై ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో వీరిద్దరు మూడుసార్లు (2021 యూఎస్ ఓపెన్ సెమీఫైనల్; 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్; 2019 ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్) పోటీపడగా... మూడుసార్లూ జొకోవిచే గెలిచాడు. వరుసగా 19వ విజయంతో... మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్), 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో వరల్డ్ నంబర్వన్ సబలెంకా 6–2, 2–6, 6–3తో 27వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై, బదోసా 7–5, 6–4తో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో సబలెంకాకిది వరుసగా 19వ విజయం కావడం విశేషం. వరుసగా రెండేళ్లు (2023, 2024) ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సబలెంకా ఈసారీ టైటిల్ సాధిస్తే మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997, 1998, 1999) తర్వాత ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ప్లేయర్గా గుర్తింపు పొందుతుంది. పావ్లీచెంకోవాతో ఒక గంట 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సబలెంకా 29 విన్నర్స్ కొట్టింది. తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. బదోసాతో ఒక గంట 43 నిమిషాలపాటు జరిగిన పోరులో కోకో గాఫ్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. కోకో గాఫ్ సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన బదోసా ఈ గెలుపుతో తన కెరీర్లో ఆడుతోన్న 20వ గ్రాండ్స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్లో లొరెంజో సొనెగో (ఇటలీ)తో బెన్ షెల్టన్ (అమెరికా); అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో యానిక్ సినెర్; మహిళల సింగిల్స్ రెండు క్వార్టర్ ఫైనల్స్లో మాడిసన్ కీస్ (అమెరికా)తో స్వితోలినా (ఉక్రెయిన్); ఎమ్మా నవారో (అమెరికా)తో ఇగా స్వియాటెక్ (పోలాండ్) తలపడతారు. బోపన్న జోడీ ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–షుయె జాంగ్ (చైనా) జోడీ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షుయె జాంగ్ ద్వయం 6–2, 4–6, 9–11తో జాన్ పీర్స్–ఒలివియా గడెస్కీ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది.50 ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధికంగా 50 సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీలలో పురుష సింగిల్స్ సెమీఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ఆల్టైమ్ రికార్డు క్రిస్ ఎవర్ట్ (52 సార్లు; అమెరికా) పేరిట ఉంది. -
సెమీఫైనల్లో భారత్
మస్కట్: డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్ టోర్నీలో సెమీఫైనల్స్కు చేరింది. తద్వారా జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సంపాదించింది. ఆసియా టైటిల్ వేటలో భారత్ రెండు అడుగుల దూరంలో ఉంది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 9–0 గోల్స్ తేడాతో థాయ్లాండ్పై ఏకపక్ష విజయం సాధించింది. భారత ఫార్వర్డ్ ప్లేయర్ దీపిక అద్భుతంగా రాణించింది. ఆమె నాలుగు (28వ, 31వ, 35వ, 55వ నిమిషాల్లో) గోల్స్ చేయగా, కనిక సివాచ్ (23వ, 25వ, 40వ నిమిషాల్లో) మూడు గోల్స్ అందించింది. మిగతా వారిలో సాక్షి రాణా (17వ నిమిషంలో), లాల్రిన్పుయి (27వ నిమిషంలో), గోల్స్ చేశారు. భారత్ తొలి అర్ధభాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికే 5–0తో మ్యాచ్ను శాసించేస్థితిలో నిలిచింది. మూడు, నాలుగో క్వార్టర్లలో మరో నాలుగు గోల్స్ సాధించింది. మూడో క్వార్టర్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేయడం ద్వారా దీపిక, కాసేపటికే మూడో గోల్ సాధించిన కనిక ‘హ్యాట్రిక్స్’ నమోదు చేశారు. శనివారం జరిగే సెమీఫైనల్లో జపాన్తో భారత్; చైనాతో దక్షిణ కొరియా తలపడతాయి. -
సెమీస్లో కిరణ్ జార్జి
ఇక్సాన్ సిటీ: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ కిరణ్ జార్జి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ కిరణ్ జార్జి 21–14, 21–16తో ప్రపంచ 34వ ర్యాంకర్, ఐదో సీడ్ టకుమా ఒబయాషి (జపాన్)పై గెలుపొందాడు. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు.ఒబయాషిపై కిరణ్కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో కిరణ్ తలపడతాడు. -
సెమీస్లో సబలెంకా
రియాద్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్లో బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పర్పుల్ గ్రూప్ రెండో లీగ్ మ్యాచ్లో సబలెంకా 6–3, 7–5తో నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలిచింది. తద్వారా వరుసగా రెండో విజయంతో సబలెంకాకు సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇదే గ్రూప్లోని మరో లీగ్ మ్యాచ్లో ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 7–6 (7/4), 3–6, 6–1తో ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్)ను ఓడించింది. ఫలితం రెండు పరాజయాలతో రిబాకినా సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. జాస్మిన్, కిన్వెన్ జెంగ్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేతకు రెండో సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. -
టీ20 వరల్డ్కప్ : చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికా (ఫొటోలు)
-
టీ20 వరల్డ్కప్ సెమీస్కు చేరే జట్లు ఇవే..!?
టీ20 వరల్డ్కప్-2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్లు విభజించబడి పోటీపడతాయి. భారత్ విషయానికి వస్తే గ్రూపు-ఏలో ఉంది. గ్రూప్-ఏలో టీమిండియాతో పాటు పాకిస్తాన్తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో జూన్ 5న ఐర్లాండ్తో తలపడుతుంది. అనంతరం జూన్ 9న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. సెమీఫైనల్కు చేరే జట్లు ఇవే.. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్లో సెమీఫైనల్కు చేరే జట్లను న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంచనా వేశాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కచ్చితంగా సెమీస్కు చేరుతాయని, నాలుగో జట్టుగా ఇంగ్లండ్ లేదా పాకిస్తాన్ వచ్చే అవకాశముందని గప్టిల్ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ తరపున 112 టీ20లు ఆడిన గప్టిల్ 3531 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా గప్టిల్ కొనసాగుతున్నాడు. -
Five States Assembly Elections 2023: బీజేపీ తీన్మార్
ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్ పోరులో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాలను సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్లో భారీ విజయంతో అధికారాన్ని నిలుపుకోగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను కాంగ్రెస్ నుంచి చేజిక్కించుకుంది. తద్వారా ఉత్తరాది హిందీ బెల్టులో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కీలకమైన 2024 లోక్సభ ఎన్నికల ముంగిట్లో లభించిన ఈ సానుకూల ఫలితాలతో బీజేపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ఘోరమైన ఓటమి మూటగట్టుకుని కాంగ్రెస్ చతికిలపడింది. తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెర దించుతూ విజయం సాధించడం ఒక్కటే ఈ ఎన్నికల్లో దానికి ఊరట. మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 164 సీట్లతో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ 65 స్థానాలతో సరిపెట్టుకుంది. రాజస్తాన్లో పోలింగ్ జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 115 చోట్ల గెలిచింది. కాంగ్రెస్కు 69 సీట్లు దక్కాయి. 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో బీజేపీ 54 సీట్లు సాధించగా కాంగ్రెస్కు 35 దక్కాయి. ఇక తెలంగాణలో 119 సీట్లకు కాంగ్రెస్ 64 చోట్ల నెగ్గి మెజారిటీ సాధించగా అధికార బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా స్థానిక పార్టీలైన ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం మధ్యే పోరు సాగిందన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ పెద్దగా ఆశలేమీ లేవు. ఆద్యంతమూ ఆధిక్యమే... ఫలితాల వెల్లడిలో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవాయే సాగింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే మధ్యప్రదేశ్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. రాజస్తాన్, ఛత్తీస్గఢ్ల్లో తొలుత కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్టు కని్పంచినా కాసేపటికే పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చాలామంది భావించిన ఛత్తీస్గఢ్లో కూడా స్పష్టమైన ఆధిక్యం కని్పస్తుండటం పార్టీలో జోష్ నింపింది. దాంతో ఒకవైపు లెక్కింపు కొనసాగుతుండగానే బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. జై శ్రీరాం, మోదీ నాయకత్వం వరి్ధల్లాలి అంటూ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రధాన కార్యాలయాల వద్ద బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత ప్రభావం నుంచి తప్పించుకోవడంతో పాటు రాజస్తాన్లో నేతల మధ్య కుమ్ములాటలకు కూడా పార్టీ చెక్ పెట్టిందని చెబుతున్నారు. మోదీ కేంద్రంగా సాగించిన ప్రచారం ఫలించింది. అంతిమంగా బీజేపీ మీద ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనగా, కాంగ్రెస్ మత, విభజన రాజకీయాలను వారు తిరస్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నిరుత్సాహంలో కాంగ్రెస్ గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఊపులో ఉన్న కాంగ్రెస్లో తాజా ఫలితాలు నిరుత్సాహం నింపాయి. ఇది తాత్కాలిక వెనుకంజేనని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కలిపి 84 లోక్సభ స్థానాలున్నాయి. తాజా విజయాలతో ఉత్తర, పశి్చమ భారతంలో అత్యధిక రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వెళ్లాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి ఆ ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శనే ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఆశించినన్ని సీట్లు నెగ్గకపోవడం బీజేపీకి నిరాశ కలిగించగా అక్కడ తొలిసారిగా అధికారం చేపట్టనుండటం కాంగ్రెస్కు ఊరటనిచ్చే అంశం. రాజస్తాన్ బీజేపీదే 115 అసెంబ్లీ స్థానాల్లో విజయం 69 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఏకంగా 115 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ ఆనవాయితీని కాంగ్రెస్ బద్దలు కొట్టలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో 69 సీట్లకు పరిమితమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీని గెలిపించలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు దూకుడుగా సాగించిన ప్రచారం ముందు కాంగ్రెస్ చేతులెత్తేసింది. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామంటూ ముఖ్యమంత్రి గెహ్లోత్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ పరాజయాన్ని ఊహించలేదని పేర్కొన్నారు. తమ ప్రణాళికలు, పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నాయని అంగీకరించారు. సీఎం గెహ్లోత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు సమరి్పంచారు. రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నా చిన్నాచితక పారీ్టలు సైతం ప్రభావం చాటాయి. భారత ఆదివాసీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రా్రïÙ్టయ లోక్తాంత్రిక్ పార్టీ, రా్రïÙ్టయ లోక్దళ్ కొన్ని సీట్లు గెలుచుకున్నాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. పలువురు కాంగ్రెస్ మంత్రులు ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సి.పి.జోïÙకి సైతం పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ జోద్పూర్ జిల్లాలోని సర్దార్పురా నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించడం విశేషం. గత ఎన్నికల్లో ఆయనకు 45,597 ఓట్ల ఆధిక్యం లభించగా, ఈసారి 26,396కు తగ్గింది. మధ్యప్రదేశ్లో మళ్లీ కాషాయమే 163 స్థానాలు బీజేపీ కైవసం 66 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 230 స్థానాలకు గాను ఏకంగా 163 స్థానాలను సొంతం చేసుకుంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ఈసారి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న అధికార కాంగ్రెస్ వ్యూహాలు ఫలించలేదు. ఆ పార్టీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజధాని భోపాల్లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సంబరాలు హోరెత్తాయి. కాంగ్రెస్ కార్యాలయం బోసిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వల్లే విజయం సాధ్యమైందని బీజేపీ నాయకులు చెప్పగా పరాజయానికి కారణాలను సమీక్షించుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బుద్నీ అసెంబ్లీ స్థానంలో సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఏకంగా లక్షకు పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈసారి బీజేపీ మధ్యప్రదేశ్తో పాటు ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యరి్థని ముందుగా ప్రకటించకపోవడం తెలిసిందే. అయినా పార్టీ ఘనవిజయం నేపథ్యంలో శివరాజ్ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. అయితే బీజేపీ ఇంతటి ఘనవిజయం సాధించినా ఏకంగా 12 మంది మంత్రులు ఓటమి పాలవడం విశేషం! అయితే అసెంబ్లీ బరిలో దిగిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ మాత్రం విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీకి 165 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ 58 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి 44.88 శాతం, కాంగ్రెస్కు 36.38 శాతం ఓట్లు లభించాయి. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 40.89 శాతం ఓట్లతో 114 స్థానాలు సాధించింది. బీజేపీ 41.02 శాతం ఓట్లు సాధించినా 109 సీట్లే నెగ్గింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. కమల్నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. 15 నెలలకే కాంగ్రెస్ అగ్ర నేత జ్యోతిరాదిత్య తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఫిరాయించారు. దాంతో కమల్నాథ్ సర్కారు కుప్పకూలింది. శివరాజ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఛత్తీస్గఢ్లో విరబూసిన కమలం 54 సీట్లతో బీజేపీ విజయహాసం 35 స్థానాలతో కాంగ్రెస్ ఓటమి రాయ్పూర్: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారతీయ జనతా పార్టీని వరించింది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాలు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్కు 35 స్థానాలే లభించాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన కమలం పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికార పీఠం సొంతం చేసుకుంది. ‘మోదీ కీ గ్యారంటీ–2023’ పేరిట బీజేపీ ఇచి్చన హామీలను ప్రజలు విశ్వసించినట్లు కనిపిస్తోంది. క్వింటాల్ రూ.3,100 చొప్పున ధరకు ఎకరాకు 21 క్వింటాళ్ల చొప్పున ధాన్యం కొనుగోలు, మహతారీ వందన్ యోజన కింద వివాహమైన మహిళలకు ఏటా రూ.12,000 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రజలను ఆకర్శించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా బీజేపీ గెలుపునకు తోడ్పడింది. కాగ్రెస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పారీ్టకి ప్రతికూలంగా మారాయి. స్వయానా సీఎం బఘెల్, డిప్యూటీ సీఎం సింగ్దేవ్ మధ్య స్పర్థలుండటం కూడా బాగా చేటు చేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి చతికిలపడింది. సీఎం బఘెల్ తన సొంత నియోజకవర్గం పటన్లో నెగ్గినా రాష్ట్రంలో మాత్రం పార్టీని గెలిపించుకోలేకపోయారు. డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్దేవ్ కూడా ఓటమి చవిచూశారు! అంబికాపూర్ అసెంబ్లీ స్థానంలో సమీప బీజేపీ ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘెల్ ముడుపులు స్వీకరించారంటూ పోలింగ్ సమీపించిన వేళ వచి్చన ఆరోపణలు కూడా కాంగ్రెస్కు బాగా నష్టం చేసినట్టు కనబడుతోంది. మరోవైపు బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీకి దిగింది. అయినా ప్రధాని మోదీకి ఉన్న జనాదరణ, ఆయన పేరుతో ఇచి్చన హామీల ఆసరాతో పార్టీ విజయ తీరాలకు చేరింది. -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్లో జరిగే తుది పోరులో భారత్తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్కతా: ఐదుసార్లు వరల్డ్కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్కు చేరింది. ఆదివారం భారత్తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో భారత్తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్లోనే భారత్తో మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్లోనే వార్నర్ 3 సిక్స్లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్లో లబుõÙన్ (18), మ్యాక్స్వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్వుడ్ 3; బవుమా (సి) ఇన్గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్వెల్ (బి) షమ్సీ 1; ఇన్గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
ACC Emerging Asia Cup 2023: సెమీఫైనల్లో భారత్ ‘ఎ’
కొలంబో: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోరీ్నలో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో నేపాల్పై ఘనవిజయం సాధించింది. మొదట నేపాల్ 39.2 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (65; 7 ఫోర్లు) రాణించాడు. గుల్షన్ ఝా (38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్ ‘ఎ’ బౌలర్లలో నిశాంత్ సింధు 4, రాజ్వర్ధన్ 3, హర్షిత్ రాణా 2 వికెట్లు తీశారు. తర్వాత సులువైన లక్ష్యాన్ని భారత జట్టు 22.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (87; 12 ఫోర్లు, 2 సిక్స్లు), సాయి సుదర్శన్ (58 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించారు. ధ్రువ్ (21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా పరుగులు చేశాడు. ఈ గ్రూపులో బుధవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ‘ఎ’తో తలపడుతుంది. -
పదేళ్ల తర్వాత మళ్లీ సెమీస్లోకి
మెల్బోర్న్: తన పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా పదేళ్ల తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ప్రపంచ 24వ ర్యాంకర్ అజరెంకా మూడోసారి సెమీఫైనల్కు చేరింది. 2012, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అజరెంకా 2013లో ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్ చేరాక మరే గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అజరెంకా 6–4, 6–1తో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై అలవోకగా గెలిచింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో అజరెంకా 17 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–4తో 17వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించి సెమీస్లో అజరెంకాతో పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 18వ సీడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో సిట్సిపాస్ 6–3, 7–6 (7/2), 6–4తో లెహచ్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... ఖచనోవ్ 7–6 (7/5), 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు. ‘మిక్స్డ్’ సెమీస్లో సానియా–బోపన్న జోడీ సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్లో సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. సానియా–బోపన్నలతో ఆడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. -
Duleep Trophy 2022: సాయికిశోర్కు 7 వికెట్లు
సేలం (తమిళనాడు): ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆర్.సాయికిశోర్ (7/70) ఏడు వికెట్లతో తిప్పేయడంతో... నార్త్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ జోన్ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 17/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 67 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), నిశాంత్ (40; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 423 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన సౌత్ జోన్ జట్టు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. రోహన్ (77; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు), టి.రవితేజ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌత్ జోన్ ఓవరాల్ ఆధిక్యం 580 పరుగులకు చేరుకుంది. -
US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో ప్రపంచ 17వ ర్యాంకర్ గార్సియా తన జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గార్సియా 6–3, 6–4తో అమెరికా టీనేజర్, 12వ సీడ్ కోకో గాఫ్పై విజయం సాధించింది. ఈ ఏడాది మూడు టైటిల్స్ నెగ్గి సూపర్ ఫామ్లో ఉన్న 28 ఏళ్ల గార్సియా యూఎస్ ఓపెన్లోనూ అదే జోరు కొనసాగిస్తూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీఫైనల్కు చేరింది. కోకో గాఫ్తో జరిగిన మ్యాచ్లో గార్సియా నాలుగు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. 24 విన్సర్స్ కొట్టిన ఆమె ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్ను ఒకసారి కోల్పోయింది. నెట్ వద్దకు 16 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచింది. 2011లో ప్రొఫెషనల్గా మారిన గార్సియా ఇప్పటివరకు 41 సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడింది. 2017లో ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరడమే గ్రాండ్స్లామ్ టోర్నీలలో ఆమె అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. పదోసారి యూఎస్ ఓపెన్లో ఆడుతున్న గార్సియా సెమీఫైనల్ చేరడం ద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన మూడోఫ్రాన్స్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో ఫ్రాన్స్ నుంచి అమెలీ మౌరెస్మో (2002, 2006), మేరీ పియర్స్ (2005) సెమీఫైనల్ చేరారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)తో గార్సియా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో జబర్ 2–0తో గార్సియాపై ఆధిక్యంలో ఉంది. జబర్ జోరు... ఈ ఏడాది 42 విజయాలతో అద్భుతమైన ఫామ్లో ఉన్న ట్యూనిషియా ప్లేయర్ ఆన్స్ జబర్ క్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ క్రీడాకారిణి ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జబర్ 6–4, 7–6 (7/4)తో తొమ్లాయనోవిచ్పై గెలిచింది. ఈ గెలుపుతో గ్రాండ్స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా మహిళా టెన్నిస్ ప్లేయర్గా జబర్ నిలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఆరో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) 6–1, 7–6 (7/4)తో 22వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 82 నిమిషాలపాటు జరి గిన ఈ మ్యాచ్లో సబలెంకా ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. కిరియోస్ జోరుకు ఖచనోవ్ బ్రేక్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా) తొలిసారి తన కెరీర్లో ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో... ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) తొలిసారి యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్, 23వ సీడ్ నిక్ కిరియోస్తో 3 గంటల 39 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 7–5, 4–6, 7–5, 6–7 (3/7), 6–4తో గెలుపొందాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ ఈ మ్యాచ్లో ఏకంగా 30 ఏస్లు సంధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించిన కిరియోస్ 31 ఏస్లు సంధించినా 58 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్లో కిరియోస్ కోపంతో తన రెండు రాకెట్లను నేలకేసి కొట్టి విరగొట్టడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో కాస్పర్ రూడ్ 6–1, 6–4, 7–6 (7/4)తో 13వ సీడ్ మారియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన రూడ్ సెమీఫైనల్లో ఖచనోవ్తో ఆడతాడు. -
Cincinnati Masters: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మెద్వెదెవ్
సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్, రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మెద్వెదెవ్ 7–6 (7/1), 6–3తో 11వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2019లో ఈ టోర్నీ టైటిల్ సాధించిన మెద్వెదెవ్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)తో తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్ 7–6 (7/5), 5–7, 6–3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై విజయం సాధించాడు. మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్లో కామెరాన్ నోరీ (బ్రిటన్) 7–6 (7/4), 6–7 (4/7), 6–4తో మూడో సీడ్ అల్కారజ్ (స్పెయిన్)పై, బోర్నా చొరిచ్ (క్రొయేషియా) 6–4, 6–4తో ఫీలిక్స్ అలియాసిమ్ (కెనడా)పై నెగ్గారు. -
Commonwealth Games 2022: సెమీస్లో సింధు, శ్రీకాంత్
బ్యాడ్మింటన్లో మహిళల సింగిల్స్లో సింధు... పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి చేరారు. క్వార్టర్ ఫైనల్స్లో సింధు 19–21, 21–14, 21–18తో గో వె జిన్ (మలేసియా)పై, శ్రీకాంత్ 21–19, 21–17తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై, లక్ష్య సేన్ 21–12, 21–11తో జూలియన్ (మారిషస్)పై గెలిచారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 21–8, 21–6తో తాలియా–కేథరిన్ (జమైకా) జంటపై గెలిచింది. -
Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు
ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో భారత మహిళలు అసమానంగా పోరాడారు. ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయినా ఆ తర్వాత కోలుకొని సత్తా చాటారు. చివర్లో ఎదురుదాడికి దిగి లెక్క సరి చేశారు కూడా. దాంతో ఫలితం పెనాల్టీ షూటౌట్కు చేరింది. అక్కడా ప్రత్యర్థి తొలి ప్రయత్నాన్ని కీపర్ సవిత అద్భుతంగా అడ్డుకోగలిగింది. ఇదే జోరు కొనసాగిస్తే విజయం సాధించడం ఖాయమనిపించింది. కానీ ఇక్కడే రిఫరీ భారత్ను దెబ్బ కొట్టింది. ‘గడియారం గంట కొట్టలేదంటూ’ మొదటి గోల్ ప్రయత్నంలో లెక్కలోకి రాదంది. మళ్లీ పెనాల్టీ తీసుకునేందుకు ఆసీస్కు అవకాశం కల్పించింది. దాంతో ఏకాగ్రత చెదిరిన మన మహిళలు ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం కోల్పోయారు. షూటౌట్లో తడబడి చివరకు ఓటమి పక్షాన నిలిచారు. భారత్ పరాజయానికి ఆటలో వైఫల్యంకంటే అసమర్థ రిఫరీనే కారణమనడంలో సందేహం లేదు. బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీస్లో ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్లో 3–0 తేడాతో భారత్ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. మ్యాచ్ 10వ నిమిషంలో ఆస్ట్రేలియా తరఫున రెబెకా గ్రీనర్ గోల్ చేయగా, 49వ నిమిషంలో భారత్ తరఫున వందనా కటారియా గోల్ నమోదు చేసింది. తొలి క్వార్టర్లో వెనుకబడిన భారత జట్టు తర్వాతి రెండు క్వార్టర్లలో దూకుడుగా ఆడింది. గోల్ లేకపోయినా ఆసీస్పై ఆధిపత్యం ప్రదర్శించగలిగింది. అదే ఊపులో చివరి క్వార్టర్లో గోల్తో స్కోరు సమం చేసింది. పెనాల్టీ షూటౌట్లో ఆస్ట్రేలియా నుంచి ఆంబ్రోసియా మలోన్, కైట్లిన్ నాబ్స్, ఎమీ లాటన్ గోల్స్ చేయగా... భారత్ నుంచి లాల్రెమ్సియామి, నేహ, నవనీత్ కౌర్ విఫలమయ్యారు. కాంస్యం కోసం నేడు జరిగే పోరులో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. ఏం జరిగింది... తొలి పెనాల్టీని మలోన్ తీసుకోగా, భారత కీపర్ సవిత దానిని గోల్ కాకుండా సమర్థంగా అడ్డుకోగలిగింది. అంతా ముగిసిన తర్వాత అది చెల్లదని, మళ్లీ పెనాల్టీ తీసుకోవాలని రిఫరీ ఆదేశించింది. పెనాల్టీ సమయం గరిష్టంగా 8 సెకన్లు చూపించే ‘స్టాప్వాచ్’ టైమర్ స్టార్ట్ కాలేదని, దానికి ముందే పెనాల్టీ తీసుకున్నందున గుర్తించలేమని రిఫరీ ప్రకటించింది. నిబంధనల ప్రకారమైతే మైదానంలో ఉండే టెక్నికల్ అఫీషియల్ ముందుగా చేయి పైకెత్తుతారు. ఆ తర్వాత చేతిని కిందికి దించితే ‘టైమర్’ ప్రారంభమవుతుంది. అదే సమయంలో రిఫరీ విజిల్ వేస్తే పెనాల్టీ తీసుకోవాలి. అయితే ఈ టెక్నికల్ అఫీషియల్ చేతికి కిందకు దించలేదు. ఇది పూర్తిగా ఆమె తప్పు. దాంతో స్టాప్వాచ్ను మరో అధికారిణి స్టార్ట్ చేయలేదు. దానిని గుర్తించి ‘నో నో’ అనే లోపే పెనాల్టీ ముగిసిపోయింది. దీనిని ఆమె వివరించడంతో రిఫరీ మళ్లీ పెనాల్టీ తీసుకోవాల్సిందిగా కోరింది. మా ఓటమికి దీనిని సాకుగా చెప్పను. అయితే మొదటి పెనాల్టీని ఆపితే సహజంగానే వచ్చే ఉత్సాహం ఆ తర్వాత నీరుగారిపోయింది. అందరం చాలా నిరాశ చెందాం. తాము పెనాల్టీని కోల్పోయామని గుర్తించిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు రిఫరీ ఎందుకు కల్పించుకోవాలి. అధికారులు ఆటతో పాటు ముడిపడి ఉండే భావోద్వేగాలని అర్థం చేసుకోలేరు. –భారత కోచ్ జేనెక్ స్కాప్మన్ -
Asia Cup hockey: లెక్క సరిచేసిన భారత్
జకార్తా: లీగ్ దశలో జపాన్ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీ సూపర్–4 సెమీఫైనల్ లీగ్లో భారత్ శుభారంభం చేసింది. 2018 ఆసియా క్రీడల చాంపియన్ జపాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో డిఫెడింగ్ చాంపియన్ భారత్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున మంజీత్ (8వ ని.లో), పవన్ రాజ్భర్ (35వ ని.లో) ఒక్కో గోల్ సాధించగా... జపాన్ జట్టుకు టకుమా నివా (18వ ని.లో) ఏకైక గోల్ను అందించాడు. నేడు జరిగే సూపర్–4 రెండో మ్యాచ్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
Thomas Cup 2022: ఎన్నాళ్లో వేచిన పతకం
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఐదుసార్లు చాంపియన్ మలేసియా జట్టును క్వార్టర్ ఫైనల్లో ఓడించిన భారత్ 1979 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ సెమీఫైనల్ చేరింది. తద్వారా 73 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత పురుషుల జట్టు తొలిసారి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. 1990 నుంచి థామస్ కప్లో సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకూ కాంస్య పతకాలు అందజేస్తున్నారు. అంతకుముందు మాత్రం సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య ప్రత్యేకంగా కాంస్య పతకం కోసం మ్యాచ్ను నిర్వహించేవారు. బ్యాంకాక్: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించింది. గతంలో సాధ్యంకాని ఘనతను ఈసారి సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్ అయిన థామస్ కప్లో భారత పురుషుల జట్టు తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో ఐదుసార్లు చాంపియన్ మలేసియా జట్టును ఓడించి సెమీఫైనల్ చేరింది. థామస్ కప్లో సెమీఫైనల్ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. నేడు జరిగే సెమీఫైనల్లో 2016 చాంపియన్ డెన్మార్క్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో ఇండోనేసియాతో జపాన్ ఆడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో డెన్మార్క్ 3–2తో దక్షిణ కొరియాపై... జపాన్ 3–2తో చైనీస్ తైపీపై... ఇండోనేసియా 3–0తో చైనాపై విజయం సాధించాయి. గెలిపించిన ప్రణయ్ మలేసియాతో పోటీలో భారత్కు శుభారంభం దక్కలేదు. తొలి మ్యాచ్లో భారత నంబర్వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–23, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ జి జియా చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–19, 21–15తో గో జె ఫె– నూరుజుద్దీన్ జోడీని ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్ చక్కటి సమన్వయంతో ఆడుతూ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ జోరు పెంచి ప్రత్యర్థి జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడో మ్యాచ్లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ 21–11, 21–17తో ఎన్జీ జె యోంగ్పై గెలిచి భారత్ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ తొలి గేమ్లో చెలరేగిపోగా... రెండో గేమ్లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. నాలుగో మ్యాచ్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట 19–21, 17–21తో ఆరోన్ చియా–తియో యె యి ద్వయం చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. తెలంగాణ ప్లేయర్ విష్ణువర్ధన్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కృష్ణప్రసాద్ పోరాటపటిమ కనబరిచినా కీలకదశలో తడబడ్డారు. నిర్ణాయక ఐదో మ్యాచ్లో అనుభవజ్ఞుడైన హెచ్ఎస్ ప్రణయ్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆడి 21–13, 21–8తో లియోంగ్ జున్ హావోపై నెగ్గడంతో భారత్ 3–2తో చిరస్మరణీయ విజయాన్ని ఖరారు చేసుకుంది. స్కోరు 20–8 వద్ద ప్రణయ్ స్మాష్ షాట్ కొట్టి చివరి పాయింట్ రాబట్టిన వెంటనే భారత జట్టు సభ్యులందరూ ఆనందంతో కోర్టులోకి దూసుకెళ్లి సంబరాలు చేసుకున్నారు. -
PV Sindhu: సూపర్ సింధు...
మనీలా (ఫిలిప్పీన్స్): ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రెండో పతకాన్ని ఖాయం చేసుకుంది. గతంలో 2014లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఈసారి కూడా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–9, 13–21, 21–19తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి సెమీఫైనల్కు చేరింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఒకదశలో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది. అయితే రెండో గేమ్లో హి బింగ్ జియావో పుంజుకుంది. స్కోరు 9–10 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గిన హి బింగ్ జియావో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో సింధు 7–3తో ఆధిక్యంలోకి వెళ్లి దానిని కాపాడుకుంది. చివర్లో సింధు 20–16తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు కోల్పోయిన సింధు ఆ వెంటనే మరో పాయింట్ గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 13–8తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పతకం సాధించలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 53 నిమిషాల్లో 21–12, 14–21, 16–21తో ఐదో సీడ్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ జంట గెలిచిఉంటే సెమీస్ చేరినందుకు కనీసం కాంస్య పతకం లభించేది. నేటి సెమీఫైనల్స్ ఉదయం గం. 10:30 నుంచి సోనీ టెన్–2లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్ సీడ్ జో సాలిస్బరీ (బ్రిటన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి. -
తొమ్మిదేళ్ల తర్వాత...సెమీస్లో భారత్
పోష్స్ట్రూమ్: తమ అజేయ రికార్డును కొనసాగిస్తూ భారత మహిళల హాకీ జట్టు తొమ్మిదేళ్ల తర్వాత జూనియర్ ప్రపంచకప్లో మరోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చిన భారత జట్టు క్వార్టర్స్లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభం నుంచే దాడులకు పదునుపెట్టిన అమ్మాయిలు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ముంతాజ్ ఖాన్ (11వ ని.లో), లాల్రిండికి (15వ ని.లో), సంగీత (41వ ని.లో) ఒక్కో గోల్ చేసి జట్టును గెలిపించారు. 33 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్లో భారత అమ్మాయిల జట్టు సెమీస్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2013 ప్రపంచకప్ టోర్నీలో భారత్ సెమీస్ చేరింది. అప్పుడు సెమీస్లో ఓడిన భారత జట్టు కాంస్య పతకపోరులో ఇంగ్లండ్ను 3–2తో పెనాల్టీ షూటౌట్లో ఓడించి పతకం గెలుచుకుంది. 2016 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించలేకపోయింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్ అయిన నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. -
గాయత్రి–త్రిషా జంట సంచలనం
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... ఒత్తిడిని దరిచేరనీయకుండా సహజశైలిలో ఆడితే అద్భుతాలు చేయవచ్చని భారత బ్యాడ్మింటన్ టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ నిరూపించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో గాయత్రి–త్రిషా ద్వయం నమ్మశక్యంకానీ రీతిలో ఆడి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో వందేళ్లపైబడిన చరిత్ర కలిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా గాయత్రి–త్రిషా జంట రికార్డు నెలకొల్పింది. బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో శుక్రవారం అద్భుతం జరిగింది. మహిళల డబుల్స్లో బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే భారత టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ సంచలనం సృష్టించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంక్ జోడీ గాయత్రి–త్రిషా 14–21, 22–20, 21–15తో ప్రపంచ రెండో ర్యాంక్, రెండో సీడ్ ద్వయం లీ సోహీ–షిన్ సెయుంగ్చాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఈ క్రమంలో 19 ఏళ్ల కేరళ అమ్మాయి త్రిషా జాలీ, 18 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి గాయత్రి 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్న భారతీయ జంటగా రికార్డు నెలకొల్పింది. గత ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకం, టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన లీ సోహీ–షిన్ సెయుంగ్చాన్ జంటతో జరిగిన పోరులో గాయత్రి–త్రిషా అద్భుతంగా ఆడారు. తొలిసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో ఆడుతున్న గాయత్రి–త్రిషా తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్లో 18–20తో ఓటమి అంచుల్లో నిలిచారు. కొరియా జంట మరో పాయింట్ గెలిచిఉంటే గాయత్రి–త్రిషా ఇంటిదారి పట్టేవారే. కానీ అలా జరగలేదు. రెండు పాయింట్లు వెనుకంజలో ఉన్నప్పటికీ గాయత్రి–త్రిషా పట్టువదలకుండా పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచారు. రెండో గేమ్ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్లో గాయత్రి–త్రిషా స్కోరు 8–8తో సమంగా ఉన్న దశలో ఒక్కసారిగా విజృంభించారు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొరియా జోడీ తేరుకునే ప్రయత్నం చేసినా గాయత్రి–త్రిషా తమ దూకుడు కొనసాగించి ప్రత్యర్థి ఆట కట్టించారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 276వ ర్యాంక్ జోడీ జెంగ్ యు–షు జియాన్ జాంగ్ (చైనా)లతో గాయత్రి–త్రిషా ద్వయం తలపడుతుంది. సెమీస్లో లక్ష్య సేన్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువతార లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్తో తలపడాల్సిన చైనా ప్లేయర్ లూ గ్వాంగ్ జు గాయం కారణంగా వైదొల గడంతో లక్ష్య సేన్కు వాకోవర్ లభించింది. ప్రకాశ్ పదుకొనె, పుల్లెల గోపీచంద్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. డిఫెండింగ్ చాంప్ లీ జి జియా (మలేసియా)–మాజీ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్) మధ్య మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ నంబర్వన్ జోడీ మార్కస్ గిడియోన్ –కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–24, 17–21తో ఓడింది. తొలి గేమ్లో భారత జంటకు ఆరు గేమ్ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది. నిజానికి ఈ టోర్నీలో మాకు ఎంట్రీ లభిస్తుందని ఆశించలేదు. అయితే చివరి నిమిషంలో కొన్ని జోడీలు వైదొలగడంతో రిజర్వ్ జాబితా నుంచి మాతోపాటు వేరే జోడీలకూ ఎంట్రీ లభించింది. ప్రతి మ్యాచ్లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. క్వార్టర్ ఫైనల్లోని రెండో గేమ్లో 18–20తో వెనుకబడ్డా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఆడి విజయాన్ని అందుకున్నాం. –గాయత్రి తల్లిదండ్రులకు తగ్గ తనయ గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సాధించారు. తల్లి పీవీవీ లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. తల్లిదండ్రులు రాణించిన ఆటలోనే ఇప్పుడు కుమార్తె మెరి సింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి గాయత్రి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. -
ప్రణయ్పై గెలుపుతో సెమీఫైనల్లో లక్ష్య సేన్
జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువస్టార్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–16తో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్పై గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 10–21, 21–23తో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్కిది వరుసగా ఆరో ఓటమి. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ జోడీ 11–21, 21–23తో హి జి టింగ్–హావో డాంగ్ జౌ (చైనా) జంట చేతిలో ఓడింది. -
ముందుంది మరింత మంచికాలం!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తమ జట్టు ప్రదర్శన పట్ల హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) యజమాని వరుణ్ త్రిపురనేని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో నిలకడైన ప్రదర్శనతో హెచ్ఎఫ్సీ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. మున్ముందు తమ జట్టులో స్థానిక క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్న ఆయన... ఓవరాల్గా ఐఎస్ఎల్ కూడా ఒక బలమైన బ్రాండ్గా మారిందని విశ్లేషించారు. లీగ్లో తమ ఆట తదితర అంశాలపై వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్ ఎఫ్సీ ప్రదర్శనపై... చాలా బాగుంది. ఇది మాకు మూడో సీజన్. తొలిసారి ఆడినప్పుడు జట్టు చివరి స్థానంలో నిలవడంతో పలు కీలక మార్పులు చేసి భిన్నమైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. ఫలితంగా గత ఏడాది ప్లే ఆఫ్స్కు చేరువగా వచ్చాం. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో సెమీస్ను లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాం. హైదరాబాదీ ఆటగాడు లేకపోవడంపై... స్థానికంగా ప్రతిభ ఉన్నవారిని తీసుకునేందుకు మేం గట్టిగానే ప్రయత్నిం చాం. హైదరాబాద్లో చెప్పుకోదగ్గ టోర్నమెంట్లు కూడా లేకపోవడంతో మేం ఆశించిన స్థాయి ప్రమాణాలు గల ఆటగాళ్లు లభించలేదు. ‘నామ్కే వాస్తే’గా టీమ్లోకి తీసుకోలేం కదా. చివరకు అభినవ్ అనే కుర్రాడిని గుర్తించగలిగాం. గోల్కీపర్గా అతను మా రిజర్వ్ జట్టులో భాగంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక పద్ధతి ప్రకారం ఆటగాళ్లను ఐఎస్ఎల్ కోసం తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైరైన విదేశీయులతో ఆడటంపై... అది ఆరంభ సీజన్లలో మాత్రమే జరిగింది. ఇది ఎనిమిదో ఐఎస్ఎల్ సీజన్. ఇప్పుడు ఈ టోర్నీ గురించి బయటి ప్రపంచానికి కూడా బాగా తెలుసు. పలు విదేశీ సంస్థలు మాకు స్పాన్సర్లుగా రావడం అందుకు నిదర్శనం. ప్రతీ సీజన్కు లీగ్ బలంగా మారుతోంది. మున్ముందు ఐఎస్ఎల్ స్థాయి పెరగడం ఖాయం. వచ్చే సీజన్ నుంచి లీగ్ మళ్లీ ప్రేక్షకుల మధ్యలో రానుంది కాబట్టి ఐఎస్ఎల్ ఎదుగుదలను మనం స్పష్టంగా చూడవచ్చు. -
సెమీఫైనల్లో ఓడిన సానియా జంట
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–2, 2–6, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కిచెనోక్ (ఉక్రెయిన్)–ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ చేతిలో ఓడింది. సెమీస్లో నిష్క్రమించిన సానియా–హర్డెస్కా జోడీకి 12,500 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 9 లక్షల 33 వేలు) లభించింది. -
విష్ణు–బాలాజీ జంట ఓటమి
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ– 250 టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో విష్ణు వర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ల్యూక్ స్మిత్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ తమ సర్వీస్ను మూడు సార్లు కోల్పోయింది. నేడు సాదియో –ఫాబియన్ (ఫ్రాన్స్); రోహన్ బోపన్న–రామ్ కుమార్ (భారత్) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో రేపు జరిగే ఫైనల్లో ల్యూక్–జాన్ ప్యాట్రిక్ జంట ఆడుతుంది. సుహానా సైనీకి కాంస్యం ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి సుహానా సైనీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్లో శుక్రవారం జరిగిన అండర్–19 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో సుహానా 11–9, 9–11, 10–12, 11–13తో ప్రపంచ నంబర్వన్ ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో ఓడింది. -
రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్లో యువ భారత్
కూలిడ్జ్ (అంటిగ్వా): అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో యువ భారత్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో 2020 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 37.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఎడంచేతి వాటం పేస్ బౌలర్ రవి కుమార్ (3/14) స్వింగ్ బౌలింగ్తో బంగ్లాదేశ్ను హడ లెత్తించాడు. స్పిన్నర్ విక్కీ (2/25) కూడా రాణించాడు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అంగ్కృష్ (44; 7 ఫోర్లు), ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (26; 3 ఫోర్లు) రెండో వికెట్కు 70 పరుగులు జోడించారు. కెప్టెన్ యశ్ ధుల్ (20 నాటౌట్; 4 ఫోర్లు), కౌశల్ (11 నాటౌట్; 1 సిక్స్) రాణించారు. రవి కుమార్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఫిబ్రవరి 1న తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్తో అఫ్గానిస్తాన్; ఫిబ్రవరి 2న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడ తాయి. ఫైనల్ ఫిబ్రవరి 5న జరుగుతుంది. -
44 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర...
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్లో ఒకేసారి భారత్కు రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ఫైనల్కు చేరుకోవడం ఖాయమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే పురుషుల సింగిల్స్లో తొలిసారి భారత ప్లేయర్ ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా మహిళల సింగిల్స్లో 2019లో పీవీ సింధు విశ్వవిజేతగా నిలిచింది. హుఎల్వా (స్పెయిన్): రెండు నెలల క్రితం థామస్ కప్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ టోర్నీ మ్యాచ్లో ఓడిపోయి జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువతార లక్ష్య సేన్... నిలకడలేని ఆటతీరుతో గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి పది గంటలకు మొదలయ్యే సెమీఫైనల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడతారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–7తో ప్రపంచ 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)ను చిత్తు చేయగా... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 67 నిమిషాల్లో 21–15, 15–21, 22–20తో 42వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచాడు. జున్ పెంగ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణాయక మూడో గేమ్లో లక్ష్య సేన్ 19–20 వద్ద మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. ఈ స్కోరు వద్ద ఒక్కసారిగా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. ఉత్తరాఖండ్కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. భారత్కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ ప్రణయ్ కూడా గెలిచి ఉంటే భారత్కు మూడో పతకం ఖరారయ్యేది. కానీ క్వార్టర్ ఫైనల్లో కీన్ యియు (సింగపూర్) 21–14, 21–12 తో ప్రణయ్ను ఓడించి రెండో సెమీఫైనల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో పోరుకు సిద్ధమయ్యాడు. సింధుకు నిరాశ... మహిళల సింగిల్స్లో భారత స్టార్, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17–21, 13–21తో ఓడిపోయింది. తై జు చేతిలో సింధు ఓడటం ఇది 15వ సారి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారుల సంఖ్య. గతంలో ప్రకాశ్ పదుకొనే (1983లో), సాయిప్రణీత్ (2019లో) కాంస్య పతకాలు నెగ్గారు. ఈసారి లక్ష్య సేన్, శ్రీకాంత్లలో ఒకరికి కనీసం రజతం లేదా స్వర్ణం... మరొకరికి కాంస్య పతకం ఖరారు కానుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. మహిళల సింగిల్స్లో సింధు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్ రెండు పతకాలు (ఒక కాంస్యం, ఒక రజతం) సాధించారు. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట ఒక కాంస్యం గెలిచింది. పురుషుల సింగిల్స్లో ప్రకాశ్ పదుకొనే, సాయిప్రణీత్ ఒక్కో కాంస్యం నెగ్గారు. శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా ఒక్కో పతకం ఖరారు చేశారు. -
సింధుకు నిరాశ
బాలి (ఇండోనేసియా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇండో నేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో ప్రపంచ చాంపియన్ సింధు కథ సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 26 ఏళ్ల సింధు 21–15, 9–21, 14–21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ను దక్కించుకున్నా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెల్చుకున్నాక సింధు ఆడిన నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేదు. వరుసగా పదోసారి... మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట కూడా సెమీఫైనల్లో నిష్క్రమించింది. ప్రపంచ నంబర్వన్ జోడీ మార్కస్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ 16–21, 18–21తో ఓటమి పాలైంది. గిడియోన్–కెవిన్ ద్వయం చేతిలో సాత్విక్–చిరాగ్లకిది వరుసగా పదో పరాజయం కావడం గమనార్హం. -
సెమీస్లో సింధు
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 66 నిమిషాల్లో 14–21, 21–19, 21–14తో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో రచనోక్ (థాయ్లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 12–21, 8–21తో అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–19, 21–19తో గో జె ఫె–నూరూజుద్దీన్ (మలేసియా) జంటపై నెగ్గి సెమీఫైనల్కు చేరింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీకి సిక్కి–అశ్విని జంట అర్హత బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్కు భారత మహిళల డబుల్స్ జంట సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో బరిలోకి దిగనున్న తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా సిక్కి–అశ్విని గుర్తింపు పొందింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు బాలిలో జరిగే ఈ టోర్నీకి మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైంది. -
సెమీస్లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–14తో బుసానన్ ఒంగ్బామ్రంగ్ఫన్ (థాయ్లాండ్)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో సయాకా తకహాషి (జపాన్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 17–21, 15–21తో హెయో క్వాంగ్గీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–18, 18–21, 17–21తో ఆరోన్ చియా–సో వుయ్ యికి (మలేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
టీ20 ప్రపంచకప్లో సెమీస్కు చేరే జట్లు ఇవే...
Ian Chappell picks his semifinal contenders: టీ20 ప్రపంచకప్- 2021లో భాగంగా ప్రస్తుతం సూపర్ 12 పోటీలు జరగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ సెమీఫైనల్కు చేరే జట్లను ముందుగానే అంచనావేశాడు. ఈ మెగా టోర్నీలో గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్, గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్కు ఆర్హత సాధిస్తాయని ఛాపెల్ అభిప్రయపడ్డాడు. అయితే గ్రూప్ 2 లో మిగితా జట్లకు కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గట్టి పోటిస్తుంది అని అతడు తెలిపాడు. "గ్రూప్ 2నుంచి సెమిఫైనల్కు చేరే అవకాశాలు భారత్, పాకిస్తాన్లకు ఎక్కువగా ఉన్నాయి. అయితే వారికి న్యూజిలాండ్ నుంచి గట్టి పోటి ఉంటుంది. కాగా గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా,వెస్టిండీస్ నాలుగు జట్లు పటిష్టంగా ఉన్నాయి. అంచనా వేయడం చాలా కష్టం. కానీ ఇంగ్లండ్, వెస్టిండీస్లకు సెమీఫైనల్కు చేరే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ ఒక లాటరీ లాంటిది అని ఛాపెల్ ఓ స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. యూఏఈ పరిస్ధితులు పాక్కు బాగా కలిసొచ్చాయి... టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ స్పందించాడు. యూఏఈలో ఆడిన ఆనుభవం పాక్ను గెలిపించింది అని అతడు తెలిపాడు. "గత దశాబ్దం నుంచి యూఏఈలో పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుంది. అక్కడి పరిస్థితులు ఆ జట్టుకు బాగా తెలుసు. యూఏఈలో ఆడిన ఆనుభవం పాక్కు ఈ టోర్నమెంట్లో బాగా కలిసిస్తోంది అని భావిస్తున్నాను. మరోవైపు ఇటీవల ముగిసిన ఐపీఎల్లో జట్టులోని చాలా మంది ఆటగాళ్లు అక్కడ ఆడినందున భారత్కు కూడా ప్రయోజనం చేకూరుతుంది" అని ఛాపెల్ తెలిపాడు. చదవండి: Ind Vs Pak: టీమిండియా చేసిన పెద్ద తప్పు అదే.. అతడిని ఆడించకపోయి ఉంటే: ఆసీస్ మాజీ క్రికెటర్ -
రికార్డుల దిశగా జొకోవిచ్ అడుగులు
ఎదురు లేకుండా సాగుతున్న జొకోవిచ్ అడుగులు రికార్డుల దిశగా పడుతున్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్స్లామ్లో నంబర్వన్ సెర్బియన్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక రెండంటే రెండే మ్యాచ్లు (సెమీస్, ఫైనల్స్) గెలిస్తే జొకో క్యాలెండర్ స్లామ్తో పాటు 21వ గ్రాండ్స్లామ్ టైటిల్తో ఆల్టైమ్ గ్రేటెస్టు దిగ్గజాలు ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్)లను అధిగమిస్తాడు. న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్లను గెలిచిన సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తాజాగా యూఎస్ ఓపెన్ గెలిచే పనిలో పడ్డాడు. పురుషుల సింగిల్స్లో ఈ టాప్ సీడ్ ప్లేయర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ 5–7, 6–2, 6–2, 6–3తో ఆరో సీడ్ మటియో బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించాడు. మిగతా క్వార్టర్స్ మ్యాచ్ల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–0, 4–6, 7–5తో నెదర్లాండ్స్కు చెందిన బొటిక్ వాన్ డె జండ్ష్చల్ప్పై గెలుపొందగా, నాలు గో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (8/6), 6–3, 6–4తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై నెగ్గాడు. మహిళల క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)కు 4–6, 4–6తో మరియా సకారి (గ్రీస్) చేతిలో చుక్కెదురైంది. తొలి సెట్ కోల్పోగానే... జొకోవిచ్, బెరెటిని మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ హోరాహోరీగా మొదలైంది. పది గేమ్ల దాకా ఇద్దరు సరీ్వస్ను నిలబెట్టుకోవడంతో 5–5తో సమంగా నిలిచారు. సెర్బియన్ సర్వీస్ చేసిన 11వ గేమ్ను బ్రేక్ చేయడం ద్వారా బెరెటిని 6–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. తదుపరి గేమ్లో తన సరీ్వస్ను నిలబెట్టుకోవడంతో తొలిసెట్ను చేజిక్కించుకున్నాడు. ఈ సెట్ కోల్పోగానే జొకో జాగ్రత్త పడ్డాడు. తర్వాత వరుసగా మూడు సెట్లను అవలీలగానే చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో 12 ఏస్లు సంధించిన సెర్బియన్ స్టార్ 4 డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్ వద్ద 19 పాయింట్లు సాధించిన జొకోవిచ్ 44 విన్నర్లు కొట్టాడు. 28 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 5 బ్రేక్ పాయింట్లు సాధించి ప్రత్యరి్థపై పైచేయి సాధించాడు. మరోవైపు ఇటలీ స్టార్ బెరెటిని... జొకో కంటే అత్యధికంగా 17 ఏస్లు సంధించినప్పటికీ ఏకంగా 43 అనవసర తప్పిదాలు చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. 42 విన్నర్లు కొట్టాడు. ఇప్పటివరకు మూడు సార్లు (2011, 2015, 2018) యూఎస్ చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ ఇక్కడ సెమీస్ చేరుకోవడం ఇది 12వ సారి. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో సెర్బియన్ స్టార్... జర్మనీకి చెందిన నాలుగో సీడ్ జ్వెరెవ్తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ సీజన్ వింబుల్డన్ రన్నరప్ కరోలినా ప్లిస్కోవా 4–6, 4–6తో వరుస సెట్లలో సకారి ధాటికి చేతులెత్తేసింది. 2016లో యూఎస్ ఓపెన్ రన్నరప్గా నిలిచిన చెక్ రిపబ్లిక్ స్టార్ను కేవలం గంటా 22 నిమిషాల్లోనే సకారి ఇంటిదారి పట్టించింది. 2015 నుంచి యూఎస్ ఓపెన్ ఆడుతున్న గ్రీస్ ప్లేయర్ సకారి తన కెరీర్లో తొలిసారి సెమీస్ చేరింది. సెమీస్లో ఎవరితో ఎవరు జొకోవిచ్ (1) గీ జ్వెరెవ్ (4) మెద్వెదెవ్ (2) గీ ఫెలిక్స్ అగర్ (12) -
సూపర్ లేలా... వరుసగా మూడో సంచలన విజయం
యూఎస్ ఓపెన్లో కెనడా టీనేజర్ లేలా ఫెర్నాండెజ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మహిళల సింగిల్స్లో 19 ఏళ్ల లేలా వరుసగా మూడో సంచలన విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), క్వాలిఫయర్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) కూడా యూఎస్ ఓపెన్లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. న్యూయార్క్: అనామక క్రీడాకారిణిగా యూఎస్ ఓపెన్లో అడుగుపెట్టిన కెనడా టీనేజర్ లేలా ఫెర్నాండెజ్ అద్భుత విజయాలతో వారం రోజుల్లోనే అందరూ తనవైపు దృష్టి సారించేలా చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 73వ ర్యాంకర్ లేలా 2 గంటల 24 నిమిషాల్లో 6–3, 3–6, 7–6 (7/5)తో ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించింది. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరుకుంది. స్వితోలినాతో జరిగిన మ్యాచ్లో లేలా కీలక సందర్భాల్లో సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించింది. మ్యాచ్ మొత్తంలో ఒకే ఏస్ సంధించిన లేలా నెట్ వద్దకు 24 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు గెలవడం విశేషం. క్రిచికోవా ఓటమి ఇతర క్వార్టర్ ఫైనల్స్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఎనిమిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... క్వాలిఫయర్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) 6–3, 6–4తో 11వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. యూఎస్ ఓపెన్లో సెమీస్ చేరిన తొలి క్వాలిఫయర్గా రాడుకాను చరిత్ర సృష్టించింది. ఫిలిక్స్ తొలిసారి... పురుషుల సింగిల్స్లో 12వ సీడ్ ఫిలిక్స్ ఉజెర్ అలియాసిమ్ తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోరీ్నలో సెమీఫైనల్కు చేరాడు. తద్వారా యూఎస్ ఓపెన్ టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్లో సెమీఫైనల్కు చేరిన తొలి కెనడా ప్లేయర్గా ఘనత వహించాడు. స్పెయిన్ టీనేజ్ సంచలనం కార్లోస్ అల్కారజ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల ఫిలిక్స్ తొలి సెట్ను 6–3తో సొంతం చేసుకొని, రెండో సెట్లో 3–1తో ఆధిక్యం సాధించాడు. ఈ దశలో అల్కారజ్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
డబుల్స్ సెమీస్లో సానియా మీర్జా జంట
క్లీవ్ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెక్హాలే (అమెరికా) జంట సెమీఫైనల్లో ప్రవేశించింది. అమెరికాలోని ఒహాయోలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 6–3, 6–3తో మూడో సీడ్ లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్)–షుయె జాంగ్ (చైనా) జంటపై సంచలన విజయం సాధించింది. 61 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్లో సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్ను ఐదు సార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ఐకెరి (నార్వే)–కేథరిన్ హ్యారిసన్ (అమెరికా) జంటతో సానియా–క్రిస్టినా జోడీ తలపడనుంది. -
Tokyo Paralympics 2021: భారత్కు తొలి పతకం ఖరారు
గత నెలలో టోక్యో సమ్మర్ ఒలింపిక్స్లో మహిళా వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను ప్రదర్శనతో భారత్ పతకాల బోణీ కొట్టగా... తాజాగా టోక్యోలోనే జరుగుతున్న దివ్యాంగుల విశ్వ క్రీడల్లోనూ (పారాలింపిక్స్) మహిళా క్రీడాకారిణి ద్వారానే భారత్ పతకాల ఖాతా తెరిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా పారాలింపిక్స్లో పతకం అందించనున్న తొలి భారతీయ టీటీ ప్లేయర్గా 34 ఏళ్ల భవీనాబెన్ కొత్త చరిత్ర లిఖించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ మియావో జాంగ్తో భవీనాబెన్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భవీనా స్వర్ణ–రజత పతకాల కోసం ఫైనల్లో ఆడుతుంది. సెమీస్లో ఓడిపోతే మాత్రం కాంస్య పతకం లభిస్తుంది. టోక్యో: పారాలింపిక్స్ క్రీడల మూడో రోజు భారత మహిళా టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ శుభవార్త వినిపించింది. మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భవీనా కేవలం 18 నిమిషాల్లో 11–5, 11–6, 11–7తో 2016 రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ బొరిస్లావా పెరిచ్ రాన్కోవిచ్ (సెర్బియా)పై సంచలన విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ భారత నంబర్వన్ 12–10, 13–11, 11–6తో జాయ్స్ డి ఒలివియెరా (బ్రెజిల్)ను ఓడించింది. నడుము కింది భాగం అచేతనంగా మారిన వారు క్లాస్–4 విభాగం పరిధిలోకి వస్తారు. తొలిసారి పారాలింపిక్స్లో ఆడుతున్న గుజరాత్కు చెందిన 34 ఏళ్ల భవీనా సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది. పారాలింపిక్స్ టీటీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు అందజేస్తారు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్, 2016 రియో పారాలింపిక్స్ రజత పతక విజేత మియావో జాంగ్ (చైనా)తో భవీనా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో మియావో జాంగ్ 11–0తో భవీనాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. జియోడాన్ జు (చైనా), యింగ్ జై (చైనా) మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. పోలియో బారిన పడి... గుజరాత్లోని వాద్నగర్కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్షిప్లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. సకీనాకు ఐదో స్థానం పారాలింపిక్స్ పవర్ లిఫ్టింగ్లో మహిళల 50 కేజీల విభాగంలో సకీనా ఖాతూన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆమె 93 కేజీలు బరువెత్తింది. పురుషుల 65 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జైదీప్ మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. షాట్పుట్లో నిరాశ పురుషుల అథ్లెటిక్స్ ఎఫ్–54 షాట్పుట్ ఈవెంట్లో భారత ప్లేయర్ టెక్ చంద్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పారాలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన టెక్ చంద్ ఇనుప గుండును 9.04 మీటర్ల దూరం విసిరాడు. బ్రెజిల్కు చెందిన వాలెస్ సాంతోస్ ఇనుప గుండును 12.63 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. శుభారంభం.... ఆర్చరీ పురుషుల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్ లో భారత ఆర్చర్ రాకేశ్ కుమార్ 699 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో, శ్యామ్ సుందర్ స్వామి 682 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పురుషుల రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు వివేక్ 609 పాయింట్లు స్కోరు చేసి పదో స్థానంలో, హర్వీందర్ 600 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్లో నేటి భారత షెడ్యూల్ మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ సెమీఫైనల్: భవీనాబెన్ X మియావో జాంగ్ (చైనా); ఉదయం గం. 6:10 నుంచి. ఆర్చరీ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్: శ్యామ్ సుందర్ X మ్యాట్ స్టుట్మన్ (అమెరికా); ఉదయం గం. 6:38 నుంచి; రాకేశ్ కుమార్ ్ఠ సులేమాన్ (ఇరాక్) లేదా ఎన్గాయ్ (హాంకాంగ్); ఉదయం గం. 8:38 నుంచి అథ్లెటిక్స్ పురుషుల ఎఫ్–57 జావెలిన్ త్రో ఫైనల్: రంజీత్ భాటి (మ. గం. 3:30 నుంచి) పారాలింపిక్స్లో పతకం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి భవీనాబెన్. 2016 రియో పారాలింపిక్స్లో అథ్లెట్ దీపా మలిక్ షాట్పుట్ ఎఫ్–53 విభాగంలో రజతం గెలిచింది. -
భళా భవీనా: పారా ఒలింపిక్స్లో భారత్కు పతకం ఖాయం
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతన్న పారా ఒలింపిక్స్లో భారత్కు పతకం ఖాయమైంది. భారత ప్యాడ్లర్ భవీనా పటేల్ సంచలనం సృష్టించింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్-4 విభాగంలో సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా రికార్డులకెక్కింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 2, రియో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్తో జరిగిన పోరులో ఘన విజయం సాధించి సెమీస్లోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి రాంకోవిక్ను 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది. కాగా శనివారం జరిగే సెమీ ఫైనల్స్లో ఆమె చైనాకు చెందిన జాంగ్ మియావోతో తలపడుతుంది. కాంస్యం కోసం ప్లే ఆఫ్ లేకపోవడంతో భవీనాకు పతకం ఖాయమైంది. ఓడిపోయిన సెమీ-ఫైనలిస్టులు ఇద్దరూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంటారు. చదవండి: IND Vs ENG 3rd Test Day 3: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(8) ఔట్ ⭐1st Indian to secure a #ParaTableTennis medal ⭐Lost her opening match and then won 3 in a row. ⭐In her quarter final match, she trailed just once. Take a bow, @BhavinaPatel6 🔥 Stay tuned for her semi-final tomorrow! ⌛#Paralympics #Tokyo2020 pic.twitter.com/1gyRX7cHOj — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 27, 2021 -
వస్తూ.. వస్తూ కొంచెం బంగారం తీసుకురండి!
దేశంలో కోలాహలంగా ఉంది. ఒలింపిక్స్లో ఇండియన్ విమెన్ హాకీ టీమ్ ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్స్కు వెళ్లి చరిత్ర సృష్టించింది. ఆగస్టు 4న అర్జంటీనాతో సెమిస్లో గెలిస్తే అది మరో చరిత్ర. కాని ఇదంతా జరగక ముందే ఇలాంటిది ఒకటి సినిమాలో జరిగింది. ‘చక్ దే ఇండియా’లో రీల్ విమెన్ టీమ్ ఆస్ట్రేలియా మీద గెలిచి వరల్డ్ కప్ సాధిస్తుంది. ఇప్పుడు ఆ రీల్ టీమ్ తారలు రియల్ టీమ్ను అభినందిస్తున్నారు. అంతేనా? రీల్ టీమ్ కోచ్ షారూక్ ఖాన్ రియల్ కోచ్ను ‘సరే సరే.. వస్తూ వస్తూ కాసింత బంగారం తెండి’ అని ‘మాజీ కోచ్’ హోదాలో కోరాడు. అసలు ఇదంతా ఎంత సందడో కదా. మొత్తం 16 మంది ప్లేయర్లు. ఒక ప్రాంతం కాదు. ఒక భాష కాదు. ఒక భౌతిక, మానసిక స్థితి కాదు. ఒకే రకమైన ఆట కాదు. కదలికా కాదు. కాని ఒలింపిక్స్ కోసం టోక్యోలో క్వార్టర్ ఫైనల్స్లో నిన్న (ఆగస్టు 2న) శక్తిమంతమైన (ప్రపంచ 3వ ర్యాంకు) ఆస్ట్రేలియా జట్టు పై పోటీకి దిగినప్పుడు వాళ్లందరి కళ్ల ముందు ఒకే దృశ్యం కనపడుతూ వచ్చింది. అది దేశ జాతీయ పతాకం భారత క్రీడా ఆకాంక్ష భారత ప్రజలు ఆశిస్తున్న విశ్వ క్రీడా గుర్తింపు. అందుకే విమెన్ హాకీ టీమ్ పట్టుదలగా, అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. 19 ఏళ్ల నుంచి 31 ఏళ్ల వరకూ రకరకాల వయసుల్లో ఉన్న ఈ మహిళా ప్లేయర్లు తమ చురుకుదనాన్ని, అనుభవాన్ని సంయమనం చేసుకుంటూ 160 గ్రాముల హాకీ బాల్ మీద 130 కోట్ల మంది భారతీయులు పెట్టిన భారాన్ని ఒడుపుగా బ్యాట్తో నెడుతూ విజయం అనే లక్ష్యానికి చేర్చారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 1980 ఒలిపింక్స్లో మన మహిళా జట్టు విశ్వ వేదిక మీద అలాంటి ప్రదర్శన ఇచ్చింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు. క్రీడలంటే పురుషుల గుత్త సొత్తు కాదు... మాది... క్రీడాకాశంలో మేము సగం అని మన మహిళా క్రీడాకారులు ఎలుగెత్తి చాటిన సందర్భం ఇది. చరిత్రాత్మక సందర్భం. పతకాల కంటే కూడా ప్రయత్నమే గొప్పగా వీరు మనసుల్ని గెలుచుకున్నారు. అయితే ఇదంతా ‘డెజావూ’గా ఉంది కొందరికి. కారణం ఇలాంటి విజయాన్ని ఇదివరకే భారతీయులు చూడటం వల్లే. కాకుంటే వెండితెర మీద. ‘చక్ దే ఇండియా’ సినిమాలో. అందుకే ఆ సినిమాలో పని చేసినవారూ, చూసిన వారూ ఇప్పుడా సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. చక్ దే ఇండియా 2007లో ‘చక్ దే ఇండియా’ వచ్చింది. అంతవరకూ క్రికెట్దే రాజ్యంగా, క్రికెట్ నేపథ్య సినిమాలే ప్రధానంగా వస్తుంటే చక్ దే.. వచ్చి హాకీని తెర మీదకు తెచ్చింది. అదీ మహిళా హాకీని. ‘ఎందుకు మహిళా హాకీని ఇంత చిన్న చూపు చూస్తారు. వారి గొప్పతనం తెలిపే సినిమా తీయాలి’ అని దర్శకుడు షిమిత్ అమిన్ అనుకోవడంతో ఈ సినిమా సాధ్యమైంది. 2002 కామన్వెల్త్ క్రీడల్లో, 2004 ఆసియా కప్లో భారత మహిళా హాకీ అద్భుతమైన ప్రతిభ చూపడమే ఇందుకు కారణం. అదీ కాక మన ప్రేక్షకులకు క్రికెట్ తెలిసినంతగా హాకీ తెలియదు. హాకీ ఆటలో ఉండే మెళకువలు, కఠోర సాధన, సాటి వారి నుంచి ఎదురయ్యే సవాళ్లు ముఖ్యంగా మహిళా ప్లేయర్లకు ఎలా ఉంటాయో చూపుతూ ఈ సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు. ఇందులో కోచ్గా షారూక్ ఖాన్ నటించడానికి అంగీకరించడంతో గ్లామర్ యాడ్ అయ్యింది. నిజ జీవిత పాత్రలతో మహిళా హాకీకి కోచ్గా ఉన్న మహరాజ్ క్రిషన్ కౌశిక్ను కలిసిన దర్శకుడు షిమిత్ ఆటను సినిమాగా రాసుకోవడమే కాదు మరో హాకీ కోచ్ మిర్ రంజన్ నెగి గురించి తెలుసుకున్నాడు. 1982 ఆసియన్ గేమ్స్లో పాకిస్తాన్తో ఆడిన మేచ్లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఆ మేచ్కు గోల్ కీపర్గా వ్యవహరించిన నేగి మొహం చెల్లక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు అజ్ఞాతం వీడి మహిళా జుట్టుకు గోల్కీపింగ్లో శిక్షణ ఇచ్చి విజయబాటలో నడిపాడు. ఇతని పాత్రే షారుక్ఖాన్ పాత్రకు ఇన్స్పిరేషన్. అదొక్కటే కాదు క్రీడాకారుల్లో ఉండే ఇగో, భాషాభేదం, ప్రాంతీయభేదం... వీటన్నింటిని దాటి కోచ్లు ఆ టీమ్ని ఏకతాటిపై ఎలా తీసుకువస్తాడో కూడా సినిమాలో చూపడం వల్ల ప్రేక్షకులకు నచ్చింది. రీల్ టీమ్ తబ్బిబ్బు సినిమాలో ఆస్ట్రేలియా టీమ్పై గెలిచినట్టే ఇప్పుడు ఒలింపిక్స్లో మన జట్టు ఆస్ట్రేలియా జట్టుపై గెలవడంతో చక్ దే..లో పని చేసిన తారలు సంతోషంతో ట్వీట్లు చేస్తున్నారు. చక్దేలో కెప్టెన్గా నటించిన విద్య మలవడె ‘ఉదయం నించి నా ఫోన్ మోగుతూనే ఉంది. నేను తెర మీదే గెలిచాను. వీరు నిజంగా గెలిచారు. చరిత్ర సృష్టించారు’ అని ఇన్స్టాలో రాసింది. మరోనటి సాగరిక ఘాటే కూడా ఇలాగే సంతోషం పంచుకుంది. ఇక షారూక్ ఖాన్ ఏకంగా ‘మాజీ కోచ్’నంటూ రంగంలో దిగి సంతోషం పంచుకున్నాడు. ‘సరే సరే.. వస్తూ వస్తూ కొంచెం బంగారం తీసుకురండి. ధన్తేరస్ కూడా ముందుంది. – మాజీ కోచ్ కబీర్ఖాన్’ అని ట్వీట్ చేశాడు. దానికి రియల్ కోచ్ మరిజ్నే స్పందిస్తూ ‘మీ సపోర్ట్కు కృతజ్ఞతలు. మేము మా సర్వస్వాన్ని ఒడ్డుతాము. ఇట్లు రియల్ కోచ్’ అని సమాధానం ఇచ్చాడు. ఈ దేశం మర్యాదను నిలబెట్టే పని మహిళా ప్లేయర్లే చేస్తున్నారు. అలాగని మగవారి శ్రమ తక్కువది కాదు. స్త్రీ, పురుషులు కలిసి భారత క్రీడా పతాకాన్ని రెపరెపలాడించడమేగా కావలసింది. -
షారుక్ ట్వీట్ వైరల్: లేటైనా నో ప్రాబ్లం.. వచ్చేటప్పుడు గోల్డ్తో రండి
టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతమే చేసింది. క్వార్టర్స్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను కట్టడి చేసి సెమీ ఫైనల్కు చేరి సత్తా చాటింది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్లో తొలిసారిగా సెమీస్ చేరింది. తాజాగా ఈ విజయంపై బాలీవుడ్ బాద్ షా షారుక్ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. అంచనాలను తారుమారు చేస్తూ భారత మహిళల హాకీ జట్టు సెమీస్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మహిళల జట్టుపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. చారిత్రాత్మక సందర్భాన్ని కోచ్ సోయెర్డ్ మరీన్ రియల్ లైఫ్ చక్ దే ఇండియాతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమా కూడా మహిళల హాకీ కథాంశంతోనే తెరకెక్కింది కనుక. ఈ ఆనందాన్నీ కోచ్ సోషల్మీడియాలో పంచుకుంటూ.. సారీ ఫ్యామిలీ.. నేను రావడం ఆలస్యమవుతుందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రంలో కోచ్ కబీర్ఖాన్ పాత్ర పోషించిన షారుక్ దీనికి స్పందిస్తూ.. సరే ఏం ప్రాబ్లం లేదు. మీరు వచ్చేటప్పుడు భారత్లోని లక్షల కుటుంబాల కోసం గోల్డ్ తీసుకురండి చాలు.. మీ మాజీ కోచ్ కబీర్ ఖాన్ అని రిప్లై ఇచ్చాడు. కాగా ఉత్కంఠ సాగుతున్న మ్యాచ్లో గుర్జీత్ సంచలన గోల్ కొట్టి భారత్కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్లో అడుగుపెట్టింది. అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. Haan haan no problem. Just bring some Gold on your way back….for a billion family members. This time Dhanteras is also on 2nd Nov. From: Ex-coach Kabir Khan. https://t.co/QcnqbtLVGX — Shah Rukh Khan (@iamsrk) August 2, 2021 -
హాకీలో స్వర్ణం ఆశలు: మాజీ కెప్టెన్ అశోక్ ధ్యాన్ చంద్
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు దూసుకుపోతోంది. క్వార్టర్ ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సెమీస్లోకి ఎంటరవ్వడం మాత్రమే కాదు సరికొత్త చరిత్రను లిఖించుకుంది. దీనిపై హాకీ మాజీ కెప్టెన్ అశోక్ ధ్యాన్ చంద్ స్పందించారు. మ్యాచ్ మొత్తంలో ఎక్కడా ఒక్క పొరపాటు కూడా చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆస్ట్రేలియా ఆశలు గల్లంతయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘనత అంతా డీఫెన్స్, గోల్ కీపర్ గుర్జీత్కే దక్కుతుందని ప్రశంసించారు. ఈ విజయంతో బంగారం పతకం ఆశలకు మహిళల జట్టు మరింత చేరుకుందన్నారు. హాకీలో స్వర్ణం భారత్కు వారసత్వంగా వస్తోంది. గోల్డ్ సాధించి ఈ లెగసీని మహిళల జట్టు సాధించనుందనే ఆశాభావాన్ని ధ్యాన్ చంద్ వ్యక్తం చేశారు. భారత మహిళల హాకీ జట్టుపై దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది. పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులతోపాటు భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఫారెల్ కూడా హాకీ జట్టును అభినందించారు. 'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా' సవితా పునియాను ఓడించలేమని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సెమీ, గ్రాండ్ ఫైనల్స్కు శుభాకాంక్షలు అందించారు. అమ్మాయిలు మీరు చరిత్ర సృష్టించారు! నమ్మశక్యంకానీ ఆటతీరును ప్రదర్శించారు. ఇక గోల్డ్ మెడల్ తీసుకురండి" అని భారత మాజీ ఆటగాడు లాజరస్ బార్లా ట్వీట్ చేశారు. కాగా ఉత్కంఠ సాగుతున్న మ్యాచ్లో గుర్జీత్ సంచలన గోల్ కొట్టి భారత్కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్లో అడుగుపెట్టింది. ఇది చరిత్రలో నిలిచిపోయే గోల్ అంటూటోక్యో 2020 ఫర్ ఇండియా ట్వీట్ చేయడం విశేషం. అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. I didn't see a single weak spot in the game. Australian team was left hopeless. The credit goes to defence and the goalkeeper. We are too close to winning a medal. Getting gold medal in Hockey is India's legacy and we all hope for the best: Ashok Dhyan Chand, ex-Hockey captain pic.twitter.com/iaQTzThBsJ — ANI (@ANI) August 2, 2021 Girls you created HISTORY! Unbelievable performance. Let's do it this time, bring the yellow metal home.#Olympics2020 #Hockey https://t.co/EYd0GJ8BhV — Lazarus Barla (@LazarusBarla) August 2, 2021 -
జొకోవిచ్ జోరు
టోక్యో: టెన్నిస్ ‘టాప్’ స్టార్ నొవాక్ జొకోవిచ్ టోక్యో ఒలింపిక్స్లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. ‘గోల్డెన్ స్లామ్’ వేటలో ఉన్న ఈ సెర్బియన్ బంగారు పతకానికి రెండే అడుగుల దూరంలో ఉన్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ 6–2, 6–0తో స్థానిక స్టార్ కీ నిషికొరి (జపాన్)పై అలవోక విజయం సాధించాడు. టాప్ సీడ్ నొవాక్ క్వార్టర్స్ మ్యాచ్ను 70 నిమిషాల్లోనే ముగించాడు. సెమీస్లో అలెగ్జాండర్ జ్వెరెవ్తో జొకోవిచ్ తలపడతాడు. మహిళల విభాగంలో స్విట్జర్లాండ్ స్టార్ బెలిండా బెన్చిచ్ సింగిల్స్, డబుల్స్లో ఫైనల్ చేరింది. సింగిల్స్ సెమీస్లో ఆమె 7–6 (7/2), 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. డబుల్స్లో గొలుబిక్–బెన్చిచ్ జోడీ 7–5, 6–3తో పిగొసి–స్టెఫానీ (బ్రెజిల్) జంటపై నెగ్గింది. -
29 ఏళ్ల తర్వాత...
బాకు (అజర్బైజాన్): యూరో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో డెన్మార్క్ జట్టు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. చెక్ రిపబ్లిక్తో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ 2–1తో గెలిచింది. చివరిసారి డెన్మార్క్ 1992లో సెమీఫైనల్ చేరుకోవడమే కాకుండా ఏకైకసారి టైటిల్ కూడా సాధించింది. డెన్మార్క్ తరఫున డెలానీ (5వ ని.లో), డాల్బెర్గ్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. చెక్ రిపబ్లిక్ తరఫున షిక్ (49వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మరో క్వార్టర ఫైనల్లో ఇటలీ 2–1తో బెల్జియంను ఓడించి సెమీఫైనల్ చేరింది. -
సెమీస్లో దీపిక, అతాను దాస్
గ్వాటెమాలా సిటీ: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో పురుషుల, మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ ఆర్చర్లు, భార్యభర్తలైన దీపిక కుమారి, అతాను దాస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్లో దీపిక కుమారి 6–0తో మిచెల్లి క్రాపెన్ (జర్మనీ)పై గెలుపొందగా... అంకిత 2–6తో అలెజాండ్రా వలెన్సియా (మెక్సికో) చేతిలో ఓడిపోయింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో 6–4తో ఎరిక్ పీటర్స్ (కెనడా)పై గెలుపొందాడు. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రెండో రౌండ్లో 5–6తో డానియల్ క్యాస్ట్రో (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల టీమ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్ రాయ్లతో కూడిన భారత జట్టు 4–5తో గార్సియా, క్యాస్ట్రో, పాబ్లోలతో కూడిన స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో మహిళల జట్టు మహిళల టీమ్ విభాగంలో దీపిక కుమారి, అంకిత, కోమలికలతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో టీమిండియా 6–0తో ఇలియా, ఇనెస్, లెరీ ఫెర్నాండెజ్లతో కూడిన స్పెయిన్పై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–0తో నాన్సీ, సింతియా, కామిలాలతో కూడిన గ్వాటెమాలా జట్టును ఓడించింది. -
సింధు, శ్రీకాంత్ జోరు
బాసెల్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించే దిశగా భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ మరో అడుగు వేశారు. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్లో ప్రపంచ చాంపియన్ సింధు... పురుషుల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. 13వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్పన్ (థాయ్లాండ్)తో 59 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 23–21తో గెలిచింది. బుసానన్పై సింధుకిది 12వ విజయం కావడం విశేషం. కాంతాపోన్ వాంగ్చరోయిన్ (థాయ్లాండ్)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో నెగ్గాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో భారత ఆటగాళ్లు సాయిప్రణీత్ 14–21, 17–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో... అజయ్ జయరామ్ 9–21, 6–21తో కున్లావుత్ విదిత్సరన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే సెమీఫైనల్స్లో మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో సింధు; విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్ ఆడతారు. డబుల్స్ సెమీస్లో సాత్విక్ జంట పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 12–21, 21–19, 21–12తో ఒంగ్ యెవ్ సిన్–తియో ఈ యి (మలేసియా) జోడీపై గెలిచి సెమీఫైనల్కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 17–21, 21–16, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశం -
ప్రజ్నేశ్ ముందంజ
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 134వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 6–4, 2–6, 7–6 (7/1)తో ప్రపంచ 102వ ర్యాంకర్ జేమ్స్ డక్వర్త్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్లో తమిళనాడుకు చెందిన ప్రజ్నేశ్ 11 ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 166వ ర్యాంకర్ థామస్ మచాక్ (చెక్ రిపబ్లిక్)తో ప్రజ్నేశ్ ఆడతాడు. -
మేరీకోమ్కు పతకం ఖాయం
కాస్టెలాన్ (స్పెయిన్): ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ పతకాన్ని ఖాయం చేసుకుంది. బాక్సమ్ ఓపెన్ టోర్నీలో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన మేరీకోమ్ బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో ఇటలీకి చెందిన జియోర్డానా సొరెన్టినోపై గెలిచింది. సెమీఫైనల్లో అమెరికా బాక్సర్ వర్జీనియాతో మేరీకోమ్ ఆడనుంది. పురుషుల విభాగంలో మనీశ్ (63 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్లో మనీశ్ 5–0తో రడుయెన్ (స్పెయిన్)పై నెగ్గాడు. -
సూపర్ సాత్విక్
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ మెరిశాడు. అశ్విని పొన్నప్పతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో... చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని ద్వయం 18–21, 22–20, 24–22తో ప్రపంచ ఏడో ర్యాంక్, ఐదో సీడ్ జోడీ చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండో గేమ్లో సాత్విక్ జంట ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 24–22తో ఒంగ్ యెవ్ సిన్–తియోఈ యి (మలేసియా) జంటపై గెలిచింది. మహిళల, పురుషుల సింగిల్స్లో భారత పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 13–21, 9–21తో ప్రపంచ మాజీ చాంపియన్, నాలుగో సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో ఏ దశలోనూ సింధు తన ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 81 నిమిషాలపాటు హోరాహోరీ పోరులో సమీర్ వర్మ 13–21, 21–19, 20–22తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక మూడో గేమ్లో సమీర్ 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే పట్టువదలని ఆంటోన్సెన్ వరుస గా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
సెమీస్లో రామ్కుమార్
న్యూఢిల్లీ: ఎకెంటల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు రామ్కుమార్ రామనాథన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 206వ ర్యాంకర్ రామ్కుమార్ 6–2, 6–1తో ప్రపంచ 120వ ర్యాంకర్, నాలుగో సీడ్ ఎవ్గెనీ డాన్స్కాయ్ (రష్యా)ను ఓడించాడు. 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో రామ్కుమార్ 11 ఏస్లు సంధించడం విశేషం. తన ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రామ్కుమార్ తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో మార్విన్ మోలెర్ (జర్మనీ)తో రామ్కుమార్ ఆడతాడు. -
ఆసియా ఆన్లైన్ చెస్: సెమీస్లో భారత జట్లు
చెన్నై: ఆసియా నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల జట్టు 4–0తో; 3.5–0.5తో కిర్గిస్తాన్పై... భారత పురుషుల జట్టు 2.5–1.5తో; 2.5–1.5తో మంగోలియాపై గెలిచాయి. నేడు జరిగే సెమీఫైనల్స్లో మంగోలియాతో భారత మహిళల జట్టు; ఇరాన్తో భారత పురుషుల జట్టు తలపడతాయి. టీమ్ విభాగంలో ఫలితాలను లెక్కలోనికి తీసుకొని వ్యక్తిగత విభాగంలో పతకాలను అందజేయగా... మహిళల టాప్ బోర్డుపై ఆడిన ఆర్.వైశాలి (6.5 పాయింట్లు), ఐదో బోర్డుపై ఆడిన మేరీఆన్ గోమ్స్ (5 పాయింట్లు) స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. మూడో బోర్డుపై ఆడిన పద్మిని రౌత్ (7.5 పాయింట్లు) ఖాతాలో రజతం చేరింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో రెండో బోర్డుపై ఆడిన శశికిరణ్ (8 పాయింట్లు) రజతం గెల్చుకున్నాడు. -
నాదల్ 13వసారి సెమీస్లోకి...
మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)దే పైచేయిగా నిలిచింది. ఇటలీ టీనేజర్ జానిక్ సినెర్తో జరిగిన మ్యాచ్లో నాదల్ 7–6 (7/4), 6–4, 6–1తో గెలుపొంది ఈ టోర్నీలో 13వసారి సెమీఫైనల్కు చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 12వ సీడ్ డీగో ష్వార్ట్జ్మన్ (అర్జెంటీనా)తో నాదల్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో నాదల్ 9–1తో ఆధిక్యంలో ఉన్నాడు. పారిస్ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఒకటిన్నరకు ముగిసింది. ఫ్రెంచ్ ఓపెన్లోని సెంటర్ కోర్టుకు పైకప్పు అమర్చడంతో ఈసారి రాత్రి వేళ కూడా మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 7–5, 6–2, 6–3తో 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. -
క్విటోవా కేక...
పారిస్: కెరీర్లో మూడో గ్రాండ్స్లామ్ టైటిల్పై గురి పెట్టిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా ఆ దిశగా మరో అడుగు వేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ఫ్రెంచ్ ఓపెన్లో మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ క్విటోవా 6–3, 6–3తో లౌరా సిగెముండ్ (జర్మనీ)పై విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో క్విటోవా ఆరు ఏస్లు సంధించింది. నాలుగు డబుల్ ఫాల్ట్లు, 15 అనవసర తప్పిదాలు చేసిన ఆమె ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. పదునైన ఏస్లతో చెలరేగిన క్విటోవా తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్కసారీ బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. ఫోర్ హ్యాండ్ విన్నర్తో తొలి సెట్ను నెగ్గిన ఆమె రెండో సెట్లోనూ అదే జోరు కొనసాగించింది. తొలి గేమ్లోనే సిగెముండ్ సర్వీస్ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయింది. కానీ సిగెముండ్ తన సర్వీస్ను కాపాడుకోవడంలో మూడుసార్లు విఫలమవ్వడంతో క్విటోవాకు విజయం సులువుగానే దక్కింది. 2012లో ఏకైకసారి ఈ టోర్నీలో సెమీస్ చేరిన క్విటోవా తొలిసారి ఫైనల్కు చేరాలంటే సెమీఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించాల్సి ఉంటుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సోఫియా 6–4, 4–6, 6–0తో అన్సీడెడ్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన సోఫియా ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి సెమీఫైనల్కు చేరడం విశేషం. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సోఫియా రెండో సెట్లో తడబడింది. కానీ నిర్ణాయక మూడో సెట్లో ఈ అమెరికా క్రీడాకారిణి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. -
ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్లో నాదల్ !
పారిస్: డిఫెండింగ్ ఛాంపియన్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్లో సెమీస్కు చేరాడు. క్వార్టర్ ఫైనల్స్లో ఇటలీకి చెందిన యువ ఆటగాడు 'జన్నిక్ సిన్నర్'పై 7-6, 6-4, 6-1 తేడాతో గెలుపొందాడు. ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ ఇప్పటివరకు వంద మ్యాచులు ఆడగా, వీటిలో 98 విజయాలు సాధించడం విశేషం. ఇప్పటి వరకు 12 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ దక్కించుకున్న నాదల్ మరో టైటిల్ సాధించేందుకు రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. సెమీ ఫైనల్స్లో అర్జెంటినాకు చెందిన 'డీగో ష్వార్ట్మెన్'తో తలపడనున్నాడు. ఆ టైంలో భయకరంగా ఉంది... దాదాపు 2 గంటల 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ముగిసేసరికి అర్ధరాత్రి 1.30 గంటలైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో నాదల్ మాట్లాడాడు. 12 డిగ్రీల సెల్సియల్తో ఈ సమయం వరకు మ్యాచ్ ఆడడం భయంకరంగా ఉందని అన్నాడు. ఫుట్బాల్ ఆటగాళ్లు ఇలాంటి వాతావరణంలో ఆడుతారని, కానీ నిర్వాహకులు మ్యాచ్ను ఇంత ఆలస్యంగా ఎందుకు నిర్వహించారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాదల్, జన్నిక్ సిన్నర్ రాత్రి 10.30 గంటలకు కోర్ట్లో అడుగుపెట్టారు. ఒకే కోర్టుపై ఐదు మ్యాచులు ఉండడంతో వారికి ఆలస్యం అవ్వక తప్పలేదు. జన్నిక్పై ప్రశంసలు... జన్నిక్ అద్భుతంగా ఆడాడని, బంతిని ధాటిగా స్ట్రైక్ చేస్తున్నాడని నాదల్ అన్నాడు. మొదటి రెండు సెట్స్లో మంచి పోటీనిచ్చాడని...ముఖ్యంగా మొదటి సెట్లో హోరాహోరిగా పోటిపడ్డామని అన్నాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉందని కితాబిచ్చాడు. (ఇదీ చదవండి: అక్షరాలా రూ. 7 కోట్లు) -
ఒక్కడే మిగిలాడు
టాప్ సీడ్ సెర్బియన్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్లో నిష్క్రమించాడు. మూడో సీడ్ టెన్నిస్ స్టార్ ఫెడరర్ క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టాడు. ఇక అందరికళ్లు రెండో సీడ్ నాదల్ మ్యాచ్పైనే పడ్డాయి. కానీ టాప్–3లో అతనొక్కడే నిలిచాడు. క్వార్టర్స్ అంచెదాటి సెమీఫైనల్ చేరాడు. ఇప్పటికే మూడు సార్లు (2010, 2013, 2017) చాంపియన్గా నిలిచిన ఈ స్పెయిన్ స్టార్ నాలుగో టైటిల్ వేటలో రెండడుగుల దూరంలో నిలిచాడు. న్యూయార్క్: టాప్–3లో ఒకే ఒక్కడి అడుగు సెమీస్లో పడింది. స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ ఈ సీజన్ ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ మాజీ చాంపియన్ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. గురువారం జరిగిన పోరులో అతను 6–4, 7–5, 6–2తో అర్జెంటీనాకు చెందిన 20వ సీడ్ డీగో ష్వార్జ్మన్పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో నాదల్కు రెండో సెట్ మినహా ఎక్కడ పోటీ ఎదురవలేదు. ఆఖరి సెట్నైతే ఏకపక్షంగా ముగించేశాడు. 5 ఏస్లు సంధించిన నాదల్ ప్రత్యర్థి సర్వీస్ను 8 సార్లు బ్రేక్ చేశాడు. 39 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 35 విన్నర్స్ కొట్టాడు. 4 ఏస్లు సంధించిన ష్వార్జ్మన్... 37 అనవసర తప్పిదాలు చేశాడు. అవతలివైపు నాదల్ జోరుతో కేవలం 26 విన్నర్సే కొట్టగలిగాడు. గతేడాది కూడా ఈ టోర్నీలో సెమీస్ చేరిన నాదల్ ఓవరాల్గా గ్రాండ్స్లామ్ ఈవెంట్లలో 33 సార్లు సెమీఫైనల్ చేరాడు. ప్రస్తుతం అతని కంటే ముందు వరుసలో ఫెడరర్ (45), నొవాక్ జొకోవిచ్ (36) మాత్రమే ఉన్నారు. ఇక ఈ టోర్నీలో టైటిల్ నాదల్ చేతికే అందే అవకాశాలున్నాయి. సెమీస్ బరిలో నిలిచిన ఇతర ఆటగాళ్లెవరూ స్పానియార్డ్ జోరు ముందు నిలబడలేరు. దీంతో ఏదో సంచలనం జరిగితే తప్ప... ఈ టోర్నీలో నాదల్ చాంపియన్షిప్ను ఎవరూ అడ్డుకోలేరని చెప్పొచ్చు. 42 ఏళ్ల తర్వాత ఓ ఇటాలియన్ మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఇటలీకి చెందిన 24వ సీడ్ మాటెయో బెరెటిని చెమటోడ్చి నెగ్గి సెమీస్ చేరాడు. మ్యాచ్ సాగే కొద్దీ పోటీ పెరిగిన ఈ పోరులో అతను 3–6, 6–3, 6–2, 3–6, 7–6 (7/5)తో ఫ్రాన్స్ ఆటగాడు, 13వ సీడ్ గేల్ మోన్ఫిల్స్పై విజయం సాధించాడు. సుమారు నాలుగు గంటల (3 గం. 57 ని.) పాటు ఐదు సెట్ల దాకా ఈ మ్యాచ్ సాగింది. ఈ విజయంతో 42 ఏళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన తొలి ఇటాలియన్గా బెరెటిని ఘనతకెక్కాడు. 1977లో కొరాడో బరజుటి సెమీస్ చేరిన తర్వాత మరో ఇటలీ ఆటగాడెవరూ యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్దాకా వెళ్లలేకపోయాడు. సెమీఫైనల్లో నాదల్తో బెరెటిని తలపడతాడు. కెనడా టీనేజ్ అమ్మాయి బియాంక అండ్రిస్కూ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15వ సీడ్గా బరిలోకి దిగిన అండ్రిస్కూ 3–6, 6–2, 6–3తో బెల్జియంకు చెందిన ఎలైస్ మెర్టెన్స్ను ఓడించింది. తాజా ఫలితంతో దశాబ్దం తర్వాత యూఎస్ ఓపెన్లో సెమీస్ చేరిన టీనేజ్ క్రీడాకారిణిగా (19 ఏళ్లు) ఆమె ఘనతకెక్కింది. 2009లో వోజ్నియాకి (డెన్మార్క్) ఈ ఘనత సాధించింది. -
సింధు... ఈసారి వదలొద్దు
ఇంకొక్క విజయమే... నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తోన్న పసిడి కల నెరవేరడానికి... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకోవడానికి! ఇంకొక్క విజయమే... ముచ్చటగా మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్షిప్లో పతకం రంగు మార్చడానికి... విశ్వవేదికపై మువ్వన్నెలు రెపరెపలాడటానికి! ఇంకొక్కవిజయమే... సింధు పేరు భారత క్రీడాచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు... గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్షిప్లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం సింధు పసిడి కాంతులు మాత్రం విరజిమ్మలేకపోయింది. రెండుసార్లు కాంస్యాలతో సరిపెట్టుకోగా... మరో రెండుసార్లు ‘రజత’ హారం మెడలో వేసుకుంది. రెండు ఫైనల్స్లో ఓడిన అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకొని... మూడోసారి పతక వర్ణాన్ని పసిడిగా మార్చాలని ఆశిస్తూ... విజయీభవ సింధు...! బాసెల్ (స్విట్జర్లాండ్): జగజ్జేతగా అవతరించడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. గత ప్రదర్శన ఆధారంగా... ఈసారీ భారీ అంచనాలతో ప్రపంచ చాంపియన్షిప్లో అడుగు పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి... ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ వరుసగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆఖరి సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 40 నిమిషాల్లో 21–7, 21–14తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ చెన్ యుఫె (చైనా)పై అద్వితీయ విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే ఫైనల్లో 2017 ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో ఒకుహారా 83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్)పై గెలిచింది. ఒకుహారాతో ముఖాముఖి రికార్డులో సింధు 8–7తో ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది వీరిద్దరు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్లో గెలిచారు. 2017 ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఎదురైన పరాజయానికి సింధు ఈసారి ప్రతీకారం తీర్చుకొని పసిడి పతకం మెడలో వేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆరంభం నుంచే... రెండో ర్యాంకర్ తై జు యింగ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గొప్ప పోరాటపటిమ కనబరిచి అద్భుత విజయాన్ని అందుకున్న సింధు సెమీఫైనల్లో మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించింది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన చెన్ యుఫెను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో ఆడింది. క్లిష్టమైన కోణాల్లో షటిల్స్ను పంపిస్తూ చెన్ యుఫె సత్తాకు పరీక్ష పెట్టింది. అవకాశం వచ్చినపుడల్లా చెన్ యుఫె బలహీన రిటర్న్ షాట్లను అంతేవేగంగా రిటర్న్ చేస్తూ పాయింట్లు గెల్చుకుంది. చెన్ యుఫె కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో తొలి గేమ్లో విరామానికి 11–3తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత కేవలం నాలుగు పాయింట్లు కోల్పోయి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లో చైనా ప్లేయర్పై ఒత్తిడిని కొనసాగిస్తూ సింధు ఆరంభంలోనే 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో సింధు పైచేయి సాధిస్తూ తన ఆధిక్యాన్ని 17–9కి పెంచుకుంది. క్రాస్కోర్ట్ స్మాష్తో 20–12తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచిన సింధు ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పోయింది. అయితే చెన్ యుఫె కొట్టిన షాట్ బయటకు వెళ్లిపోవడంతో ఈసారి సింధు ఖాతాలో పాయింట్తోపాటు గేమ్, విజయం చేరాయి. ఫైనల్ చేరారిలా...సింధు తొలి రౌండ్: బై రెండో రౌండ్: పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై 42 నిమిషాల్లో 21–14, 21–15తో గెలుపు మూడో రౌండ్: బీవెన్ జాంగ్ (అమెరికా)పై 34 నిమిషాల్లో 21–14, 21–6తో గెలుపు క్వార్టర్ ఫైనల్: తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో గెలుపు సెమీఫైనల్: చెన్ యుఫె (చైనా)పై 40 నిమిషాల్లో 21–7, 21–14తో గెలుపు ఒకుహారా తొలి రౌండ్: బై రెండో రౌండ్: ఎవగెనియా కొసెత్స్కాయ (రష్యా)పై 34 నిమిషాల్లో 21–12, 21–14తో విజయం మూడో రౌండ్: సుంగ్ జీ హున్ (కొరియా)పై 47 నిమిషాల్లో 21–18, 21–13తో విజయం క్వార్టర్ ఫైనల్: హి బింగ్ జియావో (చైనా)పై 43 నిమిషాల్లో 21–7, 21–18తో విజయం సెమీఫైనల్: రచనోక్ (థాయ్లాండ్)పై 83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో విజయం చెన్ యుఫెతో మ్యాచ్కు పక్కాగా సిద్ధమై వచ్చాను. తొలి క్షణం నుంచే అనుకున్న వ్యూహాలను ఆచరణలో పెట్టాను. ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లి అంతే వేగంతో తొలి గేమ్ను ముగించాను. రెండో గేమ్లో అనవసర తప్పిదాలు చేశాను. వరుస పాయింట్లు కోల్పోయాక మళ్లీ పుంజుకొని ఆధిక్యంలోకి వచ్చాను. దాంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడుతూ మ్యాచ్ను ముగించాను. నేడు జరిగే ఫైనల్లోనూ బాగా ఆడతానని ఆశిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో నా లక్ష్యం ఇంకా నెరవేరలేదు. సంతోషంగా ఉన్నా పూర్తి సంతృప్తిగా లేను. ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్లోనూ గెలిచి స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. ఒకుహారాతో తుది పోరు తేలికేం కాదు. ఒకరి ఆటతీరుపై ఒకరికి పూర్తి అవగాహన ఉంది. కీలకదశల్లో ఏకాగ్రతతో, నిగ్రహం కోల్పోకుండా సంయమనంతో ఆడాలి. నేనైతే నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. – పీవీ సింధు -
సెమీస్లో ఓడిన బోపన్న జంట
న్యూఢిల్లీ: మాంట్రియల్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో అన్సీడెడ్ రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. కెనడాలో ఆదివారం జరిగిన పురుషుల డబు ల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వ యం 6–7 (3/7), 6–7 (7/9)తో రాబిన్ హాస్–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) జోడీ చేతి లో ఓడిపోయింది. గంటా 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జంట నాలుగు ఏస్లు సంధించింది. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి, తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయింది. సెమీస్లో ఓడిన బోపన్న జంటకు 76,300 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 54 లక్షల 11 వేలు)తోపాటు 360 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్లో పేస్ జంట
న్యూపోర్ట్ (అమెరికా): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఏటీపీ–250 టోర్నమెంట్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ లియాండర్ పేస్–మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 5–7, 14–12తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–రాబర్ట్ లిండ్స్టెట్ (స్వీడన్) జోడీపై గెలిచింది. 46 ఏళ్ల పేస్ 1995లో హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నీలో తొలిసారి ఆడాడు. తాజా విజయంతో పేస్ జాన్ మెకన్రో (47 ఏళ్లు–2006 సాన్జోస్ టోర్నీ) తర్వాత ఏటీపీ టోర్నీలో సెమీఫైనల్కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. -
ఎవరిదో నాకౌట్ పంచ్?
ప్రపంచకప్లో లీగ్ దశకు తెర పడింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. వరుసగా 38 రోజుల్లో మొత్తం 45 లీగ్ మ్యాచ్లు జరిగాయి. రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో అన్ని జట్లకు సెమీఫైనల్ చేరే అవకాశాలు సమానంగా లభించాయి. కానీ సెమీఫైనల్లో మాత్రం అలాంటి చాన్స్ ఉండదు. విశ్వవిజేతను నిర్ణయించే ఫైనల్ పోరుకు అర్హత పొందేందుకు ఈ నాలుగు జట్లకు సెమీఫైనల్స్ రూపంలో ఒక్కో అవకాశమే లభించనుంది. ఈ నాకౌట్ మ్యాచ్ల్లో ఓడితే ఇంటిదారి పడతారు కాబట్టి నాలుగు జట్లూ ఈ కీలక మ్యాచ్ల్లో పైచేయి సాధించేందుకు పక్కా వ్యూహాలతో సమాయత్తం అవుతున్నాయి. – సాక్షి క్రీడావిభాగం టైటిల్ ఫేవరెట్స్లో ఒకరిగా బరిలోకి దిగిన భారత్ ప్రస్థానం సెమీఫైనల్ వరకు రాజసంగా సాగింది. ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో పరాజయం... వర్షం కారణంగా న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దు కావడం మినహా... మిగతా ఏడు మ్యాచ్ల్లో భారత్ అదరగొట్టింది. శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయాలతో మధ్యలోనే వైదొలిగినా వారి నిష్క్రమణ ప్రభావం టీమిండియా ప్రదర్శనపై అంతగా పడలేదు. రోహిత్ శర్మ ఐదు సెంచరీలతో భీకరమైన ఫామ్లో ఉండటం పెద్ద ఊరట. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ శతకంతో ఫామ్లోకి రావడం... కెప్టెన్ కోహ్లి నిలకడ... వెరసి భారత టాపార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు భారత మిడిలార్డర్కు సరైన పరీక్ష ఎదురుకాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో సెమీఫైనల్లో టాపార్డర్ ప్రదర్శన కీలకం కానుంది. భారత్ భారీ స్కోరు చేయాలన్నా... లక్ష్య ఛేదన సాఫీగా సాగాలన్నా రోహిత్, రాహుల్, కోహ్లిలో ఒకరు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ఒకవేళ వీరు విఫలమైతే మిడిలార్డర్లో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ధోని బాధ్యతాయుతంగా ఆడాలి. బౌలింగ్ విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. బుమ్రా 17 వికెట్లు, షమీ 14 వికెట్లు తీశారు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 11 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్ కూడా తమవంతుగా రాణిస్తున్నారు. ఒకరిద్దరిపైనే భారం... అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో ఉన్న న్యూజిలాండ్కు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేసే అలవాటు ఉంది. 1975, 1979, 1992, 1999, 2007, 2011 ప్రపంచకప్లలో సెమీఫైనల్లో నిష్క్రమించిన కివీస్... 2015 ప్రపంచకప్లో ఫైనల్ చేరి తుదిమెట్టుపై చతికిలపడింది. ఈ ప్రపంచకప్లోనూ న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టింది. వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఆ జట్టుకు పరాజయం ఎదురుకాలేదు. అయితే పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లతో జరిగిన చివరి మూడు మ్యాచ్ల్లో కివీస్ జట్టుకు ఓటమి ఎదురైంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ విభాగాల్లో ఎక్కువగా ఒకరిద్దరి ప్రదర్శనపైనే ఆధారపడుతోంది. బ్యాటింగ్లో విలియమ్సన్, రాస్ టేలర్... బౌలింగ్లో ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ నిలకడగా ఆడుతున్నారు. విలియమ్సన్, టేలర్ తక్కువ స్కోర్లకే ఔటైతే మాత్రం న్యూజిలాండ్కు మరోసారి నిరాశ తప్పదేమో. ముఖాముఖి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొత్తం 106 మ్యాచ్లు జరిగాయి. 55 మ్యాచ్ల్లో భారత్, 45 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’కాగా... ఐదు మ్యాచ్లు రద్దయ్యాయి. ప్రపంచకప్లో ఏడు సార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. మూడుసార్లు భారత్ను విజయం వరించగా, నాలుగుసార్లు న్యూజిలాండ్ గెలుపు రుచి చూసింది. ఈ రెండు జట్లు చివరిసారి 2003 ప్రపంచకప్లో తలపడటం గమనార్హం. వారిద్దరి సారథ్యంలోనే మళ్లీ... విరాట్ కోహ్లి నేతృత్వంలో భారత జట్టు 2008లో అండర్–19 ప్రపంచ కప్ టైటిల్ను సాధించింది. మలేసియాలో జరిగిన నాటి టోర్నీలో సెమీఫైనల్లో న్యూజిలాండ్పై మూడు వికెట్ల తేడాతో భారత్ గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. నాటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుకు ప్రస్తుత సీనియర్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కెప్టెన్గా వ్యవహరించాడు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్ల మధ్య ప్రపంచకప్ సెమీఫైనల్ పోరు జరగనుండగా... యాదృచ్ఛికంగా కోహ్లి, విలియమ్సన్ ఈసారి సీనియర్ జట్లకు సారథులుగా ఉన్నారు. నాటి జూనియర్ న్యూజిలాండ్ జట్టులో సభ్యులుగా ఉన్న ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ... భారత జూనియర్ జట్టులో సభ్యుడైన రవీంద్ర జడేజా ప్రస్తుతం సీనియర్ జట్టులోనూ ఉన్నారు. అడ్డంకి దాటాలంటే... 1992 తర్వాత మళ్లీ ప్రపంచకప్లో సెమీఫైనల్ చేరిన ఇంగ్లండ్పై ఈసారి భారీగా అంచనాలు ఉన్నాయి. భారీ హిట్టర్లు ఉండటం.. అందరూ ఫామ్లోకి రావడం... బౌలింగ్ పదును పెరగడం... వెరసి ఇంగ్లండ్ను ఈసారి టైటిల్ ఫేవరెట్గా చేశాయి. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఓడిన ఇంగ్లండ్... చావోరేవోలాంటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టాలని పట్టుదలగా ఉంది. పోరాటపటిమకు మారుపేరైన ఆసీస్ను ఓడించాలంటే ఇంగ్లండ్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. ఇంగ్లండ్ నుంచి ఐదుగురు బ్యాట్స్మెన్లో జో రూట్, బెయిర్స్టో రెండేసి సెంచరీలు చేయగా... జేసన్ రాయ్, మోర్గాన్, బట్లర్ ఒక్కోసెంచరీ సాధించారు. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ (17 వికెట్లు), మార్క్ వుడ్ (16 వికెట్లు), క్రిస్ వోక్స్ (10 వికెట్లు) హడలెత్తిస్తున్నారు. అయితే లీగ్ దశ ప్రదర్శన ఇప్పుడు చరిత్రే. నాకౌట్ మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించి ఓపెనర్లు శుభారంభం అందించాలి. మిడిలార్డర్ కుదురుగా ఆడాలి. ఆ తర్వాత బౌలర్లు మిగతా బాధ్యతను నిర్వర్తించాలి. కీలక మ్యాచ్లో కలిసికట్టుగా ఆడితేనే గట్టెక్కుతామన్న సంగతి ఇంగ్లండ్కూ తెలుసు కాబట్టి రెండో సెమీఫైనల్ రసవత్తరంగా సాగడం ఖాయం. ముఖాముఖి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఓవరాల్గా 148 మ్యాచ్ల్లో తలపడ్డాయి. 82 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలవగా... 61 మ్యాచ్ల్లో ఇంగ్లండ్కు విజయం దక్కింది. రెండు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. ప్రపంచకప్లో ఈ రెండు జట్లు ఎనిమిదిసార్లు పోటీపడ్డాయి. ఆరు సార్లు ఆస్ట్రేలియా నెగ్గగా... రెండుసార్లు ఇంగ్లండ్ గెలిచింది. 1992 ఈవెంట్ తర్వాత ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్కు ప్రపంచకప్ మ్యాచ్లో విజయం దక్కలేదు. కంగారూ పడొద్దంటే... ప్రపంచ కప్ సెమీస్ ముంగిట డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఆటగాళ్ల గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే షాన్ మార్‡్ష మోచేతి గాయంతో ప్రపంచ కప్కు దూరం కాగా, తాజాగా ఉస్మాన్ ఖాజా తొడ కండరాల గాయంతో ప్రపంచ కప్ నుంచి వైదొలిగాడు. ఖాజా స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మాథ్యూ వేడ్ను ఎంపిక చేశారు. మరోవైపు ఆల్ రౌండర్ స్టొయినిస్ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతను సెమీఫైనల్లో ఆడేది లేనిది మరో రెండు రోజుల్లో తేలనుంది. స్టొయినిస్కు బ్యాకప్గా మిచెల్ మార్‡్షను ఎంపిక చేశారు. లీగ్ దశ ఆరంభంలో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి... చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడింది. ఆస్ట్రేలియా విజయమంత్రాల్లో సమష్టి ప్రదర్శన ప్రధానం. ఏ ఒక్కరిపైనో ఆ జట్టు అతిగా ఆధారపడటం లేదు. వార్నర్, ఫించ్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ జోరు మీదుండగా... మ్యాక్స్వెల్ నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. ఇక బౌలింగ్లో మిషెల్ స్టార్క్ 26 వికెట్లతో టోర్నీ టాపర్గా కొనసాగుతున్నాడు. కమిన్స్ 13 వికెట్లు, బెహ్రెన్డార్ఫ్ తొమ్మిది వికెట్లు తీశారు. లీగ్ దశలో ఇంగ్లండ్పై నెగ్గిన ఆస్ట్రేలియా నాకౌట్ మ్యాచ్లో మాత్రం విజయం సాధించాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. తొలి సెమీఫైనల్ జూలై 9 భారత్ X న్యూజిలాండ్ వేదిక: మాంచెస్టర్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం రెండో సెమీఫైనల్ జూలై 11 ఆస్ట్రేలియా X ఇంగ్లండ్ వేదిక: బర్మింగ్హామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం 2008లో కోహ్లి, విలియమ్సన్ -
సింధు ఆశలు ఆవిరి
సింగపూర్: ఈ సీజన్లో ఇంకా టైటిల్ బోణీ కొట్టలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లోనూ చుక్కెదురైంది. జపాన్కు చెందిన రెండో సీడ్ నొజోమి ఒకుహారాతో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు వరుస గేముల్లో 7–21, 11–21తో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ఈ మ్యాచ్ ముందు వరకు జపాన్ ప్రత్యర్థిపై మన తెలుగుతేజానిదే పైచేయి. ముఖాముఖి పోరులో 7–6తో ఆధిక్యంలో నిలిచింది. చివరిసారిగా తలపడిన రెండు సార్లూ సింధుదే విజయం. అయితే శనివారంనాటి పోటీలో ఆ ఆధిపత్యం కొనసాగలేదు. కేవలం 37 నిమిషాల్లోనే జపాన్ స్టార్ నాలుగో సీడ్ సింధును ఓడించింది. చిత్రంగా ఈ మ్యాచ్లో రియో ఒలింపిక్స్ రన్నరప్ సింధు తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేదు. తొలిగేమ్లో అయితే కనీస పోరాటం లేకుండానే తలవంచింది. రెండో గేమ్ కూడా భిన్నంగా జరగలేదు. ఆరంభంలో కాస్త పోరాడినట్లు కనిపించినా... క్రమంగా ప్రత్యర్థి వేగాన్ని సింధు అందుకోలేకపోయింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఒకుహారా ముఖాముఖి రికార్డును 7–7తో సమం చేసింది. -
సైనా జోరు...
కౌలాలంపూర్: సీజన్ తొలి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ ఓపెన్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ విజయపరంపర కొనసాగుతోంది. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా 21–18, 23–21తో గెలిచింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సైనా రెండు గేముల్లోనూ వెనుకంజలో ఉండి కోలుకొని విజయాన్ని దక్కించుకోవడం విశేషం. తొలి గేమ్లో 9–15తో... రెండో గేమ్లో 14–18తో సైనా వెనుకబడినా పట్టుదల కోల్పోకుండా పోరాడి ప్రత్యర్థి ఆట కట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా తలపడుతుంది. ముఖాముఖీ రికార్డులో ఇద్దరు 5–5తో సమంగా ఉన్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 23–21, 16–21, 17–21తో సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
ఈ ఫలితాలే ‘రోడ్ మ్యాప్’!
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల పోరుకు సెమీ ఫైనల్స్గా పరిగణిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఈవీఎంలలో నిక్షిప్తమైంది పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తే కాదు.. ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ల భవితవ్యం కూడా. 2019 లోక్సభ ఎన్నికలపై ఈ ఫలితాలు గణనీయ ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ల్లో కమలం పార్టీ అధికారంలో ఉంది. ఈశాన్యంలో కాంగ్రెస్కు మిగిలిన ఏకైక రాష్ట్రం మిజోరం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. రాజస్తాన్లో ఈ సారి కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిరోహించనుంది. అలాగే, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్దే విజయమని, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని అవి తేల్చాయి. రెండు పక్షాలకు గెలుపు అవసరమే! రాజస్తాన్తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ల్లో కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా కాంగ్రెస్ చేజిక్కించుకోగలిగితే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు గట్టి బలం చేకూరుతుంది. కాంగ్రెస్ చీఫ్గా, జాతీయ స్థాయి నేతగా రాహుల్ గాంధీ స్థానం బలోపేతమవుతుంది. బీజేపీయేతర పక్షాల కూటమికి కాంగ్రెస్ పక్షాన రాహుల్ నేతృత్వం వహించగల అవకాశాలు మెరుగవుతాయి. లేని పక్షంలో, ఎన్నికల పొత్తులు, సీట్ల పంపకాల చర్చల్లో ఎన్డీఏయేతర ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చే అనేకానేక డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తుంది. కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమికి నేతగా రాహుల్ ఆమోదనీయత పెరుగుతుంది. ఇతర పక్షాలు కాంగ్రెస్ మాట వినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా, కాంగ్రెస్కు ఆశించిన ఫలితాలు రాకుంటే, రాహుల్ ఇమేజ్తో పాటు కాంగ్రెస్ ప్రతిష్ట భారీగా దెబ్బతింటాయి. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఏన్డీయేయేతర ప్రాంతీయ పార్టీల నేతలు ‘ప్రత్యామ్నాయాలు’గా ఎదుగుతారు. మిజోరంలో అధికారం కోల్పోతే మొత్తంగా ఈశాన్యం నుంచి కాంగ్రెస్కు ప్రాతినిధ్యమే ఉండదు. మరోవైపు, కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించడం బీజేపీకి అవసరం. ఇన్నాళ్లూ కొనసాగిన విజయపరంపరను ఈ ఎన్నికల్లోనూ కొనసాగించడం ద్వారానే ఆ పార్టీ ఆత్మవిశ్వాసంతో లోక్సభ ఎన్నికల బరిలో దిగగలదు. ఎన్డీయే పక్షాలతో పొత్తు చర్చల్లోనూ ఆధిక్యత కనపర్చగలదు. ఓటమి ఎదురైతే మాత్రం పార్టీలో, పార్టీ అగ్రనేతల్లో ఆత్మవిశ్వాసం భారీగా దెబ్బతింటుంది. పార్టీ లో అసహన స్వరాల జోరు పెరుగుతుంది. కూటముల్లోనూ మార్పులు ఈ ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో ప్రధాన కూటములైన ఎన్డీయే, యూపీఏల్లోని పార్టీల్లో కూడా మార్పుచేర్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఎంతగా విమర్శించినా, బీజేపీ మిత్రపక్షంగానే శివసేన కొనసాగుతుంది. కానీ, బిహార్కు చెందిన రాష్ట్రీయ లోక్సమత పార్టీల్లాంటివి మాత్రం ఇప్పటికే ఎన్డీయేకు దూరమయ్యే దిశగా సంకేతాలిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మిత్రపక్షాలపై పట్టును పెంచుకోగలదు. పక్క చూపులు చూస్తున్న ఎన్డీయే పార్టీల ఆలోచనల్లో మార్పు రాగలదు. మొత్తానికి, ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలంతా ప్రచారం చేయడాన్ని బట్టే ఈ ఎన్నికలను ఆయా పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతుంది. - నేషనల్ డెస్క్ -
సూపర్ సోనియా
న్యూఢిల్లీ: బరిలో దిగిన తొలి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లోనే యువ బాక్సర్ సోనియా చహల్ అదర గొట్టింది. శుక్రవారం జరిగిన 57 కేజీల సెమీఫైనల్లో సోనియా 5–0తో జో సన్ హవా (ఉత్తర కొరియా)పై నెగ్గి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (48 కేజీలు) ఇప్పటికే ఫైనల్ చేరగా... తాజాగా సోనియా ఆమె సరసన చేరింది. 64 కేజీల విభాగంలో జరిగిన మరో సెమీఫైనల్లో సిమ్రన్జిత్ 1–4తో డాన్ డూ (చైనా) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో భారత్ ఖాతాలో రెండు కాంస్యాలు చేరగా... ఇద్దరు బాక్సర్లు స్వర్ణ పోరుకు సిద్ధమయ్యారు. శనివారం జరుగనున్న ఫైనల్లో హనా (ఉక్రెయిన్)తో మేరీకోమ్, ఆర్నెల్లా గాబ్రియల్ (జర్మనీ)తో సోనియా తలపడనున్నారు. 2006లో సొంత గడ్డపై జరిగిన ఈ చాంపియన్షిప్లో అత్యధికంగా భారత్ 4 స్వర్ణాలు సహా 8 పతకాలు సాధించింది. అనంతరం 2008లో 4 పతకాలు (1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యాలు) దక్కించుకుంది. ఇప్పుడు ఈ ప్రదర్శనను మెరుగుపరిచే అవకాశం భారత బాక్సర్ల ముందుంది. హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియా సెమీఫైనల్లో జకార్తా ఆసియా క్రీడల రజత పతక విజేతపై సునాయాసంగా గెలుపొందింది. మొదటి రెండు రౌండ్లు మామూలుగానే ఆడిన సోనియా... మూడో రౌండ్లో రెచ్చిపోయింది. ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించింది. ప్రత్యర్థి ఎవరైనా తన సహజసిద్ధ ఆట మారదని చెప్పే సోనియా ఈ బౌట్లో అదే చేసి చూపించింది. ‘ఫైనల్కు చేరతానని ఊహించలేదు. సొంతగడ్డపై అభిమానుల మధ్య ప్రపంచ చాంపియన్షిప్లో దూసుకెళ్లడం సంతోషాన్నిస్తోంది. తొలి రెండు రౌండ్లు ముగిసేసరికి ప్రత్యర్థే ముందంజలో ఉందని కోచ్ చెప్పారు. దీంతో మూడో రౌండ్ ప్రారంభం నుంచే దూకుడు కనబర్చాను. ఫైనల్లోనూ ఇదే ఆటతీరు కొనసాగిస్తూ... స్వర్ణం గెలవడమే నా లక్ష్యం’ అని సోనియా వెల్లడించింది. తొలిసారి ప్రపంచ చాంపియన్షిప్ బరిలో దిగి కాంస్యం నెగ్గడంపై సిమ్రన్జిత్ సంతోషం వ్యక్తం చేసింది. -
సెమీఫైనల్లో శ్రీకాంత్
ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ శ్రీకాంత్ 78 నిమిషాల్లో 22–20, 19–21, 23–21తో భారత్కే చెందిన సమీర్ వర్మను ఓడించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్)తో శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 3–8తో వెనుకంజలో ఉన్నాడు. 2015 ఇండియా ఓపె న్లో చివరిసారి కెంటో మొమోటాపై నెగ్గిన శ్రీకాంత్ ఆ తర్వాత వరుసగా ఐదు సార్లు ఈ జపాన్ ప్లేయర్ చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 18–21, 21–17, 21–16తో బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ (చైనా)పై సంచలన విజయం సాధించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ విజేత, నాలుగుసార్లు ఆసియా చాంపియన్ అయిన 35 ఏళ్ల లిన్ డాన్పై శ్రీకాంత్ నెగ్గడం ఇది రెండోసారి. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 23–21, 6–21, 22–20తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి క్వార్టర్స్కు చేరాడు. సైనా సంచలనం... మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21–15, 21–17తో సంచలన విజయం సాధించింది. 2014 చైనా ఓపెన్లో చివరిసారి యామగుచిని ఓడించిన సైనా ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఈ జపాన్ ప్లేయర్ చేతిలో ఓడింది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత మళ్లీ యామగుచిపై గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 18–21, 22–20, 21–18తో ఏడో సీడ్ లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (దక్షిణ కొరియా) జోడీపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
వృశాలి సంచలనం
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి సంచలనం సృష్టించింది. పోలాండ్లోని బీరన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వృశాలి 23–21, 21–19తో టాప్ సీడ్ కేట్ ఫ్యూ కున్ (మారిషస్)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో ఏడో సీడ్ సారా పెనాల్వార్ పెరీరా (స్పెయిన్)పై 20–22, 21–12, 21–11తో నెగ్గిన వృశాలి... ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–11, 21–13తో మోనికా సుజోక్ (హంగేరి)ను ఓడించింది. భారత్కే చెందిన రితూపర్ణ దాస్ కూడా సెమీస్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో రితూపర్ణ 21–7, 21–14తో జార్జినా బ్లాండ్ (ఇంగ్లండ్)పై గెలిచింది. -
పురుషుల సింగిల్స్ సెమీస్లో గురుసాయిదత్
హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు గురుసాయిదత్, సమీర్ వర్మ సెమీఫైనల్కు చేరారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో గురుసాయిదత్ 13–21, 22–20, 21–11తో లిమ్ చి వింగ్ (మలేసియా)పై; సమీర్ 16–21, 26–24, 21–7తో ప్రతుల్ జోషి (భారత్)పై నెగ్గారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 12–21, 12–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 22–20, 14–21, 21–17తో యోంగ్ మింగ్ నోక్–ఎన్జీ సాజ్ యావు (హాంకాంగ్) జోడీపై గెలిచింది. -
జొకోవిచ్ జోరు
వింబుల్డన్ టైటిల్ గెలిచి ఫామ్లోకి వచ్చిన మాజీ నంబర్వన్ జొకోవిచ్ తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్లోనూ దూసుకుపోతున్నాడు. మరో విజయంతో వరుసగా 11వ ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. రెండుసార్లు టైటిల్ గెలిచి, ఐదుసార్లు రన్నరప్గా నిలిచిన అతను ఎనిమిదోసారి ఫైనల్ బెర్త్ కోసం సెమీఫైనల్లో నిషికోరితో పోరుకు సిద్ధమయ్యాడు. న్యూయార్క్: ప్రిక్వార్టర్ ఫైనల్లో రోజర్ ఫెడరర్ను మట్టికరిపించిన జాన్ మిల్మన్ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ వరుస సెట్లలో తన ప్రత్యర్థి ఆట కట్టించాడు. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో వరుసగా 11వసారి సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకున్నాడు. రెండు గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–4తో ప్రపంచ 55వ ర్యాంకర్ మిల్మన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. మ్యాచ్ వరుస సెట్లలో ముగిసినా విజయం కోసం జొకోవిచ్ శ్రమించాల్సి వచ్చింది. ఈ మాజీ చాంపియన్ 20 బ్రేక్ పాయింట్లలో నాలుగింటిని మాత్రమే అనుకూలంగా మల్చుకున్నాడు. నాలుగు డబుల్ ఫాల్ట్లతోపాటు 53 అనవసర తప్పిదాలు చేశాడు. అయితే జొకోవిచ్ తప్పిదాలను మిల్మన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే చురు గ్గా కదులుతూ, బంతిని అందుకుంటూ సాధ్యమైన మేర ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. మిల్మన్ నాలుగు బ్రేక్ పాయింట్లను కాచుకోవడంతో తొలి సెట్ ఆరో గేమ్ 15 నిమిషాలపైగా సాగింది. రెండో సెట్లో ఆటగాళ్లిద్దరూ సుదీర్ఘ ర్యాలీలతో అలరించారు. కానీ ఫినిషింగ్లో జొకోవిచే పైచేయి సాధించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో 2014 రన్నరప్ నిషికోరి 4 గంటల 8 నిమిషాల పోరులో 2–6, 6–4, 7–6 (7/5), 4–6, 6–4తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొందాడు. తద్వారా 2014 ఫైనల్లో సిలిచ్ చేతిలో ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తొలి సెట్ను త్వరగానే కోల్పోయి, రెండో సెట్లో 2–4తో వెనుకబడిన నిషికోరి ఒక్కసారిగా పుంజుకున్నాడు. వరుసగా నాలుగు గేమ్లు గెలిచి రెండో సెట్ను 6–4తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్నూ నెగ్గిన నిషికోరి నాలుగో సెట్లో తడబడ్డాడు. కానీ నిర్ణాయక ఐదో సెట్లో కోలుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. సెమీఫైనల్స్లో జొకోవిచ్తో నిషికోరి; రాఫెల్ నాదల్తో డెల్పొట్రో తలపడతారు. సెమీస్లో కీస్... మహిళల సింగిల్స్ విభాగంలో గతేడాది రన్నరప్ మాడిసన్ కీస్ (అమెరికా) సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో కీస్ 6–4, 6–3తో కార్లా స్వారెజ్ నవారో (స్పెయిన్)పై విజయం సాధించింది. ఆరు ఏస్లు సంధించిన కీస్ రెండు సెట్లలో ఒక్కోసారి స్వారెజ్ సర్వీస్ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్లో జపాన్ అమ్మాయి నయోమి ఒసాకాతో కీస్; సెవస్తోవా (లాత్వియా)తో సెరెనా విలియమ్స్ తలపడతారు. మరో క్వార్టర్ ఫైనల్లో ఒసాకా 6–1, 6–1తో లెసియా సురెంకో (ఉక్రెయిన్)ను అలవోకగా ఓడించింది. ఈ విజయంతో ఒసాకా 22 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో జపాన్ తరఫున సెమీఫైనల్కు చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి 1996లో కిమికో డాటె జపాన్ తరఫున వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరింది. నిషికోరి, ఒసాకా రూపంలో జపాన్ క్రీడాకారులిద్దరు ఒకే గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరడం కూడా ఇదే తొలిసారి. -
మహిళల సింగిల్స్ సెమీస్లో సింధు
థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాంకాక్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 21–13తో సోనియా చెయా (మలేసియా)పై అలవోకగా గెలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో గ్రెగోరియా మరిస్కా తున్జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2–0తో ఆధిక్యంలో ఉంది. -
శ్రమించి గెలిచిన సెరెనా
లండన్: అమ్మ హోదా వచ్చాక ఆడుతున్న రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 25వ సీడ్ సెరెనా 3–6, 6–3, 6–4తో కామిలా గియోర్గి (ఇటలీ)పై కష్టపడి గెలిచింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సెరెనా తొలి సెట్ కోల్పోయినా... వెంటనే తేరుకొని ప్రత్యర్థి ఆట కట్టించింది. ఏడు ఏస్లు సంధించిన ఆమె కేవలం తొమ్మిది అనవసర తప్పిదాలు చేసింది. గ్రాస్కోర్టులపై 100వ విజయం సాధించిన 36 ఏళ్ల సెరెనా వింబుల్డన్ టోర్నీలో 11వసారి సెమీఫైనల్కు చేరింది. ‘నేను ఏ దశలోనూ మ్యాచ్ ఓడిపోతానని ఆందోళన చెందలేదు. తొలి సెట్ కోల్పోయినపుడు కూడా నా ప్రత్యర్థి బాగా ఆడుతోందని అనుకున్నాను. చాలా ఏళ్లుగా పరిస్థితులు ఎలా ఉన్నా పోరాటం కొనసాగించడం నాకు అలవాటుగా మారింది. ఈ మ్యాచ్లోనూ అదే చేశాను. నా కూతురికి కూడా ఈ సూత్రం చెప్పాలని అనుకుంటున్నాను’ అని మ్యాచ్ అనంతరం సెరెనా వ్యాఖ్యానించింది. గురువారం జరిగే సెమీఫైనల్లో జర్మనీ ప్లేయర్, 13వ సీడ్ జూలియా జార్జెస్తో సెరెనా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో జూలియా 3–6, 7–5, 6–1తో 20వ సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరింది. మరో రెండు క్వార్టర్ ఫైనల్స్లో 12వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 7–5, 6–4తో సిబుల్కోవా (స్లొవేకియా)పై నెగ్గగా... మాజీ నంబర్వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–3, 7–5తో దరియా కసత్కినా (రష్యా)పై విజయం సాధించి ఒస్టాపెంకోతో సెమీస్ పోరుకు సిద్ధమైంది. దివిజ్ శరణ్ జంట ఓటమి పురుషుల డబుల్స్లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శరన్–సితాక్ ద్వయం 6–7 (4/7), 6–7 (5/7), 7–6 (7/3), 4–6తో ఏడో సీడ్ మైక్ బ్రయాన్–జాక్ సోక్ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో నిషికోరి (జపాన్); రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో డెల్పొట్రో (అర్జెంటీనా); అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్); మిలోస్ రావ్నిచ్ (కెనడా)తో జాన్ ఇస్నెర్ (అమెరికా) తలపడతారు. ►సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
పంచ్ అదిరింది
మహిళల బాక్సింగ్ 48 కేజీల విభాగంలో మేరీకోమ్ సెమీఫైనల్కు చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో ఆడుతున్న మేరీకోమ్ క్వార్టర్ ఫైనల్లో 5–0తో మెగాన్ గార్డన్ (స్కాట్లాండ్)ను ఓడించింది. 69 కేజీల క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్ (భారత్) 2–3తో స్యాండీ రియాన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 75 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో వికాస్ కృషన్ 5–0తో సోమర్విల్లె క్యాంప్బెల్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. -
హోరాహోరీగా కబడ్డీ సమరం
నరసాపురం రూరల్ : నరసాపురం రుస్తుంబాదలో జాతీయస్థాయి మహిళల, పురుషుల కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలు చివరి దశకు చేరుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. మరోవైపు పోటీలను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తుండడంతో గెలుపు కోసం క్రీడాకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో మ్యాచ్లు నువ్వా నేనా అన్న రీతిలో సాగుతున్నాయి. అటు పురుషులు, ఇటు మహిళల విభాగంలో ఆంధ్రా జట్టు ఆడుతున్న సమయంలో క్రీడాభిమానుల నుంచి వారికి చప్పట్లతో ప్రోత్సాహం లభిస్తోంది. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో విజయాబ్యాంకు, పూణే, పోస్టల్ కర్ణాటక, ఆంధ్రా, ఆర్కే స్పోర్ట్స్, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ జట్లు ప్రతిభకనబర్చి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. పాయింట్ల ఆధారంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సెమీఫైనల్స్ జరిగాయి. బుధవారం ఉదయం కూడా సెమీ ఫైనల్స్ పోటీలు జరగనున్నాయి. అనంతరం రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. పోటీలను ఆంధ్రా రిఫరీస్ బోర్డు చైర్మన్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, ట్రెజరర్లు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం రాత్రి ఫైనల్స్ అనంతరం బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తామని పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. విజేత జట్లు ఇవే.. అటు పురుషులు, ఇటు మహిళల విభాగంలో మంగళవారం మ్యాచ్లు ఆసక్తికరంగా సాగాయి. పురుషుల విభాగంలో పాలం జట్టుపై పోస్టల్ జట్టు 8 పాయింట్ల తేడాతోనూ, బహారిదాస్ జట్టు ఠానే జట్టుపై 12 పాయింట్లు, ఆర్కే స్పోర్ట్స్ బీ జట్టు పై కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ జట్టు 29 పాయింట్ల తేడాతోనూ గెలుపొందాయి. మహిళల విభాగంలో ఎండీఎస్ హర్యాణా జట్టు ఆంధ్రా బీ జట్టుపై 7 పాయింట్ల తేడాతోనూ, బాబా హరిదాస్ జట్టుపై 10 పాయింట్ల తేడాతో ఆంధ్రా ఏ జట్టు , పూణే జట్టుపై ఎస్సీ రైల్వే జట్టు 43 పాయింట్ల తేడాతోను విజయం సాధించాయి. -
మ్యాథ్స్ బీ సెమీ ఫైనల్స్కు విశేష స్పందన
కర్నూలు(హాస్పిటల్): సాక్షి ఆధ్వర్యంలో సాక్షి ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్ పేరుతో నిర్వహించిన మ్యాథ్స్ బీ సెమీఫైనల్స్కు విశేష స్పందన లభించింది. స్థానిక ఎన్ఆర్ పేటలోని భాష్యం స్కూల్లో పోటీలు నిర్వహించారు. ఇటీవల పోటీలకు సంబంధించి మొదటి రౌండ్ పూర్తయింది. అందులో అర్హత సాధించిన విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా ఆదివారం రెండో రౌండ్ పోటీలు నిర్వహించారు. కేటగిరి 1లో 1, 2వ తరగతులు, కేటగిరి 2లో 3, 4వ తరగతులు, కేటగిరి 3లో 5, 6, 7వ తరగతులు, కేటగిరి 4లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులున్నారు. మొత్తం 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష మ్యాథ్స్లో బాగా సాధన చేసి, మంచి మార్కులు సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి పరీక్షలు మరిన్ని జరపాలని వారు కోరారు. ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నా మ్యాథ్స్బీలో మూడవ కేటగిరిలో నేను పాల్గొన్నా. పరీక్ష బాగా రాశా. ఇందులో ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నా. పరీక్షలో అన్ని కోణాల్లో ప్రశ్నలు ఇచ్చారు. దీనివల్ల పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు, ఎలా సిద్ధం కావాలనే అంశాలు బోధపడతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పరీక్ష బాగా రాశాను. లాజికల్, రీజనింగ్లో ప్రశ్నలు ఇచ్చారు. ఇలాంటి పరీక్షలు రాయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భవిష్యత్లో ఉన్నత విద్య, ఉద్యోగాలకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ ఇలాంటి పరీక్షల్లో పాల్గొనాలి. –వెంకట్ కౌశిల్, 7వ తరగతి లెక్కల పరీక్ష బాగా రాశాను పరీక్ష రాయడం ఎంతో ఎంజాయ్గా అనిపించింది. చదువుకున్న ప్రశ్నలే వచ్చాయి. అన్నింటికీ సమాధానాలు రాశాను. దీని వల్ల లెక్కలు బాగా నేర్చుకునేందుకు అవకాశం లభించింది. నాకు లెక్కలంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే ఈ పరీక్ష రాశాను. –లిఖిత, ఫస్ట్ క్లాస్ చాలా ఉపయోగం ఇలాంటి పరీక్షలు పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల కొత్త విషయాలు తెలియడంతో పాటు పరీక్షల్లో ప్రశ్నలు ఎలా ఇస్తారో తెలుస్తుంది. భవిష్యత్లో మన లక్ష్యసాధనకు ఇది ఎంతో ఉపయోగకరం. రేషియో, డివిజన్, పర్సంటేజేషన్ వంటి ప్రశ్నలు ఇచ్చారు. అన్నీ బాగా రాశాను. –నందిత, 5వ తరగతి పోటీ పరీక్షలకు ఉపయుక్తం ఇలాంటి పరీక్షలు తరచూ రాయడం వల్ల ఏ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు, వాటికి సమాధానాలు ఎలా రాయాలో సులభంగా తెలుస్తుంది. దీనికితోడు ప్రాక్టీస్ కూడా ఎక్కువసార్లు చేస్తాం కాబట్టి సులభంగా సమాధానాలు రాసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరీక్షల వల్ల పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరం. –జోషిత, 6వ తరగతి మ్యాథ్స్లో డెవలప్ అవుతారు మ్యాథ్స్లో లాజికల్, థింకింగ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. పోటీ పరీక్షల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ఇలాంటి పరీక్షల వల్ల ఈ సబ్జక్టుల్లో పిల్లలకు కమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వారిలో క్రియేటివ్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. -రమేష్కుమార్, భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ -
కొరియాతో భారత్ అమీతుమీ
ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ సెమీస్ నేడు క్వాంటన్ (మలేసియా): లీగ్ దశలో కనబరిచిన జోరును నాకౌట్ మ్యాచ్లోనూ పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స ట్రోఫీ సెమీస్కు సమాయాత్తం అరుుంది. దక్షిణ కొరియాతో శనివారం జరిగే మ్యాచ్లో భారత్ తలపడనుంది. లీగ్ దశలో కొరియాతో జరిగిన మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఈ నాకౌట్ పోరులో మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కెప్టెన్, గోల్కీపర్ శ్రీజేష్ గాయం నుంచి కోలుకోకపోవడం, డిఫెండర్ సురేందర్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడటం భారత శిబిరానికి ఆం దోళన కలిగిస్తోంది. అరుుతే రూపిందర్ పాల్ సింగ్, జస్జీత్, ఆకాశ్దీప్, రమణ్దీప్ సింగ్, సర్దార్ సింగ్ సమన్వయంతో ఆడితే మాత్రం భారత్కు విజయం దక్కడం కష్టమేమీకాదు. శ్రీజేష్ స్థానంలో గోల్కీపింగ్ చేస్తున్న ఆకాశ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. మలేసియా తో జరిగిన మ్యాచ్లో చివరి సెకన్లలో ఆకాశ్ ప్రత్యర్థి జట్టు పెనాల్టీ కార్నర్ను అడ్డుకున్నాడు. ‘కొరియా శక్తి అంతా వారి డిఫెన్సలోనే ఉంది. వారి రక్షణశ్రేణిని దాటుకొని ముందుకు వెళ్లడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది’ అని భారత కోచ్ ఒల్ట్మన్స అన్నారు. మరో సెమీఫైనల్లో పాకిస్తాన్తో మలేసియా ఆడుతుంది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది. -
నాకౌట్ ‘కూత’
కబడ్డీ ప్రపంచకప్ సెమీస్ నేడు కొరియా(vs)ఇరాన్ రాత్రి 8 గంటల నుంచి భారత్(vs) థాయ్లాండ్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం అహ్మదాబాద్: కబడ్డీ ప్రపంచకప్ సెమీఫైనల్స్కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు థాయ్లాండ్తో, ఇరాన్ జట్టు కొరియాతో తలపడనున్నారుు. ప్రపంచకప్ ఎక్కడ, ఎప్పుడు జరిగినా విజేతగా నిలిచే భారత్కు ఈసారి తొలి లీగ్ మ్యాచ్లోనే కొరియా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుుతే ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి భారత్ సత్తా చాటింది. మంచి అనుభవం కలిగిన రైడ్ విభాగంతో పాటు పటిష్ట డిఫెన్సతో నేటి సెమీస్లో థాయ్లాండ్ను చిత్తు చేయాలని భావిస్తోంది. పూర్తిగా స్టార్ ఆటగాళ్లతో నిండిన భారత్కు అనూప్ కుమార్, రాహుల్ చౌదరి, పర్దీప్ నర్వాల్, మంజీత్ ఛిల్లర్, దీపక్ హూడా కీలకం కానున్నారు. ఇక తన ప్రత్యర్థి థాయ్లాండ్ ఈసారి టోర్నీకి పూర్తిగా యువ ఆటగాళ్లను బరిలోకి దించింది. ఈ జట్టు కూడా ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బి టాపర్గా నిలిచింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో జపాన్పై చివర్లో 8 పారుుంట్లు సాధించి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. అందుకే ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకుండా భారత్ ఆడాల్సి ఉంది. ఇక లీగ్ల్లో ఓటమనేదే లేకుండా దూసుకెళ్లిన కొరియా జట్టు... ఎక్కువగా తమ స్టార్ రైడర్ జన్ కున్ లీపై ఆధారపడింది. భారత్, బంగ్లాదేశ్లతో జరిగిన కీలక మ్యాచ్ల్లోనూ తనే చివర్లో చెలరేగి జట్టును గట్టెక్కించాడు. అరుుతే పటిష్ట డిఫెన్స ఉన్న ఇరాన్ను ఓడించాలంటే శక్తికి మించి ఆడాల్సిందే.. -
సెమీస్ లో దీపికా పళ్లికల్
టొరంటో: గ్రానైట్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో స్టార్ ప్లేయర్ దీపికా పళ్లికల్ సెమీఫైనల్స్లో ప్రవేశించింది. గతేడాది రన్నరప్గా నిలిచిన రెండో సీడ్ దీపికా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో 12-10, 11-2, 11-4తో సల్మా హనీ ఇబ్రహీమ్ను చిత్తు చేసింది. -
సెమీస్లో సానియా జోడి
గ్వాంగ్జౌ: సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి గ్వాంగ్జౌ ఓపెన్ మహిళల డబుల్స్లో సెమీఫైనల్స్కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో 6-2, 6-3తో అనా-లెనా ఫ్రీడ్సమ్ (జర్మనీ), మోనికా నికోలెస్కూ (రొమేనియా) జంటపై సానియా జోడి వరుస సెట్లలో నెగ్గింది. యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ఊపులో ఉన్న సానియా, హింగిస్ నేడు (శుక్రవారం) జరిగే సెమీస్లో జూలియా గ్లుష్కో, రెబెకా పీటర్సన్లతో ఆడతారు. -
అందరి దృష్టి బోల్ట్ పైనే!
బీజింగ్: గత ఏడేళ్లుగా 100 మీటర్ల విభాగంలో పరాజయమెరుగని జమైకా విఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మరోసారి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. శనివారం మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఈ ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రోజున హీట్స్... ఆదివారం సెమీఫైనల్స్, ఫైనల్ రేసు జరుగుతాయి. బీజింగ్ ఒలింపిక్స్కు వేదికగా నిలిచిన బర్డ్స్నెస్ట్ స్టేడియంలోనే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరుగుతోంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో ఇదే వేదికపై బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2011లో ప్రపంచ చాంపియన్షిప్ 100 మీటర్ల ఫైనల్లో ఫాల్స్ స్టార్ట్ మినహా బోల్ట్ 2008 నుంచి ఈ విభాగంలో అజేయుడుగా ఉన్నాడు. ఈసారి బోల్ట్కు అమెరికా స్టార్స్ జస్టిన్ గాట్లిన్, టైసన్ గేల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ‘ఈ నగరంతో నాకు గొప్ప అనుబంధం ఉంది. మళ్లీ ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. నేను అద్భుతమైన ఫామ్లో ఉన్నాను’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. తొలిరోజు మూడు విభాగాల్లో ఫైనల్స్ (పురుషుల మారథాన్, 10,000 మీ., మహిళల షాట్పుట్ ) జరుగుతాయి. -
కల నిజమామోగా..!
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో ఐదో స్థానం వర్గీకరణ మ్యాచ్లో 1-0తో జపాన్పై గెలుపు 35 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్కు భారత మహిళల హాకీ జట్టు అర్హత మూడున్నర దశాబ్దాల కల... మన తరంలో కనీసం ఒక్కసారైనా చూడగలామా అనుకున్న ఘనత... భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత మహిళలు ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయారు. ఇంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కల సాకారమైంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో ఐదో స్థానం సాధించడం ద్వారా వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్కు భారత జట్టు అర్హత సాధించింది. అయితే అధికారికంగా మాత్రం అక్టోబర్లోనే ఇది నిర్ధారణ అవుతుంది. యాంట్వర్ప్ (బెల్జియం): తమ కలను నిజం చేసుకునేందుకు అందుబాటులో ఉన్న ఆఖరి అవకాశాన్ని భారత అమ్మాయిలు సద్వినియోగం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే... తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో అనుకున్న ఫలితాన్ని సాధించారు. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత జట్టు ఐదో స్థానాన్ని దక్కించుకుంది. శనివారం 5-6 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 1-0 గోల్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. ఆట 13వ నిమిషంలో రాణి రాంపాల్ భారత్కు ఏకైక గోల్ను అందించింది. మరోవైపు ‘రియో’ ఒలింపిక్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తమకూ విజయం తప్పనిసరి కావడంతో జపాన్ జట్టు చివరి సెకను వరకు తీవ్రంగా పోరాడింది. అయితే భారత గోల్కీపర్ సవిత అద్వితీయ ప్రతిభ జపాన్ ఆశలను ఆవిరి చేసింది. కనీసం ఆరుసార్లు జపాన్ క్రీడాకారిణుల గోల్ షాట్స్ను సవిత సమర్థంగా నిలువరించింది. చివరి క్వార్టర్లో జపాన్ ఏకంగా ఐదు పెనాల్టీ కార్నర్లను సంపాదించినా సవిత రూపంలో ఉన్న అడ్డుగోడను ఛేదించలేకపోయింది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకపోరులో భారత్ 2-1తో జపాన్ను ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆ మ్యాచ్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని జపాన్ తహతహలాడినా వారి ఆశలను భారత్ మరోసారి వమ్ము చేసింది. ఆరంభం నుంచే సమన్వయంతో కదులుతూ దూకుడుగా ఆడిన భారత్ 13వ నిమిషంలోనే ఖాతా తెరిచింది. లిలిమా మింజ్ ముందుకు సాగుతూ తన సహచరిణి వందన కటారియాకు పాస్ ఇచ్చింది. వందన కొట్టిన షాట్ను ‘డి’ ఏరియాలో జపాన్ గోల్కీపర్ అడ్డుకోగా... బంతి సర్కిల్లోనే ఉంది. అక్కడే ఉన్న రాణి రాంపాల్ కళ్లు చెదిరే షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించడంతో భారత్ ఖాతాలో గోల్ చేరింది. ఆ తర్వాత భారత్కు గోల్ చేసే అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకుంది. మరోవైపు జపాన్ స్కోరును సమం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయితే భారత రక్షణపంక్తి అంతే పట్టుదలగా పోరాడటంతో జపాన్ ఆశలు నెరవేరలేదు. మ్యాచ్ ముగియడానికి 25 సెకన్ల ముందు జపాన్కు పెనాల్టీ కార్నర్ వచ్చినా సవిత దానిని నిర్వీర్యం చేసింది. ‘మా అందరికీ ఇదో గొప్ప ఘనత. ఈ క్షణాల కోసం మేమెంతో కష్టపడ్డాం. ఒలింపిక్స్కు అర్హత సాధించడంద్వారా భారత్లో మళ్లీ మహిళల హాకీకి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాం.’ - రాణి రాంపాల్ ‘రియో’ క్వాలిఫయింగ్ ఇలా.. వచ్చే ఏడాది బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్ల (వాలెన్సియా, యాంట్వర్ప్) ద్వారా ఏడు జట్లు.. కాంటినెంటల్ టోర్నీల (ఆసియా క్రీడ లు, పాన్ అమెరికన్ గేమ్స్, యూరో హాకీ చాంపియన్షిప్, ఆఫ్రికా కప్, ఓసియానియా కప్) ద్వారా ఐదు జట్లు అర్హత పొందుతాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిబంధనల ప్రకారం 2014 డిసెంబరు ర్యాంకింగ్స్లో బ్రెజిల్ టాప్-40లో లేకపోవడం... పాన్ అమెరికన్ గేమ్స్కు కూడా అర్హత సాధించకపోవడంతో ‘రియో’ ఒలింపిక్స్లో బ్రెజిల్ మహిళల జట్టుకు ఆడే అవకాశం చేజారింది. ఎఫ్ఐహెచ్ నిబంధనల ప్రకారం... కాంటినెంటల్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టు హాకీ వరల్డ్ లీగ్లో టాప్-3లో నిలిస్తే ఆ స్థానాన్ని వేరే జట్టుతో భర్తీ చేస్తారు. 2014 ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా విజేత హోదాలో నేరుగా రియో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. యాంట్వర్ప్ హాకీ వరల్డ్ లీగ్లోనూ కొరియా ఫైనల్కు చేరింది. దాంతో వాలెన్సియా టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన మరో జట్టు అర్జెంటీనాకు పాన్ అమెరికన్ గేమ్స్లో ఆడకుండానే ‘రియో’ బెర్త్ ఖాయమైంది. ‘వాలెన్సియా’ టోర్నీలో టాప్-4లో నిలిచిన బ్రిటన్, చైనా, జర్మనీ, అర్జెంటీనా... ‘యాంట్వర్ప్’ టోర్నీలో టాప్-3లో నిలిచిన నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... ఆసియా క్రీడల విజేత హోదాలో దక్షిణ కొరియా ఇప్పటివరకు అధికారికంగా రియో ఒలింపిక్స్కు అర్హత పొందాయి. మిగిలిన నాలుగు కాంటినెంటల్ టోర్నీల (పాన్ అమెరికన్ గేమ్స్, యూరో హాకీ చాంపియన్షిప్, ఆఫ్రికా కప్, ఓసియానియా కప్) ద్వారా నాలుగు విజేత జట్లకు అవకాశం ఉంటుంది. అయితే ఈ కాంటినెంటల్ టోర్నీల్లో విజేతగా నిలిచే అవకాశమున్న జట్లు (ఆఫ్రికా మినహా) ఇప్పటికే రియో ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. ఫలితంగా హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్లో అత్యుత్తమ స్థానాల్లో నిలిచిన జట్లకు ‘రియో’ బెర్త్లు ఖాయమవుతాయి. ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టు ‘యాంట్వర్ప్’ టోర్నీలో ఐదో స్థానం పొందడంతో ‘రియో’ టికెట్ దక్కడం లాంఛనప్రాయమే. అయితే అక్టోబరులో ఓసియానియా కప్ ముగిశాక ఇది అధికారికంగా ఖరారు అవుతుంది. -
టీమిండియాకు మోదీ అభినందనలు
క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్స్లో ప్రవేశించినందుకు టీమిండియాను ప్రధాని నరేంద్రమోదీ అభినందనల్లో ముంచెత్తారు. భారతజట్టు అద్భుత ప్రదర్శనను చూపించిందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ జట్టుపై భారత్ అలా గెలిచిందో లేదో.. వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచకప్ ప్రస్తుత ఛాంపియన్ హోదాలో క్వార్టర్స్ బరిలోకి దిగిన టీమిండియా.. బాలబెబ్బులి లాంటి బంగ్లాదేశ్ జట్టును 109 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. బంగ్లాను ఓడించడం అంత సులువు కాదని సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా చెప్పినా.. భారతజట్టు మాత్రం సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ కూడా జట్టు ప్రదర్శనను అభినందించారు. -
సెమీస్లో భారత్
న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ లీగ్ రౌండ్-2లో భారత హాకీ జట్టు సెమీఫైనల్స్కు చేరింది. వందన కఠారియా హ్యాట్రిక్ గోల్స్ సహాయంతో గురువారం జరిగిన క్వార్టర్స్లో 10-0 తేడాతో సింగపూర్ను చిత్తుగా ఓడించింది. మొత్తంగా వందన నాలుగు గోల్స్ (17, 48, 56, 57వ నిమిషాల్లో), పూనమ్ రాణి (4వ ని), నవ్జ్యోత్ కౌర్ (6వ ని), అనూపా బర్లా (19వ ని), దీపికా (32వ ని), రాణీ రాంపాల్ (35వ ని), జస్ప్రీత్ కౌర్ (51వ ని) ఒక్కో గోల్ సాధించారు. శనివారం జరిగే సెమీస్లో భారత జట్టు థాయ్లాండ్ను ఢీకొంటుంది. -
సెమీస్లో సింధు, జయరామ్
కుచింగ్ (మలేసియా): గత ఏడాది నిలకడగా రాణించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు కొత్త ఏడాదిలోనూ అదే జోరును కనబరుస్తోంది. సీజన్ తొలి టోర్నీ మలేసియా మాస్టర్స్ గ్రాండ్ప్రి గోల్డ్లో సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 23-21, 21-9తో పోర్న్టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్లాండ్)పై నెగ్గింది. ఈ గెలుపుతో గతేడాది ఫ్రెంచ్ ఓపెన్లో పోర్న్టిప్ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ నజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ సెమీఫైనల్లో అడుగుపెట్టగా... హైదరాబాద్కు చెందిన పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ మాత్రం మూడో రౌండ్లో ఓడిపోయారు. క్వార్టర్స్లో జయరామ్ 21-16, 21-23, 21-8తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... మూడో రౌండ్లో కశ్యప్ 21-13, 17-21, 13-21తో డెరెక్ వోంగ్ (సింగపూర్) చేతిలో; సాయిప్రణీత్ 15-21, 17-21తో లీ హున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.