Sudarshan reddy
-
పోసానిపై పోలీసుల ఆర్గనైజ్డ్ క్రైమ్
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి చివరకు రిమ్స్ ఆస్పత్రి తరలించే విషయంలోనూ పోలీసుల వైఖరి ‘పచ్చ’ పగను బట్టబయలు చేస్తోందని హైకోర్టు న్యాయవాది జల్లా సుదర్శన్రెడ్డి చెప్పారు. పోలీసుల తీరు నిజమైన ఆర్గనైజ్డ్ క్రైమ్గా చెప్పవచ్చని అన్నారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పోసానిపై 15 కేసులు పెట్టారని, ఆశ్చర్యకరంగా 15వ కేసులో మాత్రమే అరెస్ట్ చేశారని తెలిపారు.పోసాని అరోగ్య సమస్యలను ఆయన, కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించి, మరునాడు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాల్సి ఉందని చెప్పినా, పోలీసులు వినిపించుకోకుండా అరెస్టు చేశారని తెలిపారు. తమ వద్ద మంచి డాక్టర్లు ఉన్నారంటూ పోసానిని జీపు ఎక్కించుకుని తీసుకెళ్లిన సంబేపల్లి పోలీసులు.. తెల్లారేవరకు జీపులోనే తిప్పుతూ తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్నారు. మరునాడు మధ్యాహ్నం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి, అక్కడ 9 గంటలపాటు విచారించారని తెలిపారు.కోర్టుకు తరలించే ముందు పీహెచ్సీ వైద్యులతో పరీక్షలు చేయించారని, గొంతు, చేయి నొప్పితో ఉన్న ఆయనకు బీపీ, షుగర్ చెక్ చేసి కోర్టుకు తరలించారని తెలిపారు. రెండు రాత్రిళ్లు నిద్ర, ఆహారం లేకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నారు. రాజంపేట జైలులో ఛాతి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, అయినా మధ్యాహ్నం వరకు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా వేధింపులకు గురి చేశారని తెలిపారు. ఈసీజీలో హార్ట్ బీట్ తేడా కనిపించడంతో కడప రిమ్స్కు తరలించారన్నారు. అప్పుడూ ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ని అంబులెన్స్లో కాకుండా పోలీస్ వ్యాన్లో తరలించడం దారుణమని, వేధింపులకు పరాకాష్ట అని చెప్పారు. -
తెలంగాణ ఓటర్ల సంఖ్య 3,35,27,925
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925కి పెరిగింది. వీరిలో 1,68,67,735 మంది మహిళలు, 1,66,41,489 మంది పురుషులు, 2,829 మంది ట్రాన్స్జెండర్లు, మరో 15,872 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025లో భాగంగా తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్రెడ్డి ప్రకటించారు. కొత్తగా 2,19,610 ఓటర్లను జాబితాలో చేర్చగా, మరో 1,17,932 ఓటర్లను తొలగించారు. 2024 ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం అప్పట్లో రాష్ట్రంలో మొత్తం 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నారు. 2024తో పోల్చుకుంటే–2025లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ పోలింగ్ కేంద్రాల వారీగా 119 శాసనసభ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను వెబ్సైట్ (https://ceotelangana.nic.in)లో ఉంచినట్టు సుదర్శన్రెడ్డి వెల్లడించారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పోస్టు ద్వారా ఇళ్లకు ఉచితంగా పంపిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు, వివరాల దిద్దుబాటు నిరంతర ప్రక్రియ అని, ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://voters.eci.gov.in)లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు సైతం ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వారిని18 ఏళ్లు నిండిన తర్వాత జాబితాలో చేర్చుతామని వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, ప్రవాస ఓటర్లకు ఫారం–6ఏ, స్వచ్ఛందంగా ఆధార్ వివరాలు ఇవ్వడానికి ఫారం–6బీ, ఓటర్ల తొలగింపు కోసం ఫారం–7, వివరాల దిద్దుబాటు/నవీకరణ కోసం ఫారం–8 ఉపయోగించాలని చెప్పారు. పెరిగిన పోలింగ్ కేంద్రాల సంఖ్య రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,356 నుంచి 35,907కి పెరిగింది. పట్టణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 14,464 నుంచి 14,750కి, గ్రామీణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 20,892 నుంచి 21,157కి పెరిగింది. మొత్తం 551 పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు కానుండగా, అందులో 286 పట్టణ, 265 గ్రామీణ పోలింగ్ కేంద్రాలున్నాయి. 90 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. కేవలం 29 స్థానాల్లోనే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని నియోజకవర్గాలు మినహాయిస్తే దాదాపుగా అన్ని చోట్లా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. -
న్యాయవాదిపై పోలీసు గూండాగిరి
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల గూండాగిరి పెచ్చుమీరిపోతోంది. సీఎం, మంత్రుల మనసెరిగి వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే ఏకైక కర్తవ్యంగా పోలీసు అధికారులు చెలరేగిపోతున్నారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో పోలీసులు అధికార పార్టీ గూండాల్లా రెచ్చిపోయారు. లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి వైఎస్సార్సీపీ నేత, మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పెద్ద స్థాయిలో ఉన్న సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్రెడ్డిని కాలర్ పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంపీడీవోపై దాడి చేశారనే అక్రమ కేసు బనాయించింది కాకుండా, పోలీసులు ఈ దాష్టీకానికి తెగబడటం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసులో కక్షసాధింపు ధోరణిలో, పక్కా పన్నాగంతో జె. సుదర్శన్రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. సుదర్శన్రెడ్డి గాలివీడు మండలం మాజీ ఎంపీపీ. ప్రస్తుతం ఆయన తల్లి ఎంపీపీగా ఉన్నారు. సీనియర్ న్యాయవాది అయిన ఆయన గతంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా గతంలో కీలక పదవిని నిర్వర్తించారు. ఆయన కుటుంబం రాయచోటి నియోజకవర్గంలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా చేస్తున్న న్యాయ పోరాటంలో సుదర్శన్రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కక్షసాధింపు చర్యలకు తెగబడింది. ఎంపీడీవోపై దాడి చేశారని అక్రమ కేసు బనాయించి పోలీసుల ద్వారా దౌర్జన్యానికి పాల్పడింది. ప్రభుత్వ పక్కా ఆదేశాలతోనే సీఐ కొండారెడ్డి శుక్రవారం గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సుదర్శన్రెడ్డిని చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ఉన్న ప్రజలు ఎంతగా అభ్యంతరం పెడుతున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా లాక్కెళ్లి పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను సీఐ కొండారెడ్డి నిర్భీతిగా ఉల్లంఘించి మరీ ఈ దాషీ్టకానికి పాల్పడ్డారన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన సుదర్శన్రెడ్డిని చొక్కా పట్టుకొని తీసుకెళ్లుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పోలీసు వ్యవస్థ ఇంతగా దిగజారడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుదర్శన్తో పాటు మరో ఇద్దరికి రిమాండ్ రాయచోటి : గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జవహర్బాబుపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఎంపీడీవో ఫిర్యాదు ఇచ్చారు. గాలివీడు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్రెడ్డితో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేశారు. ఎన్.వెంకటరెడ్డి, ఎం.బయారెడ్డి, జి.చంద్రశేఖర్రెడ్డి, జె.ధనుంజయరెడ్డి, ఎన్.రమణారెడ్డి, భానుమూర్తిరెడ్డి, జి.రామాంజులురెడ్డి, ఎన్.రామాంజుల్రెడ్డి, యు.ధర్మారెడ్డి, రెడ్డికుమార్, ఎం.ఆంజనేయరెడ్డి, పి.బయారెడ్డిలపై కేసు నమోదు చేశారు. వీరిలో జల్లా సుదర్శన్రెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, ఎం.బైరెడ్డిలను పోలీసులు శనివారం లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశానుసారం శనివారం సాయంత్రం వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని గాలివీడు పోలీసులు తెలిపారు. -
ఈ నెల 28 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2025లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, ముసాయిదా ఓటర్ల జాబి తాపై అభ్యంతరాలు, ఇతర మార్పులు, చేర్పుల ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి (సీఈఓ) సి.సుదర్శన్రెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్ల డించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారంతా ఓటరు నమోదు కోసం దర ఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దర ఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 6న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తా మని వెల్లడించారు. శనివారం సి.సుదర్శన్రెడ్డి బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు కూడా ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చని.. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటు హక్కు కల్పిస్తామని సీఈఓ తెలి పారు. ఓటర్ల సౌకర్యం కోసం వచ్చే శని, ఆది వారాల్లో (9, 10 తేదీల్లో) ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని చెప్పారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ (eci.gov.in), ఓటర్ హెల్ప్లైన్ మొబైల్ యాప్ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.8 లక్షలకుపైగా కొత్త ఓటర్లుఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా గత నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామని సుదర్శన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 3,34,26,323 మంది ఓటర్లుండగా.. అందులో 1,66,16,446 మంది పురుషులు, 1,68,07,100 మంది మహిళలు, 2,777 మంది మూడో జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. 15,948 మంది సర్వీస్ ఓటర్లు, 3,578 మంది ప్రవాసీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి అక్టోబర్ 20 మధ్యలో 8,02,805 మంది కొత్త ఓటర్లు నమోదుకాగా.. 4,14,165 మంది అనర్హులైన ఓటర్లను తొలగించామని, మరో 5,93,956 మంది ఓటర్ల వివరాలను సరిదిద్దామని వెల్లడించారు. రాష్ట్రంలో 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 8.51 లక్షల నుంచి 10.03 లక్షలకు పెరిగిందని తెలిపారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 2,25,462 మంది, వికలాంగ ఓటర్లు 5,28,085 మంది ఉన్నారని వివరించారు. -
4,85,729 మంది డూప్లికేట్ ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఎస్ఆర్) 2025లో భాగంగా రాష్ట్రంలో 4,85,729 మంది ఓటర్ల పేర్లు, ఇతర సమాచారం ఒకే రీతి(సిమిలర్ ఎంట్రీ)లో ఉన్నట్టు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్రెడ్డి తెలిపారు. ఒకే నియోజకవర్గం ఒకే పార్ట్ పరిధిలో 52,586 మంది, ఒకే నియోజకవర్గం వేర్వేరు పార్ట్ల పరిధిలో 1,10,994 మంది, వేర్వేరు నియోజకవర్గాల పరిధిలో 3,22,149 మంది ఇలాంటి ఓటర్లున్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 21,432 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితాల నుంచి తొలగించామని చెప్పారు. బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల పరిశీలన నిర్వహిస్తున్నారని, గత నెల 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 3,33,11,347 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 70,60,288 (21.19 శాతం) మంది ఓటర్లను గుర్తించి నిర్ధారించినట్టు తెలిపారు. 10,224 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదని, 23,220 మంది వలస వెళ్లారని, 21,465 మంది చనిపోయారని, 12,763 మంది ఫొటోలు సరిగ్గా లేవని, 5,677 మందికి రెండు ఓట్లున్నట్టు గుర్తించినట్టు సీఈఓ తెలిపారు. జనవరి 6న తుది ఓటర్ల జాబితా: అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని సుదర్శన్రెడ్డి తెలిపారు. నాటి నుంచి నవంబర్ 28 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖా స్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. 2025 జనవరి 1కి కనీసం 18 ఏళ్లు కలిగి ఉండేవారు ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. డిసెంబర్ 24లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న తుది జాబితాను ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సైతం ఒక పర్యాయంలో 10 దరఖాస్తులు, అభ్యంతరాలు చొప్పున 3 పర్యాయాల్లో 30 దరఖాస్తులు, అభ్యంతరాలను స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు సమరి్పంచవచ్చునని చెప్పారు. -
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్రాజ్ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. నూతన సీఈవోగా నియమితులైన సుదర్శన్రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.కాగా, తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వికాస్ రాజ్ నిర్వహించగా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వికాస్ రాజ్ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా ఈసీ నియమించింది. -
‘కాళేశ్వరం’ బాధ్యులపై చర్యలు షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ప్రారంభించామని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. పిల్పై విచారణ: మేడిగడ్డ ఘటనకు కారకులెవరో తేల్చేందుకు గాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కాంగ్రెస్ నేత జి.నిరంజన్ గత నవంబర్లో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా ఫైలింగ్ నంబర్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది టి.నరేందర్రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి, కేంద్రం తరఫున న్యాయవాది ఎల్.ప్రణతిరెడ్డి, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ టి.సృజన్కుమార్రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకతవకలు గుర్తించింది మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుపై ప్రభుత్వ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఏం చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలతో నివేదిక అందజేయాలని గత నెల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ధర్మాసనానికి ఏజీ అందజేశారు. అనంతరం వాదనలు వినిపించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్డీఎస్ఏ అధికారులు గత ఏడాది అక్టోబర్ 24, 25 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించి ప్రాథమిక విచారణ జరిపారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలను ఎన్డీఎస్ఏ సమర్పించింది. ‘ప్రణాళిక, రూపకల్పన, నాణ్యత, నియంత్రణ, ఆపరేషన్–నిర్వహణకు సంబంధించిన సమస్యలతో పాటు పియర్లు ఏకశిలగా ఉండటంతో కదిలి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కచ్చితమైన కారణాలను గుర్తించడానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి..’అని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ విభాగం ప్రాథమిక విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ఈఎన్సీ వెంకటేశ్వర్లును తొలగించాం. ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అయితే ‘కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952లోని సెక్షన్ 3(1) ప్రకారం హైకోర్టు/సుప్రీంకోర్టు మాజీ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది’అని వివరించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం 4 నెలలకు వాయిదా వేసింది. -
క్రైమ్ కామెడీ
ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, ‘రంగస్థలం’ మహేశ్, ‘తాగుబోతు’ రమేశ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘నటరత్నాలు’. శివ నాగు దర్శకత్వంలో చంటి యలమాటి, డా. దివ్య నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చి, సినిమా తీయాలనుకునేవాళ్లు ఎలా సఫలమవుతున్నారు? ఎలా విఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘2002లో ఓ సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చి, లాస్ అయ్యాను. ‘నటరత్నాలు’ కథ సినిమాలో సినిమాలాంటిది. ప్లాన్ చేసిన బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేశాం’’ అన్నారు చంటి యలమాటి. -
కస్టం మిల్లింగ్ కహానీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా నుంచి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్ను మిల్లర్లు ఇప్పటివరకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. జిల్లాలోని మొత్తం 62 పారాబాయిల్డ్, 218 ముడిరైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ద్వారా కేటాయించిన ధాన్యానికి సంబంధించి కస్టం మి ల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే.. 2022–23 వానాకాలం సీజన్లో జిల్లాలోని మిల్లర్లకు 6,03,872 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. ఈ ధాన్యానికి గాను మిల్లర్లు 4,09,535 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే 3,87,529 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 22,005 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన సీఎంఆర్ పెండింగ్ ఉంది. ► 2022–23 యాసంగి సీజన్ విషయానికి వస్తే 6,35,190 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు. ఇందుకు సంబంధించి 4,32,264 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1,22,980 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్సీఐకి ఇచ్చారు. ఇంకా 3,09,284 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ ఇవ్వాల్సింది పెండింగ్లో ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఇష్టం మిల్లర్లు కొందరు ఇష్టం వచ్చినట్లు మొండికేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,31,289 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. కొత్త ప్ర భుత్వం ఈ నెలాఖరులోగా మొత్తం సీఎంఆర్ ఇవ్వాలని గడువు పొడిగించింది. అయితే మిల్ల ర్లు మాత్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ధాన్యం మాఫియా.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన భారీ అక్రమం ఇటీవల బయటకొచ్చింది. బోధన్లోని మాజీ ఎమ్మెల్యే షకీల్కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే నాలుగు రైస్మిల్లులకు 2021–22 యాసంగి, 2022–23 వా నాకాలం సీజన్లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్) కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. మిల్లింగ్ చేసి మిగిలిన సీఎంఆర్ బియ్యం ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పాడు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్(ఎడపల్లి), ఆర్కామ్ ఇండస్ట్రీస్(వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్(వర్ని), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) అనే మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఇందులో ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, ఆర్కామ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్ ఐ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం (సీఎంఎఆర్) మాత్రమే పౌరసరఫరాల శాఖకు ఇచ్చారు. ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26వేల మెట్రిక్ ట న్నుల సీఎంఆర్ బి య్యాన్ని ఇవ్వాలని పౌ రసరఫరాల శాఖ అధికారులు అడుగగా, షకీల్ మిల్లుల నుంచి తమకు బియ్యం రాలేదని చెబుతుండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చినట్లు నలుగురు మిల్లర్లు చెబుతుండడం విశేషం. ఈ విషయమై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రైస్మిల్లుల్లో జరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలు, అవినీతి అక్రమాలు బహిర్గతం చేయడానికి ఏకకాలంలో కేంద్ర విజిలెన్స్ విచారణ చేప ట్టాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవేంద్ర సింగ్ చౌహాన్కు వినతిపత్రం ఇచ్చారు. సీఎంఆర్ ఇవ్వకపోతే కఠిన చర్యలు ప్రభుత్వానికి తిరిగివ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్ను మిల్లర్లు తక్షణమే ఇవ్వకపోతే కఠినచర్యలు తీసుకుంటాం. కొందరు మిల్లర్ల వైఖరి కారణంగా ప్రభుత్వానికి, రైతుల కు, ఇతర మిల్లర్లకు చెడ్డపేరు వస్తోంది. కొందరు మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా బయట ప్రాంతాల్లో అమ్ముకున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయి. – సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే -
మెదక్కు దామోదర.. జహీరాబాద్కు సుదర్శన్రెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నియమించింది. అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు మెదక్ బాధ్యతలు అప్పగించింది. అలాగే జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డిని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్(ఎస్సీ), జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట్, సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండడంతో కాంగ్రెస్ ఇన్చార్జిలను నియమించింది. ఇవి చదవండి: 'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్ శంకర్ -
ఈడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: యంగ్ ఇండియా లిమిటెడ్కు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను కొనసాగిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి సోమవారం ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఐదు గంటలపాటు నేషనల్ హెరాల్డ్ కేసులో సుదర్శన్రెడ్డి విచారణ సాగింది. కాగా ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సెప్టెంబర్ 23 న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పార్టీ నేత గాలి అనిల్ కుమార్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం ఇప్పటికే ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఈనెల 6న మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్లను ఈడీ అధికారులు విచారించారు. -
కాంగ్రెస్కు మాజీ మంత్రి ఝలక్!
పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం ఇన్చార్జులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డితో అభ్యర్థి మధుయాష్కి, అసెంబ్లీ ఇన్చార్జులు గత అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. అయితే శనివారం తెల్లవారుజామునే సుదర్శన్ రెడ్డి ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పగా, తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి పి సుదర్శన్రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ పంపినట్లు శనివారం ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే బాధ్యతను అధిష్టానం ఈ ఇన్చార్జులకు అప్పగించింది. పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రచార బాధ్యతలను ఇన్చార్జి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే అగ్రనేత ప్రచార సభల నిర్వహణ వంటి బాధ్యతలనూ ఇన్చార్జికి పార్టీ అప్పగించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో సీనియర్ నేతను ని యమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఈ ఇన్చార్జులను ప్రకటించింది. అయితే ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్షోలు, పార్టీలో చేరికలు ఇలా ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికాబద్ధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన్ని చుట్టి వచ్చేలా చేస్తున్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రచారం కూడా ఊపందుకుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూనే రోడ్షోలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. ఇటు కాంగ్రెస్లో మాత్రం ఈ స్థాయి ఊపు కనిపించడం లే దు. పార్టీ నాయకులను, శ్రేణులను సమన్వయం చేయడంలో కీలకమైన పార్టీ ఇన్చార్జి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే బోధన్కు చెందిన కాంగ్రెస్ కేడర్ దాదాపు అంతా టీ ఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇటీవల గెలిచిన సర్పంచ్లు, ద్వితీయ శ్రేణి నాయకులు కూ డా ఈ ఎన్నికల సందర్భంగా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సు దర్శన్రెడ్డి పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్ధరాత్రి వరకు సమాలోచనలు.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం అర్ధరాత్రి వరకూ సమాలోచనలు జరిపారు. పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ రాత్రి 11 గంటల ప్రాంతంలో నగరంలోని కంఠేశ్వర్లోని మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్రెడ్డి, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు తాహెర్బిన్ హందాన్, ఈరవత్రి అనీల్, ఆర్మూర్కు చెందిన ఒకరిద్దరు నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే మధుయాష్కి హైదరాబాద్లో సుదర్శన్రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా గత అర్ధరాత్రి మరోసారి సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున తాను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సుదర్శన్రెడ్డి ప్రకటించడం ఎన్నికల వేళ ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
నిజామాబాద్లో కాంగ్రెస్ 9 స్థానాలు గెలుస్తుంది
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం పలు జాతీయ న్యూస్ చానెళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ అంచనాలను కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. జాతీయ సర్వేలు ఎలా ఉన్నా.. ప్రజలు సర్వేలు చూసి ఓట్లు వేయరని తెలిపారు. మహాకూటమిదే అధికారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ స్పందిస్తూ.. మహాకూటమికి 70 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేను మించి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఓట్లు భారీగా గల్లంతు అయ్యాయని, ఈ విషయమై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. -
హామీల అమలులో టీఆర్ఎస్ విఫలం: పి. సుదర్శన్ రెడ్డి
సాక్షి, బోధన్రూరల్: గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలో రాగానే వాటిని అమలు చేయడంతో విఫలమైందని మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండంలోని చెక్కి క్యాంప్, పెంటాకుర్దూ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ అధికారంలోకి మేనిఫేస్టోలో ఉన్నవిఅన్ని అమలు చేస్తామన్నారు. టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగాశంకర్, మండలాధ్యక్షులు నాగేశ్వర్రావ్, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తాం బోధన్టౌన్ : విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కాంగ్రెస్ ఎల్లవేళల కృషి చేస్తుందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. పట్టణ శివారులోని ఏఆర్ గార్డెన్లో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం టీఆర్ఎస్ పిరికి పందచర్య అన్నారు. ఈ సమ్మేళనంలో విశ్వబ్రాహ్మణుల సంఘం జిల్లా అధ్యక్షులు రమణాచారీ, సభా«ధ్యక్షులు హరికాంత్ చారీ, ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ దోసపల్లి నరహారి నాయకులు కెప్టెన్ కరుణాకర్రెడ్డి, అమర్నాథ్బాబు, గోపాల్రెడ్డి, హన్మంత్రావ్, మహమూద్, విశ్వబ్రాహ్మణ సంఘం వివిధ మండలాల అధ్యక్షులు భూమాచారీ, ప్రసాద్, మల్లెపూల రవి, గంగాధర్చారీ, చంద్రశేఖర్ చారీ, సత్యం చారీ, మురారి, జనార్ధన్చారీ ఉన్నారు. ఎడపల్లి : కుర్నాపల్లి, మండల కేంద్రంలో పి.సుదర్శన్రెడ్డి ప్రధాన వీదుల గుండా రోడ్షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాకాయలు పేల్చి సుదర్శన్రెడ్డికి ఘనస్వాగతం పలికారు. రెంజల్ : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేస్తుందని సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బాగేపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ మేనిఫెస్టోలోని çహామీలను నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. -
దోస్త్ మేరా దోస్త్...
బోధన్(నిజామాబాద్ ): నిన్న మొన్న అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎమ్మెల్యే స్థానానికి వేర్వేరు పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీ చేసిన ఆ ముగ్గురు ఉద్దండ నేతలు రాజకీయ ప్రత్యర్థులు. తాజా రాజకీయాల నేపథ్యంలో చేయి చేయి కలిపారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఓకే గూటికి చేరుకున్నారు.గత ఎన్నికల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ తాజా రాజకీయ పరిధుతులు ఆ ముగ్గురు నేతలను ఏకం చేశాయి. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నామినేషన్ల గడియలు సమీపిస్తున్న నేపథ్యంలో బోధన్ నియోజక వర్గంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా, రసవత్తరంగా మారాయి. ఆ ముగ్గురు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సిత్రాలను ఓటర్లు ఆసక్తిగా గమనిస్తూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు గతాన్ని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు స్పష్టమవుతాయి. నవీపేట మండలంలోని సిరాన్పల్లి గ్రామానికి చెందిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 1986–07లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి అప్పట్లో టీడీపీ అభ్యర్థి స్వర్గీయ కొత్త రమాకాంత్ చేతిలో ఓటమి చెందారు.1999,2004,2009 వరకు మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికలబరిలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం పొంది హ్యాట్రిక్ రికార్డు సాధించారు.ఉమ్మడిరాష్ట్రంలో పలు కీలకమైన శాఖలకు మంత్రి గా పని చేశారు. 2004. 2009లో తెలంగాణజనతా పార్టీ, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, 2014ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మేడపాటి ప్రకాష్ రెడ్డిలు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పై పోటీ చేసి ఓడిపోయారు. కాని 25 వేలపైగా ఓట్లు సాధించి సత్తాచాటుకున్నారు.ఈ ఇరువురు నేతలు గత ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ప్రత్యర్థి అభ్యర్థులే. అయితే ఇందులో మేడపాటి ప్రకాష్ రెడ్డి ఈ ఏడాది అక్టోబర్ 20న కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అధినేత రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మరో నేత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి విద్యార్ధి దశ నుంచి రాజకీయ ప్రస్తానం కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. కాని కాల క్రమంలో ఆయన పలు పార్టీల్లోకి వెళ్లారు.తాజాగా బిజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం వెల్లడించారు. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సాక్షితో తెలిపారు. కెప్టెన్ కరుణాకర్ రెడ్డి 2004,2009 ఎన్నికల్లో వేర్వేరు పార్టీల అభ్యర్థిగామాజీ మంత్రి సుదర్శన్రెడ్డి పై పోటీపడ్డారు. 2009 ఎన్నికల్లో కెప్టెన్ కరుణాకర్ రెడ్డి 35 వేలపైగా ఓట్లు సాధించి సత్తా చాటుకున్నారు. ఈ ముగ్గురు ప్రత్యర్థి నేతలను ఈ సారి ఎన్నికల్లో ఒకే పార్టీ వేదిక పై చూడబోతున్నాం. ఈ రాజకీయ పరిణామాలు ఆసక్తి రేక్కెత్తిసున్నాయి. -
తాటికల్లు మంచిగున్నది..
సాక్షి,చెన్నారావుపేట: ఎన్నికల ప్రచారాలు జోరుగా ,చాలా వింతగా చేస్తున్నారు అభ్యర్థులు . గెలవాలనే తపనతో ప్రజలను ఆకర్షించాలని వివిధ రూపాలలో దర్శనమిస్తున్నారు. ఇదే విధంగా తాటికల్లు తాగుతున్నట్లు టీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి వరంగల్ జిల్లా చెన్నారావు పేటోలో ప్రచారాలు చేశారు. -
పగే ఊపిరైతే...!
ఆశ, శ్వాసే కాదు.. పగ కూడా కొందర్ని బతికేలా చేస్తుంది. అందుకు శత్రువు పై ప్రతీకారం తీర్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉంటే చాలు. ఆ పగే ఊపిరై బతికిస్తుందనే కథతో రూపొందుతోన్న రివెంజ్ థ్రిల్లర్ ‘శత్రు’. సుదర్శన్రెడ్డి దర్శకత్వంలో హరినాథ్రెడ్డి, తపస్, తమన్నా వ్యాస్, శ్రేయా వ్యాస్ ముఖ్య తారలుగా టి.హరినాథ్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి బేబీ కుసుమ క్లాప్ ఇవ్వగా, శ్రీమతి స్వప్న కెమెరా స్విచ్చాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, సెప్టెంబర్లో మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. -
నియోజకవర్గానికి 2,360 ‘డబుల్’ గృహాలు
రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ సుదర్శన్రెడ్డి నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 2,360 డబుల్ బెడ్రూం గృహాలు మంజూరయ్యాయని రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించనుందని పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్.రవి ఆధ్వర్యాన శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1400 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా నగర పంచాయతీకి అదనంగా 960 మంజూరయ్యాయని తెలిపారు. రాజకీయాలకతీతంగా అర్హులకు గృహాలు మంజూరు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత పట్టణంలో ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలపై ఆయన ఆరా తీశారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్, తహసీల్దార్ శంకర్లింగం, పాల్గొన్నారు. -
అత్యున్నత కార్పొరేషన్గా తీర్చిదిద్దుతా
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సుదర్శన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థను రాష్ట్రంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతానని చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. అందరూ గర్వపడేలా అవినీతిరహిత కార్పొరేషన్గా పేరొచ్చే లా పనిచేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారి ఆయన సంస్థ కార్యాలయానికి వచ్చారు. ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్తో కలసి ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలన వారసత్వాలను విడిచి రాష్ట్ర ప్రభుత్వ అంచనా లకు తగినట్లుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులకు సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ప్రజలు ప్రశంసించేలా కార్పొరేషన్ పనితీరు ఉండాలని, ఇందుకోసం ఉద్యోగులంతా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలన్నారు. కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ.. రూ.వేల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేషన్లో సరైన సిబ్బంది, విభాగాలు లేవని, ఫైనాన్స, ఐటీ, టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
కాలయాపన వద్దు
• ఎన్డీఎస్ఎల్ను తక్షణమే పునరుద్ధరించాలి • చెరుకు సాగుకు ప్రభుత్వం భరోసానివ్వాలి • మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి డిమాండ్ • రేపటి నుంచి కాంగ్రెస్ రైతు పాదయాత్ర బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ భవితను తేల్చడంలో ఇంకా కాలయాపన వద్దని, నెలలోపు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న టీఆర్ఎస్.. రెండున్నరేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. మంగళవారం బోధన్లోని నీటిపారుదల శాఖ గెస్ట్హౌస్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లేఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేయడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారికి ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోధన్ ప్రాంతం చెరుకు పంట సాగుకు అనుకూలమని, చెరుకుకు బదులు ఇతర పంటలు సాగు చేసిన రైతులు వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఫ్యాక్టరీ భవితతో పాటు చెరుకు పంట సాగుపై రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. గతేడాది ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు రావాల్సిన రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని కోరారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర ఫ్యాక్టరీని పునరుద్ధరణ, చెరుకు సాగుపై రైతులకు భరోసా, కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయి వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రైతు పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి చెప్పారు. కోటగిరి మండలంలోని కొల్లూరులో ప్రారంభమయ్యే పాదయాత్ర బోధన్, రెంజల్, ఎడపల్లి మండలాల మీదుగా బోధన్కు చేరుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారన్నారు. ఎంపీపీలు గంగాశంకర్, మోబిన్ఖాన్, రెంజల్ జెడ్పీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి, నేతలు రాంమోహన్, రమేశ్, గుణప్రసాద్, ఎల్లయ్య యాదవ్, అశోక్, ఎంపీటీసీలు శంకర్, సురేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం పుస్తకావిష్కరణ
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ రచించిన పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. 'గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం' పేరుతో రచించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టీస్ సుదర్శన్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రొఫెసర్ కోదండరామ్, 'సాక్షి' ఈడీ కే రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే విభజనకు అర్థముంటుందన్నారు. హైకోర్టు విభజన బాధ్యత కేంద్రానిదే అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్కు ఆత్మహత్యాసదృశమే అని జైరాం రమేష్ పేర్కొన్నారు. అయితే.. డిసెంబర్ 9 ప్రకటన తరువాత తెలంగాణపై కాంగ్రెస్ ఎందుకు వెనక్కిపోయిందో జైరాం రమేష్ రాయలేదని కే రామచంద్రమూర్తి అన్నారు. ఇకపోతే.. అదిష్టానాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినప్పటికీ అతణ్ని సీఎం పదవి నుంచి ఎందుకు తొలగించలేదో కూడా జైరాం రమేష్ చెప్పలేదన్నారు. -
గొప్పలొద్దు.. నీరు కావాలి : సుదర్శన్రెడ్డి
► నీటి ఎద్దడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ► తక్షణమే సర్కారు పరిష్కరించాలి ► కలెక్టర్ సీరియస్గా స్పందించాలి ---మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి బోధన్: తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని.. ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతుంటే.. తెలంగాణ సర్కారు అభివృద్ధి పేరిట గొప్పలతో కాలం వెళ్లదీస్తుందని మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 19వ వార్డులో బోరు మోటారు ప్రారంభించారు. అనంతరం నీటి పారుదలశాఖ విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. రూ.వేల కోట్లతో ప్రారంభించిన వాటర్గ్రిడ్ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు, పశువులు తాగు నీటికి ఇబ్బందులు పడుతుంటే.. అధికార యంత్రాంగంలో ముందస్తు ప్రణాళిక, అప్రమత్తత లేకపోవడం ప్రభుత్వ పాలన తీరు, నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షకు పైగా జనాభా ఉన్న బోధన్ పట్టణంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, నీటి ఎద్దడికి బాధ్యులైన మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ యోగతారాణా సీరియస్గా స్పందించాలన్నారు. వార్డుల్లో నీటి ఎద్దడి నివారణకు 30 మోటర్ల వితరణ పట్టణంలోని నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను తమ పార్టీతోపాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు తన దృష్టికి తెచ్చారని మాజీ మంత్రి వెల్లడించారు. ప్రజల నీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్య తీవ్ర ఉన్న వార్డుల్లో కొత్తగా వేసిన బోర్లకు సొంత డబ్బులతో 30 మోటర్లను అందించానని, తమ పార్టీ కౌన్సిలర్లు, ఆయా వార్డుల్లో నాయకులు బోర్లు వేయించి మరో 10 మోటార్లను బిగించారన్నారు. అనంతరం పట్టణంలోని గోశాల రోడ్డులో గల మున్సిపల్ 19వ వార్డులో బోరు మోటారును ప్రారంభించా రు. పలువార్డుల్లో పర్యటించిన ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్యాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గుణప్రసాద్, అబ్బగోని గంగాధర్గౌడ్, కౌన్సిలర్లు దాము, పౌల్, మాజీ కౌన్సిలర్ నక్క లింగారెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతలు నరేంధర్, విష్ణువర్ధన్రెడ్డి, ఫసియోద్దీన్, రమేశ్ పాల్గొన్నారు. -
బిడ్డను చంపేశారయ్యా...
గుంటూరు రూరల్ / ముప్పాళ్ల: ‘‘ఉన్నత విద్య చదివి ప్రయోజకుడై ఉద్దరిస్తాడనుకున్న బిడ్డను ఇలా చంపేశారయ్యా...అన్నింట్లో ముందే వాడు చివరకు చావులోను ముందుంటాడనుకో లేదయ్యా... చదువుల పేరుతో తన బిడ్డను తమకు కాకుండా చేశారంటూ విద్యార్థి సుదర్శన్రెడ్డి తల్లి పద్మావతి హృదయ విదారకంగా విలపించింది. పండుగ పూట కూడా ఇంటిదగ్గర ఉండనీయకుండా చేసి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారయ్యా అంటూ ఆమె రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. మండల కేంద్రం ముప్పాళ్లకు చెందిన లోకసాని గోవిందరెడ్డి, పద్మావతిల చిన్న కుమారుడు సుదర్శన్రెడ్డి(18) గుంటూరు రూరల్ మండలం తురకపాలెం రోడ్డులోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. అనంతరం కళాశాలలోనే ఉంటూ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల కిందట జేఈఈ మెయిన్స్ పరీక్షలు అనంతరం ఇంటికి వెళ్లి వచ్చాడు. శుక్రవారం కళాశాల 4వ ఫ్లోర్లోని 429 రూంలో ఫ్యానుకు పక్కనే ఉన్న ఇనుప కొక్కానికి నవ్వారును తాడులాగా పేనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కళాశాల సిబ్బంది చెప్పారు. సమాచారం తెలుసుకుని వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కబురు చేయకపోవడం వెనుక కారణమేంటి..? ఎంసెట్ విద్యార్థులకు ఒక్క రోజు ఔటింగ్ ఇవ్వడంతో శుక్రవారం విద్యార్థులంతా ఇళ్లకు వెళ్ళారు. దూరప్రాంతాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్ళకుండా ఉండిపోయారు. మధ్యాహ్నం కళాశాలలో ఉన్న ఏడుగురు విద్యార్థులు భోజనం చేసి వారికి కేటాయించిన గదుల్లో విశ్రమించారని, సుదర్శన్ రెడ్డి మాత్రం 4వ ఫ్లోర్లోని 429 రూంలో ఫ్యానుకు పక్కనే ఉన్న ఇనుప కొక్కానికి నవ్వారును తాడులాగా పేనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కళాశాల సిబ్బంది చెప్పారు. తమ కుమారుడు మృతి చెందిన సంఘటన మధ్యాహ్నం 3 గంటలకు కళాశాల నుంచి ఎవరో ఫోన్ చేసి చెబితే కానీ తమకు తెలియలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కనీసం కళాశాల యాజమాన్యం కబురు చేయకపోవటం అనుమానంగా ఉందని తెలిపారు. బంధువుల అనుమానాలు... తమ కుమారుడు ఎవ్వరికీ హాని చేసేవాడు కాదని కేవలం కళాశాల యాజమాన్యం అశ్రద్ధ, తోటి విద్యార్థుల వల్లే తమ బిడ్డ మృతి చెందాడని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు వాపోయారు. సంఘటనా స్థలిలో పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. తమ కుమారుడు ఉండే రూంలో కాకుండా వేరే గదిలోకి వెళ్లి ఉరి వేసుకోవటం, ఉరి వేసుకున్న చోట కాకుండా మరో చోట పడి ఉండడం, తల్లిదండ్రులు వచ్చి చూసే లోగా కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని పక్కన పడుకోబెట్టటం వంటివి చూస్తుంటే తమకు అనుమానాలు వ్యక్త మవుతున్నాయని బంధువులు ఆరోపించారు. గ్రామంలోను విషాదఛాయలు... సుదర్శనరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదువుల్లో చురుగ్గా ఉండే సుదర్శనరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలియగానే మిత్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు వారాల క్రితం గ్రామానికి చెందిన ఎంసీఎ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. -
చికిత్స పొందుతూ ఏఎస్సై మృతి
మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న జి.సుదర్శన్రెడ్డి(50) మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈనెల 19వ తేదీన సుదర్శన్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్రంగా గాయాలు కావటంతో ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున చనిపోయారు. ఆయన స్వస్థలం రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి. సుదర్శన్రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు వనస్థలిపురం సాహెబ్నగర్లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన కుటుంబానికి పోలీసు అధికారుల సంఘం రూ.35,000 సాయంగా ప్రకటించింది. -
బోధన్లో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర ఆలయంలో ఈ నెల 3 నుంచి 8వ తేది వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు పూజాకార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. నిజాం చెక్కర ఫ్యాక్టరీని తెరిపించాలని ఈ సందర్భంగా దేవునికి ప్రార్థనలు చేసినట్లు మంత్రి తెలిపారు. -
రేపటి నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం, కొత్తగూడెంలో కేంద్రాలు ఖమ్మం: బీఎడ్లో చేరే విద్యార్థుల కోసం ఎడ్సెట్ కౌన్సెలింగ్ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని క్యాంప్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుధాకర్, కోఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్ల్లోని నిర్దేశిత కేంద్రాల్లో కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. కొత్తగూడెం, ఖమ్మం కేంద్రాల్లో కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్లను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. ఎడ్సెట్ హాల్టికెట్, ర్యాంక్కార్డు, డిగ్రీ, ఇంటర్మీడియెట్, టెన్త్ క్లాస్ మెమోలు, స్టడీ సర్టిఫికెట్లు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డిగ్రీ టీసీ వెంట తీసుకురావాల్సిందిగా వివరించారు. -
నిధుల ‘పంచాయితీ’
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో గ్రామపంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. వీటిని ఆర్డబ్ల్యుఎస్కు మళ్లించాలని గత కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం వివాదస్పదమైంది. ఇది పంచాయతీలకు ఉన్న హక్కులను కాలరాయడమేనని సర్పంచులు విమర్శిస్తున్నారు. జిల్లాలోని 889 గ్రామపంచాయతీలకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 13వ ఆర్థిక కమిషన్ నిధులు రూ.25కోట్లకు పైగా విడుదలయ్యాయి. వీటితో గ్రామంలోని తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధిలైట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామపంచాయతీ భవనాల నిర్వహణ, ఈ-పంచాయతీ, అంగన్వాడీ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలల నిర్వహణకు వినియోగించాల్సి ఉంది. ఇదే క్రమంలో జిల్లా పరిషత్కు వచ్చే 13వ ఆర్థిక కమిషన్ నిధుల ద్వారా సమగ్ర రక్షిత మంచినీటి పథకం(సీపీడబ్ల్యు)ను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సీపీడబ్ల్యు స్కీమ్ నిర్వహణకు గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను ఇవ్వాలని గత జూన్ 4వ తేదీన అప్పటి కలెక్టర్ సుదర్శన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీపీడబ్ల్యు స్కీమ్లు ఉన్న 405 గ్రామ పంచాయతీల నుంచి కర్నూలు డివిజన్లో 122 గ్రామపంచాయతీల నుంచి రూ.1,33,33,632లు, నంద్యాల డివిజన్లో 111 గ్రామపంచాయతీల నుంచి రూ.96,82,937లు, ఆదోని డివిజన్లో 172 గ్రామపంచాయతీల నుంచి రూ.1,74,68,598లు కలిపి మొత్తం రూ.4,48,51,167లను ఆర్డబ్ల్యుఎస్ ఇఇకి డీడీ ద్వారా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీపీడబ్ల్యు నిధులేమయ్యాయి...! సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా పరిషత్లదే. ఈ మేరకు 13వ ఆర్థిక కమిషన్ నిధులను గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులతో సీపీడబ్ల్యు స్కీమ్ కింద ఆయా గ్రామాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే జిల్లా పరిషత్ అధికారులు మాత్రం సీపీడబ్ల్యు స్కీమ్ నిధులను గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తాగునీటి అవసరాలకు గాకుండా రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, జిల్లాలో ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీలకు వచ్చిన నిధులను ఆర్డబ్ల్యుఎస్ ఈఈకి డీడీ ద్వారా చెల్లించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం తీవ్రస్థాయి విమర్శలకు తావిస్తోంది. 40 శాతం గ్రామపంచాయతీ నిధులు ఆర్డబ్ల్యుఎస్కు మళ్లించడం వల్ల గ్రామాల్లో ఇతర కార్యక్రమాల నిర్వహణ కష్టమవుతుందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు, హక్కులను సంరక్షించుకునేందుకు వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
సరదా సరదాగా..
యూకేలో చదవడానికి కోర్స్ కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ పంపిస్తే ఈ బుల్లోడు యూక్షన్, కెమెరా అని షార్ట్ కట్గా హిట్ కొట్టేవాడు. సినివూల మీద ప్రేమతో స్నేహితులతో కలసి షార్ట్ ఫిల్మ్స్ ట్రాక్ ఎక్కేశాడు. రాయులసీవు యూస పండించి యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాడు. ఇతగాడు నటించిన ఐదు లఘు చిత్రాలు యూట్యూబ్లో ఐదు లక్షలకు పైగా హిట్స్ సాధించాయి. ప్రస్తుతం ప్రముఖ హీరోల సినివూల్లో నటిస్తూ సెల్యులారుడ్ స్క్రీన్పై బిజీ అయిపోయూడు సుదర్శన్రెడ్డి. నెల్లూరుకు చెందిన సుదర్శన్రెడ్డి తిరుపతిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లోనే ఫ్రెండ్స్తో సరదాగా నాటకాలు వేస్తూ టాక్ ఆఫ్ ది కాలేజ్గా ఓ వెలుగు వెలిగాడు. స్పాంటేనిటీతో అందర్ని నవ్వుల్లో వుుంచెత్తేవాడు. తల్లిదండ్రులకేమో సుదర్శన్ను యూకేలో చదివించాలని ఆశ. సుదర్శన్ స్నేహితుడు శ్రీకాంత్ హైదరాబాద్లో డెరైక్షన్ కోర్స్ చేస్తూ షార్ట్ఫిల్మ్స్ తీసేవాడు. అలా స్నేహితులు రూపొందించిన ‘నాకు కోపం వచ్చింది’ అనే షార్ట్ఫిల్మ్ సుదర్శన్కు కమెడియున్గా వుంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత ‘అమెరికాకు దారేది’, ‘ఇదిగో ప్రియాంక’, ‘ఓఎల్ఎక్స్’ లాంటి షార్ట్ఫిల్మ్స్ యుూట్యూబ్లో లక్షల హిట్స్ సాధించారు. సుదర్శన్ పలికించే సీవు యూస నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అలా బుల్లి చిత్రాలతో కెరీర్ ఆరంభించిన సుదర్శన్.. ఇటీవల రన్ రాజా రన్ చిత్రంలో నటించాడు. నాగచైతన్య చేస్తున్న వురో చిత్రం, తమిళ్ హీరో మహత్ నటిస్తున్న ద్విభాషా చిత్రంతో పాటు పలు ప్రముఖ హీరోల సినివూల్లోనూ చాన్స్ కొట్టేశాడు. సుదర్శన్ వుంచి నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆశిద్దాం. -
కాల్పుల కలకలం
శంషాబాద్: జిల్లాలో దుండగులు పోలీసులపై తిరగబడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఔటర్ సర్వీసు రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా వారిపై మోస్ట్వాంటెడ్ చైన్స్నాచర్ కడవలూరి శివ(28) కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ వెంటనే సీసీఎస్ సీఐ సుదర్శన్రెడ్డి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే శివ మృతి చెందాడు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇతడిపై పెద్దఎత్తున చైన్స్నాచింగ్ కేసులున్నాయి. కూకట్పల్లి పోలీస్స్టేష న్ పరిధిలోనే మొత్తం 30 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ ఆర్జీఐఏ, రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా శివ గొలుసు దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. సంచలనంగా మారిన ఘటన ఔటర్ సర్వీసు రహదారిపై జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కొన్నాళ్ల క్రితమే శామీర్పేటలోనూ ఇదే తరహ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుత కాల్పుల ఘటన శంషాబాద్ మండలంలో చర్చనీయాంశంగా మారింది. దొంగలు తెగబడుతున్న తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హతుడు శివ స్థానికంగా కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలియడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఔటర్ సర్వీసు రహదారిపై ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటుందోనని స్థానికులు వణికిపోతున్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ
ఖమ్మం : ఎంసెట్ కౌన్సెలింగ్ బుధవారం జిల్లాలోని మూడు కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు ఒకటి నుంచి 25 వేల లోపు ర్యాంకుల వారికి జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 505 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఓసీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 401 మంది, భద్రాచలం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్కు 39 మంది, కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల కేంద్రానికి 65 మంది విద్యార్థులు హాజరయ్యారని ఖమ్మం సెంటర్ ఎంసెట్ నిర్వాహకులు సుదర్శన్రెడ్డి తెలిపారు. 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవని, తిరిగి ఈనెల 16న కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. శనివారం 25,001వ ర్యాంకు నుంచి 50 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు హాజరు కావాలని సూచించారు. ఈనెల 17 నుంచి కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. వెబ్ ఆప్షన్ ఎలా ఎంపిక చేసుకోవాలో వివరించేందుకు కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీంతో విద్యార్థులకు వెబ్ ఆప్షన్ సందర్భంగా తలెత్తే అనుమానాలు, ఇతర విషయాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. అయితే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిపివేయాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించడంతో పలువురు విద్యార్థులు ఆయా పత్రాలను చూపించలేక పోయారు. ఈ విషయం కౌన్సెలింగ్ సెంటర్ అధికారుల దృష్టికి తీసుకరావడంతో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని సర్టిఫికెట్లు పరిశీలించారు. -
మాజీ మంత్రి టీఆర్ఎస్లోకి రావద్దంటు ఆందోళన
నిజామాబాద్: కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కుదామనుకుంటున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన టీఆర్ఎస్లో రావద్దంటూ ఆపార్టీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో శనివారం టీఆర్ఎస్ కౌన్సిలర్లు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. కాగా గత కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఆయన కూడా ఖండించకపోవటం గమనార్హం. సుందర్శన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారనే విషయంపై ఆయన అనుచర వర్గం కూడా అవననే అంటోంది. ఇదే విషయంపై ఆయన శనివారం హైదరాబాద్లో బోధన్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైనట్లు సమాచారం. -
టీఆర్ఎస్లోకి సుదర్శన్రెడ్డి?
నిజామాబాద్: మాజీ నీటి పారుదల శాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి కాంగ్రెస్ను వీడనున్నారా? టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారా.. అంటే అవుననే అనుచరవర్గం అం టోంది. ఆయన శనివారం హైదరాబాద్లో బోధన్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారని అంటున్నారు. కొంతకాలం స్థబ్దుగా ఉన్న సుదర్శన్రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారాన్ని ఆయన ఖండించకపోవడం గమనార్హం -
ఊరిస్తున్న మార్కెట్ పదవులు
చైర్మన్ పీఠం కోసం ఆశావహుల క్యూ అధికార పార్టీలో మొదలైన సందడి జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్లు ఐదింటికి ముగిసిన పదవీ కాలం ఈ ఏడాది మరో ఆరు ఖాళీ నర్సంపేట : జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు అధికార పార్టీ నేతలను ఊరిస్తున్నాయి. నూతన రాష్ట్రం ఆవి ర్భావం... ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభం జనం సృష్టించి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు మార్కెట్ చైర్మన్ పీఠంపై దృష్టి సారించారు. నియోజకవర్గ ఇన్చార్జ్లతోపాటు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగా 14 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. ఇందులో చేర్యాల, పరకాల, ఘన్పూర్, వర్ధన్నపేట, కొడకండ్ల మార్కెట్ కమిటీల చైర్మన్ పదవి కాలం ముగిసింది. సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లలో వరంగల్ ఏనుమాముల మార్కెట్ చైర్మన్ పదవి కాలం 2016 ఆగస్ట్ 29 వరకు ఉంది. మరో సెలక్షన్ గ్రేడ్ వ్యవసా య మార్కెట్ అయిన నర్సంపేటకు సంబంధించి కమిటీ చైర్మన్ పదవి కాలం వచ్చే నెల 22తో ముగియనుంది. ఆదాయ పరంగా నర్సంపేట మార్కెట్ జిల్లాలో రెండో స్థా నం ఉండడంతో... ఇక్కడ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెల కొంది. ఎలాగైనా చైర్మన్ పదవిని దక్కించుకోవాలని అధికార పార్టీకి చెందిన పలువురు పైరవీలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్రెడ్డి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలోని నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి కా లం ఈ ఏడాది డిసెంబర్ 16న ముగియనుంది. ఈ మేరకు గూడూరు మండలానికి చెందిన ఓ జిల్లా స్థా యి నాయకుడు ఇప్పటికే ప్రయత్నాలు షు రూ చేశారు. నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కూడా చైర్మన్ పదవిపై ధీమాతో ఉన్నారు. మహబూబాబాద్, ములుగు, జనగామ, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి కా లం కూడా ఈ ఏడాదిలోనే ముగియనుంది. ఆత్మకూర్, తొర్రూరు వ్యవసాయ మార్కెట కు మాత్రం వచ్చే ఏడాది వరకు పదవి కా లం ఉంది.అయినప్పటికీ... టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక జీఓ తీసుకువచ్చి అన్ని వ్యవసాయ మార్కెట్లకు నూతన చైర్మన్లను ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో ఆశావహులు చైర్మ న్ పదవుల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
14న నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, కర్నూలు: జిల్లా కలెక్టరుగా సీహెచ్ విజయమోహన్ 14న బాధ్యతలు చేపట్టనున్నారు. సౌమ్యుడిగా, సమర్థుడిగా పేరున్న ఆయన.. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ఇటీవలే అక్కడి నుంచి జిల్లాకు కలెక్టర్గా బదిలీ అయ్యారు. 2003 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన గతంలో కరీంనగర్, చిత్తూరు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2008 నుంచి 2011 వరకు మూడేళ్లపాటు కరీంనగర్ జేసీగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మిడ్ మానేరు, శ్రీపాద వెల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తి చేశారు. రెండు ప్రాజెక్టుల కోసం 70 వేల ఎకరాలు సేకరించారు. శ్రీపాద ప్రాజెక్టు నిర్వాసితులైన 26 వేల మంది కోసం 13 గ్రామాలను ఏడాది కాలంలో అభివృద్ధి చేసి వారికి అందజేశారు. సింగరేణి కాలరీస్ చెందిన భూములను ఆక్రమించి వేలాది కుటుంబాలు అందులో జీవిస్తున్నాయి. ఐదు దశాబ్దాలుగా ఆ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అక్కడికి వచ్చినప్పుడు ఆయా కుటుంబాలకు పట్టాలు ఇస్తానని హామీ ఇవ్వడం.. వెంటనే ఆ భూములను సర్వే చేయించి 20 రోజుల్లో సుమారు 26 వేల మందికి పట్టాలు ఇప్పించారు. దాదాపు 250 మంది సిబ్బంది రేయిబవళ్లు ఆ పనిలో నిమగ్నమై విజయవంత చేశారు. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న సమయంలో మీ-సేవా కేంద్రాల నిర్వహణలో జిల్లాను టాప్గా నిలిపారు. 45 రోజుల్లో 38 లక్షల రికార్డులను మీ-సేవ ద్వారా అప్లోడ్ చేయించారు. ఇందుకోసం 66 మంది ఎమ్మార్వోలతో పనిచేయించారు. ఎకనామిక్స్లో గోల్డ్మెడలిస్ట్.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పాఠశాల, కళాశాల విద్యను విజయమోహన్ అభ్యసించారు. డిగ్రీ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో 1984 బ్యాచ్ విద్యార్థిగా ఎకనామిక్స్లో గోల్డ్మెడల్ సాధించారు. అక్కడి నుంచి 1993లో గ్రూప్-1 ద్వారా ఆర్డీఓగా ఎంపికై గుంటూరు, కాకినాడలో పనిచేశారు. ఆ తర్వాత డీఆర్డీఏ పీడీగానూ గుంటూరు, కాకినాడలో విధులు నిర్వర్తించారు. అనంతరం అనంతపురం వెలుగు పీడీగా పనిచేశారు. 2008లో ఐఏఎస్కు ఎంపికైన ఈయనకు 2003 ఐఏఎస్ బ్యాచ్ కేటాయించారు. 2008లో కరీంనగర్ జేసీగా మూడేళ్లపాటు, 2011లో చిత్తూరు జేసీగా ఏడాది పాటు విధులు నిర్వర్తించారు. తిరిగి 2012లో ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీపై వెళ్లి రెండేళ్లపాటు అక్కడ పనిచేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన బదిలీపై కర్నూలు కలెక్టర్గా రానున్నారు. -
లక్కున్న వారికే కిక్కు..!
కర్నూలు : లక్కున్న వారికే కిక్కు దక్కింది. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహించిన లక్కీ డ్రాలో మద్యం వ్యాపారులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కలెక్టర్ సుదర్శన్రెడ్డి దగ్గరుండి లక్కీ డ్రాను ప్రారంభించారు. ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ హేమంత్నాగరాజు, సూపరింటెండెంట్లు సుర్జీత్ సింగ్, హనుమంతరావుతో పాటు ఏజేసీ అశోక్కుమార్, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి టెండర్ల ప్రక్రియను కొనసాగించారు. దరఖాస్తులు చేసుకున్న వారు శనివారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో జిల్లా పరిషత్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు నిర్వహించి పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా కర్నూలు డీఎస్పీ మనోహర్రావు పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి పొద్దు పోయే వరకు కొనసాగింది. జిల్లాలో 194 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా 180 దుకాణాలకు 1801 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 28 మద్యం దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు నమోదయ్యాయి. మరో ఏడు మద్యం దుకాణాలకు రెండేసి దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మూడు దరఖాస్తులు వచ్చిన దుకాణాలు ఏడు ఉన్నాయి. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి దుకాణానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 180 మద్యం దుకాణాల ద్వారా లెసైన్స్ ఫీజు, దరఖాస్తు రుసుం, పర్మిట్ రూం ఫీజు కలిపి మొత్తం ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది రూ. 73.6 కోట్లు ఆదాయం సమకూరింది. లక్కీ డిప్లో దుకాణాలు దక్కించుకున్న వెంటనే డబ్బు చెల్లించేందుకు ప్రత్యేకంగా బ్యాంకు కౌంటర్ను పక్కనే అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది 42 మంది మహిళలు పోటీ పడి తొమ్మిది మంది దుకాణాలు దక్కించుకున్నారు. మద్యం వ్యాపారంతో సంబంధం లేని వారికి కర్నూలు, కోడుమూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో లక్కీ డిప్ ద్వారా దుకాణాలు దక్కాయి. వాటిని పాత వ్యాపారులే నిర్వహించేందుకు గుడ్విల్ పద్ధతిలో బేర సారాలు సాగుతున్నాయి. జిల్లాలోని సంత జూటూరు దుకాణానికి అత్యధికంగా 41 దరఖాస్తులు దాఖలు చేసి వ్యాపారులు పోటీ పడ్డారు. అదే గ్రామానికి చెందిన శంకర్రెడ్డిని అదృష్టం వరించింది. రెండో స్థానంలో రుద్రవరం దుకాణానికి 40 దరఖాస్తులు దాఖలయ్యాయి. కర్నూలులో నాల్గవ నంబర్ దుకాణానికి 34 మంది దరఖాస్తు చేసి పోటీ పడ్డారు. 14 దుకాణాలకు మళ్లీ టెండర్లు... జిల్లాలో గతేడాదితో పోలిస్తే దరఖాస్తులు రాని దుకాణాల సంఖ్య తగ్గింది. గతేడాది 20 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ ఏడాది 14 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు రాలేదు. దరఖాస్తులు రాని దుకాణాల విషయంలో వ్యాపారులు సిండికేట్ అయి ఉండవచ్చునని తెలుస్తోంది. వాటికి త్వరలో టెండర్లు నిర్వహిస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. చర్చనీయాంశంగా మారిన హోలోగ్రామ్ బిల్లింగ్... మద్యం వ్యాపారులు హోలోగ్రామ్ బిల్లింగ్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని నిబంధన విధించారు. ఈ విధానం అమలుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకున్న తర్వాతనే మద్యం స్టాకు ఇస్తారు. ప్రతి సీసాపై ఒక స్టిక్కర్ను అతికిస్తారు. ఫలితంగా ఆయా మద్యం బాటిళ్లు బెల్టు దుకాణాలకు వెళ్లినా, కలుషితం జరిగినా వెంటనే ఆయా బాటిళ్లు ఎక్కడ విక్రయించారన్న విషయం సునాయాసంగా తెలుస్తోంది -
అంగట్లో విద్య
‘జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ నిబంధనలకు అనుగుణంగా గవర్నింగ్ బాడీ తీర్మానించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఆ వివరాలను నోటీసు బోర్డులో పొందుపర్చాలి. పిల్లలకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. డొనేషన్లు వసూలు చేయకూడదు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.’ - కలెక్టర్ సుదర్శన్రెడ్డి మూడు రోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. సాక్షి, కర్నూలు: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను కాలరాస్తున్నాయి. ఫీజుల వసూలులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా సర్వోన్నతాధికారి ఆదేశాలనూ ఖాతరు చేయకపోవడం గమనార్హం. విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితం కాగా.. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం మీనమేషాలు లెక్కిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు అర్హత, ప్రవేశ పరీక్షలు నిర్వహించడం నిషేధం. అయితే ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోంది. జిల్లాలో 1,050 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. కర్నూలుతో పాటు నంద్యాల, డోన్, ఆదోని, ఎమ్మిగనూరులో ఫీజుల మోత మోగుతోంది. ఒక్క కర్నూలులోనే 100 పైగా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తుండగా.. 20 పైగా పాఠశాలల్లో డొనేషన్లు ఇవ్వనిదే సీటు దక్కని పరిస్థితి నెలకొంది. ఫీజుల నియంత్రణకు పాఠశాలలోని పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యాజమాన్యం, డెరైక్టర్లు, ప్రధానోపాధ్యాయుడితో కూడిన గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మే, జూన్, జులై నెలల్లో ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. తీర్మానం చేసిన అనంతరం ఆ వివరాలను నోటీసు బోర్డులో పొందుపర్చాలి. ఇందుకు సంబంధించిన ప్రతిని విద్యా శాఖ అధికారులకు పంపాలి. ఇవేవీ చేయకుండానే పాఠశాలల యాజమాన్యాలు అడ్డూఅదుపు లేని ఫీజులతో తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇకపోతే టెక్నో, గ్లోబల్ స్కూళ్ల పేరిట ప్రచారం చేయరాదని విద్యా శాఖ గతంలోనే ప్రకటించింది. అయినప్పటికీ కరపత్రాలు, ఫ్లెక్సీలతో పాటు వివిధ మార్గాల్లో టెక్నో, గ్లోబల్ స్కూల్, డిజిటల్ తరగతుల పేరిట ప్రచారం మారుమోగుతోంది. ఈ సౌకర్యాల మాటున ఫీజుల దోపిడీ కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులు, డొనేషన్లను పరిశీలిస్తే ఓ విద్యార్థి ఒకటి నుంచి 10వ తరగతి చదువు పూర్తి చేసేందుకు రూ.4 లక్షలకు పైగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పీహెడ్డీ పూర్తి చేసినా ఇంత మొత్తం ఖర్చు కాదనేది జగమెరిగిన సత్యం. అయితే పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించడంతో పాటు బంగారు భవిష్యత్కు బాటలు వేయాలనే తల్లిదండ్రుల ఆశను ప్రైవేట్ యాజమాన్యాలు తమ ఆదాయ వనరుగా మలుచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలి. గవర్నింగ్ బాడీ తీర్మానించిన ఫీజులకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. వసూలు చేసిన ఫీజుకే రశీదు ఇవ్వాలి. తల్లిదండ్రులు కచ్చితమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తాం. - కె.నాగేశ్వరరావు, డీఈఓ -
గుడ్డి దర్బార్
కర్నూలు(కలెక్టరేట్): రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు గడిచినా ప్రజాదర్బార్ వినతుల్లో అధిక శాతం పరిష్కారానికి నోచుకోని పరిస్థితి. జిల్లా కేంద్రంలో స్వయంగా కలెక్టర్ బాధితుల గోడు విని పరిష్కారానికి సిఫారసు చేస్తున్నా కింది స్థాయిలో నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. ప్రతి వారం నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చిన సమస్యలే 30 శాతం వరకు మళ్లీ వస్తుండటమే అందుకు నిదర్శనం. ఒక్క రెవెన్యూ శాఖకు చెందినవే 11,352 వినతులు పరిష్కారానికి నోచుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో 8,716 వినతులను డిస్పోజల్ (పరిష్కారం) చేసినట్లు చూపుతున్నా.. 80 శాతం సమస్యలు ఎక్కడికక్కడే ఉండటం గమనార్హం. జిల్లా కలెక్టర్ తనకు వచ్చిన వినతులను పరిష్కారం నిమిత్తం ఎండార్స్మెంట్ రాసి సంబంధిత అధికారికి రెఫర్ చేస్తారు. ఆయన తన కింది స్థాయి అధికారికి పంపి డిస్పోజల్ చేసినట్లు చూపడం పరిపాటిగా మారింది. బాధితులు మాత్రం అదే వినతితో ప్రతి వారం ప్రజాదర్బార్ గడప తొక్కాల్సి వస్తోంది. ప్రజాదర్బార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 33,507 వినతులు అందగా.. 30,007(90 శాతం) పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్కు నివేదించారు. పరిష్కారం ఈ స్థాయిలో ఉంటే ప్రజాదర్బార్కు బాధితులు పదేపదే ఎందుకు వస్తున్నారనేది వేయి డాలర్ల ప్రశ్న. జిల్లా పరిపాలనకు అధిపతి అయిన కలెక్టర్కు నేరుగా వినతులు అందిస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం వల్ల ప్రజాదర్బార్పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఆదోని, ప్యాపిలి, చాగలమర్రి, ఆత్మకూరు, సంజామల, ఆలూరు ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలంటే బాధితులకు కనీసం రూ.300 ఖర్చు అవుతుంది. ప్రతి వారం ఇలాంటి వారు వందల్లో ఉంటున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినతులు ఇస్తున్నా అధికారులు ఎండార్స్మెంట్తో సరిపెడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఒక సమస్యతో బాధితుడు మళ్లీ వస్తే అందుకు కారణాలను కలెక్టర్, జేసీలు పరిశీలిస్తే లోపం ఎక్కడుందనే విషయం బయటపడుతుంది. ఈ విషయంపై దృష్టి సారించనంత వరకు బాధితులు ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. మండలాల్లో కనిపించని గ్రీవెన్స్ ప్రతి సోమవారం మండల స్థాయిలో మండల పరిషత్ కార్యాలయంలో విధిగా ప్రజాదర్బార్ నిర్వహించాల్సి ఉంది. ఇప్పటివరకు మండల పరిషత్ అధ్యక్షులు లేనందున స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాంది. మండలస్థాయి గ్రీవెన్స్కు విధిగా స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులు పాల్గొనాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే మండల స్థాయిలో గ్రీవెన్స్ తూతూమంత్రంగా సాగుతోంది. సగం మండలాల్లో ఆ ఊసే కరువైంది. సోమవారం దాదాపు 30 మండలాల్లో ప్రజాదర్బార్ నిర్వహించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. -
ఆస్పత్రి ఎదుట ఆందోళన
మిర్యాలగూడ క్రైం :చిన్నారి మృతికి కారకుడైన వైద్యుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన బుధవారం మిర్యాలగూడలోని డాక్టర్స్ కాలనీ లోగల శ్రీసాయి జనరల్ ఆస్పత్రి వద్ద జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. దామరచర్ల మండలం మోదుగుల కుంటతండాకు చెందిన రమావత్ రవి, భారతిల కుమార్తె హిందు(4)కు జ్వరం రావడంతో పట్టణంలోని శ్రీసాయి జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిశీలించిన డాక్టర్ మూడు రకాల ఇంజక్షన్లు రాశాడని, వీటిని ఆస్పత్రి కాం పౌండర్ చిన్నారికి వేసిన కొద్ది క్షణాల్లో మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజక్షన్లు వికటించడం వల్లే తమ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా విషయం తెలుసుకున్న వన్టౌన్ సీఐ సుదర్శన్రెడ్డి ఆస్పత్రి వద్దకు వచ్చి వారికి నచ్చచెప్పారు. వైద్యుడి నిర్లక్ష్యం ఉంటే ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. మా తప్పేమీలేదు.. చిన్నారి ఇందు మృతి విషయమై డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన వద్దకు తీసుకువచ్చినప్పుడు జ్వరం, ఆయాసం, దగ్గుతో బాధపడుతుందన్నారు. తమ ఆస్పత్రి లో కేవలం ట్రీట్మెంటుకు ముందు ఏంటాసిడ్, యాంటిఎమిటిక్ ఇంజక్షన్లు మాత్రమే ఇచ్చామని, వీటి వలన రోగికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. పాప పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేషన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించగా వారు తీసుకెళ్లారని, ఈ క్రమంలోనే పాప మృతి చెందిందని వివరించారు. -
టీవీ చానల్ మార్పు విషయంలో అక్కాచెల్లెళ్ల వాగ్వాదం చెల్లి ఆత్మహత్య
సంజీవరెడ్డినగర్,న్యూస్లైన్: టీవీ చానల్ మార్పు విషయంలో అక్కాచెల్లల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన చెల్లి చివరకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన సంజీవరెడ్డినగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ సుదర్శన్రెడ్డి వివరాల ప్రకారం..బోరబండ రాజీవ్నగర్కు చెందిన వైద్యుడు ఉస్మాన్ కూతురు ఫాతిమా(13) స్థానిక పాఠశాలలో 8వతరగతి చదువుతుంది. ఫాతిమా టీవీ చూస్తుండగా అక్క వచ్చి మరోచాన ల్ మార్చింది. ఎందుకు చానల్ మార్చావంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మధ్యాహ్నం నమాజ్ చేసుకున్న అనంతరం 2గంటల సమయంలో గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గదిలోకి వెళ్లిన ఫాతిమా ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. కొనఊపిరితో ఆమెను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా చానల్ మార్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. -
అంతా నీ ఇష్టమా..?
కర్నూలు(హాస్పిటల్), న్యూస్లైన్: ‘నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు.. జీవోలున్నా అమలు చేయడం లేదు. ఎస్టాబ్లిష్మెంట్పై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదైనా అడిగితే డెరైక్టర్ ఆఫ్ హెల్త్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. అంతా నీ ఇష్టమా...?. ఇప్పటి వరకు ఏఏ ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయో చూసి సోమవారం నా వద్దకు తీసుకురండి’ అంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంఅండ్హెచ్వో) డాక్టర్ వై. నరసింహులుపై జిల్లా కలెక్టర్ సుదర్శన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్వోపై పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబుతో కలిసి కలెక్టర్ సుదర్శన్రెడ్డి స్వయంగా శనివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో డీఎంహెచ్వోతో పాటు చాలా మంది ఉద్యోగులు కూడా లేకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. దీంతో ఆయన డీఎంహెచ్వో ఎక్కడున్నారని అక్కడున్న అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ రాజాసుబ్బారావును, ఉద్యోగులను ప్రశ్నించారు. ఇంకా రాలేదని వారు చెప్పడంతో... వెంటనే పిలిపించండన్నారు. అనంతరం కలెక్టర్, జేసీ ఇద్దరూ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను పరిశీలించారు. ఏఏ సెక్షన్లో ఎవరు పనిచేస్తున్నారు.. వారు ఏఏ విధులు నిర్వరిస్తున్నారు...ఏవైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అర్ధ గంటకు పైగా వారిద్దరూ కార్యాలయంలో పర్యటించారు. ఎంతో కాలంగా డీఎంహెచ్వోపై అసంతృప్తిగా ఉన్న సిబ్బంది ఈ సందర్భంగా కలెక్టర్తో వారి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. డీఎంహెచ్వోపై వచ్చిన పలు ఆరోపణలను ప్రస్తావించారు. ఇక్కడ సమస్యలతో విసిగి వేసారిన తమకు న్యాయం చేయాలని కోరారు. ఈలోగా డీఎంహెచ్వో డాక్టర్ వై. నరసింహులు వచ్చి వారితో కలిశారు. ఆయనతో పెద్దగా మాట్లాడకుండా పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారంలోగా ఎస్టాబ్లిష్మెంట్ ఫైళ్లన్నీ తన దగ్గరకు తీసుకురావాలని ఆదేశించారు. కుప్పలు తెప్పలుగా పెండింగ్ ఫైళ్లు ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, వారు తిరిగి విధుల్లో చేరాలని తిరుగుతున్నా స్పందన లేదు. వారిని విధుల్లో చేర్చుకోకుండా తిప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి రెండు సంవత్సరాల ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. పత్తికొండ సీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ గొడవ పడి అక్కడి కార్యాలయానికి 15 రోజులుగా తాళం వేశారు. దీంతో అక్కడి సిబ్బంది జీతాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు ఉన్నాయి. ఫార్మాసిస్టు శారద సస్పెన్షన్పై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఆ ఉత్తర్వులను తెచ్చి చూపినా సస్పెన్షన్పై డీఎంహెచ్వో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఆమె వారం రోజుల క్రితం గట్టిగా ప్రశ్నించారు. దీంతో డీఎంహెచ్వో పోలీసులను ఆశ్రయించి రక్షణ కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు నెలలుగా గార్గేయపురం మెడికల్ ఆఫీసర్ జీతాన్ని డీఎంహెచ్వో ఆపేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వెల్దుర్తి పీహెచ్సీవో ఓ హెల్త్ అసిస్టెంట్ మూడు నెలలు సెలవు పెట్టి తిరిగి విధుల్లో చేరాలని వచ్చినా పోస్టింగ్ ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. కారుణ్య నియామకాలు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం చెన్నయ్య అనే డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే నైట్వాచ్మెన్ హుసేన్ ఆరు నెలల క్రితం మరణించారు. పత్తికొండ ల్యాబ్టెక్నీషియన్ స్వాములు ఆరు నెలల క్రితం చనిపోయారు. వీరికి సంబంధించి కారుణ్య నియామకాలు, బెనిఫిట్స్ ఇప్పటి వరకు తేల్చకుండా తిప్పుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు ఆసుపత్రులు, క్లినిక్లను రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నంద్యాలలోని ఎంఎస్ నగర్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ను నియమించాలని దరఖాస్తులు వచ్చినా స్పందన లేదు. కర్నూలు నగరం వీకర్సెక్షన్ కాలనీలోని అర్బన్హెల్త్ సెంటర్ను రెడ్క్రాస్ సొసైటీకి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించి రెండు నెలలైనా అమలు కాలేదు. -
ప్రజాదర్బార్ను మరిచారు!
కర్నూలు(అగ్రికల్చర్),న్యూస్లైన్ : జిల్లా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను చూపేందుకు నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అధికారులు విస్మరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులూ డుమ్మా కొట్టారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికలకు ముందు ప్రతి సోమవారమూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండేవారు. అయితే ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండు నెలలపాటు అవి నిలిచిపోయాయి. డయల్ యువర్కలెక్టర్ ప్రారంభం కాకపోయినా సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని తిరిగి కలెక్టర్ సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్తోపాటు అదనపు జేసీ అశోక్కుమార్, డీఆర్వో వేణుగోపాల్రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అయితే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులూ డుమ్మా కొట్టారు. కొన్ని శాఖల నుంచి కిందిస్థాయి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కలెక్టర్ తదితరులు ప్రజల నుంచి వినతులు తీసుకుని ఎండార్స్మెంట్ రాసి ఫలానా అధికారిని కలువాలని సూచించి పంపారు. -
కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి
బోధన్ టౌన్/ఎడపల్లి, న్యూస్లైన్ : దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మాజీ భారత క్రికెట్ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బోధన్ పట్టణం, ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్, జాన్కంపేట్లలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం లభించినప్ప టి నుంచి కాంగ్రెస్ దేశ ప్రజలకు సేవ చేస్తోందన్నారు. రైతులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బోధన్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. రైతన్నలకు సాగునీరు అందించి వారి పంటలను కాపాడారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ను చీటర్ అని విమర్శించారు. ఎన్నికలు కూడా క్రికె ట్ ఆటలాంటివే అని, జట్టులో సభ్యులందరూ కలిసి ఆడితేనె విజయం సాధ్యం అవుతుందని అన్నారు. బోధన్లో అజారుద్దీన్ను చూసేందుకు యువకులు అధిక సంఖ్యలో వచ్చారు. బ్యాట్లు తెచ్చి ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు. అజారుద్దీన్ సమక్షంలో టీడీపీ నాయకులు బిల్ల గంగాధర్ తన అనుచరులతో కాం గ్రెస్లో చేరారు. అజారుద్దీన్కు కాంగ్రెస్ నాయకులు పట్టణ స్వాగత తోరణం వద్ద గజమాల వేసి స్వాగతం పలికారు. ఆచణ పల్లి బైపాస్ నుంచి ఆచన్ పల్లి, శక్కర్నగర్, శక్కర్నగర్ చౌరస్తా, కొత్తబస్టాండ్, అం బేద్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, రాకాసీపేట్, పాత బోధన్లో రోడ్షో సాగింది. సుదర్శన్రెడ్డిని గెలిపిస్తే వందో టెస్టు పూర్తిచేసినట్లే రెంజల్ : మాజీ మంత్రి సుదర్శన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తాను వందో టెస్టు పూర్తి చేసినట్లేనని అజారుద్దిన్ పేర్కోన్నారు. చాలాకాలం భారత క్రికెట్కు పనిచేసి అలసిపోయానని తాను కెరిర్ ముగించే సమయానికి 99 టెస్టులు మాత్రమే ఆడానని అన్నారు. మిగిలిన టెస్టు మ్యాచ్ ఈ నెల 30న జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు సిక్సర్లు కోడుతూ బ్యాలెట్ బాక్సులు నింపాలని సూచించారు. సుదర్శన్రెడ్డి ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ఎవరూ చేయలేదని కొనియాడారు. టీఆర్ఎస్, టీడీపీ, బిజేపీలు డబ్బున్న పార్టీలని ఆ పార్టీల నేతలకు ప్రజా సమస్యలు తెలియవన్నారు. -
దశమి రోజు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టికెట్ ఖాయమని తెలిసినా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు కాంగ్రెస్, టీఆర్ ఎస్, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, బీజేపీ తది తర పార్టీల నేతలు ముహూర్తం కోసం ఆగారు. బుధవారం దశమి, అందులో శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ముహూర్తం కావడంతో ప్రధాన పార్టీల నేతలందరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నామినేషన్ల కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అంతా సిద్ధం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు బుధవారం తెరపడుతుంది. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుం ది. 12 తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు కా గా, ఈనెల 30న పోలింగు ఉంటుంది. ఈ నేపథ్యం లో ఈనెల 13 నుంచి ఎన్నికల ప్రచారం హోరెత్తనుం ది. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రచారసరళిపై నిఘా ముమ్మరం చేసింది. వచ్చే నెల 16న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. నిన్నటి వరకు టికెట్ల కోసం ఢిల్లీ, హైదరాబాద్లో ‘క్యూ’ కట్టిన నేతలు, నేడు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బా రులు తీరనున్నారు. పార్లమెంట్ అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో, ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గం కేంద్రంలో తహశీల్దారు/ఆర్డీఓ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేస్తారు. నేడు నామినేషన్ వేసేది వీరే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి టీ ఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుం చి మధుయాష్కీ గౌడ్, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా సింగిరెడ్డి రవీందర్రెడ్డి, బీజేపీ నుంచి పొద్దుటూరి సదానందరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, పీఆర్ సోమాని నామినేషన్ వే యనున్నట్లు ప్రకటించారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్ ఎస్), గడ్డం ఆనంద్రెడ్డి (బీజేపీ), బొడ్డు గంగారెడ్డి(వైఎస్ఆర్ సీపీ)లు నామినేషన్ వేయనున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా అంతిరెడ్డి శ్రీధర్రెడ్డి, బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (కాంగ్రెస్), బిగాల గణేశ్ గుప్తా (టీఆర్ఎస్), మీర్ మ జాజ్ అలీ (ఎంఐఎం), బీజేపీ అభ్యర్థులుగా డాక్టర్ బాపురెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు వేయనున్నారు. బోధన్లో మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్రెడ్డి (కాంగ్రెస్), మహమ్మద్ షకీల్ (టీఆర్ఎస్), మేడపాటి ప్రకాశ్రెడ్డి (టీడీపీ), బీజేపీ, వైఎస్ఆర్ సీపీల నుంచి కెప్టెన్ కరుణాకర్రెడ్డి, తూము శరత్రెడ్డిలు నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ నామినేషన్ వేయనున్నారు. వైఎస్ఆర్ సీపీ నుంచి చిల్కూరు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్లు కూడ నామినేషన్లు వేస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కేఆర్ సురేశ్రెడ్డి (కాంగ్రెస్), రాజారాం యాదవ్ (టీడీపీ), ఆశన్నగారి జీవన్రెడ్డి (టీఆర్ఎస్), మార చంద్రమోహన్లు నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ (కాంగ్రెస్), డాక్టర్ ఏలేటి మల్లికార్జున్రెడ్డి (టీడీపీ), వేముల ప్రశాంత్రెడ్డి (టీఆర్ఎస్)లు నామినేషన్లు వేయనున్నారు. జుక్కల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాం, హన్మంత్ సింధే(టీఆర్ఎస్), వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నాయుడు ప్రకాశ్లు నామినేషన్ వేయనున్నారు. అయితే కాంగ్రెస్ రెబల్గా అరుణతార, ఎమ్మెల్సీ రాజేశ్వర్లు కూడ నామినేషన్ వేసే అవకాశం ఉంది. బాన్సువాడకు కాసుల బాలరాజు (కాంగ్రెస్), పోచారం శ్రీనివాస్రెడ్డి (టీఆర్ఎస్), టీడీపీ, వైఎస్సార్సీల నుంచి బద్యానాయక్, రాంమోహన్లు నామినేషన్ వేయనున్నారు. ఎల్లారెడ్డి నుంచి పటోళ్ల సిద్దార్థరెడ్డి (వైఎస్సార్సీపీ), నల్లమడుగు సురేందర్ (కాంగ్రెస్ ), ఏనుగు రవీందర్రెడ్డి (టీఆర్ఎస్), బాణాల లక్ష్మారెడ్డి (బీజేపీ)లు నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి
రెంజల్, న్యూస్లైన్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా గురువారం మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన పలు గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..గతంలో టీడీపీ పాలనను స్వ యంగా చూశామన్నారు. ఒకరు చస్తేనే మరొకరికి పింఛన్ ఇచ్చే సాంప్రదాయం ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను తీర్చేం దుకు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, రైతులకు మద్దతు ధర, జలయజ్ఞం, పింఛన్లు పెంచడం తదితర పథకాలతో అనేక వర్గాల ప్రజలకు కాంగ్రెస్ లబ్ధిచేకూర్చిందని వివరించారు. ప్రజలు అభివృద్ధి చేసే పార్టీలనే ఆదరించాలని సూచించారు. 40 ఏళ్లుగా లేని మెడికల్ కళాశాలను మీ దయ వల్ల మంజూరు చేయించినట్లు తెలిపారు. అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా చివరి ఆయకట్టు గ్రామాల వరకు సాగు నీరందిస్తున్నట్లు తెలిపారు.కందకుర్తి ఎత్తిపోతలను జూలై వరకు పూర్తిచేయిస్తామన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్లే అనేక రకాల పథకాలు వచ్చాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోని యా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ పునర్మిర్మాణం కాంగ్రెస్తోనే జరుగుతుందన్నారు. తాను అవినీతికి అవకాశం ఇవ్వకుండా అధికారులతో పనులు చేయించానని అన్నారు. గ్రామాల్లో చిన్న సమస్యలు స్థానిక నాయకులు పరిష్కరించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను విడతల వారీగా పరిష్కరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి నాగభూషణంరెడ్డి, సర్పంచ్లు సవిత, జావిద్, పోశెట్టి,ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బోగస్ ఓట్లను తేల్చండి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: బోగస్ ఓట్లకు సంబంధించిన విచారణను ఈ నెల 20వతేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుదర్శన్రెడ్డి ఎన్నికల అధికారుల (ఆర్వోలు)ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టరేట్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు ఏఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బోగస్ ఓటర్లపై ఫిర్యాదులు, ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓటు కల్గి ఉన్న వారిని గుర్తించాలన్నారు. ఇందుకు సంబంధించి విచారణను సత్వరమే పూర్తి చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా వచ్చిన ఫారం-6 దరఖాస్తులపై విచారణను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చాలన్నారు. ప్రతి రిటర్నింగ్ అధికారి తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేయాలని, మౌలిక సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించారు, ఇంకా పెండింగ్లో ఎన్ని ఉన్నాయి తదితర వివరాలు ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులున్నాయో లేదో పరిశీలించాలన్నారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాన్ని సమగ్రంగా లెక్క కట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన టీము ల పని తీరును మెరుగుపరచాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో జరిగే పోలింగ్ ప్రక్రియను వెబ్క్యాస్టింగ్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ కన్నబాబు, ఎన్నికల సెల్ ఓఎస్డీ సంపత్కుమార్, డిప్యూటీ తహసీల్దార్లు శివరాముడు, లక్ష్మిరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజల నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ సుదర్శన్రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫోన్ ద్వారా సమస్యలపై వినతులను స్వీకరించారు. అనంతరం ప్రజాసమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్కు వచ్చిన సమస్యల పరిష్కారం అంతంత మాత్రమే ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం వచ్చిన సమస్యలను వచ్చే వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరించకపోతే కారణాలను తెలపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో జేసీ కన్నబాబు, డీఆర్వో వేణుగోపాల్రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సంపత్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ దృష్టికి వచ్చిన సమస్యలు పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొందరు వ్యక్తులు నాటుసారా, మద్యం ఇళ్లలోనే విక్రయిస్తున్నారని, తక్షణమే అడ్డుకోవాలని ఓ వ్యక్తి కోరగా.. ఎక్సైజ్ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి అదుపు చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీపం పథకం కింద గ్యాస్ కనె క్షన్లు జూన్, జూలైల్లో మంజూరు అయ్యాయని, అప్పుడు పంచాయతీ ఎన్నికల కారణంగా పంపిణీ చేయలేదని, ఇప్పుడు అడిగితే ఇవ్వడం లేదని ఆళ్లగడ్డకు చెందిన కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ డీఎస్ఓకు తగిన సూచనలు ఇచ్చారు. బేతంచెర్ల మండలం మండ్లవానిపల్లె గ్రామంలో తాగునీటిని ఇతరులు దౌర్జన్యంగా వ్యవసాయానికి వాడుకుంటున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పంపి విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. కోవెలకుంట్ల మండలం కంపమల్లలోని ఊరకుంటను కొందరు ఆక్రమించి వ్యవసాయ భూమిగా మార్చుకున్నారని, పశువులకు నీరు లేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు విన్నవించగా.. చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
నవాబ్ కృషి ఫలితమే నిజాంసాగర్
నిజాంసాగర్, న్యూస్లై న్: నిజాం పాలనలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు వ ంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం.. నాటి చీఫ్ ఇంజి నీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కృషి ఫలితమేనని భారీ నీటిపారుదల మంత్రి పి. సుదర్శన్రెడ్డి కొనియాడారు. సోమవారం ఆయన ప్రాజెక్టు గుల్దస్తా వద్ద బహదూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటికి అధిక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా ప్రధాన కాలువ లైనింగ్ పనులు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్న ఈ ప్రాజెక్టుతోపాటు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాం తంలో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించిన బహదూర్ విగ్రహ ఏర్పాటుకు తాను కృషి చేయగా, ఇంజినీర్ కుటుంబ సభ్యులు సానుకూలం గా స్పందించారని పేర్కొన్నారు. గుల్దస్తా వద్ద గార్డెన్ను అభివృద్ధి చేస్తే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గార్డెన్గా నామకరణం చేస్తామన్నారు. అం దుకు కృషిచేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యానాథ్దాస్కు సూచించారు. అతిథి గృహంలో ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చే యాల న్నారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, గేట్ల పెయిం టింగ్ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పను లు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో రూ. 4 వేల కోట్ల పంటలు పండుతున్నాయి జిల్లాలోని ఖరీఫ్, రబీ సీజన్లలో రూ. 4 వేల కోట్ల విలువగల పంటలను రైతులు పండిస్తున్నారని మం త్రి అన్నారు. సింగూరు జలాశయం ద్వారా వాటా ప్రకారంగా నిజాం సాగర్ కు నీటిని తెస్తామన్నారు. పోచారం ప్రాజెక్టు వల్ల నిజాంసాగర్ నిండిందన్నా రు. దిగువన ఉన్న సింగితం రిజర్వాయర్, కళ్యాణి ప్రాజెక్టుల వల్ల నిజాంసాగర్ ఆయకట్టు పంటలకు ఖరీఫ్లో సాగునీరందిందన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జిల్లా ప్రజానీకానికే కుటుం బ పెద్దలా నిలిచిపోయారన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం లో ఉన్నఇందూరుకు సాగునీటి కేటాయింపులో సీమాంధ్ర పాలకులు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. మెదక్ జిల్లాలో నిర్మించిన సింగూరు ప్రాజెక్టుతో నిజాంసాగర్కు నీళ్లురాని పరిస్థితులు దాపురించాయన్నారు. నాగార్జునసాగర్ జలాలను హైద రాబాద్కు తరలించి, సింగూరు జలాలను పూర్తిగా నిజాం సాగర్కు కేటాయించాలని కోరారు. సింగూ రు నీటి కోసం జిల్లా మంత్రి సుదర్శన్రెడ్డితో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు పటిష్టంగా జరిగితే చివరి ఆయకట్టుకు మేలు జరుగుతుందన్నారు. హర్షణీయం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ 1923-31 సంవ త్సరాల కాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టును కట్టిన అప్పటి చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహాన్ని అవిష్కరించడం హర్షణీయమన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ హన్మంత్ సింధే తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, నాయకులు ఆకుల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ పట్వారి గంగాధర్, మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, సర్పంచులు మణేమ్మ, రాజు తదిరతరులు పాల్గొన్నారు. బహదూర్ మనుమళ్లు, మనుమరాళ్లు మీర్ అహ్మద్ అలీ,అక్మర్ అలీ,అఫీజ్ అ లీ, ఉన్నత్ ఉన్నీ సా బేగం హాజరయ్యారు. అం త కు ముందు బహదూర్ విగ్రహావిష్కరణ ఆడంబరంగా జరిగింది. -
‘వేముగంటి’కి శంకుస్థాపన
భీమ్గల్, న్యూస్లైన్ : మండల ప్రజల చిరకాల వాంఛ అయిన వేముగంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని జూలైలోగా పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి కాంట్రాక్టర్ ను, అధికారులను ఆదేశించారు. ఆగస్టులో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం మం డలంలోని పల్లికొండలో వేముగంటి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం మండల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టు నిర్మాణ దశకు చేరుకుందన్నారు. గట్టు పొడచిన వాగు నుంచి మండలంలోని మెండోరాకు నీళ్లు తరలించే విషయాన్ని పరిశీలించేందుకు అధికారులను పంపుతామన్నారు. భూగర్భ జలాల పెరుగుదల కోసం వాగుల్లో చెక్డ్యాంలు నిర్మించడానికి కృషి చేస్తానన్నారు. శ్రీరాంసాగర్ ప్రా జెక్టు వరద కాల్వకు 30 కిలోమీటర్లకు ఒక చెక్డ్యాం నిర్మించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు పల్లికొండలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. చంద్రబాబు నాయుడు బూటకపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఆయన హయాంలో కరెంటోళ్లు రైతుల మీటర్ల డబ్బాలు లాక్కుపోయేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే మార్పు వచ్చిందన్నారు. అలాంటి బాబుకు ప్రజలు మళ్లీ ఎందుకు అవకాశమిస్తారన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. పెద్ద సంఖ్యలో సీట్లు సీమాంధ్రలో ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అందుకే.. భీమ్గల్పై అభిమానం బాల్కొండకు, భీమ్గల్కు ఎంతో వ్యత్యాసం ఉందని ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తనకు వచ్చిన మెజారిటీలో సగం భీమ్గల్ నుంచే వచ్చిందన్నారు. అందుకే తనకు భీమ్గల్ అంటే ప్రత్యేక అభిమానమన్నారు. ఈ ప్రాంత ప్రజల ‘వేముగంటి’ ఆకాంక్షను నెరవేర్చానన్నారు. మౌలిక వసతుల కల్పనకు తాను పెద్ద పీట వేశానన్నారు. నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, విప్లను ప్రాజెక్టు కమిటీ, ఆయకట్టు రైతులు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శనిగరం సంతోష్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పట్వారి గంగాధర్రావు, నాయకులు కన్నె సురేందర్, మానాల మోహన్రెడ్డి, సుంకెట రవి, వేముగంట ప్రాజెక్టు చైర్మన్ రాజేశ్వర్, సర్పంచ్లు ఆర్మూర్ మహేశ్, కొమ్ము నరేశ్, గుగులోత్ రవినాయక్, ఏశాల సౌమ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితా ఆన్లైన్ చేయండి
ఓర్వకల్లు, న్యూస్లైన్: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా కొత్తగా జాబితాలో చేరిన పేర్లను ఆన్లైన్ చేయాలని కలెక్టర్ సుదర్శన్రెడ్డి ఆదేశించారు. ఓటర్ల సవరణ జాబితా పరిశీలన కోసం శుక్రవారం ఓర్వకల్లు తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఓబులేసుతో కలిసి స్థానిక రెవెన్యూ అధికారులతో కొద్దిసేపు సమీక్షించారు. గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ 23 వరకు బీఎల్ఓల ద్వారా సేకరించిన కొత్త ఓటర్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి కంప్యూటర్లో పొందుపరచాలన్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా సాధారణ ఓటర్లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మండలంలో కొత్తగా ఓటు హక్కు కోసం 2199 మంది దరఖాస్తు చేసుకోగా 266 దరఖాస్తులను బోగస్గా గుర్తించి తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం మండలంలో 40,664 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనాథ్, ఆర్ఐ శ్రీనివాసులు, వివిధ గ్రామాల వీఆర్ఓలు పాల్గొన్నారు. -
ఇందూరులో మరింత అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇందూరు అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి పి.సుదర్శన్రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల చేరువలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలంతా పాడిపంట లు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషంగా ఉం డాలని మంత్రి ఆకాంక్షించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు రూ. 3.30 కోట్లు కేటాయించామని తెలిపారు. రబీ సీజన్లో రైతులకు 33 శాతం రాయితీతో 16 వేల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశామన్నారు. రూ. 10 కోట్లతో జిల్లాలో 57 గోదాములను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందించడానికి రూ. 518 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నవీపేట మండలంలో రూ. 4.73 కోట్లతో శాఖాపూర్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేశామన్నారు. దాహం తీర్చేందుకుజిల్లాలో తాగునీటి కొరతను తీర్చడానికి వివిధ పథకాల ద్వారా 570 పనులకుగాను రూ. 226 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. బంగారుతల్లి పథకం కింద ఆడపిల్లలకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. మార్పు పథకం కింద మాతాశిశు మరణాలను తగ్గించడంలో భాగంగా, ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 52 వేల మంది రోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యసదుపాయాన్ని కల్పించడానికి రూ. 138 కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాలో రూ. 48.32 కోట్లతో 16 మోడల్ పాఠశాలలు, రూ. 21.25 కోట్లతో 17 కసూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను నిర్మించామన్నారు. అమృతహస్తం అమృతహస్తం కింద తొమ్మిది నిత్యావసర సరుకులను బహిరంగమార్కెట్ ధరకంటే తక్కువ ధరకు పంపిణీ చేస్తున్నామన్నారు. నిర్మల్భారత్ అభియాన్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లాలో 329 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 139 కోట్ల ఖర్చు చేసి 2.99 లక్షల కుటుంబాలకు పనులు కల్పించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తగిన ప్రాధాన్యతతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిజామాబాద్లోని బైపాస్ రోడ్డుతో సహా జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కోసం తక్షణమే చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్లో మైనారిటీ కమ్యూనిటీ హాలు నిర్మాణంతో పాటు, పార్క్ ఏర్పాటు కోసం తగిన చర్యలకు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కేంద్రంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా పేద రోగులకు సరైన వైద్యసేవలు అందే విధంగా కృషి చేసినట్లు వివరించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. -
కాలనీ ఏర్పాటు ప్రశంసనీయం
ఆదోని, న్యూస్లైన్: ప్రభుత్వ చేయూత కోసం ఎదురు చూడకుండా సొంతంగా కాలనీ ఏర్పాటుకు ఆదోని రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ నాయకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కలెక ్టర్ సుదర్శన్రెడ్డి అన్నారు. కాలనీ ఏర్పాటుకు సంబంధించి స్థానిక విజయభాస్కరరెడ్డి కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆదివారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రెవెన్యూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులనుఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హైదరాబాదు, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లో రెవెన్యూ అసోసియేషన్కు ప్రభుత్వం స్థలాలు కేటాయించినా కోర్టు కేసుల కారణంగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ఆదోని అసోసియేషన్ సభ్యులు సొంతంగా పదెకరాలు కొనుగోలు కాలనీ ఏర్పాటుకు పూనుకోవడం గొప్ప విషయమన్నారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే స్థానిక ఆర్డీఓ సహకారంతో రోడ్లు, మంచినీటి పైపులైను ఏర్పాటయ్యాయని, ఇతర వసతుల కల్పనకు తన సహకారం ఉంటుందన్నారు. అంతకుముందు పట్టణలోని రెవెన్యూ భవన్ను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రారంభించారుఆదోని, న్యూస్లైన్: ప్రభుత్వ చేయూత కోసం ఎదురు చూడకుండా సొంతంగా కాలనీ ఏర్పాటుకు ఆదోని రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ నాయకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కలెక ్టర్ సుదర్శన్రెడ్డి అన్నారు. కాలనీ ఏర్పాటుకు సంబంధించి స్థానిక విజయభాస్కరరెడ్డి కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆదివారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రెవెన్యూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులనుఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హైదరాబాదు, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లో రెవెన్యూ అసోసియేషన్కు ప్రభుత్వం స్థలాలు కేటాయించినా కోర్టు కేసుల కారణంగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ఆదోని అసోసియేషన్ సభ్యులు సొంతంగా పదెకరాలు కొనుగోలు కాలనీ ఏర్పాటుకు పూనుకోవడం గొప్ప విషయమన్నారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే స్థానిక ఆర్డీఓ సహకారంతో రోడ్లు, మంచినీటి పైపులైను ఏర్పాటయ్యాయని, ఇతర వసతుల కల్పనకు తన సహకారం ఉంటుందన్నారు. అంతకుముందు పట్టణలోని రెవెన్యూ భవన్ను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకమని, అయితే హక్కులతోపాటు బాధ్యతలను గుర్తెరిగి పనిచేస్తే మనల్ని ప్రశ్నించేవారుండరన్నారు. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు అంగీకరించిందని, అవి భర్తీ అయితే ఒత్తిడి తగ్గుతుందన్నారు. డివిజన్లోని రెవెన్యూ ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తున్న అసోషియేషన్ ఆదోని శాఖను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార ్యదర్శి శివకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్రెడ్డి మాట్లాడారు. పదెకరాల్లో 150 మందికి ప్లాట్లు వేశామని, మిగిలిన వారికి త్వరలోనే స్థలం సేకకరిస్తామని అసోసియేషన్ ఆదోని డివిజన్ శాఖ అధ్యక్షుడు రజనీకాంత్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీఎండీ హుసేన్, జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్, ఆదోని ఆర్డీఓ రాంసుదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేషనల్, అక్షర శ్రీ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. . ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకమని, అయితే హక్కులతోపాటు బాధ్యతలను గుర్తెరిగి పనిచేస్తే మనల్ని ప్రశ్నించేవారుండరన్నారు. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు అంగీకరించిందని, అవి భర్తీ అయితే ఒత్తిడి తగ్గుతుందన్నారు. డివిజన్లోని రెవెన్యూ ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తున్న అసోషియేషన్ ఆదోని శాఖను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార ్యదర్శి శివకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్రెడ్డి మాట్లాడారు. పదెకరాల్లో 150 మందికి ప్లాట్లు వేశామని, మిగిలిన వారికి త్వరలోనే స్థలం సేకకరిస్తామని అసోసియేషన్ ఆదోని డివిజన్ శాఖ అధ్యక్షుడు రజనీకాంత్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీఎండీ హుసేన్, జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్, ఆదోని ఆర్డీఓ రాంసుదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేషనల్, అక్షర శ్రీ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
పర్యాటక కేంద్రంగా ‘కందకుర్తి’
కందకుర్తి(రెంజల్), న్యూస్లైన్: కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా పర్యాటక శాఖ అధికారి భిక్షు నాయక్ అన్నారు. శనివారం సీఎంఓ స్వర్ణలతతో కలిసి ఆయన రెంజల్ మండలంలోని కందకుర్తిని సందర్శించారు. ఇటీవల రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి పుష్కర క్షేత్రాన్ని పరిశీలించారని అన్నారు. మంత్రి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. పర్యాటక స్థలాల అభివృద్ధికి నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. క్షేత్రాన్ని పరిశీలించిన అధికారులు గోదావరి నదిలో నెల రోజుల్లో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. నదీ స్నానాలకు వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వంట గదులు, విశ్రాంతి గదులు, మూత్ర శాలులు, తాగు నీటి ట్యాంకులు నిర్మాణం చేపడతామని వివరించారు. వంటలపై అసంతృప్తి కందకుర్తి నుంచి రెంజల్లోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అధికారులు తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యలో బాలికలు వెనుకబడి ఉన్నట్లు గుర్తించిన అధికారులు సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలను సొంత కుటుంబ సభ్యులుగా చూడాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అలీసాగర్,అశోక్సాగర్ సందర్శన ఎడపల్లి(ఠాణాకలాన్): మండలంలోని అలీసాగర్ ఉద్యానవనాన్ని శనివారం జిల్లా పర్యాటక శాఖ అధికారి భిక్షు నా యక్ సందర్శించారు. గుట్ట పైభాగాన సుమారు 52 ఎకరాల స్థ లంలో నిర్మించనున్న పెలైట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, స రిహద్దులను అడిగి తెలుసుకున్నారు. భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డు లను పరిశీలించారు. అనంతరం అశోక్సాగర్ ఉద్యానవనాన్ని ఆయన సందర్శించారు. ఉద్యాన వనానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
పేదల గుడిసెల కూల్చివేత
సుభాష్నగర్, న్యూస్లైన్ : నగర శివారులోని నందిగుట్ట సమీపంలో గల నిజాంసాగర్ ప్రధాన కాలువకు ఓ వైపు పేదలు నిర్మించుకున్న గుడిసెలను అధికారులు కూల్చివేయించారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాలువకు ఓ వైపు పేదలు గుడెసెలు వేసుకున్నారు. సోమవారం మంత్రి సుదర్శన్రెడ్డిని కలిసి ఇళ్లకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే కలెక్టర్తో మాట్లాడారు. 15 రోజుల్లోగా నగరంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, నివాసాలు కల్పించాలని సూచించారు. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం మంగళవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య పేదల గుడిసెలను కూల్చివేయించింది. కనీసం తమ వస్తువులను తీసుకుంటామని వేడుకున్నా కనికరం చూపలేదు. దీంతో బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుడిసెలు తీసి వేయడంతో తీవ్రమైన చలిలో చిన్న పిల్లలు, బాలింతలు వణుకుతూ గడిపారు. సుమారు 3 వందల కుటుంబాలు వీధిన పడ్డాయి. వారం క్రితమే.. నిజాంసాగర్ ప్రధాన కాలువ నందిగుట్ట ప్రాంతంలో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేశారు. వాటిని విక్రయించుకోవడానికి పేదలు అడ్డు ఉన్నారని భావించారు. వారిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఎత్తులు వేశారు. వారం క్రితం మంత్రిని కలసి సమస్యను వివరించారు. పక్కా ప్రణాళక ప్రకారమే గుడిసెలను కూల్చివేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకే.. గుడిసెలను తొలగించడంలో మా ప్రమేయం లేదు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే గుడిసెలను తొలగించాం. -యాదగిరిరెడ్డి, ఆర్డీఓ, నిజామాబాద్ -
సంక్షేమ ఫలాలు అందించేందుకే.. : సుదర్శన్రెడ్డి
మద్నూర్, న్యూస్లైన్ : ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే రచ్చబండ నిర్వహిస్తున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మా ర్కెట్ యార్డులో రచ్చబండ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సోయా ఎక్కువగా పండిస్తున్నారన్నారు. వచ్చే ఏడాది సోయా విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పుడు పింఛన్లు, రేషన్కార్డులు మంజూరు చేయడం దారుణమని ఎమ్మెల్యే హన్మంత్ సింధే విమర్శించారు. అంతకు ముందు మేనూర్లో మంత్రి సుదర్శన్రెడ్డి ఎస్సీ కమ్యూనిటీ భవణ నిర్మాణానికి శంకస్థాపన చేశారు. డబ్బులిస్తేనే స్థలం కేటాయిస్తారట! అధికారులకు డబ్బులిస్తేనే తమకు ఇండ్ల స్థలం కేటాయిస్తారట అని మొగాకు చెందిన ఈరేశం రచ్చబండ కార్యక్రమం మధ్యలో లేచి గట్టిగా మాట్లాడారు. నాకు సొంత ఇల్లు లేదని గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకొని ఉంటున్నానన్నారు. ఇంటి స్థలం ఇవ్వడానికి తహశీల్దార్ రవి, ఏఆర్ఐ అజయ్ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఈరేశంను పక్కకు లాక్కెళ్లారు. వెంటనే స్పందించిన బోధన్ సబ్కలెక్టర్ హరినారాయణన్ అతడి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. వారంలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహిళా సంఘాల అభివృద్ధికి కృషి.. బిచ్కుంద : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రుణాలు అందిస్తోందని మంత్రి సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బిచ్కుంద మార్కెట్ యార్డులో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సబ్ప్లాన్ ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్తోనే తెలంగాణ రాష్ర్టం సాధ్యమన్నారు. కౌలాస్నాలా ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి రూ. 5 కోట్లు ఇస్తున్నామని, లెండి ప్రాజెక్టు నిర్మాణానికి మన రాష్ట్ర వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. లెండి కాలువల నిర్మాణానికి భూమి ఇచ్చి సహకరించాలని రైతులను కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాలకు పావలా వడ్డీ రాయితీని పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కోసం వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, కలెక్టర్ ప్రద్యుమ్న, బోధన్ సబ్ కలెక్టర్ హరినారాయణన్, మాజీ ఎమ్మెల్యే అరుణాతార తదితరులు పాల్గొన్నారు. -
డైలమాలో అన్నదాత
మచిలీపట్నం, న్యూస్లైన్ : ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు దెబ్బతినడంతో రబీలో సా గునీటిని విడుదలచేస్తే దాళ్వా పంట సాగు చేసుకుంటామని రైతులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని వారు మంగళవారం మచిలీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి సారథిని అడిగారు. నూటికి నూరుశాతం సాగునీరు విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తానని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఇంతవరకు నీటిపారుదల సమీక్షా మండలి సమావేశం కూడా నిర్వహించలేదు. రబీకి నీటి విడుదల విషయంపై నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్రెడ్డిని ప్రశ్నిం చగా, ఆ జిల్లా నుంచి ఇంకా ప్రతిపాదనే రాలేదని, ప్రాజెక్టుల నీరు ఉందని చెప్పినట్లు ప్రచారం జరగడం జిల్లా నేతల పనితీరుకు అద్దం పడుతోంది. తిరుపతిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వద్దకు మంత్రి సారథి తదితరులు వెళ్లి సాగునీరు విడుదల చేయాలని కోరినా బుధవారం రాత్రి 9.30 గంటల వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు మానసిక సంఘర్షణకు లోనవుతుంటే పాల కులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గాంధారి, న్యూస్లైన్ : పేదల సంక్షేమం కోసం పాటు పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మం త్రి సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గత కాంగ్రేసేతర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. జి ల్లాలో గృహనిర్మాణాల కోసం రూ. 500 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మండలంలో 119 మంది ఆడ పిల్లలు బంగారు పథకంలో చేరారని, వారి పేర్లపై బ్యాంకుల్లో ఒక్కొక్కరికి రూ. 42 వేలు డిపాజిట్ చేసినట్లు చెప్పారు. కొత్తగా 1,353 మందికి రేషన్ కార్డులు మంజూరైనట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుతో కామారెడ్డి డివిజన్ సస్యశ్యామలంగా మారుతుందన్నారు. తాగడానికి గోదావరి జలాలు: సురేష్ శెట్కార్, ఎంపీ మండలంలో గిరిజనులు అధికంగా ఉన్నారని, మారుమూల గ్రామాలు, తండాలు వెనుకబడి ఉన్నాయన్నారు. తాగు నీటి ఎద్దడి అధికంగా ఉందని, ఈ సమస్య పరిష్కారం కోసం గోదావరి జలాలను సరఫరా చేయడానికి రూ.16 కోట్లు విడుదలయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు: ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అందకు ముందు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు ప్రచారం ఎక్కువ పని తక్కువ అని విమర్శించారు. పింఛన్లు, గృహ నిర్మాణాల కోసం వేలల్లో దరఖాస్తులు వస్తే, రేషను కార్డులు, పింఛన్లు నామమాత్రంగా మంజూరు చేశారని ఆరోపించారు. ఇళ్లు నిర్మించుకున్నవారు బిల్లులు రాక అధికారులు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. -
పంట నష్టం సర్వేలో రైతులకు అన్యాయం
=టీఆర్ఎస్ నేతల నిరసన =జేడీఏకు వినతిపత్రం వరంగల్ సిటీ, న్యూస్లైన్ : తుపాన్తో నష్టపోయిన పత్తి, మొక్కజొన్న రైతులకు సర్వే స్థాయిలోనే అన్యాయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండలోని జేడీఏ కార్యాలయం వద్ద సోమవారం టీఆర్ఎస్ ప్రతినిధులు నిరసన తెలియజేశారు. తుపాన్ ప్రభావం తగ్గిన పది రోజుల తర్వాత సర్వే చేపట్టడాన్ని వారు తప్పుబట్టారు. పంట చేలలో నీళ్ళుంటేనే పరిహారానికి అర్హులుగా భావించడం సరికాదన్నారు. ఈ మేరకు జేడీఎ రామారావుకు టీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని జేడీఎ రామారావు వారికి హామీ ఇచ్చారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ పెద్ది సుదర్శన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, డాక్టర్ రాజయ్యలు విలేకరులతో మాట్లాడారు. సర్వేలో లోపాలు నెలకొంటే పరిహారం రాకుండా పోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇప్పటికే నీలం తుపాన్ వల్ల రైతులు నష్టపోయినా పరిహారం రాకుండా పోయిందని గుర్తుచేశారు. తక్షణం స్పందించి సర్వేలో లోపాలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. 50శాతం పంట నష్టం వాటిల్లితేనే పరిహారం లభిస్తుందంటూ సర్వే బృందాలు చెప్పడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్వే బృందాలను నిర్బంధించిన విషయాన్ని వివరించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన చేపడుతామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో కరువొచ్చినా..తుపానొచ్చినా ఈ ప్రభుత్వాలు ఆదుకోవడంలో వివక్ష కనబరుస్తున్నారని విమర్శించారు. పరిహారానికి అర్హత పొందకుండా నిబంధనలు పెట్టి సర్వే స్థాయిలోనే పట్టించుకోవడం లేదన్నారు. పత్తి రైతులకు ఈ దఫా అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోకుంటే గ్రామాలకు వచ్చే అధికారులను, సిబ్బందిని నిర్బంధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జి ఆరూరి రమేష్, జిల్లా నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మార్నేని రవీందర్రావు, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు సెవెల్ల సంపత్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, టీఆర్ఎస్ నాయకుడు శంకర్నాయక్, యూత్ అర్బన్ నాయకులు చాగంటి రమేష్ తదితరులు ఉన్నారు. -
నేను సంతకం చేయ..!
పోలవరం ఫైల్పై సంతకం పెట్టేందుకు మంత్రి సుదర్శన్రెడ్డి విముఖత... తెలంగాణవాదుల నుంచి విమర్శలు వస్తాయనే ! చేసేది లేక మరో ఫైలు రూపొందించిన అధికారులు దాన్ని నేరుగా సీఎం వద్దకు పంపిన వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ర్టం అప్పుడే విడిపోయిందా? మంత్రుల తీరు చూస్తే.. ఈ అనుమానమే కలుగుతోంది. ఒక ప్రాంతానికి చెందిన మంత్రి మరో ప్రాంతానికి సంబంధించిన ఫైల్పై సంతకాలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్రెడ్డి తీరు ఇలాగే ఉంది. ఆయన వ్యవహార శైలి అధికారులను నివ్వెరపాటుకు గురి చేసింది. పోలవరంపై కీలక నిర్ణయం తీసుకునే ఫైల్పై నెలల తరబడి సంతకం చేయకుండా మంత్రి తొక్కి పెట్టారు. ఈ ఫైల్ సంతకం చేస్తే... తెలంగాణవాదుల నుంచి తనపై విమర్శలు వస్తాయని భావిస్తున్న మంత్రి ఆ ఫైల్ను తొక్కి పెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈ ఫైల్కు సమాంతరంగా మరో ఫైల్ను తయారు చేశారు. దాన్ని మంత్రికి పంపకుండా నేరుగా ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపించారు. ఏమిటా ఫైలు..?: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశాయి. దీనిపై అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం మూడు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఇందులో పక్క రాష్ట్రాలు కొన్ని డిమాండ్లను మన రాష్ర్టం ముందుంచాయి. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను పేర్కొన్నారు. ఈ పనులన్నింటిని మన రాష్ట్రమే చేయాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్రానికి ప్రత్యేక నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నివేదిక అందజేస్తేనే.. పోలవరానికి ఇచ్చే జాతీయ హోదాపై కేంద్రం ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఇంతటి ముఖ్యమైన విషయం కావడంతో అధికారులు ప్రత్యేక ఫైల్ను రూపొందించి అనుమతి కోసం మంత్రి సుదర్శన్రెడ్డికి పంపించారు. అయితే ఆయన ఫైల్పై సంతకం చేయకుండా పక్కన పెట్టారు. కేంద్రానికి నివేదిక పంపించే గడువు ముగుస్తున్నా... మంత్రి వద్ద ఫైల్ క్లియర్ కాకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఫైల్ పెండింగ్ ఉందనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా.. అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఫైల్పై సంతకం పెట్టే ఉద్దేశం మంత్రికి లేదని ఆయన కార్యాలయంలోని సిబ్బంది వెల్లడించారు. దాంతో ఉన్నతాధికారులు మరో ఫైల్ను తయారు చేసి నేరుగా సీఎం ఆమోదానికి పంపారు. సీఎం సంతకం అయిన తర్వాత కేంద్రానికి నివేదికను పంపించారు. పోలవరం నిర్మాణాన్ని తెలంగాణలోని కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... ఫైల్పై సంతకం చేస్తే తెలంగాణ వాదుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే మంత్రి సంతకం చేయలేదని తెలుస్తోంది. -
తెలంగాణ రాష్ట్రం ఖాయం మంత్రి సుదర్శన్రెడ్డి
గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం వినూత్న పథకాలను రూపొందిస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంతో పాటు పొతంగల్, మిట్టాపూర్, నందిగామ, తడగామ గ్రామాలలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీపేటలోని రఘుపతిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనుకునే నిశ్చయంతోనే రుణ సదుపాయాన్ని పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. సంఘాలలోని మహిళలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే మరిన్ని సేవలను పొందవచ్చన్నారు. మహిళలను సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించాలనే దృక్పథంతోనే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. స్త్రీనిధి, బంగారుతల్లి పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మండలానికి రూ. 20 నుంచి రూ.30 లక్షలు ఇస్తామనే హామీ ఇచ్చారన్నారు. నిధులతో ఎంపిక చేసిన గ్రామాలలో భవనాలను నిర్మించుకోవాలన్నారు. స్త్రీనిధి సంక్షేమానికి వచ్చిన చెక్లను ఆయన మహిళా సంఘాల అధ్యక్షులకు ఆయన అందజేశారు. 18న బోధన్లో కృతజ్ఞత సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక ఆగదని మంత్రి సుదర్శన్రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈనెల 18న బోధన్లో సభను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా జరిగే సభకు అన్నివర్గాల వారు హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కల్లు, మద్య పానాన్ని వీడి యువకులు ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని సాధించేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, ఐకేపీ పీడీ వెంకటేశ్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉషారాణి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సోనియా కృషితోనే తెలంగాణ
బోధన్,న్యూస్లైన్ : ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కృషితోనే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కాబోతోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, యుపీఏ ప్రభుత్వం తెలంగాణకు కట్టుబడి ఉన్నాయన్నారు. మంగళవారం బోధన్లోని అంబేద్కర్ చౌరస్తా, తట్టికోట కాలనీలో మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక పథకాలు అమలు చేస్తోం దన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం లో వృద్ధాప్య పింఛన్ నెలకు 75 రూపా యలు ఉండగా, తమ ప్రభుత్వం దానిని రెండు వందల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. పట్టణ వాసుల సాగు, తాగు నీటికి ఆధారమైన బెల్లాల్ చెరువుకు మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరించానని తెలిపారు. రబీకి నిజాంసాగర్ నీళ్లు అందిస్తామని వెల్లడించారు . సాగర్ నీటిని రైతులు వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచిం చారు. ఈ సందర్భంగా ఇదే కాలనీకి చెంది న సూర లింగారెడ్డి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ గంగాశంకర్, సీడీసీ చైర్మన్ పోతారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పాషామోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
విభజనతో నీటియుద్ధాలు రావు.. ఇది నిజం
రాష్ట్ర విభజన వల్ల నీటి కేటాయింపులో ఎలాంటి సమస్యా రాదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి చెప్పారు. విభజన వల్ల నీటి యుద్ధాలు తప్పవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సుదీర్ఘ విలేకరుల సమావేశంలో కుండ బద్దలుకొట్టి మరీ చెప్పిన విషయాలను రాష్ట్ర మంత్రి మంగళవారం ఖండించారు. విభజన ప్రక్రియ మొదలుకాగానే అందులో భాగంగా కమిటీలు ఏర్పాటు చేస్తారని, తద్వారా జలాల పంపిణీ కూడా సక్రమంగానే సాగుతుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. నీటి యుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి ఏం చెప్పాడో తనకు తెలియదు గానీ.. తాను చెప్పేది మాత్రం నిజమని ఆయన వెల్లడించారు. -
జిల్లా కేంద్రం నుంచి పెద్దాస్పత్రి బోధన్కు తరలింపు
కంఠేశ్వర్, న్యూస్లైన్ : జిల్లా కేంద్రం నుంచి పెద్దాస్పత్రిని మంత్రి పి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గమైన బోధన్కు తరలించడం దాదాపుగా ఖరారైంది. రెండు రోజుల క్రితం ఇక్కడి నుంచి 23 మంది వైద్య ఉద్యోగులను బోధన్కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కేం ద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అనంతరం జిల్లా ఆస్పత్రిని తరలించడం అనివార్యమైంది. ఇదివరకే జిల్లా జాయింట్ కలెక్టర్ బోధన్లో స్థలపరిశీలన చేశారు. అయితే ఇటీవల వైద్యవిధాన పరిషత్ కమిషనర్ నాగార్జున బోధన్ ఆస్పత్రిని పరిశీలించారు. జిల్లా ఆస్పత్రిని ఇక్కడే ఏర్పాటు చేసేందుకు పడకల స్థాయి పెంపుపై సమీక్షించారు. పెద్దాస్పత్రి ఏర్పాటుతో బోధన్ చుట్టు పక్కల కోటగిరి, వర్ని, రెంజల్, ఎడపల్లి, మండలాలకు మైద్య సేవలు మెరుగుపడతాయి. ఇది లా ఉండగా జిల్లా ఆస్పత్రిని బాన్సువాడకు తరలించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఉండే బాన్సువాడ వెనుకబడిన ప్రాంతమైనందున వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. బాన్సువాడ మూడు నియోజక వర్గాలు, 16 మండలాలకు కేంద్ర బిందువుగా ఉంది. జుక్కల్, మద్నూరు, పిట్లం, బిచ్కుంద, బీర్కూర్, నిజాంసాగర్, వర్ని, ఎల్లారెడ్డి తది తర మండలాలు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. అధికారులు కూడా బాన్సువాడకే ఆస్పత్రిని తరలించాలని మొదట భావిం చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో బాన్సువాడ ఆస్పత్రిలో ఔట్పేషెంట్లు 18246 మంది, ఇన్ పేషెంట్లు 2744 మంది, బోధన్లో ఔట్ పేషెంట్లు 16,627 మంది , ఇన్పేషెంట్లు 948 మంది నమోదు అయ్యారు. జూన్లో బాన్సువాడలో ఔట్పేషెంట్లు 15686 మంది, ఇన్పేషెంట్లు 1749 మంది, బోధన్లో ఔట్పేషెంట్లు 16068 మంది, ఇన్పేషెంట్లు 972 మంది నమోదు అయ్యారు. జూలైలో బాన్సువాడలో ఔట్పేషెంట్లు 15553 మంది, ఇన్పేషెంట్లు 1591 మం ది, బోధన్లో ఔట్పేషెంట్లు 16647 మం ది, ఇన్పేషెంట్లు 970 మంది నమోదు అయ్యారు. ఈ వివరాల ప్రకారం రోగుల తాకిడి బాన్సువాడకే ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. బాన్సువాడకే తరలించాలి.... జిల్లా ఆసుపత్రిని బాన్సువాడకే తరలించాలి. వెనుకబడిన ప్రాంతం కాట్టి మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది. లేదంటే ఆందోళనలు చేసైనా సాధించుకుంటాం. -శ్రీనివాస్గౌడ్, జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ ఉన్నతాధికారుల నిర్ణయమే.. జిల్లా ఆస్పత్రి తరలింపు రాష్ట్ర ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం జరుగుతుంది. తరలింపుపై పరిశీలన జరుగుతుంది. వారం రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. -బాలకృష్ణరావ్, ఇన్చార్జి డీసీహెచ్ఎస్ -
నీటి ఆందోళనలపై నిపుణుల కమిటీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో నీటి పంపకాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలను పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నీటి పంపకాలపై ప్రజల్లో, ముఖ్యంగా సీమాంధ్రుల్లో నెలకొన్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే పోలవరం నిర్మాణం ఆగిపోతుందని, ఆ ప్రాజెక్టుకు నీటి లభ్యత ఉండదని, కృష్ణా బేసిన్లో రాయలసీమ ప్రాజెక్టులకు చుక్క నీరు రాదని, డెల్టా ఆయకట్టు ఎండిపోతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. వీటిని దృష్టిలో ఉంచుకుని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుతో సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయనే అంశాన్ని ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీ ఏర్పాటు విషయమూ భారీ నీటిపారుదల మంత్రి సుదర్శన్రెడ్డి రెండు రోజులుగా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. మంగళవారం కూడా దీనిపై ఉన్నతాధికారుల సమీక్ష జరిగింది. సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, నిపుణులు విద్యాసాగర్రావు, రోశయ్య, ప్రభాకర్రెడ్డి, అనంతరాములు, కేఎన్ఎస్ రెడ్డి, ఈఎన్సీలు మురశీధర్, నారాయణరెడ్డి, వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం వంటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు పూర్తయి, నీటి వాడటం మొదలైతే దిగువన చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు నీటి కొరత ఏర్పడుతుందని గోదావరి జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నదిలో వచ్చే నీరు ఎగువ ప్రాంత ప్రాజెక్టులకే సరిపోతుందని, దాంతో పోలవరానికి నీటి కొరత ఏర్పడుతుందని అంటున్నారు. వరదలప్పుడు ఇబ్బందులుండకపోయినా వర్షాభావం నెలకొనే సంవత్సరాల్లో మాత్రం పోలవరానికి నీటి కొరత ఉంటుందని దిగువ ప్రాంతంలో ఆందోళన ఉంది. అలాగే రాష్ర్ట విభజన జరిగితే పోలవరం నిర్మాణానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్న వాదన ఉంది. అలాగే కృష్ణా పరీవాహక ప్రాంతం విషయంలో కూడా సీమాంధ్రుల్లో ఆందోళన ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాయలసీమకు నీరందించే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులతో పాటు కృష్ణా డెల్టా రైతులు కూడా తమకు నీటి కొరత తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై వేయనున్న కమిటీలో నీటిపారుదల రంగ నిపుణులను సభ్యులుగా నియమించే అవకాశముంది. దీనికి ప్రభుత్వాధికారి సారథ్యం వహించాలా, లేక రిటైర్ట్ ఇంజనీరా అన్నదానిపై తుది నిర్ణయానికి రాలేదు. తెలంగాణ ఏర్పడ్డాక నీటి పంపకాల్లో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ప్రజలకు వివరించే దిశగా కమిటీ పని చేయాలన్నది ప్రభుత్వ భావన అంటున్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించే అవకాశముంది. -
ఎన్నికలే లక్ష్యం..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో వేడి పెరిగింది. ఆ పార్టీ నేతలు గెలుపుకోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా మంత్రి సుదర్శన్రెడ్డి ఎక్కువగా తన నియోజకవర్గంపైనే దృష్టి సారించి కార్యక్రమాలు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ప్రజలకు చేరువ కావడానికి యత్నిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం ఇచ్చిన ఊపుతో ముందుకు సాగుతున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన కాలంలో ఈ ప్రాంతంలో పర్యటించడానికే అధికార పార్టీ నేతలు భయపడ్డారు. ఆందోళనలకు వెరసి నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గమైన బోధన్పైనే ఎక్కువగా దృష్టి సారించారు. జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలను బోధన్ నియోజకవర్గంలోనే నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం, ఇటీవల జరిగిన సహకార సంఘాలు, పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో అప్రమత్తమైన ఆయన తన నియోజకవర్గంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలపై దృష్టి సారించి, కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేశ్ కమార్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్లు సైతం రూరల్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బాల్కొండలో ప్రభుత్వ విప్ అనిల్, ఆర్మూర్లో మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి, కామారెడ్డిలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రజల మధ్యకు వెళుతున్నారు. అభివృద్ధి పనులతో.. నవీపేట మండలం శాఖాపూర్ వద్ద రూ. 4.73 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రి సుదర్శన్రెడ్డి వారం క్రితం ప్రారంభించారు. ఈ పథకంతో మండలంలోని మంత్రి సొంత గ్రామమైన సిరన్పల్లితోపాటు శాఖాపూర్, బినోల, లింగాపూర్, నిజాంపూర్ పరిధిలోని 2,052 ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా జిల్లాలో 3.05 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందంచే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సొరంగ మార్గం పనులు బోధన్ నియోజక వర్గం పరిధిలో సాగుతున్నాయి. వీటిని వేగవంతం చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమీక్షించడంతో పాటు నీటివనరుల పెంపుదల కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ నుంచి బోధన్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ. 30 కోట్లు మంజూరు చేయించిన మంత్రి.. పనులు వేగంగా సాగేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నీటివనరుల పెంపులో భాగంగా బోధన్ మండలం పెద్దమావిడి వద్ద రూ. 10 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పనులు పూర్తయితే రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాలూరా ఎత్తిపోతల పథకానికి సంబంధించి పైపులైన్ల నిర్మాణం కోసం రూ. 42 లక్షలు మంజూరు చేయించి పనులు జరిగే విధంగా కృషి చేస్తున్నారు. నవీపేట మండలంలో 4 ఎత్తిపోతల పథకాల మరమ్మతుల కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పనులే అన్న విమర్శలున్నప్పటికీ ప్రజలకు ఎంతోకొంత మేలు జరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. -
సాగునీటి ప్రాజెక్టులపై నేటినుంచి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, ఐదేళ్ల క్రితం మంజూరు చేసి, ఇప్పటికీ పనులు మొదలుపెట్టని ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేసి వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. పనులు నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాటు నిర్మాణాలు చివరిదశలో ఉన్న ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడానికి వీలుగా ప్రభుత్వం ఈ నెల 6, 7వ తేదీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. రాష్ర్ట సాగునీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి సమక్షంలో జరిగే ఈ సమావేశానికి శాఖ ముఖ్యకార్యదర్శులు, ఈఎన్సీలు, సీఈలు హాజరుకానున్నారు. సుమారు ఐదేళ్ల క్రితం దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఖరారు చేశారు. దీని నిర్మాణ పనులు ఇంకా మొదలుకాలేదు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం కూడా పక్కకు పడిపోయింది. ఐదేళ్ల క్రితమే దీని నిర్మాణానికి అనుమతి ఇచ్చినా ఇప్పటికీ టెండర్లను కూడా ఖరారు చేయలేదు. ఇక కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, బీమా, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఎల్లంపల్లి, దేవాదుల, పులిచింతల వంటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు. ప్రాజెక్టులు పూర్తికాక ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 3,500 టీఎంసీల నీరు సముద్రంపాలయింది. అలాగే కృష్టా నీటిని కూడా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వీటి పరిస్థితిని శుక్రవారం నుంచి జరిగే సమావేశాల్లో సమీక్షించనున్నారు. -
సీమాంధ్రులకు భద్రత కల్పిస్తాం: సుదర్శనరెడ్డి
హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోని సీమాంధ్రవాసులకు భద్రత కల్పిస్తామని రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన నిజామాబాద్లో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. కేబినెట్ పరంగా సీమాంధ్రులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సీమాంధ్రులు ఎటువంటి అభద్రతాభావానికి లోనుకావద్దని ఆయన స్పష్టం చేశారు. నీటి పంపిణిలో కూడా ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదన్నారు. ఓ వ్యక్తి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆందోళన చెందవద్దని ఆయన సీమాంధ్రవాసులకు సూచించారు. అన్ని ప్రాంతాల న్యాయమైన పంపిణీని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి సుదర్శన్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్లవలసిందే అని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. వారికి ఎటువంటి అప్షన్లు ఉండవని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో హైదరాబాద్లోని సీమాంధ్ర ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైనాయి. దాంతో సచివాలయం నుంచి సీమాంధ్రలోని మారుమూల పల్లె వరకు కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.