-
టేస్టీ తేజ కొత్త బిజినెస్.. రేపే షురూ
టేస్టీ తేజ.. యూట్యూబర్. అతడి పేరులోనే తను చేసే పనేంటో అర్థమవుతోంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి హోటల్ ప్రమోషన్స్ చేసేవాడు. జబర్దస్త్లోనూ ఛాన్స్ సంపాదించుకున్నాడు. తర్వాత తన పాపులారిటీ పెరిగి సినిమా ప్రమోషన్స్ సైతం చేశాడు. మొన్నామధ్య బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్కు సైతం వెళ్లివచ్చాడు. నాలుగైదు సినిమాల్లోనూ నటించినట్లు తెలుస్తోంది తాజాగా తేజ ఓ కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నాడు. ఇరానీ నవాబ్స్ పేరిట ఛాయ్ హోటల్ పెడుతున్నట్లు వెల్లడించాడు. 'నేను కొత్తగా ఓ ప్రయాణం మొదలుపెడుతున్నాను. ఈ ప్రయాణంలో నాతోపాటు మీరు.. మనందరం కలిసి ఎదుగుదాం, సాధిద్దాం.. సంపాదిద్దాం..' అంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఏప్రిల్ 6న ఉప్పల్లో చాయ్ బిజినెస్ మొదలుపెడుతున్నట్లు పేర్కొన్నాడు. ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ ఔట్లెట్ ఓపెనింగ్కు బిగ్బాస్ ఫేం అమర్దీప్ ముఖ్య అతిథిగా హాజరవనున్నాడు. ఎవరీ తేజ తేజ అసలు పేరు కల్లం తేజ్దీప్. తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, ఆదిలక్ష్మి. హైస్కూలు వరకు తెనాలిలో చదివి తర్వాత విజ్ఞాన్ యూనివర్శిటీలో ఇంటర్, బీటెక్, ఎంటెక్ చేశాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగంతో 2017లో హైదరాబాద్ వెళ్లాడు. వీకెండ్లో ఫుడ్ వీడియోలు చేసి పాపులర్ అయ్యాడు. View this post on Instagram A post shared by Irani Nawabs (@iraninawabs) చదవండి: OTT: నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం -
వాలెంటైన్స్ డే సందర్భంగా ‘6th జర్నీ’ నుంచి లవ్ సాంగ్
పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా ‘ఆకాశంలోని చందమామ’ అనే సాంగ్ను విడుదల చేశారు. మూవీకి ఎం.ఎన్.సింహ సంగీత సారథ్యం వహింస్తున్నారు. రామారావు మాతుమూరు రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. ఈ సందర్భంగా... దర్శకుడు బసీర్ ఆలూరి,నిర్మాత పాళ్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా అరుణకుమారి ఫిలింస్ బ్యానర్లో రూపొందుతున్న ‘6జర్నీ’ మూవీ నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ‘ఆకాశంలోని చందమామ..’ అనే పాటను విడుదల చేస్తున్నాం. ప్రేమ, థ్రిల్లింగ్ సహా అన్ని ఎలిమెంట్స్తో ‘6జర్నీ’ తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాలో రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి, అభిరాం, సంజయ్ ఆచార్య, జబర్దస్త్ చిట్టిబాబు తదితరులు నటించారు. బసీర్ అలూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. - పోడూరి నాగ ఆంజనేయులు -
'మీరు నాకు అన్యాయం చేశారు'.. ఆట సందీప్పై టేస్టీ తేజ పోస్ట్ వైరల్!
బిగ్బాస్ రియాలిటీ షో ఎంతోమంది ఫేమస్ అవుతున్నారు. వారిలో చాలామంది సెలబ్రిటీలయ్యారు కూడా. అలానే ఈ ఏడాది సీజన్-7లో కొందరు సినీ ఇండస్ట్రీతో సంబంధంలేనివారు కూడా ఎంట్రీ ఇచ్చారు. బిగ్బాస్ షోలో అడుగుపెట్టగానే వారికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అలాంటి వారిలో ఫేమస్ అయిన యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ. హౌస్లో అందరినీ అలరించిన టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అతనితో పాటు బిగ్బాస్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్న శుభశ్రీ రాయగురు, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కూడా హోస్ నుంచి బయటకొచ్చేశారు. వీరంతా కలిసి బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లికి హాజరయ్యారు. అయితే వీరు ముగ్గురు కలిసి పెళ్లిలో సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ చిల్ అవుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే పెళ్లి వేడుకలో ఆటసందీప్, శుభశ్రీ కలిసి ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇది చూస్తూ పక్కనే ఉన్నా టేస్టీ తేజ వాళ్లద్దరి కెమిస్ట్రీని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో వాళ్లిద్దరూ డ్యాన్స్ చేయడాన్ని చూస్తూ పక్కనే ఉన్న చెట్టుకు తల బాదుకుంటూ కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది చాలా అన్యాయం సార్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇదంతా టేస్టీ తేజ సరదా కోసమే చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
ఆ ఒక్క ప్రశ్న అడగొద్దంటున్న తేజ.. ఇలా దొరికిపోయాడేంటి!
టేస్టీ తేజ.. సందీప్ మాస్టర్.. ఇద్దరూ హౌస్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎలిమినేట్ అయ్యాకే అసలు గొడవ మొదలైంది.. ఎనిమిది వారాలుగా నామినేషన్స్లోకి రాకుండా తనను తాను కాపాడుకుంటూ వస్తున్న సందీప్ను నామినేషన్స్లోకి లాక్కొచ్చాడు తేజ. దీంతో ఆ వారమే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. దీన్ని ఆయన మనసులో పెట్టుకున్నాడు. అంతేకాదు, తేజ ఎలిమినేట్ అవుతున్నాడనగానే ఎగిరి గంతేశాడు. అందరినీ ఎలిమినేట్ చేస్తూ చివరకు తనే ఎలిమినేట్ అయ్యాడు అని సెటైర్లు కూడా వేశాడు. ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం? అయితే సందీప్ మాస్టర్ను కావాలని నామినేట్ చేయలేదని, తనే అడిగి చేయించుకున్నాడని బిగ్బాస్ హౌస్లో కుండ బద్ధలు కొట్టి చెప్పాడు తేజ. అది అబద్ధం, నేనెందుకు అడిగి మరీ చేయించుకుంటానని ఆగ్రహించాడు సందీప్. ఈ విషయం దగ్గరే గొడవ మొదలైంది. వీరిద్దరిలో ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం? అనేది అర్థం కాక అభిమానులు తల పట్టుకుంటున్నారు. తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తేజకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. సందీప్ మాస్టర్ నిన్ను అడిగి మరీ నామినేట్ చేయించుకున్నాడా? అని యాంకర్ అడిగాడు. తటపటాయించిన తేజ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు తేజ తటపటాయించాడు. 'హౌస్ లోపల ఏం జరిగిందనేది మీకు తెలియదు. దీని గురించి ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు. సందీప్, నేను కలిసి ఈ విషయంపై ఓ వీడియో చేస్తాం' అంటూ ఆ ప్రశ్న దాటవేశాడు. తర్వాత ఏ ప్రశ్నలడిగినా టపీమని సమాధానాలు చెప్పుకుంటూ పోయిన తేజ ఈ ఒక్క విషయంపై మాత్రం మాట్లాడటానికే ఇష్టపడలేదు. దీంతో తప్పు తేజదేనా? అతడు కావాలనే అబద్ధం చెప్పి ఉంటాడా? అని అనుమానిస్తున్నారు జనాలు. సమాధానం చెప్పను అంటున్నాడంటే కచ్చితంగా తప్పు చేసినట్లే.. తేజ అడ్డంగా దొరికిపోయాడు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఓ టాస్కులో తనకు తెలియకుండానే గౌతమ్ను గట్టిగా కొట్టాడు తేజ. అందుకు అతడి ఇంటికి వెళ్లి మరీ గౌతమ్ పేరెంట్స్కు సారీ చెప్తానంటున్నాడు. చదవండి: తేజ తొమ్మిది వారాల్లో ఎంత సంపాదించాడంటే? -
తేజ ఎలిమినేట్.. వారికి రీ ఎంట్రీ ఛాన్స్
బిగ్ బాస్ సీజన్ - 7 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. 9 వారాల పాటు ఆటలొ కొనసాగిన ఆయన పాజిటివిటీని సంపాదించుకుని హౌస్ నుంచి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో ఇప్పటికే 8 వారంలోనే ఎలిమినేట్ అయిన ఆట సందీప్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకు వారు కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు. ఎనిమిదో వారంలో సందీప్ నామినేషన్ లిస్ట్లోకి రావడానికి ప్రధాన కారణం తేజ అని తెలిసిందే.. అలా మొదటిసారి నామినేట్ కావడం ఆపై సందీప్ ఎలిమినేషన్ అవడం జరిగిపోయింది. అదే విధంగా తేజ ఎలిమినేషన్కు కారణం శివాజీ.. నామినేషన్ సమయంలో సందీప్ అంశాన్ని లేవనెత్తి తేజను నామినేట్ చేశాడు శివాజీ... ఇలా ఈ ముగ్గురి మధ్యనే గేమ్ నడిచింది. బిగ్ బాస్లో ఉన్నంత వరకు అమర్,శోభ బ్యాచ్లో సందీప్ ఉన్నాడు.. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా శివాజీ, పల్లవి ప్రశాంత్నే మెచ్చుకుంటూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే సమయంలో అమర్,తేజ ఆట గురించి నెగటివ్గా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే రతికా రోజ్కు రీ ఎంట్రీ అవకాశం ఇచ్చారు.. కానీ ఆమె అంతగా మెప్పించలేక పోయింది. దీంతో సందీప్కు ఉల్టాపుల్టా పేరుతో రీ ఎంట్రీ అవకాశం కల్పించాలని బిగ్బాస్ టీమ్ కూడా యోచిస్తుందట. అప్పుడు సందీప్ శివాజీ టీమ్ వైపు ఉంటాడా..? అమర్ బ్యాచ్ వైపు ఉంటాడా..? అనే విశయంలో రసవత్తరం మొదలౌతుంది. అన్నీ అనుకూలిస్తే మరో రెండు రోజుల్లో సందీప్ రీ ఎంట్రీ గ్యారెంటీ అని సమాచారం. బిగ్ బాస్లో సంచాలక్గా మాత్రమే ఆయన కొన్ని తప్పులు చేశాడు కానీ ఆటలో ఎక్కడా కూడా సహనం కోల్పోలేదు.. ఎలాంటి నెగటివ్ లేకుండా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. -
తేజ అవుట్.. తను లేకుండా ఉండలేనంటూ శోకమందుకున్న శోభ
బిగ్బాస్ హౌస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆల్రెడీ లీకవడంతో ఎపిసోడ్లో పెద్ద పస లేకుండా పోయింది. అయితే అటు తేజ కన్నా రతిక తానెక్కడ ఎలిమినేట్ అవుతుందోనని తెగ భయపడిపోయింది. ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని నాగ్ను అర్థించింది. ఇంతలో తేజ ఎలిమినేట్ అనడంతో ఊపిరి పీల్చుకుంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి(నవంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన.. నాగార్జున కొన్ని సామెతలను ఇచ్చి అది ఎవరికి బాగా సూటవుతుందో చెప్పాలన్నాడు. భోలె షావళి.. అమర్ది కుక్క తోక వంకర అన్నాడు. అమర్.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అనే బోర్డును అశ్విని మెడకు తగిలించాడు. ప్రశాంత్ ఏకులా వచ్చి మేకులా తగిలాడన్నాడు అర్జున్. ఇక తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిపడతాడని చెప్పాడు ప్రశాంత్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత అశ్వినికి బాగా సూటవుతుందని అభిప్రాయపడింది ప్రియాంక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? భోలె షావళి.. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న అని పేర్కొంది రతిక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అనేది రతిక విషయంలో నిజమైందన్నాడు గౌతమ్. పొరుగింటి పుల్లకూర రుచి అనే బోర్డు భోలెకు వేశాడు తేజ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమనే బోర్డు శివాజీకి వేశాడు ప్రిన్స్ యావర్. వేలు ఇస్తే చేయి గుంజినట్లు అనే బోర్డును ప్రియాంక మెడలో వేసింది అశ్విని. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అనే సామెత తేజకు పర్ఫెక్ట్గా సూటవుతుందన్నాడు శివాజీ. ఇటు రా అంటే ఇల్లంత నాదే అన్నట్లుగా తేజ ప్రవర్తిస్తాడంది శోభ. ఎలిమినేషన్ భయంతో ఏడ్చేసిన రతిక తర్వాత జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్ర యూనిట్ రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. వీరు హౌస్మేట్స్తో హుక్ స్టెప్ గేమ్ ఆడించి వెళ్లిపోయారు. తర్వాత తెలుగమ్మాయి ఈషా రెబ్బ హౌస్లోకి వెళ్లి పీరియడ్స్ సమస్యల గురించి మాట్లాడి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అనంతరం నాగ్ అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరగా రతిక, తేజ మాత్రమే మిగిలారు. ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని రతిక తెగ ఏడ్చేసింది. చివరకు తేజ ఎలిమినేట్ అనగానే రతికకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఇక తేజ ఏడవకూడదనుకుంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. శోభకు ఎక్కువ మార్కులిచ్చిన తేజ ఇక్కడ మరో విషయం ఏంటంటే.. తేజ కంటే శోభ ఎక్కువ ఏడ్చింది. అందరికీ వీడ్కోలు పలికేముందు హౌస్మేట్స్కు మార్కులు ఇచ్చాడు తేజ. శోభకు పదికి 20 మార్కులిచ్చాడు. గౌతమ్కు 8, అర్జున్కు 8 మార్కులిచ్చాడు. ప్రిన్స్ యావర్కు 10, భోలె షావళికి 7మార్చులిచ్చాడు. ఆటపరంగా ఓకే కానీ మాటతీరు మార్చుకోవాలంటూ అశ్వినికి 8 ఇచ్చాడు. ఓటమిని తీసుకోలేడంటూ ప్రశాంత్కు 9, వంటలక్క ప్రియాంకకు 10, అమర్దీప్కు 9, శివాజీకి 8, రతికకు 5 మార్కులిచ్చాడు. అంటూ ఏడుపందుకున్న శోభ సెలవు తీసుకోవడమే ఆలస్యం అనుకునే సమయానికి శోభ మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది. ఇక్కడ నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియట్లేదు, భయమేస్తోంది తేజ అంటూ శోకమందుకుంది. నీతో ఒక్కరోజు మాట్లాడకుండా ఉన్నందుకే ఏదోలా ఉంది.. అలాంటిది నువ్వు లేకుండా హౌస్లో చాలా రోజులు ఉండాలంటే భయమేస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్లో ఉన్నప్పుడు నువ్వెవరు? అంటూ గడ్డిపోచ కన్నా హీనంగా చూసిన శోభ తనకోసం ఏడుస్తున్నందుకు సంతోషపడాలా? బాధపడాలా? తెలియని అయోమయంలో ఉన్న శోభ ఎప్పటిలాగే చిరునవ్వుతో వీడ్కోలు తీసుకున్నాడు. చదవండి: తొమ్మిది వారాల్లో తేజ అంత సంపాదించాడా? ఎలిమినేషన్కు కారణమిదే! -
బిగ్బాస్ 7: తొమ్మిది వారాలకు తేజ ఎంత సంపాదించాడంటే?
టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే భోజన ప్రియుడు.. కాదు కాదు, భోజన ప్రియుడు కాబట్టే ఆ పేరు పెట్టుకున్నాడు. బిగ్బాస్ హౌస్లోనూ తన పేరుకు న్యాయం చేస్తూ గుడ్లు దొంగతనం చేస్తూ, స్ప్రైట్ల కోసం కక్కుర్తి పడేవాడు. ఈ పోరాటం ఏదో ఆటలో కూడా చూపిస్తే ఇంకొన్నాళ్లు ఉండేవాడు. కానీ, అన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయే తేజను చూసి జనాలు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే ఈవారం అతడిని బిగ్బాస్ ఇంటి నుంచి బయటకు పంపించారు. గొప్పగా ఆడకపోవచ్చు. కానీ.. నిజానికి తేజ మరీ తొమ్మిది వారాలదాకా ఉంటానని అనుకోలేదట. ఏదో నాలుగువారాలు ఉండిపోదాంలే అనుకున్నాడట. కానీ తొమ్మిదివారాల దాకా ప్రేక్షకులు తనను హౌస్లో ఉంచడంతో తనను తనే నమ్మలేకపోతున్నాడు. నిజంగానే తేజ గొప్పగా ఆడకపోవచ్చు. కానీ కడుపుబ్బా నవ్వించాడు. అందరితోనూ కలుపుగోలుగా ఉన్నాడు. చిన్నపాటి గొడవలు జరిగినా సర్దుకుపోయే మనస్తత్వం తనది. అదే సమయంలో పుల్లలు పెట్టి అందరి మధ్య చిచ్చు పెట్టే నారదుడు కూడా! భలే సేఫ్గా ఆడేవాడు.. ఒకరి మాటను మరొకరికి చెప్పి వాళ్ల మధ్య అగ్గి రాజేసేవాడు. కొన్నిసార్లు అవతలి వారు ఏమీ అనకపోయినా నిన్నిలా అన్నారు, ఆ మాటన్నారు.. అని లేనిపోనివి చెప్పి కారాలు, మిరియాలు నూరేవాడు. కొన్నిసార్లు అడ్డంగా బుక్కయ్యాడు కూడా! నామినేషన్స్లోనూ భలే సేఫ్గా ఆడేవాడు. ఎదుటివారిని నొప్పించకుండా తను డేంజర్ జోన్లోకి రాకుండా విశ్వప్రయత్నాలు చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను నామినేషన్స్లోకి పంపించేవాడు. రెమ్యునరేషన్ ఎంతంటే? అలా అతడు నామినేట్ చేసినవాళ్లు కొందరు ఎలిమినేట్ అయ్యారు కూడా!. కానీ ఈ వారం తేజ ఎలిమినేషన్ కత్తికి బలైపోయాడు. తొమ్మిది వారాలు హౌస్లో ఉన్న అతడు బాగానే వెనకేశాడు. వారానికి దాదాపు రూ.1.75 లక్షల మేర తీసుకున్నాడట. ఈ లెక్కన తొమ్మిది వారాలకుగానూ రూ.15 లక్షల పైనే వెనకేసినట్లు తెలుస్తోంది. -
బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్
మూడో వారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభ శ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో పూజా.. ఎనిమిదో వారంలో సందీప్.. ఇలా మూడో వారం నుంచి ఎనిమిదవ వారం వరకు వరుసగా తేజా ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు. అయితే వరుసగా అందర్ని బయటకు పంపిన తేజ.. ఇప్పుడు తనే బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పటికీ అధికారికంగా తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. బిగ్బాస్ హౌస్ నుంచి ఈ వారం నామినేషన్లో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని మినహా మిగతా అందరూ ఉన్నారు. ప్రతి వారం మాదిరే ఈ వారంలో కూడా శోభా ఎలిమినేట్ అవతుందని అందరూ భావిస్తున్న సమయంలో ఆమె కెప్టెన్ కావడంతో సస్పెన్స్ మొదలైంది. కెప్టెన్ పేరుతో శోభ సేవ్ అయితే.. టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం దాదాపు గ్యారెంటీ అని తెలుస్తోంది. దీంతో తేజ గురించి పలు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఆట సందీప్ షేర్ చేశాడు. బిగ్బాస్ హౌస్లో మొదటి వారం నుంచి ఇప్పటివరకు తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోయారనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు తేజ నామినేట్ చేసిన ఆరుగురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ లిస్ట్లో వరుసుగా దామిని భట్ల,రతికా రోజ్, శుభ శ్రీ, నయని పావని, పూజా,ఆట సందీప్ ఉన్నారు. ఇలా మూడో వారం నుంచి వరుసగా తేజా ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ కావడంతో ఆయనది ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఇలా అందరినీ హౌస్ నుంచి బయటకు పంపిన తేజా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై ఆట సందీప్, తేజ గురించి పలు మీమ్స్ ఇన్స్టాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని సందీప్ షేర్ చేశాడు. 'కర్మ ఇట్స్ బ్యాక్.. హౌస్లో మంచి ప్లేయర్ అయిన సందీప్ను చెత్త కారణాలతో పంపించేశావ్.. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి చెత్త రీజన్తో బయటకు వస్తున్నావ్..' అంటూ సందీప్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అవన్నీ కూడా నవ్వులు పూయించేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by Anandani Evaru Koorukoru...🤔 (@anandani_evaru_koorukoru) -
బిగ్బాస్ 7: టేస్టీ తేజ అవుట్.. అతడి భయమే నిజమైంది!
బిగ్బాస్ హౌస్లో ప్రస్తుతం 12 మంది మిగిలారు. వీరిలో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని మినహా మిగతా అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఈసారి ఎలిమినేషన్ గురిం శోభా మీదే ఉంది. నిజానికి ఆమె గతవారమే ఎలిమినేట్ అవుతుందని అంతా ఊహించారు. కానీ బిగ్బాస్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ సందీప్ను పంపించేసి ఆమెను హౌస్లో ఉంచేశాడు. ఈసారి కూడా బిగ్బాస్ అదే ప్లాన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన కోసం మరో కంటెస్టెంట్ను బలి చేస్తున్నారట.. ఇంతకీ ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు.. శోభా జిగిరీ దోస్త్ టేస్టీ తేజ. ఎలిమినేషన్స్ అంటేనే బెంబేలెత్తిపోతాడు తేజ. ఎవరైనా నామినేట్ చేస్తే నేనే పాపం చేశాను? నన్నెందుకు నామినేట్ చేశారు? అన్నట్లుగా అమాయకంగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కానీ ఇతడు మాత్రం వేరేవాళ్లను చెత్త కారణాలతో నామినేట్ చేస్తుంటాడు. నిద్రపోతున్న తనమీద నాలుగు చుక్కల నీళ్లు చిలకరించిందని పూజాను నామినేట్ చేసి తనను బయటకు పంపించేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్, నామినేషన్స్లోకి వస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.. అదీ ఇదీ అంటూ సందీప్ మాస్టర్ను ఆకాశానికి ఎత్తేసి అవతలకు తోసేశాడు. నామినేషన్స్లో సిల్లీ రీజన్స్ చెప్పొద్దు అని అందరూ మొత్తుకున్నా తేజ తన తీరు మార్చుకోలేదు. గతవారం సందీప్ను ఏ కారణంతో అయితే నామినేట్ చేశాడో అదే కారణంతో అర్జున్ను నామినేట్ చేశాడు. ఇలా సిల్లీ రీజన్స్ వద్దని వార్నింగ్ ఇస్తూ తేజను నామినేట్ చేశాడు శివాజీ. అప్పటినుంచి ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని భయంతో వణికిపోతున్నాడు తేజ. చివరకు అతడు అనుకున్నట్లే జరిగింది. బిగ్బాస్ హౌస్లో టేస్టీ తేజ ప్రయాణం ముగిసినట్లు తెలుస్తోంది. ఒకరకంగా శోభ కోసం తేజ ఎలిమినేట్ అయిపోయాడు! చదవండి: శివాజీ వారిని చెడగొడుతున్నాడు.. మానస్ -
వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అమర్పై మళ్లీ విషం కక్కిన శివాజీ
కెప్టెన్ గౌతమ్ హౌస్లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఈ వారం ఆడపిల్లలు పనే చేయక్కర్లేదని బంపరాఫర్ ఇచ్చాడు. ఇంకేముంది.. లేడీ కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. అటు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలుపెట్టాడు బిగ్బాస్. మరి నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి.. మళ్లీ విషం కక్కిన శివాజీ బద్దకస్తుడైన తేజ శవాసనం వేస్తూ నేలకు అతుక్కుపోయాడు. ఇది గమనించిన బిగ్బాస్ తేజకు ఏదైనా శిక్ష వేయమని కెప్టెన్ను ఆదేశించాడు. కెప్టెన్ గౌతమ్.. తేజ అమ్మాయిలా చీర కట్టుకోవాలని చెప్పాడు. ఇంకేముంది, శోభ.. అతడికి చీర కట్టి రెడీ చేసింది. ఇదే అదను అనుకున్న తేజ.. అందరు అమ్మాయిలకు హగ్గులిచ్చుకుంటూ పోయాడు. ఇక పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ ఎప్పటిలాగే అమర్పై విషం చిమ్మాడు. వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రతి సీజన్లో అందరూ కలిసి ఒకర్ని హీరోను చేస్తే ఈ సీజన్లో నన్ను విలన్ను చేశారు అని తనకు తానే అనుకున్నాడు అమర్. చాలెంజ్ విసిరిన బిగ్బాస్ తర్వాత బిగ్బాస్.. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. ఇందుకోసం ఇంటిసభ్యులను రెండు టీమ్లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్లో ఉన్నారు. మొదట బాల్స్ టాస్కు పెట్టాడు కానీ ఫలితాలను ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. చాలెంజ్ గెలిచిన టీమ్కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదటి చాలెంజ్కే రైతుబిడ్డ అవుట్ మొదట జంపింగ్ జపాంగ్ అనే చాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వీరికి అవతలి టీమ్లో ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. అందరూ చర్చించుకుని ప్రశాంత్ను గేమ్ నుంచి సైడ్ చేశారు. తనను ఆటలో నుంచి పక్కకు తోసేయడంతో రైతుబిడ్డ కంటతడి పెట్టుకున్నాడు. శివాజీ తన చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్రశాంత్ మెడలో వేశాడు. అయితే ప్రశాంత్ కంటే భోలె ఎక్కువ ఫీలైపోయాడు. ప్రియుడి కోసం ఏడ్చేసిన శోభ మరోవైపు శోభ తన ప్రవర్తన మీద తనే డౌట్ పడింది. బయట ఉన్న ప్రియుడిని ఉద్దేశిస్తూ.. వాడు నన్ను అర్థం చేసుకుంటాడంటావా? అని తేజతో కబుర్లాడింది. 'వాడు చాలా మెచ్యూర్డ్.. అర్థం చేసుకుంటాడు.. కానీ నమ్మకంతో పాటు భయం కూడా ఉంది. ఒకవేళ వాడికి నచ్చనట్లు ఏమైనా ప్రవర్తించానా? నీ విషయంలో వేరేలా ఉన్నాను. అది తనకు నచ్చకపోవచ్చేమో.. ఎవరికి తెలుసు? అయినా ఏమీ అవదనే అనుకుంటున్నాను. పొరపాటున ఏదైనా జరిగితే నేనసలు తట్టుకోలేను. వాడు బాగా గుర్తొస్తున్నాడు' అంటూ శోభ ఏడ్చేసింది. ఇక రేపటి ఎపిసోడ్లో మిగతా చాలెంజ్లు ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనేది చూడాలి! చదవండి: లావణ్య మెడలో మూడు ముళ్లు వేసిన వరుణ్ తేజ్ -
తేజ నిజస్వరూపం బయటపెట్టిన సందీప్.. వెనకాల గోతులు తవ్వడం..
బిగ్బాస్ హౌస్లో సేఫ్ గేమ్ ఆడుతున్నవారిలో టేస్టీ తేజ ముందు వరుసలో ఉంటాడు. బలమైన కారణాలు లేకుండా కంటెస్టెంట్లను ఊరికనే నామినేట్ చేస్తూ ఉంటాడు. అతడి హ్యాండ్ మహిమో, మరేంటో కానీ తను ఎవరినైతే నామినేట్ చేస్తున్నాడో వారు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. దామిని, రతిక, శుభశ్రీ రాయగురు, నయని పావని, పూజా మూర్తి, సందీప్.. ఇలా ఎవరో ఒకరు తేజ చేతిలో బలవుతూ వస్తున్నారు. ఇక సందీప్ స్ట్రాంగ్ ప్లేయర్ అని.. ఒక్కసారైనా నామినేషన్స్లోకి వస్తే తనకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని.. పాజిటివ్ వైబ్స్తో నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. కట్ చేస్తే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. తేజ ప్రవర్తనకు బాధేసింది సందీప్ ఎలిమినేషన్కు ఒకరకంగా నువ్వే కారణమంటూ తేజను శివాజీ నామినేట్ చేశాడు. అయితే అప్పుడు తేజ ఓ మాటన్నాడు. సందీప్ను కావాలని నామినేట్ చేయలేదని, తనే అడిగి మరీ చేయించుకున్నాడని చెప్పాడు. దీనిపై ఆట సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నామినేషన్స్లో తేజ అలా మాట్లాడటం చూసి చాలా బాధపడ్డాను, అదే స్థాయిలో కోపం కూడా వచ్చింది. నేను హౌస్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నువ్వేం బాధపడకురా.. ఇంటికే వెళ్తున్నాను కదా అని పాజిటివ్గా మాట్లాడి హగ్ చేసుకున్నాను. తేజది ఐరన్ లెగ్! అలాంటిది నేను లేని సమయం చూసుకుని నామీద అబద్ధం చెప్పాడు. నేనే నామినేట్ చేయమని చెప్పానని అనడం తప్పు. తేజ చెప్పింది 100% ఫేక్. ఈ ఒక్క పాయింట్తో తనను బయటకు లాగేయొచ్చు. తేజది ఐరన్ లెగ్.. అందుకే బయటకు వచ్చేశాననుకుందాం. తేజ నామినేట్ చేసిన ఆరుగురు అలాగే వచ్చారు. సరే, జనాలు నన్ను బయటకు పంపించేశారనుకుందాం. కానీ, నేను అక్కడ లేనప్పుడు తను నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి నా గురించి అబద్ధం ఆడటం తప్పు. నామినేషన్స్లోనూ అదే వెటకారం నన్ను ఎలాగైతే నామినేట్ చేశాడో అర్జున్ను కూడా అలాగే వెటకారంగా నామినేట్ చేశాడు. నేను ఎలిమినేట్ అయినప్పుడు తేజ వెక్కివెక్కి ఏడ్చాడు. ఎప్పుడూ ఏడవని తేజ ఆ రోజు సోఫా మీద దొర్లి మరీ ఏడ్చాడు. ఎమోషన్స్ ఉండవన్న తేజ ఆ రోజు ఎంతగానో ఏడ్చాడు ఇప్పుడు నాకు ఎవరేంటనేది అర్థమవుతోంది. తనది సెల్ఫిష్ గేమ్.. ఇలా ఎవరి వెనకాల గోతులు తవ్వకూడదు' అని సందీప్ చెప్పుకొచ్చాడు. చదవండి: గౌతమ్ మాస్టర్ మైండ్.. రైతుబిడ్డ అవుట్.. ఏడ్చేసిన ప్రశాంత్ -
పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్
ఈ ఏడాది తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 కాస్తా ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. గతేడాది నిరాశపర్చిన బిగ్బాస్ ఈసారి ఉల్టా-పుల్టా అంటూ సరికొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత షో జరిగిన ఐదు వారాలకు బిగ్బాస్ 2.0 అంటూ మరోసారి ఆసక్తిని పెంచేశారు. ఐదుగురిని ఎలిమినేట్ అవ్వగా.. కొత్తగా అంతేమందిని హౌస్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షో ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరిదశకు చేరింది. బిగ్బాస్ మారథాన్లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలో అర్హతలేని వ్యక్తి మెడలో మిరపకాయల దండ వేయమని బిగ్బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు. (ఇది చదవండి: రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!) కాగా.. ఈ వారం బిగ్బాస్ మారథాన్లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఈ క్రమంలో కెప్టెన్ అయ్యేందుకు అర్హతలేని వ్యక్తుల మెడలో మిరపకాయల దండ వేసి వాళ్లను ఎలిమినేట్ చేయాలని బిగ్బాస్ హౌస్మేట్స్కు సూచించాడు. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయినందుకు ప్రశాంత్కు వ్యతిరేకంగా అమర్దీప్ ఓటు వేస్తున్నట్లు ప్రకటిస్తాడు. కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమిషన్ కోసం మొదట అమర్దీప్ ఓటేస్తాడు. 'పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలిరా నీకు అంటూ అమర్దీప్ అంటాడు. ఏదైన చెప్పినప్పుడు తొడ కొట్టేది, మీసాలు తిప్పేది, మేలేసేది, పక్కవాళ్లు నవ్వితే సంక గుద్దేది కాదు.. అంటూ ప్రశాంత్ను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీవు ఇప్పటికే కెప్టెన్ అయ్యావ్ కాబట్టి.. మరోసారి నీకు అవసరం లేదంటూ ప్రశాంత్ మెడలో మిరపకాయల దండ వేస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. మీరంతా నాపై ఇలా దండలు వేస్తుంటే రైతులు పండించిన పంట పూలమాలలా ఉంది.'అని నవ్వుతూ చెబుతాడు. అలాగే ప్రియాంక మెడలో భోలే షావలి మిరపకాయల దండ వేసి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇక శోభకు వ్యతిరేకంగా రతిక, యావర్లు ఓటేస్తారు. ఈ క్రమంలో శోభ, యావర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యావర్ను పిచ్చోడు అంటూ శోభ మాట్లాడటంతో ఆమెపై ఫైర్ అవుతాడు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఆ తర్వాత అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్కు ఓటేయడానికి ఇక్కడున్న వారికి ఎవరికీ అర్హత లేదని అంటుంది. ఇది విన్న టేస్టీ తేజ ఆమెపై ఫైర్ అవుతాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అపోజిట్లో ఉన్నంత వరకు కెప్టెన్ అయినోన్ని ఇంకోసారి అవ్వనివ్వనని అమర్దీప్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలు చూస్తే కెప్టెన్ ఎవరు అవుతారనే విషయంపై మరింత ఆసక్తి కలుగుతోంది. మరి ఇంటి సభ్యుల మనసు గెలుచుకుని ఈ వారం కెప్టెన్గా ఎవరు నిలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! -
రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ అనేది అమృతం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారమంతా ఏ పనీ చేయనక్కర్లేదు, నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్ భయమే లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లుగా కెప్టెన్ ఏది చెప్తే అదే నడుస్తుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడిపోతుంటారు. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్బాస్ బీబీ మారథాన్ పోటీ పెట్టాడు. మరి ఈ మారథాన్లో ఏం జరిగింది? ఎవరు కంటెండర్లుగా నిలిచారు? అనేది తాజా(అక్టోబర్ 26) ఎపిసోడ్లో చూసేద్దాం.. నీటితో గేమ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్లో ముందుగా స్టోర్ ఇట్.. పోర్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా షవర్ నుంచి వచ్చే నీళ్లను తలపై స్పాంజిలో నింపుకుని తమ కంటైననర్లో పిండుకోవాలి. ఈ గేమ్లో అర్జున్, అశ్విని, సందీప్, భోలె షావళి ఆడారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అర్జున్ తోసేయడంతో అశ్విని కిందపడిపోయింది. ఇక బజర్ మోగిన ప్రతిసారి కంటైనర్లో తక్కువ నీళ్లు ఉన్నవారు అవుట్ అవుతారు. మొదట భోలె అవుట్ కాగా అతడు తన కంటైనర్లోని నీటిని అశ్వినికి ఇచ్చేశాడు. ఇద్దరి త్యాగాలు.. గెలిచిన సందీప్ తర్వాతి రౌండ్లో అశ్విని అవుట్ కాగా ఆమె తన నీటిని సందీప్ మాస్టర్కు ఇచ్చేసింది. మూడో రౌండ్లో అర్జున్ ఎంత కష్టపడ్డా సందీపే గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత అమర్తో సందీప్ ముచ్చట్లు పెట్టాడు. అర్జున్ సీరియస్గా ఆడుతున్నాడని, తను తోసేశాడని ఆరోపించాడు. ఎక్కడ కొడితే ఎక్కడ నొప్పి వస్తుందో నాకూ తెలుసు. నా మోచేయి చాలు తన హైట్కు.. అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇక అర్జున్ తను గేమ్ ఆడేటప్పుడు ఎవరూ తనకు సపోర్ట్ చేయలేని తెగ ఫీలైపోయాడు. ఇంతకుముందు నో మాస్టర్ అనేవాళ్లు, ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారనగానే శివాజీ.. అవన్నీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ చులకనగా మాట్లాడాడు. అక్కా అనొద్దంటూ వెంటపడ్డ రతిక హౌస్లో రీఎంట్రీ ఇచ్చిన రతిక వచ్చినప్పటినుంచి ఇంకా ఏ అలజడి సృష్టించకుండా ఉందేంటా? అనుకునేలోపు మళ్లీ మొదలెట్టేసింది. యావర్తో నిన్ను, శివనన్నని తప్ప హౌస్లో ఎవరినీ నమ్మను.. మనం ఇద్దరం ఒకే ప్లేట్లో తింటుంటే ప్రియాంక.. మనల్ని లవ్బర్డ్స్ అందట. నీ మనసులో, నా మనసులో ఏం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నాం.. లవ్ కనెక్షన్ ఎట్లా వస్తుంది అని మాట్లాడింది. మరోవైపు ప్రశాంత్తో తనను అక్కా అనొద్దంటూ సతాయించింది. అతడికేమో ఆమె పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఏడుస్తూ అక్కా అనే పిలుస్తా అన్నాడు. ఆమె మాత్రం అందుకొప్పుకోలేదు. చివర్లో శివాజీ కలగజేసుకుని అక్కా అని పిలవనవసరం లేదు అంటూ తీర్పునిచ్చాడు. కంటెండర్గా గౌతమ్ కాసేపటికి ఎంప్టీ ద కంటైనర్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శోభా.. నేను ఆడతా.. నన్ను ఆడనివ్వకపోతే ఎవరినీ ఆడనివ్వను.. నేను ఆడాల్సిందే అంటూ ఓరకంగా వార్నింగే ఇచ్చింది. దీంతో అర్జున్.. ఆమెతో పోరు పడలేక శివాజీ, అశ్విని, గౌతమ్లతో పాటు శోభాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ గేమ్లో గౌతమ్ గెలిచాడు. ఓటమిని తీసుకోలేని శోభ ఏడుపు మొదలెట్టేసింది. తర్వాత తేజ-శోభలను బిగ్బాస్ ఆటపట్టించాడు. తేజను తిననివ్వకుండా ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావ్.. స్వయంగా మీరే రెండు చపాతీలు చేసి తేజకు తినిపించాలంటూ శోభకు పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో లవ్ సింబల్ షేప్లో చపాతీ చేసి తేజ వద్దంటున్నా అతడి వెనకాలే వెళ్తూ ముద్దలు తినిపించింది. ఎట్టకేలకు కంటెండర్గా శోభా ఇక చివరగా వేర్ ఇట్ అండ్ విన్ ఇట్ గేమ్ పెట్టాడు. మళ్లీ శోభా.. నేను ఆడతా.. అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అర్జున్ ఏదో ఆలోచిస్తుంటే అలిగి వెళ్లిపోయింది. దీంతో అశ్విని, అర్జున్ త్యాగం చేసి తేజ, యావర్, శోభాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో తేజకు అమర్, శోభాకు ప్రియాంక, యావర్కు ప్రశాంత్ సపోర్ట్ చేశాడు. ఈ గేమ్లో శోభా అత్యధికంగా 72 దుస్తులేసుకుని విన్నర్గా నిలిచింది. ఈ వారం బీబీ మారథాన్లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
లవ్బర్డ్స్ శోభా-తేజ మధ్య గొడవ.. పుల్ల పెట్టిన శివాజీ!
బిగ్బాస్ 7లో ఈ వారం నామినేషన్ హడావుడి ముగిసింది. 8 మంది లిస్టులో ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులు షురూ చేశాడు. ఓ రెండు గేమ్స్ జరిగాయి. మరోవైపు హౌసులో ఇప్పటికే మాటలతో మాయ చేస్తూ బండి లాక్కొచ్చేస్తున్న శివాజీ.. శోభా-తేజ మధ్య పుల్లపెట్టి మంట ఎక్కువ చేస్తే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 52 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అతి చేస్తున్న శివాజీ నామినేషన్స్ పూర్తవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ స్టార్టయింది. ఇక అయిపోయిన నామినేషన్ గురించి శివాజీ ఏదేదో మాట్లాడాడు. 'నామినేషన్ అనేది తెలివైన ప్రక్రియ. కానీ ఆ టైంలో కారణాలు లేకుండా, కొందరు హీరో అయిపోదామని ఎగిరెగిరి పడుతున్నారు. ఈ ప్రక్రియని అపహాస్యం చేస్తున్నారు' అని సీరియల్ బ్యాచ్ని ఉద్దేశిస్తూ అన్నాడు. అయితే ఆ ఎగిరెగిరి పడేవాళ్లలో ప్రశాంత్ కూడా ఉన్నాడు. అంటే శివాజీ లెక్క ప్రకారం.. ప్రశాంత్కి కూడా ఈ కామెంట్ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కూడా నామినేషన్స్లో తప్ప మిగతా రోజులు గేమ్స్ ఆడినా సరే ఉన్నాడా లేడా అన్నట్లు పవర్తిస్తుంటాడు. కన్నీళ్లు పెట్టుకున్న శోభా స్ట్రాంగ్గా ఉండే శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గత నామినేషన్స్లో భోలె మెంటల్ అనడాన్ని గుర్తుచేసుకుని మరీ తేజతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కాసేపటికి తన ఫ్రెండ్స్ అయిన అమర్-ప్రియాంక-సందీప్ దగ్గర మాట్లాడుతూ.. భోలె ఓ వేస్ట్ కేండిడేట్ అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!) కెప్టెన్సీ గేమ్స్ షురూ ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు 'BB మారథాన్' పేరుతో పోటీ పెట్టనున్నారు. ఇందులో పెట్టే ఒక్కో గేమ్లో నలుగురు పోటీ పడతారు. ఇందులో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. చివరి స్థానంలో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతారు. అలా 'రిజల్ట్ ఏంటో గెస్ చేయాలంతే?' పేరుతో తొలి గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని వస్తువులు నీటిలో వేస్తారు. అవి తేలుతాయో, మునుగుతాయో చెప్పాలంతే.. ఈ పోటీలో ప్రియాంక విజేతగా నిలవగా, అమరదీప్ ఓడిపోయాడు. శోభా, తేజ మధ్య స్థానాలు సంపాదించారు. 'డబ్బాలు సెట్ చేయాలంతే' అనే రెండో గేమ్లో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. రతిక ఎలిమినేట్ అయిపోయింది. గౌతమ్, యవర్ కూడా ఈ గేమ్ ఆడినప్పటికీ మధ్య స్థానాల్లో నిలబడ్డారు అంతే. పుల్లలు పెడుతున్న శివాజీ రెండో గేమ్లో రతిక ఓడిపోయిన తర్వాత తేజ ఆమెతో జోక్గా.. 'ఓడిపోయినందుకు నువ్వు కూడా అన్నం తిననని బిగ్బాస్తో చెప్పు' అన్నాడు. దీంతో శోభా రెచ్చిపోయింది. తేజతో గొడవ పెట్టుకుంది. ఎందుకలా అన్నావ్ అని గట్టిగా అరుస్తూ వాదన పెట్టుకుంది. మధ్యలో తేజతో మాట్లాడిన శివాజీ.. శోభా గురించి పుల్ల పెట్టే ప్రయత్నం చేశాడు. 'అతి సర్వత్రా వర్జయాత్' అని ఏవేవో సినిమా డైలాగ్స్ కొడుతూ తేజని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇలా చేస్తే తేజ.. శోభాకి దూరమై తన దగ్గరకు వచ్చేస్తాడని శివాజీ ఆశపడుతున్నట్లు ఉన్నాడు. ఒకటి రెండు రోజులు ముందు కూడా శోభా వెనక తిరుగుతున్నాడని తేజకి శివాజీ క్లాస్ పీకాడు. ఇవన్నీ చూస్తుంటే శివాజీ.. బిగ్బాస్లో ఆడకుండా రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడనిపిస్తోంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) -
అమర్దీప్ మీద కేకలేసిన శోభ, కేక్ కోసం ఫైటింగ్!
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు గులాబీపురం, జిలేబిపురం అనే గ్రామస్థులుగా విడిపోయారు. వీరిలో ఏ గ్రూపు గ్రహాంతరవాసులను మెప్పిస్తుందో ఆ గ్రూపులోని వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇప్పటికే ఓ టాస్కులో జిలేబిపురం గెలిచింది. మరి తాజా(అక్టోబర్ 19) ఎపిసోడ్లో ఎవరు గెలిచారు? అనేది చూసేద్దాం.. మళ్లీ బుసలు కొట్టిన మోనిత గులాబీపురం, జిలేబిపురం గ్రామప్రజలుగా కంటెస్టెంట్లు జీవించేస్తున్నారు. ఇక తేజ అయితే పెళ్లి రోజు, తొలి రాత్రి అంటూ శోభా శెట్టితో సరసాలాడాడు. మిగతావారు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఎవరికి వారు తమ టాలెంట్ చూపించారు. ఇంతలో అండర్ వాటర్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో అమర్-సందీప్ బాగానే కష్టపడ్డారు. కానీ చివరకు జిలేబిపురాన్ని గెలిపించాడు సందీప్. దీంతో శోభాలో ఉన్న మోనిత ఒక్కసారిగా నిద్రలేచింది. గెలుస్తానన్న నమ్మకం లేకపోతే వెళ్లకూడదు.. ప్రతీది ఓడిపోతున్నాం అంటూ అమర్దీప్ మీద అరిచేసింది. బోణీ కొట్టిన గులాబీపురం.. తర్వాత స్పేస్ షిప్ ఛాలెంజ్లో ప్రశాంత్, గౌతమ్ పోటీపడ్డారు. ఈసారి టాస్కులో గౌతమ్.. గులాబీపురాన్ని గెలిపించాడు. దీంతో మొదటి బోణీ కొట్టడంతో గులాబీపురం గ్రామస్తుల ముఖాలు వికసించిపోయాయి. అయితే జిలేబీపురానికి చెందిన ప్రియాంక డల్గా కూర్చోవడంతో ఆమె దగ్గరకు వెళ్లిన అమర్.. మాకొచ్చింది ఒకటేలే.. సల్లబడు అన్నాడు. సల్లబడు ఏంటి? ఓవర్గా మాట్లాడకు అని ఫైర్ అయింది. నేను సరదాగా అన్నానంటూ అమర్ చెప్పినా తను పట్టించుకోలేదు. అలిగి వెళ్లిపోయింది. తర్వాత ప్రియాంక దగ్గరకు వెళ్లిన అమర్ సారీ చెప్పాడు. మొన్నటివరకు శివాజీ, ప్రశాంత్తో గొడవపడ్డ అమర్దీప్ ఈరోజు తన స్నేహితులిద్దరితోనూ మాటలు పడాల్సి వచ్చింది. శోభా పేరు పచ్చబొట్టు వేయించుకోమన్న బిగ్బాస్ ఇదిలా ఉంటే కిచెన్లో టాటూ గురించి కబుర్లు చెప్పుకున్నారు తేజ, శోభ, పూజా మూర్తి. ఇది విన్న బిగ్బాస్ పచ్చబొట్టు వేయించుకోవచ్చుగా అని తేజకు సలహా ఇచ్చాడు. సరదాగా అన్నాడేమో అని లైట్ తీసుకునేలోపే పదేపదే పచ్చబొట్టు విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. శోభ పేరు టాటూ వేయించుకోవాలని, ఏ డిజైన్ కావాలో సెలక్ట్ చేసుకో అని ఓ పేపర్ కూడా పంపించాడు. అసలే పెళ్లి కావాల్సినవాడిని, ఈ పచ్చబొట్టు నా వల్ల కాదంటూ బిగ్బాస్కు మొర పెట్టుకున్నాడు తేజ. బయటకు వెళ్లాక (పెళ్లికి) అవకాశముందని చెప్తే వేయించుకుంటానని తేజ అనగా వేయించుకో అని ఆటపట్టించింది శోభ. అమర్ మీద పడ్డ శోభ రాత్రి తేజ కోసం బిగ్బాస్ ఓ కేక్ పంపించాడు. దానిపై శోభ అని రాసి ఉంది. ఇది ముగింపు కాదు, ముందుంది ముసళ్ల పండగ అంటూ ఓ లేఖ సైతం పంపాడు. తనకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో అని జుట్టు పీక్కున్నాడు తేజ. ఇంతలో అమర్.. కేక్ను ఎంతసేపు చూస్తూ కూర్చోవాలని ఓ ముక్క లటుక్కున తినేశాడు. అప్పుడు తేజ, శోభ.. ఇద్దరూ అమర్ మీద అరిచారు. కేక్ మీద నా పేరుంది.. ఎలా తిన్నావని ఆగ్రహించింది శోభ. శోభకు ఐ లవ్ యూ చెప్పిన తేజ చాలా సేపు తల గోక్కున్న తర్వాత తేజ కేక్ కట్ చేసి అందరికీ తలా ఓ ముక్క ఇచ్చాడు. అంతా అయిపోయాక శోభను గార్డెన్కు పిలిచాడు. కేక్ ఎందుకు పంపించాడు? దానిపై నీ పేరు ఎందుకు రాశాడు? అంటూ ప్రశ్నల చిట్టా చదివాడు తేజ. ఏదో చెబుతావనుకుంటే సోది చెప్తున్నావంటూ శోభా కోపంగా లేచింది. దీంతో తేజ సడన్గా ఐ లవ్ యూ చెప్పడంతో థూ అని ఊసేసి ముందుకు వెళ్లిపోయింది శోభ. మొత్తానికి తేజ-శోభ లవ్ ట్రాక్ కోసం బిగ్బాస్ గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. చదవండి: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ -
ఎలిమినేషన్కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!
బిగ్బాస్ మినిమమ్ జోష్ ఉంటది. ఎందుకంటే వారంలో కంటెస్టెంట్స్ అందరూ చేసిన చీటింగ్, పొరబాట్లు ఇలా ప్రతి ఒక్కదాని గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడుతాడు. ఈసారి కూడా అలానే ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ కడిగేసే ప్రయత్నం చేశాడు. ఎలిమినేషన్ కంటే ముందు మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఆ ముగ్గురికి భయం పట్టుకుంది. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 34 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అందరి తప్పులు శుక్రవారం ఏం జరిగిందనేది చూసిన నాగ్.. ప్రస్తుతానికి వచ్చేశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. రావడంతో బెస్ట్ బడ్డీస్ జోడీలుగా కూర్చోవాలని చెప్పాడు. ఫస్ట్ ప్రియాంక-శోభాశెట్టిని నిలబెట్టి.. ఈ వారం మీరేం తప్పులు చేశారు? మీకేం అన్యాయం జరిగిందని అడిగాడు. స్మైల్ టాస్కులో మూడోసారి గంట కొట్టింది తామే అయినా స్టార్స్ రాలేదని ప్రియాంక చెప్పింది. అయితే తన బడ్డీ శోభా, ఆ గేమ్లో సంచాలక్ కావడం, మరో సంచాలక్ యవర్తో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవడంతో తానేం అనలేకపోయానని చెప్పింది. అయితే ఈ పోటీలో ప్రతిఒక్కరూ తప్పుగా ఆడారని నాగ్ చెప్పాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) అమర్-సందీప్కి పడ్డాయ్ ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా గేమ్స్ ఆడుతూ ఎక్కువ తప్పులు చేసింది అమరదీప్-సందీప్. రెగ్యులర్ గా ఎపిసోడ్స్ చూసేవాళ్లందరికీ ఇది తెలుసు. నాగ్ కూడా ఆయా తప్పులు సందీప్-అమరదీప్తో చెప్పించాడు. స్మూత్గా ఇచ్చిపడేశాడు. ఇక ప్రతి సంచాలక్ నిర్ణయాన్ని బొక్కలో జడ్జిమెంట్ అని అమర్ అనడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. 'నువ్వే తొక్కలే సంచాలక్.. నీదే బొక్కలో జడ్జిమెంట్' అని అనడంతో అమర్ సైలైంట్ అయిపోయాడు. ఇలా అందరు చేసిన తప్పుల్ని ఎత్తిచూపిన నాగార్జున.. అందరూ దొరికిపోయేలా చేశాడు. అమర్ నిజస్వరూపం అయితే శివాజీ మాట్లాడుతూ.. అమరదీప్కి ఏం చెప్పినా వినట్లేదని, ఎవరూ ఫెయిర్ గేమ్ ఆడట్లేదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. మరోవైపు దొంగ టాస్కులో భాగంగా అమరదీప్.. ప్రశాంత్ని ఉద్దేశిస్తూ రూంలో కూర్చుని 'వాడు మేకప్ వేయకపోయినా దొంగలానే ఉంటాడు' అని చెబుతున్న వీడియోని స్క్రీన్పై ప్లే చేసిన నాగ్.. అమర్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. దీంతో అతడిపై నెగిటివిటీ మరింత పెరిగిపోయింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) ఆ ముగ్గురిపై అనర్హత? అయితే కంటెస్టెంట్స్ తప్పులు గురించి చెప్పి, అందరికీ స్మూత్ వార్నింగ్స్ ఇచ్చిన నాగార్జున చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్ గురించి కాకుండా ఈ హౌసులో ఉండటానికి అర్హత లేని ముగ్గురు పేర్లు చెప్పాలని అందరితో అన్నాడు. హౌస్మేట్స్ శోభాశెట్టి, ప్రశాంత్, సందీప్ కాకుండా మిగిలిన ఏడుగురిలోని పేర్లు చెప్పాలని అన్నాడు. దీంతో అందరూ నామినేట్ చేసినోళ్ల పేర్లు, అందుకు కారణాలు చెప్పారు. శోభాశెట్టి.. తేజ, గౌతమ్, శివాజీ ప్రశాంత్.. తేజ, యవర్, అమరదీప్ సందీప్ .. గౌతమ్, శివాజీ, యవర్ ప్రియాంక.. గౌతమ్, శివాజీ, శుభశ్రీ అమరదీప్.. శుభశ్రీ, గౌతమ్, యవర్ శుభశ్రీ.. తేజ, ప్రియాంక, అమరదీప్ గౌతమ్.. తేజ, ప్రియాంక, అమరదీప్ శివాజీ.. అమరదీప్, ప్రియాంక, గౌతమ్ తేజ.. అమరదీప్, శుభశ్రీ, గౌతమ్ యవర్.. అమరదీప్, ప్రియాంక, తేజ అయితే హౌసులో ఉన్న వాళ్ల ప్రకారం.. అమరదీప్, తేజ, గౌతమ్ హౌసులోని అనర్హత కలిగిన ముగ్గురుగా నిలిచారు. కానీ ప్రేక్షకుల అంచనా ప్రకారం ఆ ముగ్గురు ఎవరనేది ఆదివారం చెబుతానని నాగ్ తిరకాసు పెట్టి ఎపిసోడ్ని ఆపేశాడు. అలానే ఆదివారం.. ఎవరూ ఊహించని విషయం చెబుతానని కంటెస్టెంట్స్ అందరితో చెప్పాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఇక ఆదివారం.. కొత్తగా హౌసులోకి మరో ఆరుగురు కంటెస్టెంట్స్ రాబోతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!
బిగ్బాస్ అంటేనే ఫిట్టింగ్ బాస్.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్బాస్ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్బాస్.. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తాజా(సెప్టెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి.. యావర్కు తెలుగు క్లాసులు బిగ్బాస్ ఇంట్లో కెప్లెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందుకోసం ఇంట్లోవారంతా జంటలు జంటలుగా విడిపోయారు. వీరిలో ఆటలో వెనుకబడి అందరికన్నా తక్కువ స్టార్లు సొంతం చేసుకున్న శోభా శెట్టి- ప్రియాంకలను బిగ్బాస్ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు. మిగిలిన నాలుగు జంటలు అమర్ దీప్- సందీప్, శివాజీ- ప్రశాంత్, తేజ- యావర్, గౌతమ్- శుభశ్రీలు నెక్స్ట్ లెవల్కు వెళ్లారు. ఇకపోతే తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించాలన్నాడు బిగ్బాస్. ఈ క్రమంలో తేజ, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. అతడికి తెలుగు క్లాసులు తీసుకున్నారు. రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఆర్డర్లు, వార్నింగ్లు.. అల్లరి విద్యార్థిగా యావర్ అదరగొట్టాడు. తెలుగు పండింతులైన తేజను ఓ ఆటాడుకున్నాడు. మరోవైపు శివాజీ ఎప్పటిలాగే అతి చేశాడు. కాఫీ కోసం బిగ్బాస్ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ ఇవ్వని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరింపులకు దిగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్బాస్? కాఫీ ఇవ్వనంటాడు.. అని చిందులు తొక్కాడు. ఈయన ఓవరాక్షన్ చూసిన బిగ్బాస్ అతడికి కాఫీనే పంపించలేదు. ఎమోషనల్ టాస్క్.. ఇకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా చిట్టి ఆయిరే అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లందరికీ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారన్నమాట! త్యాగం చేసిన శుభ శ్రీ ఈ టాస్క్ గురించి ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్ ఆడటం లేదు అంటూ శివాజీ మైక్ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్తో.. నువ్వే ఆడు, లెటర్ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్- శుభశ్రీ.. ఎవరు లెటర్ అందుకోవాలనే దాని గురించి కాసేపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభ. అటు గౌతమ్ తన తండ్రి రాసిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తన లేఖను చించేసిన యావర్ యావర్- తేజా.. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్ చదివి చాలా ఎమోషనలయ్యాడు. ఏడవనంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి తర్వాతి ఎపిసోడ్లో ఎవరు త్యాగం చేస్తారు? ఇంకా ఎవరు కెప్టెన్సీ పోటీదారులవుతారో చూడాలి! -
చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..
బిగ్బాస్ గ్యారేజ్.. ఇచట అన్నిరకాల మనుషులు ఉంటారు. కోపిష్టిలు, సహనశీలులు, ఆవేశపరులు, ఆలోచనాపరులు, శక్తిమంతులు, బుద్ధిహీనులు, సహృదయులు, కఠినాత్ములు.. ఇలా భిన్నరకాల మనుషులుంటారు. హౌస్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఎంతో కొంత నేర్చుకునే వెళ్తారు. ప్రస్తుత సీజన్లో ఇంటిసభ్యుల మధ్య ఆప్యాయత కన్నా కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్కుల్లో తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్లకు బిగ్బాస్ ఈరోజు గుడ్న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పనున్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు తాజాగా ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటిసభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ ఇప్పటికే కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే మరొకరు ఉత్తరం చదువుకోవాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. చేతిదాకా వచ్చిన ఉత్తరాన్ని చదువుకునే భాగ్యం కూడా దక్కకుండా పోయిందేనని కొందరు ఏడ్చేశారు. ఇక సందీప్.. తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని.. తనకు ఈ ఉత్తరం ఎంతో అవసరమని చెప్తాడు. మదర్ సెంటిమెంట్ అయ్యేసరికి అమర్ తనతో వాదించలేకపోతాడు. అటు శుభశ్రీ సైతం తనకు ఈ లెటర్ కావాలని ఏడ్చేసింది. ఎప్పుడూ నవ్వించే తేజ కూడా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకోగానే బోరుమని విలపించాడు. మరి ఎవరెవరికి ఉత్తరం చదివే ఛాన్స్ వచ్చింది? ఎవరు తమ లెటర్ను చింపేసి త్యాగానికి సిద్ధపడ్డారు? అనేది తెలియాలంటే నేటి ఎమోషనల్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక? -
వీడియోతో దొరికిపోయిన తేజ.. బయటకు పంపించేద్దామంటూ పనిష్మెంట్!
'బిగ్బాస్ హౌస్లో హింసకు చోటు లేదు' ఈ నియమం ఇప్పటిది కాదు. తొలి సీజన్నాటి నుంచే ఈ రూల్ ఉంది. అయినా టాస్కులు జరిగేటప్పుడు కొన్నిసార్లు ఈ రూల్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అప్పుడు నాగార్జున చేత కంటెస్టెంట్లకు కోటింగ్ కూడా ఉంటుంది. ఈ సారీ అదే జరిగింది. కాకపోతే ఇదేమీ కొట్టుకునేంత ఫిజికల్ టాస్క్ కాదు. అయినా తేజ బెల్ట్తో గౌతమ్ను టపాటపా కొట్టాడు. హౌస్లో ఉన్నవాళ్లకు ఎలా ఉందో కానీ చూసే జనాలకు మాత్రం గొడ్డును బాదినట్లు బాదాడనిపించింది. తను కావాలని చేయకపోయినా బెల్ట్తో మెడపై అంత గట్టిగా కొట్టడం.. అక్కడున్నవాళ్లు వద్దని హెచ్చరిస్తూ కేకలు పెడుతున్నా తన చర్యలు ఆపకోవడం గమనార్హం. ఇలాంటి అరాచకాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యాడు నాగార్జున. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్ను తేజ ఎలా బాదాడో వీడియో చూపించాడు నాగ్. సంచాలకుడిగా ఉన్న సందీప్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శించాడు. అన్నింటికీ బాస్లా పోజు కొట్టే శివాజీ సైతం నిమ్మకు నోరెత్తనట్లు ఉండటంతో అతడినీ ఏకిపారేశాడు. మీ ఇద్దరికీ కళ్లు కనబడట్లేదా? అని తిట్టిపోశాడు. తర్వాత తప్పు చేసిన తేజను చెడుగుడు ఆడుకున్నాడు. అక్కడ అమ్మాయిలు భయంతో అరుస్తుంటే వినబడట్లేదా? అని నాగ్ ప్రశ్నించగా.. అది ఎంకరేజ్మెంట్ అనుకున్నానని నీళ్లు నమిలాడు తేజ. తేజ చేసిన తప్పుకు ఏ శిక్ష వేయాలని కంటెస్టెంట్లనే తిరిగి ప్రశ్నించాడు నాగ్. శుభశ్రీ.. అతడిని జైల్లో వేయాలంది. ప్రియాంక.. జైలు శిక్ష కూడా తక్కువేనంది. సందీప్ అయితే ఏకంగా అతడిని బయటకు పంపించేయాలన్నాడు. దీంతో తేజ తప్పు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చదవండి: ఓటీటీలో నిత్యా జోరు, మరో కొత్త వెబ్ సిరీస్ డేట్ వచ్చేసింది.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా! -
'ఎవరు సార్ ఆయన.. నాకేంటి సంబంధం'.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ!
టేస్టీ తేజ.. మీలో ఈ పేరు ఎంతమందికి తెలుసు. దాదాపుగా చాలామందికి తెలియదనే చెబుతారు. ఎందుకంటే అతని అంతలా ఫేమ్ ఉన్న వ్యక్తి కాదు. అతన్ని గుర్తు పెట్టుకునేంత ఏం చేశాడని అంటారా?.. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్గా అడుగుపెట్టేంత వరకు కూడా ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. బిగ్ బాస్ షోకు రాకముందు అతను ఏం చేశాడు? తొమ్మిదో కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టిన టేస్టీ తేజను ఈ అవకాశం ఎలా వరించింది? ఆ వివరాల గురించి ఓసారి తెలుసుకుందాం. (ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?) జబర్దస్త్తో కెరియర్ స్టార్ చేసిన తేజ.. యూట్యూబర్గా ఫేమస్ అయ్యారు. తన సొంత యూట్యూబ్ ఛానల్తోనే పాపులరిటీ తెచ్చుకున్నారు. తేజా ఫుడ్ లవర్ కావడంతో అతని పేరు కాస్తా టేస్టీ తేజాగా మారింది. మొదట చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్తో తేజా ప్రయాణం మొదలై.. ఆ తర్వాత దూసుకెళ్లాడు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడలో కూడా సెలబ్రిటీలతో టేస్టీ తేజ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఏకంగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా.. తేజాకి డబ్బులిచ్చి మరీ ఫుడ్ వీడియోలు చేయించుకుంటున్నారంటే మనోడి క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టేస్టీ తేజ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన గురించి మాట్లాడుతూ ఫుల్ ఎమోషలయ్యారు. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. టేస్టీ తేజకు జబర్దస్త్ కమెడియన్గా రాణించేందుకు లైఫ్ ఇచ్చింది మాత్రం అదిరే అభి. ఇంటర్వ్యూలో అతని ఫోటో చూడగానే టేస్టీ తేజ కన్నీళ్లాగలేదు. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. (ఇది చదవండి: 'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!) టేస్టీ తేజ మాట్లాడుతూ..'ఎవరు సార్ ఆయన.. ఆయనకు, నాకు ఏంటి సంబంధం సార్.. నాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? .. అంటూ అభిని చూస్తూ చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. తేజ వేరే వాళ్లతో వెళ్దామని చాలా మంది సలహాలిచ్చినా.. లేదు మనోడు చేస్తాడు.. అని నాతో చేయించాడు. ఎప్పుడు ఎక్కడికెళ్లినా ఈయనను మాత్రం మర్చిపోను సార్. జబర్దస్త్లో చేసిన పరిచయాల వల్లే నా సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫేమస్ అయ్యాను. ఏ సినిమా ప్రమోషన్ అయినా టేస్టీ తేజ వీడియో కచ్చితంగా ఉంటుంది. ఇదంతా అన్న వల్లే సాధ్యమైంది. ఎక్కడున్న అన్న బాగుండాలి.. మాలాంటి వారికి ప్రోత్సహించాలి. అందుకే అన్నను చూడగానే ఏడుపు వచ్చేసింది.' అంటూ ఎమోషనల్ అయ్యారు. -
'బిగ్బాస్'లో అనుకున్నదే జరిగింది.. వెళ్తూ షకీలా ఏడిపించేసింది!
'బిగ్బాస్'లో మిగతా రోజుల సంగతెలా ఉన్న వీకెండ్ వస్తే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎలిమినేషన్ టెన్షన్ కచ్చితంగా ఉంటుంది. శనివారం అందరికీ ఓ రౌండ్ వేసిన నాగార్జున.. ప్రశంసలతో పాటు కౌంటర్స్ ఇచ్చేశాడు. ఇక ఆదివారం ఎపిసోడ్లో బోలెడంత ఫన్ ఇస్తూనే, చివర్లో ఎలిమినేషన్ కూడా చేశాడు. అనుకున్నట్లే ఆమె ఇంటినుంచి బయటకెళ్లినప్పటికీ.. కాస్త డిఫరెంట్గా జరిగింది. ఇంతకీ ఆదివారం (Day-14) హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) శివాజీకి కౌంటర్స్ సోమవారం వినాయక చవితి కాబట్టి.. గణేశుడి పాటకు డ్యాన్స్ చేస్తూ హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. అయితే శనివారం ఎపిసోడ్లో పవరస్త్ర గెలుచుకున్న శివాజీ.. దాన్ని హాల్లో అలానే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో నాగ్ చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనే తీసుకుని ఉంటే, అది వాళ్లది అయ్యేదని చెప్పాడు. ఎవరూ తీసుకోకపోవడంతో దాన్ని శివాజీకే ఇచ్చేశారు. సండే ఫండే ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. అయితే దాని కంటే ముందు కాస్త హౌస్ అంతా ఫన్ జనరేట్ చేయడం కామన్. ఈసారి కూడా భళ్లాలదేవ, కట్టప్ప అని రెండు బొమ్మలు పెట్టారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్.. హౌసులో తనకి ఎవరు భళ్లాలదేవ? ఎవరు కట్టప్ప? అనేది చెప్పి కారణాలు చెప్పాలని నాగ్ 'BB సామ్రాజ్యం' అనే గేమ్ పెట్టాడు. ఇందులో తేజని నలుగురికి కట్టప్ప అయ్యాడు. గౌతమ్.. ముగ్గురికి కట్టప్ప అయ్యాడు. పూర్తి లిస్ట్ దిగువన ఉంది చూసేయండి. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) కంటెస్టెంట్ - కట్టప్ప, భళ్లాలదేవ శోభాశెట్టి.. గౌతమ్, ప్రిన్స్ గౌతమ్ - రతిక, ప్రిన్స్ రతిక - తేజ, గౌతమ్ తేజ - గౌతమ్, శివాజీ శివాజీ - తేజ, ప్రశాంత్ ప్రశాంత్ - తేజ, శివాజీ దామిని - శుభశ్రీ ,సందీప్ సందీప్ - శివాజీ, శుభశ్రీ శుభశ్రీ - తేజ , సందీప్ ప్రియాంక - శివాజీ , సందీప్ ప్రిన్స్ - సందీప్, శివాజీ అమరదీప్ - గౌతమ్, సందీప్ షకీలా - ప్రిన్స్, ప్రశాంత్ వాళ్లు సేఫ్ ఓవైపు పైన చెప్పిన జరుగుతుండగానే మరోవైపు మధ్యలో ఓసారి ఎలిమినేషన్ గురించి నాగ్ చెబుతూ వచ్చాడు. అలా తొలి రౌండులో ప్రిన్స్, రెండో రౌండులో రతిక, మూడో రౌండులో శోభాశెట్టి, ప్రశాంత్, నాలుగో రౌండులో గౌతమ్ సేవ్ అయ్యారు. ఇకపోతే ఎలిమినేషన్ కంటే ముందు 'కొంచెం గెస్ చేయ్ గురూ' అని నాగ్.. మరో గేమ్ పెట్టాడు. ఈ వారం ఆడిన రణధీర, మహాబలి గ్రూపులని ఇందులో అలానే పార్టిసిపేట్ చేయమన్నాడు. దీంతో మాయస్త్ర టాస్కులో ఓడిన మహబలి టీమ్ ఇక్కడ గెలిచారు. లగ్జరీ బడ్జెట్ సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: రజనీకాంత్తో ఉన్న ఈ పిల్లాడు స్టార్ హీరో.. గుర్తుపట్టారా!?) షకీలా ఎలిమినేట్ ఇక చివరగా మిగిలిన తేజ, షకీలా.. యాక్టివిటీ రూంలోకి వెళ్లారు. ఎవరి ఫొటో బయటకొస్తుందో వాళ్లు సేఫ్ అయినట్లు అని నాగ్ చెప్పారు. తేజ ఫొటో ఉండటంతో అతడు బతికిపోయాడు. షకీలా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆమె వెళ్లిపోవడంతో సందీప్, అమర్దీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తేజ కూడా ఎమోషనల్ అయ్యాడు. షకీలా తనకు అమ్మలా అనిపించారని అన్నాడు. దామిని అయితే 'పెదవే పలికిన మాటల్లోనే' పాట పాడింది. అయితే ఈ సాంగ్ పాడుతున్నప్పుడు షకీలా.. భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా వెళ్తూ వెళ్తూ హౌసు మొత్తాన్ని ఏడిపించేశారు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. షకీలా ఉండాల్సింది అయితే అప్పట్లో వ్యాంప్ తరహా పాత్రలతో కుర్రాళ్లని పిచ్చెక్కించిన షకీలా వేరు. హౌసులోకి వచ్చిన షకీలా వేరు. ఎందుకంటే 'బిగ్బాస్'లో చాలా హుందాగా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్లో ఉన్నవాళ్లలో ఈమెకి తక్కువ ఓట్లు పడ్డాయి. బహుశా ఇంకొన్నాళ్లు హౌసులో షకీలా ఉండుంటే బాగుండేది. (ఇదీ చదవండి: నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!) -
షకీలా ఎలిమినేట్.. ప్రోమోలోనే తెలిసిపోయిందిగా!
బిగ్బాస్ తెలుగు 7లో మరొకరిని ఎలిమినేట్ చేసే సమయం ఆసన్నమైంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రేపు గణపతి పండగ కావడంతో వినాయకుని పాటతోనే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. కంటెస్టెంట్లతో ఈరోజు ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఆటలో మీకు ఎవరు భళ్లాల దేవ? ఎవరు కట్టప్ప? అని ఆట ఆడించాడు. ప్రియాంక.. శివాజీని కట్టప్పగా పేర్కొంది. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. స్క్రీన్పై కాస్ట్యూమ్ కనిపిస్తుంది. ఆ కాస్ట్యూమ్ చూసి అదేం సినిమానో గుర్తు చేయాలి. ఇలాంటి ఫన్ గేమ్లు ఇస్తే మనోళ్లకు తెగ సంబరం.. పోటీపడి మరీ ఆడారు. మధ్యలో తేజ ఇంద్ర సినిమాలోని చిరంజీవి వీణ స్టెప్పు వేస్తానని ట్రై చేసి తన పరువు తానే తీసుకున్నాడు. చివర్లో ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ప్రశాంత్, షకీలా, గౌతమ్, శోభా శెట్టి, తేజకు కొమ్ములు పెట్టారు. అయితే అదే ప్రోమోలో షకీలా పక్కన తేజ, ప్రశాంత్ కొమ్ము లేకుండా కనపడ్డారు. మరో ప్రోమోలో కంటెస్టెంట్లు అందరూ ఎలిమినేట్ అయిన వ్యక్తి వెనకాల వెళ్తూ కనిపించారు. వారిలో శోభా, గౌతమ్ ఉన్నారు. మిగిలిందల్లా షకీలా ఒక్కరే.. దీంతో షకీలా అమ్మ ఎలిమినేట్ అయిందని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. చదవండి: హర్ష సాయి హీరోగా మెగా మూవీ.. టీజర్ చూశారా? డైలాగులు అదిరిపోయాయి! -
చిన్నప్పుడే సినిమా ఆఫర్.. ఒప్పుకోని టేస్టీ తేజ తండ్రి!
తెనాలి: ‘టేస్టి తేజ’.. యూట్యూబ్లో చిరపరిచితమైన పేరు. హోటల్ ప్రమోషన్స్తో ఆరంభించి సినిమా ప్రమోషన్స్తో సందడి చేస్తున్న చానల్ ఇది. మూడున్నర లక్షలకుపైగా సబ్స్రైబర్స్.. లక్షలాది వ్యూస్ సాధిస్తున్న ప్రోగ్రాం టేస్టి తేజ. దీని నిర్వాహకుడు ఇప్పుడు బిగ్బాస్–7 కంటెస్టెంట్గా వినోదాన్ని పంచుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూనే తన అభిరుచిని లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్న ఓ యువకుడి విజయగాధ ఇది. కుటుంబ నేపథ్యం అసలు పేరు కల్లం తేజ్దీప్. తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, ఆదిలక్ష్మి. హైస్కూలు వరకు తెనాలిలో చదివిన తేజ్దీప్, విజ్ఞాన్ యూనివర్శిటీలో ఇంటర్, బీటెక్, ఎంటెక్ చేశాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగంతో 2017లో హైదరాబాద్ వెళ్లాడు. నటనపై ఆసక్తితో.. తేజ్దీప్కు చిన్నప్పటి నుంచీ నటన, సినిమాలంటే ఆసక్తి. 8వ తరగతిలో ఉండగా అతడిని బాల నటుడిగా పరిచయం చేస్తానంటూ తమిళ నిర్మాత ఒకరు సంప్రదించారు. అయితే తేజ్ తండ్రి అంగీకరించలేదు. పాఠశాలలో, కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో తన టాలెంట్ను ప్రదర్శిస్తూ వచ్చిన తేజ్దీప్కు అనుకోకుండా కరోనా సెలవులు కలిసొచ్చాయి. అనుకోకుండా ఓ రోజు.. 2020లో వర్క్ ఫ్రం హోమ్లో ఉండగా, ఒకరోజు అనుకోకుండా తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్కు వెళ్లిన తేజ్ భోజనం చేస్తూ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో హైదరాబాద్ వెళ్లాక టేస్టీ తేజ పేరుతో హోటళ్ల సందర్శన కొనసాగించాడు. సబ్స్క్రైబర్స్, వ్యూస్ పెరిగాయి. దీంతో జబర్దస్త్లోనూ అవకాశం లభించింది. గుర్తింపూ తెచ్చుకున్నాడు. జబర్దస్త్, టేస్టీ తేజతో బిజీగా మారాడు. సినిమా ప్రమోషన్లకు టేస్టీ తేజ చానల్ వేదికైంది. ఉద్యోగానికి ఆటంకం లేకుండా, వీకెండ్లోనే తేజ్ వీడియోలు చేస్తున్నాడు. నాలుగు సినిమాల్లోనూ తేజ్ మెరిశాడు. బిగ్బాస్లోకి ఎంట్రీ ఈనెల 3 తేదీ నుంచి జరుగుతున్న బిగ్బాస్ సీజన్–7లో కంటెస్టెంట్గా తేజ్ పోటీపడుతున్నాడు. హోస్ట్గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జున తనతో కూడా టేస్టీ తేజ ప్రోగ్రాం చేయాలని కోరారు. షోలో ఆద్యంతం వినోదాన్ని పంచుతున్న తేజ్ రెండో వారం నామినేషన్కు వచ్చాడు. దీంతో అతడికి ఓట్ చేయాలని తేజ్ తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మాజీ బాయ్ఫ్రెండ్ను తల్చుకుని ఏడ్చేసిన రతిక.. పల్లవి ప్రశాంత్ ఫేక్!
బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్లు ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. బిగ్బాస్ టాస్క్ ఇస్తే ఆలస్యం గెలిచి తీరాల్సిందే అన్నంత కసిగా ఆడుతున్నారు. ఐదువారాల ఇమ్యూనిటీ పవర్ ఇస్తానని బిగ్బాస్ ఆశ పెట్టగానే హౌస్హేట్స్ మరింత అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో కొందరు మెప్పించగా మరికొందరు ఓవరాక్షన్ చేశారు. మరోపక్క అల్లరిపిల్లగా కనిపించే రతిక మాజీ ప్రియుడిని తలుచుకుంటూ కంటతడి పెట్టేసుకుంది. ఇంతకీ తాజా(సెప్టెంబర్ 7) ఎపిసోడ్లో ఏమేం జరిగాయో ఓసారి చూసేద్దాం.. లేడీ గెటప్లో ప్రిన్స్ బిగ్బాస్ తనను ఇంప్రెస్ చేసినవారికి ఇమ్యూనిటీ టాస్క్ బరిలో నిలిచే ఛాన్స్ ఇస్తానన్నాడు. దీంతో అమర్దీప్ అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చారి పాత్రలో, రతిక.. బ్రహ్మీ క్యారెక్టర్లో ఇమిడిపోయారు. ప్రిన్స్ యావర్ లేడీ గెటప్ వేసుకుని ఇల్లంతా తిరిగాడు. అయితే శివాజీ మాత్రం ఇవన్నీ తన వల్ల అయ్యే పని కాదని తనలో ఉన్న ఫ్రస్టేషన్ను తీర్చుకునేందుకు నటన అనే సాకు అడ్డుపెట్టుకుని బిగ్బాస్ను చెడామడా తిట్టేశాడు. కెమెరాల ముందు మాత్రం ఇది యాక్టింగ్ మాత్రమే అని బుకాయించాడు. తనకు కాఫీ కావాలని మొన్నటి నుంచే అడుగుతున్నాడు శివాజీ. ఇప్పుడు మంచి ఛాన్స్ దొరకడంతో యాక్టింగ్ పేరుతో బిగ్బాస్ను నానామాటలు అని, అడ్డొచ్చిన వాళ్లను సైతం తిట్టి తన కోపాన్ని బయటకు కక్కాడు. మెలికలు తిరిగిన రతిక అటు గౌతమ్ను శివాజీ బీపీ చెక్ చేయమని, రతికను స్టెతస్కోప్తో అందరి గుండె ఏం చెప్తుందో చెప్పాలన్నాడు బిగ్బాస్. కానీ ఇక్కడ కూడా శివాజీ ఓవరాక్షన్ చేస్తూ వారు పని చేయకుండా అడ్డుకున్నాడు. ఇతడి అతి భరించలేక ఆఖరికి బిగ్బాస్ అతడిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి కాఫీ ఇచ్చి అతడి నోటికి తాళం పడేలా చేశాడు. మరోవైపు శుభశ్రీ ఏ పిల్లగాడా.. అంటూ పాట పాడుతూ పరికిణీలో స్టెప్పులేసింది. ఇలా ఎవరికి వారు తంటాలు పడుతుండగా బిగ్బాస్ రతికను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు? అని అడగ్గా రతిక మెలికలు తిరిగిపోయింది. అమాయకంగా ఉండాలి, సంగీతంపై అవగాహన ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే నా మాజీ ప్రియుడిలా ఉండాలి అంది. ఏళ్లుగా మిస్ అవుతున్నా ఎవరినైనా మిస్ అవుతున్నావా? అని బిగ్బాస్ అడగ్గానే కన్నీళ్లు పెట్టుకుంది. 'మిస్ అవుతున్నావా? అని అడిగితే ఎవరైనా పేరెంట్స్ పేరు చెప్తారు. కానీ వాళ్లు దగ్గరున్నా కూడా ఇంకెవరినైనా మిస్ అవుతామా? అంటే అది ఆ వ్యక్తే! మిస్సింగ్ ఫీలింగ్ అనగానే అతడే గుర్తొచ్చాడు. కొన్ని ఏళ్ల నుంచి మిస్ అవుతున్నాను. ఈ టాపిక్ లేవనెత్తగానే నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతానో అర్థం కావట్లేదు. బిగ్బాస్ హౌస్ ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో చూస్తున్నాను' అని పేర్కొంది. దీనికి బిగ్బాస్ బదులిస్తూ.. ఇప్పటివరకు నువ్వు ఎన్నో పాటలు పాడావు కదా.. నీకోసం ఓ పాట వినిపిస్తాను అంటూ ఉడతా ఉడతా ఊచ్ అని పాట ప్లే చేశాడు. ప్రశాంత్ ఫేక్.. అనంతరం షకీలాను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి గాసిప్స్ సహా కొన్ని ముచ్చట్లు చెప్పాలన్నాడు. దీంతో షకీలా మాట్లాడుతూ.. 'ప్రశాంత్ స్ట్రాంగ్, కానీ ఫేక్ అనిపిస్తుంది. రతిక.. ప్రశాంత్ను ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంది. గౌతమ్- శుభ్రీ రాత్రంతా ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉన్న అన్ని బంధాలూ ఫేక్ రిలేషన్సే..' అని పేర్కొంది. టేస్టీ తేజ షో ప్రారంభంలో నాగ్ ఇచ్చిన బ్యాడ్జ్లను తాజా ఎపిసోడ్లో పంచాడు. పెరుగన్నం బ్యాడ్జ్ శుభశ్రీకి ఇచ్చాడు. ఇందుకోసం ఆమె 20 సెకన్లపాటు తేజను ఎత్తుకుంది. మిర్చి బ్యాడ్జ్కు గానూ శోభాశెట్టి తేజతో రొమాంటిక్ డ్యాన్స్ చేసింది. బర్గర్ బ్యాడ్జ్ను రతికకు ఇచ్చాడు. తన గురించి ఏదైనా పాట రూపంలో చెప్పాలన్నాడు. డాక్టర్బాబు- మోనితల ట్రాక్ ఇంతలో తేజను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన బిగ్బాస్ ఇంట్లోని గాసిప్స్ గురించి ఆరా తీశాడు. 'శోభాకు కనెక్ట్ అవుతున్నాడని గౌతమే నాతో స్వయంగా చెప్పాడు. డాక్టర్బాబు- మోనితల గురించి హౌస్లోనూ మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్ను ఫేక్ అని చెప్పలేను, కానీ.. కావాలని కింద కూర్చుంటూ, కింద పడుకున్నాడేమో అనిపిస్తోంది' అని తెలిపాడు. ఈ ఎపిసోడ్లో బిగ్బాస్ తనను ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. చదవండి: ఐ బొమ్మ వార్నింగ్ ఇవ్వడమేంటి?.. వైరలవుతున్న పోస్ట్! -
హీరోయిన్ను డైరెక్ట్గా ముద్దు పెట్టమని తేజ గోల.. చివరికి సాధించాడుగా!
బిగ్బాస్ హౌస్లో ఇప్పుడిప్పుడే టాస్కులు షురూ అవుతున్నాయి. ఇక్కడ అంతా ఉల్టా పల్టా అని ముందునుంచీ బిగ్బాస్ భయపెడుతూ ఉంటే దేనికైనా రెడీ అని హౌస్మేట్స్ తెగించి ఉన్నారు. ఓ పక్క టాస్కుల్లో ఉత్తేజంగా ఆడుతూనే మరోపక్క తోటి కంటెస్టెంట్లతో బంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఈ విషయంలో అందరికంటే యమ జోరుగా ఉన్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. హౌస్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే హీరోయిన్ రతిక రోస్ను బుట్టలో పడేశాడు. తన మనసే ఇచ్చేస్తానని రతిక అనడంతో ప్రశాంత్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తాజాగా టేస్టీ తేజ కూడా ఇలాంటిది తనకేమైనా వర్కవుట్ అవుతుందేమోనని ప్లాన్ చేశాడు. శుభశ్రీ రాయగురు తేజను అమ్మాయిలా రెడీ చేసేందుకు రెడీ అయింది. అతడి ముఖానికి మేకప్ అద్ది, పిలకజుట్టు వేసింది. అనంతరం లిప్స్టిక్ పూస్తుండగా డైరెక్ట్గా పెదాలతో లిప్స్టిక్ వేయొచ్చుగా అని అడిగాడు. తేజ మాటలు విని షాకైన శుభశ్రీ.. అలాంటి పప్పులు ఉడకవంటూ అతడి చెంపపై లిప్స్టిక్ రుద్దింది. అయినా సరే తేజ పట్టువిడవకుండా తనకు డైరెక్ట్గా లిప్స్టిక్ కావాలని గోల చేశాడు. దీంతో అక్కడే ఉన్న షకీలా.. ఓస్ అంతేనా.. అని అతడి బుగ్గన ముద్దు పెట్టింది. అలా అతడి బుగ్గపై షకీలా లిప్స్టిక్ మరకలు పడ్డాయి. దీంతో అక్కడున్నవారంతా నవ్వారు. అయితే తేజ తనకు దేవుడిచ్చిన కొడుకు అని చెప్పుకొచ్చింది షకీల. చదవండి: బిగ్బాస్: కండబలం కంటే బుద్ధిబలం గ్రేట్ అని నిరూపించారు!