Union govt
-
‘సుప్రీం’లో ఆప్ సర్కార్కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు విషయంలో ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి ఊరట లభించింది. పథకానికి సంబంధించిన ఎంవోయూపై ప్రభుత్వం సంతకాలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బలవంతంగా సంతకం చేయించడం ఏంటన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ.. నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకం ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని కిందటి నెలలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఆప్ సర్కార్ ఓ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసిహ్లతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ పిటిషన్పై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat Health Infrastructure Mission (PM-ABHIM) scheme) పథకాన్ని కేంద్ర ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఢిల్లీలోనూ దీనిని ప్రవేశపెట్టాలని చూసింది. అయితే దేశ రాజధానికి దీని అవసరం లేదని, ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోనే ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారంటూ ఆప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రమంగా ఇది రాజకీయ దుమారం రేపింది.దీనిపై బీజేపీ ఎంపీలు హైకోర్టులో పిటిషన్ వేయగా.. పథకాన్ని వర్తింపజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదనంతరం బీజేపీ ఆప్ మధ్య మాటలు తుటాలు పేలాయి. అయితే సుప్రీం కోర్టులో ఆ ఆదేశాలకు బ్రేకులు పడ్డాయి. సుప్రీం కోర్టులో ఆప్ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.ఏమిటీ పథకం.. పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడమే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఉద్దేశం. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఒక అంచనా. ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సీజీహెచ్ఎస్, ఎక్స్సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారూ ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. -
ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్
Farmer's Protest 2024 Latest Updates టియర్ గ్యాస్ షెల్ తగిలి యువరైతు మృతి ఖానౌరీ సరిహద్దులో హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ వదలటం షెల్ తగిలి 24 ఏళ్ల యువరైతు మృతి. శుభ్ కరణ్ సింగ్ అనే యువ రైతును ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాల ధృవీకరణ 24-year-old farmer Subh Karan dies in police firing at Khanauri border. @htTweets @HTPunjab @ramanmann1974 @RakeshTikaitBKU @priyankagandhi @deependerdeswal pic.twitter.com/5yWKCtOVZ0 — Sunil rahar (@Sunilrahar10) February 21, 2024 కేంద్రం వాదనను తప్పుపట్టిన పంజాబ్ ప్రభుత్వం రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాలపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది సరిహద్దుల్లో రైతులు చేరడానికి పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్న కేంద్రం వాదనను పంజాబ్ ప్రభుత్వం తప్పు పట్టింది హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిటం వల్ల 160 మంది రైతులు గాయపడ్డారు పంజాబ్ ప్రభుత్వం బాధ్యతతో శాంతిభద్రతలను నిర్వహిస్తోంది ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్ శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత రైతులను అడ్డుకుంటున్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన భద్రతా దళాలు డ్రోన్లతో రైతులపైకి టియర్ గ్యాస్ వదులుతున్న పోలీసులు కొందరు రైతులకు స్వల్ప గాయాలు రైతులను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం ఛలో ఢిల్లీ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులను చర్చలకు పిలిచిన వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ట్విట్టర్లో పోస్టు పెట్టిన అర్జున్ ముండా అయినా స్పందించని రైతులు శంభూ బార్డర్లో రైతులపై టియర్గ్యాస్ ప్రయోగించిన హర్యానా పోలీసులు #WATCH | Union Agriculture Minister Arjun Munda says, "...In the 5th round of meeting, we are ready to talk with farmers and discuss issues like MSP, stubble, FIR, and crop diversification. I appeal to them to maintain peace and we should find a solution through dialogue." pic.twitter.com/F17XwZs3Ur — ANI (@ANI) February 21, 2024 హర్యానా పోలీసులే టియర్ గ్యాస్ ప్రయోగించారు: పంజాబ్ డీజీపీ హర్యానా పోలీసులే కావాలని రైతులపై టియర్గ్యాస్ ప్రయోగించారు. మొత్తం 14 టియర్ గ్యాస్ గుళ్లను ఇందుకు వాడారు. రైతుల నుంచి ఎలాంటి రెచ్చగొట్టే సంఘటనలు లేకపోయినా హర్యానా పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీనిపై మేం మా నిరసనను హర్యానా పోలీసులకు తెలియజేశాం శంభూ సరిహద్దులో రైతులపై టియర్ గ్యాస్.. ఉద్రిక్తత చర్చలకు రావాలన్న కేంద్రం పిలుపును రైతులు పట్టించుకోలేదు పంజాబ్-హర్యానా శంభూ సరిహద్దు నుంచి ఢిల్లీ వైపునకు రైతులు కదిలారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను పేల్చారు. దీంతో అక్కడ రైతులంతా చెల్లా చెదురయ్యారు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ ఛలో.. పునఃప్రారంభం ఢిల్లీ ఛలో యాత్రను రైతులు ప్రారంభించారు ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు సరిహద్దులో మానవహారంగా పోలీసులు మోహరించి ఉన్నారు ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది ఢిల్లీ, సాక్షి: రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్తో ఢిల్లీ ఛలో చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం అయ్యారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్రం రైతు సంఘాలతో నాలుగు దఫాలుగా చర్చలు జరిపింది. అయితే నాలుగో విడత చర్చల్లో.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తికి ఐదేళ్లపాటు కనీస మద్దతు ధర ఒప్పందం చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే.. అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ కల్పించాల్సిందేనని పట్టుబట్టాయి రైతు సంఘాలు. దీంతో చర్చలు విఫలమై.. మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. ఢిల్లీ వైపు వెళ్లే.. పంజాబ్ - హర్యానా సరిహద్దు వద్ద రైతులను నిలువరిస్తున్నారు పోలీసులు. ఒకవైపు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలతో, ముళ్ల కంచెలతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అదే సమయంలో.. తొలి రోజు నాటి అనుభవాల దృష్ట్యా రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెలను చేధించేందుకు జేసీబీలు, వాటిని నడిపేవాళ్లపై టియర్ గ్యాస్ ప్రభావం పడకుండా ప్రత్యేక ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో రైతులూ సిద్ధమయ్యారు. శంభు సరిహద్దు వద్ద 1,200 ట్రాక్టర్లు, 14 వేల మంది మోహరించినట్లు కేంద్రం హోం శాఖ నివేదిక రూపొందించింది. తక్షణమే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్డీయే ఎంపీల ఘెరావ్ ఢిల్లీ ఛలోతో పాటు బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలతో నిరసన తెలపాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) పిలుపునిచ్చింది. ఇక పంజాబ్లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్కేఎమ్ ఇప్పటికే ప్రకించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: మళ్లీ ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా? -
మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు.. అప్పటి వరకు నో యాక్షన్
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఢిల్లీ ఛలో’ చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చండీగఢ్లో గురువారం రోజు వివిధ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. అప్పటి వరకు నిరసనకారులు శాంతియుంతంగా ఉంటారని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నాడు. వివిధ సరిహద్దుల వద్ద పోలీసులు ఏర్పాటు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయరని తెలిపారు. చండీగఢ్లో బుధవారం సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం అనంతరం రైతు నాయకుడు మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్లో గురువారం సాయంత్రం 5 గంటలకు నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.కాగా పీయూష్ గోయల్ ఆహారం, పౌర సరఫరాల పంపిణీ మంత్రి పదవిలో ఉండగా.. రాయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. తమపై దాడి చేసింది పోలీసులు కాదని, పారమిలటరీ బలగాలని చెప్పుకొచ్చారు, ఇంత జరిగినా తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు,. కేంద్రంలో గొడవ పడేందుకు రాలేదు. మాపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించకూడాదని అనుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు సమావేశానికి పిలిచారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మా నుంచి ఎలాంటి చర్య ఉండదు. ప్రధాని మోదీపెద్ద మనసుతో ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి’ అని పేర్కొన్నారు. అంతకముందు కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయవద్దని కోరారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. -
భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..!
మునుపెన్నడూ లేని రీతిలో.. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానులైన పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు ప్రకటించారు. అంతకు ముందు మరో ఇద్దరి పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. సాధారణంగా భారతరత్న అవార్డులను ఒకరు, ఇద్దరు, గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఆ సంప్రదాయానికి 1999లో బ్రేక్ పడి.. ఏకంగా నలుగురికి ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకరు, ఇద్దరు, ముగ్గురికి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదుగురికి ప్రకటించింది. ఈ ఏడాది.. బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్కు భారతరత్నలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం ఐదుగురికి ఇచ్చినట్లయ్యింది. ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో.. ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపీ నరసింహరావు పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. దేశ హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న చరణ్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ మీరట్లో పుట్టిన పెరిగిన చరణ్ సింగ్.. 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ఆయన రెండుసార్లు పని చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం,బలగం ఉన్న రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ.. చరణ్ సింగ్ వారసులు స్థాపించిన పార్టీ), విపక్ష శిబిరానికి షాక్ ఇచ్చి ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం ఉన్న సమయంలోనే.. చరణ్ సింగ్కు అవార్డు ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి: గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్ ఎం.ఎస్ స్వామినాథ్.. భారత దేశ హరితవిప్లవ పితామహుడిగా మాన్కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆయన కన్నమూశారు. ఇదీ చదవండి: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త కర్పూరి ఠాకూర్ బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో గౌరవించింది. బిహార్కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి.. తన పాలనా దక్షతతో జన నాయక్గా చెరగని ముద్ర వేసుకున్నారు. 1924 జనవరి 24న బిహార్లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు.జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఇదీ చదవండి: అరుదైన జననాయకుడు ఎల్కే అద్వానీ రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న గౌరవం దక్కింది. సంఘ్ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని.. అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. అద్వానీ.. 1927 నవంబరు 8న భారత్లోని కరాచీ (ప్రస్తుతం పాక్లో ఉంది)లో జన్మించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్లో చేరారు.దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ.. రాజస్థాన్లో సంఘ్ ప్రచారక్గా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)కు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని సైతం ఆయన చేపట్టారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదీ చదవండి: గమ్యం చేరని రథ యాత్రికుడు -
CEC bill: పంతం నెగ్గించుకున్న కేంద్రం
సాక్షి, ఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల నడుమ.. కేంద్రం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ నడుమే బిల్లుకు ఆమోదం లభించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు.. కేంద్ర మంత్రిని తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి బదులు కేబినెట్ మంత్రిని చేరుస్తూ బిల్లు రూపకల్పన చేసింది కేంద్రం. ఆ మంత్రి పేరును కూడా ప్రధానినే నామినేట్ చేస్తారు. తద్వారా 1991 చట్టాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు.. ‘‘ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని’’ తీర్పునిచ్చింది. అయినప్పటికీ కేంద్రం ముందుకే వెళ్లింది. అయితే, తాజాగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టి.. విపక్షాల అభ్యంతరాలు బదులు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక మీదటా స్వతంత్రంగానే పని చేస్తుందని అన్నారాయన. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పు దిశకు అనుగుణంగా ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార విభజనకు తగ్గట్లు ఉంది’’ అని తెలిపారు. రాజ్యసభ ఆమోదం పొందిన సీఈసీ బిల్లు ప్రకారం.. ఈసీ, ఈసీ సభ్యుల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య సంఘం ఏర్పాటవుతుంది. దీనిలో లోక్సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ప్రతిపాదిత కమిటీపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీనే రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని భావించినా.. అది సాధ్యపడలేదు. తాజాగా సవరణలతో కూడిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టడం.. చర్చ జరగడం.. విపక్షాల అభ్యంతరాల నడుమే ఆమోదం పొందడం జరిగాయి. #Centre proposes amendments in #CEC and #ECs Bill, brings CEC and ECs on par with SC Judges, also ‘Search Committee’ will comprise of Law Minister and two Secretaries of #Union Govt. pic.twitter.com/ieag9LVDtF — Suneel Veer (@sunilveer08) December 12, 2023 -
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వండి: ఈసీకి సుప్రీం ఆదేశం
సాక్షి, ఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించే పథకం ద్వారా లంచాలను చట్టబద్ధం చేశామా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్లో అవకతవకలు, గోప్యతల విషయంలో దాఖలైన వాజ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు విచారణ మంగళవారం మొదలు కాగా..మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశిస్తూ 2019 ఏప్రిల్ 12 నాడు సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశశాలను ప్రస్తావించింది. ఏప్రిల్ 2019 ఉత్తర్వులు ప్రకటించిన తేదీకే పరిమితం కాదని పేర్కొంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఏదైనా సందేహాలు ఉంటే సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సాగిన విచారణలో.. ఈసీఐ తన వద్ద తాజా వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఏప్రిల్ 12, 2019న జారీ చేసిన మధ్యంతర ఆదేశాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ 2023 సెప్టెంబర్ 30 వరకు వివిధ రాజకీయపార్టీలు ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా పొందిన విరాళాల వివరాలను తమ అందించాలని ఆదేశిస్తున్నట్లు బెంచ్ తెలిపింది అంతకుముందు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున తన వాదనలను కొనసాగిస్తూ... ‘‘నిర్ణయం మరీ ఏకపక్షమైంద కానంత వరకూ ప్రయోగాలు చేసే హక్కు చట్టసభలకు ఉంది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఏమైందన్నది ప్రశ్న. ఆ ధోరణలను బెంచ్ ముందు ఉంచాం’’ అని ధర్మాసనానికి వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయవాది కనూ అగర్వాల్ కల్పించుకుని మాట్లాడుతూ గతంలో రూ.20 వేల కంటే తక్కువ మొత్తం నిధులు చెల్లించే వారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండేది కాదని.. పార్టీలు ఈ అంశాన్ని అవకాశంగా మార్చుకుని అధికశాతం విరాళాలు ఈ మొత్తం కంటే తక్కువ ఉండేలా జాగ్రత్త పడ్డాయని, పథకాన్ని దుర్వినియోగం చేశాయని బెంచ్ దృష్టికి తీసుకు వచ్చారు. సోలిసిటర్ జనరల్ దీనికి ఉత్తరమిస్తూ... ప్రస్తుతం కొంచెం అనుమానాస్పదమైన రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న విరాళాలు తగ్గాయని, ఎలక్టోరల్ బాండ్లు పెరిగాయని తెలిపారు. ఈ దశలో జస్టిస్ ఖన్నా కలుగజేసుకుని మాట్లాడుతూ రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న ఎలక్టోరల్ బాండ్లు ఎంత మేరకు వచ్చాయో చూపాలని కోరారు. బాండ్లు ఎక్కువై ఉంటే ఆ విషయం దీని ద్వారా తెలుస్తుందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు నిరాకరించిన పార్టీ ఇప్పటికీ అంతకంటే తక్కువ మొత్తమున్న స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తోందని సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు పెరిగితే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గుతాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించమన్న పార్టీ విషయంలో మాత్రమే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గడం లేదని తెలిపారు. అందుకే ఆ పార్టీ పాత పద్ధతి కోసం డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. అనంతరం.. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఎలక్షన్ ఫండింగ్, పార్టీ ఫండింగ్, క్యాంపెయిన్ ఫండింగ్ ఇవన్నీ కాలిడోస్కోప్(రంగురంగుల చిత్రాలను ప్రదర్శించే గాజుగొట్టం) లాంటిది. ఇదంతా ఆసక్తికరమైన ప్రయోగాంశంమేనన్నారు. -
ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా.. ఇక నాలుగో ప్రయత్నంగా
ఖమ్మం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ అంశం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. తాజాగా నాలుగో ప్రయత్నంగా ఇదే అంశంపై కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు కార్మిక సంఘాలు, సింగరేణి అధికారులతో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్లో సమావేశం జరుగనుంది. ఇందులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఓటర్ల జాబితా ఎప్పుడు ప్రకటించాలి తదితర అంశాలపై చర్చించనున్నారు. రెండేళ్లుగా వాయిదా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు తొలిసారిగా 1998లో జరగగా, చివరిసారి 2017 అక్టోబర్లో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపొందింది. ఈ సంఘం గుర్తింపు కాలపరిమితి 2021తో ముగిసింది. ఆతర్వాత వివిధ కారణాలతో యాజమాన్యం వాయిదా వేస్తూ వస్తోంది. ఈ అంశంపై సీపీఐ అనుబంధ సింగరేణి కోల్మైన్స్ యూనియన్ (ఏఐటీయూసీ) హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కార్మిక సంఘాలకే అనుకూలంగా తీర్పు వచ్చినా సాంకేతిక కారణా లను సాకుగా చూపుతూ సింగరేణి సంస్థ ఎన్నికలు వాయిదా వేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ ఆదేశాల మేరకే ఎన్నికల నిర్వహణలో వెనుకంజ వేస్తోందనే విమర్శలు సంస్థపై ఉన్నాయి. కారు జోరుకు బ్రేకులు.. ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థలో 42 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణికి సంబంధించిన అంశాలు గెలు పోటమలును ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో రెండుసార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో మిగిలిన ప్రాంతాల్లో కారు పార్టీ జోరు చూపించింది. కానీ కోల్బెల్ట్ ఏరియాల్లో మాత్రం ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. దీంతో గత రెండేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వస్తే రానీ.. పోతే పోనీ.. సింగరేణి ఎన్నికల నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందంటున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులతో తెగదెంపులు చేసుకున్న బీఆర్ఎస్.. తొలి జాబితా ప్రకటన తర్వాత అసమ్మతి నేతలు పార్టీని వీడి వెళ్తున్నా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక విషయంలోనూ ఏది జరిగినా సరే అనే భావన పార్టీలో నెలకొందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సాధ్యాసాధ్యాలను కేంద్ర కార్మిక శాఖ చూసుకుంటుందని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు తగ్గట్టుగా ముందుకు పోవడమే మంచిదనేది గులాబీ నేతల అభిప్రాయంగా చెబుతున్నారు. -
మార్పు కోసం మార్పా?
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత పేర్లతో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న ఈ కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉంది. పైగా పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ నాగరిక కాలానికి చెందినవి కావు. ఇంత భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్న ఈ ముసాయిదా బిల్లులపై విస్తృత సంప్రదింపులు జరపలేదు. బ్రిటిష్ కాలపు చట్టాలను సంస్కరించాలంటే పారదర్శకత అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులు చూస్తే అది సంస్కరణల కోసం కాకుండా... ఏదో కొత్తది చేయాలి కాబట్టి చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(నేర విచారణ ప్రక్రియ చట్టం), ఎవిడెన్స్ యాక్ట్ల సమూల ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు బిల్లులను ఒక్క వారం వ్యవధిలో సంపూర్ణంగా విశ్లేషించామని ఎవరైనా అంటే వారు అత్యంత మేధావులైనా కావాలి లేదా మోసకారులైనా(ఫ్రాడ్) అయివుండాలి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో 356 సెక్షన్లు ఉండగా, ఇరవై రెండింటిని రద్దు చేస్తు న్నారు, 175 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, కొత్తగా ఎని మిది సెక్షన్లను చేరుస్తున్నారు. ఇక భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)లో ఏకంగా 533 సెక్షన్లు ఉన్నాయి. మార్పులు/ చేర్పులు చేస్తున్న సెక్షన్ల సంఖ్య 160, రద్దు చేస్తున్నవి తొమ్మిది, కొత్తగా ప్రవేశపెడుతున్నవి తొమ్మిది. భారతీయ సాక్ష్య సంహితలో 170 సెక్షన్లు ఉండగా, 23 సెక్షన్లలో మార్పులు/చేర్పులు చేస్తున్నారు, తొమ్మిదింటిని రద్దు చేస్తున్నారు, ఒక సెక్షన్ కొత్తగా చేరుస్తున్నారు. నేనైతే మేధావిని కాదు, మోసకారిని కూడా కాదని అనుకుంటున్నా. కాబట్టి, ఈ మూడు కొత్త బిల్లుల సంపూర్ణ విశ్లేషణ చేసే సాహసాన్ని ఇతరులకు వదిలేసి, కొన్ని అసాధారణ విషయాలు, మంచి అంశాలు మాత్రం ప్రస్తావిస్తాను. అన్నింటికంటే ముందుగా... అత్యంత విచిత్రమైన అంశం గురించి చూద్దాం. దేశంలోని క్రిమినల్ కేసుల విచారణలో జాప్యానికి (ఐదు కోట్ల పెండింగ్ కేసుల్లో మూడింట రెండొంతులు క్రిమినల్ కేసులే) దివ్యౌషధమని హోమ్ మంత్రి చెబుతున్న కొత్త చట్టాలు అసలుకే మోసం తెచ్చే ప్రమాదం ఉండటం. ఈ మూడు చట్టాల్లోని మొత్తం 505 సెక్షన్లలో చేసిన మార్పులను దృష్టిలో పెట్టుకుంటే వీటిపై వాద ప్రతివాదనలు పెరిగిపోతాయి. ఇప్పటికే కేసుల భారంతో కునారి ల్లుతున్న న్యాయస్థానాలకు ఇది అదనపు భారమవుతుంది. కొత్త సెక్షన్ల నేపథ్యంలో వాదనలను కొత్తగా వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తవాటికి అలవాటు పడేంత వరకూ ఇది కొనసాగుతుంది కాబట్టి విలువైన కోర్టు సమయం వృథా అవడం గ్యారెంటీ. బహుశా కొత్త చట్టాల తయారీ కమిటీలో ఉన్న న్యాయవాదులు గానీ, నిపుణులు గానీ దీన్ని గమనించలేదేమో. రెండో విషయం... చట్టాల్లో చేపట్టదలచిన మార్పుల గురించి విస్తృత స్థాయిలో చర్చించి ఉంటే సమస్య చాలావరకూ పరిష్కార మయ్యేది. పద్దెనిమిది నెలల కాలం పాటు పనిచేసిన ఈ కమిటీ ఇలాంటి చర్చలేవీ చేపట్టిన దాఖలాలు లేవు. మూడు లా కమిషన్ల నివే దికలపై, పలు సంస్థల సంప్రదింపులపై మాత్రమే కమిటీ ఆధారపడింది. కమిటీ సభ్యుల ప్రాతినిధ్యం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు తగిన విధంగా లేదు. పైగా ఇలాంటి ప్రక్రియలో అతి ముఖ్యమైన పారదర్శకత, జవాబుదారీతనం అన్నవి అస్సలు లేకుండా పోయాయి. మూడో విషయానికి వద్దాం... ఈ కొత్త ప్రతిపాదనల్లో దేశద్రోహ నేరం ప్రభుత్వ మోసం మినహా మరోటి కాదు. గత ఏడాది సుప్రీంకోర్టు సెడిషన్ చట్టాల్లోని నిబంధనలపై దాదాపుగా స్టే విధించింది. అయితే కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసి... సెడిషన్ చట్టాన్ని సమీక్షిస్తున్నాము కాబట్టి, ఆ ప్రక్రియ సాగుతున్నంత కాలం స్టే విధించవద్దని కోరింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ ప్రకటనను నమోదు చేసింది. సెడిషన్ చట్టం తాలూకూ తీవ్రతను గణనీయంగా తగ్గించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు చర్యలు చెప్పకనే చెప్పాయి. అయితే కొత్త ప్రతిపాదనల్లో జరిగింది మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. ఈ ఏడాది జూన్లో న్యాయ కమిషన్ దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందిగా సిఫారసు చేసింది. ఆ వెంటనే ప్రభుత్వం భారత న్యాయ సంహితకు సంబంధించిన 150వ సెక్షన్ను ప్రవేశ పెట్టింది. మాటల గారడీతో పాత చట్టం కంటే మరింత నిరంకుశమైన చట్టాన్ని ప్రతిపాదించింది. సార్వభౌమత్వానికి, భారత ఐక్యతలకు భంగం కలిగించడం అన్న విషయాలకు మరింత విస్తృతమైన నిర్వచ నాలను ఇచ్చింది. ‘‘ప్రభుత్వంపై ప్రేమ లేకపోవడం’’ అన్నదాన్ని మాత్రం తొలగించింది. దేశద్రోహ నేరాన్ని మోపేందుకు 1960లో సుప్రీంకోర్టు పెట్టిన పరీక్షను స్పష్టంగా తప్పింది. కేవలం మాటలు మాత్రమే దేశద్రోహానికి కారణం కాజాలవనీ, హింసను ప్రేరేపించడం, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం కూడా ఉన్నప్పుడు మాత్రమే దేశద్రోహం చట్టం అమలవుతుందని సర్వోన్నత న్యాయ స్థానం తెలిపిన విషయం గమనార్హం. కొత్త చట్టంలో వీటిని విస్మరించడం మాత్రమే కాకుండా... ఎలక్ట్రానిక్, ఆర్థికాంశాలను చేర్చింది. పైగా మాటలు, పుస్తకాలు, నాటకం, కథనం వంటి అంశాలకూ దేశ ద్రోహ నిర్వచనాన్ని అన్వయించింది. నాలుగో అంశాన్ని చూస్తే... పోలీస్ కస్టడీకి సంబంధించిన మార్పులు ఈ కాలానికి చెందినవి కావు. ప్రస్తుతం పోలీస్ కస్టడీ కోరడం లేదా ఇవ్వడమనేది అదుపులోకి తీసుకున్న పదిహేను రోజుల్లో జరగాలి. అది కూడా గరిష్ఠంగా 15 రోజుల వరకే లభిస్తుంది. సైద్ధాంతికంగా చూస్తే పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు కూడా బెయిల్ లభించవచ్చు కానీ ఆచరణలో ఇలా జరగదు. పోలీసుల విచారణ కొన సాగుతూ ఉంటుంది కాబట్టి ఇది సిద్ధాంతానికి విరుద్ధమన్నమాట. ప్రతిపాదిత కొత్త చట్టాల్లో పోలీసు కస్టడీ అవధి 15 రోజులుగానే ఉంచినా అదుపులోకి తీసుకున్న తరువాత 40 రోజుల్లో ఎప్పుడైనా (పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే కేసుల్లో) కోరవచ్చు. ఒకవేళ కేసులో పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటే అరెస్ట్ అయిన 60 రోజుల్లో ఎప్పుడైనా కస్టడీ కోరవచ్చు. అంటే, కొత్త చట్టాల ప్రకారం కనీసం 40 లేదా 60 రోజుల వరకూ బెయిల్ వచ్చే అవకాశమే లేకుండా పోతుంది. నిందితులు పోలీసుల కస్టడీలో ఉండటం అవసరమని ప్రాసిక్యూషన్ వాదిస్తూనే ఉంటుంది. పరిస్థితిని మరింత దిగజార్చే విషయం ఇంకోటి ఉంది. పోలీస్ కస్టడీని 40 లేదా 60 రోజుల కాలంలో నేరుగా 15 రోజులు కాకుండా... అప్పుడప్పుడూ కొన్ని రోజుల చొప్పున కూడా కోరవచ్చు. పౌరుల సురక్ష అంటే ఇదా? ఐదో అంశం... సామాజిక సేవ అంశాన్ని చేర్చారు. మంచిదే కానీ కొత్తదేమీ కాదు. కాకపోతే వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరముంది. చిన్న చిన్న తప్పులకు మాత్రమే కాకుండా, మిగిలిన వాటికీ విస్తరించాల్సిన అవసరముంది. అయితే బీఎన్ ఎస్ఎస్లో దీనికి కొన్ని పరిమితులు విధించారు. విచిత్రమైన విషయం ఏమిటంటే... చిన్న చిన్న తప్పుల జాబితాలో క్రిమినల్ డిఫమేషన్ ను చేర్చడం. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవలే ఈ క్రిమినల్ డిఫమేషన్ ను తీవ్రమైన తప్పిదంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కేసులోనే 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని దాదాపుగా కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆరవ అంశం... ప్రతిపాదిత కొత్త చట్టాల్లో మూక హత్యలను చేర్చారు. మెచ్చదగిన విషయం. అయితే 2014 తరువాత ఈ రకమైన నేరాలు పెరిగేందుకు కారణమేమిటన్న విషయాన్ని చూడాలి. అలాగే ఇలాంటి నేరాల విచారణ పక్కాగా, రాజకీయ జోక్యం లేకుండా జరి గేందుకు అనువైన వాతావరణం ఉందా? అన్నది ప్రశ్న. దురదృష్టవశాత్తూ ప్రతిపాదిత కొత్త చట్టాల విస్తృతి, లోతు పాతులను దృష్టిలో ఉంచుకున్నా... చిన్న చిన్న వివరాలను విస్మరించిన వైనాన్ని చూసినా ఇదంతా ఏదో ఒక తంతు పూర్తి చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా కనపడుతుంది. సంస్కరణలపై చిత్తశుద్ధి మాత్రం వ్యక్తం కాలేదు. ‘ఎక్కడికి వెళ్తున్నావో తెలియనప్పుడు, ఏ దారీ నిన్ను ఎక్కడికి చేర్చదు’ అని హెన్రీ కిసింజర్ చెప్పిన మాట నిజం! అభిషేక్ సింఘ్వీ వ్యాసకర్త ఎంపీ, మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఎన్నికలు ముగిసే వరకూ ఆహార భద్రత !
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్ తర్వాత సైతం కొనసాగించే అవకాశాలున్నాయని కేంద్రప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ కారణాలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా 81 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వం ప్రతి నెల ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. నిజానికి ఈ ఉచిత బియ్యం పంపిణీ ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగించాలని కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే నిర్ణయించడం తెల్సిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత బియ్యం పథకాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని అధికార బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టింది. గతంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలు అండగా నిలిచిన నేపథ్యంలో ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించి ఈసారీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. దీంతోపాటే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రెండేళ్లుగా ఏడాది గరిష్టంగా ఒక్కో రీఫిల్కు రూ.200 సబ్సిడీ చొప్పున 12 సిలిండర్లను రాయితీ ధరకు అందిస్తోంది. వంటగ్యాస్ ధరలు ఎక్కువ స్థాయిలోనే కొనసాగితే ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్ట్ లు
-
హైదరాబాద్, చెన్నై మధ్య భారీగా తగ్గనున్న దూరం
-
అనాగరిక చర్య.. విచారకరం: కేటీఆర్
హైదరాబాద్: మణిపూర్ అఘాయిత్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు. అనాగరికమన్న ఆయన.. కేంద్రం మౌనంగా చూస్తోందంటూ మండిపడ్డారు. ‘‘తాలిబన్ లు పిల్లలను, మహిళలను అగౌరవపరుస్తున్నప్పుడు భారతీయులమైన మనము వారిపై విరుచుకుపడుతున్నాము. అలాంటిది, ఇప్పుడు మనదేశంలోనే మణిపూర్ లో కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరం. కొత్త భారతదేశంలో అనాగరిక చర్యలు విచారకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్రం మౌనంగా చూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ.. అమిత్షా జీ ఎక్కడ ఉన్నారు? దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని మణిపూర్ను రక్షించడం కోసం వినియోగించండి అన్ని పార్టీలు కలసి రావాలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ హింసపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించేలా చేస్తుందని చెప్పారు. దారుణమైన వేధింపులకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ప్రజలకు అన్ని పార్టీలు మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: మణిపూర్ వీడియోపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు -
రావమ్మా మహాలక్ష్మి.. ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అబ్బాయిలే అధికంగా ఉంటున్నారు. కానీ.. 2021 తర్వాత అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తికి సంబంధించి 2021– 22 నివేదిక లో ఈ విషయాలను వెల్లడించింది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 977 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 1,046కు పెరిగినట్టు నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య కార్యక్రమాల అమలు భేష్ రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు బాగా అమలు చేస్తుండటం వల్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఆరే ళ్లు నిండకముందే బాలికల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తి మృతి చెందేవారు. కానీ.. ఈ పరిస్థితులు తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, క్రమం తప్పకుండా యాంటీనేటల్ చెకప్, వ్యాధి నిరో ధక టీకాల అమలు అద్భుతంగా ఉండటం వంటి పరిస్థితుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల స్థాయిలోనే ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ కూడా సత్ఫలితాలు ఇస్తోంది. అమ్మాయిల సంఖ్య పెరగడానికి ఇవి కూడా కారణాలని నివేదిక వెల్లడించింది. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం కేరళ తర్వాత ఏపీలోనే అధికం దేశంలో అమ్మాయిలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో 1,046 మంది నమోదయ్యారు. అత్యల్పంగా హర్యానాలో 887 మంది అమ్మాయిలు మాత్రమే నమోదయ్యారు. ఏపీలో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,063 మంది, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,038 మంది అమ్మాయిలు ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతుండటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఇండియాలో సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 968 మంది అమ్మాయిలు నమోదయ్యారు. -
తెలంగాణకు 2,486 కోట్లు.. ఏపీకి 4,787 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు మూడో విడత పన్నుల వాటాను సోమ వారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా రూ.1,18,280 కోట్ల మేర నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు రూ.2,486 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.4,787 కోట్ల నిధు లను విడుదల చేసింది. రాష్ట్రాలు తమ మూలధనం, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు నిధులు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. చదవండి: అలర్ట్: ప్రపంచంలో టాప్–20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్లోనే.. -
రేపు ఏడో విడత బొగ్గు గనుల వేలం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడో విడత బొగ్గు గనులను ఈ నెల 29న వేలం వేయనుంది. వేలం ద్వారా 106 బొగ్గు గనులను ఆఫర్ చేయనుంది. ఆరో విడతలో వేలం వేసిన 28 బొగ్గు గనులకు సంబంధించి ఒప్పందాలపై అదే రోజు సంతకాలు చేయనున్నట్టు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ 28 బొగ్గు గనుల్లో గరిష్టంగా 74 మిలియన్ టన్నుల మేర వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొంది. ఏటా వీటి నుంచి రూ.14,497 కోట్ల ఆదాయం వస్తుందని.. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించింది. ఇక ఏడో విడత వేలానికి ఉంచే 106 బొగ్గు గనుల్లో 61 గనులు కొంత వరకు అన్వేషించినవి కాగా, 45 గనుల్లో అన్వేషణ పూర్తయినట్టు బొగ్గు శాఖ తెలిపింది. మొత్తం 106 గనుల్లో 95 నాన్ కోకింగ్ కోల్, ఒకటి కోకింగ్ కోల్, 10 లిగ్నైట్ గనులుగా వెల్లడించింది. -
కాళేశ్వరానికి జాతీయహోదాపై తప్పుడు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా విషయమై పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు చేసిన ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని మంత్రి టి.హరీశ్రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన పంపలేదని కేంద్రమంత్రి ప్రకటించారని, వాస్తవానికి సీఎం కేసీఆర్తోపాటు గతంలో నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో తాను అనేకమార్లు ప్రధాని మోదీ, జలశక్తి శాఖ మంత్రికి ఈ విషయమై వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రి చేసిన ప్రకటన సభతోపాటు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. గతంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచిన వినతిపత్రాలు, లేఖలను హరీశ్రావు శుక్రవారం ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజక్టుకు సీడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచి్చందని, కేంద్ర జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ అనుమతులు కూడా లభించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై 2018లో టీఆర్ఎస్ ఎంపీలు వేసిన ప్రశ్నలకు నాటి జలశక్తి మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారన్నారు. అయితే ఈ ప్రకటనకు విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్భద్ర, మధ్యప్రదేశ్లోని కెన్ బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూ, కాళేశ్వరంపై తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిందని పేర్కొన్నారు. కేడబ్లు్యడీటీ–2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచి్చందని, అన్నిరకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించిందన్నారు. -
‘నోట్ల రద్దు అంశం ఒక విఫల ప్రయోగం’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అంశం ఒక విఫల ప్రయోగమని తెలంగాణ మంత్రి హరీష్రావు విమర్శించారు. నోట్ల రద్దు వల్ల సుమారు 62 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, పెద్ద నోట్ల రద్దు అంశంపై కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు(మంగళవారం) హరీష్రావు మాట్లాడుతూ.. ‘ దేశంలో నగదు చలామని గతం కంటే రెట్టింపు అయ్యింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఫేక్ కరెన్సీ 54 శాతం పెరిగింది. దేశంలో అవినీతి పెరిగిందని సీబీడీఐ చెప్పింది. దేశంలో నల్లధనం విపరీతంగా పెరిగింది. టెర్రరిజాన్ని అదుపులోకి తెస్తామన్నారు.. ఏం చేశారు?, కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి’ అని మందిపడ్డారు. -
నర్సింగ్ లో ఏపీ టాప్
-
సీబీఐ, ఐటీ, ఈడీలను వేటకుక్కల్లా ప్రయోగిస్తున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించే ప్రతిపక్షాలకు చెప్తున్నా.. ఔను తెలంగాణలో మాది కుటుంబ పాలనే. నూటికి నూరుపాళ్లు కుటుంబ పాలనే. రాష్ట్రంలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ పెద్ద కొడుకుగా కేసీఆర్ అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఇది వసుదైక కుటుంబం...’’అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కేసీఆర్ జై తెలంగాణ అనడం లేదంటూ ఇటీవల కొందరు మాట్లాడుతున్నారని.. అసలు కేసీఆర్ జైతెలంగాణ అనకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణతో కేసీఆర్కు ఉన్న పేగు బంధాన్ని తెంపే దమ్ము ధైర్యం ఎవరికీ లేవని స్పష్టం చేశారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై శనివారం శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది. దీనికి సీఎం కేసీఆర్కు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. చర్చలో బీజేపీ సభ్యుడు రఘునందన్రావు చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రగతిని వివరించారు. కేటీఆర్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పదేళ్లు కూడా దాటని పసిగుడ్డు తెలంగాణ.. ఇప్పుడు దేశానికే టార్చ్బేరర్. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సూచికగా ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి కాంతిరేఖ. ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణను ఉన్నత ఆలోచనలతో నిలిపిన కేసీఆర్, ఆ ఆలోచనలను అమలు చేసిన అధికారులు, ఉద్యోగులు కలిసి ప్రగతిని ప్రతి గడపకు చేర్చారు. పల్లె కన్నీరు పెడుతోందంటూ పాడుకున్న తెలంగాణ పల్లెలు ఇప్పుడు నవ చరిత్రకు నాంది పలుకుతున్నాయని కీర్తించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఉత్తమ పంచాయతీలుగా 20 గ్రామాలు నిలిస్తే అందులో 19 తెలంగాణవి కావడమే దీనికి నిదర్శనం. వ్యవసాయ ఉత్పత్తుల్లో 26వ స్థానం నుంచి ఇప్పుడు పంజాబ్, హరియాణా తర్వాత దేశంలోనే మూడో స్థానానికి తెలంగాణ ఎగబాకిందని నాబార్డు నివేదికే చెప్తోంది. 2015లో 68.17 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తయితే.. ఇప్పుడు 2.02 కోట్ల టన్నులు వస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలకు ఈ గణాంకాలు కనిపించటం లేదా? కొందరివి పసలేని విమర్శలు ప్రభుత్వ పథకాలు గొప్పగా ఉన్నా కొందరు వాటిపై పసలేని విమర్శలు చేస్తున్నారు. రైతుబంధును ఐక్యరాజ్యసమితి కూడా కీర్తిస్తే.. బడా వ్యక్తులకు దోచిపెడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో పదెకరాలకు మించి భూమి ఉన్న వారి సంఖ్య కేవలం 3.1 శాతమే. రైతుబీమా కూడా పేద రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో రైతు సంక్షేమం ఇలా ఉంటే మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి రైతాంగం నడ్డి విరిచేందుకు కేంద్రం ప్రయతి్నంచింది. వాటిని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన 700 మంది రైతుల ప్రాణాలు తీశారు. ఇలాంటి ప్రధాని ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఎల్ఐసీ వంటి సంస్థను దోస్త్కు దోచిపెట్టి క్రోనీ క్యాపిటలిజంను పెంచి పోషించారు. ప్రధాని కొందరు కార్పొరేట్ వ్యక్తుల మేలు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రతి నిర్ణయం వెనుక మానవీయ కోణం ఉంది. కాళేశ్వరానికి ఖర్చు తప్పా..? కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను ప్రపంచమంతా పొగుడుతోంది. డిస్కవరీ చానల్ ప్రత్యేక ప్రోగ్రామ్ రూపొందించి ప్రపంచం ముందుంచటం మనకు గర్వకారణం. కానీ అందులో అవినీతి అంటూ ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయి. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు లక్ష కోట్లను ప్రధాని ఖర్చు పెట్చొచ్చు. కానీ 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే తప్పా? రివర్స్ పంపింగ్కు కాళేశ్వరం కేరాఫ్గా నిలిస్తే.. పచ్చటి పంటలతో కళకళలాడుతూ ఇప్పుడు పాలమూరు రివర్స్ మైగ్రేషన్కు చిరునామాగా నిలుస్తోంది. దళిత బంధు లబ్ధిదారులతో సభ రాష్ట్రంలో దళిత బంధు పథకంతో ఎంత సంపద ఒనగూరిందో లెక్కలు తీసే బాధ్యతను సెస్కు అప్పగించాం. త్వరలో ఆ వివరాలు వస్తాయి. పథకం ప్రారంభించి త్వరలో రెండేళ్లు అవనున్న సందర్భంగా.. దాన్ని ప్రారంభించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దళిత బంధు లబి్ధదారులతో భారీ సభ నిర్వహిస్తాం. జాతీయ స్థాయి ప్రముఖులు దీనికి హాజరవుతారు. ప్రధాని మాటలన్నీ డొల్లే.. మేకిన్ ఇండియా అంటూ ప్రధాని మోదీ ఊదరగొట్టే మాటల్లో డొల్లతనమే తప్ప ఫలితాలు అంతంతే. కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్నది ‘డబుల్ ఇంపాక్ట్ సర్కార్’. మోదీ డబుల్ ఇంజన్తో ఏమాత్రం పొంతన ఉండదు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అని గొప్పలు చెప్తున్నవారు చెప్పేవన్నీ ‘సబ్ బక్వాస్’. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో అందించే కళ్లద్దాలు మేడిన్ తెలంగాణ. ఈ నిజాలు ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదు. వారి కోసం అసెంబ్లీలో కంటి వెలుగు శిబిరం పెట్టించాలి. ప్రజాసంక్షేమం విషయంలో కేసీఆర్కు కులమతాలతో సంబంధం లేదు. ఆయనకు పేదరికమే గీటురాయి. నల్గొండలో మేం ఫ్లోరైడ్ రక్కసి సమస్యను పరిష్కరించాం. కానీ కేంద్రం హర్ఘర్ జల్ అంటూ హడావుడి చేస్తోంది. ఇంటింటికీ నీళ్లు ఇవ్వవచ్చు. కానీ గుండె గుండెలో విషం నింపొద్దు. రియల్ లీడర్గా తెలంగాణ చాక్లెట్ నుంచి రాకెట్ వరకు, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ వరకు, యాప్స్ నుంచి మ్యాప్స్ వరకు ఉత్పత్తి, అభివృద్ధి చేస్తూ తెలంగాణ రియల్ లీడర్గా ఎదిగింది. వరల్డ్ గ్రీన్ సిటీగా, హరితహారం ద్వారా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నం చేయడంవంటి తెలంగాణ విజయాలను ‘మన్కీబాత్’లో ప్రస్తావించేందుకు కూడా ప్రధాని మోదీకి నోరు రాలేదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘జోడో’ అంటూ పక్క నుంచి వెళ్లిపోం మునుగోడు ఎన్నికప్పుడు వంద మంది ఎమ్మెల్యేలను బరిలో దింపారన్న విమర్శలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘అవి ఎన్నికలు.. కచి్చతంగా పోరాడుతాం. ఎంత మందితోనైనా ప్రచారం చేయిస్తాం. జోడో యాత్ర అని నడుస్తూ ఎన్నిక జరిగే ప్రాంతం పక్కనుంచి వెళ్లిపోయే రకం కాదు..’’ అని పరోక్షంగా రాహుల్గాంధీ భారత్జోడో యాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే దీనిపై భట్టి విర్కమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టినది రాజకీయ యాత్ర కాదన్నారు. మనుషుల మధ్య వైషమ్యాలు పెంచి దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతున్న సమయంలో.. దేశాన్ని ఒక్కటి చేసే యాత్రే భారత్జోడో యాత్ర అని స్పష్టం చేశారు. దీనిపై కేటీఆర్ వివరణ ఇస్తూ.. తాను మునుగోడు ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదని, ఎన్నికలు జరుగుతున్నప్పుడు గుజరాత్లో జోడోయాత్ర చేయకుండా పక్క నుంచి వెళ్లిపోవటాన్ని ప్రస్తావించానని చెప్పారు. ఇక ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవారని, బీజేపీలో చేరాక అసంబద్ధ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రెండున్నర గంటలు.. లెక్కలు, విమర్శలు.. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలు సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు గణాంకాలను వివరిస్తూ, ఆయా అంశాలకు సంబంధించిన పత్రికల క్లిప్పింగ్లు, ఇతర పత్రాలను చూపిస్తూ ప్రసంగించారు. శుక్రవారం నాటి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కేంద్రంపై విమర్శలు లేకపోగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో మంత్రి కేటీఆర్ సమాధానం మాత్రం కేంద్రం తీరును విమర్శిస్తూనే సాగింది. ఒక్కో శాఖ ఆధ్వర్యంలో గత ఎనిమిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితులతో బేరీజు వేసి విశ్లేíÙంచారు. అడపాదడపా కాంగ్రెస్ పాలనను ఉటంకిస్తూ కొన్ని విమర్శలు చేసినా.. కేటీఆర్ ప్రసంగం ఆసాంతం బీజేపీ, మోదీ ప్రభుత్వం లక్ష్యంగా సాగింది. – దేశ అభివృద్ధి గురించి ప్రధాని మోదీ చేస్తున్న ప్రసంగాలకు, వాస్తవాలకు పొంతనే లేదని.. దేశానికి గుజరాత్ మోడల్ అంటూ చేసిన ప్రచారం పూర్తి డొల్లేనని కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్లలో కరెంటు, రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ అక్కడి బీజేపీ ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు, అక్కడి పత్రికల క్లిప్పింగులను ప్రదర్శించారు. మోటార్లకు మీటర్ల బిగింపు గురించి ప్రస్తావిస్తూ.. ఈ అంశంలో కేంద్రం రాసిన లేఖ ప్రతిని చూపారు. నోట్ల రద్దుకు మద్దతు తప్పే! గతంలో పెద్దనోట్ల రద్దుకు మేం మద్దతునివ్వడం సరికాదు. అలా చేసి ఉండాల్సింది కాదు. ఈ విషయంలో గతంలో ఎంఐఎం, ఇతర విపక్షాలు చెప్పిందే నిజమైంది. దేశమంటే అదానీ, ప్రధాని మాత్రమే కాదు. 140 కోట్ల మంది ప్రజలు. ఒకరు అమ్మేవారు, మరొకరు కొనేవారు. సీబీఐ, ఐటీ, ఈడీలను వేటకుక్కల్లా వాడిన నీతి బాహ్య సర్కార్ బీజేపీది. తెలంగాణపై పగబట్టినట్టు సవతి తల్లి ప్రేమ చూపుతూ కేంద్రం ఆర్థిక పరమైన ఆంక్షలతో కుంగదీసే ప్రయత్నం చేస్తోంది. ఐటీఐఆర్ను రద్దు చేశాక కాకతీయ టెక్స్టైల్ పార్కు తదితరాలకు ఉత్తుత్తి మాటలే తప్ప ఇప్పటిదాకా ఇచ్చింది గుండుసున్నా. నా మాటలకు కట్టుబడి ఉన్నా. – కేటీఆర్ -
సవాల్ మీద సవాల్.. ఆ వర్గాలకు వరాలు ఏ స్థాయిలో..?
ఊరటలు, ఊరడింపులు, ఉపశమనాల కోసం ఉద్యోగులు మొదలుకుని ఆర్థిక నిపుణులు, పరిశ్రమ వర్గాల దాకా అందరూ ఏటా ఎదురు చూసే తరుణం మరోసారి రానే వచ్చింది. కరోనా కల్లోలం నుంచి బయటపడాం అనుకునేలోపే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో మరో పిడుగు నెత్తినపడింది. ఆ వెంటే ఉద్యోగాల కోత.. తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఊపిరి సలపకుండా చేశాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు ప్రపంచం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు భారత్ బడ్జెట్కు సిద్ధమైంది. సాధారణంగా బడ్జెట్ అనగానే ప్రతి రంగం కొన్ని ప్రయోజనాలను ఆశించటం సహజం. కానీ, ఈసారి పేద, మధ్యతరగతి ఆశలపైనే ప్రధాన దృష్టి నెలకొంది. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతిపైనా పడింది. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ వర్గాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందుకు మరో కారణం లేకపోలేదు.. తరుముకొస్తున్న ఎన్నికలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్ర సర్కార్కు సార్వత్రిక ఎన్నికలు 2024 కంటే ముందు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇది. సాధారణంగా పేద,మధ్య తరగతి వర్గాలే ఓటు బ్యాంక్లో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఈ తరుణంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మొగ్గితే.. ప్రజాకర్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే బడ్జెట్ విషయంలో కేంద్రం జాగ్రత్తగా కసరత్తులు చేసినట్లు స్పష్టమవుతోంది. పెరుగుతున్న ధరలతో కుటుంబాల పొదుపు తగ్గుతున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండు బలంగా వినిపిస్తోంది. ఏటా ఈ పన్నుల విషయంలో నిరాశే మిగులుతోంది. ఈసారైనా స్వల్ప ఊరటైనా దక్కుతుందా? అనేది చూడాలి. అయితే.. ఎన్నికల వేళ పేద, మధ్య తరగతి వర్గాలకు పలు తాయిలాలూ ఉంటాయంటున్నారు. ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించకపోయినా ఉద్యోగులకు ఎంతో కొంత ఊరటనిచ్చేలా 80సి పన్ను మినహాయింపుల పెంపు వంటి చర్యలుండవచ్చని చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివాటిపై పలు వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ద్రవ్యోల్బణ ప్రభావం ఆదాయ పన్ను ఊరటపై ఎప్పట్లాగే వేతన జీవులు మరోసారి ఆశలు పెట్టుకోగా, భయపెడుతున్న ద్రవ్యల్బోణం కట్టడికి తీసుకోబోయే చర్యలపై ఆర్థిక నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో.. రూ.5-10 లక్షల మధ్య వార్షికాదాయ ఉన్న వర్గంపై ద్రవ్యోల్బణ భారం భారీగా ఉంది. ఎలాంటి రాయితీలకు నోచుకోని ఈ వర్గం.. ఈసారి కేంద్ర బడ్జెట్పైనే ఆశలు పెట్టుకుంది. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగాల్లో కోతలు.. తదితరాల నుంచి తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా చేస్తుందేమోనని వీరంతా ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది కీలకమైన లోక్సభ ఎన్నికలున్నందున ప్రజలపై మరీ భారం మోపలేని పరిస్థితి. పైపెచ్చు ఎన్నో కొన్ని తాయిలాలు ప్రకటించాల్సిన అనివార్యత. వీటన్నింటినీ సంతృప్తి పరుస్తూనే.. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించడమనే ప్రధానాంశంతో ఆర్థిక పద్దుకు రూపమివ్వడంలో నిర్మలా సీతారామన్ ఏ మేరకు నెగ్గుకొచ్చారో చూడాలి. -
స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ అమల్లో ఏపీకి ఉత్తమ అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పాఠశాల ఆరోగ్యం, సంక్షేమం కార్యక్రమం (స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్) అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన 2వ జాతీయ వర్క్ షాపులో ఆంధ్రప్రదేశ్ తరఫున స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రోగ్రామ్, పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు (ఎస్సీఈఆర్టీ) నోడల్ ఆఫీసర్ హేమరాణి ఈ పురస్కారాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోలీ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారని పేర్కొన్నారు. కేంద్రం 2020 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో ఆగస్టు 2020 నుంచి ఎస్సీఈఆర్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంయుక్తంగా యూనిసెఫ్ సాంకేతిక సాయంతో అమలు చేశాయని తెలిపారు. చదవండి: (కందుకూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు) -
ఆన్లైన్ చదువులయోగం.. ‘స్వయం’ వేదికగా ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర కోర్సుల మంజూరు, పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ అయిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా భారతీయ ప్రాచీన విద్య అయిన యోగాపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యోగాను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో యోగాకు అంతర్జాతీయంగా ఇప్పటికే ఎంతో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏఐసీటీఈ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ వేదికగా ఈ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన ‘స్వయం’ పోర్టల్ ద్వారా ఈ ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సును అభ్యసించే వారికి క్రెడిట్లను కూడా అందించనుంది. వీటి ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ అంశాల్లోనూ క్రెడిట్ కోర్సులు.. యోగాతోపాటు విద్యార్థులకు ఉపయోగపడేలా మేధో హక్కులు, బేసిక్ రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటి అంశాల్లో కూడా క్రెడిట్ కోర్సులను ప్రారంభించింది. కేంద్ర ఆవిష్కరణల విద్యా విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), వివేకానంద యోగా అనుసంధాన సంస్థలు ఈ కోర్సులకు రూపకల్పన చేశాయి. యోగాను ప్రొఫెషనల్గా నిర్వహించే వారికి ఈ సర్టిఫికెట్ కోర్సుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. రిమోట్ సెన్సింగ్, భూ పరిశీలన సెన్సార్స్, థర్మల్ రిమోట్ సెన్సింగ్, స్పెక్టరల్ సిగ్నేచర్స్, హైపర్ స్పెక్టరల్ రిమోట్ సెన్సింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు ఈ కోర్సుల ద్వారా పరిజ్ఞానం అలవడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ సర్టిఫికెట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాలను 12 ప్రాంతీయ భాషల్లోనూ ఏఐసీటీఈ అనువాదం చేయిస్తోంది. అంతేకాకుండా ఆయా మాధ్యమాల్లోనూ ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే తెలుగులో ఇంజనీరింగ్ పుస్తకాలు.. కాగా 12 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులను అందించేలా ఇప్పటికే ఆయా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేస్తోంది. ఆయా భాషలకు విద్యార్థుల డిమాండ్ను అనుసరించి.. ప్రాధాన్యత క్రమంలో వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో 218 సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల అనువాదాన్ని ఏఐసీటీఈ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు, కన్నడం, ఒడియా, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ మాతృభాషల్లో ఆయా భావనలను అర్థం చేసుకుంటే.. వారు వాటిని బాగా గుర్తుంచుకుని అన్వయించే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు చాలామంది విద్యార్థులకు సమాధానం తెలిసినప్పటికీ.. ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల పరీక్షలు రాయలేకపోయేవారని అంటున్నారు. ప్రాంతీయ భాషా పాఠ్యపుస్తకాల వల్ల వారికి ఈ ఇబ్బంది తొలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. -
అలాంటప్పుడు అక్కడ సర్కార్ ఎందుకు?: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం పంచాయితీకి సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు.. కేంద్రానికి ఉన్న అధికారాలకు కొనసాగింపు అని కేంద్రం నొక్కి చెప్పడంతో, అలాంటప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని.. సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. అధికారం, సేవలు.. పరిపాలనపై నియంత్రణ.. తదితర అంశాల్లో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య తీవ్రస్థాయిలోనే వైరం నడుస్తోంది. ఈ దరిమిలా ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్పై వరుసగా మూడోరోజు వాదనలు వింది. గురువారం విచారణ సందర్భంగా.. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ఢిల్లీ దేశ రాజధాని అని, దానికంటూ ఓ ఏకైక హోదా ఉందని, అక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారు గనుక ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. గతంలోని ఓ తీర్పును ప్రస్తావించిన ఆయన.. ఢిల్లీ కాస్మోపాలిటన్ నగరమని, ఒక మినీ భారత్లాంటిదని వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్ర, ఉమ్మడి జాబితాలోని అంశాలను ధర్మాసనం గౌరవిస్తుందని, కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విషయాలపై శాసనం చేసే హక్కు ఢిల్లీ అసెంబ్లీకి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాలపై పార్లమెంటుకు శాసనపరమైన నియంత్రణ ఉంటే, ఢిల్లీ ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల సంగతేంటని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే.. ఢిల్లీ శాసన అధికారాలలో భాగంగా సేవలపై శాసన నియంత్రణను ఏవిధంగా ఉద్దేశించలేదో చెప్పాలని న్యాయస్థానం సొలిసిటర్ జనరల్ను కోరింది. ఒకానొక తరుణంలో ఎల్జీ విశిష్ట అధికారాల ప్రస్తావన సైతం లేవనెత్తింది బెంచ్. ఆ సమయంలోనే సోలిసిటర్ జనరల్.. కేంద్ర పాలిత ప్రాంతమనేది కేంద్రానికి(యూనియన్)కు కొనసాగింపని, ఆ ఉద్దేశం దాని పరిధిలోని పరిపాలన కేంద్రం పరిధిలోకి వస్తుందని సోలిసిటర్జనరల్ కోర్టుకు తెలిపింది. అలాంటప్పుడు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఎందుకంటూ బెంచ్.. సోలిసిటర్ జనరల్ను నిలదీసింది. పరిపాలన కేంద్ర ప్రభుత్వానిదే అయితే, ప్రభుత్వంతో ఇబ్బంది ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సోలిసిటర్ జనరల్ స్పందించారు. క్రియాత్మక నియంత్రణ అనేది ఎన్నికైన ప్రభుత్వానిదని, కేంద్రం పరిపాలనా నియంత్రణతో సంబంధం కలిగి ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. అందులో కేంద్ర, రాష్ట్ర సర్వీసులు ఉన్నాయని, కేంద్ర పాలిత ప్రాంతాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ తరుణంలో సమయం ముగియడంతో.. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను జనవరి 17కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఢిల్లీలో పాలన, ఇతర సేవల నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వం.. అత్యున్నత న్యాయస్థానాన్ని గతంలో ఆశ్రయించింది. 2018లో.. ధర్మాసనం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికైన ప్రభుత్వం సలహాలకు కట్టుబడి ఉంటారని, ఇద్దరూ ఒకరితో ఒకరు సామరస్యపూర్వకంగా పనిచేయాలని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే.. 2019 ఫిబ్రవరిలో మాత్రం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ భిన్న తీర్పులను వెల్లడించింది. పైగా ఆ ఇద్దరు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్లు ఆ తర్వాత రిటైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనానికి బదిలీ అయ్యింది. -
కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్
-
వాళ్లు చెప్పినట్టు వింటే.. తాలిబన్ రాజ్యమే
దేశాన్ని రక్షించేందుకు తెలంగాణ బిడ్డలు ముందుకు రావాలి ప్రజలు అభివృద్ధి వైపు సాగాలంటే సమాజంలో శాంతి, సహనం అవసరం. మతపిచి్చ, కులపిచ్చి పెంచి విద్వేషాలు రెచ్చగొడితే దేశం తిరోగమనం వైపు పయనిస్తుంది. మేధావులు, యువత దీనిపై ఆలోచన చేయాలి. మన చుట్టూ ఏం జరుగుతోందో పరిశీలన చేయాలి. మనం బాగున్నాం కదా, పొరుగింటోళ్లు ఏమైపోతే ఏమిటని అనుకుంటే, ఓ రోజు మనకూ ప్రమాదం వస్తుంది. అందువల్ల ఉద్యమ పంథా, పోరాట రక్తమున్న తెలంగాణ బిడ్డలు ఈ దేశాన్ని రక్షించడానికి ముందుకు రావాలి. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, మహబూబాబాద్/భద్రాద్రి కొత్తగూడెం: ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలు ఫలిస్తే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతుంది. సమాజం మరో తాలిబన్లా మారిపోతుంది. ఇక్కడికి పెట్టుబడులు రావు. ఉద్యోగాలు, ఉపాధి లభించవు. మన చుట్టూ జరుగుతున్న విద్వేష రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. దీనిపై సమాజంలో చర్చ జరగాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నూతన కలెక్టరేట్లను, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయా చోట్ల కలెక్టర్లను వారి చాంబర్లలోని కుర్చీల్లో కూర్చోబెట్టి అభినందించారు. తర్వాత రెండు చోట్ల నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. దేశానికే మార్గదర్శకంగా నిలిచాం. దీనికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. రెండు రోజులు చెప్పినా అవి ఒడవవు. తెలంగాణలో గతంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ధైర్యం చేసి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. ప్రజలు సంక్షేమ పథకాల జాతరను అనుభవిస్తున్నారు. గతంలో 600 ఫీట్లు బోరు వేసినా నీరు ఉండేది కాదు. ప్రస్తుతం సమృద్ధిగా నీరు,కరెంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రజలకు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉండేలా సమీకృత కలెక్టరేట్లను నిర్మించుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో మంత్రుల చాంబర్ కంటే తెలంగాణలో కలెక్టర్ చాంబర్ అద్భుతంగా ఉందని పంజాబ్ మంత్రి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర అసమర్థత వల్లే తగ్గిన ఆదాయం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.5లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు రూ.11.54 లక్షల కోట్లకు చేరింది. మనస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లకు చేరేది. కేంద్ర అసమర్థ పనితీరు వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దాదాపు రూ.3 లక్షల కోట్ల నష్టం జరిగింది. అన్ని రాష్ట్రాలను కలిపితే ఈ నష్టం మరెంతో ఉంటుంది. జల వివాదాలు తీర్చడం లేదు దేశవ్యాప్తంగా నదుల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నా.. రైతుల పొలాల వద్దకు రావు. కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ 19 ఏళ్లు గడిచినా తీర్పు ఇవ్వలేదు. మనం మొండి పట్టుదలతో తెగించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. నీటి సమస్య లేకుండా చేసుకున్నాం. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నా నదులపై ఉన్న వివాదాలను తేల్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం తాగునీటి సమస్య తీరలేదు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి ఇంకా ఉండటం ఏమిటి? 10 రోజులకోసారి నీళ్లు సరఫరా చేసే దుస్థితికి కారణాలేమిటి? ఇప్పటివరకు కేంద్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ల అసమర్థత, తప్పుడు విధానాల ఫలితమే ఇది...’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బిజీ బిజీగా కార్యక్రమాలు సీఎం కేసీఆర్ తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబాబాద్కు చేరుకున్నారు. అక్కడ నూతన కలెక్టరేట్ను, జిల్లా గ్రంధాలయాన్ని, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత కొత్తగూడెం–పాల్వంచ మధ్యలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన సభలో మాట్లాడారు. తర్వాత రోడ్డు మార్గంలో కొత్తగూడెం వెళ్లి బీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రెడ్యానాయక్, బానోతు హరిప్రియ, చల్లా ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూకల రాంచంద్రారెడ్డి విగ్రహాలు పెడతాం: కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ఆదర్శ నాయకుడు నూకల రాంచంద్రారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తొలి ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చాలామంది నాయకులకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురువు అయితే.. పీవీకి గురువు నూకల రాంచంద్రారెడ్డి అన్నారు. అలాంటి నేత గురించి ఈ తరం యువతకు తెలపడం ప్రభుత్వ బాధ్యత అని.. మహబూబాబాద్, వరంగల్ పట్టణాల్లో ప్రభుత్వ ఖర్చులతో రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏదైనా ఒక ఇనిస్టిట్యూట్కు ఆయన పేరు పెడతామన్నారు. రెండు జిల్లాలకు వరాలు మహబూబాబాద్కు కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నామని.. వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక అభివృద్ధి పనుల కోసం మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా 3 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం ప్రత్యేక నిధులనుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధిని మంజూరు చేస్తున్నామని సీఎం చెప్పారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల చొప్పున.. ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. పాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతాం: సీఎస్ శాంతికుమారి రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని, పరిపాలనా ఫలాలను ప్రజలకు చేర్చేందుకు ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తాను జిల్లాలో పనిచేసినప్పుడు కలెక్టర్ కార్యాలయాలు ఇరుకు గదులతో టాయిలెట్స్ కూడా సరిగాలేక ప్రజలు ఇబ్బంది పడేవారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సమీకృత కలెక్టరేట్లు ఇంద్ర భవనాల్లా ఉన్నాయని, వీటిని చూస్తే అసూయగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అడగకుండానే వరాలిచ్చే కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి అడిగితే వరాలు ఇచ్చేవాళ్లు ఉంటారేమోగానీ.. సీఎం కేసీఆర్ మాత్రం అడగకుండానే కష్టాలను అర్థం చేసుకొని వరాలు ఇచ్చే పేదల ఆరాధ్య దైవమని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఇదే తరహాలో ఆయన మానుకోట ప్రజలపై చల్లని చూపు సారించాలని కోరారు. సీఎం ఆశీస్సులతో మానుకోట అభివృద్ధిలో బంగారు కోట కావాలని ఆకాంక్షించారు. -
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైద్యఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ టెలికన్సల్టేషన్ విభాగం, విలేజ్ హెల్త్ క్లినిక్ల విభాగంలో రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ అవార్డులను కేంద్రం నుంచి మంత్రి రజని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో సీఎం జగన్ను కలిసి రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపించారు. చదవండి: (Viral Video: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!) (ఆ కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని చెప్పారు: ఎంపీ మిథున్రెడ్డి) -
కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ అనేది మన దేశ చట్టమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. తాము నిర్దేశించిన ఏ చట్టమైనా భాగస్వామ్యపక్షాలను కలిపి ఉంచుతుందని పేర్కొంది. కొలీజియం వ్యవస్థను కచ్చితంగా అందరూ అనుసరించాల్సిందేనని తేల్చిచెప్పింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆమోదించకుండా జాప్యం చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషనల్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కొలీజియంపై కేంద్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలను తాము పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. చదవండి: (కాంగ్రెస్లో అంతర్మథనం.. పక్కలో బల్లెంలా మారుతున్న ఆప్) -
Visakhapatnam: విశాఖ వేదికగా జీ–20 సదస్సు
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక జీ–20 సదస్సుకు విశాఖపట్నం వేదిక కానుంది. జీ–20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు సదస్సులు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులు నిర్వహించబోతోంది. ఏపీ నుంచి విశాఖపట్నాన్ని కేంద్రం ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4 తేదీల్లో, ఏప్రిల్ 24న విశాఖ వేదికగా వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించే జీ–20 సదస్సుకు నోడల్ అధికారిగా ప్రొటోకాల్ డైరెక్టర్ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని, సెక్యూరిటీ నోడల్ అధికారిగా డీజీపీని నియమించారు. విశాఖలో సదస్సు జరిగే మూడు రోజుల్లో ఆర్థిక రంగం, వ్యవసాయం, పర్యావరణం, విద్య, వైద్యం తదితర అంశాలపై 37 సమావేశాలు జరుగుతాయని జిల్లా అధికారులు చెప్పారు. వేలాది మంది ప్రతినిధులు హాజరవుతారని.. వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, విదేశాంగ మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. తదనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ఇప్పటికే కలెక్టర్ డా.మల్లికార్జున, జేసీ విశ్వనాథన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి.. జిల్లా అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. సదస్సు నిర్వహణకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేసి.. జేసీ విశ్వనాథన్ను నోడల్ అధికారిగా నియమించారు. అతిథుల కోసం నగరంలోని స్టార్ హోటళ్లలో 703 గదులను రిజర్వ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అతిథులు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: (CM YS Jagan: ఇంటింటా మనం.. అదే మన లక్ష్యం) -
AP: తెలుగు రాష్ట్రాల మధ్య ఐకానిక్ వంతెన.. తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ కృష్ణా నదిపై ముచ్చటగొలిపే ఐకానిక్ వంతెన నిర్మాణం కానుంది. దీని నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. పర్యాటకానికి ఊతమిచ్చేలా ఈ వంతెన నిర్మించనున్నారు. రూ.1,082.65 కోట్లతో రూపొందించిన ఈ వంతెన నిర్మాణ ప్రణాళికను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. మొదటి విడతగా రూ.436 కోట్లు కూడా మంజూరు చేసింది. దాంతో నంద్యాల జిల్లాలో వరద ముంపు బాధిత గ్రామాల ప్రజల సౌకర్యార్థం కృష్ణా నదిపై కొత్త వంతెన నిర్మించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. కృష్ణా నదిపై కొత్త వంతెన నిర్మాణ ప్రతిపాదన 2008 నుంచి పెండింగులో ఉంది. 2007లో నాటు పడవలో కృష్ణా నదిని దాటుతూ ప్రమాదానికి గురై 61 మంది మరణించారు. దీంతో సిద్ధేశ్వరం – సోమశిల మధ్య వంతెన నిర్మించాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. 2008లో శంకుస్థాపన కూడా చేశారు. ఆయన హఠాన్మరణంతో దాని నిర్మాణం నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని పట్టించుకోలేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఎన్హెచ్–167 కె గా ప్రకటించి కృష్ణా నదిపై వంతెనతో సహా ఆరులేన్ల రహదారి నిర్మాణానికి నిర్ణయించారు. తెలంగాణలోని నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల బైపాస్ రోడ్డు వరకు 174 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల జాతీయ రహదారి (ఎన్హెచ్–167కె)ని రూ.1,200 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది. దాంతోపాటు కృష్ణా నదిపై వంతెన కూడా నిర్మించాలని నిర్ణయించారు. తగ్గనున్న దూరం ఈ వంతెన నిర్మాణంతో నంద్యాల జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలు నదిలో ప్రయాణించాల్సిన అవసరం లేకుండా రోడ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆత్మకూరు, నందికొట్కూరు, పడిగ్యాల, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 35 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఏపీ, తెలంగాణ మధ్య దూరమూ 80 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రస్తుతం నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కర్నూలు, వనపర్తి మీదుగా వెళ్లాలి. ఈ వంతెన నిర్మిస్తే నంద్యాల నుంచి నేరుగా నాగర్కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లిపోవచ్చు. తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. ఐకానిక్ వంతెన ఇలా.. ఇక్కడ సాధారణ వంతెన కాకుండా పర్యాటక ఆకర్షణగా ఐకానిక్ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం – తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా సోమశిల మధ్య దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మిస్తారు. కేబుల్ ఆధారిత సస్పెన్షన్ వంతెనగా నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించారు. నల్లమల ప్రాంతంలో, శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్వాటర్లో విహరించే సందర్శకులకు ఈ వంతెన పెద్ద ఆకర్షణగా నిలవనుంది. దీనిపై ప్రత్యేకంగా ఆద్దాల నడక దారిని ఏర్పాటు చేయనున్నారు. ఆలయ శిఖరం రూపంలో పైలాన్, ఎల్ఈడీ లైట్ల కాంతులతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి. వంతెన నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా ముందస్తు (అడ్హక్) నిధులివ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తొలి, రెండో దశ పనులను పూర్తి చేయడానికి ఏ మేరకు నిధులు అవసరమో గుర్తించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లను ఉన్నతస్థాయి కమిటీ సోమవారం ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రి మండలికి కేంద్ర జల్శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదనలు పంపనున్నాయి. దానిపై కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేస్తే.. అడ్హక్గా పోలవరానికి నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. రూ.10 వేల కోట్లను అడ్హక్గా విడుదల చేసి, నిధుల కొరత లేకుండా చేయాలని, డిజైన్లను త్వరితగతిన ఆమోదిస్తే పోలవరాన్ని సత్వరమే పూర్తి చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అడ్హక్ నిధుల విడుదలతోపాటు సీఎం జగన్ లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో రెండుసార్లు రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ సమావేశాలలో అడ్హక్గా పోలవరానికి నిధులిచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్శక్తి శాఖను కేంద్ర కమిటీ ఆదేశించింది. మార్చి వరకూ రూ.7,300 కోట్లు ఇప్పటివరకూ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్మెంట్ చేయడం, మార్చి వరకూ భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, పనులు చేయడానికి రూ.7,300 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఢిల్లీలో సోమవారం సమావేశమై చర్చించింది. పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని.. తక్షణం ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి.. తొలి దశ, రెండో దశ పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీ, పీపీఏలను ఆదేశించింది. చదవండి: (కల్లుగీత..రాత మారేలా..! సీఎం వైఎస్ జగన్ చొరవతో తీరిన కష్టాలు) -
రొటీన్గా చేస్తే పట్టించుకోం.. కానీ టార్గెట్గా నడుస్తోంది: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారని చెప్పారు. నవంబర్ 27న 15 నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధుల జనరల్ బాడీ సమావేశం తెలంగాణ భవన్లో నిర్వహిస్తామన్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఈ సమావేశం ఎలా నిర్వహించాలి అనే దానిపై గ్రేటర్ లీడర్లు అందరం చర్చించాం. వ్యవస్థలు వారి చేతుల్లో ఉన్నాయని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. తర్వాత మా చేతుల్లోకి రావొచ్చు. టార్గెట్గా దాడులు చేస్తున్నారు. ప్రజలు అన్ని చూస్తున్నారు. మేం అన్నింటినీ ఎదుర్కొంటాం. దేశంలో ఏం జరుగుతుందో అన్ని గమనిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. రొటీన్గా చేస్తే పట్టించుకోం. కానీ టార్గెట్గా నడుస్తోంది. నాకు జ్వరం వస్తే కూడా రాజకీయం చేశారు. ఇవన్నీ భయపడి ఉంటే హైదరాబాద్లో ఎలా ఉంటాం' అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. చదవండి: (పదే పదే క్లీన్బౌల్డ్.. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహమేంటి?) -
ఇకపై ఆ తలనొప్పి ఉండబోదు.. కాలర్ ఎవరోతెలియాల్సిందే..!
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ (అన్ నోన్ నంబర్) బెడదకు త్వరలోనే ముగింపుపడనుంది. తమ మొబైల్ ఫోన్కు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం ఫోన్ వినియోగదారుల హక్కుగా మారనుంది. ట్రూ కాలర్ యాప్తో సంబంధం లేకుండానే తమ కాంటాక్ట్ నంబర్ల జాబితాలో లేని నంబరు నుంచి ఫోన్ కాల్ వస్తే అది ఎవరు చేశారో తెలిసిపోనుంది. తద్వారా సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా విధాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన కొత్త టెలికాం విధానం పార్లమెంటులో ఆమోదం పొందగానే అమల్లోకి రానుంది. - సాక్షి, అమరావతి ఫేక్ ఐడీ కార్డులతో కనెక్షన్లు... సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు... దేశంలో అమాంతంగా పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఫేక్ ఐడీ కార్డులతో సిమ్ కార్డులు, ఓవర్ ద టాప్(వోటీటీ) కనెక్షన్లు తీసుకుని దర్జాగా మోసాలకు పాల్పడుతున్నారు. దాదాపు 90శాతం సైబర్ నేరాల ముఠాలు ఇలా ఫేక్ కనెక్షన్లతోనే సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నాయి. ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్న ఫోన్ కనెక్షన్లతోనే ఆడియో, వీడియో, వాట్సాప్ కాల్స్, ఇన్స్ట్రాగామ్ మెసేజ్లు, యూపీఐ మెసేజ్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయని జాతీయ నేర గణాంకాల (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. వాటిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఆ మొబైల్ కనెక్షన్లు ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్నవి కావడంతో ఆయా చిరునామాల్లో సంబంధిత వ్యక్తులు ఉండటం లేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు కొత్త విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు పార్లమెంటుకు ఇప్పటికే నూతన విధాన పాలసీ డ్రాఫ్ట్ను సమర్పించింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నారు. కేవైసీ తప్పనిసరి... టెలికాం కంపెనీలు తమ ఖాతాదారుల పూర్తి వివరాలను పరిశీలించి నిర్ధారించుకోవాలి. అందుకోసం బ్యాంకులు చేస్తున్నట్టుగా ‘నో యువర్ కస్టమర్(కేవైసీ) ప్రక్రియను పాటించాలి. తమ కంపెనీ నుంచి మొబైల్ సిమ్ కార్డ్, వోటీటీ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్క ఖాతాదారు సమర్పించిన గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తర్వాతే కనెక్షన్ ఇవ్వాలి. లేదా కనెక్షన్ ఇచ్చిన వారం రోజుల్లోనే ఆ గుర్తింపు కార్డులను పరిశీలించాలి. ఖాతాదారులు సమర్పించిన గుర్తింపు కార్డులు సరైనవి అని నిర్ధారణ అయితే సరే. నిర్ధారణ కాకపోతే వెంటనే ఆ కనెక్షన్లను నిలుపుదల చేయాలి. ఏ సందర్భంలో అయినా సరే పోలీసుల విచారణలో ఫేక్ గుర్తింపు కార్డులతో ఎవరైనా కనెక్షన్ తీసుకున్నారని తెలిస్తే సంబంధిత టెలికాం కంపెనీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫేక్ ఐడీతో తీసుకుంటే కఠిన చర్యలు... ఇక ఫేక్ గుర్తింపు కార్డుతో ఎవరైనా మొబైల్ కనెక్షన్ గానీ, వోటీటీ కనెక్షన్ గానీ తీసుకున్నారని టెలికాం కంపెనీల ‘కేవైసీ’లో వెల్లడైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా ఫేక్ ఐడీ కార్డులతో మొబైల్, వోటీటీ కనెక్షన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించినా వారిపై కేసు నమోదు చేస్తారు. అలా ఫేక్ ఐడీ కార్డుతో కనెక్షన్ తీసుకున్నవారికి రూ.50వేల జరిమానా లేదా ఏడాది జైలు లేదా రెండూ విధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎవరు కాల్ చేస్తున్నారో తెలిసిపోతుంది... నూతన పాలసీ ప్రకారం తమ కాంటాక్ట్ నంబర్ల జాబితాలో లేని నంబరు నుంచి కాల్ వచ్చినా సరే ఆ ఫోన్ చేసింది ఎవరో ఇకపై తెలిసిపోతుంది. ప్రస్తుతం ట్రూ కాలర్ యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఆవిధంగా ఎవరు కాల్ చేస్తున్నారో తెలుస్తుంది. కానీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే, ట్రూ కాలర్ యాప్తో నిమిత్తం లేకుండానే తమకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారుడికి హక్కుగా కేంద్రం నూతన పాలసీ డ్రాఫ్ట్ను సిద్ధం చేసింది. ఇందుకోసం మొబైల్ కంపెనీలు తమ సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని ఆదేశించనుంది. -
Regional Ring Road: ఉత్తర ‘రింగ్’కు బడ్జెట్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి బడ్జెట్ ఖరారైంది. ఉత్తర భాగంలో మొత్తం 162.46 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.13,200 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర జాతీయ రహదారుల విభాగం తేల్చింది. ఇందులో రోడ్డు నిర్మాణానికి రూ.8 వేల కోట్లు, భూసేకరణకు రూ.5,200 కోట్లు అవసరం అవుతాయని నిర్ధారించింది. వాస్తవానికి ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో ఉత్తర భాగం నిర్మాణానికి సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఇప్పుడు మరో రూ.4,200 కోట్ల మేర పెరిగింది. వాటా సొమ్ము ఇవ్వాలని రాష్ట్రానికి లేఖ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి మొత్తంగా 2 వేల హెక్టార్ల భూమి అవసరం పడుతోంది. ఇందులో ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నందున.. చాలావరకు భూసేకరణ చేయాల్సి వస్తోంది. పరిహారం రూపంలో భారీగా ఖర్చవనుంది. నిబంధనల ప్రకారం భూసేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600 కోట్లు తన వాటాగా ఇవ్వాలి. దీంతో ఈమేరకు సొమ్మును జమ చేయాల్సిందిగా ఎన్హెచ్ఏఐ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. భూసేకరణకు కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో దానికి సంబంధించిన నిధులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని అందులో ప్రస్తావించింది. వ్యయం మరింత పెరిగే అవకాశం! గ్రేటర్ హైదరాబాద్ను చుట్టేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు అవతల చేపట్టిన రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి మొత్తంగా రూ.19 వేల కోట్లు ఖర్చవుతుందని తొలుత ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు, దక్షిణ భాగానికి రూ.10 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. కానీ పలు రకాల కారణాలతో ఈ ప్రాజెక్టులో జాప్యం జరిగి.. నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. తాజాగా కేంద్రం ఆమోదించిన బడ్జెట్ ప్రకారం.. ఒక్క ఉత్తర భాగం నిర్మాణానికే రూ.13,200 కోట్లు ఖర్చవనున్నాయి. ఈ మార్గంలో ప్రధాన పట్టణాలకు చేరువగా రోడ్డు నిర్మాణం జరగనుంది. ఆ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా ఉండటంతో పరిహారం ఖర్చు ఎక్కువగా ఉంటుందని.. అంచనా వ్యయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక రీజనల్ రింగ్రోడ్డు దక్షిణ భాగం ఖర్చుకూడా భారీగానే ఉంటుందని అంటున్నాయి. 30 కిలోమీటర్లు మినహా వేగంగా.. భువనగిరి కాలా (కాంపిటెంట్ అథారిటీ లాండ్ అక్విజిషన్) పరిధిలో 22 కిలోమీటర్ల రోడ్డు, సంగారెడ్డికి చేరువగా ఉన్న గ్రామాలకు సంబంధించి 8 కి.మీ.ల రోడ్డుకు సంబంధించి భూసేకరణ సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. ఈ 30 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ సర్వే కొనసాగుతుండగా.. మిగతా ప్రాంతాల్లో పూర్తయింది. ఆ ప్రాంతాలకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుమతులు రాగానే భూసేకరణ చేపడతారు. అవార్ట్ పాస్ చేస్తే సదరు భూమి ఎన్హెచ్ఏఐ పరిధిలోకి వెళుతుంది. ఈలోగా పరిహారం నిధుల్లో రాష్ట్రం వాటాను జమ చేయాలని జాతీయ రహదారుల విభాగం కోరింది. -
ఆదర్శ రాష్ట్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రమంత్రి అభినందించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుజరాత్లోని రాజ్కోట్లో మూడ్రోజుల పాటు జరిగే జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనం శుక్రవారం ప్రారంభమైంది. ఏపీలో జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న ఇళ్లలో విద్యుత్ ఆదాకు చేపడుతున్న చర్యలను ఈ సమ్మేళనంలో అజయ్జైన్ వివరించారు. అత్యాధునిక సాంకేతికత.. తొలిదశలో 15.6 లక్షల ఇళ్లకు ఏపీ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సాయంతో ఒక్కో ఇంటికీ నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్లైట్లు, రెండు ఫ్యాన్లను అందజేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ చొప్పున మొత్తం 1,145 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెప్పారు. నిర్మాణంలో ఇండో–స్విస్ బిల్డింగ్ టెక్నాలజీతో పాటు రీఇన్ఫోర్డ్స్ కాంక్రీట్ (ఆర్సీసీ) ప్రీకాస్ట్ టెక్నాలజీ, షియర్వాల్ టెక్నాలజీ, ఈపీఎస్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీవల్ల ఇంటి లోపల కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అజయ్జైన్ వివరించారు. కాలనీలు కాదు.. అధునాతన గ్రామాలు ఇక అల్పాదాయ వర్గాలు, పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో తయారవుతున్న ఇళ్లలో వారు సగౌరవంగా జీవించేలా చూడడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ లక్ష్యమని అజయ్జైన్ స్పష్టంచేశారు. అందుకు అనుగుణంగానే కాలనీలకు బదులు అధునాతన గ్రామాలను సృష్టిస్తున్నామని, 17,005 లే అవుట్లలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు. రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలాన్ని పేదలకు పంపిణీ చేసినట్లు వివరించారు. లేఅవుట్ అభివృద్ధికి రూ.3,525 కోట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు వెచ్చించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, మరో 18.9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, నిర్వహణ అంశాలను మొబైల్ యాప్లు, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. హౌసింగ్ జేఎండీ ఎం. శివప్రసాద్, చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్ ఈ సదస్సులో పాల్గొన్నారు. -
కొప్పర్తిలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్.. 30,000 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద 225 ఎకరాల్లో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకు ఏపీఐఐసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ ఏర్పాటుకోసం ఆసక్తిగల రాష్ట్రాల నుంచి బిడ్లను ఆహ్వానించింది. సుమారు రూ.445 కోట్ల పెట్టుబడితో 225 ఎకరాల్లో ఈ జోన్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ నారాయణ భరత్గుప్తా ‘సాక్షి’కి వెల్లడించారు. నిజానికి.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన్నవరం వద్ద ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంతో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్కు 753.85 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఈ ప్రాజెక్టును ఎవ్వరూ పట్టించుకోకపోవడం, మారిన రాజకీయ పరిస్థితులతో ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ప్రయోజనం కాదంటూ రెండు సంస్థలు ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రీన్ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుండటమే కాకుండా రూ.1.26 లక్షల కోట్లతో భారీ ఇంధన ప్రాజెక్టులను చేపట్టారు. ఈ అవకాశాలను వినియోగించుకుంటూ సౌర, పవన విద్యుత్ రంగాలకు చెందిన విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ను కొప్పర్తిలో ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలను పంపింది. మొత్తం రూ.445 కోట్ల అంచనా వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు వ్యయం చేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ ఈ జోన్ను సాధించుకునేందుకు నీరు, విద్యుత్ను చౌకగా అందించడమే కాకుండా అనేక రాయితీలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 30,000 మందికి ఉపాధి ఇక ఈ తయారీ జోన్ రాష్ట్రానికొస్తే పెట్టుబడులు, ఉపాధితోపాటు కీలకమైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కొప్పర్తిలో ఏర్పాటయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. విద్యుత్ ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద సుమారు రూ.24,000 కోట్ల బడ్జెట్ను ఈ రంగానికి కేటాయించింది. కొప్పర్తిలో ఈ తయారీ రంగ జోన్ ద్వారా సుమారు రూ.3,500 కోట్ల పెట్టబడులు రావడంతోపాటు ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ, సెంటర్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశముంది. ఇక్కడే 1,186 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు ప్రతిపాదనలను కూడా కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అలాగే, కాకినాడ వద్ద ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ సాధించుకున్న రాష్ట్రం ఈ రెండు పార్కులను ఇతర రాష్ట్రాలతో పోటీపడి చేజిక్కించుకుంటుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తంచేస్తున్నారు. -
ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి : రాహుల్ గాంధీ
-
రైతులపై ప్రధాని మోదీ దెబ్బ కొడుతున్నారు : మంత్రి కేటీఆర్
-
ఏ ‘వెలుగులకు’ ఈ కొత్త చట్టం?
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 2014 నుంచీ జరుగుతున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నప్పటికీ ఈ దఫా మాత్రం 2003 నాటి విద్యుత్ చట్టంలో మార్పులు చేయాలనే పట్టుదలను కేంద్రం కనబరుస్తోంది. ప్రధానంగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్నాయనీ, దాని నుంచి బయటపడవేసేందుకే ఈ కొత్త చట్టమనే అభిప్రాయాన్ని కేంద్ర విద్యుత్శాఖ పెద్దలు చెబుతున్నారు. ఇది అంతి మంగా డిస్కంలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకేనని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు–2022పై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యుత్ చట్టం–2003లో మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తెచ్చేందుకు 2014 నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై గతంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. 2019లో కూడా మరోసారి ప్రయత్నం జరిగింది. మెజార్టీ రాష్ట్రాలు, విద్యుత్ ఉద్యో గులు, రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరోసారి కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మాత్రం వ్యతిరేకతను లెక్క చేయకుండా చట్టం చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. మరోసారి అదే వ్యతిరేకత వచ్చిన ఫలితంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు –2022 కాస్తా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చెంతకు చేరింది. అయినప్పటికీ గెజిట్ల జారీ ద్వారా తాను చేయాలనుకున్న మార్పులను చేస్తూ కేంద్రం ముందుకే అడుగులు వేస్తోంది. దేశంలోని డిస్కంల ఆర్థిక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లకు చెల్లించాల్సిన బకాయిల వ్యవహారం కేంద్రానికి కొత్త మార్పులకు ఊతమిస్తోందని చెప్పకతప్పదు. 1998–99 నుంచి విద్యుత్ రంగంలో తెచ్చిన కాలానుగుణ సంస్కరణలు డిస్కంలు, జెన్ కోలను కాపాడలేకపోయావనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. దేశ వ్యాప్తంగా 57 డిస్కంలు ఏకంగా 1.40 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. ఇందులో ఆయా ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం రూ.76 వేల కోట్లు ఉండగా... మిగిలిన 64 వేల కోట్ల మేర ఆయా ప్రభుత్వశాఖలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు. అయితే, విద్యుత్ను తీసుకున్నందుకుగానూ విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్కో)లకు డిస్కంలు రూ.1.10 లక్ష కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. అటు డిస్కంలు, ఇటు జెన్కోలను కాపాడే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త చట్టం తెస్తున్నామనేది కేంద్ర పెద్దల ఉవాచ. విద్యుత్ పంపిణీ రంగంలో కేవలం ఒకరే కాకుండా ఎక్కువ మంది ఉండాలనీ, తద్వారా డిస్కంలలో పోటీతత్వంతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయనీ కేంద్రం చెబుతోంది. అందుకే డిస్కంలల్లో ప్రైవేటీకరణకు తాజా చట్టం తెరలేపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైల్లో ప్రైవేటు డిస్కంలు సేవలందిస్తు న్నాయి. ఇక ఒడిశాలో ఏకంగా 4 ప్రైవేటు డిస్కంలు విద్యుత్ పంపిణీ రంగంలో పనిచేస్తున్నాయి. అయితే, మరింత విస్తృతంగా కొత్త నెట్ వర్క్ అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న నెట్వర్క్లోనే ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకే కొత్త చట్టం వస్తోందని తెలు స్తోంది. దీనితో పాటు కొత్త చట్టంలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయని విద్యుత్రంగ నిపుణులు చెబుతున్నారు. అవి: 1. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్, సభ్యుల నియామకానికి త్రిసభ్య కమిటీ స్థానంలో నలుగరు సభ్యుల కమిటీని ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ ప్రతి నిధి ఇందులో భాగస్వామ్యం కానున్నారు. తద్వారా రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం తలదూర్చనుందన్న విమర్శలు వస్తున్నాయి. 2.ఒక రాష్ట్రం కాకుండా 2,3 రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ను రాష్ట్రాల ఈఆర్సీలు కాకుండా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈ ఆర్సీ) ఇవ్వనుంది. తద్వారా రాష్ట్రాల ఈఆర్సీల పాత్ర నామ మాత్రంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3.విద్యుత్ కొనుగోళ్లకు అయ్యే వ్యయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే నేరుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసే అధికారం జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ల చేతుల్లోకి వెళ్లనుంది. తద్వారా రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఎస్ఎల్డీసీ) అధికారం కుంచించుకుపోనుందన్న ఆందోళన నెలకొంది. 4. ప్రస్తుతం ఉన్న చట్టంలో యూనివర్సల్ సప్లై ఆబ్లిగేషన్ అనే నిబంధన ఉంది. ఒక రైతు కోసం కూడా కొత్తగా లైన్ల అవసరం ఏర్పడితే డిస్కంలు వేయా ల్సిందే. తాజా చట్టంలో ఈ ఆబ్లిగేషన్ను తొలగించారు. తద్వారా సామాన్య వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చట్టంపై మరింత లోతైన చర్చ జరగాల్సిందేనన్న వైఎస్సార్సీపీ అభిప్రాయా నికి సానుకూల స్పందన వస్తోంది. అనుమానాలు నిజమేనా? ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్ చట్టం–2003లో రూపొందిం చారు. కాలక్రమంలో ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సవరణలు చేసి కొత్త బిల్లును తెరమీదకు తెచ్చింది ఇప్పుడే. అంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త బిల్లు ముందుకు వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ బిల్లులోని కొన్ని అంశాలు కేంద్ర వైఖరిపై అనుమానం వ్యక్తం చేసే విధంగానే ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం సెక్షన్ 14, 42లల్లో ఏమని పేర్కొన్నారంటే... ‘‘విద్యుత్ సరఫరా, పంపిణీ, ట్రేడింగ్ కోసం ఏ సంస్థకైనా, ఏ వ్యక్తికైనా సంబంధిత కమిషన్ లైసెన్స్ను జారీచేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ పొందిన సంస్థ లేదా వ్యక్తులు తమ పరిధిలోని వినియోగ దారుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ నెట్వర్క్ (విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) వగైరా)ను సొంతంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.’’ అయితే, కొత్త బిల్లులో ఈ రెండు క్లాజ్లలో మార్పులు చేస్తున్నారు. ఎటువంటి లైసెన్సు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో పాటు, ఇప్పటికే ప్రభుత్వరంగ డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్ పంపిణీ నెట్వర్క్ను ఉపయోగించే వెసులుబాటును కల్పించారు. ఈ రెండు క్లాజులలో చేయనున్న మార్పులను గమనిస్తే ప్రైవేటు సంస్థలకు విద్యుత్ పంపిణీ రంగంలోకి బార్లా తలుపులు తెరుస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ప్రస్తుతం మునిసిపాలిటీ/ జిల్లా పరిధిలో మాత్రమే ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులకు అవకాశం ఉండేది. తాజాగా సెప్టెంబరు 8వ తేదీ కేంద్రం విడుదల చేసిన గెజిట్లో మాత్రం మునిసిపాలిటీ/ మూడు జిల్లాలతోపాటు ఏదైనా పేర్కొన్న చిన్న ప్రాంతంలో కూడా విద్యుత్ పంపిణీ లైసెన్సును పొందే అవకాశం ఉందని పేర్కొంది. ((తద్వారా కేంద్రం తాజా అడుగులు మరింత ఆందోళనను పెంచే విధంగానే ఉన్నాయని చెప్పకతప్పదు.)) విస్తృత చర్చ జరగాల్సిందే! ఏడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా 52 అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలకూ అధికారం ఉంటుందని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఈ జాబితాలో విద్య, ధరల నియంత్రణ, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ వంటి అంశాలతో పాటు విద్యుత్ కూడా ఒక అంశం. ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఏవైనా మార్పు చేర్పు లతో పాటు కొత్త చట్టాలు చేసే సమయంలో రాష్ట్రాల అభిప్రాయం కూడా కేంద్రం తీసుకోవడం పరిపాటి. ముసాయిదా విద్యుత్ (సవ రణ) నిబంధనలు–2022 విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై అనేక పార్టీలు గుర్రుమంటున్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై కొత్త చట్టం తెస్తున్న నేపథ్యంలో దీనిపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ప్రతిపాదించిన బిల్లులో ఉన్న లోపాలు, చేయాల్సిన మార్పులపై కూడా తన అభిప్రాయాన్ని పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. భిన్న అభిప్రాయాలు, అనుమానాల నేపథ్యం లోనే పార్లమెంటులో ఆగస్టు 8న కేంద్రం ఈ ముసాయిదాను ప్రవేశ పెట్టింది. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో చివరకు విద్యుత్పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ముందు ఉంచనున్నట్టు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. దీంతో వివాదం కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగింది. విశాల ప్రజానీకంలో నెలకొన్న సందే హాల నివృత్తి తర్వాతే కేంద్రం ముందుకు వెళితే ఆమోదయోగ్యంగా ఉంటుంది. – కె.జి. రాఘవేంద్రారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ -
యాసంగి వరికి ఆంక్షల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: ఈసారి యాసంగిలో వరి సాగుకు ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గత యాసంగిలో వరి వేయొ ద్దని రైతులకు సూచించగా.. ఈసారి అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నందున వరి వేసుకోవడానికి ఆంక్షలు ఉండవని పేర్కొన్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో యాసంగి సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే వానాకాలం సీజన్కు సంబంధించి ఇంకా కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ నడుస్తుండగానే యాసంగి వరిసాగుపై వ్యవసాయ శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ యాసంగిలో వరి సాగు విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు తెలిపారు. కేంద్ర ఎగుమతి విధానంతో మారిన సీన్ గత యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టింది. అయినా గణనీయంగానే వరి సాగవడం, ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తడం కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత నెలలో బియ్యం ఎగుమతికి సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటించింది. కేంద్రం ముడి బియ్యం ఎగుమతులపై 20శాతం సుంకాన్ని, నూకల ఎగుమతిపై నిషేధాన్ని విధించింది. ఈ నిబంధన నుంచి బాస్కతి, బాయిల్డ్ రైస్లను మినహాయించింది. దీనివల్ల ముడి బియ్యం ఎగుమతులు తగ్గి, ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరుగుతుందని.. యాసంగి ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి, ఉప్పుడు బియ్యంగా మార్చి ఎగుమతులు చేసే వెసులుబాటు పెరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో సాగయ్యే అవకాశం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నీటి వనరులు అందుబాటులోకి రావడం, పలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవడం, మంచి వర్షాలతో కొన్నేళ్లు రాష్ట్రంలో వరి అంచనాలకు మించి సాగవుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వరి సాగైంది. నిజానికి ఈ వానాకాలం సీజన్లో పత్తిసాగు పెంచాలని సర్కారు రైతులకు సూచించింది. 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని భావించింది. భారీ వర్షాలతో చాలాచోట్ల విత్తిన పత్తి దెబ్బతిన్నది సాగు 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మరోవైపు వరిని 45 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలకున్నా.. రైతులు 64.54 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఇప్పుడు యాసంగిలో వరిపై ఆంక్షలు ఎత్తివేయడం వల్ల గణనీయంగా సాగు పెరిగే అవకాశముంది. 2020–21 యాసంగిలో 52.28 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ప్రభుత్వ సూచనల మేరకు 2021–22 యాసంగిలో కాస్త తగ్గి 35.84 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ఈసారి ఆంక్షలు లేకపోవడం, వానలు కురిసి జల వనరులన్నీ నిండటం, భూగర్భ జలాలు పెరగడంతో.. 2020–21కు మించి వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్నేళ్లుగా యాసంగిలో వరిసాగు తీరు (లక్షల ఎకరాల్లో) ఏడాది సాగు విస్తీర్ణం 2017–18 19.20 2018–19 17.30 2019–20 38.62 2020–21 52.28 2021–22 35.84 -
Visakhapatnam: విశ్వ విశాఖ.. మరోసారి కీర్తి పతాకం ఎగరేసింది
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశ్వ విశాఖ..మరోసారి కీర్తి పతాక ఎగరేసింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో నాల్గో ర్యాంకు సాధించి.. గత ర్యాంకును అధిగమించింది. 2018–19లో 23వ ర్యాంకుకు పడిపోయిన విశాఖ.. 2019–20లో 9వ స్థానానికి ఎగబాకింది. 2020–21లో అదే స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది దేశంలో టాప్–5లో నిలిచి 4వ ర్యాంకు సాధించింది. పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ, రవాణా వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకును ప్రకటించింది. సిటిజన్ ఫీడ్బ్యాక్లో కూడా టాప్ సిటీగా జీవీఎంసీ గుర్తింపు పొందడం విశేషం. గార్బేజ్ ఫ్రీ సిటీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దేశవ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి, పర్యాటక ప్రాంతంగా బీచ్ క్లీన్, పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ నిషేధం. మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులకు నగరాలను ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది ర్యాంకులను శనివారం ఢిల్లీలో ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో 2021–22కి గానూ విశాఖ మహా నగరం మొదటి 5 నగరాల జాబితాలో నిలిచింది. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి సమక్షంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నగరాలకు సంబంధించి ప్రకటించిన ర్యాంకుల్లో ఇండోర్కు మొదటిస్థానం దక్కగా.. జీవీఎంసీకి నాల్గో ర్యాంకు వచ్చింది. అవార్డులతో మేయర్ హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీశ, అదనపు కమిషనర్ సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి జీవీఎంసీకి గతంలో 9.. ఇప్పుడు 4 జీవీఎంసీకి నాల్గో ర్యాంకు రావడంపై విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్లో 9వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఢిల్లీలోని తలక్తోరా ఇండోర్ స్టేడియంలో శనివారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు, గత కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ, అదనపు కమిషనర్ డాక్టర్ సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి తదితరులు కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. జీవీఎంసీకి వచ్చిన మార్కులివీ.. మొత్తం 7,500 మార్కులకు గానూ జీవీఎంసీకి 6,701 మార్కులు వచ్చాయి. పార్ట్–1లో స్వచ్ఛత లీగ్ ప్రోగ్రెసీవ్కు సంబంధించి 3,000 మార్కులకు 2,536, పార్ట్–2లో గార్బేజ్ ఫ్రీ సిటీకి సంబంధించి 1,250 మార్కులకు 1,050, పార్ట్–2బిలో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంలో వెయ్యికి వెయ్యి మార్కులు, పార్ట్–3లో సిటిజన్ వాయిస్కు సంబంధించి 2,250కి గానూ 2,115 మార్కులు వచ్చాయి. సిటిజన్ ఫీడ్ బ్యాక్లో బెస్ట్ సిటీ స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో నగరాన్ని ఉన్నతంగా నిలపడంలో నగర పౌరుల భాగస్వామ్యం ఎంతో ఉంది. సిటిజన్ ఫీడ్ బ్యాక్ విషయంలో విశాఖను నంబర్వన్గా నిలబెట్టారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు స్వచ్ఛతా బృందం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వే నిర్వహించారు. వెబ్సైట్ ద్వారా, గూగుల్ పేలో స్వచ్ఛభారత్ యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్లో ఏ నగరం ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఏడు ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తారో ఆ నగరానికి గరిష్ట మార్కులు కేటాయిస్తారు. ఈ విభాగంలో వైజాగ్కు బెస్ట్ సిటీ అవార్డు వరించింది. 10 నుంచి 40 లక్షల జనాభా ఉన్న నగరాలను ఓ విభాగంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విభాగంలో సిటిజన్ ఫీడ్బ్యాక్లో బెస్ట్ సిటీగా ఎంపికైంది. ప్రజల భాగస్వామ్యంతో 4వ ర్యాంకు స్వచ్ఛ సర్వేక్షణ్లో జీవీఎంసీ 4వ స్థానం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. అవార్డు సాధించడంలో జీవీఎంసీ యంత్రాంగంతో పాటు స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, సెలబ్రిటీలు, ఆర్డబ్ల్యూఎస్, వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు, నగర పౌరుల కృషి ఎంతో ఉంది. ఇదే స్ఫూర్తితో నగరాన్ని మరింత సుందరంగా ఉంచేందుకు అనునిత్యం కృషి చేస్తాం. పోటీతత్వం ఉంటేనే నగరాలు మరింత పరిశుభ్రంగా ఉంటాయి. రోజురోజుకూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న విశాఖ నగరం ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రజలందరి భాగస్వామ్యంతో వచ్చే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్లో మొదటి ర్యాంకు సాధనే లక్ష్యంగా పనిచేస్తాం. – గొలగాని హరి వెంకటకుమారి, మేయర్ అవార్డు మరింత బాధ్యత పెంచింది విశాఖ మహానగరం 4వ ర్యాంకు సాధించి టాప్–5లో నిలవడం గర్వంగా ఉంది. అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి. ఈ అవార్డు పొందడం వెనుక మేయర్ గొలగాని హరివెంకటకుమారి, గత కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పాలకమండలి, అధికారులు, సిబ్బందితో పాటు నగర పౌరులు, ఆర్డబ్ల్యూఎస్, నేవల్, పోలీస్, విద్యాసంస్థలు, ఎన్జీవోస్ కృషి ఉంది. 2023లో టాప్–1 స్థానాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమిస్తాం. కేవలం ర్యాంకు కోసమే కాకుండా.. ప్రజలకు సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవనం అందించడంతో పాటు క్లీన్ సిటీగా నిత్యం ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పి.రాజాబాబు, జీవీఎంసీ కమిషనర్ శత శాతం క్లీన్ సిటీ విశాఖ కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో నియమ నిబంధనలతో పనులు పూర్తి చేస్తున్నాం. పారిశుధ్యం విషయంలో రాజీ పడటం లేదు. అందుకే గత ర్యాంకును అధిగమించి టాప్–5లో నిలిచాం. వచ్చే ఏడాదికి మరింత మెరుగు పడేందుకు ప్రయత్నిస్తాం. పారిశుధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఎంహెచ్వోలు, జెడ్సీలు, నివాసిత సంక్షేమ సంఘాలు, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్లు, ఎన్జీవోల సమష్టి కృషితో ఈ అవార్డును సొంతం చేసుకున్నందుకు గర్వంగా ఉంది. – డా.కేఎస్ఎల్జీ శాస్త్రి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి చెత్త రహిత నగరాల్లో 5 స్టార్ రేటింగ్ చెత్తరహిత నగరాల జాబితాలో గతేడాది 3స్టార్ రేటింగ్ సాధించిన జీవీఎంసీ ఈ ఏడాది 5 స్టార్ రేటింగ్ సాధించింది. 98 వార్డుల్లోనూ తడి పొడి చెత్త విభజన చేసి, ఎరువును తయారు చేయడం వంటి అంశాలన్నీ విశాఖ నగరాన్ని 5 స్టార్ రేటింగ్కు తీసుకెళ్లాయి. -
అటార్నీ జనరల్గా ఆర్.వెంకటరమణి
న్యూఢిల్లీ: భారత తదుపరి అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు ట్వీట్ చేశారు. నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని లీగల్ అఫైర్స్ విభాగం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పదవిలో వెంకటరమణి మూడు సంవత్సరాలపాటు కొనసాగుతారు. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. వేణుగోపాల్ స్థానంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, సొంత కారణాలతో రోహత్గీ ఆ ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించారు. వెంకటరమణి అక్టోబర్ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. మోదీ తొలిసారిగా ప్రధాని అయినపుడు 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు రోహత్గీనే అటార్నీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగిశాక వేణుగోపాల్ సేవలందించారు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం) -
రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై ) కింద ఉచిత బియ్యం పంపిణీని మరో మూడునెలలు పొడిగించింది. పీఎంజీకేఏవై 7వ దశలో భాగంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా కార్డులోని ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల చొప్పున 122 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. వచ్చే మూడునెలలు పండుగలు ఉండటంతో పేదలకు ఆర్థిక బాధలు లేకుండా ఆహారధాన్యాలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కోవిడ్–19 విజృంభణ నేపథ్యంలో 2020 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవైకు శ్రీకారం చుట్టింది. మొదటి రెండు దశల్లో ఎనిమిది నెలల పాటు (ఏప్రిల్ 2020 నుంచి నవంబర్ 2020), మూడు నుంచి ఐదు దశల్లో 11 నెలలు (మే 2021 నుంచి మార్చి 2022), ఆరోదశలో ఆరునెలలు (ఏప్రిల్ 2022 నుంచి సెప్టెంబర్ 2022) వరకు.. మొత్తం 25 నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. 88 లక్షల కార్డులకే ఉచిత బియ్యం రాష్ట్రంలో ఉన్న 1.45 కోట్ల రేషన్ కార్డుల్లో 88 లక్షల కార్డులనే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ కింద పరిగణిస్తోంది. 88 లక్షల ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకే ప్రతినెలా కేంద్రం బియ్యం 5 కిలోల చొప్పున (నాన్–సార్టెక్స్) ఇస్తుండగా మిగిలిన 57 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో మొత్తం అందరికి సార్టెక్స్ బియ్యం అందిస్తోంది. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ఏ, నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులందరూ దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉండగా కేంద్రం మాత్రం కొన్ని కార్డులకే బియ్యం ఇస్తోంది. కోవిడ్ సమయంలో ప్రారంభించిన పీఎంజీకేఎవై కింద ఉచిత బియ్యాన్ని కూడా ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకే పరిమితం చేయడంతో రాష్ట్రంలో 88 లక్షల కార్డులకు మాత్రమే ఉచిత బియ్యం దక్కనున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని అన్ని కార్డులను ఎన్ఎఫ్ఎస్ఏ కింద పెట్టి మొత్తం అందరికీ కేంద్రమే బియ్యం ఇస్తుండటం గమనార్హం. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరినా పట్టించుకోవడంలేదు. -
ఆ విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరాం: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే మా లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే సుప్రీంకు వెళ్లామన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకముందే అమరావతి రాజధానిగా ప్రకటించారని తెలిపారు. రాజధానిపై చంద్రబాబు వేసింది ఎక్స్పర్ట్ కమిటీ కాదు.. ఇన్వెస్ట్మెంట్ కమిటీ అని ఎద్దేవా చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవడంతోనే ఉద్యమాలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రాధికారానికి భంగం కలిగించే విధంగా ఉన్న తీర్పుపైనే సవాల్ చేశామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చదవండి: (అనంతపురం బీఈఎల్కు లైన్ క్లియర్) -
ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం
న్యూఢిల్లీ: 26 రకాల ఔషధాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. అత్యవసర జాబితా నుంచి ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్లను తొలగించింది. ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్లతో క్యాన్సర్ వస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వాటితో పాటు 26 రకాల మందులను ఇండియా మార్కెట్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాంటాక్, జింటాక్ మందులను ఎసిడిటీ సంబంధింత సమస్యలకు వైద్యులు సూచిస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలను కలిగి ఉన్న కొత్త నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ను విడుదల చేయగా జాబితా నుండి తాజాగా 26 ఔషధాలను తొలగించింది. ఆల్టెప్లేస్, అటెనోలోల్, బ్లీచింగ్ పౌడర్. కాప్రోమైసిన్, సెట్రిమైడ్, క్లోర్ఫెనిరమైన్, డిలోక్సనైడ్ ఫ్యూరోయేట్, డిమెర్కాప్రోల్, ఎరిత్రోమైసిన్, ఇథినైల్స్ట్రాడియోల్, ఇథినైల్స్ట్రాడియోల్(ఏ) నోరెథిస్టిరాన్ (బీ),గాన్సిక్లోవిర్, కనామైసిన్, లామివుడిన్ (ఎ)+నెవిరాపైన్ (బి)+ స్టావుడిన్ (సి),లెఫ్లునోమైడ్, మిథైల్డోపా, నికోటినామైడ్, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2a, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2బి, పెంటమిడిన్, ప్రిలోకైన్ (A) + లిగ్నోకైన్ (B, ప్రోకార్బజైన్, రానిటిడిన్, రిఫాబుటిన్, స్టావుడిన్ (ఎ) + లామివుడిన్ (బి), సుక్రాల్ఫేట్, వైట్ పెట్రోలేటం నిషేధించిన 26 ఔషధాలు జాబితాలో ఉన్నాయి. -
గుడ్న్యూస్: 2024 డిసెంబర్ 31 దాకా ‘పీఎంఏవై–అర్బన్’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)–అర్బన్ పథకాన్ని 2024 డిసెంబర్ 31వ తేదీ వరకూ కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి దేశంలో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని 2015 జూన్లో ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మంజూరు చేసిన 122.69 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థన మేరకు పథకాన్ని 2024 డిసెంబర్ 31 కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చదవండి: (Video Viral: జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు) -
CM KCR: తెగించి కొట్లాడండి
సాక్షి, హైదరాబాద్: తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉందని, కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపట్ల అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిపై పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసన గళం వినిపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించకుండా కేంద్రం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది లోక్సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులు కలుపుకుని మొత్తం 16 మంది ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏళ్లలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని ప్రశ్నించాలన్నారు. కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని కేంద్రాన్ని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. కేంద్రంపై పోరుకు పార్లమెంటు సరైన వేదిక.. ‘కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో అన్ని రంగాల్లో దేశాభివృద్ధి నిలిచిపోతున్నందున పార్లమెంటు ఉభయ సభలను తెలంగాణ ఎంపీలు పోరాట వేదికగా ఉపయోగించుకోవాలి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలకు పాల్పడుతూ నిబంధనల పేరిట ఆర్థిక అణచివేతకు పాల్పడుతోంది. 8 ఏళ్లుగా తెలంగాణ క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తుండటంతో ఆర్బీఐ బిడ్ల వేలంలో తెలంగాణ బిడ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దేశంలో 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులను కలిగి ఉన్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో ఆ పార్టీ వివరణ ఇవ్వాలి. కేంద్రం, రాష్ట్రాల నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలను ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కుట్రపూరిత చర్య. బీజేపీ అనుసరిస్తున్న దిగజారుడు, చవకబారు రాజకీయాలకు ఇది నిదర్శనం’అని కేసీఆర్ ఈ భేటీలో వ్యాఖ్యానించారు. ఎఫ్ఆర్బీఎంపై మాటమార్చిన కేంద్రం ‘ఏటా కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిమితిని ప్రకటించిన తర్వాతే రాష్ట్రాలు బడ్జెట్లు రూపొందించుకుంటాయి. తెలంగాణ ఎఫ్ఆర్బీఎంను రూ. 53 వేల కోట్లుగా ప్రకటించి రూ. 23 వేల కోట్లకు కుదించడం కుట్రపూరితం. ఈ తరహా బీజేపీ దివాళాకోరు, తెలివితక్కువ వ్యవహారాలను నిలదీసి, వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు అన్ని రకాల ప్రజాస్వామిక పద్ధతులను పార్టీ ఎంపీలు అనుసరించాలి. విద్యుత్ సంస్కరణల పేరిట కావాల్సిన వారి కోసం రాష్ట్రాలపై ఒత్తిడి తేవడాన్ని నిలదీయాలి. నీతి ఆయోగ్ సిఫారసులను బుట్టదాఖలు చేయడాన్ని ప్రశ్నించాలి. తెలంగాణ సహా కేవలం 8 రాష్ట్రాలు మాత్రమే దేశ జీడీపీకి దోహదం చేస్తున్నాయి. ఎనిమిదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన నిధుల లెక్కలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టబయలు చేస్తాయి’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అవసరమైతే నేనూ ఢిల్లీకి వస్తా.. పార్లమెంటు సమావేశాల సందర్భంగా అవసరమైతే తాను ఢిల్లీకి వచ్చి బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలసి వచ్చే విపక్ష పార్టీల అధినేతలు, ఎంపీలతో చర్చలు జరుపుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న పలు ప్రజావ్యతిరేక బిల్లులను నిర్ద్వందంగా తిరస్కరించాలని ఎంపీలను ఆదేశించారు. ఎఫ్ఆర్బీఎం విషయంలో కేంద్రం ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ బొగ్గు దిగుమతులు, కేంద్ర ప్రభుత్వ అప్పులపై నిలదీయాలన్నారు. ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ పథకం అమలుపై కుట్రలు, పాతాళంలోకి దిగజారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ, బీజేపీ మూకస్వామ్యంపై నిరసన గళం వినిపించి ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేకత ఉధృతమైతే పార్లమెంటు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భాలను సీఎం ఎంపీలకు గుర్తుచేశారు. అదే పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు అంశాలకు చెందిన డిమాండ్లతోపాటు ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని, ఈ జాప్యానికి బీజేపీని దోషిగా నిలబెట్టాలన్నారు. -
CM KCR: తగ్గేదేలే.. కేంద్రంపై సమరమే..!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలపై పార్లమెంటుతో పాటు దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో తనతో కలిసి వచ్చే బీజేపీయేతర పార్టీలను సమన్వయం చేసుకుంటూ కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న లౌకిక, ప్రజాస్వామిక విలువలతో పాటు సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు మరింత మద్దతు కూడగట్టడంపై కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నెల 18నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ ప్రభుత్వ దమనకాండపై పోరాటం సాగించడంతో పాటు, కేంద్రం నిజ స్వరూపాన్ని ప్రజానీకం ముందు నిలబెట్టేలా దేశవ్యాప్త నిరసనలకు శ్రీకారం చుడుతున్నారు. నేతల సానుకూల స్పందన కేసీఆర్ ఇప్పటికే ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), అర్వింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ)తో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సన్నిహితులు, తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ, బిహార్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ, యూపీ ప్రతిపక్ష నేత), శరద్ పవార్ (ఎన్సీపీ)తో మాట్లాడారు. తాజాగా శుక్రవారం బీజేపీయేతర పార్టీలకు చెందిన పలువురు జాతీయ నేతలతో ఫోన్లో మాట్లాడారు. ఓ వైపు రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిపై మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూనే, మరోవైపు బీజేపీపై పార్లమెంటు లోపలా, బయటా సాగించాల్సిన పోరుపై వివిధ రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రతిపాదనలకు వివిధ రాష్ట్రాల సీఎంలు, పలువురు నేతలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఉభయ సభల్లో నిలదీత కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నదని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్న వైనాన్ని దేశ ప్రజలకు వివరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రోజు రోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువను ఉదహరిస్తూ దేశ అభివృద్ధి సూచీ పాతాళానికి చేరుకుంటున్న ప్రమాదకర పరిస్థితులను ఎత్తి చూపనున్నారు. దేశం ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై కూడా ఉందని భావిస్తున్న నేపథ్యంలో, పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీని నిలదీయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ, సామాజిక రంగాలు సహా అన్నింటా కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ఆధిపత్య ధోరణితో ప్రజాస్వామిక విలువలు దిగజారడం.. పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వానికి బదులు అశాంతి పెరుగుతున్న విషయాన్ని విపక్ష నేతలతో జరుపుతున్న చర్చల్లో కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తి, లౌకిక జీవన విధానానికి బీజేపీ ప్రభుత్వ విధానాలు గొడ్డలిపెట్టుగా మారుతున్న వైనం.. దేశ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరాన్ని కేసీఆర్ వివరిస్తున్నారు. నేడు టీఆర్ఎస్ ఎంపీలకు దిశా నిర్దేశం ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత సీఎం కేసీఆర్ శనివారం ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ భేటీలో పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై విపక్ష ఎంపీలను కూడా కలుపుకొని సాగించాల్సిన పోరాటంపై పలు సూచనలు చేస్తారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సిన తీరుపై కూడా దిశా నిర్దేశం చేస్తారు. అర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి బాటలో సాగుతున్న తెలంగాణను ప్రోత్సహించకుండా కేంద్రం పెడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ బీజేపీని దోషిగా నిలబెట్టే విషయమై పలు సూచనలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులు, మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్న తీరును ఎండగట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. -
సీఎం జగన్తో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం భేటీ
సాక్షి, అమరావతి: కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యింది. బుధవారం సాయంత్రం.. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్కరన్లతో కూడిన బృందం భేటీ అయ్యింది. ఈ భేటీకి వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జి శేఖర్ బాబు హాజరు అయ్యారు. ఏపీకి సంబంధించి కీలకాంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. -
ఎట్టి పరిస్థితుల్లోను అగ్నిపథ్ ను ఆపేది లేదు
-
ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి
-
తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
-
మంకీపాక్స్పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: మంకీపాక్స్పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా కేంద్రం చర్యలు చేపట్టింది. అనుమానిత కేసుల శాంపిళ్లను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపాలని సూచించింది. గత 21 రోజులలో మంకీపాక్స్ సోకిన దేశాలకు ప్రయాణించిన చరిత్ర ఉన్న ఏ వయస్సు వారైనా, తీవ్రమైన దద్దుర్లు, వాపు, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, తీవ్రమైన బలహీనత వంటి ఇతర లక్షణాలు కలిగి ఉంటే మంకీపాక్స్ వైరస్ వ్యాధితో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్నారు. వీరికి కొద్ది రోజులు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలాఉంటే, మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది. చదవండి: (కారులో వెళ్తున్న ప్రధాని మోదీ.. యువతి చేతిలో ఆ ఫోటో చూడగానే..) -
విద్యుత్పై మరో గుబులు రేపిన కేంద్రం...రాష్ట్రాలకు అల్టిమేటం జారీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్పై కేంద్రం మరో గుబులు రేపింది. విదేశీ బొగ్గు కొనుగోళ్లను రాష్ట్రాలకు తప్పనిసరి చేసింది. గత ఆదేశాల మేరకు ఈ నెల 31లోగా 10 శాతం విదేశీ బొగ్గు దిగుమతుల కోసం రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లు ఆర్డర్ ఇవ్వకపోయినా, వచ్చే నెల 15 నాటికి జెన్కోల విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు రాక ప్రారంభం కాకపోయినా.. ఈ కొరతను తీర్చడానికి వచ్చే ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఏకంగా 15 శాతం వరకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేసింది. దీనికి తోడు సంబంధిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు దేశీయ బొగ్గు కేటాయింపులనూ ప్రతి నెలా 5 శాతం వరకు తగ్గించుకుంటూ పోతామని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు కేంద్ర విద్యుత్ శాఖ స్వయంగా బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దేశంలో బొగ్గు కొరత తీర్చేందుకు.. దేశంలో బొగ్గు కొరతను తీర్చడానికి దేశీయ బొగ్గులో తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును కలిపి విద్యుదుత్పత్తి జరపాలని గత ఏప్రిల్ 30న రాష్ట్రాలను కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది. వచ్చే అక్టోబర్ 31 వరకు అవసరం కానున్న విదేశీ బొగ్గులో.. 50 శాతం వచ్చే జూన్ 30లోగా, 40 శాతం వచ్చే ఆగస్టు 31లోగా, 10 శాతం వచ్చే అక్టోబర్ 31లోగా రప్పించుకోవడానికి వీలుగా ప్రస్తుత మే 31లోగా ఆర్డర్ ఇవ్వాలంది. ఈ ఆదేశాలనుసరించి ఇప్పటి వరకు 10 శాతంవిదేశీ బొగ్గు వినియోగాన్ని ప్రారంభించని థర్మల్ ప్లాంట్లు.. వచ్చే అక్టోబర్లోగా 15 శాతం, ఆ తర్వాత నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 10 శాతం విదేశీ బొగ్గును కలిపి విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని తాజాగా కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి రాష్ట్ర జెన్కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు లభ్యత పుష్కళంగా ఉన్నా తప్పనిసరిగా విదేశీ బొగ్గును కొనాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, ఆ శాఖ అధికారులు రెండ్రోజులకోసారి రాష్ట్రాల జెన్కోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విదేశీ బొగ్గు కొనుగోళ్లలో పురోగతిపై ఆరా తీస్తున్నారు. అయితే రాష్ట్రంలోని ప్లాంట్లకు బొగ్గు కొరత లేదని, విదేశీ బొగ్గు అవసరం లేదని కేంద్ర మంత్రికి రాష్ట్ర ఇంధన శాఖ, జెన్కో అధికారులు తేల్చి చెప్పారు. లేఖ కూడా రాశారు. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలు ఒప్పుకోకపోవడంతో తాజాగా కేంద్రం బెదిరిస్తోందని జెన్కో అధికారులు చెబుతున్నారు. విదేశీ బొగ్గు.. తలకు మించిన భారం రాష్ట్రంలో పోర్టు లేదు. 450 కిలోమీటర్ల దూరంలోని కృష్ణపట్నం పోర్టు నుంచి రైలు/రోడ్డు మార్గంలో విదేశీ బొగ్గును తీసుకురావడంరాష్ట్రానికి తలకుమించిన భారం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విదేశీ బొగ్గు ధరలు భారీగా పెరిగి టన్నుకు రూ. 35 వేలు (400 డాలర్ల పైన)కు చేరింది. సింగరేణి బొగ్గు ధర టన్నుకు రూ.5 వేలే ఉంది. కేంద్రం ఒత్తిళ్లతో విదేశీ బొగ్గు కొంటే ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరింతగా కుంగిపోతాయి. వినియోగదారులపై చార్జీల భారం పెరగనుంది. -
కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?
రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో 160 సంవత్స రాలకు పైగా చర్చ జరుగుతున్న ఈ చట్టం అమలు తీరు, దాని పర్యవసానాలపై పౌర సమాజం ఆసక్తితో ఉంది. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం వెలుగులో జీవిస్తున్న సమాజం మనది. మానవ సమాజ పరిణామ క్రమంలో మనుషులకు అవసరం లేనివి కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ విధంగానే నల్ల చట్టాలు కూడా మిగలొద్దని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఎన్నో దేశాలు వాటిని రద్దు చేసుకున్నాయి. మరి మనది 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం. రాజుల కాలం పోయింది. సంస్థానాలు కూలిపోయి నాయి. కానీ రాజులేని కాలంలో రాజద్రోహ చట్టాన్ని ఇంకా కాపాడుతున్నది ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య దేశంలో ఒక అవమానకరమైన పరిస్థితిని సూచిస్తుంది. అందుకేనేమో తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే రాజద్రోహానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. భారత స్వతంత్ర ఆకాంక్షను అణచివేయడానికి బ్రిటిష్ వారు 1860లో ఇండియన్ పీనల్ కోడ్లో రాజద్రోహాన్ని పొందుపరిచారు. మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి స్వతంత్ర సమరయోధులు రాజద్రోహం కింద ఆనాడు శిక్ష అనుభవించారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి ఉద్యమిస్తున్న వారిని ఈనాడు అదే చట్టం కింద నిర్బంధించడం సిగ్గుచేటు. ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ ఈ చట్టం ఎత్తివేతకు అన్ని పార్టీలతో కార్యాచరణను ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇందులో కలిసి రావాలని రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మాతో జరిగిన చర్చల్లో ప్రతిపాదించడం జరిగింది. మావోయిస్టులే చర్చలకు సిద్ధమ వుతున్నప్పుడు ఈ చట్టం మరింత కాలం చెల్లినది అని చెప్పక తప్పదు. (చదవండి: కార్మిక హక్కులకు అసలు ప్రమాదం) చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, ఈనాటి ప్రమాదాన్ని ముందే ఊహించిన కె.ఎం. మున్షీ లాంటివారు దీన్ని అత్యంత క్రూరమైన చట్టంగా అభివర్ణించారు. వ్యక్తి హక్కులను నిర్దాక్షిణ్యంగా అణిచివేసే ఈ చట్టం ప్రజా స్వామ్య మనుగడకు ప్రమాదకరమని రాజ్యాంగ సభలో మాట్లాడారు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్య మనుగడ ఉండదు. ప్రశ్న ప్రజాస్వామ్య ఉనికికి జీవగర్ర లాంటిది. పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల అణచివేతకు కారణమవుతున్న రాజద్రోహాన్ని భారత శిక్షా స్మృతి నుండి తొలగించాలని ఇప్పటికే అనేక కేసులు దాఖలయ్యాయి. ఈ ప్రయత్నంలో న్యాయవ్యవస్థ సఫలీకృతం అయితే భారత ప్రజలకు ఒక భరోసా లభించినట్లే. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా గొంతు విప్పవలసిన సమయం ఇది. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొనే ప్రజా ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ సత్యం గ్రహించాలి. ప్రజాస్వామ్యం అంతిమసారం అదే. రాజ్యంగ స్ఫూర్తి కూడా అదే. (చదవండి: అసమ్మతి గళాలపై అసహనం) - డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణా ఇంటి పార్టీ అధ్యక్షులు -
రిక్రూటైన ఐదేళ్లకే రిటైర్మెంట్?
న్యూఢిల్లీ: కరోనాతో సైన్యంలో రెండేళ్లుగా నిలిచిన నియామకాలను మొదలు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. పెన్షన్ల భారం తగ్గించుకొనేందుకు ఆర్మీలో నియామకాలను మూడు రకాలుగా చేస్తారని సమాచారం. 25 శాతం మంది మూడేళ్లు, 25 శాతం ఐదేళ్లు పనిచేసి రిటైరవుతారు. మిగతా 50 శాతం రిటైరయ్యేదాకా సేవలనందిస్తారు. చదవండి: (అమిత్ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేను: గవర్నర్ తమిళిసై) -
పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు .. రూ.లక్షల్లో ప్రమాద బీమా
సాక్షి, మన్యం పార్వతీపురం కురుపాం: అసంఘటిత కార్మికులకు కేంద్రం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ–శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు రూ.లక్షల్లో ప్రమాద బీమా వచ్చేలా చర్యలు చేపట్టింది. గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ–పోర్టల్పై అప్పట్లో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేయగా, ఇప్పుడు ఈ పథకంపై తగినంత అవగాహన లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. త్వరగా రిజిస్ట్రేషన్లు చేసుకుని, పథకం లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు. 16 నుంచి 59 వయసు కలిగిన వారంతా ఈ పథకానికి అర్హులు కాగా, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.2 లక్షలు, అంగవైకల్యం బారినపడితే రూ.లక్ష అందజేస్తారు. రాష్ట్రాలు, కార్మిక సంఘాల సమన్వయంతో సామాజిక సంక్షేమ పథకాలను ఈ పోర్టల్ ద్వారా ఏకీకృతం చేయడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని, ఈ–పోర్టల్ ప్రారంభించిననట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 12 అంకెల నంబర్ కలిగిన ఈ–శ్రమ్ గుర్తింపు కార్డు ఇస్తారు. అనంతరం వారికి ఏడాది కాలానికి గాను ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన((పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి కర్షక బీమా పథకం కింద ప్రమాద బీమా వర్తింపజేస్తారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం పొందని వారంతా ఈ పథకానికి అర్హులే కాగా, ఈ జాబితాలో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, భూమి లేని రైతులు, మత్స్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, తోపుడు బండ్ల వ్యాపారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, తాపీమేస్త్రీలు, కార్పెంటర్లు, టైలర్లు, రజకులు, కల్లుగీత కార్మికులు, చేనేత, క్షౌ ర వృత్తి వారు, చిరు వ్యాపారులు ఉన్నారు. పోస్టాఫీసుల్లో రిజిస్ట్రేషన్లు.. ప్రస్తుతం కార్మిక శాఖ అధికారులు తపాలా శాఖ సహాయంతో అసంఘటిత కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంస్థ సభ్యులు కూడా ఈ–శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ఆధార్ లింక్ చేసిన ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్లతో జిల్లాలోని ఏ పోస్టాఫీస్కు వెళ్లినా ఈ–శ్రమ్ పోర్టల్లో కార్మికుల వివరాలు నమోదు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కోవిడ్ విపత్తు సమయంలో వలస కూలీలు, అసంఘటిత కార్మికులు పడిన ఇబ్బందులు చూసి, వారికి ఎలాగైనా ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీంకోర్టు 2021 జూన్ 29వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ–శ్రమ్ పోర్టల్ని అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. 2021 ఆగస్టు 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, అన్నిచోట్ల నుంచి ఇప్పుడిప్పుడే ఈ పథకానికి స్పందన లభిస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో రిజిస్టేషన్లు అంతగా జరగకపోవడం బాధాకరం. ప్రస్తుతం కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాలకొండ, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల్లోని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్ నమోదు ప్రక్రియ జరుగుతుండగా, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పథకం సద్వినియోగం చేసుకోవాలి కార్మికులంతా ఈ–శ్రమ్ పథకం లబ్ధి పొందాలి. దగ్గరలోని పోస్టాఫీస్కి గానీ, స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సభ్యుల వద్దకు గానీ వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. సి.హెచ్.సాయికిశోర్, ఈ–శ్రమ్ ప్రాజెక్ట్ జోనల్ ఇన్చార్జ్, కురుపాం -
మరో ఆరు నెలలు ఉచితమే..
సాక్షి, ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకునేందుకు మరోసారి ముందుకొచ్చాయి. ఈ క్రమంలో రేషన్కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఒకటి, రెండు నెలలు కాదు మళ్లీ ఆరు నెలల పాటు లబ్ధిదారులందరికీ ఉచితంగానే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా, గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పొడిగింపు.. కరోనా కేసులు మొదలైన సమయాన పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో అప్పట్లో వారిని ఆదుకునేందుకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా గత నెలతో ప్రక్రియ ముగిసింది. దీంతో తాజాగా ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించాయి. పంపిణీ వివరాలిలా.. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీ లబ్ధిదారుడిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు బియ్యం కేటాయింపులు చేశాయి. ఆహారభద్రత లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పది కేజీలు, అంత్యోదయ కార్డుకు 35కేజీలు ఇస్తుండగా... అదనంగా ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కేజీల బియ్యం ఇవ్వనున్నారు. ఇక అన్నపూర్ణ కార్డుదారులకు మాత్రం యథావిధిగా పది కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. కాగా, జిల్లాలో 669 రేషన్షాపులు, 4,16,826 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 3,89,765, అంత్యోదయ కార్డులు 27,058తో పాటు అన్నపూర్ణ కార్డులు మూడు ఉన్నాయి. నేటి నుంచి పంపిణీ చేస్తారు... ఏప్రిల్ నెలకు సంబంధించి ఉచితంగానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో రేషన్కార్డు ఉన్న వారందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నేటి నుంచి బియ్యం అందించాలని రేషన్ డీలర్లను ఆదేశించాం. – రాజేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
ప్రత్యేక ‘పరిధి’ తగ్గింది
న్యూఢిల్లీ/గౌహతి/కోహిమా: ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతోంది. ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)–1958ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. అస్సాంలో 23 జిల్లాలు, మరో జిల్లాలో కొన్ని ప్రాంతాలు, మణిపూర్లో 6 జిల్లాలు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో), నాగాలాండ్లో 7 జిల్లాలకు(15 పోలీసు స్టేషన్ల పరిధిలో) ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం ట్వీట్లు చేశారు. ఇదొక కీలకమైన అడుగు అని అభివర్ణించారు. నాగాలాండ్, అస్సాం, మణిపూర్లో ఏఎఫ్ఎస్పీఏ పరిధిలోని ప్రాంతాల సంఖ్యను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీని నేతృత్వంలోని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఏప్రిల్ 1 (శుక్రవారం) నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశంలో తీవ్రవాదానికి చరమగీతం పాడి, శాంతిని స్థాపించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, చేపట్టిన చర్యల వల్ల మూడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భద్రత మెరుగుపడిందని, అభివృద్ధి వేగం పుంజుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. అందువల్లే ఏఎఫ్ఎస్పీఏ పరిధి నుంచి ఆయా ప్రాంతాలను మినహాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో యథాతథంగా.. అయితే, మూడు రాష్ట్రాల నుంచి సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయడం లేదని, కొన్ని ప్రాంతాల్లో యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో 2014తో పోలిస్తే 2021లో తీవ్రవాద ఘటనలు 74 శాతం తగ్గిపోయాయని చెప్పారు. భద్రతా సిబ్బంది మరణాలు 60 శాతం, సాధారణ ప్రజల మరణాలు 84 శాతం తగ్గాయని గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో 7,000 మంది తీవ్రవాదులు లొంగిపోయారన్నారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుకు ఆమోదం! 2021 డిసెంబర్లో నాగాలాండ్లో సైనికుల దాడిలో 14 మంది సాధారణ ప్రజలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజల వినతి మేరకు ఏఎఫ్ఎస్పీఏను ఎత్తివేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అస్సాం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ స్వాగతించారు. మూడు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలను ఏఎఫ్ఎస్పీఏ నుంచి మినహాయించడం సంతోషకరమని నాగాలాండ్ సీఎం నీఫియూ రియో చెప్పారు. ఏమిటీ చట్టం? తీవ్రవాదాన్ని అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే ధ్యేయంగా ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 1958 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సైనిక దళాలకు కొన్ని అధికారాలు దక్కాయి. ముందస్తుగా వారంట్ ఇవ్వకుండానే ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. సోదాలు నిర్వహించవచ్చు. ఎవరినైనా కాల్చి చంపినా అరెస్టు, విచారణ నుంచి ప్రత్యేక రక్షణ ఉంటుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏఎఫ్ఎస్పీఏకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోంచాను షర్మిళ 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించారు. 2015లో త్రిపురలో, 2018లో మేఘాలయాలో ఈ చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. చదవండి: (కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి) -
బెంగాల్ సీఎం లేఖ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
న్యూఢిల్లీ: ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అధికార బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీల నేతలకు, బీజేపీయేతర సీఎంలకు మంగళవారం మమత లేఖ రాశారు. ఈ లేఖలో విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రత్యక్ష దాడులు చేస్తోందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లే మార్గం గురించి చర్చించడానికి కలిసొచ్చేవారంతా సమావేశమవ్వాలని మమత పిలుపునిచ్చారు. బీజేపీ అణచివేత పాలనపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. Koo App Our Hon’ble Chairperson Mamata Banerjee writes to all Opposition leaders & CMs, expressing her concern over BJP India’s direct attacks on Democracy. BJP has repeatedly attacked the federal structure of our country and now, it’s time to unitedly fight this oppressive regime. View attached media content - All India Trinamool Congress (@AITCOfficial) 29 Mar 2022 దేశంలో ఎక్కడైనా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలు చర్యలకు దిగుతాయి అంటూ మమత విమర్శలు గుప్పించారు. ఈ దేశ సమాఖ్య నిర్మాణంపై దాడి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఈ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయాలనే అధికార బీజేపీ దురుద్దేశాన్ని మనమందరం ప్రతిఘటించాలని మమత లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ సమావేశానికి ఎవరెవరు వెళ్తారనే దానిపై మాత్రం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చదవండి: (రాహుల్ గాంధీ తెలుగు ట్వీట్.. కల్వకుంట్ల కవిత కౌంటర్) -
కిషన్రెడ్డిపై మంత్రి నిరంజన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను అవమానించిన వారు ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు కోల్పోయారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం లేదు. పండిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిది. కేంద్రం లేకి మాటలు మాట్లాడుతోంది. రా రైస్, బాయిల్డ్ రైస్ అని కన్ఫ్యూజ్ చేయడం తప్ప కేంద్రం ఏం చేస్తుంది. మేము వడ్లు ఇస్తం.. ఏం చేసుకుంటారనేది కేంద్రం ఇష్టం. తెలంగాణ రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు..?. ఆయనకు రైతుల కష్టాలు పట్టవా. మేము ఇన్నిసార్లు పీయూష్ గోయల్ను కలిస్తే ఒక్కసారి అయినా కిషన్రెడ్డి వచ్చాడా..?. కేంద్రం మార్గాలు వెతకాలి. కాలానుగుణంగా మార్పులు రావాలి. ఇథనాల్ ప్రొడక్షన్ 2025 నాటికి 20 శాతం పెంచుతామన్నారు. ఇప్పటి వరకూ 5శాతం దాటలేదు. గోదాములు ఖాళీ లేవంటున్న కేంద్రం... ఎందుకు ఖాళీ చేయడం లేదు. ప్రజలకు బియ్యాన్ని పంచరెందుకు?. కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు లేవు. 28, 29న సార్వత్రిక సమ్మె చేస్తాం. ఉగాది తర్వాత ఉదృతమైన ఉద్యమం చేస్తాం. ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అయింది. ఇది దక్షిణ భారతదేశం మొత్తం పాకడం ఖాయం. తెలంగాణ రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని' మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. చదవండి: (ఆర్ఆర్ఆర్ తొలి గెజిట్కు గ్రీన్సిగ్నల్.. 113 గ్రామాలు.. 1904 హెక్టార్లు) -
రాష్ట్రాలు, యూటీలను అప్రమత్తం చేసిన కేంద్రం
-
ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి కేంద్రం గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2022లో జరగనున్న ఎన్నికలకు ముందు ఈసీ సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే.. ఓటర్ ఐడీతో ఆధార్ను అనుసంధానం చేయడంతోపాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా నాలుగు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ►పాన్-ఆధార్ లింక్ చేసినట్లే, ఓటర్ ఐడి లేదా ఎలక్టోరల్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ను అనుమతిస్తారు. అయితే, ఇది స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. ►వచ్చే ఏడాది జనవరి 1 నుంచి, 18 సంవత్సరాలు నిండిన వయోజనులు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మాత్రమే చేయడానికి అవకాశం ఉండేది. చదవండి: (కర్ణాటక సర్కారుకు సొంతపార్టీ ఎమ్మెల్యే షాక్.. అసెంబ్లీలోనే ఫైర్) ►ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు ఓటర్లుగా భర్త పనిచేసే ప్రాంతంలో జీవిత భాగస్వాములు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఇకమీదట మహిళా ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా భార్య పనిచేసే ప్రాంతంలో సర్వీసు ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు కల్పించారు. ►ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను కూడా ఎన్నికల కమిషన్కి ఇచ్చింది. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ఇదివరకు కొన్ని అభ్యంతరాలు ఉండేవి. వీటన్నిటిని ఆమోదిస్తూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక ఎన్నికల సంస్కరణల బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. చదవండి: (కాంగ్రెస్ పార్టీలో చేరనున్న భారత మాజీ క్రికెటర్?) -
‘370’ రద్దు తర్వాత స్వస్థలాలకు 1,678 మంది కశ్మీరీలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాత సుమారు 1,678 మంది కశ్మీరీలు తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారని కేంద్రం తెలిపింది. వీరందరికీ ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ–2015 కింద ఉద్యోగాలను కల్పించినట్లు మంగళవారం పార్లమెంట్లో వెల్లడించింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 150 మంది దరఖాస్తుదారుల భూములను తిరిగి వారికే అప్పగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వలసవెళ్లిన హిందువులకు చెందిన భూములపై తిరిగి వారికే అధికారం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. చదవండి: (చంపేస్తామని బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్) -
నవంబర్ 26లోపు దిగిరావాలి.. లేకుంటే...
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నవంబర్ 26లోగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే ఢిల్లీ సరిహద్దులో నిరసనలు ఉధృతం చేస్తామని రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ హెచ్చరించారు. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు మొదలై దాదాపు ఏడాది కావొస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈ అల్టిమేటం జారీచేశారు. ‘కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 వరకు సమయం ఇస్తున్నాం. నవంబర్ 27 నుంచి రైతులు గ్రామాల నుంచి ట్రాక్టర్లలో ఢిల్లీ చుట్టుపక్కల జరుగుతున్న నిరసన ప్రదేశాల వద్దకు చేరుకుంటారు. భారీ సంఖ్యలో తరలివచ్చే రైతులతో నిరసన ప్రదర్శనలు మరింత ఉధృతం అవుతాయ’ని రాకేష్ టికాయిత్ పేర్కొన్నారు. (చదవండి: పెరుగుతున్న పెట్రోలు ధర.. నిండుతున్న కేంద్ర ఖజానా) రైతు సంఘాల నుంచి గత రెండు రోజుల్లో కేంద్రానికి జారీ అయిన రెండో హెచ్చరిక ఇది. ఢిల్లీ సరిహద్దుల నుంచి నిరసనకారులను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్గా మారుస్తామని ప్రభుత్వాన్ని ఆదివారం రాకేష్ టికాయిత్ హెచ్చరించారు. నిరసన స్థలంలో తమ గుడారాలను తొలగించడానికి ప్రత్నిస్తే.. పోలీసు స్టేషన్లు, కలెక్టరేట్ల వద్ద టెంట్లు వేస్తామన్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు చట్టాలు తమ ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని పేర్కొంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు.. తిక్రీ, సింగు, ఘాజీపూర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్ర సర్కారు మాత్రం ఈ చట్టాలు రైతులకు అనుకూలమని వాదిస్తోంది. కేంద్రం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా ఫలించలేదు. (చదవండి: ఎయిరిండియా జాతీయీకరణ ఒక భారీ కుట్ర!) -
డిఫెన్స్ అకాడెమీలోకి మహిళలు..
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షలకు మహిళలను అనుమతించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు మంగ ళవారం తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణను సజావుగా జరిపేందుకు అవసరమైన చర్యలను చేపడుతు న్నట్లు చెప్పింది. మూడు రకాల రక్షణ బలగాల్లో మహిళలను ప్రవేశపెట్టనున్న ట్లు పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రక్షణ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. పురుష అభ్యర్థులకు ఉన్నట్లే మహిళా అభ్యర్థులకు కూడా ఎత్తు, బరువు వంటి భౌతిక పరామితులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. ప్రస్తుతం ఆ పరామితులను నిర్ణయిస్తున్నట్లు తెలిపింది. ఎన్డీఏ ప్రవేశ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది. -
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్న్యూస్..!
న్యూ ఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. ఎలాంటి రుసుం లేకుండా వాహన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని కేంద్రం నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుం నుంచి కూడా మినహాయింపును ఇచ్చింది. భారత్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు అదనపు ప్రోత్సహకంగా సెంట్రల్ మోటార్ వాహనాల నియమాలు-1989 సవరించాలని కేంద్రం గతంలోనే ప్రతిపాదించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని వేగవంతంగా చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను అందిస్తున్నాయి. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా...!
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి కేంద్రం తీపికబురును అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 28 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. డీఎ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొ బొనాంజాను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన హెచ్ఆర్ఏ రేట్లను 2021 ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసించే ప్రాంతాల ప్రకారం హెచ్ఆర్ఏ పెంపు ఉండనుంది. హెచ్ఆర్ఏ పెంపులో భాగంగా మూడు రకాల కేటగిరీ ప్రాంతాలను కేంద్రం ప్రకటించింది. ‘ఎక్స్’ కేటగిరీ నగరాల్లో నివసించేవారికి, పెంపు 27 శాతం ఉంటుంది. ‘వై’, ‘జెడ్’ నగరాల్లో నివాసితులకు వరుసగా 18 శాతం, 9 శాతం హెచ్ఆర్ఏ పెంపును నిర్ణయించింది. డీఏ 50 శాతం దాటినప్పుడు, హెచ్ఆర్ఏ రేట్లు వరుసగా 30%, 20% , 10% కు సవరించబడతాయి. X, Y, Z నగరాల వర్గాలు X కేటగిరి నగరాలు 50 లక్షలకు పైగా జనాభా ఉన్నవి. Y కేటగిరి నగరాలు 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నవి Z కేటగిరి ఐదు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్నవి అంతకుముందు X, Y, Z నగరాల్లో వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతం హెచ్ఆర్ఏ ఉండేది. -
కాలం చెల్లితే.. 'తుక్కే'
సాక్షి, అమరావతి: కాలుష్యాన్ని నివారించి అనుకూలమైన పర్యావరణాన్ని నెలకొల్పే చర్యల్లో భాగంగా 15 సంవత్సరాలకు పైగా వినియోగించిన రవాణా (ట్రాన్స్పోర్ట్) వాహనాలను ఫిట్నెస్ ఆధారంగా తుక్కు చేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 20 ఏళ్లు పైబడి వినియోగించిన రవాణేతర (నాన్–ట్రాన్స్పోర్ట్) పాత వాహనాల ఫిట్నెస్ ఆధారంగా తుక్కు చేయించేలా వాటి యజమానులను ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం తొలి దశలో పాత వాహనాల ‘వలంటీరీ స్క్రాపింగ్’ (స్వచ్ఛందంగా తుక్కు చేసే) విధానాన్ని ప్రకటించింది. పాత వాహనాలను తుక్కు చేసి.. వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి వాహన పన్నుల్లో రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇందుకోసం రవాణా, రవాణేతర రంగాల వాహనాలకు వేర్వేరుగా రాయితీలను ప్రకటించింది. ఇందుకోసం రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ ఫెసిలిటీలను (తుక్కు చేసే సదుపాయ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఫెసిలిటీలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తాయా అనే అంశంతో పాటు పాత వాహనాలను తుక్కు చేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే రాయితీలపై కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు శుక్రవారం రాష్ట్రాల్లోని రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. స్క్రాపింగ్ ఫెసిలిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని రాయితీపై కేటాయించే అంశంపైనా కేంద్రం చర్చించింది. పాత వాహనాలను తుక్కు చేయాలంటే ఆ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే సంబంధిత వాహనాల పన్ను బకాయిలు గానీ, గ్రీన్ ట్యక్స్గానీ, చలానా బకాయిలు గానీ ఉండకూడదు. పాత వాహనాలను తుక్కు చేసేందుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు వీలుగా ఆ బకాయిలను ఏడాది పాటు రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. రాయితీల ప్రతిపాదన ఇలా.. ► పాత వాహనాన్ని తుక్కు చేసినందుకు దాని విలువలో 5 శాతం నగదును వాహనదారుడికి చెల్లించాలని కేంద్రం సూచించింది. ► వాటి స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ఆ వాహనాల ధరలో 5 శాతం రాయితీ ఇచ్చేలా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్తో సంప్రదింపులు జరుపుతోంది. ► రాష్ట్రంలో మొత్తం 1,41,50,277 వాహనాలుండగా.. 15 ఏళ్ల వినియోగం దాటిన వాహనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి 27,47,943 ఉంటాయని రాష్ట్ర రవాణా శాఖ లెక్క తేల్చింది. ► పాత వాహనాలను తుక్కు చేసిన సర్టిఫికెట్ చూపి కొత్తగా కొనుగోలు చేసే రవాణేతర (నాన్–ట్రాన్స్పోర్టు) వాహనాలకు 15 ఏళ్ల పన్నుపై 25 శాతం, రవాణా (ట్రాన్స్పోర్టు) వాహనాలకైతే 8 ఏళ్ల పన్నులో 15 శాతం రాయితీ ఇవ్వాలని సూచించింది. -
ప్రొఫెషనల్ కోర్సులు మరింత చేరువ
సాక్షి, అమరావతి: ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలోనూ వినూత్న విధానాలకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. దేశంలో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో (జీఈఆర్)ను పెంచేందుకు వీలుగా జాతీయ నూతన విద్యావిధానం–2020లో అనేక అంశాలను చేర్చింది. ఈ లక్ష్యాలు నెరవేరేందుకు వీలుగా ఆయా విద్యా విభాగాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులలో చేరికలు పెరిగేందుకు ఆన్లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెరి్నంగ్ (ఓడీఎల్) విధానాలను మరింత విస్తృతం చేస్తోంది. ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో నాన్ ప్రొఫెషనల్ కోర్సులే ఎక్కువగా అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులనూ క్రమేణా విద్యార్థులకు చేరువ చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త విధివిధానాలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 యూజీసీ రెగ్యులేషన్ల ప్రకారం ఆన్లైన్, ఓడీఎల్ నాన్ ప్రొఫెషనల్ కోర్సులను పలు విద్యాసంస్థలు అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు ఏఐసీటీఈ నిర్ణయంతో ప్రొఫెషనల్ కోర్సులనూ ఆయా విద్యాసంస్థలు విద్యార్థులకు అందించనున్నాయి. రెగ్యులర్ కోర్సులతో సమానంగా.. ఈ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో సమానమైన ప్రాధాన్యతతో విద్యార్థులకు అందనున్నాయి. ఏఐసీటీఈ చట్టం–1987 ప్రకారం డిప్లొమో, పీజీ డిప్లొమో సర్టిఫికెట్, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో, పోస్టు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ డిగ్రీలను ఆన్లైన్, ఓడీఎల్ ద్వారా అమలుచేస్తారు. విద్యా సంవత్సరంగా జనవరి/ఫిబ్రవరి లేదా జులై/ఆగస్టుల మధ్య 12 నెలల కాలవ్యవధిలో ఇవి అమలవుతాయి. ఈ కోర్సులను నాణ్యతా ప్రమాణాలతో విద్యార్థులకు అందించేలా ప్రతి సంస్థ ‘సెంటర్ ఫర్ క్వాలిటీ అస్యూరెన్సు (సీఐక్యుఏ) ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి. ఆన్లైన్, డిస్టెన్స్ విధానంలో ఈ కోర్సులు అమలుచేస్తున్నా విద్యార్థులు టీచర్ల మధ్య ముఖాముఖి అభ్యసనం ఉండేలా కొంతకాలం సంప్రదాయ అభ్యసన విధానాన్నీ అమలుచేయాల్సి ఉంటుంది. ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలోని కోర్సులకు కూడా రెగ్యులర్ కోర్సులతో సమానంగా క్రెడిట్ సిస్టమ్ అమలవుతుంది. విద్యార్థి ఆయా కోర్సులను యూనిట్ల వారీగా విద్యార్థి అభ్యసించిన గంటలు, అసెస్మెంటులో తేలిన ప్రమాణాలను అనుసరించి ఈ క్రెడిట్లు ఇస్తారు. డ్యూయెల్ విధానంలో అమలుకు అవకాశం ►విద్యాసంస్థలు డ్యూయెల్ (ద్వంద్వ) విధానంలో అంటే సంప్రదాయ కోర్సులను అమలుచేస్తూనే ఆన్లైన్, ఆన్లైన్ డిస్టెన్స్ కోర్సులను అమలుచేయడానికి అవకాశం కల్పించనున్నారు. ►రెగ్యులర్ కోర్సులతో సమానంగా వీటిని గుర్తిస్తున్నందున ఆ కోర్సుల్లోని లెరి్నంగ్ మెటీరియల్ మాదిరిగానే ‘ఈ లెరి్నంగ్ మెటీరియల్’ను డిజిటల్ ఫార్మాట్లో విద్యార్థులకు అందిస్తారు. ►విద్యార్థులు తమంతట తాము అభ్యసించడం, పరిజ్ఞానాన్ని స్వయంగా పెంచుకోవడం, ఎప్పటికప్పుడు స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ ఎవాల్యుయేషన్) ద్వారా స్వయం మార్గదర్శకత్వం వంటివి పెంపొందించుకోగలుగుతారు. ►రెగ్యులర్ కోర్సులకు మాదిరిగానే ఈ పరీక్షలను కూడా నిరీ్ణత కేంద్రాల్లో ఆన్లైన్లో నిర్వహించాల్సి ఉంటుంది. ►పెన్, పేపర్ లేదా కంప్యూటరాధారిత, లేదా పూర్తిస్థాయి ఆన్లైన్ విధానంలో విద్యార్థులను నిపుణులైన వారితో పరీక్షింపజేయాలి. కోర్సులు అందించే సంస్థల అర్హతలు.. ♦యూజీసీ గుర్తింపు, స్వయంప్రతిపత్తి ఉన్న ఉన్నత విద్యాసంస్థలు, డీమ్డ్ వర్సిటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులు అందించేందుకు అర్హమైనవి. ♦ఈ ఆన్లైన్ కోర్సులు అమలుచేసే సంస్థలకు నాక్ 4 పాయింట్ల స్కేలులో 3.26 పాయింట్లు, లేదా ఎన్బీఏ స్కోరు 1000 స్కేల్లో 700 వచ్చి ఉండడం తదితర నిబంధనలను ఏఐసీటీఈ అమలుచేస్తుంది. ♦నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్కులో ఆ సంస్థలు టాప్ 100లో ఉండాలి. ♦ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలను కలిగి ఉండాలి. ♦ఆయా సంస్థల్లోని ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సులను కూడా ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అందించవచ్చు. ♦ఈ కోర్సులను అమలుచేసేటప్పుడు విద్యార్థులకు సహకారం కోసం నిపుణులైన బోధకులతో ‘లెరి్నంగ్ సపోర్టు సెంటర్ల’ను ఏర్పాటుచేయాలి. ♦ఆన్లైన్ విధానంలో ఏఐసీటీఈ నిషేధించిన ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అమలుకు వీల్లేదు. వీటితో పాటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్, అప్లయిడ్ ఆర్ట్స్, క్రాఫ్టŠస్, డిజైన్ వంటి కోర్సులను ఆన్లైన్, ఓడీఎల్ విధానంలో అమలుచేయరాదు. ♦విద్యార్థులను రెగ్యులర్ కోర్సులకు నిర్దేశించిన పరిమితికి మూడు రెట్లు అదనంగా చేర్చుకోవడానికి అవకాశమిస్తారు. ♦నిబంధనలు ఉల్లంఘించే సంస్థల అనుమతుల రద్దుకు ఏఐసీటీఈ యూజీసీకి సిఫార్సు చేస్తుంది. అవసరమైన చట్టపరమైన చర్యలనూ చేపడుతుంది. చదవండి: అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి టీడీపీ అడ్డదారులు: పైకి కత్తులు.. లోన పొత్తులు -
డిస్కంలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు లేట్ పేమెంట్ సర్చార్జీల నుంచి కొంత ఉపశమనం లభించింది. విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరిగితే జరిమానాగా చెల్లించాల్సిన లేట్ పేమెంట్ సర్చార్జీలు కొంతవరకు తగ్గిపోనున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం డిస్కంలు బకాయిపడ్డ బిల్లు మొత్తంపై.. 18 శాతం వడ్డీని లేట్ పేమెంట్ సర్చార్జీగా చెల్లిస్తూ వస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన ఎలక్ట్రిసిటీ (లేట్ పేమెంట్ సర్చార్జీ) రూల్స్-2021తో సర్చార్జీలు కొంతమేర తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వార్షిక రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేటుపై మరో 5 శాతాన్ని జత చేసి లేట్ పేమెంట్ సర్చార్జీలుగా చెల్లించాలని రూల్స్ పేర్కొంటున్నాయి. ఎస్బీఐ వార్షిక రుణాలపై ప్రస్తుతం 7.59 శాతం వడ్డీరేటు ఉండగా, మరో 5 శాతం జత చేసి 12.59 శాతం సర్చార్జీగా (జరిమానా) ఇకపై చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు 45 రోజుల్లోగా డిస్కంలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 45 రోజుల గడువు మించిన తర్వాత తొలి నెల జాప్యానికి 12.59 శాతాన్ని (వడ్డీ రేటు) సర్చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం... రెండో నెల నుంచి ప్రతి నెలా 0.5 శాతం చొప్పున ఈ సర్చార్జీ పెరుగుతుంది. ఈ పెంపుపై గరిష్ట పరిమితిని 3 శాతంగా నిర్ణయించారు. అంటే ఏడు నెలల జాప్యం జరిగితే సర్చార్జీలు 15.59 శాతానికి చేరి ఆగిపోనున్నాయి. ఆ తర్వాత జరిగే జాప్యానికి అదనంగా వడ్డీరేటు పెరగదు. భారీగా బకాయిలు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి (http://praapti.in) పోర్టల్ ప్రకారం విద్యుదుత్పత్తి కంపెనీలకు తెలంగాణ డిస్కంలు గత డిసెంబర్ నాటికి రూ.6,954 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రూ.2,500 కోట్లు, తెలంగాణ జెన్కోకు రూ.5 వేల కోట్లు సైతం డిస్కంలు చెల్లించాల్సి ఉంది. అన్ని కలిపి విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.15 వేల కోట్లకు పైనే ఉంటాయని ట్రాన్స్కో వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.15 వేల కోట్ల బకాయిలపై ప్రతి నెలా చెల్లించాల్సిన లేట్ పేమెంట్ సర్చార్జీలు (జరిమానా) తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్తో 18 శాతం నుంచి 12.59– 15.59 శాతానికి (వడ్డీరేటు) తగ్గనుండడంతో ప్రతి నెలా డిస్కంలకు రూ.కోట్లలో భారం తగ్గుతుందని ట్రాన్స్కో వర్గాలు తెలిపాయి. -
ఆ ఆలోచన సరికాదు: ఎంపీ ఎంవీవీ
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖ ప్రజల ఆకాంక్షలను ప్రధానికి రాసిన లేఖలో తెలిపారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామనే నమ్మకం కుదిరిందన్నారు. ఎంతో కాలం లాభాల్లో నడిచిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం దురదృష్టకరమని చెప్పారు. సమస్య ఉంటే పరిష్కరించాలి తప్ప విక్రయించే ఆలోచన సరికాదన్నారు.(చదవండి: డ్రామా : ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు) ‘‘విశాఖ ఉక్కుకు తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల ఫ్యాక్టరీల్లో విశాఖ ఉక్కు ఒకటి.కొన్నేళ్లు నష్టాలు వచ్చినా మళ్లీ కోలుకునే సామర్థ్యం ఉంది. స్వంత గనులు లేకనే విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయి. విస్తరణకు రుణాలు తీసుకున్నందున వడ్డీభారం కూడా అధికంగా ఉంది. రూ.22 వేలకోట్ల రుణభారాన్ని ఈక్విటీగా మార్చి సొంత గనులు ఇస్తే విశాఖ ఉక్కు లాభాలు సాధిస్తుందని’’ ఆయన సూచించారు.(చదవండి: రాష్ట్రపతి పర్యటన: మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి) కేంద్రం దిగిరాకపోతే రాజీనామాలకు కూడా వెనుకాడమని, విజయసాయిరెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానిని కలుస్తామని ఆయన తెలిపారు.ప్రధాని మోదీకి ఆంధ్రుల సెంటిమెంట్ను వివరిస్తామని పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ భూములు ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు మించి విలువ చేస్తాయని, వాటిని బుక్ వాల్యూకు అమ్ముతామంటే ఒప్పుకోమన్నారు. నీతి ఆయోగ్ చెప్పినంత మాత్రాన అమ్మాలని లేదని.. విశాఖ ఉక్కు అమ్మకం ఆపి, ఆదుకోవాలని ప్రధానిని కోరుతున్నామని ఎంపీ ఎంవీవీ అన్నారు. -
కరోనా వ్యాక్సిన్: కేంద్రం మార్గదర్శకాలు..
సాక్షి, ఢిల్లీ: కరోనా వ్యాక్సిన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్లో గర్భవతి, బాలింతలను భాగం చేయలేదని.. లబ్ధిదారులు రెండు రకాల టీకాలు వేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఉపయోగం గురించి లేఖలో కేంద్రం వివరించింది. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అని కేంద్రం తెలిపింది. ఏ టీకా అయితే మొదటి డోసు తీసుకుంటారో అదే టీకా రెండో డోసులో తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చదవండి: ‘కోవిడ్ టీకాతో నపుంసకులవుతారు’ కాగా, దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రేపు (శనివారం) ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇవ్వనున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. చదవండి: కరోనా కట్టడి: భారత్పై ఐఎంఎఫ్ ప్రశంసలు -
మీడియాకు భారీగా ప్రభుత్వ బకాయిలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రకటనల విభాగం, పలు రాష్ట్రాల ప్రకటనల విభాగాలు మీడియా సంస్థలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉన్నాయని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ బకాయిలు వారు ఇప్పట్లో చెల్లించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఒక అఫిడవిట్లో ఐఎన్ఎస్ సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ‘మీడియా ఇండస్ట్రీ అంచనాల ప్రకారం..వివిధ మీడియా సంస్థలకు డీఏవీపీ(డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ విజువల్ పబ్లిసిటీ) సుమారు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో రూ. 800 కోట్ల నుంచి రూ. 900 కోట్ల వరకు ప్రింట్ మీడియా వాటా’ అని వివరించింది. -
కేరళ సర్కారుకు తలంటిన కేంద్రం
-
లాక్డౌన్పై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనుసరిస్తోన్న లాక్డౌన్ను కొన సాగించాలా? ఎత్తివేయాలా? మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రధాని కార్యాలయ వర్గాల ఆదేశాలతో రాష్ట్రంలోని పలువురు సీనియర్ ఐఏఎస్లకు, కలెక్టర్లకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయి. దాదాపు అందరూ లాక్డౌన్ను ఇంకొన్నాళ్లు కొనసాగించాలని చెప్పినట్లు తెలిసింది. అలాగైతేనే కరోనా వైరస్ను పూర్తిగా నిరోధించగలమని రాష్ట్రానికి చెందిన అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. ‘కరోనా కేసుల సంఖ్య ఇంకా ఆగలేదు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడంలేదు. కేసుల సంఖ్య తగ్గకుండా, లాక్డౌన్ను ఎత్తివేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది’అని ఢిల్లీ వర్గాలకు చెప్పినట్లు ఒక అధికారి వ్యాఖ్యానించారు. ‘మర్కజ్’తో పెరిగిన కేసులు కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు మున్ముందు ఎలాంటి వైఖరి అనుసరించాలన్న దానిపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 14తో లాక్డౌన్ దేశవ్యాప్తంగా పూర్తికానుంది. కానీ ఇప్పటికీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరణాలూ ఆగడంలేదు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేయాలా?, లేకుంటే కేసులు ఎక్కువగా నమోదైన చోట్ల హాట్స్పాట్లను ఏర్పాటుచేసి, అక్కడ లాక్డౌన్ను కొనసాగించి, మిగిలిన ప్రాంతాల్లో దశలవారీగా ఎత్తివేస్తే ఎలా ఉంటుంది? అనే దానిపై ఢిల్లీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన అధికారులు తెలంగాణలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి విన్నవించారు. ‘మర్కజ్ ఘటన అనంతరం రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అదే లేకుంటే ఇప్పుడు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులే ఉండేవి. కానీ మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి కుటుంబీకుల ద్వారా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో ఐదారు జిల్లాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు 25 జిల్లాలకు వ్యాపించింది. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న సమయంలో లాక్డౌన్ ఎత్తివేస్తే వైరస్ను కట్టడి చేయలేం’అని చెప్పినట్టు మరో అధికారి వెల్లడించారు. ‘లాక్డౌన్ ఎత్తివేయకపోతే వ్యాపారాలు, సాధారణ ప్రజలకు ఉపాధి, రోగులు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి ఉండదు కదా? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాల’ని ఢిల్లీ వర్గాలు ప్రశ్నించాయని సమాచారం.‘ఇప్పటివరకు ఎలాగో ప్రజల సాయంతో లాక్డౌన్ విజయవంతం చేశాం. మరికొన్నాళ్లు ఓపికపడితే గండం నుంచి బయటపడతామ’ని బదులిచ్చినట్టు ఓ అధికారి తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. మర్కజ్ ద్వారా జిల్లాల్లో రోజురోజుకూ కేసులు బయటపడుతున్నాయి. గద్వాల, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇది మున్ముందు ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్రస్తుతం మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి కుటుంబీకులకే వైరస్ పరిమితమైంది. మున్ముందు ఇది మూడో కాంటాక్ట్కు ఏమైనా చేరిందా అనేది తెలుస్తుంది. లాక్డౌన్ను మరికొన్నాళ్లు కొనసాగించాక కేసులేమైనా ఉంటే బయటపడతాయి. అప్పటివరకు ఉత్కంఠ తప్పద’ని అధికారులు అంటున్నారు. ‘నేరుగా మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి బంధువులు, స్నేహితులు.. ఇలా అన్ని కాంటాక్ట్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాక, తదుపరి కేసుల సంఖ్య తగ్గొచ్చు. ఇంటింటి సర్వే ద్వారా ఇది తెలుస్తుంది. దాన్నిబట్టి నిర్ణయాలు ఉంటాయి’అని ఒక అధికారి చెప్పారు. -
కరోనా: ఆ జిల్లాలు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విరుచుకుపడుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ జిల్లాల్లో మరిన్ని కేసులు నమోదు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఢిల్లీ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన తర్వాతే పాజిటివ్ కేసుల సంఖ్య అమాం తం పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబ సభ్యులను, కలసిన వారందరినీ క్వారంటైన్ చేయాలని ఆదేశించింది. కేసుల సంఖ్యకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని అంచనా వేసిన కేంద్రం.. దేశవ్యాప్తంగా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 96 జిల్లాలను రెడ్ జిల్లాలుగా ప్రకటించింది. ఈ జిల్లాల పరిధిలోని హాట్స్పాట్లను గుర్తించి.. అక్కడ కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ రెడ్ జిల్లాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 10 జిల్లాలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు, ఏపీలో విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూ రు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలున్నాయి. వీటి పరిధిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఆది వారం వీడియో కాన్ఫరెన్స్లో సైతం కేబినెట్ సెక్రటరీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కరోనా తీవ్రరూపం దాల్చితే కట్టడి చేయడం కష్టమని, లాక్డౌన్ కఠినంగా అమలు జరిగేలా చూడాలని, అవసరమైతే ఆంక్షలను మరికొన్ని గంటలు పొడిగించాలని సూచించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు ఇవే.. ఉత్తర, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ (అండమాన్ , నికోబార్ దీవులు), విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు (ఆంధ్రప్రదేశ్), పట్నా, ముంగేర్, బేగుసరాయ్, లక్కిసరాయ్, నలందా(బిహార్), చండీగఢ్, రాయ్పూర్, బిలాస్పూర్, దుర్గ్ (ఛత్తీస్గఢ్), సౌత్, సౌత్వెస్ట్, ఈస్ట్, వెస్ట్, నార్త్వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్, నార్త్ ఢిల్లీ, సెంట్రల్, సహదరా, సౌత్ ఈస్ట్ (ఢిల్లీ), దక్షిణ గోవా, ఉత్తర గోవా(గోవా), అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోద, రాజ్కోట్, భావ్నగర్, బోతాడ్, గిర్ సోమ్నాథ్, కఛ్, మహేసన, పోర్బందర్ (గుజరాత్), గుర్గావ్, ఫరీదాబాద్, అంబాలా (హరియాణా), శ్రీనగర్, బాందిపొర (జమ్ము, కశ్మీర్), బెంగళూరు అర్బన్, చిక్బళ్లాపూర్, ఉత్తర కన్నడ, మైసూరు(కర్ణాటక), కసర్గఢ్, ఎర్నాకులం, కన్నూర్, పాత్తనమిట్ట, కోజికోడ్, మల్లాప్పురం, తిరువనంతపురం (కేరళ), లేహ్ లఢక్ (లఢక్), ఇండోర్, జబల్పూర్, ఉజ్జయిని, భోపాల్ (మధ్యప్రదేశ్, ముంబై, పుణే, నాగ్పూర్, సాంగ్లీ, థానే, అహ్మద్నగర్, పాలఘర్ (మహారాష్ట్ర), షాహిది భగత్సింగ్ నగర్, ఎస్ఏఎస్ నగర్, బిల్వారా (పంజాబ్), జైపూర్, జోధ్పూర్, ఝంఝూ (రాజస్తాన్), చెన్నై, తిరునల్వేలి, ఈరోడ్, నమక్కల్, కోయంబత్తూర్, కన్యాకుమారి (తమిళనాడు), హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి (తెలంగాణ), మీరట్, ఆగ్రా, గౌతం బుద్ధనగర్, లక్నో, గజియాబాద్ (ఉత్తర్ప్రదేశ్), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), కోల్కతా, 24 పరగణాల ఉత్తర, హూగ్లీ, మిడ్నాపూర్ ఈస్ట్, నడియా(పశ్చిమబెంగాల్) -
నెగెటివ్ వచ్చినా.. 14 రోజులు ఇంట్లో ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా క్వారంటైన్లో ఉండి, నెగెటివ్గా తేలినవారు మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో లాక్డౌన్ విధించిన దరిమిలా.. ప్రభు త్వం క్వారంటైన్లో ఉన్నవారిలో నెగెటివ్గా తేలినవారు పాటించాల్సిన నియమ నిబంధనలను కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసింది. శరీరంలో వైరస్ లేదని నిర్ధారణ అయినా కూడా బాధితులు మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వీటిని పాటించాలని పేర్కొంది. నిబంధనలు ఇవే.. ►క్వారంటైన్లో ఉన్న వ్యక్తికి కరోనా నెగెటివ్గా తేలితే.. హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం.. వారిని విడుదల చేస్తారు. కానీ బృందాలుగా క్వారంటైన్ సెంటర్కు అనుమానితులుగా వచ్చిన వారిలో ఒక్కరికి పాజిటివ్ వచ్చినా.. ఎవరినీ బయటికి అనుమతించరు. ►ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొందరు పౌరులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరంతా వారి సొంత రవాణా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ►క్వారంటైన్ అయిన ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే వీరికి ప్రత్యేక పాసులు జారీ చేస్తుంది. ► వీరికి ఒకే రూటులో నిర్ణీత కాల పరిమితితో పాసులు జారీ అవుతాయి. ►ఈ పాసులు జారీ అయిన మార్గంలో వీరి ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ►వీరు సొంతూళ్లకు వెళ్లాక తప్పకుండా 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందే. పైగా ఎక్కడ ఉంటున్నామన్న వివరాలు సదరు వ్యక్తి ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది. -
త్వరలోనే రాష్ట్రాలకు రూ.35వేల కోట్లు..
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు త్వరలోనే రూ.35వేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయనుంది. రాష్ట్రాల పన్ను ఆదాయం 14శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రం చెల్లిస్తుందన్న విషయం తెలిసిందే. జీఎస్టీ నష్టాల చెల్లింపులకు 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని కేంద్రం ఆధారం చేసుకోనుంది. ఇప్పటి వరకు కేంద్రం జీఎస్టీ నష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు రూ.2.11లక్షల కోట్లను చెల్లించాయి. జీఎస్టీ రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే స్పందస్తూ..జీఎస్టీ వసూళ్లను పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నెలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లను పెంచే విధంగా కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పాండే తెలిపారు. చదవండి: ఇలా చేస్తే రూ. 1 కోటి దాకా నజరానా -
నిర్వహణ నెత్తిమీదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలకు, వాటికయ్యే నిర్వహణ ఖర్చును భరించాలన్న వినతిపై కేంద్ర ప్రభుత్వం విముఖత చూప డం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. దీంతో ఈ ఏడాది వర్షాకాలం నుంచి అందుబాటులోకి రానున్న భారీ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ అవసరాలకయ్యే ఖర్చు భారమంతా రాష్ట్రమే భరించాల్సి రానుంది. దీని కోసం ఏటా గరిష్టంగా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి రావడం రాష్ట్రానికి కత్తిమీద సాములా మారనుంది. ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం... రాష్ట్రంలో ఇప్పటికే 14ఎత్తిపోతల పథకాల కింద నీటి పంపింగ్ జరుగుతుండగా వాటికి 1,500 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం ఉంటోం ది. వాటిపైనే ఏటా రూ.1,800 కోట్ల మేర విద్యుత్ బిల్లుల రూపేణా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ. 3,200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో గరిష్టంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాల పరిధిలోనే రూ. 1,600 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉండగా దేవాదులలో రూ. 800 కోట్లు, ఏఎంఆర్పీలో రూ. 650 కోట్ల మేర విద్యుత్ బిల్లుల బకాయిలున్నాయి. ఈ బిల్లుల చెల్లింపే కష్టసాధ్యమవుండగా ఈ ఏడాది ఖరీఫ్ నుంచి విద్యుత్ వినియోగం మొత్తంగా 4,500–5,000 మెగావాట్ల మేర పెరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది జూన్ నుంచే 2 టీఎంసీల నీటిని కనీసం 6 నెలలపాటు ఎత్తిపోసేలా పంపులను సిద్ధం చేస్తున్నా రు. ఈ నీటిని ఎత్తిపోసేందుకు గరిష్టంగా 2,800 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కగట్టారు. ఈ విద్యుత్ అవసరాలకు మిడ్మానేరు ఎగువ వరకే రూ. 2,500 కోట్ల మేర ఖర్చు కానుండగా మిడ్మానేరు దిగువన పంపింగ్కు మరో రూ. 1,500 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది జూన్ నుంచే సీతారామ ఎత్తిపోతలను పాక్షికంగా ప్రారంభించనున్నారు. వాటితోపాటే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును కలుపుకొని ఈ ఏడాది నుంచి రూ. 8 వేల కోట్ల మేర ఖర్చు జరిగే అవకాశం ఉంది. 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల కాలా నికి విద్యుత్ అవసరాలకు రూ. 37,796 కోట్లు అవసరం ఉంటుందని నీటిపారుదల శాఖ గతంలోనే తేల్చింది. వాటితోపాటే పంప్హౌస్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఐదేళ్ల కాలానికి రూ. 2,374 కోట్లు ఉంటుందని లెక్కగట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే భారీ ఎత్తిపోతల పథకాల విద్యుత్, ఓఅండ్ఎంకు సంబంధించి రూ. 40,170 కోట్లు అవసరం అవుతుందని, ఈ ఖర్చులో కొంతైనా భరించాలని కేంద్రానికి విన్నవించింది. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆర్థిక సాయం చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదు. నిర్వహణ భారం మోసే అంశంపై కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రాజెక్టులకుగానీ, నిర్వహణకుగానీ నిధులు కేటాయించలేదు. దీంతో ఈ నిర్వహణ భారాన్ని మొత్తంగా రాష్ట్రమే భరించాల్సి రానుంది. అసలే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇది రాష్ట్రానికి గుదిబండగా మారనుంది. -
స్కూళ్లకూ అక్రెడిటేషన్!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలోనే కాదు.. పాఠశాల విద్యలోనూ అక్రెడిటేషన్ విధానం రాబోతోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించే కాలేజీలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడి టేషన్ కౌన్సిల్ (న్యాక్) ఇచ్చే గుర్తింపు తరహాలోనే పాఠ శాలల్లో నాణ్యతా ప్రమాణాల పెంపునకు అక్రెడిటేషన్ విధా నం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలోనే స్వతంత్ర అక్రెడిటేషన్ సంస్థను ఏర్పాటు చేయా లని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తీసుకురాబోతున్న నూతన విద్యా విధానంలో ఈ అంశాన్ని పొందుపరిచింది. స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎస్ఎస్ఎస్ఏ) పేరుతో దీనిని ఏర్పాటు చేయాలని నూతన విద్యా విధానంపై ఏర్పాటైన కస్తూరి రంగన్ కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు.. కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నా ఎస్ఎస్ఎస్ఏ నుంచే లైసెన్స్ ఇచ్చే విధానం తేవాలని స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య కోసం..: ప్రస్తుతం పాఠశాలల నిర్వహణ, ప్రమాణాల పెంపు కార్యక్రమాలన్నీ పాఠశాల విద్యాశాఖ (జిల్లాల్లో డీఈవోలు) నేతృత్వంలోనే కొనసాగు తుండటంతో అధికారం కేంద్రీకృతమైంది. అయితే దాని వల్ల పాఠశాలల నిర్వహణ విధానం దెబ్బతింటోం దని, ఫలితంగా నాణ్యమైన విద్యను అందించడం సాధ్యం కావడం లేదని నూతన విద్యావిధానం (ఎన్ఈపీ) ఫైనల్ కాపీలో కస్తూరి రంగన్ కమిటీ పేర్కొంది. పైగా చాలా ప్రైవేటు యాజమాన్యాలు విద్యను ఆర్థిక వనరుగానే చూస్తూ వ్యాపారంగా మార్చేశాయని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో విద్యా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పారదర్శక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముందని తెలిపింది. అందుకే పాఠశాల విద్యా విధానంలో బాధ్య తను పెంపొందించే చర్యలు చేపట్టాలని సూచించింది. పాఠశాలవిద్యలో 4 కీలకం పాఠశాల విద్య పరిపాలన, నిర్వహ ణలో 4 అంశాలే కీలకమని నూతన విద్యా విధానంపై ఏర్పాటైన కస్తూరిరంగన్ కమిటీ పేర్కొంది. అందులో పాలసీ మేకింగ్, ప్రొవిజన్/ ఆపరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, వృత్తి నైపుణ్యాల పెంపుతో పాటు ప్రమాణాల పెంపు, స్వయం ప్రతిపత్తిగల సంస్థతో అకడమిక్ వ్యవహరాల నిర్వహణ చేప ట్టాలని, ఇందుకు అధికార వికేంద్రీకరణ చేపట్టాలని వెల్లడించింది. ►విద్యా ప్రమాణాల పెంపునకు పాలసీ రూప కల్పన వ్యవహారాలను అత్యున్నత విభాగంగా పాఠశాల విద్యాశాఖే పర్యవేక్షించాలి. ►పాఠశాలల్లో విధానాలు, పథకాల అమలును పాఠశాల విద్యా డైరెక్టరేట్ చూడాలి. ►పాఠశాలలు కనీస నాణ్యతా ప్రమాణాలు సాధించేందుకు రాష్ట్రాలు వృత్తిపరమైన నాణ్యతా ప్రమాణాల పెంపునకు ఎస్ఎస్ఎస్ఏ పేరిట స్వయం ప్రతిపత్తిగలసంస్థలు ఏర్పాటు చేయాలి. పాఠశాలలు, టీచర్లు, భాగస్వాములతో సంప్ర దించి వాటి విధివిధానాలను రాష్ట్రాల రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండళ్లు రూపొందిం చాలి. ఎస్ఎస్ఎస్ఏ పాఠశాలల సెల్ఫ్ ఆడిట్ను పరిశీలించి అక్రెడిటేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేయాలి. ►ఎస్ఎస్ఎస్ఏ అమలు చేసే విధివిధానాలు అన్నింటినీ పారదర్శకంగా రూపొందించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ►అన్ని స్థాయిల విద్యలో అక్రెడిటేషన్ ఉండాలి. దీనిని ప్రీస్కూల్, ప్రైవేటు, ప్రభుత్వ విద్య విభాగాలన్నిటిలో అమలు చేయాలి. తద్వారా కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు సాధించాలి. ►కొత్త ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుకు ఎస్ఎస్ఎస్ఏ నుంచి లైసెన్స్ టు స్టార్ట్ ఏ స్కూల్ (ఎల్ఎస్ఎస్) పొందాలి. ఎస్ఎస్ఎస్ఏ నిబంధనల మేరకు పారదర్శకతతో కూడిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ►అకడమిక్ వ్యవహారాలు, కరిక్యులమ్ సంబంధ అంశాలు అన్నింటినీ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల సహకారంతో రాష్ట్ర విద్యా పరిశో ధన, శిక్షణ మండళ్లు(ఎస్సీఈఆర్టీ) చూడాలి. టీచర్ శిక్షణ సంస్థలను బలోపేతం చేసి విధానాల రూపకల్పనలో వాటి సహకారం తీసుకోవాలి. ►స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రెడి టేషన్ ఫ్రేమ్ వర్క్ను (ఎస్క్యూఏఏఎఫ్) ఎస్సీఈ ఆర్టీలు రూపొందించాలి. దీని రూపకల్పనలో సంబంధిత వర్గాలను భాగస్వాములు చేయాలి. ►ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఒకే రకమైన అసెస్మెంట్, అక్రెడిటేషన్ విధానం అమలు చేయాలి. దానికి సంబంధించిన విధివిధానాలను ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో ఇవ్వాలి. ►నాణ్యతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొనే క్రమంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్), స్టేట్ అచీవ్మెంట్ సర్వే (సాస్) అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ►కేంద్ర విద్యా సంస్థల అక్రెడిటేషన్కు సీబీ ఎసీఈ, ఎన్సీఈఆర్టీలతో సంప్రదించి ఎంహెచ్ ఆర్డీ రెగ్యులేటరీ విధానాన్ని రూపొందించాలి. ►అక్రెడిటేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు విద్యాహక్కు చట్టం–2009ని సమీక్షించాలి. అయితే మూడేళ్ల వయసు నుంచి అందించే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకొని 12వ తరగతి వరకు విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం అందరికీ విద్యావకాశాలు దూరం కాకుండా చూడాలి. అనాథ బాలలు, విధి వంచితులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. గత దశాబ్ద కాలపు అనుభవాలను పరిగణనలోకి తీసుకొని అక్రెడిటేషన్ విధానం రూపొందించాలి. ►ఏటా విద్యా ప్రమాణాలు పరిశీలించే ఎన్ఏఎస్ నిర్వహణకు నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ను ఏర్పాటు చేయాలి.