viral fevers
-
అద్దె ఇల్లు.. ఆరుబయటనే శవం
ఇబ్రహీంపట్నం: మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజల మెదళ్లను శాసిస్తూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటూ ఉన్న ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రసాద్నగర్లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విషజ్వరంతో.. కూలి చేసుకునే పాలపర్తి రాజేష్, రూతు దంపతులకు ఇద్దరు కుమారులు. జెడ్పీ పాఠశాలలో పెద్ద కుమారుడు ఏడో తరగతి, చిన్న కుమారుడు జాన్ వెస్లీ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రసాద్నగర్ వరద ముంపునకు గురికావడంతో పారిశుద్ధ్యలేమి, కలుషిత తాగునీరు, అందుబాటులో లేని వైద్య సదుపాయం వల్ల కొద్ది రోజుల క్రితం బాలుడు జాన్వెస్లీ జ్వరం బారిన పడ్డాడు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో వైద్యం చేయించారు. మరలా కడుపులో నొప్పి రావడంతో రెండురోజుల క్రితం మరో ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. వారు మెడికల్ టెస్ట్లు రాయగా.. తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చేయించలేదు. దీంతో కడుపులో నొప్పి భరించలేక బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లిదంద్రులు చెబుతున్నారు. మంటగలసిన మానవత్వం.. వారు ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో ఆ యజమాని బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. దీంతో 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనే టెంట్వేసి బంధువుల కడసారి చూపుకోసం ఉంచారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ బాలుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
ముందు జాగ్రత్తే మందు!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అతిసార (డయేరియా) వ్యాధి కూడా ఎక్కువగానే ఉంది. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో గత రెండు, మూడు నెలల నుంచి వైరల్ జ్వరాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందీ వీటి బారినపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఇప్పుడు భారీ వర్షాలకు వరదలు కూడా తోడయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలను వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముంపు నేపథ్యంలో తాగునీరు కలుíÙతమై అతిసార (డయేరియా), కలరా, టైఫాయిడ్, చర్మ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. తాగే నీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకూ శుద్ధి చేసిన (ఆర్వో) నీటినే తాగాలని చెబుతున్నారు. లేకుంటే పంపు నీటిని కాచి చల్లార్చి తాగాలని పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఇంట్లో, ఆరు బయట పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.వైద్య నిపుణుల జాగ్రత్తలు ఇవే.. » నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి. »తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. »నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకూడదు. » తినడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. »రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు శుద్ధమైన నీటిని తాగాలి. »తడిచిన బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు. »శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడంతో పాటు మాస్క్ పెట్టుకోవాలి. »దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వినియోగించాలి. »గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. » నాలుగైదు రోజులపాటు జ్వరం ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. డెంగీ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు జ్వర లక్షణాలు ఉంటాయి. ప్లేట్లెట్స్ పడిపోవడం సంభవిస్తుంది.వైద్యులను సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వినియోగం వద్దు.. జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులు మొదలు కాగానే చాలామంది వైద్యులను సంప్రదించకుండా మందుల షాపుల్లో వాళ్లిచ్చే మందులు వాడుతుంటారు. ఇలా చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి సమస్యలకు ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి యాంటీబయోటిక్స్ను మందుల షాపుల వాళ్లు ఇచ్చేస్తున్నారు.జలుబు, ఫ్లూ వంటి వాటికి ఇవి పనిచేయవని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేకుండా ఈ మందులను వాడితే కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాధులతో పోరాడే మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉంటుంది. యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వాడకంతో మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడుతుంది. దీంతో పాటు జీర్ణకోశ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇన్ఫెక్షన్ సంభవిస్తే మందులు కూడా పనిచేయని పరిస్థితులు వస్తాయి. జ్వరం మొదలుకాగానే ఆందోళన వద్దువిష జ్వర బాధితులు యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం లేదు.. సాధారణ చికిత్సలతోనే నయమవుతుంది. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు లేనివారు మూడు రోజులు ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి పారాసెటమాల్ వేసుకోవాలి. ముక్కు, కళ్లు కారడం, జలుబు వంటివి ఉంటే సిట్రిజెన్ వేసుకుంటే సరిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినా జ్వరం, ఇతర సమస్యలు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, జ్వరాల వైద్య నిపుణులు, గుంటూరు అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడొద్దు చిన్న పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వస్తే కంగారు పడొద్దు. మందుల దుకాణాల్లో వాళ్లిచ్చిన యాంటీబయోటిక్స్ను అనవసరంగా వాడొద్దు. పారాసిటమాల్, దగ్గు సిరప్లను రెండు రోజులు వాడి చూడాలి. అయినప్పటికీ సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. నిల్వ ఉన్న నీటిలో పిల్లలు ఆడకుండా చూడాలి. కలుíÙత నీటిలో పిల్లలు సంచరిస్తే చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. విరేచనాలయ్యే పిల్లలకు మసాలా ఆహారం పెట్టొద్దు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విఠల్ రావు, పిల్లల వైద్య నిపుణుడు, విజయవాడ పరిశుభ్రత పాటించాలి వరదల నేపథ్యంలో ఇంట్లో, వాష్ రూముల్లో చేరిన బురదను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో జలుబు, దగ్గు, జ్వర బాధితులుంటే వారు ఒక గదికి పరిమితం కావడం ఉత్తమం. మాస్క్ ధరించాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగొద్దు. వీలైనంత వరకూ నీరు, తిండి విషయంలో పరిశుభ్రత పాటించాలి. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, గుంటూరు -
ఆస్పత్రుల్లో బారులు తీరుతున్న రోగులు
-
భాగ్యనగరవాసులకు అలర్ట్.. విషజ్వరాల కారణంగా రోగులతో దవాఖానాలు బిజీ (ఫొటోలు)
-
దడ పుట్టిస్తున్న ఇన్ఫ్లూయెంజా వైరస్.. వాళ్లకి రిస్క్ ఎక్కువ
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఇన్ఫ్లూయెంజా (శ్వాసకోశ సంబంధిత వ్యాధి) దడ పుట్టిస్తోంది. ఏ ఇంటికెళ్లినా ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్ మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. బాధితులు దాదాపు పది నుంచి పక్షం రోజుల వరకు జ్వరం బారిన పడతారు. జ్వరం తగ్గిన కూడా ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా సోకుతోంది. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్ర ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మందికి ఇన్ఫ్లూయెంజా లక్షణాలే కనిపిస్తున్నాయి. చిల్డ్రన్ వార్డులో ఎక్కువ మంది చిన్నారులు శ్వాస సంబంధిత ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. కొంత మంది మృత్యువాత పడిన ఘటనలు సైతం ఉన్నాయి. అతలాకుతలం.. ప్రస్తుతం జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో వీటి బారిన పడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 104 కేసులు నమోదయ్యాయని పేర్కొంటుండగా, అనధికారికంగా 200కు పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్తో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి, ఉట్నూర్, బోథ్ ఏరియా ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈనెలలోనే 32 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి లెక్క తేలడం లేదు. మరికొంత మంది బాధితులను హైదరాబాద్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్రలోని యవత్మాల్, నాగ్పూర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దోచుకుంటున్న ల్యాబ్లు.. సీజనల్ వ్యాధులను అదునుగా చేసుకొని కొంత మంది ల్యాబ్ల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు సంబంధిత ల్యాబ్లకు పంపి బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. నిర్వాహకులకు 40 శాతం అందజేసి 60 శాతం వైద్యులు తీసుకుంటుండడంతో వీరి బిజినెస్ జోరుగా సాగుతోంది. అర్హతలు లేకున్నప్పటికీ చాలా మంది ల్యాబ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు సమాచారం. ఇంకొంత మంది శిక్షణ పూర్తి కాకుండానే ప్రైవేట్ ల్యాబ్లలో పనిచేస్తూ సొంతంగా పరీక్షలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. ఈ తతంగమంతా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం ప్యాథలాజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజిస్ట్ కోర్సు పూర్తి చేసినవారు మాత్రమే ల్యాబ్ నిర్వహణ చేపట్టవచ్చు. అయితే దీనికి విరుద్ధంగా అనర్హులు ల్యాబ్లను ఏర్పాటు చేసి వైద్యులతో కలిసి అక్రమ దందా సాగిస్తున్నారు. కిక్కిరిసిన చిల్డ్రన్ వార్డు.. రిమ్స్ ఆస్పత్రి చిల్డ్రన్ వార్డు చిన్నారులతో కిక్కిరిసి కనిపిస్తోంది. నెలరోజులకు పైగా ఇదే పరిస్థితి. వార్డులో 70 బెడ్లు ఉంటే.. వందకు పైగా చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతుండడం గమనార్హం. వీరిలో ఎక్కువగా ఇన్ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పక్షం దాటిన జ్వరం వీడటం లేదు. అలాగే మహిళా వార్డు పరిస్థితి కూడా ఇ లాగే ఉంది. జ్వరాలకు సంబంధించి అన్ని వార్డులకు కలిపి దాదాపు 400 మంది వరకు చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా రిమ్స్లో ఓపీ 1600 వరకు నమోదవుతుంది. ఆయా పీహెచ్సీల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు ఓపీ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాధుల కట్టడికి చర్యలు.. జిల్లాలో వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నాం. వాతావరణ మా ర్పుల కారణంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఏడాది 104 డెంగీ కేసులు నమోదయ్యాయి. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలని అవగాహన కల్పిస్తున్నాం. – మెట్పెల్లివార్ శ్రీధర్,జిల్లా మలేరియా నివారణ అధికారి -
జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా కేసులు కూడా భారీగా వెలుగుచూస్తున్నాయి. గత నెల రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాతావరణం మారడం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగినట్లుగా వైద్య యంత్రాంగం అంచనా వేసింది. వానాకాలమంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని హెచ్చరిస్తోంది. ఆస్పత్రుల్లో రోగుల క్యూ సీజనల్ వ్యాధులతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్లోని ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ సహా జిల్లాల్లోని ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఓపీలో సగం మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారే. పీహెచ్సీల్లో కానరాని డాక్టర్లు కొన్ని చోట్ల వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగ నిర్లక్ష్యం బాధితులకు శాపంగా మారింది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వం వేసిన అంచనాలకు మించి జ్వరాలు, డెంగీ, మలేరియా కేసులున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పగటి పూట కుట్టే దోమతో డెంగీ.. డెంగీ కారక ఈడిస్ ఈజిప్ట్ దోమ అన్ని దోమల్లాంటిది కాదు. పగటిపూటే కుడుతుంది. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పెరుగుతుంది. ఒక వారం రోజులు కదపకుండా దోసెడు నీరున్నా చాలు. అందులో పునరుత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తుంది. ఎయిర్ కూలర్లలో, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన మంచినీటిలో, వాడకుండా పక్కన పడేసిన పాత టైర్లు, రేకు డబ్బాల్లో వాన నీరు కురిస్తే ఆ చిన్ననీటి గుంతల్లోనూ జీవనం కొనసాగిస్తుంది. అందుకే ఇంట్లో, కార్యాలయాల్లో ఎక్కడైనా కొద్దిపాటి నీటి నిల్వలున్నాయా అని పరిశీలించాలి. డెంగీ వస్తే ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు అయినట్లు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహంతో పాటు రక్తపోటు స్థాయిలు పడిపోతాయి. ఐజీఎం పరీక్షతోనే డెంగీ నిర్ధారణ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తుంది. ఇక వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకుంటే ప్లేట్లెట్లు పడిపోకుండా కాపాడుతాయి. ఇది కూడా చదవండి: నిరుత్సాహపర్చిన బీసీలకు ‘లక్ష’ సాయం! -
కోవిడ్ మళ్లీ కోరలు చాస్తోంది! రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల వైరల్ ఫీవర్లు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో కోవిడ్–19 పరీక్షల్లో పాజిటివిటీ రేటు సైతం వేగంగా పెరుగుతున్నట్లు గుర్తించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలకు జాగ్రత్త చర్యలను సూచిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ) సమస్యలపై ఇదివరకే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేయగా.. ప్రస్తుతం కోవిడ్–19 కేసుల దృష్ట్యా జాగ్రత్త చర్యలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం వద్దు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్–19 కేసుల నమోదు వేగంగా పెరుగుతోంది. కేరళలో 26.4 శాతం, మహారాష్ట్రలో 21.7 శాతం, గుజరాత్లో 13.9 శాతం, కర్ణాటకలో 8.6 శాతం, తమిళనాడులో 6.3 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం అలస్వతంగా ఉండవద్దని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ దిశగా టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్లను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. పరీక్షలను పెద్ద ఎత్తున పెంచుతూ కోవిడ్–19 జాగ్రత్తలను పాటించేలా చేయాలని, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేసుల సంఖ్య పెరిగి ప్రమాదానికి దారితీయకుండా ముందస్తు జాగ్రత్తలు అవసరమని కేంద్రం వివరించింది. ఇదే సమయంలో అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్, ఇన్ఫ్లుయాంజా కేసులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దేశంలో ఈ తరహా కేసులు జనవరి నుంచి మార్చి చివరి వరకు, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కనిపిస్తాయని, ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. కోవిడ్–19ను అరికట్టేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్త చర్యలు పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. ► వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపర్చుకోవాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించింది. ► దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వీలైనంత తక్కువగా బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది. ► వైద్యులు, పారామెడిక్స్, ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మాస్క్లు ధరించాలని స్పష్టం చేసింది. ► రద్దీగా ఉండే ప్రాంతాల్లో, క్లోజ్డ్ సెట్టింగులున్న చోటఉండాల్సిన వారు తప్పకుండా మాస్క్లు ధరించాలి ► తుమ్మేటప్పుడు, దగ్గుతున్నప్పుడు ముక్కు, నోరు కప్పుకోవడానికి రుమాలు అందుబాటులో ఉంచుకోవాలి ► బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరు తరచుగా చేతులు శుభ్రపర్చుకోవాలి ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలి ► కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో చేయాలి. లక్షణాలను గుర్తిస్తే వెంటనే ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి ఆస్పత్రుల్లో ఏర్పాట్లు.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే విధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని తెలిపింది. అలాగే ఆక్సిజన్ వసతులను పునఃసమీక్షించుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకల తీరును నిరంతరం పరిశీలించాలని, ఆస్పత్రుల వారీగా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈనెల 27న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
వైరస్ లోడింగ్.. జరభద్రం.. ప్రతి ఇద్దరిలో ఒకరు జ్వర బాధితులే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లూయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ రూపంలో దేశంలోకి కోవిడ్ థర్డ్వేవ్ ప్రవేశించి ఏడాది దాటినా ఇంకా దాని రూపాంతరాలు వ్యాప్తిలోనే ఉంటున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ వద్దకు వస్తున్న ప్రతి ఇద్దరు రోగుల్లో ఒకరు దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. బాధితుల్లో పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారని వివరిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో ప్రజలు మాస్క్ల వాడకాన్ని దాదాపుగా మర్చిపోయారని.. రద్దీ ప్రాంతాల్లోనూ ఎవరూ పెద్దగా మాస్క్లు వాడటంలేదని విశ్లేషిస్తున్నారు. అందుకే వైరల్ జ్వరాలు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ♦ మాస్క్ , శానిటైజర్ వాడాలి. ♦ కళ్లు, ముక్కు, నోటిని అధికంగా తాకడం, రుద్దడం వంటివి మానాలి. ♦ జనసమ్మర్థ ప్రాంతాల్లోకి మాస్క్ లేకుండా వెళ్లకూడదు. ♦ బట్టలు, తువ్వాళ్లు, వాటర్ బాటిళ్ల వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. బాధితుల్లో దగ్గు అధికం.. గత 2 నెలలుగా ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా కేసుల పెరుగుద ల అధికంగా ఉంది. చాలా మందిలో దగ్గు ఎక్కువగా ఉంటోంది. ఆస్తమా, అలర్జీ, సీవో పీడీ, ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్న వారిలో సమస్యలు మరింతగా పెరుగుతున్నా యి. ఈ వైరస్లకు వాయుకాలుష్యం తోడుకావడంతో సమస్య తీవ్రమవుతోంది. ఈ వైరస్ల బారినపడిన వారు అజిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్ను ఎక్కువగా వాడరాదు. ఇలాంటి వారికి ఫ్లూ వ్యాక్సిన్లు రక్షణనిస్తాయి. – డాక్టర్ (ప్రొ) గోపీచంద్ ఖిల్నానీ, చైర్మన్, పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ ఈ వైరస్ ఏమిటో అంతుబట్టట్లేదు చాలామంది బాధితుల్లో దగ్గు ఎక్కువై కళ్లెలో రక్తం పడటం, ఆయాసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్య లు పెరుగుతున్నాయి. ఒకట్రెండు రోజు లు జ్వరం, ఒళ్లునొప్పులు సైతం ఉంటు న్నాయి. ఇది ఇన్ఫ్లూయెంజాలో కొత్త వేరియెంటా లేక కొత్త మ్యు టేషన్ తీసుకున్న కోవిడ్ ఇన్ఫెక్షనా అనేది (ఆర్టీపీసీఆర్ గుర్తించని) స్పష్టంగా తెలియట్లేదు. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఇన్ఫ్లూయెంజా ఫ్లూ షాట్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచి స్తున్నాం. ఇవి ఇన్ఫ్లూయెంజా ఏ,బీ, స్వైన్ఫ్లూ నుంచి రక్షణనిస్తున్నాయి. – డాక్టర్ వీవీ రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ -
తెలంగాణ లో డెంగ్యూ జ్వరాల డేంజర్ బెల్స్
-
పటిష్ట చర్యలతో విషజ్వరాలను కట్డడి చేశాం: మంత్రి రజనీ
సాక్షి, అమరావతి: విషజ్వరాలతో మరణాలు రాష్ట్రంలో సంభవించలేదని, విషజ్వరాలను సమర్థవంతంగా కట్టడి చేయగలిగామని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం.. వైద్యారోగ్య శాఖల నాడు-నేడు స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె ప్రసంగించారు. గత ప్రభుత్వంలో(2015-19 మధ్య) 74 వేలకు పైగా మలేరియా కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఈ ప్రభుత్వంలో నాలుగు వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. భారీ వర్షాలు, వరదలు పొటెత్తినా కూడా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని విషజ్వరాలను రికార్డు స్థాయిలో కట్టడి చేయగలిగామని విడదల రజనీ తెలియజేశారు. ప్రాణాంతకంగా మారుతున్న మలేరియా కట్టడి కోసం కూడా చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న ఆమె.. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నీరుగార్చిందని, కానీ.. జగనన్న ప్రభుత్వం మాత్రం డెంగ్యూ, మలేరియాలను ఆరోగ్యశ్రీలో చేర్చిందని చెప్పుకొచ్చారు. అదే విధంగా విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం, ప్రత్యేక బృందాల క్యాంపులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె లేవనెత్తారు. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో చాలా ఆర్భాటాలు.. ప్రజాధనాన్ని దుబారా చేసిందని మంత్రి రజనీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆనాడూ ‘దోమలపై దండయాత్ర’ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకటనను సైతం ఆమె చదివి వినిపించారు. సంధ్య ఘటనపై స్పందిస్తూ.. చింతూరు మండలానికి చెందిన చిన్నారి సంధ్య మృతి ఘటన బాధాకరం. వాస్తవానికి.. వైరల్ డిసీజ్తో చిన్నారి మృతి చెందింది. ఈ విషయాన్ని వైద్యులు ఇచ్చిన రిపోర్టులతో పాటు ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలు కూడా ఇచ్చారని ఆమె ప్రతులు చూపించారు. పొరుగు రాష్ట్రానికి సంధ్య కుటుంబం వెళ్లిందని టీడీపీ విమర్శిస్తోందని.. భద్రాచలం పరిధిలో అందుబాటులో ఉంది కాబట్టే సంధ్య కుటుంబం అక్కడికి వెళ్లిందని మంత్రి రజనీ తెలిపారు. ఈ ఘటనపై కూడా టీడీపీ సభ్యులు రాజకీయం చేయడం సరికాదని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విడదల రజనీ మండిపడ్డారు. ఇదీ చదవండి: పారిశ్రామిక పరుగులపై సీఎం జగన్ ఏమన్నారంటే.. -
డెంగీ విజృంభణ.. ఆ జిల్లాలో రోజుకు 28 కేసులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అధిక వర్షాలు.. వాతావరణ మార్పులు.. పెరుగుతున్న దోమలతో డెంగీ పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసులు అధికమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాపిస్తుండడంతో పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ప్రతీఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. రెండు నెలలుగా జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా పీహెచ్సీలతో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రులలో ఓపీ, ఐపీ కోసం రోగులు బారులు తీరుతున్నారు. ఆగస్టు, సప్టెంబర్లో విజృంభణ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అనారోగ్య వాతావరణం నెలకొంది. ఈ వాతావరణమే వైరల్ ఫీవర్ల వ్యాప్తికి కారకంగా మారుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య లోపం కారణంగానే దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో జ్వరాల ప్రభావం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే డెంగీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగస్టులో 181 కేసులు, సెపె్టంబర్ (15 నాటికి)లో ఇప్పటి వరకే 422 కేసులు నమోదుతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రులు కిటకిట సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల అనధికారికంగా పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదు కావడంతో జ్వరం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. జ్వరం వస్తే చాలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా రోగులు వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ప్రతి రోజు 2 వేలకుపైగా నమోదవుతుండగా, ఇన్పేషెంట్లకు సరిౖయెన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో జ్వరాల బారినపడిన పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ డెంగీ ప్రయివేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా తర్వాత అంతటి సంపాదన తెచ్చే అస్త్రమైంది. డెంగీ జ్వరం వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గడం సర్వసాధారణం. ప్లేట్లెట్స్ సాకుగా చూపుతూ ప్రయివేటు ఆసుపత్రులు పేషెంట్లను వారి బం«ధువులను భయాందోళనకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకుండా ప్లేట్లెట్స్ పరీక్ష చేయడం, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ పేషెంట్ను ఆసుపత్రికి పరిమితం చేస్తున్నారు. ఇక ఆంటిబయోటిక్స్, సెలాయిన్స్ పెట్టుకుంటూ రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. అవకాశం వచి్చందే తడవుగా సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీకి మెరుగైన వైద్యసేవలు అందించాలని అందుకు ఖర్చు రూ.వేలల్లో ఉంటుందని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతుండడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు డబ్బులకు వెనుకాడకుండా పేదలు జేబులను గుల్ల చేసుకుంటున్నారు. రోజుకు 28 కేసులు ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజుకు ఒకటి లేదా రెండుకు మించి కేసులు నమోదు కాలేదు. తాజాగా సెప్టెంబరులో డెంగీ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా రోజుకు 28 కేసులు చొప్పున నమోదవడం పరిస్థితికి అద్ధం పడుతోంది. దోమల సంఖ్య పెరగడమే ఈ వైరల్, డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. గతంతోపోలిస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలు, చెరువులు, కుంటలు నిండాయి. ఈ కారణం వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ విషయానికి వస్తే.. చుట్టూ హారంలా జలాశయాలు, కాలువలు ఉండటంతో దోమల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఇదీ చదవండి: వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం -
కో–ఇన్ఫెక్షన్స్.. ఏకకాలంలో అనేక జ్వరాలు..!
ఇటీవలి కాలంలో ప్రతి ఇంటా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడటం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్యకాలంలో వరసగా వర్షాలు అందరినీ బెంబేలెత్తించాయి. నిన్న మొన్నటి కరోనా కాలం తర్వాత... అదే సంఖ్యలో మూకుమ్మడి జ్వరాలు ఇటీవల నమోదయ్యాయి. అయితే ఇప్పటి జ్వరాల్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరిలో ఒకే సమయంలో రెండు రకాల జ్వరాలు నమోదవ్వడం ఇటీవల నమోదైన ధోరణి. ఇలా ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లు రావడాన్ని వైద్యనిపుణులు తమ పరిభాషలో ‘కో–ఇన్ఫెక్షన్స్’గా చెబుతున్నారు. ఆ ‘కో–ఇన్ఫెక్షన్ల’పై అవగాహన కోసమే ఈ కథనం. ఓ కేస్ స్టడీ: ఇటీవల ఓ మహిళ జ్వరంతో ఆసుపత్రికి వచ్చింది. తొలుత ఆమెలో డెంగీ లక్షణాలు కనిపించాయి. పరీక్షలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం డాక్టర్లు చూశారు. ఆ తర్వాత ఆమెకు ఆయాసంగా ఉండటం, ఊపిరి అందకపోవడం గమనించారు. అప్పుడు పరీక్షిస్తే ఆమెకు కోవిడ్ కూడా ఉన్నట్లు తేలింది. ఇలా ఒకేసారి రెండు రకాల జ్వరాలు (ఇన్ఫెక్షన్లు) ఉండటాన్ని ‘కో–ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇలా రెండ్రెండు ఇన్ఫెక్షన్లు కలసి రావడం కాస్తంత అరుదు. కానీ ఇటీవల ఈ తరహా కేసులు పెద్ద ఎత్తున రావడం విశేషం. ఇక ఈ కేస్ స్టడీలో కోవిడ్ కారణంగా బాధితురాలిని నాన్–ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద పెట్టి, ఆక్సిజన్ ఇస్తూ... రెండు రకాల ఇన్ఫెక్షన్లనూ తగ్గించడానికి మందులు వాడాల్సి వచ్చింది. వైరల్, బ్యాక్టీరియల్ జ్వరాలు కలగలసి... సాధారణంగా జ్వరాలతో బయటపడే ఇన్ఫెక్షన్లు రెండు రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటివి బ్యాక్టీరియల్ జ్వరాలు. రెండోవి వైరల్ జ్వరాలు. అయితే ఇటీవల బ్యాక్టీరియల్ జ్వరాల్లోనే రెండు రకాలుగానీ లేదా ఒకేసారి రెండు రకాల వైరల్ ఇన్ఫెక్షన్లుగానీ... లేదంటే ఒకేసారి వైరల్తో పాటు బ్యాక్టీరియల్ జ్వరాలుగానీ కనిపిస్తున్నాయి. అంతేకాదు... ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లతో పాటు ఒకే సమయంలో కుటుంబసభ్యుల్లో అనేక మంది జ్వరాల బారినపడటం అనేకమందికి ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియల్ జ్వరాలతో కలగలసి... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల విషయానికి వస్తే కొందరిలో వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరిలో ఎలుకలతో వ్యాపించే బ్యాక్టీరియల్ జ్వరం ‘లెప్టోస్పైరోసిస్’ కనిపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బొరియలు వాననీటిలో నిండిపోగా ఎలుకలు ఇళ్లలోకి రావడం పరిపాటిగా మారింది. లెప్టోస్పైరోసిస్ కనిపించడానికి ఇదే కారణం. ఇంకొందరిలో తొలుత జ్వరం రావడం... ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాలూకు రెండో పరిణామంగా (సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల) నిమోనియా కేసులూ కనిపిస్తు న్నాయి. ఇక లక్షణాల తీవ్రత ఎక్కువగా లేని కోవిడ్ రకాలతో (ఒమిక్రాన్ వంటి వాటితో) కలిసి ఇతరత్రా జ్వరాలు రావడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. యాంటీబయాటిక్స్ వద్దు... జ్వరం వచ్చిన వెంటనే కొందరు పారాసిటమాల్తో పాటు యాంటీబయాటిక్స్ మొదలుపెడతారు. యాంటీవైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేయకపోగా... అవసరం లేకపోయినా వాటిని తీసుకోవడం వల్ల కొన్ని కౌంట్లు మారుతాయి. విరేచనాల వంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ వంటి అనర్థాలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే కాకుండా... మూడోనాడు కూడా జ్వరం తగ్గకపోతే... అప్పుడు మాత్రమే డాక్టర్ను సంప్రదించి, తగిన మోతాదులోనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు కలగలసి రావడం ఇదే మొదటిసారి కాదు... గతంలోనూ కొన్ని సందర్భాల్లో డెంగీ, స్వైన్ ఫ్లూ, టైఫాయిడ్ లాంటివి కలసి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. దాంతో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికున్గున్యా వంటివి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివారణ... వర్షాకాలంలో పరిసరాల్లో నీళ్లు పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది... ఈ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి పరిసరాల పారిశుద్ధ్య జాగ్రత్తలూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగినంత అప్రమత్తంగా ఉండాలి. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా మెష్ / మస్కిటో రెపల్లెంట్స్ వంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక పెద్దవయసు వారు అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే అవకాశాలున్నందున వాటి పట్ల మరింత అప్రమత్తత వహించాలి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వైరల్ జ్వరాలివే.. వైరల్ జ్వరాల్లో ముఖ్యంగా డెంగీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తోంది. సాధారణంగా అది కోవిడ్తో పాటు కలిసి రావడం చాలామందిలో కనిపిస్తోంది. మరికొందరిలో వైరల్ ఇన్ఫెక్షన్లయిన కోవిడ్, ఫ్లూ... ఈ రెండూ కలగలసి వచ్చాయి. ఇంకొందరిలో కోవిడ్, ఫ్లూ, స్వైన్–ఫ్లూ... ఈ మూడింటిలో ఏ రెండైనా కలసి రావడమూ కనిపించింది. లక్షణాలు... వైరల్ జ్వరాల విషయానికి వస్తే... వీటిల్లో జ్వరం తీవ్రత... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వంటివి సోకినప్పుడు జ్వరం, దగ్గు కనిపిస్తుంటాయి. తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇటీవల కోవిడ్తో కలసి మరో ఇన్ఫెక్షన్ ఉంటే... ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. వెరసి... జ్వరం, స్వల్పంగా జలుబు/ఫ్లూ లక్షణాలు, కొందరిలో ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ. డెంగీ కేసుల్లో కొందరిలో ఒంటిపై ర్యాష్ వంటి లక్షణాలతో పాటు రక్తపరీక్షలు చేయించినప్పుడు... ప్లేట్లెట్స్ తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు... కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్ అందరికీ తెలిసిన వైద్య పరీక్షే. డెంగీ నిర్ధారణ కోసం చేసే కొన్ని పరీక్షల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ డెంగీలో లక్షణాలకే చికిత్స చేయాల్సి ఉన్నందున... ప్లేట్లెట్ కౌంట్తోనే దీన్ని అనుమానించి... తగిన చికిత్సలు అందించాలి. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిన టైఫాయిడ్ నిర్ధారణ కోసం వైడాల్ టెస్ట్ అనే వైద్య పరీక్ష చేయించాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర పరీక్షలూ చేయించాలి. చికిత్స వైరల్ జ్వరాలకు నిర్దిష్ట చికిత్స లేనందున జ్వరానికి పారాసిటమాల్ ఇస్తూ... లక్షణాలను బట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అందించాలి. ద్రవాహారాలు ఎక్కువగా ఇవ్వాలి. ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే... వాటిని బట్టి చికిత్సను మార్చాలి. (ఉదా. డెంగీలాంటి కేసుల్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు, వాటిని ఎక్కించడం). ఇక టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అయితే జ్వరం వచ్చిన రెండు, మూడు రోజుల వరకు అది వైరలా, బ్యాక్టీరియలా తెలియదు కాబట్టి కేవలం పారాసిటమాల్ తీసుకుంటూ... ఆ పైన కూడా జ్వరం వస్తూనే ఉంటే వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించి, తగిన చికిత్సలు తీసుకోవాలి. ఇక లెప్టోస్పైరోసిస్ వంటివి కాలేయం, కిడ్నీ వంటి వాటిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారి. అందుకే ఈ కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఫిజీషియన్ -
తెలంగాణకు ‘ఫుల్ ఫీవర్’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి. వానలు.. దోమలతో.. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు అపరిశుభ్ర పరిస్థితులు, దోమల వ్యాప్తి కారణంగా డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 వేలకుపైగా డెంగీ కేసులు నమోదుకాగా.. ఇందులో ఒక్క ఆగస్టులోనే 3,602 కేసులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు సరిగా అందక ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రంగా.. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులూ నమోదవుతున్నాయి. ఒక్క మేడ్చల్ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తీవ్రత గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67 లక్షల మంది ఔట్ పేషెంట్లు వచ్చారని వైద్యారోగ్యశాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. సగటున నెలకు 9.93 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధికంగా అనారోగ్యాల బాధితులు ఉన్నారని.. ఇందులో విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వర బాధితులే.. ► నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధికారికంగానే 56 మందే డెంగీ బారినపడ్డట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ► కరీంనగర్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రోజూ 150 మంది వరకు విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ 38, వైరల్ జ్వరాలు 1,872 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 188 డెంగీ కేసులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో రోజూ వందల్లో జ్వర బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనూ సీజనల్ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రోజూ 1,500 మందికిపైగా రోగులు వస్తున్నారని, అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజుల్లో 90 డెంగీ కేసులు వచ్చాయి. ► విష జ్వరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరైనా మంచం పట్టి కనిపిస్తున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోక కింద పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 547 డెంగీ కేసులు, 83 చికున్ గున్యా కేసులు వచ్చాయి. ► ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోనూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో 86 డెంగీ కేసులు నమోదుకాగా.. వేల మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. ► సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్న పరిస్థితి ఉంది. పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మూడు రోజులుగా జ్వరంతో.. మా బాబు మహేశ్ వయసు ఎనిమిదేళ్లు. మూడు రోజులుగా తీవ్రంగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. బాగా నీరసంగా ఉంటే ఈ రోజు ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైరల్ జ్వరంలా ఉంది.. పరీక్షలు చేయించాలని వైద్యులు అంటున్నారు. – మహేశ్ తల్లి, ఉప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో తగ్గక ప్రైవేటుకు వెళ్లాం డెంగీ రావడంతో వారం రోజుల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో చేరి ఐదు రోజులు చికిత్స తీసుకున్నాను. ప్లేట్ లెట్స్ తగ్గిపోతూనే ఉన్నాయి. మా ఇంట్లోవాళ్లు ఆందోళనతో ఫీవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. – సాయి కిరణ్ (20), బాగ్ అంబర్పేట ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
వైరల్ జ్వరాలకు ఆరోగ్యశ్రీ రక్ష
సాక్షి, అమరావతి: సీజనల్ జ్వరాల బారినపడుతున్న ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. ఓ వైపు వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు జ్వరాలబారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 1,237 మలేరియా, 2,174 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సీజనల్ వ్యాధుల బారినపడే వారికి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స లభిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద చేసే చికిత్సల సంఖ్యను ప్రభుత్వం ఏకంగా 2,446కు పెంచింది. త్వరలో వీటిని 3,118కి పెంచనుంది. 7,032 మందికి చికిత్స ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 689 మంది మలేరియా బాధితులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందారు. వైరల్ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గుదల సమస్య ఉంటోంది. ఈ క్రమంలో ఎలీసా నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా వైరల్ జ్వరంతో బాధపడుతూ.. ర్యాపిడ్ కిట్లో పాజిటివ్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగ్యూ చికిత్స అందిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు వరకు 6,343 మంది చికిత్స పొందారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 1,612 మంది ఉన్నారు. పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకి ఉచిత చికిత్స.. ఎలీసా పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,174 డెంగ్యూ కేసులను మాత్రమే నిర్ధారించారు. ఎలీసా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయితేనే డెంగ్యూ ఉన్నట్టు. అయితే కొన్ని రకాల వైరల్ జ్వరాల్లో ఎముక మజ్జ అణచివేత (బోన్మ్యారో సప్రెషన్)తో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ జ్వరాల బారినపడి.. ప్లేట్లెట్స్ తగ్గినవారికి ఎలీసా పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఇలాంటి పరిస్థితులున్న బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు -
విజృంభిస్తున్న విషజ్వరాలు: డెంగీ..మలేరియా..టైఫాయిడ్!
అంబర్పేట: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీకి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. నిత్యం 40 నుంచి 50 ఉండే ఓపీ.. ప్రస్తుత సీజన్లో 70 నుంచి 80కి పెరిగింది. నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నాలుగు బస్తీ దవాఖానాలకు సామాన్య రోగుల సంఖ్య తాకిడి ఎక్కువైంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జ్వరాల భారిన పడిన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకూ పరుగులు తీస్తున్నారు. ఈ సీజన్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 20 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణ, పారిశుధ్య నిర్వహణలో జరుగుతున్న వైఫల్యంతోనే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. అండగా బస్తీ దవాఖానాలు సీజన్ వ్యాధులు ప్రబలుతుండటంతో బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు బస్తీ దవాఖానాల్లో వైద్యులు ఓపీ చూస్తున్నారు. సాధారణ జనంతో పాటు ఇతర జ్వరాలను గుర్తించి చికిత్స అందించడంతో పాటు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేస్తున్నారు. నియోజకవర్గంలో అంబర్పేట మున్సిపల్ కాలనీ, బాగ్ అంబర్పేట అయ్యప్ప కాలనీ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెహ్రూనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఫీవర్ ఆసుపత్రిలో వెనుకాల ఉన్న తిలక్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యానగర్ డీడీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓపీతో పాటు వైద్య పరీక్షల శాంపిళ్లు సేకరించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆయా డివిజన్లలో ఉన్న బస్తీ దవాఖానాల్లో సైతం వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి పంపిస్తున్నారు. వైద్య పరీక్షల్లో తేలిన ఫలితాన్ని బట్టి కోవిడ్కు చికిత్సను అందిస్తున్నారు. దోమల నియంత్రణలో విఫలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిసినా దోమలను నియంత్రించడంలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం విఫలమవుతున్నది. దోమల లార్వా, దోమల విజృంభణలను నివారించడంలో ఎంటమాలజీ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూ.. తూ.. మంత్రంగా ఫాగింగ్ చేపట్టి చేతులు దులుపు కుంటున్నారే తప్ప వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. లార్వా నిర్మూలనలో సైతం పై పై చర్యలు తీసుకొని మిన్నకుండి పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్య విభాగాన్ని సమాయత్తం చేశాం సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాం. సీజనల్ వ్యాధులను అరికడుతూనే విస్తృతంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపడుతున్నాం. సీజనల్ వ్యాధులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. – డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ హేమలత -
కరీంనగర్ జిల్లాలో విజృంబిస్తున్న విష జ్వరాలు
-
తెలంగాణను వణికిస్తున్న విష జ్వరాలు
-
హైదరాబాద్: విజృంభిస్తున్న విషజ్వరాలు
-
మళ్లీ డెంగీ కాటు!
సాక్షి, హైదరాబాద్: గతేడాది వర్షాకాలంలో రాష్ట్రాన్ని గడగడలాడించిన డెంగీ... సీజన్ దాటినా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం డెంగీతో కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు అంటే 20 రోజుల్లో రాష్ట్రంలో 180 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా వర్షాకాలంలో డెంగీ జ్వరాలు, వైరల్ ఫీవర్లు వస్తుంటాయి. సీజన్ దాటాక కూడా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయంటే డెంగీకి కారణమయ్యే దోమ ఇంకా అక్కడక్కడా ఉండటం వల్లేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం డెంగీ నివారణ చర్యలను దాదాపు నిలిపివేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరోవైపు స్వైన్ఫ్లూ కేసులు కూడా రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గత 15 రోజుల్లోనే 30 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వైన్ఫ్లూ నియంత్రణకు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో స్వైన్ఫ్లూ ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఆయా ఆసుపత్రుల్లో స్వైన్ఫ్లూ మందులు, మాస్కులు సిద్ధంగా ఉంచారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తలనొప్పి, ఒంటి నొప్పులు, ఊపిరి తీసుకోలేకపోవడం, ఛాతీలో మంట వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతేడాది 13,417 కేసులు ఎన్నడూ లేనంతగా గతేడాది డెంగీతో జనం విలవిలలాడిపోయారు. డెంగీతో అనేక మంది చనిపోయినా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం మరణాల సంఖ్యను తక్కువగా చూపించినట్లు విమర్శలు వచ్చాయి. 2019 జనవరి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు తెలంగాణలో 13,417 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అందులో కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 10 వేల కేసుల వరకు నమోదైనట్లు అంచనా వేశారు. డెంగీ కేసుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 40 నుంచి 50 శాతం వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. గతేడాది వర్షాకాల సీజన్లో అధిక వర్షాలు కురవడం వల్లే అధికంగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్లో 20 నుంచి 25 రోజులు, అక్టోబర్లో 25 రోజులకుపైగా వర్షాలు కురవడం వల్లే డెంగీ దోమల వ్యాప్తి పెరిగింది. -
తగ్గని జ్వరాలు
సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆగట్లేదు. వ్యాధులు తగ్గ ట్లేదు. జనానికి జ్వరాల బాధలు తప్ప ట్లేదు. జూలైలో ప్రారంభమైన జ్వరాలు ఇప్పటికీ తగ్గట్లేదు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడ్డారు. డెంగీ, మలేరియా, చికున్గున్యా జ్వరాలు పట్టిపీడిస్తు న్నాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాం తులు, విరేచనాలతో భయాందోళనకు గురవుతున్నారు. సెప్టెంబర్ చివరి నాటికే వర్షాల తీవ్రత తగ్గిపోవాలి. కానీ అక్టోబర్ నెలాఖరుకు కూడా వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ఇప్పటికీ సాయం త్రం అయిందంటే చాలు అనేకచోట్ల క్యుములోనింబస్ మేఘాలతో ఒక్క సారిగా కుండపోత వర్షాలు కురుస్తున్నా యి. ఈ వర్షాలు నవంబర్లోనూ కొద్ది రోజులు కొనసాగే పరిస్థితి ఉండటంతో దోమలు మరింత విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఇద్దరే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ చెబుతున్నా అనధికారిక సమాచారం ప్రకారం డెంగీ కారణంగా కనీసం 150 మందికిపైగా చనిపోయారు. అందులో ఒక్క నిలోఫర్ ఆసుపత్రిలోనే ఏడుగురు పసి పిల్లలు డెంగీతో చనిపోయారని అక్కడి వైద్యులే ఆఫ్ ది రికార్డు సంభాషణల్లో చెబుతున్నారు. అంకెలను తక్కువ చూపిస్తూ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దేశంలోనే డెంగీలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఏకంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి రెండు వ్యాధుల విజృంభణ.. డెంగీ, చికున్గున్యా వానాకాలం సీజన్లో వచ్చేవి కాగా, శీతాకాలంలో స్వైన్ఫ్లూ పుంజుకుంటుంది. వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉండటంతో డెంగీ, స్వైన్ఫ్లూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో వేర్వేరుగా వచ్చే ఈ రెండు వ్యాధులు ఇప్పుడు ఒకేసారి రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 20 వరకు తెలంగాణలో 1,319 స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా, 21 మంది చనిపోయారు. దీంతో జ్వరం, తలనొప్పి వస్తేనే ప్రజలు డయాగ్నస్టిక్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మామూలు జ్వరానికీ పరీక్షల కోసం వేలు ఖర్చు చేస్తున్నారు. ఇదే అదనుగా డయాగ్నస్టిక్ సెంటర్లు, వైద్యులు దీన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ పేరొందిన ఆస్పత్రి వైద్యులు ప్రతి చిన్న దానికి రూ.5 వేలకు మించి పరీక్షలు చేయిస్తున్నారు. దాంతో పాటు వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు మందులు విచ్చలవిడిగా మింగుతున్నారు. అది ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుం దని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ చర్యలు కరువు.. దోమలే డెంగీ, మలేరియా జ్వరాలకు కారణం. ఈ దోమలను నివారించడానికి ఇంట్లో పరిశుభ్రత, నీటిని నిల్వ ఉండకుండా చూడటం ముఖ్యం. చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే అక్కడా డెంగీ దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమలను నిర్మూ లించాలంటే నిరంతరం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఫాగింగ్ చేయాలి. కానీ ఈ ఏడాది ఫాగింగ్ యంత్రాలు పూర్తిస్థాయిలో లేకపోవ డంతో దోమల నివారణ జరగలేదు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలను ఎదుర్కోవడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైంది. చాలాచోట్ల డెంగీ కిట్లను సకాలంలో అందించలేకపోయింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడాయి. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సరాసరి రూ.50 వేల వరకు డెంగీ, చికున్గున్యా, ఇతర వైరల్ జ్వరాలకు ఖర్చు చేసినట్లు అంచనా. కొన్ని కుటుంబాలైతే రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. కొందరు ప్రత్యేకంగా డెంగీకి బీమా చేయించుకున్నారు. సాయంత్రం ఓపీకి బ్రేక్.. ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఓపీ నిర్వహించాలన్న సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికీ డెంగీ, వైరల్ ఫీవర్లు వస్తున్నా సాయంత్రం డాక్టర్లు ఓపీ చూడట్లేదు. అయితే దీనికి రోగులు రావట్లేదన్న కారణం చూపుతున్నారు. ఇక కీలకమైన వైరల్ ఫీవర్ల సీజన్ కావడంతో కొందరు ప్రభుత్వ వైద్యులు సొంత ప్రైవేటు ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మళ్లీ దోమలు విజృంభించే చాన్స్ ఇప్పటికీ ఆస్పత్రులకు డెంగీ జ్వరాలతో జనం వస్తూనే ఉన్నారు. సీజన్ అయిపోయినా వర్షాల వల్ల ఈ పరిస్థితి నెల కొంది. వర్షాలు తగ్గాక మళ్లీ దోమలు విజృం భించే అవకాశముంది. కాబట్టి ఇళ్లలో పరిశు భ్రత పాటించాలి. –డాక్టర్ కృష్ణ భాస్కర్, పిజీషియన్, సిటీ న్యూరో, హైదరాబాద్ డెంగీలో ఖమ్మం రెండో స్థానం.. దగ్గు, జలుబు, తలనొప్పి తో ప్రజలు ఆస్పత్రులకు వస్తున్నారు. డెంగీ కేసుల్లో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది. అంటే దోమలు ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. దీంతో దోమలు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం -
అమ్మో.. జ్వరం
సాక్షి, గుంటూరు : ఇంటిల్లిపాదిని సందడి చేస్తూ ఉండాల్సిన పిల్లలు జ్వరాలతో మంచం పడుతున్నారు. స్నేహితులతో పాఠశాలలకు ఉల్లాసంగా వెళ్లాల్సిన చిన్నారులు ఆస్పత్రుల గడప తొక్కుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలు జ్వరాలతో బాధ పడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం విష జ్వరాలతో ముప్పాళ్ల మండలం, నరసరావుపేట పట్టణాల్లో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. జీజీహెచ్లో ప్రతి రోజూ 20 పిల్లలు గుంటూరు జీజీహెచ్లో ప్రతి రోజూ 20 మంది పిల్లలు వివిధ రకాల జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్, నిమోనియా సమస్యలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. గుంటూరు జిల్లాలో చిన్నపిల్లల వైద్య నిపుణులు 215 మంది ఉన్నారు. ప్రతి వైద్యుడి వద్దకు రోజూ 60 నుంచి 100 మంది పిల్లలను జ్వరాల చికిత్స కోసం తీసుకొస్తున్నారు. జ్వరాల లక్షణాలు చలి జ్వరం, జాయింట్ నొప్పులు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, శరీరంపై ఎర్రటి గుల్లలు, కడుపులో నొప్పి, బీపీ తగ్గిపోవటం, మూత్రం సక్రమంగా రాకపోవటం, నీరసం తదితర లక్షణాలు జ్వరాల బారిన పడిన పిల్లల్లో కనిపిస్తాయి. జ్వరం సోకిన పసి కందులు సరిగ్గా తల్లిపాలు తాగలేక ఏడుస్తుంటారు. మూత్ర సమస్య వస్తుంది. జ్వరం మూడు రోజులకు మించితే.. సాధారణంగా జ్వరం మూడు రోజులు ఉంటుంది. వైద్య పరీక్షలు జ్వరం వచ్చిన మూడు రోజుల తరువాత మాత్రమే చేయించాలి. ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేలకన్నా తక్కువగా ఉన్నా ప్రమాదం ఉండదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి రక్తం రావడం, మూత్రంలో రక్తం కారడం, దగ్గుతున్నప్పుడు రక్తం పడడం, పళ్లు తోముకుంటున్నప్పుడు రక్తం రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలు జ్వరాలు సోకిన పిల్లలకు జీజీహెచ్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ పెనుగొండ యశోధర తెలిపారు. ప్రతి రోజూ 20 మంది వరకు జ్వరాలు సోకిన పిల్లలు వస్తున్నారన్నారు. ఆగస్టులో 85 మందికి, సెప్టెంబర్లో 181 మంది జ్వరాలు సోకిన పిల్లలకు సేవలందించామని తెలిపారు. నాతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్లు బీ దేవకుమార్, ఎలిజబెత్, రామిరెడ్డి, పేరం ఝాన్సీరాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శివరామకృష్ణ, చాందిని, వీరేష్, బ్రహ్మయ్య, కరిముల్లా, దీపక్, సునీత, వాణీభాయ్, పీజీ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. జాగ్రత్తలు పాటించండి జ్వరం వారం రోజులపాటు ఉంటుంది. జ్వరం తగ్గినా 48 గంటల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్లెట్లు, బీపీ తగ్గిపోవడం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు జ్వరం తగ్గిన 48 గంటల తర్వాత బయటపడతాయి. కొబ్బరి నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రావణం పిల్లలకు తాగించాలి. జ్వరం వచ్చిన మూడు, లేదా నాలుగో రోజు మాత్రమే వైద్య పరీక్షలు చేయించాలి. వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు. ఇంట్లో, స్థానికంగా అందుబాటులో ఉండే అర్హత లేని వారితో సెలైన్లు పెట్టించి పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దు. అందుబాటులో ఉన్న మెరుగైన వైద్యశాలలో మాత్రమే పిల్లలకు చికిత్స తీసుకోవాలి. – డాక్టర్ తిమ్మాపురం చంద్రశేఖరరెడ్డి, పిల్లల వైద్య నిపుణుల సంఘం సెక్రటరీ. దోమతెరలు వాడండి దోమల ద్వారా డెంగీ, మలేరియా, చికెన్గున్యా, వైరల్ జ్వరాలు, ఫైలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. దోమల పెరుగుదలకు అపరిశుభ్రమైన వాతావరణమే కారణం. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యం. మురుగు, వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పనికిరాని వస్తువులు, వినియోగించని వాటిని బయటపడేయాలి. టైర్లు, కొబ్బరి బొండాలు దోమలు ఆవాసాలుగా ఉంటాయి. దోమ తెరలు వాడటం చాలా మంచిది. చేతులు పూర్తిగా కప్పి ఉండే వస్త్రాలను ధరించాలి. – డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
డెంగీ డేంజర్ ; కిట్లకు కటకట..
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులకు ఇదో పరీక్ష. డెంగీ రోగులకు పరీక్షలు చేయడంలో విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో డెంగీ నిర్ధారణ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరిపడా డెంగీ నిర్ధారణ కిట్లు లేక పాట్లుపడుతున్నాయి. రెండు, మూడు రోజులు ఆగాలని వైద్య సిబ్బంది చెబుతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం డెంగీపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కిట్లు సమకూర్చకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నివేదికలతో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవసరం 10 లక్షలు...అందుబాటులో 1.35 లక్షల మందికే వైరల్ జ్వరాలు విజృంభిస్తుండటం, ఒక్కోసారి 103–104 డిగ్రీల జ్వరం వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా జనం ఆందోళన చెందుతున్నారు. వైరల్ జ్వరాలు, డెంగీ అనుమానిత కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 31 జిల్లా, 87 ఏరియా ఆసుపత్రులకు రోజూ లక్షలాదిమంది తరలివస్తున్నారు. పడకలు కూడా దొరకని పరిస్థితి. ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్లోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్కూ రోగులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వేలాది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కూడా డెంగీ నిర్ధారణ కోసం లక్షలాది మంది వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షలమందికి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉండగా, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో కేవలం 1.35 లక్షలమందికి మాత్రమే సరిపడా కిట్లున్నాయి. అందులో ప్రాథమిక నిర్ధారణ కోసం నిర్వహించే ర్యాపిడ్ టెస్టు కిట్లు 73 వేలుండగా, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఎలీసా కిట్లు కేవలం 62 వేలమందికి సరిపోను మాత్రమే ఉన్నాయి. ఎలీసా పరీక్షల కోసం రెండు, మూడు రోజులపాటు ఆగాలని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది చెబుతుండటంతో బాధితులు ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. వైద్య విధాన పరిషత్ యంత్రాంగం విఫలం వైద్య విధాన పరిషత్కు ఇన్చార్జి కమిషనర్గా హైదరాబాద్ కలెక్టర్ మాణిక్రాజ్ కొనసాగుతున్నారు. రెండు విధులతో ఆయన జిల్లా, ఏరియా ఆసుపత్రులపై దృష్టి సారించడంలేకపోతున్నారు. కనీసం ఆయా ఆసుపత్రుల యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేని పరిస్థితి. ఆయన కంటే కిందిస్థాయిలో ఉండే అధికారులు కూడా డెంగీ నిర్వహణ, పర్యవేక్షణలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలీసా కిట్లు ఏడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకూ అధికారులు డెంగీ నిర్ధారణ కిట్లు తక్కువగానే ఇచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్లను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి 500, దుబ్బాక ఆసుపత్రికి 150, తూప్రాన్ ఆసుపత్రికి 250 మాత్రమే ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి కేవలం ఏడే ఎలీసా కిట్లు ఇచ్చారు. ర్యాపిడ్ పరీక్ష కిట్టు ద్వారా ఒక్కో యూనిట్ ఒక్కరికి, ఎలీసా కిట్టు ఒక్కోటి 96 మందికి పరీక్ష చేయడానికి వీలుంది. నీలోఫర్ ఆసుప త్రికి 70 ఎలీసా కిట్లు మాత్రమే ఇచ్చారు. అయితే, ఇక్కడికి రోజూ కనీసం 2 వేల మందికి పైగా పిల్లలు వస్తున్నారు. హైదరా బాద్లోని ఫీవర్ ఆసుపత్రికి రోజూ 2,500 మంది రోగులు వస్తుంటారు. అక్కడ కేవలం 3,936 మందికి సరిపోయే 41 ఎలీసా కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి ఐదు ఎలీసా కిట్లు మాత్రమే ఉన్నాయి. ఆలస్యానికి కారణమిదే.. డెంగీ పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యానికి కారణం కిట్ల కొరత కాదు. అవసరమైనన్ని కిట్లు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరమైనప్పుడు తెప్పిస్తున్నాం. అయితే, ఎలీసా పరీక్షకు నిర్వహించే ఒక్కో కిట్టు ధర రూ.25 వేలు. ఒక్కో కిట్టు ద్వారా 96 మందికి పరీక్షలు చేయడానికి వీలుంది. కొద్దిమంది కోసం ఒక్కసారి కిట్టు విప్పితే మిగతావారి కోసం దాన్ని దాచి ఉంచలేం. కాబట్టి 96 రక్త నమూనాలు వచ్చే వరకు ఆగుతున్నాం. -చంద్రశేఖర్రెడ్డి, ఎండీ,టీఎస్ఎంఎస్ఐడీసీ -
మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి విష జ్వరాలతో తల్లడిల్లుతోందని, సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడదామంటే స్పీకర్ అవకాశం ఇవ్వట్లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ వెయ్యి మంది ఔట్పేషెంట్లతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి కిటకిటలాడుతోందన్నారు. మంత్రి ఈటల ఒకసారి సంగారెడ్డికి వస్తే పరిస్థితి తీవ్రత తెలుస్తుందన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చి కాంగ్రెస్ సభ్యులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. -
99 శాతం వైరల్ జ్వరాలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలు ప్రబలుతున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రబలిన జ్వరాల్లో 99 శాతం వైరల్ జ్వరాలేనని, డెంగీ చాలా తక్కువ మందికే సోకిందని శాసనసభకు తెలిపారు. 2007లో ప్రభావం చూపిన తరహాలో ఇప్పుడు డెంగీ తీవ్రత లేదని, అప్పటి కంటే బాధితుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నా, దాని తీవ్రత తక్కువే ఉందన్నారు. అప్పటి తరహాలో మృతుల సంఖ్య ఎక్కువ లేని విషయాన్ని గుర్తించాలన్నారు. ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క, అనసూయ (సీతక్క) ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లనే జ్వరాలు తీవ్రంగా ప్రబలి రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని నిలదీయగా, మంత్రి దానికి వివరంగా సమాధానమిచ్చారు. వైరల్ జ్వరాలే అయినందున పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని, మరో నెలరోజులు ఈ తరహా పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికీ పరిస్థితి గంభీరంగానే ఉన్నా, ఆందోళన అవసరం లేదని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా జనానికి ధైర్యం చెప్పేలా వ్యవహరించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలు భేష్.. జ్వరాలు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చొరవను శాసనసభ వేదికగా అభినందిస్తున్నట్లు ఈటల ప్రకటించారు. వారు చాలా అప్రమత్తంగా ఉండి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో 9,381 పోస్టుల భర్తీ.. రాష్ట్రవ్యాప్తంగా 12,289 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారని, వీటిలో 9,381 పోస్టులు త్వరలో∙భర్తీ అవుతాయని ఈటల తెలిపారు. వీటి లో 2,917 మంది డాక్టర్లు, 4,268 మంది నర్సులు, మిగతావి పారా మెడికల్ పోస్టులని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి ప్రకటించాలి: కాంగ్రెస్ రాష్ట్రం మొత్తం జ్వరాలతో బాధపడుతున్నందున ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొందని ఆ పార్టీ సభ్యులు భట్టి విక్రమార్క, సీతక్క ఆరోపించారు. వాస్తవాలు దాచి మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దని, సమస్య తీవ్రంగా ఉందని ఆరోపించారు. -
బొప్పాయి..బాదుడేనోయి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ, మలేరియా, డయేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఔషధగుణాలున్న బొప్పాయి పండ్లకు ఎన్నడూ లేనంత గిరాకీ పెరిగింది. మార్కెట్లో డిమాండ్కు తగ్గట్లు బొప్పాయి సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. అన్ని జిల్లా, మండల ప్రధాన ఆస్పత్రులన్నీ డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోతున్నాయి. దీనికితోడు వర్షాల సీజన్ కావడంతో కలుషిత నీటితోనూ ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగులు బొప్పాయి పండ్లను ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంకా పలు రకాల మేలు కలుగుతుందని చెబుతున్నారు. ఎక్కడ నుంచి సరఫరా... రాష్ట్రంలో పెద్ద సైజు బొప్పాయి పండ్లు అధికంగా ఖమ్మం, జహీరాబాద్, కల్వకుర్తి, అచ్చంపేట, ఒంగోలు నుంచి, చిన్నసైజు బొప్పాయిలు నల్లగొండ, వరంగల్, కర్ణాటకలోని గుల్బర్గా, ఏపీలోని నూజివీడుల నుంచి హైదరాబాద్కు వస్తోంది. ధర.. దడదడ గత ఏడాది ఇదే సమయానికి గడ్డిఅన్నారం మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులు పెద్దరకం బొప్పాయి కిలో రూ.8 నుంచి రూ.10కి విక్రయించారు. అది కాస్త ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40కి పెరిగింది. దీన్ని రిటైల్ వ్యాపారులు కిలో రూ.80కి అమ్ముతున్నారు. సూపర్ మార్కెట్లలో కిలో రూ.100కి అమ్ముతున్నారు. ఇక జిల్లాల్లో పెద్దరకం బొప్పాయిలు అందుబాటులో లేవు. చిన్నసైజు బొప్పాయి ధర సైతం జిల్లాలో కిలో రూ.80కి తక్కువగా లేదు. అయితే, గడ్డిఅన్నారం మార్కెట్కు శుక్రవారం 80 టన్నుల మేర బొప్పాయి పండ్లు వచ్చినట్లు మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నారు. ఇదే రీతిన మార్కెట్లో బొప్పాయి వస్తేనే ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. మేలు ఇలా.. శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేసేందుకు, శరీరంలోని కొవ్వును తగ్గించడానికి దోహదపడుతుంది. గుండెపోటు నివారణకు, జలుబు, జ్వరంతో బాధపడేవారికి మంచి ఔషధం.. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ∙లివర్ సిరోసిస్ వంటి కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. -
డెంగ్యూ తీవ్రత అంతగా లేదు : ఈటల
సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత అంతగా లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 99 శాతం జ్వరాలు వైరల్ ఫీవర్లు మాత్రమేనని చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని పలు వార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. 400 పడకల ఆస్పత్రిలో రోజుకు 675 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైరల్ ఫీవర్ల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పరిస్థితిలో మరో 150 పడకల ఏర్పాటు చేస్తున్నట్టు వ్లెడించారు. ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రుల్లో మాదిరిగా త్వరలో ఖమ్మం హాస్పిటల్లో కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం ఆస్పత్రి ఖ్యాతిని పెంచేలా.. సకల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. -
కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు: మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్ : గతంతో పోలిస్తే ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రస్తుతం సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఓపీ కౌంటర్ల సంఖ్యను 6 నుంచి 25కు పెంచామని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన ఈటల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్ జ్వరాల గురించి అడిగి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. తమకు కూడా ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు వస్తున్నాయని, వాటిని ముఖ్యమంత్రికి సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లో దోమతెరలు పంచుతున్నామని, ఉదయ సమయాల్లో సైతం దోమతెరలు ఉపయోగించాలని కోరారు. కాలం మారుతుండటం వల్ల అందరికీ జర్వాల బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరు కాచిన నీటినే తాగాలని సూచించారు. కాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
మన్యంలో ముసురుతున్న జ్వరాలు
సాక్షి, సీతంపేట: మన్యం నూటొక్క డిగ్రీల జ్వరంతో మూలుగుతోం ది. తాజాగా కురుస్తున్న వానలకు గెడ్డల్లో కొత్త నీరు చేరి కలుషితమవుతోంది. ఈ నీటినే గిరిజనులు తాగడానికి ఉపయోగిస్తుండడంతో వారు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన్యం పరిధిలోని ఏ పీహెచ్సీ చూసినా వైరల్, టైఫాయిడ్ వంటి జ్వరాల బాధితులే కనిపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఊటబావుల్లో, గెడ్డల్లో నీరు చేరింది. ఈ నీటినే కొన్ని గ్రామాల్లో వినియోగించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీనికి తోడు కొన్ని గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా క్షీణించడంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఆస్పత్రులు కిటకిట.. ఐటీడీఏ పరిధిలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలు మరో 15 ఉన్నాయి. ఏరియా ఆస్పత్రులు 2, సీహెచ్సీలు 10 ఉన్నాయి. హైరిస్క్ ప్రాంతమైన సీతంపేట ఏజెన్సీలో సీతంపేట, దోనుబాయి, కుశిమి, మర్రిపాడు గ్రామాల్లో పీహెచ్సీలు ఉన్నాయి. రోజుకు ఒక్కో పీహెచ్సీలో 50 నుంచి 100 మంది వరకు ఓపీ వస్తుండగా వారపు సంత రోజుల్లో ఆ సంఖ్య 200ల వరకు ఉంటుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. రోజుకు ఒక్కో పీహెచ్సీకి సుమారు 30 నుంచి 40 వరకు ఓపీలో జ్వరాల కేసులే నమోదవుతుండగా సీహెచ్సీల్లో మాత్రం 60 కేసుల వరకు జ్వర పీడితులు చేరుతున్నారు. సీతంపేటలో సోమవారం, బుధవారం మర్రిపాడు, గురువారం దోనుబాయి, శనివారం కుశిమి సంతలు జరుగుతాయి. ఆ యా సంతలకు వచ్చినప్పుడు వైరల్ జ్వరాలు వంటి వాటికి పీహెచ్సీలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ సమయంలో పీహెచ్సీల్లో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి. తగ్గుముఖం పట్టిన మలేరియా.. ప్రాణాంతకమైన మలేరియా పాజిటివ్ కేసులు ఈ ఏడాది ఐటీడీఏ పరిధిలోని 20 సబ్ప్లాన్ మండలాల్లో తగ్గాయి. గత ఏడాది ఇదే సీజన్లో ఆగస్టు నెల వరకు 137 మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 67 కేసులు మాత్రమే నమోదవ్వడం గమనా ర్హం. 20 ట్రైబల్ సబ్ప్లాన్ మండలాల్లో 1256 గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో హైరిస్క్ మలేరియా గ్రామాలు జిల్లాలో గత ఏడాది 584 గుర్తించారు. ఈ గ్రామాల్లో అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నట్టు గుర్తించి మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టగా ఆ సంఖ్య 445కు తగ్గింది. ప్రభుత్వం మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో 2 లక్షలకు పైగా దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సంవత్సరం మరో 40 వేల దోమ తెరలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అలాగే లక్షా 50వేలకు పైగా గంబూషియా చేపలను మురికి కుంటల్లో వేశారు. 225 గ్రామాలకు ఇప్పటికే సింథటిక్ ఫైరాత్రిన్ అనే దోమల నివారణా మందును ఇళ్లల్లోనూ, ఆరుబయట స్ప్రే చేస్తున్నారు. అలాగే మురికి కాలువలు, చిన్నచిన్న చెరువుల్లో దోమల కారక లార్వాను నాశనం చేసే గంబూషియా చేపలను పెంచుతున్నారు. ఇవి దోమ లార్వాను తినేస్తాయి. దీంతో దోమలు వృద్ధి చెందకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆరోగ్య కేంద్రాల్లో లక్షకు పైగా ఆర్డీడీ కిట్లు మలేరియా నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉంచారు. ఏసీటీ అనే మలేరియా నివారణ మాత్రలు కూడా ఉంచారు. అప్రమత్తంగా ఉన్నాం.. ఏజెన్సీలో వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం. జ్వర పీడిత కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందినా మెడికల్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. టైఫాయిడ్, వైరల్ జ్వరాల వంటి కేసులు అధికంగా వస్తున్నాయి. వీటికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. వైద్య సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నాం. మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. – ఈఎన్వీ నరేష్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ మలేరియా తీవ్రత తగ్గింది.. మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఇప్పటికే మొదటి రౌండు సింథటిక్ ఫైరాత్రిన్ స్ప్రేయింగ్ జరిగింది. రెండో రౌండు కూడా విస్తృతంగా చేస్తున్నాం. ఆవాస గ్రామాలతో పాటు వసతి గృహాల్లో సైతం స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే మలేరియా తగ్గుముఖం పట్టింది. – శ్రీకాంత్, మలేరియా నివారణ కన్సల్టెంట్ -
గులియన్ బరి డేంజర్ మరి
పెద్దపల్లి జిల్లాలో ఆయనో వైద్యుడు. రెండ్రోజులుగా రొటావైరస్ వ్యాక్సిన్పై వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాడు. ఏడాదిలోపు పిల్లలకు వేసే ఆ వ్యాక్సిన్ను ఎలా వేయాలో తనకుతానే నోట్లో వేసుకొని చూపించాడు. ఏమైందో ఏమోకానీ ఆ రాత్రికి ఆయనకు విరోచనాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున లేద్దామనుకునే సరికి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో కంగారుపడిన వైద్యుడి కుటుంబసభ్యులు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తదుపరి వైద్యం కోసం ఆయన్ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడక్కడ చికిత్స పొందుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రాష్ట్రంలో అత్యంత సీనియర్ మంత్రి. స్వయానా ఆయన తోడల్లుడి కుమారుడికి ఒక్కసారిగా కాళ్లు, చేతులు పడిపోయాయి. శరీరానికి అది వ్యాపిస్తోంది. కంగారుపడిన తోడల్లుడు వెంటనే మంత్రికి సమాచారం ఇచ్చారు. దీనిపై సంబంధిత మంత్రి వైద్యులను సంప్రదించారు. దీనికి కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స అందిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ ఈ రెండే కాదు రాష్ట్రంలో ఇలాంటి కేసులు పలుచోట్ల నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య వర్గాలు గుర్తించాయి. ఈ వ్యాధిని గులియన్ బరి సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్) అంటారు. కాళ్లు, చేతులు చివరకు శరీరం మొత్తం వ్యాపించి నరాలు పనిచేయకుండా చచ్చుపడిపోతాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం సంభవించే అవకాశముందని వైద్య ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. విష జ్వరాల తర్వాత వచ్చే అవకాశం.. ప్రస్తుతం వైరల్ ఫీవర్లు గణనీయంగా ఉంటుండటంతో వాటితోపాటు అక్కడక్కడా జీబీ సిండ్రోమ్ ఛాయలు కనిపిస్తున్నాయి. విషజ్వరాలు వచ్చిపోయాక మనిషిలో నీరసం ఉంటుంది. ఆ సమయంలో జీబీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి రోగికి తక్షణమే స్టిరాయిడ్స్ ఎక్కించాలి. పరిస్థితి చేయిదాటకముందే ఈ వైద్యం చేయడం వల్ల ప్రమాదం ఉండదంటున్నారు. ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరల్ ఫీవర్ వచ్చిన వారిలో ఎవరికో ఒకరికి మాత్రమే వ్యాప్తిచెందే అవకాశముందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. రొటా వికటించిందా..? : ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీన్ని మొదటిసారిగా వేయాలని సర్కారు నిర్ణయించింది. రొటా వైరస్ వికటించడం వల్లే ఆ డాక్టర్కు జీబీ సిండ్రోమ్ సోకిందన్న చర్చ జరుగుతోంది. అయితే అటువంటిది జరిగే అవకాశం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. జీబీ సిండ్రోమ్ తీవ్రతపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సహా పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. దీని వ్యాప్తి జరగకుండా అప్రమత్తం కావాలని ఆదేశించారు. రెండు, మూడు శాతం కేసుల్లో ప్రాణాపాయం వైరల్ ఫీవర్లు వచ్చి పోయాక జీబీ సిండ్రోమ్ రావడానికి అవకాశముంది. ప్రస్తుతం వైరల్ సీజన్ ఉండటం వల్ల ఈ రెండు, మూడు నెలల్లో ఎవరికో ఒకరికి జీబీ సిండ్రోమ్ రావడానికి కొంతమేర అవకాశం ఉంది. అత్యంత తక్కువ మందిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. 7 నుంచి 10 రోజులపాటు క్రమంగా పెరిగి, తదుపరి చేసే వైద్యంతో తగ్గిపోతుంది. రెండు, మూడు శాతం కేసుల్లో మాత్రమే ప్రాణాపాయం ఉంటుంది. – డాక్టర్ చంద్రశేఖర్,చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో ఆస్పత్రి -
వ్యాధుల పంజా!
మన్యంపై వ్యాధులు పంజా విసురుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఈ నీటినే స్థానికులు వినియోగించి రోగాలబారిన పడుతున్నారు. టైఫాయిడ్, విషజ్వరాల బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. టైఫాయిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో వైద్యాధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. జ్వరపీడితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వ్యాధులు మరింత విజృంభించకముందే అధికారులు అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖపట్నం , అరకులోయ: వ్యాధులు విజృంభిస్తుండడంతో మన్యం వాసులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీటి వనరులు లేకపోవడంతో ఊటగెడ్డలు, గ్రావీటి తాగునీటి పథకాల ద్వారా సేకరించిన నీటినే గిరిజనులు వినియోగిస్తున్నారు. దీంతో వ్యాధులబారిన పడుతున్నారు. కొద్దిరోజులుగా మన్యంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వైరల్, టైఫాయిడ్ జ్వర పీడితులే అధికంగా వస్తున్నారు. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాలకు చెందిన రోగులు అరకులోయలోని ప్రాంతీయ ఆస్పత్రికి వైద్యం కోసం తరలిస్తున్నారు. ఈ సీజన్లో మలేరియా జ్వరాల తీవ్రత తక్కువుగా ఉండగా, వైరల్, టైఫాయిడ్ జ్వరాల కేసులు అధికమయ్యాయి. నెల రోజుల వ్యవధిలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో 69 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. దగ్గు, జలుబుతో కూడిన వైరల్ జ్వరాల కేసులు కూడా అ«ధికంగానే ఉన్నాయి. అనంతగిరి, లుంగపర్తి, పినకోట, ఉప్ప, హుకుంపేట, డుంబ్రిగుడ, కిల్లోగుడ, పెదబయలు, రూడకోట, గోమంగి, ముంచంగిపుట్టు సీహెచ్సీల్లో కూడా జ్వర పీడితుల ఓపీ అధికంగా ఉంది. గిరిజన గ్రామాల్లో పర్యటించే వైద్యసిబ్బందిని కూడా జ్వరపీడితులు కలిసి వైద్యసేవలు పొందుతున్నారు. మలేరియా కేసుల తీవ్రత లేనప్పటికీ కలుషిత నీటి వినియోగం కారణంగా వ్యాప్తి చెందే టైఫాయిడ్, వైరల్ జ్వరాల తీవ్రతపై వైద్యబృందాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. కలుషిత నీరే ఆధారం గిరిజనులకు సురక్షిత తాగునీరును అందించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఊటనీటిపైనే ఆధారపడుతున్నారు. గత్యంతరంలేని పరిస్థితిలో ఈ నీటినే తాగి రోగాల బారిన పడుతున్నారు. 11 మండలాల పరిధిలోని 244 పంచాయతీల్లో 3,759 గిరిజన గ్రామాలు ఉండగా, గ్రావీటి, పెద్ద తరహ తాగునీటి పథకాలు ఉన్నవి 1288 గ్రామాలేనని ఐటీడీఏ గణాంకాలు చెబుతున్నాయి. 1242 గ్రామాల్లో గిరిజనులు తాగునీటి కుండీలు, తాగునీటి బావులపై ఆధారపడుతున్నారు. అయితే వర్షాలు కురిసే సమయంలో నీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఎప్పటికప్పుడు కుండీలు, బావుల్లో క్లోరినేషన్ పనులు చేపట్టకపోవడంతో కలుషిత నీటిని సేవిస్తున్న గిరిజనులు వైరల్, టైఫాయిడ్ జ్వరాలకు గురవుతున్నారు. సౌర పంపులు ఉన్న 93 గ్రామాలలో తాగునీరు సురక్షితంగా ఉండడంతో ఆయా గ్రామాలలో గిరిజనులు సీజనల్ వ్యాధులకు దూరంగానే ఉన్నారు. 1365 పంపింగ్, గ్రావీటి పథకాలను నిర్మించినప్పటికీ ట్యాంకులను శుభ్రం చేసే పనులు సక్రమంగా జరగడం లేదు. కొండల నుంచి వృథాగా పోతున్న నీటిని గ్రామాలకు మళ్లించే గ్రావీటి తాగునీటి పథకాలు కూడా గిరిజనుల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు కూడా తాగునీటి వనరుల క్లోరినేషన్కు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఊటగెడ్డలు, కుండీలు, గ్రావీటి పథకాలలో సేకరించిన తాగునీటిని నేరుగా వినియోగించవద్దని, కాచి చల్లార్చిన తరువాత వాడాలని వైద్యబృందాలు గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. వ్యాధులపై అప్రమత్తం టైఫాయిడ్, వైరల్ జ్వరాల తీవ్రతపై వైద్యబృందాలను అప్రమత్తం చేశాం. అన్ని పీహెచ్సీల్లో జ్వరాల నివారణకు మందులు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్సీల్లో జ్వర పీడితులకు వైద్యసేవలు కల్పిస్తున్నాం. గ్రామాలలో తాగునీటి వనరుల క్లోరినేషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పంచాయతీ అధికారులను కోరాం. కాచి చల్లార్చిన నీటినే వినియోగించాలని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. –డాక్టర్ కె.లీలాప్రసాద్, ఏడీఎంహెచ్వో, పాడేరు ఐటీడీఏ -
విషజ్వరాలతో విలవిల!
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వాటితో ఒక్క సెప్టెంబరు నెలలోనే 1,853 మంది మృత్యువాత పడ్డారంటే రాష్ట్రంలో జ్వరాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. సగటున రోజుకు 62మంది మరణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వ్యాధుల తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా ప్రభుత్వం మాత్రం విష జ్వరాలు లేనేలేవంటోంది. సాధారణ జ్వరాలు మాత్రమే ఉన్నాయని.. మరణించిన వారు కూడా ఇతర కారణాలతో చనిపోయిన వారేనని బుకాయిస్తోంది. ఓ వైపు వేధిస్తున్న వ్యాధులు.. మరోవైపు సర్కార్ నిర్లక్ష్యం వెరసి.. పేద రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. పరీక్షలు చేయించుకుని, మందుబిళ్లలు తెచ్చుకుని ఉపశమనం పొందుదామని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు ఎప్పుడొస్తారో, మందుబిళ్లలు దొరుకుతాయో లేదో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇక కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల తీరయితే సరేసరి. వచ్చిన వారిని బెంబేలెత్తిస్తూ జేబులు గుల్లచేసి వదిలిపెడుతున్నారు. సమన్వయలోపం.. బాధితులకు శాపం వాతావరణ మార్పులు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. అధ్వాన్న పారిశుధ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జ్వరాల నివారణ ఆరోగ్య శాఖదేనని.. కాదు, స్థానిక యంత్రాంగం పారిశుధ్యాన్ని మెరుగుపర్చుకోకపోవడం వల్లే ఇదంతానని ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తుండడంతో శాఖల మధ్య సమన్వయలోపం బాధితులకు శాపంలా మారింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలున్నాయి. కాగితాలపైనే ‘దోమల దండయాత్ర’ దోమలపై దండయాత్ర అంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు.. ఆచరణలో మాత్రం చతికిల పడింది. అన్ని శాఖలను సమన్వయపరుస్తూ దోమలపై దండయాత్ర సాగించడానికి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. ఇందుకోసం అప్పట్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. అయినా ‘దండయాత్ర’ అతీగతీ లేకుండాపోయింది. జిల్లాల్లో పరిస్థితి ఘోరం ♦ శ్రీకాకుళం జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఎక్కువ శాతం ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల వారే విషజ్వరాల బారినపడ్డారు. ప్లేట్లెట్స్ తగ్గుముఖం పడుతున్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇదొక కొత్తరకం వైరస్ అని, ఇదేమిటో అంతుచిక్కడంలేదని వైద్యులు చెబుతున్నారు. గత నెలలో ఒక్క శ్రీకాకుళం రిమ్స్లోనే 51మంది బలయ్యారు. ♦ విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలోనే 41మంది మరణించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 35 మంది వరకు డెంగీతో చనిపోయారు. విషజ్వరాలతో అనేకమంది మరణించారు. వీరిలో గ్రామీణ ప్రాంత ప్రజలే అధికం. ఇంకా 5 వేల మంది వరకు జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ♦ విశాఖలో మురికివాడల్లో నివసిస్తున్న వారికి విష జ్వరాలు ఎక్కువగా సోకుతున్నాయి. ఇక్కడ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు గ్రామీణులే. నర్సీపట్నం, కోటవురట్ల, సబ్బవరం, చోడవరం, అనకాపల్లి, ఎస్కోట, లక్కవరం తదితర గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. కేజీహెచ్ పీడియాట్రిక్స్ విభాగంలో మంగళవారం నాటికి 20 మంది చిన్నారులు జ్వరంతో చికిత్స పొందుతున్నారు. ఒక్క కేజీహెచ్లోనే ప్రభుత్వ రికార్డుల ప్రకారం 224 మంది చనిపోయారు. అంతేకాక.. జిల్లావ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో వందలాది మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. కోస్తాను కుదిపేస్తున్న డెంగీ, మలేరియా ♦ తూర్పుగోదావరి జిల్లాను గత నెల రోజులుగా డెంగీ వ్యాధి కుదిపేస్తోంది. దీనిబారిన పడినవారు ఆర్థికంగా కుదేలైపోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలైతే ఖరీదైన వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు. వైద్యాధికారులు మాత్రం మరణాలేవీ లేవంటున్నారు. మరోవైపు.. జిల్లాను కలవరపెడుతున్న డెంగీ జ్వరాలను అధికార యంత్రాంగం అదుపు చేయలేకపోతోంది. అధికారికంగా 302 కేసులే నమోదైనా అనధికారికంగా రోగుల సంఖ్య పది వేలకుపైనే ఉంటుందని అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కాకినాడ జీజీహెచ్, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఒక్క సెప్టెంబరు నెలలోనే 360మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ♦ పశ్చిమ గోదావరి జిల్లా కూడా విషజ్వరాల బారిన పడి మంచమెక్కింది. ఇక్కడ కూడా డెంగీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైద్య అధికారులు, ప్రభుత్వం డెంగీ మరణాలు లేవని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. గత మూడు నెలల్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి 47 మంది డెంగీ రోగులు వచ్చారు. అనధికారికంగా జిల్లాలో డెంగీ మరణాలు సంభవించిన దాఖలాలు ఉన్నా.. అధికారులు వాటిని సాధారణ మరణాలుగా చూపిస్తున్నారు. వరదలు వచ్చి తగ్గడంతో ఏజెన్సీతోపాటు వరద పీడిత ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా జిల్లాలో మలేరియా, డెంగీ కేసుల్లో అధిక శాతం ఏజెన్సీతోపాటు డెల్టా ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలోనే ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 56మంది మృత్యువాతపడ్డారు. ♦ కృష్ణా జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న భేదం లేకుండా డెంగీ, టైఫాయిడ్, మలేరియా విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గత ఐదు నెలల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో జిల్లా వ్యాప్తంగా 1,485 కేసులు నిర్ధారణకు వచ్చాయి. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య ఇక వేల సంఖ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రుల్లో ఒక సెప్టెంబరులోనే మొత్తం 263మంది మృత్యువాత పడ్డారు. ♦ గుంటూరు జిల్లాలోని ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, ఫిరంగిపురం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, పెదపలకలూరు, నూతక్కి, సంగం జాగర్లమూడి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లి, గుంటూరు నగరంలో జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో ఒక్క సెప్టెంబరులో మొత్తం 293 మరణాలు సంభవించాయి. ♦ ప్రకాశం జిల్లాలోనూ డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం వీటిని ఒప్పుకోవడం లేదు. సాధారణ జ్వరాలేనని చెబుతున్నప్పటికీ ఒక్క ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో 56మంది విషజ్వరాలకు బలయ్యారు. ♦ శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లాలోనూ అనేకమంది డెంగీ, మలేరియా బారిన పడ్డారు. నెల్లూరు జీజీహెచ్లోనే సెప్టెంబరులో 88మంది మరణించారు. రాయలసీమలో జ్వరాలు, ఎండల తీవ్రత ఎక్కువే ♦ వైఎస్సార్ జిల్లాలో దోమల తీవ్రత, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటివరకు 167 మలేరియా కేసులు, 12 డెంగీ కేసులు, 2552 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వర్షం జాడలేకపోవడంతో ఉష్ణోగత్రలు వేసవిని తలపిస్తున్నాయి. కడప రిమ్స్లో సెప్టెంబరు ఒక్క నెలలోనే 77మంది విష జ్వరాలకు బలయ్యారు. ♦ అనంతపురం జిల్లానూ మలేరియా వణికిస్తోంది. జ్వరాల బారినపడుతున్న వారిలో గ్రామీణులే అధికం. జిల్లాలోని 87 పీహెచ్సీలకు రోజూ దాదాపు 60 వేల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరిలో 30 శాతం మంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం సర్వజనాస్పత్రికి రోజూ 2 వేల మంది రోగులు వస్తున్నారు. వీరిలో ఎక్కువమంది జ్వరపీడితులే. గత నెల అనంతపురంలోని జీజీహెచ్లో మొత్తం 98మంది జ్వరాల కారణంగా మరణించారు. ♦ కర్నూలు జిల్లాలోనూ మలేరియా కేసులు అధికంగానే నమోదయ్యాయి. నంద్యాల, కర్నూలు, ఆదోనిల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 146 అనుమానిత డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక్క కర్నూలు జీజీహెచ్లోనే సెప్టెంబరులో 147 మరణాలు సంభవించాయి. ♦ తిరుపతి రుయా ఆస్పత్రిలో 99మంది మృత్యువాత పడ్డారు. గత నెల రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో మృతి చెందిన వారి వివరాలు.. ఆస్పత్రి మృతుల సంఖ్య జీజీహెచ్, గుంటూరు 293 జీజీహెచ్, కాకినాడ 277 కేజీహెచ్, విశాఖపట్నం 224 జీజీహెచ్, విజయవాడ 210 జీజీహెచ్, కర్నూలు 147 రుయా, తిరుపతి 99 జీజీహెచ్, అనంతపురం 98 జీజీహెచ్, నెల్లూరు 88 డీహెచ్, రాజమండ్రి 83 రిమ్స్, కడప 77 డీహెచ్, ఏలూరు 56 రిమ్స్, ఒంగోలు 56 డీహెచ్, మచిలీపట్నం 53 రిమ్స్, శ్రీకాకుళం 51 డీహెచ్, విజయనగరం 41 -
ఉత్తరప్రదేశ్లో విజృంభిస్తున్న విష జ్వరాలు
-
జ్వరం..కలవరం
మునుపెన్నడూ లేనంతగా సెప్టెంబరు తొలి వారంలోనూ ఎండలు మండుతున్నాయి. అప్పుడప్పుడు పలకరింపుగా వరుణడు ప్రత్యక్షమవుతున్నాడు. అడపాదడపా జల్లులు కురిపిస్తున్నాడు. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు జ్వరాలకు కారణమవుతున్నాయి. జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య రాన్రానూ పెరుగుతోంది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ప్రధానాస్పత్రుల్లో జ్వరపీడితులు పెరుగుతున్నారు. చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రాయలసీమ ప్రాంత పెద్దాస్పత్రి రుయాలో వైరల్ ఫీవర్తో రోజుకు 250 మందికి పైగా జనరల్ మెడిసిన్ ఓపీ విభాగానికి వస్తున్నారు. నిత్యం ఓపీ రద్దీగానే కనిపిస్తోంది. సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులపై వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. కొంత కాలంగా అడపాదడపా చిన్నపాటి వర్షం కురుస్తోంది. వెంటనే ఎండ దంచేస్తోంది. దీంతో ప్రజలు వ్యాధులతో సతమతమవుతున్నారు. రుయా ఓపీకి రోజూ 1,500 నుంచి 2వేల మంది వస్తుంటారు. వీరిలో తీవ్రమైన జ్వరంతో వస్తున్న వారు 250 మందికిపైగా ఉన్నారు. రక్త పరీ క్షల కోసం సెంట్రల్ ల్యాబ్ ముందు రోగులు గంటల తరబడి నిరీక్షించా ల్సిన దుస్థితి నెలకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. తిరుపతిలోని కార్పొరేట్ ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నగరంలో పేరు పొందిన 20 ఆస్పత్రుల్లో జ్వరంతో రోగులతాకిడి పెరిగింది. డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైనట్లు సమాచారం. చిన్నపిల్లల ఆస్పత్రిలో జ్వరంతో వస్తున్న చిన్నారులసంఖ్య పెరుగుతోంది. పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లే వారికి రక్త పరీక్షల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారని రోగులు గగ్గోలు పెడుతున్నారు. సీజనల్ మార్పులకు అనుగుణంగా వచ్చే రోగాలపై వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మదనపల్లెలో రోగాల దాడి మదనపల్లె మున్సిపాలిటీతో పాటు పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు విషజ్వరాల బారిన పడి అల్లాడిపోతున్నారు. మలేరియా, టైఫాయిడ్, తదితర విషజ్వరాలతో ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులు రోగులతో కనిపిస్తున్నాయి. మదనపల్లె జిల్లా, íపీహెచ్సీ( ప్రాథమిక వైద్యకేంద్రాల)ల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లా ఆస్పత్రితో పాటు, రూరల్ పరిధిలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. డాక్టర్లు, ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలతో పాటు ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఫీల్డు అసిస్టెం ట్లు, అటెండర్లు, యూడిసి, సీనియర్ అసిస్టెంటుల పోస్టులు 81కి గానూ 39కిపైగా ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఆస్పత్రుల నుంచి వెనుతిరగాల్చి వస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీలో డాక్టర్లు అందుబాటులో ఉండాలి. కానీ వారు 10.30కి వచ్చి 12 గంటలకే వెళ్లిపోతున్నారు. పీహెచ్సీలు, సబ్సెంటర్లలో డాక్టర్లు వారానికి రెండు మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఇప్పటి వరకు డెంగీ, మలేరియా, విషజ్వరాలతో నలుగురు చనిపోయారనే సమాచారం ఉంది. ఆరు నెలల వ్యవధిలో 1017 మంది విషజ్వరాల బారిన పడ్డారు. మెరుగైన సేవలందిస్తున్నాం తీవ్రమైన జ్వరంతో రుయాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. అత్యవసర విభాగంలో 24 గంటల ల్యాబ్తో పాటు సెంట్రల్ ల్యాబ్ను కూడా అందుబాటులో ఉంచాం. జ్వర బాధితులకు వేగవంతంగా రక్త పరీక్షలు నిర్వహించేలా ఇప్పటికే టెక్నీషియన్లకు ఆదేశాలు జారీ చేశాం.– డాక్టర్ సిద్ధానాయక్, సూపరింటెండెంట్, రుయా ఆస్పత్రి, తిరుపతి -
మంచంపట్టిన ఏజెన్సీ
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో వ్యాధులు ముసురుకున్నాయి. గత 2 నెలలుగా అధిక వర్షాలు కురవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు గుంటల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో దోమలు పెరిగి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గ్రామాల్లో తాగునీరు వనరుల్లో క్లోరినేషన్ పనులు నామమాత్రంగానే ఉండడంతో ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డయేరియా, కామర్లు వంటి వ్యాధులతో బాధపడుతూ మంచాన పడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, కామర్లు, డయేరియాతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా తలపోటు, దగ్గు, జలుబు బాధపడేవారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏజెన్సీలోని 5 మండలాల్లోని 14 పీహెచ్సీలు జ్వరపీడితులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వ్యాధులబారిన పడ్డవారు క్యూ కడుతున్నారు. గ్రామాల్లో మురికినీరు కాల్వల్లో చెత్తాచెదారం నిండి దుర్గంధం వెదజల్లుతుంది. దోమల బెడద ఎక్కువగా ఉండడంతో రాత్రిపూట ప్రజలు కంటిమీద కునుకుకూడా తీయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి విడత గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేశామని చెబుతున్న అధికారులు రెండో విడతలో కొన్ని గ్రామాల్లోనే పనులు చేసి చేతులు దులుపుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఏడాదిలో 45 వేల మంది జ్వరపీడితులు ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 14 ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది సుమారు 45 వేల మందికి పైగా జ్వరపీడితులు నమోదయ్యారు. అదేవిధంగా 181 మలేరియా, 270 కామెర్లు, 5 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రభుత్వ వైద్యాధికారులు వెల్లడిస్తున్నవి. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అనేకమంది జ్వరపీడితులు నమోదయ్యారు. ఆ ప్రకారం బాధితులు రెండురెట్లు ఉంటారని అంటున్నారు. ఈ ప్రాంతంలో 262 మలేరియా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వాటిలో తొలివిడత స్ప్రేయింగ్ పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెండో విడత ఇప్పటివరకూ 120 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేస్తున్నామని చెప్పారు. మిగిలిన గ్రామాల్లో వర్షాల కారణంగా స్ప్రేయింగ్ పనులు ఆలస్యమైనట్టు వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. అయితే గ్రామాల్లో మాత్రం పారిశుద్ధ్యలోపం వల్ల దోమలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వ్యాధులతో బాధపడేవారికి మెరుగైన వైద్యసేవలకు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
‘ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తా’
సాక్షి, విజయనగరం : విషజ్వరాలపై స్పందించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైఎస్సార్సీపీ నేత, సాలూరు ఎమ్యెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారన్నారు. ప్రజలు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. -
వణుకుతున్న తోటపాలెం
విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు తోటపాలెంలో విష జ్వరాలు ప్రబలాయి. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో డెంగీ వ్యాధి సోకినట్లు వచ్చిన ఉదంతంపై చర్యలు తీసుకున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం.. దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడం.... తదితర సమస్యలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ జ్వరపీడుతుల సంఖ్య తగ్గకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, పీడిస్తున్న జ్వరాలపై మున్సిపల్ యంత్రాంగానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కమిషనర్ టి.వేణుగోపాలరావు ఆ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఎంహెచ్ఓ డాక్టర్ శివకుమార్తో పలువురు సిబ్బందిని పంపించారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తమ వంతు చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. స్వలాభం కోసం చూసుకోకండి... పట్టణంలోని తోటపాలెం ప్రాంతంలో ప్రబలుతున్న విషజ్వరాలపై ఎంహెచ్ఓ డాక్టర్ శివకుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రోహితకు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుందీ.. తీసుకున్న వైద్యంపై ఆరా తీశారు.. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నామని చెప్పడంతో స్పందించిన ఎంహెచ్ఓ ఆర్ఎంపీ నిర్వహిస్తున్న చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు. రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు జ్వరంతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. స్వలాభం కోసం చూసుకుని రోజుల తరబడి వైద్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పారు. తోటపాలెంలో జ్వరాల తగ్గుముఖం పట్టేందుకు వారం రోజుల ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఇందులో భాగంగా రెండు ఫాగింగ్ మిషన్లతో ఫాగింగ్ చేయడంతో పాటు మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్ సహాయంతో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. -
అదుపులోకి రాని జ్వరాలు
భీమిని(బెల్లంపల్లి): కన్నెపల్లి మండల కేంద్రంలో విషజ్వరాలు ఇంకా అదుపులోకి రాలేదు. గత వారం రోజులుగా జ్వరాలు ప్రబలుతున్నాయి. ఆదివారం నాటికి విషజ్వరాల బారిన పడి ముగ్గురు మృతి చెందారు. కన్నెపల్లి గ్రామ సాక్షరభారత్ సమన్వయకర్త ఏదుల మల్లేశ్(40) శనివారం మధ్యాహ్నం కరీంనగర్ ఆస్పత్రిలో మృతి చెందగా, స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన చింతపురి వెంకక్క(70) శనివారం ఉదయం జ్వరంతో ఇంట్లోనే మృతి చెందింది. ఆదివారం ఎస్టీ కాలనీలోని రాజారాం–పోసక్క దంపతుల కూతురు గురుండ్ల వనజ(19) జ్వరంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వనజ బెల్లంపల్లిలో ఇంటర్మీయెడిట్ చదువుతోంది. మరో 50 మంది వరకు జ్వరంతో మంచం పట్టారు. రోజు రోజుకూ జ్వరాల సంఖ్య పెరుగుతోంది. గ్రామంలో ఇంటికిద్దరు విషజ్వరం సోకి బాధపడుతున్నారు. ఆదివారం జిల్లా వైద్యాధికారి భీష్మా వైద్య సిబ్బందితో వెళ్లి కన్నెపల్లి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి కొంత మందిని 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రకాశ్రావు, జిల్లా పంచాయతీ అధికారి నరేందర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవో రాధాకృష్ణ, తహసీల్దార్ విజయానంద్ గ్రామంలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. డీఎంఅండ్హెచ్వో మాట్లాడుతూ మృతి చెందిన వారు విషజ్వరంతో మృతి చెందలేదని వేర్వేరు కారణాలతో మృతి చెందారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుండగా డీఎంఅండ్హెచ్వో ఇలా మాట్లాడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడంపై సర్పంచ్ గురుండ్ల సత్తమ్మ, పంచాయతీ కార్యదర్శి జోసఫ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని వారికి సూచించారు. గ్రామంలో నీటి నిలువలు లేకుండా చూడాలని క్లోరినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక చర్యలు: కలెక్టర్ కన్నెపల్లి మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ అధికారి గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖతో పాటు పలు శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించారని, కాలనీలో ఒకే బావి ఉండడంతో ప్రస్తుతం ఉన్న ఓవర్హెడ్ ట్యాంకు వద్ద బురద నీరు చేరి నీరు కలుషితం అవుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో ఆ కాలనీ మొత్తం జ్వరాల బారిన పడుతున్నారన్నారు. ఈ ఓవర్హెడ్ ట్యాంకు క్లోరినేషన్తో పాటు చుట్టూ ప్లాట్ఫాం ఏర్పాటు చేయించి తాగునీటి కోసం బోర్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. అంతేకాకుండా గ్రామంలో పారిశుధ్యంపై గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. కన్నెపల్లి మండలాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత తహసీల్దార్, ఎంపీడీవో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, వైద్య సిబ్బంది సందర్శించి వైద్య శిబిరంతో పాటు పారిశుధ్యం కోసం ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
బుడ్డోడికి జ్వరమొచ్చింది
సాక్షి, కామారెడ్డి:సాధారణంగా ఫిబ్రవరి మాసాన్ని ‘హెల్తీ సీజన్’గా పేర్కొంటుంటారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.నెల రోజులుగా జిల్లాలో వైరల్ ఫీవర్స్తో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, దగ్గుతో చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గుతో గొంతునొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దగ్గడం వల్ల బాడీపెయిన్స్ పెరుగుతున్నాయి. దీంతో వారు మరింత నీరసించిపోతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు న్యుమోనియా బారిన పడుతున్నారు. దీంతో పిల్లలకు మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పులకు తోడు నీటికాలుష్యం, చల్లగాలి, దుమ్ము, ధూళి, పొగ, చల్లని పదార్థాలు తీసుకోవడం, ప్రయాణాలు వంటి సమస్యలతో పిల్లలు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. వ్యాధుల బారిన వేలాది మంది.. చిన్న పిల్లల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏడాది నుంచి నాలుగేళ్లలోపు పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లాలో 30కి పైగా చిన్న పిల్లల ఆస్పత్రులు ఉన్నాయి. ఏ ఆస్పత్రికి వెళ్లినా నిరంతరం పదుల సంఖ్యలో పేషెంట్లు కనిపిస్తున్నారు. ఆస్పత్రుల్లోని బెడ్లన్నీ పిల్లలతో నిండిపోతున్నాయి. చిన్నచిన్న ఆస్పత్రులకు సైతం నిత్యం 20 నుంచి 30 మంది పిల్లలు వైద్యం కోసం వస్తున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు ఉన్న కొన్ని ఆస్పత్రులకు రోజు కనీసం 50 మందికి తగ్గకుండా వస్తున్నారు. పేరున్న ఆస్పత్రులకు రోజూ వంద మందికిపైగానే పిల్లల్ని తీసుకువస్తున్నారు. వైద్యులు క్షణం తీరికలేకుండా చూసినా ఓపీ తగ్గడం లేదు. నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికిపైగా చిన్నారులు ఆస్పత్రుల్లో చేరినట్టు అంచనా.. హెల్తీసీజన్లో విచిత్ర పరిస్థితి... ఫిబ్రవరి మాసంలో వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండకపోవడంతో ఈ సమయాన్ని హెల్తీసీజన్గా పేర్కొంటారు. అలాంటిది ఈసారి మాత్రం వాతావరణంలో వచ్చిన అనేక మార్పులతో వ్యాధుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా చిన్నారులు ఈ మార్పును తట్టుకోలేక అనారోగ్యానికి గురవుతున్నారు. సకాలంలో వైద్యం అందని పక్షంలో న్యుమోనియా బారిన పడుతున్నారు. రక్తహీనతకు తోడు అనారోగ్యానికి గురికావడం వల్ల ప్లేట్లెట్స్ పడిపోయి తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ♦ కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. ♦ ఇంటా, బయట దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. ♦ పడుకునే బట్టలను శుభ్రంగా ఉంచాలి. ♦ జలుబు చేస్తే ఆవిరి పట్టాలి. ♦ పౌష్టికాహారం ఇవ్వాలి. ద్రవాహారం ఎక్కువగా ఇస్తుండాలి. పిల్లలకు రెగ్యులర్గా ఫ్రూట్స్, మిల్క్, ఎగ్ వంటివి ఇవ్వాలి. ♦ ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ♦ ఐస్క్రీమ్లు, కూల్డ్రింక్స్ ఇవ్వవద్దు. వాతావరణంలో మార్పులతో.. ఈసారి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. నెలరోజులుగా పిల్లలు జ్వరాలబారిన పడుతు న్నారు. సాధారణంగా ఈ సీజన్లో ఇలాంటి సమస్యలు రావు. కానీ వాతావరణంలో మార్పులు, శుభ్రమైన నీరు తీసుకోకపోవడం, చల్లని పదార్థాలు తీసుకోవడం, దుమ్ముధూళిలో తిరగడంతో సమస్యలు వస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు మరింత నీరసించిపోయి న్యుమోనియా బారిన పడుతున్నారు. తగిన జాగ్రత్తలతో వ్యాధులను నివారించవచ్చు. పిల్లలకు కాచి చల్లార్చిన నీటినే తాగించాలి. పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పౌష్టికాహారం అందించాలి. – రాజేశ్వర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, కామారెడ్డి -
వణికిస్తున్న వైరల్ ఫీవర్
సిరిసిల్ల జ్వరపీడితులకు ఒక్కసారిగా రక్తకణాలు తగ్గిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వంద మందికి రక్తపరీక్షలు చేస్తే.. 60 మందికి రక్తకణాలు పడిపోయాయని ఓ ప్రైవేటు డాక్టర్ ఒక్కరు చెప్పారు. జలుబు, తలనొప్పి, దగ్గు, దమ్ముతోపాటు, కాళ్లు, కీళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఎన్నిమందులు వాడినా తగ్గకపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి మొండి జ్వరాలు గతంలో ఎన్నడూ చూడలేని మరో ప్రభుత్వ వైద్యుడు చెప్పడం గమనార్హం. దోమల విజృంభన.. దోమలు ఒక్కసారిగా విజృంభించాయి. ఇటీవల మున్సిపల్ అధికారులు పందులను పట్టణం నుంచి తరలించినా దోమల ఉధృతి తగ్గలేదు. కార్మిక వాడలతోపాటు అన్నిప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రధాన వీధుల్లో రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా.. మోరీనీళ్లు రోడ్లపైనే పారుతున్నాయి. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణంలో దోమలు విస్తరిస్తున్నా మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు తీసుకోవడంలేవు. మోరీల్లో నిల్వ ఉండే నీటి ద్వారానే దోమలు విజృంభిస్తున్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరికి.. ఈ చిత్రాల్లోని ఇద్దరు చిన్నారులు దీక్షిత(7), గాయత్రి(7నెలలు). వీరి తల్లిదండ్రులు ప్రగతినగర్కు చెందిన రోషిణి–కమలాకర్. దీక్షతకు పదిరోజుల క్రితం జ్వరం రాగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. మందులు వాడగా మళ్లీ జ్వరం వచ్చింది. మూడు రోజుల క్రితం గాయత్రి కూడా జ్వరం బారినపడింది. పిల్లలిద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైరల్ ఫీవరే ఎక్కవ పిల్లలకు వైరల్ ఫివర్ అధికంగా వస్తోంది. రోజుల తరబడి జ్వరాలు తగ్గడంలేదు. ప్లేట్లెట్స్ కూడా తగ్గుతున్నాయి. నేను రోజుకు వంద మంది పిల్లలను పరీక్షిస్తున్నా. ఇరవై మంది అడ్మిట్ అవుతున్నారు. జ్వరాలు తగ్గినా మళ్లీ వస్తున్నాయి. దమ్ము, దగ్గు సమస్యలు ఉన్నాయి. – మురళీధర్రావు, పిల్లల వైద్యుడు ఓపీ సంఖ్య పెరిగింది జ్వరాలతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం మా ఆస్పత్రికి రోజూ 700 – 800 మంది వస్తున్నారు. జ్వరం తీవ్రంగా ఉంటే అడ్మి ట్ చేసుకుంటున్నాం. మిగతా వారికి వైద్యం చేసి ఇళ్లకు పంపిస్తున్నాం. మందుల కొరత లేదు. – ఆర్.తిరుపతి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్రకాశం జిల్లాను వణికిస్తున్న విషజ్వరాలు
-
జ్వరాల విజృంభణ
అనంతపురం మెడికల్ : జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మరీముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒకవైపు తీవ్రమైన మండలు, మరోవైపు పారిశుద్ధ్యలోపంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 80 పీహెచ్సీలు, 15 సీహెచ్సీలు, రెండు ఏరియా ఆస్పత్రులు, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రులు ఉన్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా సర్వజనాస్పత్రి ఉంది. క్షేత్రస్థాయిలో రోగాల నియంత్రణ చేయాల్సిన పీహెచ్సీల్లో నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నారు. అసలు వైద్యులు ఉంటున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. పైగా ఇక్కడ సేవలపై నమ్మకం లేని ప్రజలు రెఫరల్ సెంటర్లకు వెళ్తున్నారు. చాలా మంది సర్వజనాస్పత్రిని నమ్ముకుని వస్తున్నారు. రోజూ 1500 మందికి పైగా ఔట్ పేషెంట్స్ వస్తుండగా వీరిలో సగానికి పైగా కేసులు జ్వరంతో వచ్చినవే ఉంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సరిగా అందకపోవడంతో ప్రధానంగా చిన్న పిల్లలను ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా నష్టపోతున్నారు. నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు జ్వరం రోగాలతో విలవిల్లాడుతుంటే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. వేసవి నేపథ్యలో ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా అవేం పట్టడం లేదు. జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే దాఖలాలు కానరావడం లేదు. కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతూ సమీక్షలతో సరిపెడుతున్నారు. డివిజన్ల వారీగా అధికారులకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించినా ప్రయోజనం లేకుండాపోతోంది. తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోని పీహెచ్సీలకు వెళ్లి రావడం మినహా గ్రామాల్లో పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. వాస్తవానికి చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై పీహెచ్సీల వారీగా సిబ్బంది అవగాహన కల్పించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. పంచాయతీలు, మునిసిపాలిటీల్లో పైపులు పగిలిపోయి తాగునీరు కలుషితమవుతోంది. ఓవర్ హెడ్ ట్యాంకులు క్లోరినేషన్ చేయడం లేదు. ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ప్రజలు రోగాలతో తల్లడిల్లుతున్నారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన కోదండరాం
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల ప్రజలు విషజ్వరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాలోని బోనకల్ మండలం రావినూతల గ్రామంలో విష జ్వరాల బారిన పడి కొందరు వ్యక్తులు మృతిచెందారు. మృతిచెందిన వారి కుంటుంబాలను ఆదుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. విషజ్వరాల బారినపడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకొని తక్షణమే అక్కడ నివారణ చర్యలు తీసుకోవాలంటూ ఆయన కమిషన్కు ఫిర్యాదు చేశారు. -
మంచంపట్టిన బోడగుట్టపల్లి
నెల రోజుల్లో రెండోసారి ప్రబలిన విషజ్వరాలు ముగ్గురికి డెంగీ లక్షణాలు తాజాగా 20 మందికి జ్వరం ఆందోళనలో గ్రామస్తులు మొక్కుబడిగా వైద్యశిబిరాలు తూతూమంత్రంగా పారిశుధ్య పనులు బసంత్నగర్ : పాలకుర్తి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని బోడగుట్టపల్లి మళ్లీ మంచంపట్టింది. గ్రామంలోని బీసీ కాలనీలో విషజ్వరాలు ప్రబలుతున్నారుు. తాజాగా 20మంది జ్వరంతో బాధపడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి జ్వరాలు విజృంభిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన గణపతి అనసూర్యకు పది రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు. అరుునా తగ్గకపోవడంతో గోదావరిఖని, పెద్దపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఫలితం లేకపోవడంతో కరీంనగర్లోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. వారం రోజుల చికిత్స అనంతరం రెం డు రోజుల క్రితం అనసూర్యను వైద్యులు ఇంటికి పంపించారు. గత నెలలో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ మల్లేశం, బీసీ కాలనీకి చెందిన పూరెళ్ల రాజు కూడా డెంగీతో ఆస్పత్రుల్లో చేరారు. పది రోజలు కరీంనగర్లో చికిత్స పొందారు. నెలరోజుల్లో గ్రామంలో సుమారు 50 మంది జ్వరంతో ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో ముగ్గురు డెంగీ పాజిటివ్గా నిర్ధారణ అరుుంది. నెల రోజులైనా గ్రామాన్ని జ్వరాలు వీడకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది డిసెంబర్లో కన్నాల ఎస్సీ కాలనీకి చెందిన ఎల్కటూరి మల్లయ్య, అనసూర్య దంపతులు వారం రోజుల వ్యవధిలో మృతిచెందారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన ముక్కెర అజయ్ విషజ్వరంతోపాటు రక్తకణాలు తగ్గడంతో కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వేముల రాణి వరంగల్లోని ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. మొక్కుబడిగా వైద్య శిబిరాలు.. గ్రామంలో జ్వరపీడితులు ఎక్కువవుతున్నారనే స్థానికుల ఫిర్యాదు మేరకు బోడగుట్టపల్లిలో కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యం లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే ఈ శిబిరంలో హెల్త్ సూపర్ వైజర్ సీతారామయ్యతో పాటు ఏఎన్ఎం మెటీల్డా, ఆశ వర్కర్లు మాత్రమే పాల్గొని జర్వపీడితులకు మందులు పంపి ణీ చేశారు.గ్రామంలో పరిస్థితి తీవ్రంగా ఉ న్నా వైద్యులు హాజరు కాకపోవడంపై స్థాని కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డ్రెరుునేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. లోపం ఎక్కడ? కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తరచూ విషజ్వరాలు విజృంభించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అధికారులు, పాలకులు అదిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శిస్తున్నారు. కేవలం పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడే అధికారులు మొక్కుబడిగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు సమస్యకు కారణాలు విశ్లేషించడం లేదని పేర్కొంటున్నారు. దసరా పండుగ సందర్భంగా గ్రామంలో డ్రెరుునేజీలన్నీ శుభ్రం చేరుుంచారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అయితే గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంక్ లేకపోవడంతో డెరైక్ట్ పంపింగ్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో తాగునీరు కలుషితమై విషజ్వరాలు ప్రబలుతున్నాయనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలకు కారణం పారిశుధ్య లోపమా లేక కలుషిత నీరే కారణమా అనే విషయం తేల్చి జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది. రూ.70 వేలు కర్సయినయ్ నా భార్య పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. గోదావరిఖని, పెద్దపల్లి ఆసుపత్రులలో చూపించినా తగ్గలేదు. ఈనెల 7వ తేదీన కరీంనగర్కు తీసుకెళ్లినం. పరీక్షించిన వైద్యులు డెంగీ అని చెప్పిండ్రు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచినం. వైద్యానికి రూ.70 వేలు కర్సయినయ్. -
జిల్లాకు జ్వరం
నాలుగు రోజుల్లోనే 89 మందికి.. రోగులతో ఆస్పత్రులు కిటకిట 200 గ్రామాల్ని చుట్టుముట్టిన వ్యాధులు 60 మందికి డయేరియా నిర్ధారణ లో జ్వరం, కీళ్లు, ఒళ్లనొప్పుల కేసులు 999 మళ్లీ జ్వరాలు విజృంభించాయి. జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. లోపిస్తున్న పారిశుధ్యం.. వాతావరణంలో వచ్చిన మార్పులతో జిల్లాలో అనేక చోట్ల విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నాయి. ఒళ్లు.. కీళ్ల నొప్పుల బాధలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లో జ్వరాలు సోకి నలుగురు చనిపోయారు. ఇంకా చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు. సాక్షి, మంచిర్యాల : జిల్లాలో జ్వరాల ధాటికి వందలాది మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, ఆస్పత్రుల్లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. మరోపక్క.. వరదలతో పైప్లైన్ లీకేజీలు ఏర్పడి.. తాగునీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగిన ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. మరోపక్క.. లోపించిన పారిశుధ్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ లేక చాలా ప్రాంతాల్లో ప్రజ లు కలుషిత నీరే తాగుతున్నారు. ఫలితంగా డయేరియా విజృంభిస్తోంది. వర్షాకాలం వ్యా ధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్, క్లోరినేషన్, పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టాల్సిన పంచాయత్రాజ్ శాఖ విఫలమైంది. దీంతో చాలా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. ఫలితంగా వ్యాధులు చాపకింద నీరులా ప్రబలుతున్నాయి. ఇటీవల కురి సిన వర్షాలకు జిల్లాల్లో సుమారు రెండొందల పంచాయతీలను వ్యాధులు చుట్టుముట్టాయి. దడపుట్టిస్తున్న వ్యాధులు వైద్యశాఖ రికార్డుల ప్రకారం.. గడిచిన నాలు గు రోజుల్లో 89 మందికి విషజ్వరాలు సోకా యి. 60 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఒళ్ల.. కీళ్ల నొప్పులు.. లో ఫీవర్ కేసులు 999 నమోదయ్యాయి. అనధికారంగా జ్వరపీడితుల సంఖ్య 3 వేలకు పైనే ఉంటుంది. ఈ నెల 20న జన్నారం మండలం నాయకపుగూడకు చెందిన లక్ష్మీ (24) బాలింత జ్వరంతో చనిపోయింది. 21న నేరడిగొండ మండలం బోరిగాం పంచాయతీ పరిధిలోని గుత్పాల గ్రామంలో మండాడి జింగుబాపు (19) అతిసారతో చని పోగా.. 30 మంది అస్వస్థతకు గురయ్యారు. 25న ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్కు చెందిన మెస్రం అన్వంతిబాయి(18) జ్వరం సోకి ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయింది. 26న జైపూర్ మండలం భీమారంకు చెందిన బూక్య లలిత(35) జ్వరంతో చనిపోయింది. అలాగే ఈ నెల 21న కౌటాల మండలం బాబాపూర్ను జ్వరాలు చుట్టుముట్టాయి. వైద్యశాఖ అక్కడ శిబిరం నిర్వహించినా.. బాబాపూర్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ప్రస్తుతం వేమనపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పది మంది విద్యార్థులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలందించారు. అప్రమత్తమైన అధికారులు కురుస్తోన్న వర్షాలతో విషజ్వరాలు, డయేరియా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీజనల్ వ్యాధులు ఎక్కడ ప్రబలినా.. వెంటనే అక్కడికి వెళ్లి శిబిరాలు నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ.. 13 మంది వైద్యులు.. 53 పారామెడికల్ సిబ్బందితో 23 వైద్య బృందాల్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ బృందాలు జిల్లాలో 25 సమస్యాత్మక ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాయి. కలెక్టర్ జగన్మోహన్, ఐటీడీఏ పీవో కర్ణన్, డీఎంహెచ్వో జలపతినాయక్ ప్రతీరోజు జిల్లాలో వ్యాధులపై సమీక్షిస్తున్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే ఆ బృందాలు స్పందించాలని డీఎంహెచ్వో జలపతినాయక్ సంబంధిత బృంద సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క.. పల్లెల్లో విజృంభిస్తోన్న విషజ్వరాలపై పంచాయత్రాజ్ శాఖ స్పందించింది. ఇటీవల కురిసిన వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. మురికికాలువలు.. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ సున్నంతో కలిపి చల్లాలని పంచాయతీ కార్యదర్శులు సిబ్బందిని ఆదేశించినట్లు డీపీవో పోచయ్య తెలిపారు. తాగే నీటిలో క్లోరినేషన్, పైప్లైన్ లీకేజీలుంటే వెంటనే మరమ్మతులు చేసుకోవాలని పేర్కొన్నారు. పదిహేను రోజులకోసారి ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ను క్లోరినేషన్ చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ, చెత్త తొలగింపు కోసం అవసరమైతే ప్రత్యేకంగా కార్మికులను నియమించుకోవాలన్నారు. డ్రెరుునేజీ నీళ్లు బయటికి ప్రవహించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు డీపీవో తెలిపారు. ఈవోపీఆర్డీలు, డీఎల్పీవోలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో జరుగుతోన్న పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మూడు రోజులుగా జ్వరం ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు టేకం పోతయ్య. పక్కడ బెడ్పై ఉన్నది అతడి చిన్నారి కూతురు అయ్యుబాయి(3). మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరిది ఆసిఫాబాద్ మండలంలోని మాలన్గోంది గ్రామం. ఈ ఊరిలో మరికొంద రు కూడా జ్వరాలతో బాధపడుతున్నారు. సార్లు వైద్య శిబిరాలు నిర్వహించి, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
వానల్లో ఆరోగ్యం జాగ్రత్త!!
హెల్త్ ఇన్ రెయిన్స్ అదేపనిగా కురిసే వానల మాటున కొన్ని రకాల జబ్బులు పొంచి ఉంటాయి. అలా జలజలా వాన కురవగానే ఇలా బిలబిలా ఈ జబ్బులు వచ్చేస్తుంటాయి. నేరుగా నీళ్లు కలుషితం కావడం వల్ల, దోమల కారణంగా, వాతావరణం చల్లబడటంతో వైరస్లు బలంగా ఉండటం వల్ల వ్యాధులు మామూలే. కుండపోతగా వర్షాలు కురుస్తున్న ఈ వాతావరణంలో ఒకింత అప్రమత్తంగా ఉండాలి. వర్షాలతో మన ఆరోగ్యం కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు మొదలు కాగానే నలువైపుల నుంచి నాలుగు రూపాల్లో వచ్చి పడతాయి వ్యాధులు. ఈ కింద పేర్కొన్న విభజన కేవలం మన సౌలభ్యం కోసమే. ఈ కింది వాటిలో దేనివల్లనైనా జ్వరాలు, జబ్బులు రావచ్చు. 1. నేరుగా నీటితో... గ్యాస్ట్రోఎంటిరైటిస్, టైఫాయిడ్, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ, లెప్టోస్పైరోసిస్ అనేవి నీళ్ల నుంచి పుట్టి, నీళ్లతో వ్యాపించే (వాటర్బార్న్) వ్యాధులు. 2. పరోక్షంగా నీటి వల్ల వ్యాప్తి చెందేవి... నేరుగా నీరు జబ్బులకు కారణం కాకపోయినా నీటి చినుకులు పరోక్షంగా ఈ వ్యాధుల వ్యాప్తికి తోడ్పడతాయి. ఈ సీజన్ దోమల బ్రీడింగ్కు తోడ్పడి వ్యాప్తి చెందే వులేరియూ, డెంగ్యూ, చికన్గున్యా వంటి వ్యాధులు వస్తాయి. నిజానికి... మలేరియా అనే వ్యాధి ప్రోటోజోవా పరాన్నజీవుల వల్ల వచ్చేది, చికన్గున్యా వైరస్తో వ్యాప్తి చెందేది. అతే ఇక్కడ ఈ వ్యాధుల వ్యాప్తికి వాన నీరు పరోక్ష కారణమై ఈ వ్యాధుల వాహకమైన దోమలు వృద్ధి చెందేలా చేస్తాయి. కాబట్టి వీటన్నింటికీ పరోక్షంగా వచ్చే జబ్బుల విభాగంలోకి చేర్చవచ్చు. 3. ఈ సీజన్లో వచ్చే వైరల్ ఫీవర్స్... ఇవన్నీ చాలా రకాల వైరస్లతో వస్తాయి. ఇందులో ఫ్లూ వంటి జ్వరాలు చాలా సాధారణమైనవి. 4. కలుషితమైన నీటి వల్ల... ఆహారం కలుషితం కావడంతో వచ్చే అమీబియాసిస్, జియార్డియాసిస్ వంటి వ్యాధులు కూడా ఈ సీజన్లో కనిపిస్తాయి. ఇవి వర్షాలలో కనిపించే వ్యాధుల్లో కొన్ని ముఖ్యమైనవి. 5. నేరుగా నీటితో... డయేరియా మదిరి అతిసారం అవుతుంది. వర్షాలొచ్చాక నీళ్లు కాస్తా కలుషితమై అవి తాగితే నీళ్ల విరేచనాలవుతాయి. అవి కాస్తా వురింత ఎక్కువై- విరేచనాలకు తోడు వాంతులూ జతగూడితే అదే గ్యాస్ట్రోఎంటిరైటిస్. కొన్ని సందర్భాల్లో జ్వరం రావడం, శరీరం నుంచి నీరు ఎక్కువగా బయుటకు వెళ్తే వుూత్రపిండాలు దెబ్బతినడం కూడా జరగవచ్చు. జాండీస్ రూపంలో : హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ వైరస్ల వల్ల వచ్చే ఈ రెండు వ్యాధులు కామెర్ల రూపంలో తవు లక్షణాల్ని చూపుతాయి. ఆకలి వుందగించడం, వికారం, మాత్రం పచ్చగా రావడంతో పాటు జ్వరం, వాంతుల వంటి లక్షణాలు ఈ వ్యాధుల్లో ఉంటాయి. * టైఫాయిడ్ కాస్తా ఎంటిరిక్ ఫివర్ అంటూ ఎంట్రీ ఇచ్చేస్తుంది. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియూ వల్ల వచ్చే ఇది దీర్ఘకాలం జ్వరం (ప్రొలాంగ్డ్ ఫీవర్), తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పితో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాల కూడా ఉంటాయి. * లెప్టోస్పైరోసిస్ అనేది బ్యాక్టీరియూ వల్ల వచ్చే వ్యాధి. వర్షాలకు ఎలుకల వంటివి ఇళ్లలోకి రావడంతో వాటి మాత్రంలో ఉండే బ్యాక్టీరియూ నీళ్ల వల్ల ఆహారపదార్థాలను చేరి కలుషితం చేస్తుంది. పైగా ఈ సీజన్లో సీవరేజ్ గుంటల్లో దిగి పనిచేసేవారికి కలుషితమైన నీటి కారణంగా త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. నీళ్లలో నిత్యం తిరిగే రైతులూ, కూలీలకూ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువే. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతుల రూపంలో లక్షణాలు కనిపిస్తాయి. కడుపునొప్పి, కళ్లెర్రబారటం, కళ్లు పచ్చగావూరడం వంటి లక్షణాలూ ఉంటాయి. దోమలు జ్వరాలకు ఫ్రెండ్స్... ఈ జ్వరాలదీ, వానలదీ పరోక్ష సంబంధం. వర్షం కురిసి నీళ్లు చేరడం వల్ల దోమల వంటి కొన్ని కీటకాల గుడ్లు పొదిగేందు (బ్రీడింగ్)కు అవకాశం చిక్కుతుంది. దాంతో వచ్చేవే మలేరియూ, చికన్గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు. * మలేరియా అన్నది ప్రోటోజోవా అనే ఏకకణ పరాన్నజీవి అనాఫిలస్ దోవుతో వల్ల వ్యాప్తి చెంది వస్తుంది. వ్యాధి మదిరి తలకెక్కితే సెరెబ్రల్ వులేరియూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్-ఏఆర్డీఎస్), స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్), ఒక్కోసారి కామెర్లూ రావచ్చు. * చికన్గున్యా వైరస్ ఎడిస్ ఈజిప్టై అనే దోమ ద్వారా వ్యాప్తి చెంది వస్తుంది. ఓ ఏడాదీ, రెండేళ్ల క్రితం తన సత్తా ఏమిటో సవుస్త జనాలకూ చూపెట్టిన ఈ వ్యాధి కూడా నీళ్లు చేరడంతో దోమలు పెరిగి వస్తుంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయి కీళ్లనొప్పులు లక్షణాలుగా ఇది తన తీవ్రత చూపుతుంది. * డెంగ్యూ పేరెత్తితేనే ఇప్పుడు దడ పుడుతోంది. ఇదీ దోవుల్లోనే ఒక రకమైన దోమ అయిన ఏడిస్ ఈజిప్టై వల్ల వ్యాప్తి చెందుతుంది. జ్వరం, తలనొప్పి వంటివి దీని లక్షణాలు. వాటితో పాటు ఎముకలు విరిచినంత నొప్పి వస్తుంది కాబట్టే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావానికి కారణవతుంది. శరీరానికి షాకిచ్చి అపస్మారక స్థితిలోకి నెట్టి ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారి తీస్తుంది. అంచెలంచెల తీవ్రతతో ప్రభావం చూపే మూడు దశల వ్యాధినే డెంగ్యూ క్లాసికల్ ఫీవర్, డెంగ్యూ హ్యావురేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. నీళ్ల జల జల... వైరస్లతో విలవిల... ఈ వానల్లో వైరస్లు విపరీతంగా విజృంభిస్తాయి. ఇవన్నీ ఫ్లూ లాంటి జ్వరాలే. ఈ వైరస్ వల్ల వచ్చే జ్వరాలు ఫ్లూ లక్షణాలను చూపి ఈ సీజనంతా హడలగొట్టేస్తాయి. జ్వరంతో ఒళ్లు పెనంలా కాల్చడమే కాదు. వాంతులు విరేచనాలతో శరీరంలోని నీటిని బయటకు పంపేసి డీహైడ్రేషన్కు కారణమవుతాయి. అయితే వీటిలో చాలావరకు తవుంతట తామే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) జ్వరాలే. పరాన్నజీవులతో ఎన్నో వ్యాధులు * బయట ఏదైనా తింటే చాలు... అమీబియూసిస్ ఈ సీజన్లో తప్పక కనిపించే అవకాశం ఉంది. ఎంటమిబా హిస్టలిటికా అనే అమీబాలాంటి ఈ పరాన్నజీవి నీళ్లు, ఆహారం కలుషితమైన కారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కడుపులోకి చేరగానే ఎక్కువగా విరేచనాలు అవుతాయి. దీనికి తోడు కడుపునొప్పి, ఆకలిలేమి, బరువు తగ్గడం కూడా ఉండొచ్చు. * జియార్డియా అనే ఏకకణ జీవి కూడా అమీబియాసిస్లాంటి జబ్బే వస్తుంది. అయితే జియార్డియా వల్ల వస్తుంది కాబట్టి దీన్ని జియార్డియాసిస్ అంటారు. ఇది ఒళ్లంతా దురదలు పుట్టిస్తుంది. కడుపులో ఉన్న సూక్ష్మజీవి వల్లగాక ఏదైనా చర్మవ్యాధి వల్లనేమోనని పొరబడేలా ఈ దురదలు ఉంటాయి. వాన సమయంలో వ్యాధుల నుంచి జాగ్రత్తలిలా... చేయాల్సినవి... ⇒ ఈ సీజన్లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం. ⇒ వాటర్ను డిస్ ఇన్ఫెక్ట్ చేయుడానికి క్లోరిన్ బిళ్ల వేసి క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసిన నీరు తాగడం వుంచిది. ⇒ తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి. ⇒ మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ⇒ పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ⇒ ఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. ⇒ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మల, మూత్ర విసర్జనకు ముందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా హ్యాండ్వాష్తో చేతులు కడుక్కోవాలి. ⇒ పాత్రలు శుభ్రం చేసే సవుయుంలో సబ్బు లేదా డిటర్జెంట్ వాడండి. చేయకూడనివి... ⇒ కుండల్లో లేదా బిందెల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగకండి. ⇒ బయుటి ఆహార పదార్థాలు ఈ సీజన్లో వద్దు. ⇒ చల్లారిన ఆహారాన్ని మాటిమాటికీ వేడి చేసుకొని తినవద్దు. ⇒ పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకండి. ⇒ హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులను ఈ సీజన్లో వాడకండి. ⇒ కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయువద్దు. మట్టితో చేతులు, పాత్రలు శుభ్రం చేయవద్దు. - డాక్టర్ సి.హెమంత్ సీనియర్ ఫిజీషియన్,యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ,హైదరాబాద్ -
అనంతలో విషజ్వరాల విజృంభణ:చిన్నారి మృతి
-
విషజ్వరాల విజృంభణ: 20 మంది మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషజ్వరాలు విజృంభణతో జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. విషజ్వరాల బారినపడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు మాసాల చిన్నారి మృతిచెందింది. ఇప్పటికే విషజ్వరాలతో గత ఐదు రోజుల్లో నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. మృతిచెందినవారి సంఖ్య మొత్తం 20 కి చేరినట్టు అధికారులు వెల్లడించారు. విషజ్వరాలపై అనంతపురంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించిన వైద్యసదుపాయాలు సరైన సమయంలో అందడం లేదంటూ అక్కడి ప్రాంతవాసులు వాపోతున్నారు. -
'మంత్రి కామినేని రాజీనామా చేయాలి'
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విష జ్వరాల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు. మంగళవారం అనంతపురంలో డీఎం అండ్ హెచ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మంత్రి కామినేని శ్రీనివాస్ను రాజీనామా చేయాలంటూ సీపీఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దాంతో డీఎం అండ్ హెచ్వో కార్యాలయం వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. -
తిరుపతిలో విజృంభిస్తోన్న విషజ్వరాలు
-
'డెంగ్యూ, మలేరియాపై అప్రమత్తత అవసరం'
- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ - అర్బన్ ప్రాంతాల్లో ప్రచార వాహనాలు ప్రారంభం విజయవాడ (లబ్బీ పేట) : రాష్ట్రంలో ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధులపై పూర్తి అవగాహన కలిగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. అందులో భాగంగా ప్రజలు చేయాల్సిన, చెయ్యకూడని చర్యలను తెలిపేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రవేశపెట్టిన ప్రచార వాహనాలను మంత్రి కామినేని శ్రీనివాస్ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 242 వాహనాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయన్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు ఒక వాహనం చొప్పున ఏర్పాటు చేశామని ప్రకటించారు. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో 22 వాహనాలను కేటాయించామని, వాటిలో విజయవాడ పరిధిలో 14, ఇతర పట్టణాల్లో 8 పర్యటిస్తాయని తెలిపారు. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిన కేసులను డెంగ్యూగా ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. డెంగ్యూ లక్షణాలతో ఉన్న రోగులకు సరైన చికిత్స అందించి నయం చేయొచ్చన్నారు. జిల్లాలో 102 కేసులు నమోదవగా, విజయవాడలో 26, మచిలీపట్నంలో 15 మందిని గుర్తించి చికిత్స చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. ప్రయివేటు ఆస్పత్రిల్లో డెంగ్యూ లక్షణాలతో చేరిన రోగుల వివరాలు ప్రభుత్వాస్పత్రికి తప్పనిసరిగా తెలపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో ఎలీజ టెస్ట్లు నిర్వహిస్తున్నామన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, అదనపు డీఎం అండ్ హెచ్వొ డాక్టర్ టీవీఎస్ఎన్ శాస్త్రి పాల్గొన్నారు. -
వణికిస్తున్న విష జ్వరం
– పశ్చిమాన పెరుగుతున్న కేసులు – నిద్దరోతున్న వైద్యశాఖ – ‘పారిశుధ్యం’పై సమన్వయ లోపం – మృత్యువాత పడుతున్న చిన్నారులు ఓ పక్క ఎండలు అదరగొడుతుంటే.. మరోవైపు వదిలీ వదిలీ పడుతున్న వర్షాలు ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల జిల్లా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. దీంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. బాధితుల్లో పదేళ్లలోపు పిల్లలే ఎక్కువమంది ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది. ‘‘ బి.కొత్తకోట బీరంగి పంచాయతీలో మూడేళ్ల వయస్సున్న అరుణ అనే చిన్నారి శనివారం జ్వరంతో మృతి చెందింది. డెంగీ జ్వరమే ఇందుకు కారణమని వైద్యులు నిర్ధారించారు.’’ ‘‘ రామసముద్రం మండలంలోని మూగవాడి గొళ్లపల్లెకు చెందిన కార్తిక్ (16) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శనివారం జ్వరం ఎక్కువకావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు.’’ ..ఈ రెండే కాదు పడమటి మండలాల్లో గత నెల రోజుల్లో 360 జ్వరా బాధిత కేసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. విజృంభిస్తున్న విష జ్వరాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. చిత్తూరు (అర్బన్): వైద్యారోగ్యశాఖ, జిల్లా పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా విభాగాల మధ్య కొరవడిన సమన్వయం జనం ప్రాణాలపైకి తెస్తోంది. జ్వరాలపై గత ఏడాది జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మేల్కొనేలోపు చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తగ్గడం లేదే..! జిల్లాలో జూన్లో తేలికపాలి వర్షాలు పడ్డాయి. ఈనెలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 985 జ్వరం కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 13 డెంగీ కేసులు ఉన్నాయి. జూలై నెలలో 759 కేసులు నమోదవగా 11 డెంగీ కేసులు, గత నెల 892 జ్వరం కేసుల్లో 8 డెంగీ కేసులు బయటపడ్డాయి. ఈనెల్లో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 489 మంది జ్వరాలతో ఆసుపత్రులకు వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. రానున్న మాసాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. జ్వర బాధితుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉందే తప్ప.. తగ్గేలా కనిపించడంలేదు. ఈ ప్రాంతాల్లో ఎక్కువ జ్వరాలతో బాధపడుతున్న వాళ్లు, మృత్యువాత పడుతున్న వాళ్లల్లో చాలామంది జిల్లాలోని పడమటి మండలాలకు చెందిన వాళ్లే కావడం ఆందోళన కలిగిస్తోంది. తూర్పు మండలాలతో పోలిస్తే పశ్చిమాన వాతావరణం కాస్త చల్లగా ఉండటానికి తోడు చిన్నపాటి వర్షాలు పడితే పరిసరాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. మురుగునీరు ప్రవహించడానికి సరైన కాలువ వ్యవస్థ లేకపోవడం, గ్రామాల్లో ఇళ్ల మధ్యే మురుగునీళ్లు నిలిచిపోతుండటం ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా పలమనేరు, వి.కోట, పుంగనూరు, మదనపల్లె, మొలకలచెరువు, బి.కొత్తకోట, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం ప్రాంతాల వైపు జ్వరాలతో బాధపడుతున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. సమన్వయం ఏదీ? పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు సరిగా జరగడంలేదు. పారిశుధ్యం నిర్వహణ మొత్తం పంచాయతీ శాఖ చూస్తున్నా.. పనులు ఆశించిన స్థాయిలో ఉండటంలేదు. గతంలో ప్రతీ నెలా ఓ గ్రామంలో సామూహిక పారిశుధ్య పనులు నిర్వహిస్తుండటంతో పరిస్థితి కాస్త గాడిన పడేది. కానీ ఈ ఏడాది సీజనల్ జ్వరాలు వణికిస్తున్నా పంచాయతీశాఖను నిద్రలేపలేకపోతోంది. గ్రామాల్లో ఉన్న నీటి నిల్వ కేంద్రాలు, ఓవర్హెడ్ ట్యాంకులు దోమలకు పుట్టినిల్లుగా తయారైంది. నెలలో రెండు సార్లు వీటిని శుభ్రం చేయాలని నిబంధనలు చెబుతున్నా పట్టించుకునే దిక్కులేదు. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత వైద్యారోగ్యశాఖ అధికారులు మేల్కొంటున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ముందస్తుగా ప్రజల్ని చైతన్యం చేసి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడాల్సిందిపోయి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన జ్వరాలు విభృంభించిన తరువాత వైద్యశిబిరాలు పెట్టడం కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదనేది అందరికీ తెలిసిన సత్యం. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, వైద్య శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతోంది. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల మధ్య భేదాభిప్రాయాల వల్ల పల్లెల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా తయారైంది. గత పాఠాలు మరిచారా..? రాష్ట్ర చరిత్రలోనే జిల్లాలో గతేడాది ఎక్కువ డెంగీ కేసులు నమోదయ్యాయి. 2012లో 329 డెంగీ కేసులు నమోదవడం ఓ సంచలనం.అయితే గత చరిత్రను తుడిచిపెడుతూ 2015లో ఏకంగా 1245 డెంగీ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. మూడేళ్ల కాలంలో ఈ సంఖ్య నాలుగంకెలకు చేరడం అధికారులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక డెంగీ జ్వరాలతో గత ఏడాది జిల్లాలో చనిపోయిన వాళ్ల సంఖ్య 44. ఢిల్లీ నుంచి జాతీయ వైద్యృబందం రంగంలోకి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి యువకులు,ృÐlద్దులు ఇలా చాలా మంది ప్రాణాలు గాల్లో కలిపిపోయాయి. విష జ్వరాలు సోకిన వాళ్లకు సకాలంలో డెంగీ, ఇతర పరీక్షలు చేయడంతో ఆలస్యం నెలకొనడం, కొన్ని చోట్ల సాధారణ జ్వరం గుర్తించడానికి అవలంభించే విధానాన్నే విష జ్వరాలను కనిపెట్టడంలో అన్వయించడం వల్ల చివర్లో ప్రాణాంతక జ్వరాలని గుర్తించడం వల్ల ప్రజలు తల్లడిల్లిపోయారు. దీనికి తోడు 135 మలేరియా కేసులు, 45 చికున్ గున్యా కేసులు సైతం నమోదయ్యాయి. గతం నేర్పిన పాఠాలనుృ§lష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడాల్సిన యంత్రాంగం ఇంకా మొద్దునిద్దరలో ఉండటం శోచనీయమే. నిధులు ఉపయెగించుకోండి... పారిశుద్ద్య పనులు మెరుగు పరచడానికి ఇప్పటికే 14వ ఆర్థిక సంఘ నిధులను అన్ని గ్రామాలకు పంపిణీ చేశాము. వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి. కార్యదర్శులు, సర్పంచ్లు ఇందుకు చొరవ చూపాలి. ఇప్పటికే విష జ్వరాలపై మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించాం. విష జ్వరాలు, డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ద్య పనులు చేపడుతున్నాం. – కె.ల్.ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి. నేటి నుంచి మొబైల్ క్లీనిక్స్... సీజనల్ వ్యాధుల నుంచి ప్రజల్ని చైతన్యం చేసి అప్రమత్తం చేయడానికి నేటి నుంచే కొత్త ప్రణాళికను అమల్లోకి తెస్తున్నాం. మొబైల్ మలేరియా క్లీనిక్స్ పేరిట ఓ చైతన్య రథంలో మా సిబ్బంది ప్రతీ మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దోమల వ్యాప్తి నివారణ, లార్వాల గుర్తింపు, డ్రైడే, పారిశుద్ద్య నిర్వహణ ఇలా అన్నింటిపై ప్రణాళిక రూపొందించాం. కచ్చితంగా గతేదికన్నా ఈ సారి జ్వరాల సంఖ్యను తగ్గిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆయా వైద్యాధికారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. – డాక్టర్ జె.లావణ్య, జిల్లా మలేరియా అధికారి. -
పశ్చిమ కృష్ణాపై డెంగీ పంజా
పశ్చిమ కృష్ణాపై డెంగీ పంజా విసిరింది. ఒక రోజు వ్యవధిలో ముగ్గురిని పొట్టనపెట్టుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కాగా, ఒక ఉప సర్పంచ్ ఉన్నారు. గ్రామాల్లో డెంగీ లక్షణాలతో మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో అధికారులు స్పందించి జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి,మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. చాట్రాయి : మండలంలోని మర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు పర్వతనేని శ్రీనివాసరావు(58) డెంగీ జ్వరం బాధపడుతూ గురువారం మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు తండ్రి పర్వతనేని సూర్యనారాయణ ప్రస్తుతం కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులకు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్న శ్రీనివాసరావు అకాల మరణంపై స్థానికులు విచారం వ్యక్తంచేశారు. డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి పెనుగంచిప్రోలు : డెంగీ వ్యాధి లక్షణాలతో పది నెలల వయసు గల ఓ చిన్నారి మృతిచెందింది. పెనుగంచిప్రోలులోని తుపాను కాలనీకి చెందిన అలవాల రాము, కవిత దంపతుల కుమార్తె శిరీష(10 నెలలు) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆ చిన్నారికి స్థానిక ఆర్ఎంపీల వద్ద, నందిగామలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో విజయవాడలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ప్లేట్లెట్స్ తగ్గి చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పారని శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెనుగంచిప్రోలుతోపాటు లింగగూడెం, గుమ్మడిదూర్రు గ్రామాల్లో కూడా విషజ్వరాలు ప్రబలడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వీరులపాడు మండలంలో... తాటిగుమ్మి(వీరులపాడు) : డెంగీ లక్షణాలతో వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో ఓ బాలిక మరణించింది. గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగ సునీత కుమార్తె హైమావతి (7) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ నందిగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం రాత్రి రక్త కణాల సంఖ్య తగ్గిపోవడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా... మార్గమధ్యంలో మృతిచెందింది. విష జ్వరాలతో గ్రామాలు అల్లాడుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
వణికిస్తున్న విష జ్వరాలు
లావేరు: మండల కేంద్రంలోని లావేటిపాలేంలో విష జ్వరాలు విజృంభించాయి. డెంగీ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడి పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. గ్రామానికి చెందిన ఇనపకుర్తి రమణ, లంకలపల్లి కాసులమ్మ డెంగీ లక్షణాల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సగరపు లక్ష్మీ, ఇనపకుర్తి ఎల్లారావులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో మరికొంత మంది కూడా జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. జ్వరాలు విజృంభిస్తున్నా గ్రామంలో ఎలాంటి వైద్యసేవలు అందడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షీణించిన పారిశుద్ధ్యం లావేటిపాలేంలో పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారాలే కనిపిస్తున్నాయని, తాగునీటి వనరుల వద్ద మురుగునీరు నిల్వ ఉంటోందని వాపోతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెంట కుప్పలు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మాసాయిపేటలో విషజ్వరాలు
వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న ఓ వాడలో విష జ్వరాలు సోకి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజుల నుంచి కొందరు మంచాన పడగా మరి కొందరు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కొంత మంది పేద రోగులు మంచాన పడి మూలుగుతున్నారు. దోమల కాటు వల్ల డెంగీ తదితర జ్వరాలు సోకాయని బాధితులు తెలిపారు. వాడలో ఇంటింటికీ గొర్ల కొట్టాలు ఉండడంతో పేడ, మురుగు వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణలో అధికారులు అశ్రద్ధ చేస్తున్నారని, రోగాల బారినపడిన వారికి సర్కారు వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. 15 రోజుల క్రితం సాయిప్రియ, శ్రీకాంత్, సుశీల, కవిత తదితరులకు విష జ్వరాలు సోకడంతో నగరంలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకొని వచ్చారు. అలాగే నందిని, నవీన, మౌనిక, మోక్షిత తదితరులు రోగాల బారిన పడి నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాప వైద్యానికి రూ.30 వేలు ఖర్చు మా ఐదేళ్ల కూతురు సాయిప్రియకు 15 రోజుల క్రితం జ్వరం వచ్చింది. తగ్గక పోవడంతో టెస్టులు చేయించాం. రక్తంలో తెల్ల కణాలు తగ్గాయని, దీంతో డెంగీ సోకిందని డాక్టర్లు చెప్పారు. దీంతో హైదరాబాద్లోని సనత్నగర్ వద్ద సెయింట్ థెరిసా ఆసుపత్రిలో వైద్యం చేయించాం. అప్పు చేసి రూ. 30వేలు ఖర్చు చేశాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. - లలిత మనవరాలు ఆసుపత్రిలోనే ఉంది నామనవరాలు సరితకు జ్వరం వచ్చింది. పది రోజుల నుంచి పట్నంలోని ఆస్పత్రిలో ఉంది. ఇప్పటివరకు రూ. 20వేలు ఖర్చయ్యాయి. డెంగీ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. - కమలమ్మ మళ్లీ జ్వరం వస్తోంది నా కూతురు కవితకు పక్షం రోజుల క్రితం జ్వరం వచ్చింది. తూప్రాన్లో టెస్టులు తీసుకుంటే డెంగీ సోకిందని చెప్పిండ్రు. పట్నం తీసుకెళ్లి రూ. 25 వేలు ఖర్చు చేసి నయం చేయించి ఇంటికి వచ్చాం. మళ్లీ సాయంత్రం పూట చలి, జ్వరం రావడంతో మూలుగుతోంది. - లక్ష్మి -
విషజ్వరంతో ఇద్దరు మృతి
అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు): జిల్లాలో విషజ్వరంతో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో సోమవారం రేగండ్ల నాగమణి(27) జ్వరంతో మృతి చెందింది. మృతురాలికి భర్త, ఒకరు సంతానం ఉన్నారు. మూడు రోజుల కిందట ఆమెకు జ్వరం రాగా మొదట స్థానికంగాను, ఆ తర్వాత ఖమ్మంలో వైద్య సేవలు అందించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. డెంగీ లక్షణాలతో ప్లేట్లెట్స్ తగ్గి ఒకరు మృతి చెందటంతోపాటు గ్రామానికి చెందిన మరికొందరు జ్వరాలతో బాధపడుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరంలో మరొకరు.. రుద్రవరం(రెడ్డిగూడెం): రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాలో విష జ్వరంతో మరొకరు మృతి చెందారు. గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. గ్రామానికి చెందిన బాణావాత్ సోని మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆమె వైద్య సేవలు పొందింది. ఆదివారం రాత్రి జ్వరంతోపాటు బీపీ, షుగర్ పెరగడంతో తీవ్ర అస్వస్తతకు గురైంది. మైలవరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. గ్రామంలో మృతుల సంఖ్య పెరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కన బర్చి జ్వరాల నియంత్రణకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మంచంపట్టిన తుక్కాపూర్
పలువురికి విషజ్వరాలు పారిశుద్ధ్య లోపమే కారణమంటున్న వైద్యులు కొల్చారం: కొల్చారం మండలం తుక్కాపూర్లో వారం రోజులుగా గ్రామస్తులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్ గ్రామస్తులను పట్టిపీడిస్తున్నాయి. తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వైద్య సేవల కోసం మెదక్, జోగిపేట, తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 25మంది విషజ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. అసలే కష్టాల్లో ఉన్న తమకు మాయరోగాలు ప్రాణాలమీదికి తెస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రంగంపేట వైద్యాధికారి మురళీధర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ధ్యలోపంవల్లే గ్రామంలో రోగాలు వస్తున్నాయని, కాచివడపోసిన నీటిని మాత్రమే తాగాలని ఆయన సూచించారు. -
30 మంది విద్యార్థినులకు అస్వస్థత
కోవెలకుంట్ల (కర్నూలు) : కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండల కేంద్రంలోని గురుకుల బాలికల వసతి గృహంలో విష జ్వరాలు ప్రబలి 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గుర్తించిన హాస్టల్ వార్డెన్ వైద్య అధికారులను సంప్రదించడంతో.. ఆదివారం వసతిగృహం ఆవరణలో ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేసి విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. -
మంచం పట్టిన మారెపల్లి
పెద్దముల్: రంగారెడ్డి జిల్లా పెద్దముల్ మండలం మారెపల్లి తండా విషజ్వరాలతో మంచంపట్టింది. గ్రామంలోని సుమారు 300 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. వాంతులు, విరోచనాలతో పాటు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంతలా విషజ్వరాలు ప్రభలుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
50 మంది విద్యార్థులకు విషజ్వరాలు
మైదుకూరు: వైఎస్ఆర్ జిల్లాలో అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థులకు విషజ్వరాలు సోకడంతో ఆస్పత్రికి తరలించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం వనిపెంట ఆశ్రమ హాస్టల్కు చెందిన 50 మంది విద్యార్థులు గత కొన్నిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా.. విషజ్వరాలు సోకాయని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
మనావత్తండాలో వైద్య శిబిరం
సాక్షి కథనానికి అధికారులు స్పందంచారు. విషజ్వరాలతో వణికి పోతున్న మానావత్ తండాలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, డీఎంహెచ్ వో లు గ్రామానికి స్వయంగా తరలి వచ్చి రోగులకు చికిత్స అందించారు. -
మెదక్ జిల్లాలో విషజ్వరాలు
-
ప్రబలిన విషజ్వరాలు
రేపల్లె (గుంటూరు) : ప్రబలిన విషజ్వరాలతో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకువారిపల్లెలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలో రెండు వారాలుగా పలువురు జ్వరం బారినపడ్డారు. అయితే ఆరెపల్లిలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
విజయనగరం జిల్లాలో విషజ్వరాలు
గుర్ల : విజయనగరం జిల్లా గుర్ల మండలం తాడిపూడి పంచాయతీ మధురై గ్రామం చిన్ననాగవలసలో విషజ్వరాలు ప్రబలాయి. నాలుగు రోజులుగా విషజ్వరాలతో తల్లడిల్లిపోతున్నా వైద్యులు పట్టించుకోవడంలేదు. ఈ గ్రామం గరివిడి పీహెచ్సి పరిధిలో ఉండడంతో గుర్ల పీహెచ్సి వైద్యులు అక్కడికెళ్లి వైద్యశిబిరం ఏర్పాటు చేసే వీలులేదు. గరివిడి పీహెచ్సీ వాళ్లకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
విషజ్వరాలతో 20 మందికి అస్వస్థత
దుగ్గిరాల (గుంటూరు జిల్లా) : విషజ్వరాల కారణంగా జిల్లాలోని దుగ్గిరాల మండలం మంచకలపూడి గ్రామంలో 20 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా గ్రామంలో విషజ్వరాలతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం నాటికి గ్రామంలో 20మందికి పైగా గ్రామస్తులు ఈ విషజ్వరాల బారిన పడినట్లు సమాచారం. కాగా గ్రామంలో హెల్త్ క్యాంప్లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నా జ్వరాలు తగ్గుముఖం పట్టడంలేదు. ఇప్పటికే ఈ గ్రామాన్ని కలెక్టర్ కూడా సందర్శించి అధికారులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. -
ప్రబలుతున్న విషజ్వరాలు
జైపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గత ఐదు రోజుల్లో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. తాజాగా.. గ్రామానికి చెందిన రాధమ్మ(53) గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. కాగా మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. మండలంలో విషజ్వరాలు ప్రబలుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. -
నర్సాపురం గ్రామంలో 200ల మందికి జ్వరాలు
ఆత్మకూర్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం నర్సాపురం గ్రామంలో విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇంటికి ఒకరిద్దరు చొప్పున దాదాపు 200 మంది జ్వరాల బారినపడ్డారు. ఇటీవల గ్రామంలో పీహెచ్సీ సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. అంతేకాకుండా గ్రామంలో 8 డెంగ్యూ కేసులు కూడా బయటపడ్డాయి. బాధితుల్లో ముగ్గురు కోలుకున్నప్పటికీ ఐదుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
వణికిస్తున్న జ్వరాలు
శ్రీశైలం ప్రాజెక్టు : సున్నిపెంట గ్రామంలో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఆసుపత్రులలో ఎక్కడ చూసినా జ్వరం బారిన పడిన రోగులే కనిపిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో దాదాపుగా ప్రతి ఇంటిలో ఒకరు బాధపడుతున్నారు. ఫ్రభుత్వాసుపత్రులే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో, మలేరియా కార్యాలయంలో మలేరియా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. టైఫాయిడ్ నిర్థారణ కోసం జ్వర పీడితులు ప్రైవేటు ల్యాబోరేటరీలను ఆశ్రయించక తప్పడం లేదు. జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు సున్నిపెంటలో రెండవ విడత డీడీటీ స్ప్రేయింగ్ను చేస్తున్నారు. మలేరియా అధికారిణి ఇ హుసేనమ్మ పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి జ్వరపీడితుల రక్తనమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. నిరుపేదలు టైఫాయిడ్ టెస్ట్ల కోసం ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించలేక ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా సభ్యులు ఎన్ ఎస్ వకీల్ ఈ మేరకు టైఫాయిడ్ టెస్ట్లను కూడా ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలలో చేయాలని, కాలనీలో వ్యాధులను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ అంతటా హెల్త్ ఇన్స్పెక్టర్ టి నాగరాజు, మలేరియా సర్వేలైన్ ఇన్స్పెక్టర్లు పి వీరన్న, నరసింహరావు, హెల్త్ అసిస్టెంట్లు బాలనరసయ్య రాములు నాయక్ తదితరులు ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. -
35 మందికి విషజ్వరాలు
జైపూర్(ఆదిలాబాద్ ): ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామస్థులు విషజ్వరాలతో మంచం పట్టారు. గ్రామానికి చెందిన 35 మందికి గత మూడు రోజులుగా జ్వరాలు వస్తుండటంతో ఈ రోజు 108 సాయంతో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారిలో కొంత మంది ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. -
అది విష జ్వరాల గ్రామం..
బలిజపేట(విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా బలిజపేట మండలం నారాయణపురం గ్రామంలో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో దాదాపు 100మందికి పైగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమాలు చేపట్టక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో చేసేదేంలేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించడంతో వారు ప్రజలను దోచుకుంటున్నారు. కాగా, ఇదే గ్రామంలో విషజ్వరాల కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు పది రోజుల క్రితం ఒక హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి శాంపిల్స్ను సేకరించారు. కాగా, ఇప్పటి వరకు ఆ శాంపిల్స్కు సంబంధించిన ఫలితాలను అధికారులు వెలువరించలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు గ్రామంలోని ప్రజలకు ఎలాంటి మందులను కూడా అధికారులు అందించలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రం మలేరియా, టైపాయిడ్ సోకినట్లుగా వైద్యులు తేల్చారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు వాపోతున్నారు. -
ప్రబలిన విషజ్వరాలు..
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం ఏదూలసంఘం గ్రామంలో విష జ్వరాలు ప్రబలాయి. మంగళవారం నాటికి దాదాపు 50 మందికిపైగా గ్రామస్తులు విష జ్వరాలతో బాధపడుతున్నారు. కాగా, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా గ్రామంలో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. దీంతో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేసింది. దాంతో ఏదూలసంఘం గ్రామంలోని ప్రజలుకు తక్షణం వైద్య సేవలు అందించాలని ప్రాజెక్టు అధికారి వైద్య అధికారులను ఆదేశించారు. దాంతో వారు గ్రామానికి చేరుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. -
విష జ్వరాలతో 50 మందికి అస్వస్థత
శ్రీకాకుళం (కంచిలి) : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం గ్రామంలో శుక్రవారం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా గ్రామంలో సుమారు 50 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన ప్రభుత్వ వైద్యాధికారులు శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు చికిత్సనందించి మందులు పంపిణీ చేస్తున్నారు. -
'సీమ'ను వణికిస్తున్న విష జ్వరాలు
వైఎస్ఆర్ జిల్లా : రాయలసీమను విష జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల సమ్మె చేయడం, ఎన్నడూ లేనంతగా వర్షాభావంతో తాగునీరు కలుషితం కావడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా మలేరియా, డెంగీ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మలేరియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. డెంగీ లక్షణాలతో వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ లక్షణాలతో ఇప్పటికే పలువురు మృత్యువాత పడటంతో జ్వర పీడితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రక్త పరీక్షల్లో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గగానే డెంగీ లక్షణాలుగా భావించి కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వేలూరు నగరాల్లోని ఆస్పత్రులకు పరుగు తీస్తున్నారు. వేలాది రూపాయలు ఆసుపత్రులకు సమర్పించుకుంటున్నారు. విషజ్వరాలు మరింత పెరిగే ప్రమాదముందని వైద్యులు కూడా చెబుతున్నారు. రెండు వారాల పాటు సాగిన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం కూడా ఇప్పుడు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలు ప్రబలి రాయలసీమ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు విష జ్వరాల బారిన పడ్డారు. కార్మికులు సమ్మె విరమించి చెత్త తొలగించినా జ్వరాల తీవ్రత మాత్రం తగ్గలేదు. వృద్ధి చెందుతున్న లార్వా రాయలసీమలో జ్వరాలు అధికమవడానికి వర్షాలు కురవకపోవడం కూడా కారణమేనని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గతంలో ఎప్పుడూ లేనంత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీమ జిల్లాల్లో విపరీతమైన నీటి ఎద్దడి నెలకొంది. సుమారు 3,700 పైచిలుకు గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి నెలకొంది. దాంతో రక్షిత తాగునీరు కరువైంది. ప్రజలు చెరువులు, కుంటల్లోని చివరన మిగిలిన జలాలు, అడుగంటిన బోర్లనుంచి అప్పుడప్పుడూ వచ్చే నీటివల్లకూడా విషజ్వరాలు ప్రభలుతున్నాయి. ఉన్న నీటికి పొదుపుగా వాడే క్రమంలో ప్రజలు నీటిని ఇళ్లలో ఎక్కువ కాలం నిలువ చేసుకుంటున్నారు. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో నిల్వ చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చాలా చోట్ల వారం, పది రోజులకోమారు మంచి నీరు వదులుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అందువల్లే ఆ నీటి లోంచి లార్వా వృద్ధి పెరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. తద్వారా దోమలు పెరిగి జనం జ్వరాల బారినపడుతున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. మురికి కాలువల్లో కంటే కూడా నిల్వ చేసుకున్న మంచి నీటిలోనే లార్వా అధికంగా వృద్ధి అవుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో కేసుల నమోదు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పెద్ద సంఖ్యలో మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో డయేరియా, మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం 'సీమ' జిల్లాల్లో 304 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఇంతకు నాలుగురెట్లు కేసులు ఉండవచ్చని అంచనా. -
పిల్లలిలా చనిపోతుంటే ఏం చేస్తున్నారు?
పెండ్లిమర్రి : ‘ఎం.ఏరాసుపల్లె గ్రామంలో దాదాపు నెల రోజుల నుంచి విషజ్వరాలు వస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోయారు. ఇలానే కోనసాగితే గ్రామస్తులు ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్లుంది. గ్రామస్తులు భయం గుప్పిట్లో ఉన్నారు. పరిస్థితి ఆలాగుంటే మీరేం చేస్తున్నార’ని వైద్యాధికారులపై ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ఏరాసుపల్లె గ్రామంలో శుక్రవారం డెంగీ లక్షణాలతో నరసింహరెడ్డి(14) అనే బాలుడు మృతి చెందాడు. విష జ్వరాలతో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ఫ్రగాడ సానూభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. గ్రామస్తులు భయంతో వణికి పోతున్నారని, జ్వరాలు రాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని డీఎంహెచ్ఓ నారాయణ నాయక్ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొత్తగా జ్వరం కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో పాడుబడిన బావిని పూడ్చివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పసల భాస్కర్, ఎంపిపి భర్త రామమోహన్రెడ్డి, రైతు కన్వీనర్ నాగమల్లారెడ్డి, ఎంపీడీవో వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ అంజనేయులు, వైద్యాధికారి మధుసూదన్రెడ్డి, ఈఓపిఆర్డి రఘనాధ్రెడ్డి పాల్గొన్నారు. కాగా, డెంగీ లక్షణాలతో చనిపోయిన నరసింహారెడ్డి మృతదేహాన్ని టీడీపీ నియోకవర్గ ఇన్చార్జి పుత్తా నరసింహరెడ్డి పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు ఫ్రగాడ సానూభూతి తెలిపారు. -
మన్యంలో మరణమృగందం
-
విష జ్వరాలతో గిరిపుత్రుల విలవిల
డెంగీ, మలేరియాతో ఏజెన్సీల్లో మృత్యుఘోష సాక్షి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం: తెలంగాణలో తండాలు, గూడేలు విష జ్వరాల కోరల్లో చిక్కుకున్నాయి. ఊళ్లకు ఊళ్లే మంచానపడ్డాయి. డెంగీ, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్లతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న జ్వరాలతో మృత్యువు కరాళ నృత్యం చేస్తోంది. గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. వారాల తరబడి జ్వరం పీడిస్తున్నా దేవుడిపై భారం వేసి పేదలంతా మంచాలకే పరిమితమవుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులకు జ్వరంతోడై మరణాలు నిత్యకృత్యమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని కుటుంబాలన్నీ మాడిన కడుపులతోనే జ్వరాలను కాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, అడవిబిడ్డల్లో అవగాహనా లేమికితోడు వైద్యసేవలు కరువై మారుమూల ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు దారుణంగా ఉన్నా కంటితుడుపు చర్యలతోనే అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే వైద్య సేవల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం తీరు అధ్వాన్నంగా ఉంది. వరంగల్ కేంద్రానికి 15 కిలోమీటర్ల సమీపంలో ఉన్న తండాలోనూ డెంగీ మరణాలు నమోదయ్యాయి. జూన్ నుంచి వివిధ రకాల జ్వరాలతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 128 మంది చనిపోయారు. ఒక్క ఈ నెలలోనే 17 మందికిపైగాా మృత్యువాతపడ్డారు. జిల్లావ్యాప్తంగా 53 డెంగీ, 85 మలేరియా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. ఈ లెక్కల్లో చేరని బాధితులే ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఖమ్మం ఏజెన్సీలో రెండు నెలల్లో దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. భద్రాచలం సమీపంలోని గుండాల కాలనీలోనే ఏకంగాఏడుగురు మరణించారు. జ్వరాల నివారణకు ఏజెన్సీలో క్యాంపులు నిర్వహించిన భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యుడు రత్నప్రసాద్ సైతం డెంగీతో చనిపోవడం తీవ్రతకు అద్దంపడుతోంది. అడవిబిడ్డలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్లోనూ పల్లెలన్నీ పడకేశాయి. గిరిజన ఆవాసాల్లో చావుకళ కనిపిస్తోంది. అయితే జిల్లాల్లో ఇలాంటి మరణాలను నిర్ధారించడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఖ్యను తక్కువగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సంభవిస్తున్న చాలా మరణాలు అధికారిక గణాంకాల్లోకి చేరడం లేదు. దీంతో బాధిత కుటుంబాలకు ఎలాంటి ఆసరా లభించడం లేదు. అష్టకష్టాలు పడి ప్రైవేట్గా చికిత్స పొందుతున్న వారి కుటుంబాలేమో ఆర్థికంగా కుదేలై వీధిన పడుతున్నాయి. తండాల్లో ఇదీ పరిస్థితి.. వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గూడురు, కొత్తగూడ, ములుగు తదితర మండలాల్లో గిరిజన పల్లెలు, గొత్తికోయ గూడేల్లో ఆరోగ్య సేవలు కరువయ్యాయి. అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు జ్వరాలు వస్తే చెట్ల పసర్లు, భూత వైద్యాలు, నాటు మందులతోనే సరిపెట్టుకుంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో 108 సేవలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో రవాణా విషయంలోనూ ఇక్కడి వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తీవ్రంగా జబ్బుపడిన వారిని మంచంలో పడుకోబెట్టో, డొల్లల ద్వారానో తరలించాల్సి వస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ములుగు మండలంలో ఇద్దరు, ఏటూరునాగారంలో ముగ్గురు, మంగపేట మండలంలో ముగ్గురు, కొత్తగూడ మండలంలో ఒకరితో కలిపి మొత్తం 9 మంది జ్వరాలతో చనిపోయారు. కొందరు ఆసపత్రులకు తిరిగినా, డబ్బు ఖర్చుపెట్టినా ప్రాణాలు దక్కలేదు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వైద్యశాఖ అధికారులు ఎలాంటి క్యాంపులు నిర్వహించ డంలేదు. ఇక ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జామిని గోండు గూడెం, పొలాస బిల్లునాయక్ తండాలో ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు. ఈ రెండు ఆవాసాల్లో సుమారు 150 వరకు కుటుంబాలుంటే వందకుపైగా గిరిజనులు మంచానికే పరిమితమయ్యారు. ఇలా జిల్లాలోని వందలాది మారుమూల గ్రామాలన్నింటిలో విష జ్వరాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. జ్వరాలను తలచుకుంటేనే జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) పరిధిలో అత్యధికంగా జ్వరాలు సోకే నివాసిత ప్రాంతాలను(హ్యాబిటేషన్లు) ఏటా సీజన్కు ముందే వైద్య,ఆరోగ్య శాఖ గుర్తిస్తుంది. ఏజెన్సీ ఏరియాలోని జైనూర్ పీహెచ్సీ పరిధిలో మొత్తం 84 హ్యాబిటేషన్లు ఉండగా, ఈసారి 28 హ్యాబిటేషన్లలో జ్వరాలు సోకే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. కానీ ఈసారి 33 ఆవాసాల్లో జ్వరాలు విజృంభించాయి. జిల్లాలోని ప్రతి పీహెచ్సీ పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో కిటకిట లాడుతున్నాయి. నాలుగు మారుమూల మండలాలకు కేంద్ర బిందువైన జైనూరు 30 పడకల ఆసుత్రికి సాధారణంగా రోజుకు వంద నుంచి రెండు వందల మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ప్రస్తుతం ఈ సంఖ్య నాలుగు వందలకు చేరిందని స్థానిక వైద్యాధికారి తెలిపారు. విలవిల్లాడుతున్న ఏజెన్సీలు ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం జ్వరాలతో మంచం పట్టింది. రెండు నెలలుగా విషజ్వరాలతో ఇక్కడి ప్రజలు విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని చండ్రుగొండ మండలం రావికంపాడు వాసుల గోడు ఎంత వర్ణించినా తక్కువే. 2500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో రెండు నెలలుగా ఇంటికొకరు మంచమెక్కుతున్నారు. రాష్ర్టంలోని మారుమూల ప్రాంతాల్లో పారిశుద్ధ్యలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో దోమల ఉధృతి పెరిగి మలేరియా, డెంగీ వంటి విషజ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికితోడు సరైన వైద్య సేవలు లేక గిరిజనులు మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. అధికారులు మొక్కుబడి చర్యలతో చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో వైద్య సేవలందించాల్సిన పీహెచ్సీలు రిఫరల్ కేంద్రాలుగా మారాయి. జ్వరం కాస్త ఎక్కువైతే చాలు స్థానిక వైద్యులు పెద్దాసుపత్రికి తీసుకెళ్లమంటున్నారు. అంత దూరం వెళ్లి వైద్యం చేయించుకోలేని గిరిజనులు దేవుడిపైనే భారం వేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులకు కొందరు వెళుతున్నా ఎలాంటి ఫలితం ఉండటం లేదు. వైద్యులు, మందుల కొరత, సౌకర్యాల లేమితో ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సేవలు అందడం లేదు. కాగా, జ్వరాల బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలుతుంటే వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం డెంగీ మరణాలు లేవని పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి కుటుంబాలకు దిక్కెవరు? వరంగల్ జిల్లా ములుగు మండలం అన్నంపల్లి గ్రామానికి చెందిన పాడియా ప్రేమ్సింగ్(45)కు ఈ నెల 14న జ్వరం వచ్చింది. స్థోమతను బట్టి స్థానిక ప్రైవేటు ఆసుపత్రుల్లో 16 వరకు చికిత్స చేయించారు. 17న జ్వరం ఎక్కువైంది. దీంతో అదేరోజు అతన్ని వరంగల్లోని ప్రభుత్వాసుపత్రి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందాడు. రూ. 30 వేలు ఖర్చయిందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రేమ్సింగ్ భార్య నాగమ్మ వికలాంగురాలు. కొడుకు పరిస్థితి దాదాపు అంతే. ఈ కుటుంబం ఇప్పుడు వీధినపడింది. హరిశ్చంద్రనాయక్ తండా దుస్థితి వరంగల్ జిల్లా హసన్పర్తి మండలంలోని బైరాన్పల్లికి అనుబంధంగా ఉన్న గిరిజన పల్లె హరిశ్చంద్రనాయక్ తండా విషజ్వరం కోరల్లో చిక్కి అల్లాడుతోంది. 150 కుటుంబాలున్న ఈ తండాలో దాదాపు వంద కుటుంబాలు ఈ జ్వరం బారిన పడ్డాయి. సగానికిపైగా ఇళ్లలో ఒకరి కంటే ఎక్కువ మంది జ్వరపీడితులున్నారు. ఇదే తండాలో పది రోజుల క్రితం నునావత్ రాజు(35) డెంగీతో మరణించాడు. మూడేళ్లుగా ఈ తండాలో ఇప్పటివరకు 42 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారే. జ్వరమే శాపమై.. వీధిన పడిన కుటుంబం భద్రాచలం మండలంలోని గుండాల కాలనీలో ఒకే ఒక్క రోజు తీవ్ర జ్వరంతో బాధపడి మరణించిన కొత్తపల్లి రాంబాబు(32) కుటుంబం ఇప్పుడు దయనీయ పరిస్థితిలో ఉంది. టాక్సీ డ్రైవర్గా బీదరికాన్ని అనుభవిస్తున్న రాంబాబును జ్వరం రూపంలో మృత్యువు మింగేసింది. రాంబాబుకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఆయన చనిపోయే నాటికి భార్య సుజాత నిండు గర్భిణి. ఇప్పుడు ఆమెకు మరో పాప పుట్టింది. ఇంటికి పెద్ద దిక్కు చనిపోవడంతో ఈ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరిని ఆదుకునేందుకు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గ్రామస్థులే చందాలు వేసుకుని రాంబాబు కుటుంబానికి కాస్త అండగా నిలిచారు. డెంగీతో ఇద్దరి మృతి నిర్మల్ రూరల్/మంచిర్యాల టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో డెంగీ బారిన పడి తాజాగా ఇద్దరు మరణించారు. నిర్మల్ మండలంలోని రత్నాపూర్కాండ్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు ఎస్.తార(35) వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం రాత్రి చనిపోయారు. మూడు రోజులుగా ఇక్కడి రిమ్స్లో చికిత్స పొందుతూ ప్లేట్లెట్స్ పడిపోవడంతో ప్రాణాలు విడిచారు. అలాగే మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడకు చెందిన కొడిపాక అభిసాయి(15) కూడా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. ఇప్పటికే తలసేమియా వ్యాధి ఉన్న అభిసాయికి వారం క్రితం డెంగీ జ్వరం వచ్చింది. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. -
వైరల్ ఫీవర్తో మా చెల్లెలు చనిపోయింది!
జ్వరాల విషయంలో తెలంగణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీంతో ఈ ప్రాంతం కాస్తా అనారోగ్య తెలంగాణగా మారుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డెంగ్యూ, వైరల్ ఫీవర్లు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైరల్ ఫీవర్ కారణంగా తన సొంత చెల్లెలు చనిపోయారని, డెంగ్యూ కారణంగా భద్రాచలం ఆర్ఎంవో చనిపోయారని ఆయన చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం మాత్రం ప్రజారోగ్యానికి నిధులు విడుదల చేయట్లేదని మండిపడ్డారు. డీజిల్ లేక 108, 104 వాహనాలు నడవడం లేదని, గిరిజనులకు హెలికాప్టర్ ద్వారా వైద్యసాయం అందిస్తానన్న కేసీఆర్ మాటలు.. నీటిమూటలుగానే మిగిలిపోయాయని చెప్పారు. విషజ్వరాలతో గత నాలుగు నెలల్లో దాదాపు 120 మంది చనిపోయారని అన్నారు. ఆస్పత్రులలో చికిత్స కోసం గతంలో ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు చెల్లుబాటు కావట్లేదని విక్రమార్క తెలిపారు. -
వానొచ్చే.. వ్యాధులొచ్చే..!
ప్రబలుతున్న అంటురోగాలు - ఆస్పత్రులకు పరుగులుపెడుతున్న జనం - వాతావరణంలో మార్పు వల్లే వైరస్ వ్యాప్తి అంటున్న నిపుణులు - తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల వాసులు టైఫాయిడ్, వైరల్ జ్వరాల బారిన పడి ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వర్షాకాలం మొదలైన తర్వాత నగరంలో సరైన వర్షాలు లేక నీటిఎద్దడి ప్రారంభమైంది. దానికితోడు విద్యుత్ కోతలు నగరవాసులకు నరకం చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ నీళ్లు రెండు, మూడు రోజులకొకసారి వదిలేవారు. నీళ్లు పట్టుకునే సమయంలో కొన్ని ఏరియాల్లో స్థానికుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ఇటువంటి సమయంలో గత కొన్ని రోజులుగా వర్షాలు వచ్చి పలకరించడంతో నగరవాసులు పులకరించిపోయారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం సాగలేదు. ఇన్నాళ్లుగా నీళ్లు లేక ఇబ్బందులుపడిన ప్రజలు ఇప్పుడు వర్షం నీటితో కలుషితమైన మంచినీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. దీంతోపాటు పలు మురికివాడలు, అనధికార కాలనీల్లో డయేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాగా, మున్ముందు దోమలతో వృద్ధి చెందే వ్యాధులైన డెంగీ, మలేరియా వంటివి కూడా వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మూల్చంద్ మెడిసిటీలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ..‘ మా ఆస్పత్రికి డెంగీ లక్షణాలతో ఇద్దరు రోగులు వచ్చారు. అదే సమయంలో టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో డజనుకుపైగా రోగులు చికిత్స కోసం వచ్చారు.,’ అని చెప్పారు. వాతావరణంలో అనూహ్య మార్పులు, అధికతేమ వల్ల వైరల్ బాక్టీరియా త్వరితగతిన వ్యాప్తి చెందుతోందని ఆయన వివరించారు. సాకేత్ ప్రాంతంలో ఉన్న మ్యాక్స్ ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్అయిన డాక్టర్ రోమెల్ టిక్కూ మాట్లాడుతూ వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందని చెప్పారు. కొన్ని కేసుల్లో ఈ జ్వరాలు రెండు, మూడు వారాల వరకు రోగిని పట్టిపీడించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. రుతుపవనాల కారణంగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, వాటి వల్ల ఈ వర్షాకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో డెంగీ వ్యాధితో బాధపడుతున్న 33 మంది రోగులు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వచ్చారు. అయితే వారిలో ఎవరూ మరణించిలేదు. వీటిలో కేవలం ఆగస్టు నెలలోనే 11 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు పదోవంతు తగ్గాయి. ఇదిలా ఉండగా, మలేరియా కేసులు సైతం గత యేడాది కంటే ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి. ‘ఓవర్ హెడ్ ట్యాంకులను, పూలకుండీలు, ఇతర నీరు నిలిచే అవకాశమున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడంతో మలేరియా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు.. అలాగే పరిపాలన విభాగం కూడా నగరవ్యాప్తంగా ఫాగింగ్ చేపట్టి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు యత్నించింద’ని కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ.. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారే ఎక్కువగా వైరల్ వ్యాధుల బారిన పడతారని చెప్పారు. సరైన సమయంలో పౌష్టికాహారం తినడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని తెలిపారు. ‘దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు తుమ్మినప్పుడో, దగ్గినప్పుడో ఆ కణాలు గాలిలో కలిసి దగ్గర్లోనే ఉన్న ఇతరులకు ఆ జబ్బులు అంటుకుంటాయి. అలాంటి వ్యక్తులకు సాధ్యమైనంత మేర దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే రోగాలబారిన పడకుండా మనలను మనం కాపాడుకోవచ్చ’ని ఆయన సలహా ఇచ్చారు. -
ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్గున్యా జ్వరాలతో జనం విలవిలలాడిపోతున్నారు. అయితే జిల్లాలోని రిబ్బెన మండలం ఖైర్గాంలో ఓ మహిళ విష జ్వరంతో మరణించింది. అలాగే ఉట్నూరు మండలం హస్నాపూర్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. జర్వంతో మరో ఇద్దరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. జిల్లాలో విష జ్వరాల బారిన ప్రజలు ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి తరలివెళ్తున్నారు. ఇప్పటికే రిమ్స్ ఆసుపత్రి విషజ్వరాల బారినపడిన రోగులతో నిండిపోయింది. -
ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్గున్యా... జ్వరాలతో జనం విలవిలలాడిపోతున్నారు. దాంతో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి రోగులు తరలి వెళ్తున్నారు. దాదాపు 50 మంది రోగులు రిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే అదే జిల్లాలోని డిలావర్పూర్లోని గ్రామస్తులు పూర్తిగా మంచం పట్టారు. అలాగే చెన్నూరు మండలం కొమ్మెరలోని దాదాపు 100 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. అయితే వారు ఆసుపత్రులకు వెళ్ల లేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం కానీ వైద్యాధికారులు కానీ పట్టించుకోవడం లేదని వారు తీవ్ర వేదన చెందుతున్నారు. -
వైద్య,ఆరోగ్య సేవలు అన్ని గ్రామాలకు చేరాలి
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు అన్ని గ్రామాలలోను ప్రత్యేక వైద్యశిబిరాలు ఐటీడీఏ పీఓ వినయ్చంద్ పాడేరు: ఏజన్సీలోని ఎపిడమిక్ సీజన్ను సమర్ధంగా ఎదుర్కోవాలని, గిరిజనులకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీఓ వి.వినయ్చంద్ హెచ్చరించారు. ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల తీవ్రతపై శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారులు, ఎస్పీహెచ్ఓలు, వైద్యఅధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రత్యేకాధికారులంతా ఎపిడమిక్ సీజన్ ముగిసేంత వరకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలను అనుక్షణం సమీక్షించాలని ఈ సందర్భంగా పీవో ఆదేశించారు. మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు, క్షయవ్యాధి నివారణకు చేపడుతున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలన్నీ అన్ని గ్రామాలకు చేరాలని సూచించారు. ఎక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వైద్యాధికారి, ఇతర సిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాల్లోను దోమల నివారణ మందును స్ప్రేయింగ్ చేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ఆశ కార్యకర్తల వద్ద పూర్తిస్థాయిలో మందుల నిల్వలు ఉండాలని, ఎస్పీహెచ్ఓలు కూడా ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వైద్యసిబ్బంది పనితీరును సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడ అనారోగ్య సమస్యలతో గిరిజనులు మృతి చెందినా సంబంధిత వైద్యసిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. మరణాలకు సంబంధించి రోజువారీ నివేదికను తమకు అందజేయాలన్నారు. ప్రతి పంచాయతీకి రూ. 4 లక్షల మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయని తద్వారా పారిశుధ్యం, తాగునీటి వనరుల క్లోరినేషన్ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో పాడేరు ఆర్డీఓ రాజకుమారి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికాార్జునరెడ్డి, ఈఈ ఎంఆర్జీ నాయుడు, పీహెచ్ఓ చిట్టిబాబు, పీఏఓ భాగ్యలక్ష్మి, డీఎంఓ ప్రసాదరావు, ఇన్చార్జి ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలాప్రసాద్, అన్ని క్లష్టర్ల ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.