allahabad
-
ఇది ఆజాద్ పార్క్..!
ప్రయాగ్రాజ్ (అలహాబాద్) పేరు వినగానే త్రివేణి సంగమం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఇందిరా గాంధీ పుట్టిన ఇల్లు ఆనందభవన్ గుర్తు వస్తుంది. గూగుల్లో వెతికితే అలహాబాద్లో చూడాల్సిన ప్రదేశాల్లో ఆజాద్ పార్క్ కనిపిస్తుంది. టూర్ ప్లాన్లో పార్కులెందుకు, టైమ్ వేస్ట్ అని కొట్టిపారేస్తుంటాం. కానీ ఆజాద్ పార్కును చూసి తీరాలి. నగరం మధ్యలో 133 ఎకరాల విశాలమైన పార్కు, పచ్చదనం పరిఢవిల్లుతుంటుంది. వాహనాల రణగొణ ధ్వనులు వినిపంచనంత ప్రశాంత వాతావరణం అలరించి తీరుతుంది. టికెట్ తీసుకుని లోపలికి వెళ్లగానే కళ్లు చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్ కోసం వెతుకుతాయి. ఆజాద్ పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారామ్ తివారీ, ఆజాద్ అనేది ఆయన బిరుదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగం చేసిన ప్రదేశమే ఈ పార్కు.చదువరుల పార్కుఆజాద్ పార్క్ బ్రిటిష్ హయాంలో ఏర్పాటైంది. అప్పుడు దాని పేరు ఆల్ఫ్రెడ్ పార్క్. జాతీయోద్యమవాదులు ఈ పార్కులో తలదాచుకుని ఉద్యమవ్యూహాలు రచించేవారు. అలా చంద్రశేఖర్ ఈ పార్కులో ఉన్న సమయంలో ఆ సమాచారం తెలుసుకున బ్రిటిష్ పోలిస్ అధికారి, తన బృందంతో మోహరించాడు. ఆజాద్ తన తుపాకీతో ముగ్గురు పోలీసులను చంపేశాడు. ఆ కాల్పుల్లో ఆజాద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలిసుల చేతిలో చిక్కకుండా తన తుపాకీతో కణత మీద కాల్చుకుని ప్రాణత్యాగం చేశాడు ఆజాద్. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆజాద్ విగ్రహాన్ని స్థాపించి ఆజాద్ మెమోరియల్గా తీర్చిదిద్దారు. ఆ పార్కుకు ఆజాద్ పేరు పెట్టారు. విగ్రహం దగ్గర నిలబడి ఆజాద్కి సెల్యూట్ చేసి మౌనంగా నివాళి అర్పించి బరువెక్కిన గుండెతో ముందుకు సాగిపోతారు పర్యాటకులు.పార్కులో లైబ్రరీ!ఆజాద్ పార్కులో ఆజాద్ మెమోరియల్తోపాటు విక్టోరియా మెమోరియల్ కూడా ఉంది. అయితే అందులో ఇప్పుడు విక్టోరియా స్టాచ్యూ లేదు. ప్రయాగ్రాజ్ సంగీత్ సమితి, మదన్ మోహన్ మాలవ్యా స్టేడియం, అలహాబాద్ మ్యూజియం ఉన్నాయి. అలహాబాద్ పబ్లిక్ లైబ్రరీ బిల్డింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు బ్రిటిష్ కాలం నాటి యూరోపియన్ స్లైట్ నిర్మాణాలు. రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో 5వేల మందికి పైగా సందర్శిస్తారని అంచనా. టికెట్ ఐదు రూపాయలు మాత్రమే. ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ఇక్కడకు నగరవాసులు రెగ్యులర్గా వస్తుంటారు. మంత్లీ టికెట్ వంద రూపాయలు. ఏడాదికి పాస్ తీసుకుంటే వెయ్యి రూపాయలు. పార్కులోపల ఒక ప్రత్యేకమైన ప్రపంచం. రెగ్యులర్గా వాకింగ్కి వచ్చే మహిళలు, రిటైర్ అయిన వాళ్లు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకుంటూ నడక వేగం తగ్గకుండా ముందుకు వెళ్తుంటారు. కోచ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. లైబ్రరీలో సివిల్స్కి ప్రిపేరయ్యే వాళ్లు కనిపిస్తారు. ఆవరణలో ఒక్కొక్కరు ఒక్కో చోట దుప్పటి పరుచుకుని పుస్తకాలు పక్కన పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు. వారి ఏకాగ్రత స్థాయి ఎంతలా ఉంటుందంటే పర్యాటకులు వారి పక్కనే నడిచి వెళ్తున్నా సరే... పుస్తకంలో నుంచి తలతిప్పి చూడరు. వారి చదువుకు భంగం కలిగించకూడదనే పర్యాటకులే ఒకరికొకరు సైగ చేసుకుంటూ శబ్ధం చేయకుండా దూరంగా వెళ్లిపోతుంటారు. ఈ పార్కులోకి ఎంట్రీ ఫీజు ఐదు రూపాయలే కానీ పార్కు గేటు దగ్గర కొబ్బరిబోండా డెబ్బై రూపాయలు. లైట్ అండ్ సౌండ్ షో సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతుంది. 45 నిమిషాలపాటు సాగే ఈ షోలో మోతీలాల్ నెహ్రూ ఇల్లు ఆనందభవన్, అందులో సాగిన స్వాతంత్య ఉద్యమ రచన వివరాలు, ఆజాద్ పార్కులో సాగిన ఉద్యమ ఘట్టాలతో షో నడుస్తుంది. ఆజాద్ మరణంతో ముగిసే ఈ షో మరోసారి మనసును బరువెక్కిస్తుంది. ఈ రోజు మనం పీలుస్తున్న స్వేచ్ఛావాయువుల వెనుక ఎన్ని ప్రాణత్యాగాలో? లైట్ అండ్ సౌండ్ పూర్తయి పార్కులో నుంచి బయటపడేటప్పటికి ఎనిమిది గంటలవుతుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: 'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..) -
జైప్రకాశ్ అసోసియేట్స్పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దివాలా పిటిషన్ల విషయంలో ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. జేపీ గ్రూప్లో కీలకమైన జేఏఎల్ ప్రధానంగా నిర్మాణం, హాస్పిటాలిటీ తదితర వ్యాపారాలు సాగిస్తోంది. కంపెనీ 2037 కల్లా మొత్తం రూ. 29,805 కోట్ల రుణాలను (వడ్డీతో కలిపి) కట్టాల్సి ఉండగా ఇందులో రూ. 4,616 కోట్లు 2024 ఏప్రిల్ 30 నాటికి చెల్లించాల్సి ఉంది. దీన్ని చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం వల్ల లిక్విడిటీ కొరత ఏర్పడటమే డిఫాల్ట్ కావడానికి కారణమంటూ జేఏఎల్ వినిపించిన వాదనలను తోసిపుచ్చిన ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలిచ్చింది. -
హైకోర్టును ఆశ్రయించిన ఐదేళ్ల బుడ్డోడు.. కారణమిదే!
యూపీలోని కాన్పూర్కు చెందిన ఓ బుడ్డోడు అలహాబాద్ హైకోర్టును ఒక ప్రత్యేక అభ్యర్థనతో ఆశ్రయించాడు. తాను చదువుకుంటున్న పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉందని, దానిని తొలగించాలంటూ ఆ ఐదేళ్ల చిన్నారి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మందుబాబులు పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు ఆడ్డాగా మార్చారని ఆ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి కారణంగా తమ చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాడు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. కాన్పూర్లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి అథర్వ తన కుటుంబ సభ్యుల సాయంతో కోర్టుకు ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రతి సంవత్సరం ఈ మద్యం దుకాణం కాంట్రాక్టును ఎలా పునరుద్ధరిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పాఠశాల కాన్పూర్ నగరంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఉంది. అక్కడికి 20 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఉంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాతే తెరవాలి. అయితే తరచూ ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అథర్వ కోర్టుకు తెలిపాడు. అథర్వ కుటుంబ సభ్యులు ఈ విషయమై కాన్పూర్ అధికారులకు, యూపీ ప్రభుత్వానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఈ పాఠశాల 2019లో ప్రారంభమయ్యిందని, మద్యం దుకాణానికి సంబంధించిన ఒప్పందం దాదాపు 30 ఏళ్లనాటిదని వైన్స్ దుకాణ యజమాని వాదనకు దిగారు. ఈ నేపధ్యంలో అధర్వ తన కుటుంబ సభ్యుల సహకారంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ క్షితిజ్ శైలేంద్రలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. -
Aditi Sen De: అద్వితియ ప్రతిభ
పాపులర్ అయిన తరువాత ఆ బాటలో ప్రయాణించడం విశేషమేమీ కాదు. దార్శనికులు మాత్రం వర్తమానంలో ఉంటూనే భవిష్యత్ వెలుగును దర్శిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు అదితి సేన్ డె. ‘క్వాంటమ్’ అనే కాంతి మిణుకు మిణుకుమంటున్న కాలంలోనే దాని ఉజ్వల కాంతిని ఊహించింది అదితి. క్వాంటమ్ సైన్స్లో చేసిన కృషికి డా.అదితి సేన్ డె ‘జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సెలెన్స్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డ్కు ఎంపికైన 33వ శాస్త్రవేత్త, తొలి మహిళా శాస్త్రవేత్త అదితి సేన్ గురించి.... అలహాబాద్లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ (క్యూఐసీ)లో అదితి ప్రొఫెసర్గా పనిచేస్తోంది. ‘క్యూఐసీ’ అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత రూపం. ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శాస్త్రం. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన పరిశోధన రంగాలలో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ ఒకటి’ అంటుంది అదితి. కోల్కతాలో పుట్టి పెరిగిన అదితికి చిన్నప్పటి నుంచి గణితం ఇష్టమైన సబ్జెక్ట్. తల్లి లక్ష్మి టీచర్. తండ్రి అజిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కలకత్తా యూనివర్శిటీలో అప్లాయిడ్ మ్యాథమేటిక్స్లో ఎంఎస్సీ చేసిన అదితి పోలాండ్లోని గడాన్స్క్ యూనివర్శిటీలో భౌతికశాస్త్రంలో పీహెచ్డీ చేసింది. తన థీసీస్కు క్వాంటమ్ ఫిజిక్స్కు సంబంధించిన అంశాన్ని ఎంచుకుంది. ‘రెండు వేల సంవత్సరంలో నా కెరీర్ను మొదలు పెట్టాను. ఆ సమయంలో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రారంభ దశలో ఉంది. పరిమిత సంఖ్యలో అప్లికేషన్లు ఉండేవి’ అంటూ ఆనాటి పరిమితులను గుర్తు తెచ్చుకుంటుంది అదితి. పరిమితులు, ప్రతిబంధకాలతో పనిలేకుండా ‘క్వాంటమ్ ఫిజిక్స్’పై తన ఇష్టాన్ని పెంచుకుంటూ పోయింది. కాలంతో పాటు నడుస్తూ, ఎప్పటికప్పుడు ‘క్వాంటమ్ ఫిజిక్స్’ను అధ్యయనం చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. క్వాంటమ్ థర్మల్ యంత్రాల రూపకల్పన(బ్యాటరీలు, రిఫ్రెజిరేటర్లాంటివి) నుంచి క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ అల్గారిథమ్ల సమర్థవంతమైన అమలు, సూటబుల్ క్వాంటమ్ సిస్టమ్స్ వరకు... ఎన్నో విషయాలపై పని చేస్తోంది అదితి. ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ (2018) అందుకుంది. 2022లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మెంబర్గా ఎంపికైంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ స్విన్సిస్టమ్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ విత్ అల్ట్రా– కోల్డ్ గ్యాసెస్, క్వాంటమ్ కోరిలేషన్స్... మొదలైన వాటికి సంబంధించి అదితి లెక్చర్స్, టాక్స్ ఆదరణ పొందాయి. బెనర్జీ, శ్రీజన్ ఘోష్, శైలాధిత్యలతో కలిసి ‘స్ప్రెడింగ్ నాన్ లోకాల్టీ ఇన్ క్వాంటమ్ నెట్వర్క్స్’, కవన్ మోదీ, అరుణ్ కుమార్, ఉజ్వల్ సేన్లతో కలిసి ‘మాస్కింగ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపాజిబుల్...మొదలైన పుస్తకాలు రాసింది. క్లాసులో పాఠం చెప్పినా, సెమినార్లో ఉపన్యాసం ఇచ్చినా, పుస్తకం రాసినా విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో తనదైన శైలిని ఎంచుకుంది. సంక్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో కమ్యూనికేట్ చేయడం ఆమె శైలి. ‘క్వాంటమ్’పై ఆసక్తి చూపుతున్న ఈతరంలోని చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు అదితి సేన్. ‘క్వాంటమ్’ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. సమన్వయం చేసుకుంటూ... కెరీర్, ఫ్యామిలీలో ఏదో ఒక ఆప్షన్ను ఎంపిక చేసుకోవడంపైనే మహిళా శాస్త్రవేత్తల కెరీర్ కొనసాగుతుందా, ఆగిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అయితే కెరీర్, ఫ్యామిలీని సమన్వయం చేసుకుంటూ వెళితే సమస్యలు ఉండవు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తిరిగి పనిలో చేరి అద్భుతమైన శక్తిసామర్థ్యాలను చాటుకున్న మహిళా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. – అదితి సేన్ -
‘కీచక న్యాయం’పై కొరడా!
ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తరచు రుజువవుతూనే వుంది. ఆఖరికి న్యాయదేవత కొలువుదీరే పవిత్ర స్థలం కూడా అందుకు మినహాయింపు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కు ఉత్తర ప్రదేశ్లోని బాందా జిల్లా మహిళా సివిల్ జడ్జి రాసిన బహిరంగ లేఖ స్పష్టం చేస్తోంది. జిల్లా జడ్జి, ఆయన అనుచరుల నుంచి ఆమె ఎదుర్కుంటున్న వేధింపులు ఎలాంటివో, అవి ఎంత ఆత్మ న్యూనతకు లోనయ్యేలా చేశాయో మహిళా జడ్జి వాడిన పదజాలమే పట్టిచూపుతోంది. ‘నన్నొక వ్యర్థపదార్థంగా చూస్తున్నారు. పురుగుకన్నా హీనంగా పరిగణిస్తున్నారు’ అని అన్నారంటే ఆమె వేదనను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ‘గత ఏడాదిన్నరగా నడిచే శవంగా బతుకీడుస్తున్నాను. ఇక జీవరహితమైన ఈ కాయాన్ని కొనసాగించలేను. ఆత్మహత్యకు అనుమతించండి’ అని కూడా ఆమె రాశారు. ‘మీరంతా ఆటబొమ్మగా, ప్రాణరహిత పదార్థంగా మారటం నేర్చుకోండి’ అని మహి ళలనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తనను రాత్రిపూట ఒంటరిగా కలవమంటూ వేధిస్తున్నారని మొన్న జూలైలో ఆమె చేసిన ఫిర్యాదుపై హైకోర్టులోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించింది. కానీ కింది ఉద్యోగులు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలంటే ఆ జడ్జిని విచారణ సమయంలో బదిలీ చేయాలన్న వినతిని పట్టించుకున్నవారు లేరు. దీనిపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేస్తే ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం తోసిపుచ్చటం ఆమె తట్టుకోలేక పోయారు. నిరుడు దేశవ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు చోటు చేసుకున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక చెబుతోంది. లైంగిక నేరాలకు సంబంధించి సగటున ప్రతి 51 నిమిషాలకూ ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ 65,473 కేసులతో మొదటి స్థానంలో వుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. పనిచేసే చోట మహిళలను వేధించటంలో ఢిల్లీ అగ్రస్థానంలో వుంది. నిజానికి వాస్తవ ఘటనలతో పోలిస్తే కేసుల వరకూ వెళ్లే ఉదంతాలు తక్కువనే చెప్పాలి. అందరి దృష్టిలో పడతామని, ఉపాధి కోల్పోతామని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రతీకారానికి దిగొచ్చని భయపడి చాలామంది ఫిర్యాదు చేయటానికి వెనకాడతారు. ఈ వేధింపుల పర్యవసానంగా చాలామంది మహిళలు ఆత్మాభిమానం దెబ్బతిని, మానసిక క్షోభకు లోనయి వృత్తిపరంగా ఎదగలేని నిస్సహా యస్థితిలో పడుతున్నారు. ఇలాంటì కేసులు తమముందు విచారణకొచ్చినప్పుడు నేరగాళ్లను కఠి నంగా శిక్షించి, బాధితులకు ఉపశమనం కలగజేయాల్సిన చోటే... మహిళా న్యాయమూర్తులకు వేధింపులుంటే ఇంతకన్నా ఘోరమైన స్థితి ఉంటుందా? నిజానికి న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపులుంటున్నాయని ఆరోపణలు రావటం ఇది మొదటిసారేమీ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదులొచ్చిన సందర్భా లున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగోయ్పై 2019లో ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను మొదట బదిలీ చేసి,ఆ తర్వాత సర్వీసునుంచి తొలగించి చివరకు చీటింగ్ కేసు కూడా పెట్టారు. గొగోయ్ పదవీ విరమణ చేశాక ఆ మహిళకు తిరిగి ఉద్యోగం లభించింది. జస్టిస్ గొగోయ్కి మాత్రం ఏం కాలేదు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేసిన మహిళ కూడా ఇలాంటిస్థితినే ఎదుర్కొన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను వేధించిన తీరు గురించి ఆమె ఫిర్యాదు చేశారు. తన గోడు అరణ్యరోదన కావటంతో గత్యంతరం లేక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన వేధింపులు ఎలావుండేవో సోదాహరణంగా వివరించారు కూడా. ‘నీ పని తీరు చాలా బాగుంది. నీ అందం మరింత బాగుంది’ అనటం, ఒక శుభకార్యంలో నృత్యం చేయాలంటూ భార్యతో ఫోన్ చేయించటం, ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఫోన్ చేయటం తేలిగ్గా కొట్టిపారేయదగ్గ ఆరోపణలు కాదు. కానీ విషాదమేమంటే ఆ ఫిర్యాదుకు అతీగతీ లేక పోయింది. ఆ న్యాయమూర్తి నిక్షేపంగా తన పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఆయన రిటైర్ కావటంతో తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆమె 2018లో పిటిషన్ పెట్టుకున్నారు. చివరకు ఆ మహిళా జడ్జి స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించుకుని నిరుడు ఉద్యోగంలో చేరడానికి అనుమతించింది. చదువూ సంస్కారం లేనివాళ్లూ, జులాయిలుగా తిరిగేవాళ్లూ మహిళలపై, బాలికలపై వేధింపులకు దిగుతారనే అపోహ వుంది. కానీ పెద్ద చదువులు చదువుకుని, ఉన్నత పదవులు వెలగబెడు తున్న వారిలో కొందరు ఆ తోవలోనే ఉంటున్నారని అప్పుడప్పుడు వెల్లడవుతూనే వుంది. ఇలాంటి కేసుల్లో అసహాయ మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మహిళా న్యాయమూర్తులకు సైతం వేధింపులుంటే ఇక దిక్కెవరు? కాలం మారింది. యువతులు చదువుల్లో ఎంతో ముందుంటున్నారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. వేరే వృత్తి ఉద్యోగాలను కాదనుకుని న్యాయవ్యవస్థ వైపు వచ్చే వారిలో చాలామంది సమాజానికి ఏదో చేద్దామన్న సంకల్పంతో వస్తారు. అలాంటి వారికి సమస్య లుండటం దురదృష్టకరం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆ మహిళా జడ్జి లేఖపై వెనువెంటనే స్పందించటం, అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదిక కోరటం హర్షించదగ్గ అంశం. గతంలో మాదిరి కాక దోషులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ కీచకపర్వం ఆగదు. -
3 హైకోర్టులకు 13 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం
అలహాబాద్, కర్నాటక, మద్రాస్ హైకోర్టుల్లో 13 మంది అదనపు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో 11 మంది లాయర్లు కాగా ఇద్దరు న్యాయాధికారులు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో సిఫార్సు చేసింది. వీరిలో మద్రాస్ హైకోర్టు న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి బీజేపీతో సంబంధాలున్నాయనే ఆరోపణ వివాదం రేపింది. ఈమె పేరును సిఫార్సు చేయడాన్ని మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. బార్కు చెందిన 21 మంది లాయర్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ‘‘తాను బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శినంటూ గౌరీ అంగీకరించారు. మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. మత ఛాందస భావాలున్న ఆమె న్యాయమూర్తిగా అనర్హురాలు’’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 10న విచారణ జరగాల్సి ఉంది. దానిపై మంగళవారమే విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. పార్టీలతో సంబంధాలున్న వారూ జడ్జీలు కావచ్చని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు అనడం తెలిసిందే. -
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్ ఫీజు అందించిన వైనం
లక్నో: ప్రతిష్టాత్మక ఐఐటీ బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్యూ)కి అర్హత సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అడ్మిషన్ కోల్పోతున్నాను అంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన బాలిక సంస్కృతి రంజన్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే ఆమె జేఈఈ ఉమ్మడి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, షెడ్యూల్డ్ కులాల విభాగంలో రెండు వేల ర్యాంకును సాధించింది. ఈ మేరకు సంస్కృతి రంజన్ హైకోర్టుకు హాజరై... ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా గణితం, కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన ఐదేళ్ల కోర్సు ప్రవేశ రుసుము మొత్తం రూ 15 వేలు చెల్లించలేకపోతున్నాను. నా తండ్రి కిడ్ని వ్యాధి కారణంగా మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతోంది’’ అని తెలిపింది. (చదవండి: జపాన్లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) అంతేకాక ‘‘నేను నా పరిస్థితిని వివరిస్తూ..అడ్మిషన్ గడువు తేదిని పొడిగించండి అంటూ జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీకి చాలాసార్లు లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందువల్ల నన్ను కాలేజీలో చేర్చుకునేలా విశ్వవిద్యాలయానికి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీట్ల కేటాయింపు సంస్థకు ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలి" అని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన దినేష్ కుమార్ సింగ్తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ యూనివర్సిటిలో మూడు రోజుల్లో రిపోర్టు చేయాల్సిందిగా పిటిషన్లో కోరింది. అయితే ధర్మాసనం ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించడమేకాక తన తండ్రి ఆరోగ్య దృష్ట్యా కిడ్ని మార్పిడి చేయించుకోమని సలహా సూచించింది. ఈ క్రమంలో న్యాయమూర్తి దినేశ్సింగ్ మాట్లాడుతూ..."అంతేకాదు మేము ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని డబ్బుని అందజేస్తాం. పైగా ఒక దళిత యువతి ఐఐటీలో ప్రవేశం పొందాలనే తన కలను సాకారం చేసుకునేందుకు తనకు న్యాయం చేయమని కోరుతూ ఈ కోర్టు ముందుకి వచ్చింది. అందువల్లే ఈ కోర్టు స్వయంగా సీటు కేటాయింపు కోసం రూ. 15,000 విరాళంగా ఇస్తోంది." అని న్యాయమూర్తి దినేశ్ సింగ్ అన్నారు. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) -
దారుణం: వెంటిలేటర్ లేక సీనియర్ వైద్యుడు మృతి
సాక్షి,లక్నో: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు మూడున్నర లక్షలకుపైగా వణికిస్తోంది. రోజుకు రోజుకుపెరుగుతున్న బాధితులతో దేశ రాజధానిలో కరోనా ఉగ్రరూపాన్నిదాల్చింది. తీవ్ర ఆక్సిజన్ కొరత మృత్యు ఘంటికలను మోగిస్తోంది. అటు ఉత్తర ప్రదేశ్లో కరోనా కల్లోలం కానసాగుతోంది. ఈ క్రమంలో వెంటిలేటర్ లభ్యంకాక ఒక సీనియర్ డాక్టర్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్రాజ్ ఆసుపత్రిలో 50 ఏళ్లపాటు ఎనలేని సేవలదించిన సీనియర్ సర్జన్ డాక్టర్ జెకె మిశ్రా (85) సమయానికి వెంటిలేటర్ అందుబాటులోకి రాక అదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కోవిడ్తో బాధపడుతున్న ఆయన భార్య, ప్రముఖ గైనకాలజిస్ట్ రామ మిశ్రా (80) కళ్లముందే ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో మిశ్రా కుటుంబ సభ్యులతో పాటు, ఆసుపత్రి సిబ్బంది,ఇతరులు విచారంలో మునిగి పోయారు. అలహాబాద్లోని స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ఆసుపత్రిని తరువాతి కాలంలో ప్రయాగ్రాజ్ అని పేరు మార్చారు. ఈ ఆసుపత్రిలో మొట్టమొదటి రెసిడెంట్ సర్జన్లలో మిశ్రా ఒకరు. ఆయన భార్య డాక్టర్ రామ మిశ్రా అధ్యాపక సభ్యురాలు.ఇద్దరు పదవీ విరమణ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు లేకపోవడంవల్లే తమ బంధువులను కోల్పోయామని బాధిత కుటుంబాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పించాయి. దాదాపు 50 ఏళ్లపాటు విశేష సేవలందించిన మిశ్రాకు వెంటిలేటర్ దొరకక ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యం సీనియర్ వైద్యులుగా తమకెదురైన భయంకరమైన అనుభవాలను మీడియాతో షేర్ చేశారు. (కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం) ‘‘ఆ హాస్పిటల్ ఆయనకు రెండో ఇల్లు... ఈ హాస్పిటల్ తమను కాపాడుతుందని భావించాం.. కానీ కానీ అదే తాము చేసిన పెద్ద తప్పయిపోయింది. తీవ్ర అనారోగ్యంతో ఆక్సిజన్ స్థాయి లెవల్స్ పడిపోయి స్థితిలో ఏప్రిల్ 13న ఆసుపత్రిక వచ్చాం..నొప్పితో బాధపడుతూ, చికిత్స కోసం ఎదురుచూస్తూ, బెడ్స్ దొరక్క ఒక రాత్రంతా గడిపాల్సి వచ్చిందదంటూ రామ మిశ్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు హాస్పిటల్ సిబ్బంది మిశ్రాకోసం బెడ్ సమకూర్చారు. కానీ, నేను మాత్రం నేలపైనే పడుకున్నా. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు. బీపీ మానిటర్ లాంటి కనీస సౌకర్యాలు లేవు. ఆయనకు మొదటి రెండు రోజుల్లో ఇంజక్షన్లుఇచ్చారు. కానీ అవేమిటో అడిగినా చెప్పలేదు. అసలు అక్కడ రోగులను పట్టించుకునేనాధుడేలేదు.. ఈ క్రమంలో ఏప్రిల్ 16 మధ్యాహ్నం నుంచి తన భర్త పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. వెంటిలేటర్లో ఉంచమని వైద్యులను వేడుకున్నాను. కానీ కీలకమైన (లారింగోస్కోప్, ఎండోట్రాషియల్ (ఇటి) ట్యూబ్) పరికరాలు వెంటనే అందుబాటులో లేవు. మరోవైపు ఆయనకు విపరీతమైన దగ్గు, రక్తం పడుతోంది. క్షణ క్షణానికి పరిస్థితి విషమిస్తోంది. హాస్పిటల్ సిబ్బందిని గట్టిగా అరిచేసరికి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే ఆయన్ను పై అంతస్తులో ఐసీయూలోకి తరలించారు. దీంతో పరిస్థితి మరింత విషమించింది. తాను పైకి వెళ్లేసరికే ఆయన ఊపిరి ఆగిపోయిందంటూ ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు. రెండో ఆలోచన లేకుండా.. ఆదుకుంటుందనే ఆశతో ఈ ఆసుపత్రికి వచ్చాం...కానీ ఈ ఆసుపత్రే తన భర్త ప్రాణాలను బలి తీసుకుందంటూ ఆమె ఆవేదన వెలిబుచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తిరస్కరించింది. 25-30 కంటే తక్కువ ఆక్సిజన్ స్థాయిలతో 500 మంది రోగులు ఉన్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. రోగులందరినీ కాపాడటానికి చేయగలిగిందంతా చేస్తున్నాం.. అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం తమకు ఉందని తెలిపింది. అలాగే డాక్టర్ జెకె మిశ్రా గుండెపోటుతో మరణించారని కూడా వెల్లడిండంచింది. కాగా రికార్డు స్థాయి కేసులతో దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ ప్రకంపనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దీంతో పలువురు వైద్యులు తమ ప్రాణాలకు తెగించి మరీ కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది వైద్యులు,ఇతర సిబ్బంది కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. చదవండి :ఆక్సిజన్ కొరత: సింగపూర్ భారీ సాయం పీరియడ్స్ టైంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? -
అలహాబాద్ పేరు మార్పుపై సుప్రీం నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోమవారం నాడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అలహాబాద్ హెరిటేజ్ సొసైటీ దాఖలు చేసిన ఈ పిటిషన్ భారత ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన త్రిసభ్య బెంచీ ముందుకు వచ్చింది. (చదవండి: వామ్మో! ఇన్ని పేర్లు ఎలా మార్చగలం ?) అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా 2018, అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నిర్ణయం ద్వారా మార్చారు. దాన్ని నాడు కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘గంగా, యమున సంగమం ప్రాంతంలో మొగల్ చక్రవర్తి అక్బర్ తన కోటను నిర్మించిన 16వ శతాబ్దానికి ముందు అలహాబాద్ను ప్రయాగ్గా పిలిచేవారు. నాడు ఆయన ప్రయాగ్ను ఇలాహాబాద్గా పేరు మార్చగా, ఆయన మనవడు షా జహాన్ దాన్ని అలహాబాద్గా మార్చారు. బ్రహ్మ దేవుడు ప్రయాగ్ వద్ద మొట్ట మొదటి యజ్ఞాన్ని నిర్వహించారు. రెండు నదులు కలిసే చోటును ప్రయాగ్ అంటారు. అలహాబాద్లో గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలిశాయి. అందుకని అది ప్రయాగ్కు రాజ్ లాంటిది. కనుక ప్రయాగ్రాజ్ అయింది’ అని నాడు యోగి ఆదిత్యనాథ్ పేరు మార్పు వెనక కథనాన్ని వినిపించారు. అప్పుడు సోషల్ మీడియాలో ప్రయాగ్రాజ్గా పేరు మార్పుపై హాస్యోక్తులు వెల్లువెత్తాయి. ‘నీవు ఎక్కడ పుట్టావు ?’ అని ఒకరు ఒకరిని ప్రశ్నించగా, ‘ప్రయాగ్రాజ్’లో అంటూ సమాధానం. ‘ఏ కోచ్లో పుట్టావ్?’ అంటూ అనుబంధ ప్రశ్న. అప్పటికే ఢిల్లీ–అలహాబాద్ మధ్య తిరిగే రైలొకటి ‘ప్రయాగ్రాజ్’గా ప్రసిద్ధి చెందిన విషయం తెల్సిందే. -
జడ్జీలు నిర్భీతి ప్రబోధకులుగా ఉండాలి
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడానికి జడ్జీలు నిర్భయులైన ప్రబోధకులుగా ఉండాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2012లో ఓ న్యాయవాది యూపీలోని అలహాబాద్ చీఫ్ మెజిస్ట్రేట్పై దాడికి ప్రయత్నించాడు. ఈ కేసును శుక్రవారం విచారించిన ధర్మాసనం..‘జడ్జీలు నిర్భీతితో, నిష్పాక్షికంగా తమ తీర్పులను ఇవ్వాల్సి ఉంటుంది. వారిని అవమానించడం, దూషించడం ద్వారా తీర్పులను ప్రభావితం చేయరాదు’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దిగువకోర్టు విధించిన 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానాను సమర్థించిన సుప్రీంకోర్టు.. శిక్ష అమలును మూడేళ్ల పాటు వాయిదా వేసింది. 2022, జూన్ 30 వరకూ సదరు న్యాయవాది అలహాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోకి రాకుండా, సత్ప్రవర్తనతో మెలిగితే ఈ శిక్షను కొట్టివేస్తామని స్పష్టం చేసింది. -
కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
-
అతడి స్టైల్ అదే.. అందరినీ అలాగే చంపాడు!
లక్నో : వరుస హత్యలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న సీరియల్ కిల్లర్ను కుంభమేళా వద్ద అలహాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆర్నెళ్లలో పది మందిని హతమార్చి మరో ఇద్దరిని హత్య చేయబోయిన అతడిని పట్టుకున్న టీమ్కు 50 వేల రూపాయల నజరానా లభించింది. వివరాలు... ప్రయాగ్ రాజ్(అలహాబాద్) జిల్లా బసెహర గ్రామానికి చెందిన కలువా అలియాస్ సుభాష్(38) గతేడాది జూలై నుంచి కిడీగంజ్, పరేడ్గ్రౌండ్, కుంభమేళా తదితర ప్రాంతాల్లో వరుసగా హత్యలకు పాల్పడ్డాడు. ఫుట్పాత్పై నిద్రించే కూలీలను లక్ష్యంగా చేసుకుని అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం కుంభమేళా పరిసర ప్రాంతాల్లో నిద్రపోతున్న ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఎస్ఎస్సీ నితిన్ తివారీ మాట్లాడుతూ...‘ గత ఆరు నెలలుగా సుభాష్ పది మందిని హత్య చేశాడు. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. బాధితుల దుస్తులతోనే వారి ముఖాన్ని కప్పి ఊపిరాడకుండా చేసేవాడు. ఆ తర్వాత గొడ్డలి వంటి పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడి వారిని అంతమొందించేవాడు’ అని చెప్పారు. హత్యలు చేయడం వెనుక అతడి ఉద్దేశం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విచారణలో ఆ విషయాలన్నీ బయటపడతాయని పేర్కొన్నారు. -
స్త్రీలోక సంచారం
జనవరి 19 నుంచి అలహాబాద్లో మొదలయ్యే ప్రయాగ కుంభ మేళా ఉత్సవాలకు వచ్చే మహిళా భక్తులతో మర్యాదగా ఎలా మసులుకోవాలో, వారికి అవసరమైన సదుపాయాలకు లోటు రాకుండా ఎలా నిర్వహణ ఏర్పాట్లు చేయాలో పోలీస్ సిబ్బందికి, పారామిలటరీ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయాగ్రాజ్ (ఉత్తరప్రదేశ్)లోని ‘గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (జీబీపీఎస్ఎస్ఐ) ముందుకొచ్చింది. మార్చి 4 వరకు జరిగే ఈ కుంభమేళాకు దాదాపు 10 కోట్ల మంది వస్తుండగా, వారిలో సగం మంది మహిళలే ఉంటారన్న అంచనా ఉంది కనుక ఎన్నడూ లేని విధంగా మహిళలకు ప్రత్యేక ఘాట్లను నిర్మిస్తున్నారు. కుంభ్ ఏరియా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.పి.సింగ్కి వచ్చిన ఈ ఆలోచనతో కుంభమేళ ఉత్సవాలను ఈసారి ‘ఉమెన్ ఫ్రెండ్లీ’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవాళ ఆదివారం ఈ రద్దీ మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో ‘ట్రావంకోర్ దేవస్వం బోర్డు’ అందోళన చెందుతోంది. అయితే అందుకు వేరే కారణం ఉంది. కోర్టు తీర్పుతో లభించిన స్వేచ్ఛతో చెన్నైలోని ‘మానితి’ అనే సంస్థ సభ్యులు (వీరంతా యాభై ఏళ్లలోపు వారే) 50 మంది ఇవాళ అయ్యప్ప దర్శనానికి శబరిమల చేరుకోబోతున్నారు. వారి రాకను ప్రతిఘటిస్తున్న స్థానిక రాజకీయ పక్షాల కారణంగా తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించి వీలైనంత వరకు ఇరువైపుల వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసేందుకు దేవస్వం బోర్డు పోలీసు యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతోంది. -
‘పేరు’ గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనా!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2017లో ఆదిత్యనాథ్ యోగిని ఎంపిక చేసినప్పుడు ‘కరడుగట్టిన హిందూత్వ’ వాదిని ఎంపిక చేయడానికి తామేమి వెనకాడమని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. అప్పటికీ గోరఖ్పూర్ ఆలయానికి పీఠాధిపతిగా కొనసాగుతున్న ఆయనపై పలు దొమ్మి కేసులతోపాటు మత ఘర్షణలు, హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారంటూ పలు కేసులు ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చాన తనపై ఉన్న అన్ని కేసులను తానే స్వయంగా కొట్టివేసుకున్నారు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ను పాకిస్తాన్ టెర్రరిస్టుగా అభివర్ణించి, మసీదుల్లో హిందూ విగ్రహాలను ప్రతిష్టిస్తానంటూ ఆదిలోనే వివాదాస్పదుడిగా ముద్ర పడిన యోగి ఆదిత్యనాథ్ యూపీలోని అన్ని ముస్లిం ప్రాంతాల పేర్లను తొలగించి వాటి స్థానంలో హిందూ పేర్లను ప్రవేశ పెడుతూ పోతున్నారు. గోరఖ్పూర్లోని భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయానికి మహాయోగి గోరఖ్నాథ్ పేరును పెట్టారు. ముఘల్సరాయ్ రైల్వేస్టేషన్కు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ అని, మొఘల్ చక్రవర్తి అక్బర్ కనుగొన్న అలహాబాద్ నగరం పేరు మార్చి ప్రయాగ్రాజ్ పేరు పెట్టారు. ఫైజాబాద్ జిల్లాను అయోధ్యగా మారుస్తున్నట్లు దీపావళి వేడుకల్లో ఆదిత్యనాథ్ ప్రకటించారు. గతంలోనే ఉర్దూ బజార్ను హిందీ బజార్గా, హుమాయున్ నగర్ను హనుమాన్ నగర్గా మార్చారు. తాజ్ మహల్ పేరును కూడా మార్చి రామ్ మహల్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రామ రాజ్యాన్ని స్థాపిస్తానని ముఖ్యమంత్రయిన కొత్తలో ప్రకటించిన ఆయన పేర్ల ఆలోచనలో పడి ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయినట్లున్నారు. ఒక్క భారత్లోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే పేద ప్రాంతంగా, పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన రాష్ట్రంగా యూపీ ఇప్పుడు గుర్తింపు పొందింది. సబ్ సహారా ఆఫ్రికాలో పుట్టడం కన్నా యూపీలో ఓ శిశువు జన్మిస్తే నెల లోపల ఆ శిశువు మరణించే అవకాశాలు రెండింతలు ఉన్నాయని ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్ తాజా సంచికలో వెల్లడించింది. పొరుగునున్న నేపాల్కన్నా యూపీలో మనిషి ఆయుషు ప్రామాణం తక్కువ. నైజీరియా, బంగ్లాదేశ్లకన్నా సరాసరి రాష్ట్ర జీడీపీ రేటు తక్కువ. యూపీలోని కాన్పూర్ నగరాన్ని ప్రపంచంలోనే అతి కాలుష్యనగరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలనే ప్రకటించింది. ఇక మానవ అభివృద్ధి సూచికలో పాకిస్థాన్ కన్నా వెనకబడి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై యోగి దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
రావణాసుర, దుర్యోధన.. ఈ పేర్లు ఎందుకు పెట్టరు?
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్గా మార్చడాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమర్థించుకున్నారు. తన నిర్ణయాన్ని పౌరాణిక పాత్రలైన రావణాసుర, దుర్యోధునులతో పోలుస్తూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘అలహాబాద్ పేరును ఎందుకు మార్చారని కొంత మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. వారందరనీ ఒకటి అడుతుతున్న.. మీ తల్లిదండ్రులు మీకు రావాణాసుర, దుర్యోధన అని ఎందుకు పేర్లు పెట్టడం లేదు? ఇది కూడా అలాగే. ఎవరైనా మంచి పేర్లను పెడుతారు’ అని యోగి పేర్కొన్నారు. అలహాబాద్ అసలు పేరు ‘ప్రయాగ్’. కానీ 16 శతాబ్దంలో మొగల్ చక్రవర్తి అక్బర్.. గంగా, యమున నదుల సమీపంలో ఓ కోటను స్థాపించి దాని పేరు సంగం అని పెట్టారు. అలాగే ప్రయాగ్ ప్రాంతం, సంగం ప్రాంతాల మొత్తాన్ని ఇలహాబాద్గా నామకరణం చేశారు. తర్వాత అక్బర్ మనువడు షాజహాన్ దాన్ని అలహాబాద్గా నామకరణం చేశారు. (అయోధ్య’పై త్వరలో శుభవార్త) కాగా ఇటీవల అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్గా యోగి ఆదిత్యానాథ్ సర్కార్ తీర్మానం చేసింది. ‘బ్రహ్మదేవుడు మొదట యజ్ఞం చేసిన ప్రదేశం ప్రయాగ్. రెండు నదులు కలిసే చోట ఇది ఉంది. అలాగే అలహాబాద్లో గంగా, యమునా, సరస్వతీ మూడు నదులు కలుస్తాయి. అందుకే దాన్ని కింగ్ ఆఫ్ ప్రయాగ్ అంటారు. ఈ కారణంతోనే అలహాబాద్కు ‘ప్రయాగ్ రాజ్’ పేరును ఖరారు చేశామ’ని సీఎం యోగి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఒక రాజకీయ జిమ్మిక్కు అని, బలవంతంగా హిందూత్వ ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారని ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి. అయోధ్యలో రాముని భారీ విగ్రహం! -
అలహాబాదూ... నీ పేరేం బాలేదు!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగికి వన్ ఫైన్ డే అలహాబాద్ పేరు తీరు నచ్చలేదు. వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించి ఆ పేరుని ప్రయాగ రాజ్గా మార్చి పారేశారు. ఇంతకు ముందు చాలా ఏళ్ల క్రితం రెండు సార్లు ఆ ప్రయత్నం జరిగినా ఫలితం లేకపోయింది. యోగినా మజాకా.. వెంటనే తేల్చి పారేశారు. దెబ్బకు అలహాబాద్ చరిత్ర పుటల్లో కలిసిపోయింది. అయితే కారణం కూడా సెలవిచ్చారు. అక్బర్ తప్పుని తాను సరిచేస్తున్నట్టు ప్రకటించారు. క్షణ కాలం తికమక పడ్డాను.. ఈమధ్య కేంద్ర మంత్రి అక్బర్ తప్పుల మీద కుప్పలు కుప్పలుగా అమ్మాయిల ఆరోపణలు వస్తున్నాయి. వాటికీ, దీనికీ లింకేమిటా అని. అప్పుడు బల్బు వెలిగింది. ఈ అక్బర్ కాదు.. నాటి మొఘల్ చక్రవర్తి అక్బర్ అని. ఆయన పెట్టిన పేరు అలహాబాద్. అలహాబాద్ పేరు 500 ఏళ్ల నుంచి జనం నోళ్లలో నానుతూ, అలవాటైన తరువాత దాన్ని ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి తప్పు అంటున్నారు. పోనీ ఆయన అంతవరకూ వేరే పేరుతో ఉన్న నగరానికి పేరు మార్చి పెట్టారా అంటే అదీ లేదు. మరి తప్పేమిటో? ఎవరైనా దీనిపై సందేహం వెలిబుచ్చితే మీకు సంస్కృతి గురించి ఏమాత్రం తెలియదంటారు. అయినా ఊరు పేరు మార్చి గొప్పలు పోవడమే వింత. ఇంతవరకూ ఏడుగురు ప్రధానుల్ని అందించిన అలహాబాద్, జీవన ప్రమాణాల్లో (లివబుల్ సిటీస్) 111 భారతీయ పట్టణాల్లో, 96వ స్థానంలో నిలిచింది. అంటే అంత తీసికట్టులో ఉంది. అక్కడ సౌకర్యాలు పెంచడానికి కృషి లేకపోయినా, పేరు మార్చి ఘనకార్యంగా భావిస్తోంది ఆ ప్రభుత్వం. అయినా ఆ బ్రహ్మచారి ముఖ్యమంత్రికి బారసాల కార్యక్రమాలు కొత్తేమి కాదు. వీధులు పేర్లు, వాడల పేర్లు వందల కొద్దీ మార్చేస్తున్నారు. అంతగా మాట్లాడితే అక్కడంతా అదే తీరు. మాయావతి ముఖ్యమంత్రిగా జిల్లాల పేర్లు మార్చేస్తే, తరువాత పదవిలోకి వచ్చిన అఖిలేష్ మళ్లీ వాటిని మార్చారు. ఈ అనవసర నామకరణం, బారసాల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా స్ఫూర్తిగా తీసుకొనే ప్రమాదం కనబడుతోంది. అదే బాధాకరం. నగరాలు, పట్టణాల పేర్లను మార్చడంలో రికార్డు సృష్టిస్తున్న పాలకులు వాటి అధ్వాన పరిస్థితులను కూడా కాస్త పట్టించుకుంటే బావుంటుంది కదా! డా‘‘ డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం -
అందరు చూస్తుండగానే.. రౌడీ షీటర్ హత్య
అలహాబాద్ : ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్లో ఓ రౌడీషీటర్ను సినీ ఫక్కీలో దారుణంగా హత్య చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలహాబాద్లోని రాజాపూర్ కాలనీలో దుర్గామాత పూజ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో అందరు చుస్తుండగానే కొందరు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం బాంబు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధంచి దృశ్యాలు సీసీ కెమెరాలో రాకార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తిని నీరజ్ బాల్మీకిగా గుర్తించారు. అతనిపై రౌడీషీటుందని, పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. -
అలహాబాద్ ఇక ప్రయాగ్ రాజ్..!
సాక్షి, లక్నో/ఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్గా యోగి ఆదిత్యానాథ్ సర్కార్ మంగళవారం మార్చేసింది. ఈ మేరకు పేరు మారుస్తూ.. యోగి కేబినెట్ తీర్మానం చేసింది. యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఒక రాజకీయ జిమ్ముక్కు అని, బలవంతంగా హిందూత్వ ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారని ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి. -
అలహాబాద్.. ఇకపై ప్రయాగ్రాజ్!
అలహాబాద్: చారిత్రక నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడారు. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే అలహాబాద్ పేరును మారుస్తాం. ప్రయాగ్రాజ్గా మార్చాలన్నది ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష. అందరూ అంగీకరిస్తే ప్రయాగ్రాజ్గా మారుస్తాం’ అని తెలిపారు. ఈ మేరకు సీఎం పంపించిన ప్రతిపాదనలకు గవర్నర్తో పాటు కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఇక్కడ జరగనున్న కుంభమేళాకు ముందుగానే కొత్తపేరు ప్రయాగ్రాజ్ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. -
యూపీ సీఎం సంచలన నిర్ణయం
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్య పట్టణమైన అలహాబాద్ పేరును మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది కుంభమేళా జరగనున్న నేపథ్యంలో త్వరలోనే అలహాబాద్ను ప్రయాగ్రాజ్గా మార్చనున్నట్లు ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అలహాబాద్ పేరు మార్పు ప్రతిపాదన గవర్నర్ ముందు పెట్టామని.. అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. కేబినెట్ ఆమోదం అనంతరం ‘ప్రయాగ్ రాజ్’ వాడుకలోకి వస్తుందని చెప్పారు. కుంభమేళా ఏర్పాట్లపై మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఏర్పాటు ప్రారంభమయ్యాయి. కుంభమేళా జరిగే ప్రాంతంలో అన్ని సదుపాయలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ పాంత్రంలో ఎటీఎంలు, సెల్ టవర్లు, చేతిపంపులు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం’ అని సీఎం అన్నారు. 2019 జనవరి 15న కుంభమేళా ప్రారంభం కానుంది. దాదాపు 192 దేశాల నుంచి కోట్లలో భక్తులు రానున్నారు. -
నడిరోడ్డుపై దారుణం!
-
వైరల్: నడిరోడ్డుపై దారుణం!
అలహాబాద్: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ భూవివాదం రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రాణాలను తీసింది. నడిరోడ్డుపై వెళ్తున్న ఆ మాజీ పోలీస్ అధికారిని దుండగలు పట్టపగలే చితక్కొట్టారు. పెద్ద పెద్ద రాడ్లతో దారుణంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆ అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆ వృద్ధునిపై దాడి చేస్తుంటే పక్కన ఉన్నవారు ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. 70 ఏళ్ల అబ్దుల్ సమద్ ఖాన్ రిటైర్డ్ ఎస్ఐ. అతను సైకిల్పై వస్తుండగా.. ఓ వ్యక్తి పెద్ద రాడ్తో అతనిపై దాడి చేశాడు. దీంతో అబ్దుల్ కిందపడిపోగా మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ అబ్దుల్ను స్థానికులు అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భూవివాదమే కారణమని, నిందితుల్లో ఒకరికి నేరచరిత్ర ఉందని తెలిపారు. -
భార్యను చంపి ఫ్రిజ్లో, పిల్లల్ని సూట్కేసులో..
అలహాబాద్ : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఒకరు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించగా.. మరొకరి శవం ఫ్రిజ్లో, ఇద్దరి శవాలు సూటుకేసులో, ఇంకొకరిది బీరువాలో లభించాయి. మృతదేహాలు అలహాబాద్లోని ధుమాన్గంజ్ చెందిన మనోజ్ కుష్వాహ(35), అతడి భార్య, వారి ముగ్గురు పిల్లలవిగా పోలీసులు గుర్తించారు. భార్యపై అనుమానంతో భర్తే.. గత మూడు రోజులుగా మనోజ్ కుష్వాహా ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా మనోజ్ ఫ్యాన్కు వేలాడుతూ కన్పించాడు. అతడి భార్య మృతదేహం వేరే గదిలో ఉన్న ఫ్రిజ్లో, ఇద్దరు పిల్లల శవాలు సూట్కేసులో, మరో పాప శవం బీరువాలో లభించాయి. భార్యా పిల్లలను హత్య చేసి మనోజ్ ఈ ఘాతుకానికి పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భార్యపై అనుమానంతోనే అతడు ఇంత దారుణానికి ఒడిగట్టివుంటాడని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఫ్రిజ్, సూట్కేసు, బీరువాలో శవాలు
లక్నో: ఒక కుటుంబంలోని మొత్తం ఐదుగురు సభ్యులు చనిపోయి వుండడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్, అలహాబాద్, ధుమాంగంజ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద పరిస్థితిలో మృతదేహాలు పడివుండటం పలు సందేహాలకు తావిస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటి తాళం వేసి వుండటంతో పగుల గొట్టి ప్రవేశించిన పోలీసులు అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. ఒక వ్యక్తి (భర్త) ముందుగదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా, లోపల ఫ్రిజ్లో మహిళ (భార్య) మృతదేహం కనిపించింది. ఇద్దరు కుమార్తె శవాలు సూట్కేస్లో, బీరువాలో కుక్కి వుండగా, మూడువ కుమార్తె శవం మరో గదిలో పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మతృదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి భర్తకూడా ఆత్మహత్య చేసుకొని వుండొవచ్చనే సందేహాన్ని అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ నితిన్ తివారీ వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతోందన్నారు. -
రాజు మెచ్చిన చిత్రం
పాదుషా గారికి వైకల్యం ఉంది. ఒక కన్ను కనిపించదు. ఒక కాలు నడవనివ్వదు. అయినా పాలనా వ్యవహారాలు నిర్వర్తించడంలో ఏ లోటూ రానిచ్చేవారు కాదు. ఒకరోజు పాదుషా గారికి తన ముఖచిత్రాన్ని గీయించుకోవాలనే కోరిక కలిగింది. ‘‘ఎవరైతే నాలో ఉన్న శారీరక లోపాలు కనపడకుండా నా చిత్రాన్ని గీస్తారో వాళ్లకు గొప్ప బహుమానాన్ని అందిస్తాను’’ అని ప్రకటించారు. రాజ్యంలోని ప్రముఖ చిత్రకారులందరూ రాజుగారి చిత్రాన్ని గీసేందుకు బారులు తీరారు. చిత్రకారులంతా పాదుషా గారి వైకల్యం కనబడకుండా చిత్రించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. అందులోనుంచి ఒక పల్లెటూరి చిత్రకారుడు ‘‘పాదుషా గారూ! మీరు కోరినట్లుగా మీ చిత్రాన్ని నేను గీస్తాను’’ అని చెప్పాడు. చెప్పినట్లుగా రాజుగారి ముఖచిత్రాన్ని అత్యంత సుందరంగా, రాజుగారు మెచ్చుకునేలా చిత్రీకరించాడు. చిత్రంలో రాజుగారు అశ్వంపై ఆసీనులై బాణం ఎక్కుపెట్టినట్లు చిత్రించి తన చిత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. నడవనివ్వని కాలును గుర్రానికి కనపడని వైపు ఉంచి, కనిపించని కన్నును మూసి బాణాన్ని ఎక్కుపెట్టినట్లు చిత్రించి రాజుగారి మన్ననల్ని పొందాడు. రాజుగారు తన ముఖారవిందాన్ని చిత్రంలో చూసుకుని ఎంతో సంతోషించారు. ఆ పల్లె చిత్రకారుడికి ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించారు. ఇది కేవలం కథ మాత్రమే కాదు పాఠం. మనమూ ఇతరుల లోపాలను బహిర్గతం కాకుండా చిత్రాలను గీయవచ్చు. దైవానుగ్రహం పొంది ఎన్నో వరాలను పొందవచ్చు. ఒకరి లోపాలను ఎత్తి చూపడం అల్లాహ్కు అస్సలు ఇష్టం ఉండదు. ఎదుటి వారిలోని మంచినే చూడాలి. మనలో ఉన్న లోపాలను తొంగి చూసుకోవాలి. అంతేకాని, ఎప్పుడూ ఎదుటి వారి లోపాలపైనే దృష్టి పెడితే మనం అభాసుపాలవుతాం. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు, బలహీనతలుంటాయి. ఒకరి లోపాలు, బలహీనతలను నలుగురిలో చెప్పి నవ్వులపాలు చేయకుండా ప్రవర్తిస్తే అల్లాహ్ మన లోపాలు, మన బలహీనతలపై ముసుగు వేస్తాడు. – నాఫియా -
మృత్యుభయం
రాజుగారు భారీ ఊబకాయంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సన్నబడేందుకు ఎన్ని మందులు వాడినా, ప్రయోజనం లేకపోగా రోజురోజుకూ బరువు పెరగసాగారు. దాంతో తన బరువు తగ్గించగల వైద్యుడికి భారీ నజరానా ప్రకటించారు. ఒక వైద్యుడు వచ్చాడు. రాజుగారితో ‘‘నేను మీ బరువును తగ్గిస్తాను. మీరు సన్నబడే వైద్యం నా దగ్గరుంది.’’ అంటూ రాజును పరీక్షించి, మరుసటి రోజు వస్తానని వెళ్లిపోయాడు. రెండోరోజు వైద్యుడు చాలా విచారంగా దర్బారులోనికి వచ్చి ‘‘రాజుగారూ! ఇప్పుడిక వైద్యంతో లాభంలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. మరెన్నో రోజులు మీరు బతకరు.మహా అయితే ఓ 30 రోజులు మాత్రమే మీరు బతుకుతారు’’ అని చెప్పాడు విచారంగా. ఈ మాటలతో రాజుకు ముచ్చెమటలు పట్టాయి. ఆగ్రహంతో వైద్యుడ్ని బంధించారు. కానీ వైద్యుడి మాటలు రాజును మనశ్శాంతి లేకుండా చేశాయి. తీవ్ర విచారంతో తిండీ తిప్పలు మానేశారు. కంటికి నిద్ర కూడా కరువైంది. రెప్ప వాలిందంటే– మృత్యువు తనను వెంబడిస్తున్నట్లు పీడకలలతోనే సరిపోతోంది. అలా వైద్యుడు చెప్పిన గడువుకు ఇంకా రెండు రోజులే మిగిలాయి. రాజుకు ఒక్కసారిగా మృత్యువు కళ్లముందే తిరగాడ సాగింది. భయంతో వణికి పోసాగారు. 29 వ రోజు, రాజు చెరసాలలో ఉన్న వైద్యుడ్ని పిలిచి, ‘‘నువ్వు చెప్పిన గడువుకు కేవలం ఒక్కరోజే మిగిలింది. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా రేపు నేను చనిపోకపోతే నీ తల నరికేస్తాను’అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. రాజుగారి మాటలకు వైద్యుడు పగలబడి నవ్వాడు. ‘‘అల్లాహ్! మీకు నూరేళ్ల ఆయుష్షు ఇచ్చు గాక, మీ చావు ఘడియలు నాకెలా తెలుస్తాయండీ, నేనేమైనా జ్యోతిష్యుడినా? అయితే, నేను ఏ ఉద్దేశంతోనైతే ఈ మాటన్నానో ఆ ఉద్దేశం నెరవేరింది. మృత్యువు భయంతో నిద్రాహారాలు మాని మీరు సన్నబడ్డారు. ఇదే నా వైద్యం’’ అని విన్నవించుకున్నాడు. వైద్యుడి మాటలకు రాజు సంతోషించాడు. నిజంగా నెల తిరక్కముందే తాను ఇంత సన్నబడ్డానా అని ఆశ్చర్యపోయారు. వైద్యుడి సమయస్ఫూర్తికి ఎంతగానో అభినందించారు. విలువైన కానుకలతో సత్కరించారు. ఏ వ్యక్తికైనా చావు జ్ఞాపకం ఉండి, పరలోక చింతనలో జీవితం గడిపితే ఎవరూ లావెక్కరు. ఆరోగ్యంగా ఉంటారు. ఇదే ఈ కథలో నీతి. – రేష్మా -
వీడియో.. ఎస్పీకి ఎమ్మెల్యే బెదిరింపులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్పాయి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలహాబాద్లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఎస్పీపై బెదిరింపులకు దిగారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. శనివారం అలహాబాద్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ముఖ్యఅతిథిగా ఓకార్యక్రమం జరిగింది. దీనికి అలహాబాద్ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే హర్షవర్దన్ బాయ్పాయి హాజరయ్యారు. ఆయన వాహనం లోపలికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారు దిగిన ఆయన పోలీసులపై చిందులు తొక్కారు. ‘నన్ను గుర్తుపట్టకపోగా, పైగా వాహనాన్ని అడ్డుకుంటారా?’ అంటూ అధికారులపై మండిపడ్డారు. ఇంతలో అలహాబాద్ ఎస్పీ అక్కడికి రాగా, ఆయన్ను హర్షవర్దన్ బెదిరించారు. ‘నన్ను ఆపుతారా? హింస అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది కదా’.. అంటూ వ్యాఖ్యలు చేస్తుండగా, అనుచరులు ఎమ్మెల్యేని లోపలికి తీసుకెళ్లారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్.. చారు నిగమ్ అనే అధికారణిపై మండిపడగా, ఆమె కంటతడి పెట్టుకున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
ఎస్పీకి ఎమ్మెల్యే బెదిరింపులు..!
-
ప్రధాన నిందితుడికి కీలక నేత అండదండలు!
సాక్షి, అలహాబాద్: కేవలం కాలు తగలడంతో మొదలైన ఓ గొడవలో లా (న్యాయశాస్త్రం) విద్యార్థి దిలీప్ సరోజ్ హత్యకు గురికావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. కొన్ని విషయాలు వెలుగుచూశాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు విజయ్ శంకర్ సింగ్కు రాజకీయ సంబంధాలున్నాయని, సుల్తాన్పూర్కు చెందిన ఓ కీలక నేత అండదండలున్నాయని పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం... గత శుక్రవారం అలహాబాద్లోని కాలికా రెస్టారెంట్కు దిలీప్ అనే లా సెకండియర్ విద్యార్థి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ ప్రధాన నిందితుడు విజయ్ శంకర్కు దిలీప్ కాలు తగలడంతో వివాదం మొదలైంది. కొంత సమయానికే హాకీ స్టిక్స్తో, ఐరన్ రాడ్తో దిలీప్పై విజయ్ శంకర్, రెస్టారెంటె వెయిటర్ మున్నా చౌహాన్ దాడి చేశారు. కుప్పకూలిపోయిన దిలీప్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న బాధితుడు ఆదివారం మృతిచెందాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా వెయిటర్ మున్నాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు విజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తనను కొట్టినందుకే దిలీప్పై దాడి చేశానని వెయిటర్ చెబుతున్నాడు. దిలీప్ మృతి అనంతరం రైల్వే ఉద్యోగి, ప్రధాన నిందితుడు విజయ్ శంకర్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతడికి సుల్తాన్పూర్ జిల్లాకు చెందిన కీలకనేత చంద్ర భద్రా సింగ్ అలియాస్ సోనూ సింగ్కు సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. సుల్తాన్పూర్కే చెందిన నిందితుడు విజయ్ సోనూ సింగ్ వద్ద తలదాచుకున్నడాని భావిస్తున్న పోలీసులు ఓ బృందాన్ని అక్కడికి పంపించారు. సోనూ సింగ్కు, విజయ్కి సంబంధం ఉన్నట్లు తమ వద్ద ఎన్నో సాక్ష్యాలు, ఫొటోలున్నాయని పోలీసులు చెబుతున్నారు. లా విద్యార్థి దిలీప్ హత్య కేసులో నిందితుడి కుటుంబసభ్యులతో పాటు అవసరమైతే సోనూ సింగ్ను విచారిస్తామని సీనియర్ పోలీస్ అధికారి అకాశ్ కుల్హారీ వివరించారు. -
దారుణం: కాలు తగిలిందని.. కొట్టి చంపారు!
-
దారుణం: కాలు తగిలిందని.. కొట్టి చంపారు!
అలహాబాద్ : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఒకరి కాలు మరొకరికి తగలిందని మొదలైన చిన్న గొడవ చివరికి ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. అలహాబాద్లోని కాలికా రెస్టారెంట్లో గత శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దిలీప్ అనే లా సెకండియర్ విద్యార్థి తన స్నేహితులతో డిన్నర్ చేయడానికి కాలికా రెస్టారెంట్కు వెళ్లాడు. విజయ్ శంకర్ అనే వ్యక్తికి దిలీప్ కాలు తగిలిందన్న విషయంలో చిన్నగొడవ మెదలైంది. డిన్నర్ అనంతరం మరో సారి వీరి మధ్య గొడవ జరగడంతో రెస్టారెంట్ బయట కొట్టుకున్నారు. ఈ సమయంలో రెస్టారెంట్ వేయిటర్ మున్నా చౌహన్ ఐరన్ రాడ్తో దిలీప్పై దాడి చేశాడు. దీంతో అతను కుప్పుకూలిపోవడంతో వెంటనే బైక్పై ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనంతా బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే ఆ రెస్టారెంట్ యజమాని పోలీసులకు డయల్ 100 ద్వారా సంప్రదించగా దగ్గరల్లో ఉన్న గస్తీ వాహనం సమయానికి అక్కడకు చేరుకోలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విజయ్ శంకర్, మున్నాచౌహన్లను అదుపులోకి తీసుకున్నారు. సమయానికి అప్రమత్తం కానీ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. గొడవ దిలీప్-విజయ్ శంకర్కైతే వెయిటర్ ఎందుకొచ్చాడనేది పోలీసులకు అంతు చిక్కడంలేదు. వెయిటర్ను విచారించగా కూరగాయలతో తీసుకొస్తున్న తనను దిలీప్ కొట్టడంతో ఆగ్రహానికి లోనై రాడ్తో దాడిచేసానని అతను తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు. -
సాధువు ఫోటో వైరల్
అలహాబాద్ : ట్రాక్టర్, లారీ లాంటి భారీ వాహనాలను తాడుతో పట్టుకుని ముందుకు లాగడాన్ని అప్పుడప్పు చూసే ఉంటాం. మరీ కొందరైతే జుట్టుతోనే లేక పళ్ల సాయంతోనో లాగడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ సాధువు మాత్రం వీటన్నింటినీ మించి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తర భారతదేశంలో మినీ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మాఘ్ మేళా ప్రతి ఏటా జరుగుతుంటుంది. ఈ మేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి గాంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మేళా సమయంలో పవిత్ర జలాలతో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. అలహాబాద్ లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధిచెందిన ప్రయాగ్ లో ఓ సాధువు చేసిన సాహసం హాట్ టాపిక్ గా మారింది. ట్రాక్టర్ ను ఓ తాడు సాయంతో తన మర్మాంగానికి కట్టుకుని ఓ సాధువు ముందుకు లాగారు. తెల్ల జుట్టు, గడ్డంతో బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి నగ్నంగా ఉన్న ఆ సాధువు అసాధారణ ప్రదర్శనను ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి ప్రర్శనలు ఇదేం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో సాధువులు ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో కూడా ఓ సాధువు డజన్ ఇటుకలను తన మర్మావయవానికి కట్టుకొని ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించి ఓ వీడియో అప్పుడు వైరల్ అయింది. 2016లో కూడా కుంభమేళా సమయంలో ఓ సాధువు పెద్ద బండారాయిని తాడుసాయంతో మర్మావయవానికి కట్టుకొని ఓ ప్రదర్శన ఇచ్చారు. 2018 మాఘ్ మేళాకు సంబంధించి మరిన్ని ఫోటోలు -
కాలేజీలో కొండచిలువ హల్ చల్ ..
సాక్షి, అలహాబాద్: పాములను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ బాటనీ ప్రొఫెసర్ కాలేజీ గ్రౌండ్లోకి ప్రవేశించిన కొండచిలువను సునాయశంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్లో చోటుచేసుకుంది. వివరాలివి.. కాలేజీ గ్రౌండ్లో ఇవాళ ఉదయం 12 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇది గమనించిన కాలేజీ ప్రొఫెసర్ ఎంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. -
కళాశాలలో ప్రొఫెసర్ సాహసం
అలహాబాద్ : నగరంలోని ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్ సాహసం చేశారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ డిగ్రీ కళాశాలలోని బోటనీ డిపార్ట్మెంట్లో ఎన్బీ సింగ్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం డిపార్ట్మెంట్ గదిలో ఉన్న ఆయనకు ఓ విద్యార్థి నుంచి ఫోన్ వచ్చింది. కళాశాల పరిసర ప్రాంతాల్లోకి కొండచిలువ వచ్చిందని దాని సారాంశం. అంతే అక్కడి నుంచి హుటాహుటిన కొండచిలువ ఉన్న చోటుకు చేరుకున్న ఎన్బీ సింగ్.. 40 కిలో బరువున్న పామును అవలీలగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పారు. ఎన్బీ సింగ్ ఇప్పటివరకూ 12 పాములను చేతులతో పట్టుకున్నారు. దీనిపై మాట్లాడిన ఎన్బీ సింగ్.. కొండచిలువలు మిగతా పాముల్లో ప్రమాదకరమైనవి కావని ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే పాములు పట్టడం ప్రారంభించానని చెప్పారు. వాటికి ఉద్రేకం తెప్పిస్తే కొండచిలువలు ఎవరిపైనా దాడి చేయవని తెలిపారు. -
ఆరుషి హత్యకేసులో.. సినిమా డైరెక్టర్లా..!
అలహాబాద్ : ఒక ఆలోచన ఆధారంగా కథ అల్లుకుని, దానికి తగ్గట్లు సీన్లు రాసుకుని సినిమాను ఓ కొలిక్కితెస్తారు దర్శకులు. సంచలనాత్మక ఆరుషి-హేమ్రాజ్ హత్యకేసులోనూ సీబీఐ విచారణ కోర్టు(ట్రయల్ కోర్టు) న్యాయమూర్తి సరిగ్గా సినిమా దర్శకుడి మాదిరి ‘కథను కొలిక్కి తెచ్చేందుకు’ ప్రయత్నించారట!! ‘‘న్యాయమూర్తి సినిమా దర్శకుడిలా వ్యవహరించారు. అసలు హత్య చేసింది ఎవరు, ఎందుకు, ఎలా చేశారు అనే వాస్తవ విషయాలను పట్టించుకోకుండా చెల్లాచెదురుగా ఉన్న ఆధారాలనే నమ్మి, నిందితులకు జీవితఖైదు విధించారు’’ అని ఘజియాబాద్ సీబీఐ విచారణ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తీర్పు కాపీలో ఆసక్తికరమైన విషయాలను రాసుకొచ్చింది. 2008 నాటి నోయిడా జంట హత్యలపై గురువారం తీర్పును వెలువరించిన అలహాబాద్ హైకోర్టు.. జీవితఖైదును అనుభవిస్తోన్న ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తర్వార్లను సంశయ లబ్ధి(బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దోషులను నిర్ధారించడంలో సీబీఐ పూర్తిగా విఫలం చెందిందని, ఆ అరకొర ఆధారాలనే నమ్మిన సీబీఐ న్యాయమూర్తి నిజానిజాలను విస్మరించారని హైకోర్టు ధర్మాసనం వాపోయింది. ప్రస్తుతం దస్నా జైలులో ఉన్న రాజేశ్, నుపుర్ తల్వార్లు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం ఉంది. తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలంలో ఊహించని మలుపులు తిరిగి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన బాలిక ఆరుషి, వాచ్మన్ హేమరాజ్ల హత్య కేసులో దోషులెవరో ఇంకా తేలలేదు. ఈ కేసులో ఆమె తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లే ప్రధాన నిందితులంటూ ఆరోపించిన సీబీఐ.. వారికి మరణశిక్ష విధించాలని వాదించింది. అయితే అందుకు తగ్గట్లు సందేహాతీతమైన, సహేతుకమైన సాక్ష్యాధారాలేవీ సీబీఐ సమర్పించ లేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేది లేదనిదీ త్వరలోనే ప్రకటిస్తామని సీబీఐ అధికారులు చెప్పారు. అసలేం జరిగింది ? ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నివసిస్తోన్న డెంటిస్టు దంపతులు రాజేశ్- నుపుర్ తల్వార్ ఇంట్లో వారి కూతురు ఆరుషి(14 ఏళ్లు), పనిమనిషి హేమ్రాజ్(45 ఏళ్లు) దారుణ హత్యకు గురయ్యారు. 2008, మే 15 అర్ధరాత్రి తర్వాత ఈ ఉదంతరం చోటుచేసుకుంది. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులుగానీ, అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థగా అందరూ భావించే సీబీఐ సిబ్బందికానీ ఆదినుంచీ తప్పులు చేస్తూ పోయారు. మీడియాకు లీకులివ్వడంలో చూపిన ఉత్సాహంలో రవ్వంతైనా దర్యాప్తుపై చూపలేకపోయారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు తొలుత ఆరుషిని వాచ్మాన్ హత్య చేసి పారిపోయి ఉంటాడని నిర్ధారణకొచ్చారు. ఆ ఇంటిపైనున్న గదిలో నివాసం ఉంటున్నా డన్నారు గనుక అక్కడ సోదా చేద్దామనుకున్నా ఆ గదికి దారితీసే మెట్లవైపు తలుపు తాళం వేసి ఉండటంతో దాన్ని విరమించుకున్నారు. హేమరాజ్ కోసం అంతటా వెతికి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు ఆ మర్నాడొచ్చి తలుపు తాళం బద్దలుకొట్టారు. తీరాచూస్తే అక్కడి టెర్రస్పైనే అతని శవం పడి ఉంది. ఆ పక్కనున్న గదిలో రక్తపు మరకలున్న దిండు దొరికింది. అనంతరకాలంలో ఆ రక్తపు మరకలు హేమరాజ్వేనని నిర్ధారణైంది. ఆరుషికి సంబంధించి మెడ కోసిన ఆనవాలు తప్ప నెత్తురొలికిన జాడలేదు. అంటే ఆ రక్తపు మరకల్ని ఎవరో శుభ్రం చేసి ఉండాలి. అలా చేసిందెవరో పోలీసులు తేల్చలేకపోయారు. తల్వార్ దంపతులే ఆ పని చేసి ఉండొచ్చునని భావించినా అందుకు ఎలాంటి ఆధా రాలనూ చూపలేకపోయారు. రాజేష్ తల్వార్ సహాయకుడు కృష్ణ, ఇంట్లో పనిచేసే రాజ్కుమార్, విజయ్మండల్ అనే మరో ఇద్దరు యువకుల్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఏమీ రాబట్టలేకపోయారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా ఫలితం లేకపోయింది. ఆరుషి కేసులో మొత్తం మూడు దర్యాప్తులు జరిగాయి. అందులో ఒకటి యూపీ పోలీసులది కాగా, మరో రెండింటిని సీబీఐకి చెందిన రెండు వేర్వేరు బృందాలు చేపట్టాయి. చిత్రమేమంటే– రెండూ వేర్వేరు నిర్ధారణలకొచ్చాయి. హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు వెనువెంటనే స్వాధీనం చేసుకోనందువల్ల నేరస్తుల వేలిముద్రలు, ఇతర ఆధారాలు చెదిరిపోయాయి. ఆరుషినీ, హేమ రాజ్నూ అభ్యంతరకర పరిస్థితుల్లో చూసిన తల్వార్ దంపతులు కోపం పట్టలేక ఆ బాలికను ‘పరువు హత్య’ చేశారని ఆరోపించినా ఆరుషి గదిలో ఆమె శవం మాత్రమే ఎందుకున్నదో, హేమరాజ్ శవం టెర్రస్పైకి ఎలా చేరిందో సీబీఐ చెప్పలేకపోయింది. ఆరుషి గదికి బయట తాళం వేసి ఉందని, దాని తాళం చెవి తల్వార్ దంపతుల దగ్గరే ఉంటుందని, వేరేవారెవరూ ఆ గదిలోకి వెళ్లే అవకాశం లేదని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ గదికి వేరే తలుపు కూడా ఉందని, పైగా ఆరుషి గదిలోకి దుండగులు బాత్రూం ద్వారా ప్రవేశించి ఉండొచ్చునని తల్లిదండ్రులు చెప్పినదానికి వారి దగ్గర జవాబు లేదు. నార్కో అనాలిసిస్ పరీక్షలు సైతం ఉన్న గందరగోళాన్ని మరింత పెంచాయి. కృష్ణ, రాజ్కుమార్, విజయ్మండల్ నార్కో అనాలిసిస్ పరీక్షల్లో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎవరికి వారు మరొకరు ఈ హత్యకు కారకులని చెప్పారు. వారు చెప్పిన అంశాలతో సరిపోలే సాక్ష్యాధారాలేవీ పోలీసులకు లభించలేదు. తమ సచ్ఛీలత నిరూపించుకోవడానికి ఆరుషి తల్లిదండ్రులు కూడా అన్ని పరీక్షలకూ సిద్ధపడ్డారు. కానీ అందులో ఏమీ తేలలేదు. ఇలా ఈ కేసులో జవాబులేని ప్రశ్నలెన్నో ఉన్నాయి.. ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నదని ‘నిరూపించడం’ కోసం ఆ కుటుంబాన్ని మీడియా బజారులో నిలబెట్టింది. అన్ని విలువలనూ వదిలిపెట్టి అనేక కథనాలను ప్రచారంలో పెట్టింది. రాజేష్ తల్వార్కు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉన్నదని ఒక కథనం చెబితే... ఆ దంపతులు కుమార్తెను ఒంటరిగా వదిలి విందుల పేరుతో ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేవారని మరో కథనం ఏకరువు పెట్టింది. తొలుత ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా ఇందులో ఎలాంటి ఆధారాలూ లభించలేదని అంగీకరించింది. కానీ ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల’ ఆధారంగా తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తున్నట్టు 2013 నవంబర్లో తెలిపింది. చిత్రమేమంటే ఈ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదు గనుక కేసు మూసేయాలని 2010 డిసెంబర్లో న్యాయస్థానాన్ని సీబీఐ అభ్యర్థిస్తే అందుకు అభ్యంతరం చెబుతూ అప్పీల్కెళ్లింది తల్వార్ దంపతులే. తీరా మరో మూడేళ్లకు వారే నేరస్తులంటూ న్యాయస్థానం శిక్షించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వివిధ సందర్భాల్లో వారు సాగించిన పోరాటం, పడిన మనో వేదన అంతా ఇంతా కాదు. కుమార్తెను కోల్పోయి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ఓదార్పు లభించడం మాట అటుంచి ఊహించని ఇబ్బందులు చుట్టుముట్టాయి. చివరకు తొమ్మిదేళ్లకు వారిద్దరూ నిర్దోషులుగా బయటికొచ్చారు గానీ... తమ కుమార్తె ఉసురు తీసిందెవరో మాత్రం తెలియలేదు. మన దర్యాప్తు సంస్థల పని తీరుకు, మన న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు సాగే వైనానికి ఆరుషి హత్య కేసు ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. -
గంగా నదిలో మునిగిన పడవ
సాక్షి, అలహాబాద్ : ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మేజా మండలం వద్ద గంగా నదిలో పడవ మునగిపోయింది. ఈ ఘటనలో ఆరుగురిని స్థానికులు రక్షించగా.. పలువురు గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పడవ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడం వల్లే మునిగిపోయినట్లు భావిస్తున్నారు. -
ఆమె ఒక్క రోజు పోలీస్...
అలహాబాద్: అది ఉత్తర ప్రదేశ్లోని సివిల్ లైన్స్ పోలీస్టేషన్. ఆదివారం ఉదయం ఎవరో వీవీఐపీ వస్తున్నట్లు పెద్ద హడావుడి నెలకొంది. ఇంతలో ఓ జీపు వచ్చి ఆగింది. అధికారులంతా అలర్ట్ అయ్యి సెల్యూట్ చేశారు. తీరా చూస్తే అందులోంచి పట్టుమని పదిహేనేళ్లు లేని ఓ అమ్మాయి దిగింది. ఆ బాలిక పేరు సౌమ్య దుబే. అక్కడే ఓ స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. పోలీస్ శాఖ నిర్వహించిన ఓ వ్యాస రచన పోటీల్లో నెగ్గటంతో ఒక్క రోజు పోలీసాఫీసర్ గా విధులు నిర్వర్తించే అరుదైన అవకాశం దక్కించుకుంది. ఆగష్టు 8న రిజర్వ్ పోలీస్ ఆడిటోరియంలో ‘ఏ సొసైటీ విత్ అవుట్ పోలీస్’ అన్న అంశంపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. ప్రతిష్టాత్మక పాఠశాలల నుంచి సుమారు 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో టాపర్ గా నిలిచిన సౌమ్యను ఆగష్టు 15న అలహాబాద్ ఎస్ఎస్పీ అనంద్ కులకర్ణి సన్మానించారు కూడా. ఇక ఇవాళ స్టేషన్ హౌజ్ అధికారిగా ఆమె విధులు నిర్వర్తించింది. సౌమ్య అక్కడున్న సిబ్బందితో కాసేపు ముచ్చటించింది. వారి విధి నిర్వహణ ఎలా ఉంటుందో, ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో? అడిగి మరీ తెలుసుకుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇక ఇదే పోటీలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన పరిమళ అగర్వాల్, మహింద్ర నాథ్ అను కూడా మరో రెండు స్టేషన్లకు ఇలాగే ఒక్క రోజు అధికారులను చేసేశారు అలహాబాద్ పోలీసులు. -
హైకోర్టుకు ‘మందిర్–మసీదు’ వివాదం
అలహాబాద్: చాలా ఏళ్ల నాటి కాశీ విశ్వనాథుడి ఆలయం–జ్ఞాన్వాపి మసీదు వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇందుకు సంబంధించిన రెండు పిటిషన్లను ప్రత్యేక బెంచ్కు పంపాలని కోర్టు బుధవారం తమ రిజిస్ట్రీని కోరింది. వారణాసిలోని అంజుమాన్ ఇంటాజామియా మసీదు, లక్నోలోని యూపీ సున్నీ వక్ఫ్ కేంద్ర బోర్డు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడంతో న్యాయవాది జస్టిస్ సంగీత చంద్ర ఈ ఆదేశాలు జారీచేశారు. 1997, 1998లో వారణాసి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జీ(ఏడీజే) జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజూమన్ మసీదు కోర్టును ఆశ్రయించింది. కాశీ విశ్వనాథుడి ఆలయ ట్రస్టు దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యాన్ని సవాలు చేస్తూ అంజూమన్ వేసిన పిటిషన్ను ఏడీజే కొట్టివేశారు. మసీదు వెలిసిన ఆ స్థలంలో మహారాజా విక్రమాదిత్యుడు 2 వేల ఏళ్లకు పూర్వమే ఆలయాన్ని నిర్మించారని ట్రస్ట్ 1991లో దాఖలు చేసిన తన పిటిషన్లో పేర్కొంది. 1664లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేసి, అక్కడ మసీదును నిర్మించారని ఆరోపించింది. మసీదును అక్కడి నుంచి తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరింది. అయితే ‘మందిర్–మసీదు’ వివాదాన్ని సివిల్ కోర్టు పరిష్కచడం చట్టం ప్రకారం సాధ్యం కాదని, కాబట్టి ట్రస్ట్ పిటిషన్ను తిరస్కరించాలని ఇంటాజామియా మసీదు ఏడీజేని ఆశ్రయించినా నిరాశే ఎదురరైంది. ట్రస్ట్ దాఖలు చేసిన పౌర వ్యాజ్యంలో తమనూ కక్షిదారులను చేయాలన్న విజ్ఞప్తిని ఏడీజే తోసిపుచ్చడంతో సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టు గడప తొక్కింది. -
సీఎం యోగి నిందితుడిగా ఉన్న..
గోరఖ్పూర్ అల్లర్ల రికార్డులు తీసుకురండి: హైకోర్టు అలహాబాద్: 2007లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన అల్లర్లకు సంబంధించి అన్ని రికార్డులతో వ్యక్తిగతంగా హాజరు కావాలని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అలహాబాద్ హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ కేసులో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితుడిగా ఉన్నారు. ఈనెల 11న ప్రధాన కార్యదర్శి తమ ముందు హాజరై, అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ ఉమేశ్ చంద్ర శ్రీవాత్సవల డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీ–సీఐడీ సీఎం చేతుల్లో ఉండడంతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రే నిందితుడు కావడంపై పర్వేజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున ఏదైనా స్వతంత్ర ఏజెన్సీకి కేసును అప్పగించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో యోగితో పాటు అప్పటి గోరఖ్పూర్ మేయర్ అంజూ చౌదరీ, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాధా మోహన్దాస్ అగర్వాల్ నిందితులుగా ఉన్నారు. -
యోగికి పదిరోజుల సమయమిచ్చిన హైకోర్టు
నచ్చిన ఆహారాన్ని తినడం, ఆహార పదార్థాల వ్యాపారాన్ని చేపట్టడం జీవన హక్కులో భాగమేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి హైకోర్టు ఈ విషయంలో సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు పదిరోజుల సమయాన్ని ఇచ్చింది. అక్రమ కబేళాలు, మాసం దుకాణాలపై అణచివేత కారణంగా ప్రజల ఆహార అలవాట్లు, ఉపాధి హక్కులు దెబ్బతినకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించి.. పది రోజుల్లో తమకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని వివిధ రకాల ఆహార అలవాట్లు ప్రజల జీవనవిధానంలో భాగంగా ఉన్నాయని, రాష్ట్ర లౌకిక సంస్కృతిలో ఇవి ముఖ్యభాగమని హైకోర్టు లక్నో ధర్మాసనం విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. తన మాంసం దుకాణం లైసెన్స్ను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు. మాంసం దుకాణానికి లైసెన్సులు ఇవ్వడంలో యూపీ ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాను వ్యాపారం నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. యూపీలో యోగి ప్రభుత్వం వచ్చాక.. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యాపారం పూర్తిగా పడకేసిన సంగతి తెలిసిందే. -
మీ బాధ నాకు తెలుసు, సాయం చేస్తాను: మోదీ
అలహాబాద్ (ఉత్తరప్రదేశ్): న్యాయవ్యవస్థపై ఉన్న భారాన్ని తొలగించేందుకు, పెండింగ్ కేసుల తగ్గించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సాయం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్కు హామీ ఇచ్చారు. 'న్యాయవ్యవస్థపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించాలన్న చీఫ్ జస్టిస్ సంకల్పానికి ప్రభుత్వం అండగా ఉంటుందని నేను ఆయనకు హామీ ఇస్తున్నాను' అని మోదీ అన్నారు. అలహాబాద్ హైకోర్టు 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఖేహర్ మాట్లాడుతున్నప్పుడు ఆయనలోని బాధ తనకు అర్థమైందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 1200 పాత చట్టాలను తొలగించి.. న్యాయవ్యవస్థ ఆధునీకరణ దిశగా అడుగులు వేసిందని అన్నారు. కోర్టుల పనితీరును సరళీకరించేందుకు, నాణ్యమైన సేవలు అందించేందుకు టెక్నాలజీ వినియోగాన్ని చీఫ్ జస్టిస్ తీసుకొచ్చారంటూ మోదీ ప్రశంసించారు. -
యూపీలో రాజకీయ హత్య.. కలకలం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరిన కొద్ది గంటల్లోనే రాజకీయ హత్య జరిగింది. అలహాబాద్ జిల్లాలో బీఎస్పీ నాయకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. మావు అయిమా పట్టణంలో బీఎస్పీ నేత మహ్మద్ షమీని ఆదివారం రాత్రి బైకుపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సంఘటనా స్థలంలోనే షమీ ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని, షమీ కుటుంబ సభ్యలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మద్దతుదారులు అలహాబాద్-ప్రతాప్ గఢ్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. నేర చరిత్ర కలిగిన షమీకి స్థానిక బీజేపీ, వీహెచ్ పీ నాయకులతో విభేదాలున్నాయని పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహ్మద్ షమీ.. సమాజ్ వాదీ పార్టీ నుంచి బీఎస్పీలో చేరారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే రాజకీయ హత్య జరగడంతో యూపీలో కలకలం రేగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని రాష్ట్ర మంత్రి శ్రీకాంత్ శర్మ హెచ్చరించారు. ప్రజాభద్రతే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని తెలిపారు. -
ట్రైనింగ్ టైంలో కూలిన హెలికాప్టర్
-
నగల దుకాణంలో తలకు గన్ పెట్టి..
-
నగల దుకాణంలో తలకు గన్ పెట్టి..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఓ నగల దుకాణంలో దోపిడిదొంగల అరాచకం సీసీటీవీ ఫొటేజీలో కనిపించింది. మంగళవారం అలాహాబాద్ పట్టణంలోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు.. నగల వ్యాపారి తలకు గన్ పెట్టి బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు. పక్కా ప్లాన్తో మొహానికి ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు నగల దుకాణంలోకి ప్రవేశించారు. అందులో ఓ వ్యక్తి వ్యాపారి తలకు గన్ పెట్టగా.. మిగతా ఇద్దరు బ్యాగుల్లో ఆభరణాలు నింపుకున్నారు. అనంతరం ముగ్గురూ అక్కడ నుంచి నిమిషాల్లో పారిపోయారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫొటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
అలహాబాద్లో అగ్ని ప్రమాదం
-
ప్రియాంకా, డింపుల్ ఫొటో పక్కపక్కనే..
అలహాబాద్: సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయనున్నాయా? తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య దాదాపు పొత్తు కుదిరినట్లేనా? అంటే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో వెలిసిన ఫ్లెక్సీలు ఆ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. అలహాబాద్లో జిల్లా ప్రధాన కార్యదర్శి హసీబ్ అహ్మద్ ఏర్పాటుచేసిన పోస్టర్లు, ఫ్లెక్సీల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఫొటోలు చేర్చారు. అతడి ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల్లో కూడా ఈ ఫ్లెక్సీల ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్లలో 'ఉత్తరప్రదేశ్లోకి మతశక్తులు ప్రవేశాన్ని అడ్డుకునేందుకు మేమంతా ఒక్కటయ్యాం. ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్కు సుస్వాగతం' అంటూ ఆ ఫ్లెక్సీల్లో రాశారు. ప్రియాంక, డింపుల్తోపాటు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రమోద్ తివారీ, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఫొటోలు కూడా చేర్చారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన హసీబ్ వివరణ ఇస్తూ.. 'ఈ పోస్టర్ ద్వారా కమ్యునల్ శక్తులను అడ్డుకునేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని చెప్పాలనుకున్నాను. పునర్వైభవాన్ని తెచ్చేందుకు అఖిలేశ్తో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా మంచి అవకాశం. కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయంలో తప్పకుండా ఆలోచించాలి. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే వెళితే మా పార్టీకి మెజారిటీ వస్తుంది. లేదా రెండు పార్టీలు కలిసి పనిచేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు చేయొచ్చు' అని చెప్పాడు. కాగా, దీనిపై యూపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముకుంద్ తివారీ స్పందిస్తూ 'కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేం పాటిస్తాం. పార్టీ విజయం కోసం పనిచేస్తాం' అని అన్నారు. మరోపక్క, వీరి కలయికపై బీజేపీ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ ఒంటరిగా పోటీ చేస్తే బతకదనే విషయం కాంగ్రెస్ పార్టీకి ముందే తెలుసుకాబట్టే సమాజ్వాది పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తుందని అన్నారు. ఏదేమైనా ఈ రెండు పార్టీలకు ఈసారి ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయమని, బీజేపీకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. -
రూ.9999 డ్రా చేసిన అపరిచితుడు
లబోదిబోమంటున్న బాధితురాలు అలహాబాద్ బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు హిందూపురం అర్బన్ : బ్యాంకు మేనేజర్నంటూ ఫోన్ చేసిన అపరిచితుడు ఖాతాదారురాలి ఏటీఎం కార్డుపై నంబర్ తెలుసుకుని, కాసేపటి తర్వాత రూ.9999 నగదు డ్రా చేసిన సంఘటన సోమవారం చూసింది. హిందూపురం పట్టణంలోని ఎంఎఫ్ రోడ్డులో నివాసముంటున్న రాజాబాయికి అలహాబాద్ బ్యాంకులో 50275179945 నంబరుతో అకౌంట్ ఉంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో 73610 20259 నంబరు నుంచి ఫోన్కాల్ వచ్చింది. ‘నేను బ్యాంకు మేనేజర్ మాట్లాడుతున్నా. మీ ఏటిఎం బ్లాక్ అయ్యింది. అది రిలీజ్ చేయడానికి కార్డుపై ఉన్న నంబరు చెప్పండి’ అని కోరడంతో ఆమె చెప్పేసింది. అదే రోజు సాయంత్రం కార్డు పనిచేస్తోందో లేదో చూద్దామని ఏటీఎం కేంద్రానికి వెళ్లింది. మినీ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఖాతాలోంచి రూ.9999 నగదు డ్రాయినట్లు స్లిప్ వచ్చింది. తిరిగి తనకు వచ్చిన సెల్నంబర్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని సమాధానం వచ్చింది. ఆందోళన చెందిన బాధితురాలు సోమవారం అలహాబాద్ బ్యాంకు మేనేజర్ను కలిసి తనకు జరిగిన మోసం గురించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పాస్బుక్ ఎంట్రీ చేయించుకోగా పీఓఎస్ మెషిన్ నుంచి పై మొత్తం డ్రా అయినట్లు కనిపించింది. ఏ ప్రాంతం నుంచి డ్రా అయ్యిందో విచారణ చేస్తామని మేనేజర్ తెలిపినట్లుబబాధితురాలు తెలిపింది. -
బ్యాంకు అధికారులను చితక్కొట్టారు
అలహాబాద్ : బ్యాంకు అధికారులకు, ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అలహాబాద్ బ్యాంకు శాఖ బయట రోడ్డుపైనే అధికారులు, ప్రజలు ఒక్కరినొక్కరూ కుమ్ములాడుకున్నారు. ఇద్దరు బ్యాంకు ఆఫ్ బరోడా అధికారులను తీవ్రంగా చితక్కొట్టారు. డబ్బులు ఇవ్వకుండా పదేపదే తిప్పించుకుంటున్నారని ఆగ్రహంతో ప్రజలు మండిపడ్డారు. ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ వాగ్వాద వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. పాత నోట్లు రద్దైన దగ్గర్నుంచి ప్రజలు బ్యాంకుల ఎదుటే రోజుల తరబడి వేచిచూడటం, తీరా తమవద్దకు వచ్చే సరికి బ్యాంకుల్లో నగదు అయిపోయినట్టు అధికారులు చెప్పడం ప్రజల్లో తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. గంటల కొద్దీ నిరీక్షణకు ఫలితం దక్కకపోవడంతో ప్రజలు బ్యాంకు అధికారులపై దాడికి పాల్పడుతున్నారు. ఇటీవలే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాల్దా శాఖను ప్రజలు ధ్వంసం చేశారు. అక్కడక్కడా బ్యాంకు శాఖ వద్ద ప్రజలు నిరసనలకు కూడా దిగుతున్నారు. -
మెడికల్ కాలేజీకి షాకిచ్చిన హైకోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2015-16 సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో అక్రమంగా అడ్మిషన్లు ఇచ్చిన మెడికల్ కాలేజీ యాజమాన్యానికి అక్షింతలు వేసింది. లక్నోకు చెందిన డాక్టర్ ఎంసీ సక్సేనా మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ లో అక్రమ ఎడ్మిషన్లను తప్పుబడుతూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ భారీ జరిమానా విధించింది. విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల చొప్పున 150 మందికి పరిహారం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. కొంతమంది విద్యార్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై జస్టిస్ దేవేంద్ర కుమార్ అరోరా ఈ తీర్పును ప్రకటించారు. అంతేకాదు వైద్య కళాశాల అడ్మిషన్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆమోదించిన మార్గదర్శకాలపట్ల యాజమాన్యం అవిధేయతను ప్రకటించిందని మండిపడింది. రెండు నెలల్లో మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ జనరల్ వద్ద ఈ మొత్తం సొమ్మును డిపాజిట్ చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. పూర్తి పరిశీలన తర్వాత ఈ పరిహారాన్ని ఆయా విద్యార్థులకు డైరక్టర్ జనరల్ పంపిణీ చేస్తారని పేర్కొంది. అలాగే మొదటి సం.రం పరీక్షలు రాసేందుకు అనుమతించాలన్న విద్యార్థులను పిటిషన్ను కూడా కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిగానీ, అనుబంధంగానీ లేదని రాష్ట్ర న్యాయవాది సంజయ్ భాసిన్ వెల్లడించారు. నిబంధనలను పాటించకుండా పారదర్శకత లేకుండా అడ్మిషన్లు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన, అనారోగ్యకరమైన పద్ధతుల ద్వారా అక్రమ సంపాదనకు తెర తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అతిపెద్ద గూండా ఎవరో తేల్చుకుందాం: కట్జూ
ముంబై : పాకిస్తానీ యాక్టర్లను భారత్లో నిషేధించడంపై తీవ్ర చర్చ రేగుతున్న నేపథ్యంలో మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహార్ అప్కమింగ్ ఫిల్మ్ యే దిల్ హే ముస్కిల్ విడుదలను నిలిపివేయడంపై మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు."నిస్సహాయంపు ఆర్టిస్టులపై ఎంఎన్ఎస్ ఎందుకు దాడిచేస్తుంది? ఒకవేళ ధైర్యముంటే నా ముందుకు రండి. మీ అసహనానికి నా దగ్గర దండన ఉంది. మీ కోసమే ఈ దండన వేచిచూస్తున్నట్టు" బుధవారం పలు ట్వీట్లు చేశారు. ఎంఎన్ఎస్ ప్రజలు అరేబియన్ సముద్రపు ఉప్పు నీరు తాగే గూండాలని వ్యాఖ్యానించారు. గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమం పవిత్రమైన నీరు తాగే తాను అలహాబాదీ గూండానని పేర్కొన్నారు. తన ముందుకు వస్తే ఎవరు అతిపెద్ద గూండానో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఒక్క ఎంఎల్ఏ పార్టీ ఎంఎన్ఎస్ వారి పాఠాలను వారే నేర్చుకోలేకపోతున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో జీరో-ఎంఎల్ఏ పార్టీగా ఎంఎన్ఎస్ నిలుస్తుందని ట్వీట్ చేశారు. కట్జూ వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ వైస్ ప్రెసిడెంట్ వాగీశ్ సారస్వత్ మండిపడ్డారు. కనీసం మాకు ఒక్క ఎంఎల్ఏనైనా ఉన్నారని, అయినా కట్జూ ఏ ఆధారాలతో ఇలా వ్యాఖ్యానిస్తున్నారని ప్రశ్నించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధినేతగా ఉన్న కట్జూ ఇప్పటికే పలు అంశాలపై తీవ్రంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ ఖాన్ నటించిన కరణ్ జోహార్ సినిమా యే దిల్ హై ముస్కిల్ వచ్చే శుక్రవారం విడుదల కాబోతుంది. కానీ ఆ సినిమా విడుదలను నిలిపివేశారు. జోహార్ ఫిల్మ్ను నిలిపివేయడంపై ఎంఎన్ఎస్కు మాజీ ఇండియన్ క్రికెటర్, కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ అంత మంచికాదంటూ బెదిరించారు. MNS people are goondas who have drunk the salt water of the Arabian Sea. I am an Allahabadi goonda, who has drunk the water of the Sangam — Markandey Katju (@mkatju) October 19, 2016 So instead of showing your bravery on those helpless artists, come have a dangal with me, and let the world see who is a bigger goonda — Markandey Katju (@mkatju) October 19, 2016 -
ఆ విషయంలో బాధ ఉంది: అమితాబ్
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం పట్ల తనకు విచారం ఉందని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ కోరిక మేరకు 1984లో రాజకీయాల్లోకి వచ్చిన అమితాబ్.. అలహాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ‘ఓట్ల కోసం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చాను. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోనందుకు నేను చాలా బాధ పడ్డాను. నాకు ఏదైనా విచారం ఉందంటే ఇదే. అలహాబాద్ నగర ప్రజలకు చాలా హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయాను. మాట నిలబెట్టుకునేందుకు నా వంతు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నేను రాజకీయాల్లోకి రావడం భావోద్వేగ నిర్ణయం. అయితే రాజకీయాల్లో భావోద్వేగాలకు చోటు లేదని నాకు తర్వాత తెలిసింది. దీంతో రాజకీయాల నుంచి తపుకున్నాన’ని అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. ప్రముఖ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, బర్కాదత్ నిర్వహించిన ‘ది కఫ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనదేశంలో రాజకీయాల గురించి సినిమా నటులు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు లేవని అమితాబ్ అభిప్రాయపడ్డారు. -
ఆరుషి తల్లికి పెరోల్
న్యూఢిల్లీ: తమ కూతురు ఆరుషి హత్య కేసులో జీవితఖైదు పడిన ఆమె తల్లి నుపుర్ తల్వార్ కు పెరోల్ లభించింది. ఆమెకు అలహాబాద్ హైకోర్టు మూడు వారాలు పెరోల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించడంతో ఆమెకు ఊరట లభించింది. ఆరుషి, పనిమనిషి హేమ్ రాజ్(45) హత్య కేసులో భర్త రాజేశ్ తల్వార్ తో కలిసి నుపుర్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. నోయిడాలోని తల్వార్ ఇంటిలో ఆరుషి, హేమరాజ్ 2008, మే 15-16న హత్యకు గురయ్యారు. దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసులు ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు 2013, నవంబర్ లో ఆరుషి తల్లిదండ్రులను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. -
మా స్కూల్లో జాతీయ గీతాన్ని పాడనివ్వం!
అలహాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి ఊరు, వాడ, ప్రతి బడిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అదేవిధంగా తమ బడిలోనూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన టీచర్లు, ప్రిన్సిపాల్కు యాజమాన్యం నుంచి చుక్కెదురైంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తమ స్కూల్లో జాతీయ గీతాన్ని ఆలపించడానికి అనుమతివ్వబోనంటూ యజమాని తేల్చిచెప్పాడు. దీనికి నిరసనగా ప్రిన్సిపాల్, సహా ఎనిమిది మంది టీచర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ ఘటన గుజరాత్ అహ్మదాబాద్లోని సైదాబాద్లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది. పంద్రాగస్టునాడు స్కూలులో జెండా ఎగురవేసిన తర్వాత జాతీయగీతాన్ని ఆలపించాలని, ఆ తర్వాత వందేమాతరం, సరస్వతి వందన ఆలాపన చేయాలని స్కూల్ ప్రిన్సిపాల్ రితూ శుక్లా మేనేజ్మెంట్కు నివేదించారు. అయితే, జాతీయగీతం ఆలపించడం, ఇతర దేశభక్తి గీతాలను పాడటం వల్ల ఓ మతం వారి మనోభావాలు దెబ్బతింటాయని, కాబట్టి దీనిని అంగీకరించబోనని మేనేజర్ చెప్పారు. దీంతో మరో వర్గానికి చెందిన ఎనిమిది టీచర్లు సహా ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు విద్యాశాఖ తెలిపింది. అయితే, తమ స్కూల్ ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించొద్దన్న నిర్ణయాన్ని పాఠశాల యజమాని జియా వుల్ హక్ సమర్థించుకున్నారు. మతం, దైవం కన్నా దేశమే మిన్న అని జాతీయ గీతం ప్రబోధిస్తుందని, ఇది తమ మతాన్ని ప్రగాఢంగా విశ్వసించేవారికి ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళుతామని ఆయన చెప్పినట్టు సమాచారం. -
గోడకూలి ఐదుగురు మృతి
అలహాబాద్: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు కూలీలపై గోడ కూలడంతో వారు సజీవ సమాధి అయ్యారు. అలహాబాద్ ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ఘటన జరిగింది. ఓ ఈద్గా గోడకు అనుకొని ఏర్పాటు చేసిన టెంటులో బసచేస్తున్న వారిపై అర్థరాత్రి దాటిన తరువాత గోడకూలింది. కూలీలంతా నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం గోడకూలి ఉండటం గమనించిన స్థానికులు.. శిధిలాల కింద కూలీల మృతదేహాలను గుర్తించినట్లు పోలీస్ అధికారి దినేష్ షా వెల్లడించారు. ఈద్గా పురాతనమైనది కావడంతో దానిని రిపేర్ చేసే పనిలో ఉన్న కూలీలు అక్కడ తాత్కాలిక బస ఏర్పాట్లు చేసుకోగా.. వారిపై గోడ కూలినట్లు ఆయన వెల్లడించారు. -
ఆందోళన రేపిన బాలిక హత్య
అలహాబాద్: ఏడేళ్ల బాలికపై 15 బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార ఘటన జరిగిన 20 రోజుల తర్వాత నిందితుడి తండ్రి బాధిత బాలికను కిరాతంగా హత్య చేశాడు. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జరిగింది. బాలిక మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను అడ్డుకోవడంతో బాలిక తండ్రితో పాటు ఆమె తరపు వారిపై బుధవారం పోలీసులు లాఠీచార్జి చేశారు. జూన్ 5న బాలికపై పొరుగింట్లో ఉంటున్న 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఈ నెల 26న నిందితుడిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల తర్వాత నిందితుడు తండ్రి సహా ఐదుగురు బాలిక ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కుపోయారు. తర్వాత కత్తి గాయాలతో బాలిక మృతదేహాన్ని పొలాల్లో కనుగొన్నారు. నిందితుడి తండ్రి బాలికను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బాలిక మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో వారిపై పోలీసులు లాఠిచార్జి చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టామని పోలీసు సీనియర్ అధికారి జోగిందర్ కుమార్ తెలిపారు. -
ముందుకు నడిపించేందుకు మేం సిద్ధం
యూపీని ముందుకు నడిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో పాటు గంగా నది కృప కూడా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఆయన యూపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత బీజేపీ నిర్వహించిన అత్యంత భారీ సభ ఇది. ఈ సభతో ప్రచార పర్వానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఈ ర్యాలీలో పార్టీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్, మనోహర్ పరికర్, ఉమాభారతి తదితరులు పాల్గొన్నారు. గత రెండేళ్లలో బీజేపీ ఎన్నో విజయాలు సాధించిందని, తాను ఏ దేశం వెళ్లినా ఏదో ఒక ప్రయోజనం చేకూరుతోందని మోదీ చెప్పారు. అయితే ఆ ఘనత మోదీది కాదని.. భారతదేశానిదని ఆయన అన్నారు. ఇక గంగానది ఒక నది కాదని.. అది ఒక ఆలోచనా స్రవంతి అని చెప్పారు. ప్రపంచం మన దేశం గురించి మాట్లాడుతోందంటే అందుకు ఉత్తరప్రదేశే కారణమని తెలిపారు. అభివృద్ధి కావాలంటే వంశ పారంపర్య పాలనకు స్వస్తి పలకాలని చెప్పారు. యూపీలో ఇంతకుముందు కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్సింగ్ల హయాంలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని, అదంతా ఇప్పుడు ఏమైపోయిందని ప్రశ్నించారు. -
కర్మభూమిలో కురువృద్ధుడికి అవమానం!
పార్లమెంట్ లో రెండు సీట్లతో ప్రారంభమై, మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టగలిగే స్థాయిలో భారతీయ జనతా పార్టీని నిలిపిన మూడు స్తంభాల్లో ఒకరు మురళీ మనోహర్ జోషి. మిగతా ఇద్దరు అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కే అద్వానీలు. చివరి ఇద్దరి కంటే భిన్నంగా మనోహర్ జోషి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ ఉన్నతికి కృషి చేశారు. జోషి పుట్టింది నైనిటాల్ లోనే అయినప్పటికీ అలహాబాద్ యూనివర్సిటీలో ఆయన జీవితం మలుపు తిరిగింది. విద్యార్థిగా ప్రవేశించి, పీహెచ్ డీ పూర్తిచేసి, వర్సిటీలోనే ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. విలక్షణ సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన అలహాబాద్ పేరు చెబితే చాలా మందికి.. నెహ్రూ, ఇందిర, అమితాబ్ బచ్చన్, హరిప్రసాద్ చౌరాసియాలతోపాటు మురళీ మనోహర్ జోషి పేరు కూడా గుర్తుకొస్తుంది. అలాంటి కర్మభూమిలో, సొంత పార్టీ నేతల చేతిలోనే అవమానానికి గురయ్యారు మనోహర్ జోషి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యూహరచన చేసేందుకు బీజేపీ ఆదివారం అలహాబాద్ లో జాతీయ కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర సీనియర్ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంతటి కీలక సమావేశానికి కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషిని పిలవకపోవడంపై అలహాబాద్ లోని ఆయన అనుచరగణం భగ్గుమంటోంది. సమావేశానికి వచ్చే నాయకులకు స్వాగతం తెలుపుతూ యూపీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోనూ జోషి ఫొటో ఎక్కడా కనిపించకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. అద్వానీ, వాజపేయిల ఫొటోలు కూడా ఏక్కడోగానీ కనబడలేదట. 'జోషి గారు రెండు రోజులుగా అలహాబాద్ లోనే ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు రమ్మని ఏఒక్కరూ ఆయనను పిలవలేదు. ఇది జోషిని అవమానించినట్లు కాదా? ఇలాంటి చర్యల ద్వారా ఇప్పుడున్న నాయకులు ఏం చెప్పదలుచుకుంటున్నారు?' అంటూ మీడియా ముందు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు జోషి అనుచరులు. తమ నాయకుడికి జరిగిన అవమానంపై పార్టీ సమావేశాల్లో నిలదీస్తామని అంటున్నారు. అలహాబాద్ నుంచి మూడు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన మనోహర్ జోషి.. 2009లో వారణాసి నుంచి పోటీచేశారు. ప్రస్తుతం ఆయన కాన్పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. సంఘ్ నిర్దేశకత్వంలో మోదీ-షా ద్వయం నడిపిస్తోన్న బీజేపీలో సీనియర్లకు ప్రాధాన్యం ఎప్పుడో తగ్గిపోయిందని, 'కాంగ్రెస్ ముక్త్ భారత్' పిలుపునిచ్చిన పార్టీ 'కాంగ్రెస్ యుక్త్'లా మారిపోయిందని పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు కామెంట్ చేశారు. -
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం
అలహాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఉదయం అలహాబాద్లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఎంపీలు హాజరుకానున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలతో అమిత్ షా భేటీయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు రచించనున్నారు. ఈ సమావేశాలను యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శంఖారావ సభగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ అభివర్ణించిన విషయం తెలిసిందే. -
జన్మ సార్థకతతోనే స్వర్గ ప్రాప్తి
ఇస్లామిక్ సమ్మేళనంలో పండితులు ♦ రెండు లక్షల మంది హాజరు సాక్షి, హైదరాబాద్: దేవుడు (అల్లా) ఇచ్చిన వరం మానవ జన్మ అని, దాన్ని సార్థకం చేసుకోగలిగినప్పుడే స్వర్గ ప్రాప్తి లభిస్తుందని ఇస్లాం స్కాలర్స్ చెప్పారు. తబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో పహాడీషరీఫ్లో మూడు రోజుల ప్రపంచ స్థాయి ఇస్లామిక్ (ఇజ్తేమా) సమ్మేళనం శనివారం ప్రారంభమైంది. తొలి రోజు భారీ స్థాయిలో దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారు. ఇందులో బెంగళూర్కు చెందిన ఇస్లాం పండితుడు మౌలానా ఖాసీం ఖురేషీ ప్రసంగిస్తూ... ‘మానవ జన్మ ఒక పరీక్ష లాంటిది. దానిని సార్థకం చేసుకోవాలి. మంచి లక్షణాలతో మనుగడ సాగించాలి. ఒక మంచి కుమారుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, సమాజంలో ఒక పౌరుడిగా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించినప్పుడే జన్మ సార్థకమవుతుంది. ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు. రాబోయే బంగరు జీవితాన్ని మరిచి తాత్కాలిక ఉపశమనాల కోసం ప్రాకులాడవద్దు. మనిషిని మనిషిగా గుర్తించి మానవత్వాన్ని చాటాలి. క్రమశిక్షణతో వ్యక్తిగత జీవితం నీతి నిజాయితీగా కొనసాగించి నప్పుడే ప్రవక్త చూపిన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది’ అన్నారు. న్యూ ఢిల్లీకి చెందిన స్కాలర్ మౌలానా షౌకత్ మాట్లాడుతూ... ‘మనిషికి బతికినంతవరకే విలువ. మరణాంతరం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. తోటివారికి హాని తలపెట్టవద్దు. శాంతిని ప్రబోధించాలి. మహ్మద్ ప్రవక్త చూపించిన సన్మార్గంలో నడిచినప్పుడే సంపూర్ణ అత్మ శుద్ధిగల మానవుడిగా మారతారు. ఆధ్యాత్మిక చింతన సన్మార్గంలో నడిపించడానికి ఎంతో దోహద పడుతుంది’ అన్నారు. కార్యక్రమంలో భాషా మొయినోద్దీన ఆష్రఫ్ అలీ ఇఖ్రమలీ, వసీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రెండు వేలకు పైగా పండితులు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలకు చెందిన సుమారు రెండు వేల మందికి పైగా ఇస్లాం పండితులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ఆదివారం మరింతమంది ప్రముఖ పండితుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉన్నాయి. ఈ క్రమంలో రెండో రోజూ భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉందని తబ్లిక్ జమాత్ కమిటీ పేర్కొంది. సమ్మేళానానికి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించారు. సోమవారంతో సమ్మేళనం ముగుస్తుంది. -
వేడివేడి నూనెలో చేతులాడిస్తాడు..
తాలింపులో పచ్చిమిర్చీ వేస్తున్నప్పుడో, పిండి వంటలు చేస్తున్నప్పుడో ఒకటీ అరా వేడివేడి నూనె చుక్కలు ఒంటిపై పండితే ప్రాణం పోయినంత పనౌతుంది. అలాంటిది సలసలా కాగే నూనెలో అమాంతం చేయి పెట్టేసి పకోడీలు అవీ వండేస్తుంటాడు రాంబాబు. ఇంతకీ ఎవరీ బాబు? ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ రాంబాబు సొంతూరు. ఆ ఊళ్లోని ఓ వీధి తన ఇంటిముందరే చిన్న పొయ్యి అదీ ఏర్పాటుచేసి పిండి వంటలు అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. 200 డిగ్రీల వేడి నూనెలో చేతులు పెట్టడం, పెట్టినా కాలకపోవడంతో రాంబాబు దగ్గర ఏవో దివ్యశక్తులు ఉన్నట్లు అక్కడి జనం అమ్ముతున్నారు. ఒక విధంగా ఆ నమ్మకం అతడి షాపుకు గిరాకి పెరిగేందుకు కూడా తోడ్పడింది. ఇంతకీ ఏమిటీ మ్యాజిక్? అని రాంబాబునే అడిగితే.. 'మ్యాజిక్కూ లేదూ మాయా లేదు.. అంతా దైవ లీల! ఇరవైఏళ్ల కిందట షాపు ప్రారంభించినప్పటి నుంచీ నా వంటకాలకి మంచి పేరుంది. కొన్ని సార్లు అదుపులేచలేనంత మంది కస్టమర్లు వస్తుంటారు. అలా ఓ బిజీ సాయంత్రాన.. కస్టమర్లకు పదార్థాల్ని త్వరగా అందించాలనే హడావిడిలో పక్కనే జల్లిగంటే ఉన్న సంగతి మర్చిపోయి వేడివేడి నూనెలో చెయ్యిపెట్టి పకోడీని కలిపా! క్షణాల తర్వాత పొరపాటు గుర్తొచ్చి చెయ్యి వెనక్కి తీసుకున్నా. ఆశ్చర్యకరంగా చిత గాయమైనా కాలేదు! ఆ తర్వాత మళ్లీ మళ్లీ వేడివేడి నూనెలో నా చేతిని ముంచా. అయినా ఏమీ కాలేదు. అప్పుడు అర్థమైంది. ఇది దేవుడి లీలని. అప్పటి నుంచి గంటెలు గట్రా పక్కన పారేసి చేత్తోనే పదార్థాలు వండేస్తున్నా. ఇంతకు ముందు కంటే రుచిగా ఉంటున్నాయని పొగుడుతున్నరు కస్టమర్లు' అని వివరిస్తాడు స్ట్రీట్ ఛెఫ్ రాంబాబు. రోజుకు దాదాపు 100 కిలోల పిండి పదార్థాలమ్మే ఆయనకు ఖర్చులన్నీపోనూ 2వేల రూపాయలు మిగులుతాయట! -
నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల ఆందోళన
నెల్లూరు : ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ జిల్లా కోర్టులో ఓ న్యాయవాదిని పోలీసులు కాల్చి చంపినందుకు నిరసనగా నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల విధులు బహిష్కరించారు. జిల్లాలోని కోర్టుల ఎదుట గురువారం వారు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంతో కోర్టుకు వచ్చిన పలువురు కక్షిదారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా న్యాయవాదుల చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. (చదవండి : కోర్టులో పోలీసు కాల్పులు.. న్యాయవాది మృతి) -
కోర్టు ఆవరణలో కాల్పులు
లాయర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు అలహాబాద్ హైకోర్టులో ఘటన అలహాబాద్: లాయర్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అలహాబాద్ కోర్టు ఆవరణలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ జరిపిన కాల్పుల్లో ఒక లాయర్ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని రోషన్ అహ్మద్గా, క్షతగాత్రుడిని ఫిరోజ్ నబీగా గుర్తించారు. అలహాబాద్లో బుధవారం లాయర్లు తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. హైకోర్టు ముందున్న అలహాబాద్-కాన్పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం లాయర్లు కోర్టు ఆవరణలోకి ఒక్కసారిగా తోసుకువచ్చారు. అక్కడున్న అధికారులు, లాయర్లపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో ఆత్మ రక్షణకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడినట్లు స్థానిక జిల్లా కోర్టు జడ్జి భవ్నాథ్ సింగ్ తెలిపారు. కానిస్టేబుల్ను గాయపరచిన బుల్లెట్ ఆందోళన చేస్తున్న లాయర్ల నుంచి దూసుకొచ్చిందని వెల్లడించారు. కాగా లాయర్లపై పోలీసుల కాల్పులకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త బంద్కు బార్ కౌన్సిల్ పిలుపునిచ్చింది. మృతిచెందిన లాయర్ అహ్మద్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. -
కోర్టులో పోలీసు కాల్పులు.. న్యాయవాది మృతి
అలహాబాద్: అలహాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులు.. న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ లాయర్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కోర్టులో ఉద్రిక్తతను చల్లార్చేందుకు ఓ ఎస్ఐ జరిపిన కాల్పుల్లో ఓ లాయర్ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లాయర్లు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే కాల్పుల ఘటనతో కోర్టు ఆవరణలో ఉన్న లాయర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లాయర్లు పోలీసులతో ఘర్షణకు దిగి.. కోర్టు ఆవరణలోని వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కూతవేటు దూరంలో అలహాబాద్ హైకోర్టులోని న్యాయవాదులకు సమాచారం అందడంతో అక్కడి న్యాయవాదులు రెచ్చిపోయారు. అలహాబాద్ - కాన్పూర్ జాతీయరహదారిపై వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం... కోర్టు ఆవరణలో ఘర్షణకు దిగిన లాయర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకే ఎస్ఐ కాల్పులు జరిపారని చెప్పారు. ఆ కాల్పులు జరిపింది ఎవరో ఇంకా నిర్థరించలేదని పోలీసు శాఖ ప్రతినిధి మృత్యుంజయ మిశ్రా తెలిపారు. మృతి చెందిన న్యాయవాది రోషన్ అహ్మద్గా గుర్తించారు. గాయపడిన న్యాయవాది ఫిరోజ్ నబీ అని పోలీసులు తెలిపారు. ఘటన స్థలం వద్దకు పోలీసులు ఉన్నతాధికారులతో పాటు న్యాయమూర్తులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
స్మార్ట్ సిటీల కోసం టాస్క్ఫోర్స్
వైజాగ్, అజ్మీర్, అలహాబాద్ల కోసం కార్యాచరణ ప్రణాళిక సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), అజ్మీర్(రాజస్తాన్), అలహాబాద్(ఉత్తరప్రదేశ్) నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. ఆ టాస్క్ఫోర్స్ మూడు నెలల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు, యూఎస్ వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ ప్రిజ్కర్ల మధ్య మంగళవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరాల వారీగా టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటుచేసి ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ టాస్క్ఫోర్స్ కమిటీల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ(యూఎస్టీడీఏ) ప్రతినిధులు ఉంటారు. ఆయా టాస్క్ఫోర్స్ కమిటీలు సంబంధిత నగరాల నిర్ధిష్ట లక్షణాలు, ప్రాజెక్టు అవసరాలు, పెట్టుబడుల ఆకర్షణ కోసం రాబడి నమూనాలు తదితర అంశాలను చర్చించి కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విశాఖ, అజ్మీర్, అలహాబాద్ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు మూడు రాష్ట్రాలతో జనవరి 25న యూఎస్టీడీఏ ఒప్పందం కుదుర్చుకుందని పెన్నీ ప్రిజ్కర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రులతో మాట్లాడానన్నారు. తాజా పరిణామాలతో స్మార్ట్ సిటీల స్వప్నం వాస్తవ రూపం దాల్చనుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణానికి అవసరమైన నిధులను ఎఫ్డీఐ లేదా ఎఫ్ఐఐల ద్వారా సేకరిస్తామన్నారు. టాస్క్ఫోర్స్ కమిటీల్లో కేంద్రం తరపున పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, సంయుక్త కార్యదర్శులు డాక్టర్ సమీర్ శర్మ, ప్రవీణ్ ప్రకాశ్లు ప్రాతినిథ్యం వహిస్తారని వివరించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులకు వెంకయ్యనాయుడు ఫోన్లో వివరించారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా త్వరలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ టాస్క్ఫోర్స్ కమిటీలో రాష్ట్రం తరపున పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో పాటు విశాఖ మున్సిపల్ కమిషనర్, పురపాలన కార్యదర్శి ప్రాతినిధ్యం వహించనున్నట్టు తెలిపారని వెంకయ్యనాయుడు మీడియాకు వివరించారు. విశాఖపట్నం విద్యార్థి చెక్కపై రూపొందించిన నరేంద్ర మోదీ, ఒబామాల కరచాలనం చిత్రాన్ని సమావేశం అనంతరం పెన్నీకి వెంకయ్యనాయుడు బహూకరించారు. -
మళ్లీ షిర్డీ సాయి విగ్రహాల వివాదం!
-
మళ్లీ షిర్డీ సాయి విగ్రహాల వివాదం!
అలహాబాద్: షిర్డీ సాయిబాబా విగ్రహాల వివాదం మళ్లీ మొదలైంది. షిర్డీ సాయి దేవుడు కాదని, హిందూ ఆలయాల నుంచి ఆయన విగ్రహాలను తొలగించాలని హిందూమత నాయకులు తీర్మానం చేశారు. మతపరమైన భావాలను దెబ్బతీసిన బాలీవుడ్ సినిమా పీకేను నిషేధించాలనీ డిమాండ్ చేశారు. అలహాబాద్లో ఆదివారం రాత్రి ముగిసిన ధర్మ సంసద్ సమ్మేళనంలో ఈమేరకు పలు తీర్మానాలు చేశారు.'షిర్డీ సాయిబాబా గురువూ కాదు, దేవుడూ కాదు. కనుక హిందూ ఆలయాలపై చెడు ప్రభావాలు పడకుండా వాటి నుంచి ఆయన విగ్రహాలను తొలగించాలి' అని తీర్మానంలో పేర్కొన్నారు. ద్వారక శంకరాచార్య శిబిరంలో ద్వారక శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి, పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి సమక్షంలో జరిగిన ఈ సమ్మేళనంలో వందలాది సాధువులు, మతనాయకులు పాల్గొన్నారు. గోవధను నిషేధించాలని, హిందువులు ఇతర మతాల్లోకి మారకుండా చర్యలు తీసుకోవాలని, సంస్కృతాన్ని ప్రోత్సహించాలని తీర్మానాలు చేశారు. అయోధ్యలో సనాతన సంప్రదాయాల ప్రకారం రామాలయాన్ని నిర్మించాలని, ప్రభుత్వ పథకాలకు హిందీ పేర్లు పెట్టాలని కోరారు. హిందువుల జనాభా తగ్గకుండా ఉండేందుకు హిందూ ధర్మాన్ని శక్తిమంతగా ప్రచారం చేయాలని స్వరూపానంద సూచించారు. -
రాజకీయాల్లోకి మళ్లీ రాను..
రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేశానని, రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకున్నాక వాటి నుంచి బయటపడ్డానని బిగ్బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అలహాబాద్ లోక్సభ స్థానం నుంచి 1984లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన అమితాబ్, మూడేళ్లకే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పట్లోని తన భావోద్వేగాలు తనను రాజకీయాల వైపు నడిపించాయని, నిజ జీవితానికి, భావోద్వేగాలకు వ్యత్యాసం ఉంటుందని తర్వాత తెలుసుకున్నానని అన్నారు. -
విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం
వారణాసి: ఆరుగురు వ్యక్తులు ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరప్రదేశ్లోని చాందౌలి జిల్లా ఇల్లియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9న ఈ ఘటన జరిగింది. ఎస్పి మునిరాజ్ కథనం ప్రకారం ప్లస్ టు చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని స్కూల్ కు వెళుతుండగా ఆరుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఆ తరువాత నిందితులు ఆ విద్యార్థినిని అలహాబాద్ తీసుకువెళ్లారు. అక్కడ ఆ బాలికను నిర్బంధంలో ఉంచి ఆరుగురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ విధంగా వారు ఆరు రోజులపాటు అలా చేశారు. ఆ తరువాత ఆ బాలికను వారు వారణాసి తీసుకువచ్చి రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టినట్లు ఎస్పి చెప్పారు. నిందితులలో ఒకడు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లారు. బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ** -
'జన్ ధన్' కోసం ఘర్షణ, కాల్పులు
లక్నో: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎగబడడంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు. ముఫార్డ్ గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాల కోసం పేద ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. క్యూ లైను నుంచి ఇద్దరు యువకులను గెంటేయడంతో గొడవ ప్రారంభమైంది. వారిపై దాడి జరగడంతో ఓ యువకుడు కాల్పులు జరిపాడు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకామె పరిస్థితి విషమంగా ఉంది. -
ఆప్ అన్ని పార్టీల్లాంటిదేనా?
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని పార్టీల్లాంటిదేనా? ఆ పార్టీ నేతలు పొద్దస్తమానం విమర్శించే పార్టీలకి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి తేడా లేదా? అలహాబాద్ లో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ పై ప్రశ్నలు సంధించిన ఇద్దరు మహిళా కార్యకర్తలపై దాడి జరిగింది. వారిని కొట్టి, తిట్టి నేట్టేయడం జరిగింది. సమావేశ ప్రారంభం లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లింలకు సీట్లెందుకు ఇవ్వలేదని నాజ్ ఫాతిమా అనే కార్యకర్త ప్రశ్న వేసింది. అంతే ... ఆమెపై దాడి చేసి అక్కడినుంచి బయటకి తోసేశారు. ఆ తరువాత శ్రద్ధా పాండేయ అనే మరో మహిళా కార్యకర్త పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణ చేశారు. ఆమెకు కూడా అదే శాస్తి జరిగింది. అయితే పార్టీ కార్యకర్తలు పలువురు పలురకాల ఆరోపణలు చేశారు. అవినీతిపరులకు టికెట్లివ్వడం నుంచి పలు అంశాలను లేవనెత్తారు. దీంతో సమావేశాన్ని మధ్యలోనే వదిలిపెట్టి సంజయ్ సింగ్ వెళ్లిపోయారు. -
అది ముస్లింల ఊచకోత
నాటి ఘోరానికి మోడీయే నేతృత్వం వహించారు: ములాయం అలహాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నేతృత్వంలోనే ‘2002 గుజరాత్ అల్లర్లు’ జరిగాయని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ విమర్శించారు. ‘‘మీరే నాడు ముస్లింల ఊచకోతకు నేతృత్వం వహించారు. చేసిందంతా చేసేసి.. ఇప్పుడు ఓట్ల కోసం మీ నాయకులు ముస్లింలను క్షమాపణ కోరుతున్నారు’’ అంటూ నిప్పులు చెరిగారు. ముస్లింలను క్షమాపణ కోరుతున్నట్లుగా ఇటీవల బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఆయన ఈ విమర్శలు సంధించారు. ఆదివారం అలహాబాద్లో ఎస్పీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ములాయం మాట్లాడారు. ప్రసంగం మొత్తం మోడీపై విమర్శలతోనే సాగింది. ఉత్తరప్రదేశ్ను గుజరాత్ అంతటి సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా చేయడం ములాయం వల్ల కాదని, ఎందుకంటే అలా చేయడానికి 56 అంగుళాల ఛాతీ కావాలని ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఎస్పీ అధినేత 2002 అల్లర్లను తెరపైకి తెచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మీరు ఢిల్లీపై దండెత్తడానికి చాలా ఎత్తులు వేస్తున్నారు. కానీ మీ కల నెరవేరదు. ముస్లిం సోదరులు తెలివితక్కువ వాళ్లని మీ అభిప్రాయమా? వాళ్లు ధైర్యవంతులు, సున్నిత మనస్కులు, విశ్వాసం కలవారు.. మీ ఎత్తులు చెల్లవు. పన్నెండేళ్ల పాటు గుజరాత్ను అభివృద్ధి చేశానని మోడీ చెప్పుకుంటున్నారు. కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. అభివృద్ధికి ఆధారం లేదు. గుజరాత్లో 30 శాతం మంది మహిళలు, 50 శాతం మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. అత్యంత దారుణంగా కలుషితమైన నదుల్లో కొన్ని గుజరాత్లోనివే. అసంఘటిత రంగంలోని కార్మికులకు అక్కడ ఇచ్చే వేతనాలు.. యూపీలో కంటే తక్కువ. దీన్ని మీరు(మోడీ) అభివృద్ధి అంటారా? దీన్ని పాలన అంటారా? నేను ఆయనకు(మోడీకి) ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. గుజరాత్లో ముస్లింలను ఊచకోత కోసిన తర్వాత వారిని పరామర్శించడానికి వెళ్లి నేను నా సత్తా చాటుకున్నాను. ‘మీపై ఎవరైనా దాడి చేస్తే మా బాధ్యత కాదు’ అని మోడీ ప్రభుత్వం నన్ను బెదిరించడానికి చూసినా లెక్కచేయకుండా వెళ్లి బాధితులను ఓదార్చాను. ఇక కాంగ్రెస్ సంగతిచూస్తే.. ఆ పార్టీకి పేదలు, మైనారిటీల విషయంలో ఒక విధానమంటూ లేదు. కనీసం దేశ సరిహద్దులు కూడా కాంగ్రెస్ చేతిలో సురక్షితం కావు. -
అలహాబాద్లో అలరించిన వింటేజ్ కార్ ర్యాలీ
-
సైబీరియా పక్షుల రాకతో కొత్త కళ