athletes
-
వెటరన్... ఆపేదేలేదు!
వయసు పై బడడం అంటే కలల దారులు మూసివేయడం కాదు. గంభీర ఏకాంతవాసం కాదు. క్షణక్షణం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ‘వయసు పై బడింది’ అని ఎప్పుడూ భారంగా అనుకోలేదు ఈ మహిళలు. ‘ఈ వయసులో ఆటలేమిటీ!’ అనే నిట్టూర్పు వారి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. వెటరన్ అథ్లెట్స్లో సత్తా చాటుతూ నిత్యోత్సాహానికి నిలువెత్తు చిరునామాగా నిలుస్తున్నారు...ఇటీవల గుంటూరులో ఏపీ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 6వ ఏపి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో... రేస్ వాక్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న శిరీషారెడ్డి, షాట్పుట్, జావెలిన్ థ్రో, జంప్స్లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్న ఎం.లక్ష్మి, పరుగులో మూడు బంగారు పతకాలు సాధించిన వి. విజయ... ఆత్మవిశ్వాసం, నిత్యోత్సాహం మూర్తీభవించిన మహిళలు.గుంటూరుకు చెందిన విజయకు పదిహేనేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలలో ఒకరు దివ్యాంగురాలు. ఇళ్లలో పనిచేస్తూ, ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తాను పనిచేసే ఇంటి యజమాని కుమార్తె కోసం మైదానంలో అడుగుపెట్టింది. ఒక జిమ్ ట్రైనర్ సూచన ప్రకారం వెటరన్ అథ్లెటిక్స్ కోసం సాధనప్రారంభించింది. పతకాలు సాధించడం ఇప్పుడామెకు పరిన్టిగా మారింది. క్యాన్సర్ బారిన పడినప్పుడు ‘ఇక నా పని అయిపోయింది’ అని నిరాశలోకి వెళ్లిపోలేదు శిరీష. ఆ మనోధైర్యానికి కారణం...క్రీడాస్ఫూర్తి. నెల్లూరు చెందిన 71 ఏళ్ల శిరీషా రెడ్డికి ఆటల్లో గెలవడం వల్ల వచ్చినవి పతకాలు మాత్రమే కాదు. అంతకంటే విలువైన ఆత్మవిశ్వాసం తాలూకు శక్తులు!విశాఖపట్టణానికి చెందిన 86 ఏళ్ల లక్ష్మి వయసు న్తికేళ్ల దగ్గరే ఆగిపోవడానికి కారణం ఆటలు! ‘ఆటలు ఆనందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి’ అంటున్న లక్ష్మి ఆరోగ్య రహస్యం... క్రమశిక్షణ. ఆ ఉక్కు క్రమశిక్షణకు మూలం... ఆటలు.‘విరమణ అనేది ఉద్యోగానికే. ఆటలకు కాదు’ అంటున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన 76 సంవత్సరాల కోటేశ్వరమ్మ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకుంటోంది.వెటరన్ అంటే మాటలు కాదు... గెలుపు దారిలో విరామం లేకుండా ఉత్సాహమే శక్తిగా పరుగులు తీయడమే అని చెప్పడానికి ఈ వెటరన్ అథ్లెట్లు తిరుగులేని ఉదాహరణ.– మురమళ్ళ శ్రీనివాసరావు,సాక్షి, గుంటూరు– కె.ఎస్., సాక్షి, కావలి, నెల్లూరు జిల్లాక్యాన్సర్ నుంచి బయటపడి...గత 35 ఏళ్ళ నుండి క్రీడాసాధన చేస్తున్నాను. 2011లో క్యాన్సర్ సోకింది. కొంత కాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొండి ధైర్యంతో దానిని సులభంగా జయించాను. 2021లో కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆటలు ఆడడం కష్టమయ్యింది. అయినా వెనకడుగు వేయలేదు. ఏడు పదుల వయసులో ఎన్నో జాతీయ స్థాయి పతకాలు సాధించాను.– ఎల్. శిరీషా రెడ్డి, నెల్లూరుకష్టాల్లోనూ నవ్వడం నేర్చుకున్నాఆరు పదుల వయసు దాటినా కష్టాలు మాత్రం వెన్నంటే ఉంటున్నాయి. అందుకే అవి చుట్టుముట్టినప్పుడల్లా నవ్వుతోనే ఎదుర్కొంటాను. ఆ నవ్వుకు కారణం ఆటలు. పదకొండు అంతర్జాతీయ వెటరన్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలతో సహా మొత్తం పదకొండు పతకాలు సాధించాను. గుంటూరులో జరిగిన పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించాను. ఊపిరి ఉన్నంత వరకు పోటీల్లో పాల్గొంటాను.– వి.విజయ, గుంటూరు 86 = ఎనర్జిటిక్ఉదయించే సూర్యుడు అస్తమించే వరకు తన విధి నిర్వర్తిస్తాడు. పుట్టుకకు, మర ణానికి మధ్యలో ఉండే జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా నడిపించాలనేది నా సిద్ధాంతం. నేను పూర్తి శాకాహారిని. ఎక్కడ పోటీలున్నా ఒంటరిగానే వెళతాను. క్రమశిక్షణకుప్రాణం ఇస్తాను.– ఎం.లక్ష్మి, 86, విశాఖపట్నంకావాలి... ఇలాంటి శక్తిఅంతర్జాతీయ వెటరన్ క్రీడాకారిణిగా రాణిస్తున్న నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన ఏనుగుల కోటేశ్వరమ్మ వయస్సు 76 ఏళ్లు. అయినా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసమాన క్రీడా నైపుణ్యాన్ని ఆమె ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 125, జాతీయ స్థాయిలో 115, అంతర్జాతీయ స్థాయిలో 17 పతకాలు సాధించింది. కావలిలోని జవహర్ భారతి కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహించింది. పదవీ విరమణ చేసినప్పటికీ ఆటలపై ఆసక్తితో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో న్ల్గొంటూ విజేతగా నిలుస్తోంది. లక్షల రూన్యలు ఖర్చు అయ్యే అంతర్జాతీయ క్రీడా పోటీల్లో న్ల్గొనడానికి తనకు వచ్చే పింఛన్ నగదును దాచుకొని వాటితో క్రీడాపోటీల్లో న్ల్గొంటోంది.ఆటలే ఆరోగ్యం... మహాభాగ్యంసింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, జన్న్ లలో బంగారు పతకాలు సాధించినప్పటికీ, స్వీడన్ లో సాధించిన కాంస్య పతకం సంతోషాన్ని ఇచ్చింది. ఒలింపిక్స్లో న్ల్గొన్న క్రీడాకారులతో పోటీపడి అన్నిరకాల ప్రీ పోటీల్లో విజేతగా నిలవడంతో చివరి పోటీల్లో న్ల్గొనే అర్హత రావడమే చాలా గొప్ప విషయం. రోజూ గ్రౌండ్లోప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. అందువల్లనే ఆరోగ్య సమస్యలు లేకుండా హుషారుగా ఉంటాను. – ఏనుగుల కోటేశ్వరమ్మ -
అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా అంజూ
చండీగఢ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నూతన కార్యవర్గం తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 9 మంది అథ్లెట్లతో కూడిన ఏఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు మహిళా అథ్లెట్లు, ముగ్గురు పురుష అథ్లెట్లకు చోటు దక్కింది. తాజా ఎన్నికల్లో మరోసారి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ‘డబుల్ ఒలింపియన్’ మాజీ లాంగ్జంపర్ అంజూ బాబీ జార్జి... ఈ కమిషన్కు చైర్పర్సన్గా వ్యవహరించనుంది. ఈ కమిషన్లో అంజూతో పాటు జ్యోతిర్మయి సిక్దర్ (రన్నింగ్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), ఎండీ వల్సమ్మ (హర్డిల్స్), సుధా సింగ్ (స్టీపుల్ఛేజ్), సునీతా రాణి (రన్నింగ్) చోటు దక్కించుకున్నారు. పురుషుల విభాగం నుంచి ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ సాగూతో పాటు ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, అవినాశ్ సాబ్లే (స్టీపుల్ ఛేజ్) ఉన్నారు. గత కమిషన్లో నలుగురు మహిళలు ఉండగా... ఇప్పుడు వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతూ ఆ సంఖ్యను 6 చేశారు. బహదూర్ సింగ్ గతంలో సుదీర్ఘ కాలం ఈ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించారు. బిజీ షెడ్యూల్ కారణంగా కమిషన్కు ఎక్కువ సమయం కేటాయించలేనని చెప్పినప్పటికీ... ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ నీరజ్ చోప్రాతో చర్చించి అతడిని కమిషన్లో భాగం చేసింది. 2012 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన అదిలె సుమరివాలా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న సుమరివాలాకు.. ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ సమావేశాలకు హజరయ్యే అధికారాలు ఉన్నాయి. డోపింగ్ ఉదంతాల వల్ల దేశ అథ్లెటిక్స్ ప్రభ మసకబారకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏఎఫ్ఐ నిర్ణయించింది. దీని కోసం అథ్లెట్ల శిక్షణకు సంబంధించిన వివరాలను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పర్యవేక్షించనుంది. -
ప్యారిస్ ఒలింపిక్స్ : నీతా అంబానీ ‘ఇండియా హౌస్’ విశేషాల వీడియో
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్లో భారతీయ కళలు, ఔన్నత్యాన్ని చాటుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆశయాలకు అనుగుణంగా, ఐవోఏ భాగస్వామ్యంతో రూపొందించిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్కు సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. #WATCH | IOC member and CEO & Chairperson of Reliance Foundation, Nita Ambani gives us a glimpse of the first ever India House at the Olympics, bringing the spirit of India to Paris. pic.twitter.com/jxlTKEg3Dq— ANI (@ANI) July 30, 2024ఒలింపిక్స్లో భారతీయ అథ్లెట్లకు నిలయం భారతదేశపు తొలి కంట్రీ హౌస్ను ఏర్పాటు చేశారు. భారతీయ అథ్లెట్లను ఉత్సాహ పరిచేందుకు, వారి విజయ సంబరాలకు ఉద్దేశించినదే ఈ ఇండియా హౌస్ అని నీతా వెల్లడించారు. ఈ సందర్భంగా నీతా, బనారస్, కాశ్మీర్ నుండి వచ్చిన చేతిపనులు విశేషాలను పంచుకున్నారు. ఇంకా అద్బుతమైన హస్తకళలు, సాంప్రదాయ భారతీయ ఆభరణాలు కూడా ఇందులో ఉన్నాయి. భారతీయ అథ్లెట్ల నైపుణ్యాలు, జాతీయ క్రీడా సమాఖ్యలకు మద్దతు ఇవ్వడంలో భారత విశ్వసనీయతను చాటడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అంతేకాదు భారత్ను విశ్వక్రీడా వేదికగా నిలపడంతోపాటు, భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనే ఆకాంక్షకు ఇది నిదర్శనమన్నారు. ఈ సందర్బంగా ఆమె అతిథులకు భారతీయ వంటకాలను రుచి చూపించారు. భారతీయ ఆహారం, బాలీవుడ్ సంగీతం లేకుండా భారతదేశంలో ఏ వేడుకలు పూర్తి కావనీ, మన సంప్రదాయాలు, మన కళ, సంస్కృతి ఇవన్నీ మన అథ్లెట్లను ఉత్సాహపరచడం కోసమే అన్నారు. కళాకారుల నృత్యాలకు నీతా కూడా ఉత్సాహంగా కాలు కదపడం విశేషం. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా ఆనంద్ పిరామిల్కూడా కన్పించారు. ఇండియా హౌస్ లాంచ్ వేడుకలో గాయకుడు షాన్ వేదికపై ప్రదర్శనను ఈ వీడియోలో చూడవచ్చు. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన మరుసటి రోజు జులై 27న లా విల్లెట్ ప్రాంతంలో ఈ ఇండియా హౌస్ను ప్రారంభించారు. ఈ వేడుకలో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష, బీసీసీఐ సెక్రటరీ జై షా, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఒలింపిక్స్ ముగింపు తేదీ వరకు ఆగస్టు 11 వరకు ఈ హౌస్ను సందర్శకులు వీక్షించే అవకాశం ఉంది. -
భారత్తో బంధం... మరో దేశానికి ప్రాతినిధ్యం
ప్రతి క్రీడాకారుడి జీవితాశయం ఒలింపిక్స్లో పోటీపడటం, దేశానికి పతకం సాధించడం. అయితే ఈ విశ్వ క్రీడల్లో పాల్గొనాలంటే కొన్ని దేశాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. చాలా మందికి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కదు. ఫలితంగా సత్తా ఉన్న వాళ్లు వేరే దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడి మరో మార్గంలో ఒలింపిక్స్లో పాల్గొనాలనే తమ కలను నిజం చేసుకుంటారు. మరికొందరేమో తల్లిదండ్రుల వృత్తిరీత్యా స్వదేశాన్ని వీడి వేరే దేశంలో స్థిరపడతారు. వారి పిల్లలు క్రీడలను కెరీర్గా ఎంచుకొని ఒలింపిక్స్ స్థాయికి వెళతారు. మరో మూడు రోజుల్లో ఆరంభమయ్యే పారిస్ ఒలింపిక్స్లో భారత్తో బంధం ఉన్నా వేరే దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఉన్నారు. వారి వివరాలు క్లుప్తంగా...రాజీవ్ రామ్ (టెన్నిస్; అమెరికా): రాజీవ్ రామ్ తల్లిదండ్రులు రాఘవ్, సుష్మా బెంగళూరు నుంచి చాలా ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. రాజీవ్ అమెరికాలోని డెన్వర్లో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత టెన్నిస్ను కెరీర్గా ఎంచుకున్నాడు. 40 ఏళ్ల రాజీవ్ ఐదు గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించాడు. వీనస్ విలియమ్స్తో కలిసి రాజీవ్ రామ్ 2016 రియో ఒలింపిక్స్లో అమెరికాకు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజత పతకం అందించాడు. పారిస్లో రాజీవ్ పురుషుల డబుల్స్లో పోటీపడనున్నాడు. ప్రీతిక పవాడే (టేబుల్ టెన్నిస్; ఫ్రాన్స్): ప్రీతిక తల్లిదండ్రులు విజయన్, సుగుణ పుదుచ్చేరిలో జన్మించారు. 2003లో విజయన్ ఫ్రాన్స్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2004లో ప్రీతిక పారిస్లో జని్మంచింది. 16 ఏళ్లకే ప్రీతిక ఫ్రాన్స్ తరఫున టోక్యో ఒలింపిక్స్లో పోటీపడింది. స్వదేశంలో జరగనున్న ఒలింపిక్స్లో 19 ఏళ్ల ప్రీతిక మహిళల సింగిల్స్లో 12వ సీడ్గా బరిలోకి దిగనుంది. మహిళల డబుల్స్తోపాటు మిక్స్డ్ డబుల్స్లోనూ ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. శాంతి పెరీరా (అథ్లెటిక్స్; సింగపూర్): సింగపూర్ ‘స్ప్రింట్ క్వీన్’గా పేరొందిన వెరోనికా శాంతి పెరీరా పూర్వీకులది కేరళ. సింగపూర్లో వాళ్ల తాతకు ఉద్యోగం రావడంతో తిరువంతనపురం నుంచి సింగపూర్కు వచ్చి స్థిరపడ్డారు. గత ఏడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో శాంతి 100 మీటర్ల విభాగంలో రజత పతకం గెలిచి 49 ఏళ్ల తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్లో సింగపూర్కు తొలి పతకాన్ని అందించింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో సింగపూర్ బృందానికి శాంతి పతాకధారిగా వ్యవహరించనుంది. కనక్ ఝా (టేబుల్ టెన్నిస్; అమెరికా): ఇప్పటికే రియో, టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న కనక్ ఝా నాలుగుసార్లు టేబుల్ టెన్నిస్లో అమెరికా జాతీయ చాంపియన్గా నిలిచాడు. కనక్ తల్లి సుగుణ స్వస్థలం ముంబైకాగా.. తండ్రి అరుణ్ కోల్కతా, ప్రయాగ్రాజ్లలో పెరిగారు. వీరిద్దరు ఐటీ ప్రొఫెషనల్స్. వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లి కాలిఫోరి్నయాలో స్థిరపడ్డారు. 24 ఏళ్ల కనక్ 2018 యూత్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచాడు. అమర్ ధేసి (రెజ్లింగ్; కెనడా): అమర్వీర్ తండ్రి బల్బీర్ జాతీయ గ్రీకో రోమన్ చాంపియన్. పంజాబ్ పోలీసులో కొంతకాలం పనిచేశాక బల్బీర్ 1979లో కెనడాకు వచ్చి స్థిరపడ్డారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో కెనడాకు ప్రాతినిధ్యం వహించిన అమర్ 125 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో 13వ స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్లో పతకంపై గురి పెట్టాడు. 28 ఏళ్ల అమర్ 2021 పాన్ అమెరికన్ చాంపియన్íÙప్లో పసిడి పతకం సాధించాడు. అనంతరం 2022 బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
షణ్ముగ శ్రీనివాస్కు స్వర్ణం... శిరీషకు కాంస్యం
ఇండియన్ గ్రాండ్ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు పతకాలతో మెరిశారు. గురువారం చెన్నైలో జరిగిన పురుషుల 200 మీటర్ల విభాగంలో నలబోతు షణ్ముగ శ్రీనివాస్ స్వర్ణ పతకం సాధించగా... మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో ముగద శిరీష కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 21 ఏళ్ల షణ్ముగ శ్రీనివాస్ అందరికంటే వేగంగా 21.18 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఇదే నెలలో భువనేశ్వర్లో జరిగిన ఫెడరేషన్ కప్ చాంపియన్షిప్లో షణ్ముగ రజత పతకం సాధించాడు. మూడేళ్ల క్రితం కెన్యాలో జరిగిన అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో శ్రీనివాస్ భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 20 ఏళ్ల శిరీష 1ని:03.06 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిరీష ఖేలో ఇండియా గేమ్స్లోనూ కాంస్య పతకం సాధించింది. -
‘టాలెంట్ హంట్’కు సిద్ధం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలు కీలక ఘట్టంలోకి ప్రవేశించాయి. గ్రామ/వార్డు సచివాలయం, మండలస్థాయి పోటీలను దిగ్విజయంగా ముగించుకుని నియోజకవర్గ స్థాయిలో సత్తా చాటేందుకు జట్లు ఉరకలేస్తున్నాయి. బుధవారం నుంచి 175 నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తిస్థాయి ప్రొఫెషనల్ రీతిలో పోటీలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాట్లు చేసింది. క్రిక్క్లబ్ యాప్, ‘ఆడుదాం ఆంధ్రా’ వెబ్సైట్ ద్వారా యూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష వీక్షణం, ప్రత్యక్ష స్కోరును తిలకించేలా సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కామెంట్రీలను నిర్వహించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలిసితీసే ఉద్దేశంతో ప్రభుత్వం 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులకు 5 క్రీడాంశాల్లో మెగా టోరీ్నకి శ్రీకారం చుట్టింది. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ (డబుల్స్)లో నియోజకవర్గ స్థాయి నుంచి నగదు బహుమతులను ప్రకటించింది. పోటీలను పక్కా ప్రొఫెషనల్ విధానంలో ఆయా క్రీడా ఫెడరేషన్ల నిబంధనల ప్రకారం నిర్వహించనుంది. టీ10 విధానంలో పూర్తిస్థాయి మ్యాచ్ బాల్తో క్రికెట్ పోటీలు, వాలీబాల్లో (25–25–15), బ్యాడ్మింటన్లో (21–21–21) బెస్ట్ ఆఫ్ త్రీ పాయింట్ల విధానాన్ని అమలు చేయనుంది. ఖోఖోలో 2 ఇన్నింగ్స్కు 9 నిమిషాలు, కబడ్డీ పురుషుల సెషన్కు 20 నిమిషాలు, మహిళలకు 15 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించింది. భోజన, వసతి సౌకర్యాలతో.. మండలస్థాయి పోటీల్లో విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసింది. వీరిని నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపేందుకు అవసరమైన చోట రవాణా, భోజన, వసతులను పర్యవేక్షిస్తోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకారం పోటీలను పూర్తిచేసే లక్ష్యంతో సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. 27 నుంచి పూర్తిస్థాయిలో క్రికెట్ పోటీలు ఊపందుకునేలా కార్యాచరణ రూపొందించింది. మండలాలు, మునిసిపాలిటీలు కలిపి 753 యూనిట్ల నుంచి 75,000 మందికిపైగా క్రీడాకారులు నియోజకవర్గ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిభ వేట ప్రారంభం.. నియోజకవర్గ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లకు చెందిన ప్రతినిధులు నియోజకవర్గాల్లోని పోటీలను పరిశీలించి ‘టాలెంట్ హంట్’ చేపట్టనున్నారు. ప్రో కబడ్డీ సంస్థ, ప్రైమ్ వాలీబాల్, ఏపీ ఖోఖో క్రీడా సంఘం, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు, అంతర్జాతీయ క్రీడాకారుల బృందాలు యువతలోని ప్రతిభను గుర్తించి నివేదిక రూపొందించనున్నాయి. అసలు ఆట ఇప్పుడే మొదలైంది ఆంధ్రాను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడంలో భాగంగా ఆడుదాం ఆంధ్రా నిర్వహిస్తున్నాం. ఇది ఏటా కొనసాగిస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా వెతికిపట్టుకుని ప్రపంచ వేదికలపై నిలబెట్టడమే సీఎం జగన్ లక్ష్యం. ఇకపై అన్నీ కీలక ఘట్టాలే. ఇప్పుడే అసలు ఆట మొదలైంది. క్రీడాకారులు ప్రతి దశలోనూ అద్భుత ప్రతిభ కనబర్చాలి. – ఆర్కే రోజా, క్రీడా శాఖ మంత్రి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందజేశాం నియోజకవర్గ స్థాయి పోటీలకు సర్వం సిద్ధమైంది. ఎప్పటికప్పుడు జేసీలు, శాప్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యాలపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది తగిన ఆదేశాలిచ్చాం. మండలస్థాయి విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందించాం. పూర్తిగా ప్రొఫెషనల్స్ తరహాలో టోర్నీ జరగనుంది. – ధ్యాన్చంద్ర, శాప్ ఎండీ -
ఆనందం.. ఆకాశాన్నంటింది
సాక్షి నెట్వర్క్/అమరావతి: గ్రామాల్లో ‘ఆడుదాంఆంధ్రా’ క్రీడా సంబరం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. క్రీడా మైదానాల్లోకి యువత భారీ సంఖ్యలో దూసుకొస్తున్నారు. నాల్గవ రోజు శుక్రవారానికి 14,396 గ్రామ/వార్డు సచివాలయాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. దాదాపు 96.61 శాతం సచివాలయాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 100 శాతం సచివాలయాల్లో పోటీలు మొదలయ్యాయి. ఒక్క రోజే 21,488 మ్యాచ్లకు షెడ్యూల్ చేస్తే 18,871 మ్యాచ్లను పూర్తి చేశారు. ఏలూరు, బాపట్ల, అనంతపురం, కృష్ణా, వైఎస్సార్, తూర్పుగోదావరి, అనకాపల్లి, చిత్తూరు, విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 92 శాతానికిపైగా మ్యాచ్ షెడ్యూల్ పూర్తయింది. మొత్తం .16లక్షల మంది వీక్షకులు హాజరవగా.. మొత్తంగా నాలుగు రోజుల్లో 28.60 లక్షల మంది ఆడుదాం ఆంధ్ర క్రీడలను వీక్షించారు. పల్నాడుకే వన్నె తెచ్చిన క్రీడలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా యువత ఆటల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షించారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 257 సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో పోటీలు జరిగాయి. ఇక్కడ 666 మ్యాచ్లకు గాను 664 మ్యాచ్లు నిర్వహించారు. 8,816 మంది క్రీడాకారులు పాల్గొనగా, 32,850 మంది ప్రేక్షకులు వీక్షించారు. క్రీడల నిర్వహణ పై కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. తిరుపతి జిల్లాలో 392 సచివాలయాల పరిధిలోని మైదానాల్లో క్రీడలు నిర్వహించారు. 1261 మ్యాచ్లకు గాను 1260 మ్యాచ్లను నిర్వహించారు. కడపలో కదం తొక్కారు కడప జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు సంబరాన్ని తలపిస్తున్నాయి. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కడపలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీడీఓలు, ఫిజికల్ డైరెక్టర్లు టోర్నమెంట్ను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లాలో 500 సచివాలయాల పరిధిలో 690 మ్యాచ్లు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియంతో పాటు పాఠశాల్లో 70 మ్యాచ్లు జరిగాయి. విజయవాడలోని కానూరి వీఆర్ సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న పోటీల్లో క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విజయవంతంగా ఆడుదాం ఆంధ్రా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం.. ఆంధ్రా’ ఆటల పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావటానికి ఈ ఆటల పోటీలు దోహదపడుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది క్రీడాకారులు వారి పేర్లు నమోదు చేసుకొని క్రీడల్లో పాల్గొంటున్నారు. సచివాలయం స్థాయి నుంచి ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా చక్కని అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రద్యుమ్న, రాష్ట్ర క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ -
ఉరకలేస్తున్న క్రీడోత్సాహం
సాక్షి నెట్వర్క్/అమరావతి: రాష్ట్రంలో క్రీడా సంబరం ఉరకలేస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ యువత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజైన గురువారం 8,319 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. 26 వేల మ్యాచ్లకు గాను 82 శాతం షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యధికంగా ఏలూరు (96.80 శాతం), బాపట్ల (92.13 శాతం), అనంతపురం (90 శాతం) మేర ప్రణాళిక ప్రకారం పోటీలు జరిగాయి. గుంటూరు, ఏలూరు, బాపట్లలో 99.15కుపైగా, అన్నమయ్య, తూర్పుగోదావరి, విజయనగరం, ఎన్టీఆర్, అనకాపల్లిలో 96 శాతానికిపైగా సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 8,948 క్రీడా మైదానాల్లో క్రీడాకారులకు, వీక్షకులకు అవసరమైన వసతులను కల్పించారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు ప్రత్యేకంగా కామెంట్రీ బాక్స్లను ఏర్పాటు చేశారు. సుమారు 6.69 లక్షల మంది పోటీలను వీక్షించారు. విక్రమార్కులై చెలరేగారు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు నువ్వా–నేనా అన్నట్టుగా పోటీల్లో తలపడ్డారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను తిలకించేందుకు వీక్షకులు పోటెత్తారు. పోటీల పర్యవేక్షణకు చిత్తూరు కలెక్టరేట్లోని పూలే భవనంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. చిత్తూరు మైదానాల్లో నిర్వహిస్తున్న పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ పరిశీలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు, పుంగనూరు, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో పోటీలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి మూడో రోజు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఒంటిమిట్టలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 645 సచివాలయాల పరిధిలోను, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో పోటీలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని 672 సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు కొనసాగుతున్నాయి. సివంగులై తలపడుతున్న యువతులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతులు సివంగులను తలపిస్తూ పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 535 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో దాదాపు 13 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, 3 రోజుల్లో 81,860 మ్యాచ్లను తిలకించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 625 సచివాలయాల స్థాయిలో 956 మ్యాచ్లు జరగాల్సి ఉండగా, 730 మ్యాచ్లు జరిగాయి. మొత్తంగా మూడు రోజుల్లో 3,280 మ్యాచ్లు జరిగాయి. సుమారు 33 వేల మంది కారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలికలు, యువతులతోపాటు డ్వాక్రా సంఘాల మహిళలు సైతం పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆడుదాం ఆంధ్రా పోటీలు విజయవంతంగా సాగుతున్నాయి. విజయం కోసం హోరాహోరీ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. యువత పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం, ప్రగతి పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ పోటీలను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న పరిశీలించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దాచేపల్లి మండలంలోని గామాలపాడులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సందడి తెచ్చాయి. గురువారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 260 సచివాలయాల్లో 707 మ్యాచ్లలో క్రీడాకారులు తలపడ్డారు. కృష్ణా జిల్లాలో 508 సచివాలయాల్లో 977 మ్యాచ్లలో క్రీడాకారులు పోటీ పడ్డారు. మండల స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా జెర్సీ (టీ.షర్ట్, టోపీ)లను జిల్లా క్రీడల అభివృద్ధి కార్యాలయాలకు సరఫరా చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని 605 సచివాలయాలకు 68,970 జెర్సీలు, కృష్ణా జిల్లాలో 508 సచివాలయాలకు 57,912 జెర్సీలు వచ్చాయి. -
సంబరంలా.. ఆడుదాం ఆంధ్రా పోటీలు
సాక్షి, నెట్వర్క్: మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా పోటీలు తొలిరోజు అంబరాన్ని అంటే సంబరంతో మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరులోని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 6,174 చోట్ల షెడ్యూల్ ప్రకారం పోటీలను నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు ఐదు క్రీడాంశాల్లో కలిపి మొత్తం 33,722 పోటీలు జరిగాయి. సాంప్రదాయ క్రీడాంశాలైన యోగా, మారథాన్ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 26 జిల్లాల్లోనూ 5 లక్షలకుపైగా ప్రేక్షకులు నేరుగా ఆడుదాం ఆంధ్రా పోటీలను వీక్షించినట్టు సమాచారం. దాదాపు 50 శాతం జిల్లాల్లో 100 శాతం, మిగిలిన జిల్లా్లల్లో 99 శాతం వరకు జట్ల కూర్పు పూర్తయింది. జనవరి 9లోగా గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలను పూర్తి చేసేలా రోజూ ప్రణాళిక ప్రకారం అధికార యంత్రాంగం పని చేస్తోంది. తుది నివేదిక ప్రకారం ఆడుదాం ఆంధ్రాకు 37.23 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. ఇందులో 23.48 లక్షల మంది పురుషులు, 13.75 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. వలంటీర్ల ద్వారా మాన్యువల్ స్కోరింగ్తో పాటు పారదర్శకత కోసం క్రిక్ క్లబ్ యాప్ ద్వారా ఆన్లైన్ స్కోర్లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల మంది శిక్షణ పొందిన వలంటీర్లకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడల స్కోరింగ్కు ప్రత్యేక లాగిన్లు అందించారు. సచివాలయ స్థాయి పోటీల్లో విజేతలకు అందించేందుకు వీలుగా టీషర్టులు, టోపీలను వేగంగా సరఫరా చేస్తున్నారు. 17.10 లక్షల జతలకు గాను 8 లక్షలకు పైగా ఇప్పటికే జిల్లాలకు చేరాయి. కోస్తా.. వెల్లివిరిసిన ఆనందం.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలో పోటీలను కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంపీ భరత్రామ్ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 511 సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో ఆటల పోటీలకు 90 వేల మంది పురుషులు, 40 వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,16,171 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేయించుకున్నారు. రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు హాజరై పోటీలకు శ్రీకారం చుట్టారు. భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు, భీమవరంలో కలెక్టర్లు వె.ప్రసన్న వెంకటేష్, పి.ప్రశాంతిలు ఆటల పోటీలను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో 1.43 లక్షల మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 1.71 లక్షల మంది క్రీడల్లో పాల్గొనటానికి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏలూరు జిల్లాలో 5 ప్రధాన క్రీడలకు సంబంధించి 14,354 టీమ్లను సిద్ధం చేసి 7,198 మ్యాచ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో దాదాపు 1.17 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో 11 వేలకు పైగా జట్లు ఆడనున్నాయి. కృష్ణా జిల్లాలో వివిధ క్రీడల్లో 1.12 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పురుషుల్లో 7 వేల జట్లు, మహిళల్లో 4వేల జట్లు ఉన్నాయి. పోటీల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ పతాకంతో 2 కిలోమీటర్ల మేర విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 3,280 అడుగుల పొడవున రూపొందించిన జాతీయ జెండాతో క్రీడాకారులు గాంధీనగర్ నుంచి చీమకుర్తిలోని ప్రభుత్వ హైస్కూలు క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. దర్శిలో జాతీయ పతాకంతో రెవెన్యూ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు జరిగాయి. ఉత్తరాంధ్రలో ఉరిమిన ఉత్సాహం.. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో 11,500 జట్లు నమోదు చేసుకోగా.. 670 క్రీడా మైదానాలు సిద్ధం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 976 సచివాలయాల పరిధిలో 485 మైదానాల్లో ఐదు క్రీడాంశాల్లో ఆటల పోటీలు జరిగాయి. మొత్తం 2.07 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విజయనగరంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఆటల పోటీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులైన కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ పతక విజేత మత్స్య సంతోషి, జాతీయ వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, స్కేటింగ్ క్రీడాకారుడు సాయితేజలను ఘనంగా సత్కరించారు. విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెంలో జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ రవి పట్టాన్శెట్టి, ఎంపీ సత్యవతి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 14,098 టీములు, అందులో 1.31 లక్షల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. రాయలసీమ.. ఆటాడుకుందాం రా.. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో 1,89,929 మంది, నంద్యాల జిల్లాలో 1.25 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో 645, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పోటీలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 515 క్రీడామైదానాల్లో పోటీలు జరిగాయి. తిరుపతి జిల్లాలో పలు సచివాలయాల పరిధిలో క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. అనంతపురం, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, తాడిపత్రి, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ పోటీలు జరిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. -
ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్ర’ మెగా టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి యువత పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు 30.50 లక్షల మంది క్రీడాకారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. మరో 1.36 లక్షల మందికి పైగా ప్రేక్షకులుగా నమోదయ్యారు. వీరిలో క్రీడల్లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారి కోసం శాప్ ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్ను తీసుకొస్తోంది. అలాగే యువత నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు రిజిస్ట్రేషన్ల గడువును ఆదివారం వరకు పొడిగించింది. ప్రత్యేక డ్రెస్.. డిజిటల్ స్కోరింగ్ ఈ టోర్నీని ప్రొఫెషనల్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో విజేతలకు ప్రభుత్వం స్పోర్ట్స్ టీ షర్టులను పంపిణీ చేయనుంది. దాదాపు ఒక్కో సచివాలయం పరిధిలో ఐదు క్రీడాంశాల్లో(క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, వాలీబాల్)గెలిచిన 114 మంది మహిళలు, పురుషులకు ‘ఆడుదాం ఆంధ్ర’ లోగోతో కూడిన టీషర్టులు అందించనుంది. తొలి దశలో 17.19 లక్షల టీషర్టులను అందజేయనుంది. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన జిల్లా స్థాయి విజేతలకు స్పోర్ట్స్ డ్రెస్ కిట్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. అలాగే సచివాలయాల పరిధిలో వలంటీర్ల సేవలను ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల కోసం ఉపయోగించుకోనున్నారు. జిల్లా కోచ్లు, పీఈటీలు, పీడీలతో పాటు వలంటీర్లకు అంపైరింగ్, డిజిటల్ స్కోరింగ్పై తొలి దశ శిక్షణ అందించారు. మరోసారి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక యాప్లో స్కోరింగ్ నమోదుపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివాలయం, మండల స్థాయి వరకు ఆఫ్లైన్లో స్కోర్లు నమోదు చేసి వాటిని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గస్థాయిలో క్రీడాకారులు, ప్రేక్షకులు తమ మొబైల్లోనే స్కోర్ చూసుకునే విధంగా పోటీల సమయంలోనే ఆన్లైన్లో స్కోరింగ్ నమోదు చేస్తారు. పది రోజుల పాటు వాయిదా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 9,060 క్రీడా మైదానాలను శాప్ అధికారులు గుర్తించారు. మైదానాల్లో గడ్డి తొలగించడంతో పాటు క్రీడలకు అనువుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. కానీ తుపాను కారణంగా పలు జిల్లాల్లోని మైదానాల్లోకి నీళ్లు చేరాయి. ప్రస్తుతం వాటిని తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. దీంతో 15వ తేదీన ప్రారంభం కావాల్సిన టోర్నీని పది రోజుల పాటు వాయిదా వేశారు. మరోవైపు.. రిజిస్ట్రేషన్లకు గడువును ఆదివారం(డిసెంబరు 17) వరకు పొడిగించారు. -
ఆట కాదు.. వేట
సాక్షి, అమరావతి: జాతీయ క్రీడా పోటీల్లో ఏపీ క్రీడాకారుల బృందం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే పతకాల వేటలో అద్భుతంగా రాణించింది. 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలతో ఆంధ్రప్రదేశ్ 37వ జాతీయ క్రీడల్లో సత్తా చాటింది. మహిళా అథ్లెట్లు నాలుగు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్యాలతో అదరగొట్టారు. గత ఏడాది అథ్లెటిక్స్లో ఆరు పతకాలు రాగా.. ఈ ఏడాది 8కి పెరిగాయి. వెయిట్ లిఫ్టింగ్లో 3 నుంచి 5కు పెరిగాయి. వాటర్ స్పోర్ట్స్లో ప్రాతినిధ్యం వహించిన తొలి పోటీలోనే పతకం రావడం విశేషం. 20 క్రీడాంశాల్లో 183 క్రీడాకారులు ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తే... ఇందులో 31 మంది పురుషులు,33 మంది మహిళా క్రీడాకారులు వ్యక్తిగత, బృంద విభాగాల్లో పతకాలు సాధించారు. శిక్షణ అదిరింది జాతీయ క్రీడల్లో పతకాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ‘టార్గెట్ గోవా’ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. క్రీడా సంఘాల సమన్వయంతో దాదాపు 17 క్రీడాంశాల్లో షెడ్యూల్ ప్రకారం శాప్ కోచ్లతో స్పెషల్ కోచింగ్ క్యాంపు నిర్వహించింది. ఫలితంగా క్రీడాకారుల నైపుణ్యాలు మెరుగుపడటంతో పతకాల సంఖ్య కూడా పెరిగింది. 17 క్రీడాంశాల్లో శిక్షణ క ల్పిస్తే.. వీటిల్లో ఏకంగా 10 విభాగాల్లో పతకాలు రావడం విశేషం. ఈ స్పెషల్ క్యాంపు కోసం ఏకంగా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేయడంతో పాటు మరో రూ.14.16 లక్షల విలువైన క్రీడా పరికరాలు, దుస్తులను సమకూర్చింది. వీటితో పాటు పోటీలకు వెళ్లే ముందు టీఏ, డీఏల కింద మరో రూ.12 లక్షలు విడుదల చేసింది. గతేడాది 8 విభాగాల్లో 16 పతకాలు సాధిస్తే.. ఇప్పుడు 11 విభాగాల్లో ఏకంగా 27 పతకాలు గెలుపొందడం విశేషం. క్రీడాకారులకు రెట్టింపు ప్రోత్సాహం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పెద్దపీట వేసింది. గతంలో ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను రెట్టింపు చేసింది. జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిస్తే రూ.5 లక్షలు, రజతానికి రూ.4 లక్షలు, కాంస్యానికి రూ.3 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఫలితంగా క్రీడాకారులు ఆరి్థక ఇబ్బందులను దాటి పతకాలను ఒడిసి పడుతున్నారు. పతకాల ఒరవడిని కొనసాగిస్తాం ఏపీలోని యువతను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాప్ ప్రత్యేక కోచింగ్ క్యాంపుల ద్వారా మెరుగైన శిక్షణ అందిస్తోంది. వచ్చే జాతీయ పోటీల్లోనూ ఇప్పటి కంటే మెరుగైన ప్రదర్శన, ఎక్కువ పతకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతాం. అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం. ఈ పతకాల ఒరవడి ఇలానే కొనసాగేలా చూస్తాం. – ధ్యాన్ చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సాధించిన పతకాలు ఇలా.. ♦ బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం (డి.పూజా, ఎస్కే గౌస్), మహిళా బ్యాడ్మింటన్ జట్టుకు కాంస్యం (కె.నవ్య, టి.సూర్య చరిష్మా, ఎల్.మమైఖ్య, డి.రష్మీత, ఎం.ఆకాంక్ష, సీహెచ్.సాయి ఉత్తేజ్రావు, డి.పూజ, పి.సోనికసాయి, డి.దీపిక, డి.స్రవంతి) లభించాయి. ♦ మహిళల వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో ఎన్.లలిత (స్వర్ణం), 59 కేజీల విభాగంలో ఎం.దీపనయోమి (కాంస్యం), పురుషుల్లో 109 కేజీల విభాగంలో బీఎస్ విష్ణువర్ధన్ (రజతం), 55 కేజీల విభాగంలో ఎస్.గురునాయుడు (కాంస్యం), 73 కేజీల విభాగంలో జె.కోటేశ్వరరావు (కాంస్యం) పతకాలు సాధించారు. ♦ పెన్కాక్ సిలాట్ 80–85 కేజీల విభాగంలో డీఎన్వీ రత్నబాబు (కాంస్యం), మోడ్రన్ పెంటాథ్లాన్లో మిక్స్డ్ డబుల్స్ డి.వెంకటేశ్, ఎన్.సనుతి యశోహర (కాంస్యం) పొందారు. ♦ అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్ల్లో జ్యోతి యర్రాజీ (స్వర్ణం), 200 మీటర్ల పరుగులో (కాంస్యం) సాధించింది. 4్ఠ100 మీటర్ల రిలేలో ప్రత్యూష, మధు కావ్యారెడ్డి, భవానీ యాదవ్, జ్యోతి యార్రాజీ బృందం (స్వర్ణం), 4్ఠ400 మీటర్ల రిలేలో ప్రత్యూష, జ్యోతికశ్రీ, ఎం.శిరీష, కె.రజిత బృందం (స్వర్ణం) కైవసం చేసుకుంది. ♦ 400 మీటర్ల పరుగులో జ్యోతికశ్రీ (రజతం), జావెలిన్ త్రోలో రేష్మి శెట్టి (కాంస్యం), త్రిపుల్ జంప్లో ఎం.అనూష (కాంస్యం), 200 మీటర్ల పరుగులో జ్యోతి యర్రాజీ కాంస్యం సాధించారు. మహిళల హెప్టాథ్లాన్లో సౌమ్య మురుగన్ స్వర్ణంతో అదరగొట్టింది. ♦ తైక్వాండోలో మహిళల 67 కేజీల విభాగంలో కనక మహాలక్ష్మి, పురుషుల 68 కేజీల విభాగంలో టి.వరుణ్ కాంస్య పతకాలు గెలుపొందారు. ♦ సెపక్ తక్రాలో మహిళల డబుల్ ఈవెంట్లో ఎం.మధులత, టి.నాగహారిక, జి.రోషిత బృందం (రజతం), పురుషుల రెగు విభాగంలో ఎం.అర్జున్, సి.అశోక్కుమార్, జి,శివ కుమార్, ఎస్.మాలిక్ బాషా, టి,షణ్ముక్ శ్రీవంశీ బృందం (కాంస్యం) సాధించాయి. ♦ ఆర్చరీలో జి.బైరాగినాయుడు స్వర్ణం, మహిళల కయాకింగ్లో నాగిడి గాయత్రి రజతం సాధించింది. ఖోఖోలో ఏపీ పురుషుల జట్టు కాంస్యం గెలుపొందింది. ♦ స్కే మార్షల్ ఆర్ట్స్లో పురుషుల 50 కేజీల విభాగంలో పి.ప్రవీణ్ (రజతం), 58 కేజీల విభాగంలో ఎం.నీలాంజలి ప్రసాద్ (కాంస్యం), 75 కేజీల విభాగంలో బి.శ్రీనివాసులు (కాంస్యం) సాధించారు. -
111 పతకాలు... ఐదో స్థానం
హాంగ్జౌ: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మునుపెన్నడు లేని విధంగా ఈ క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీని సాధించారు. చైనా ఆతిథ్యమిచ్చిన ఈ ఆసియా మెగా ఈవెంట్లో ఏకంగా 111 పతకాలతో భారత్ టాప్–5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలున్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించగా...ఇప్పుడు భారత బృందానికి ఐదో స్థానం లభించింది. నీరజ్ స్వర్ణంతో... ఆఖరి రోజు శనివారం పోటీల్లో నీరాజ్ యాదవ్ జావెలిన్ త్రో (ఎఫ్55)లో 33.69 మీటర్లతో రికార్డు దూరం విసిరి బంగారం నిలబెట్టుకున్నాడు. 39 ఏళ్ల నీరజ్ గత 2018 పారా ఈవెంట్లోనూ పసిడి పట్టాడు. ఈ క్రీడల్లో సహచరుడు టెక్ చంద్ (30.36 మీ.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. తర్వాత దిలిప్ మహాదు పురుషుల 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. మహిళల 1500 మీటర్ల రేసులో పూజ కాంస్యం నెగ్గింది. వ్యక్తిగత ర్యాపిడ్–6 బి1 ఈవెంట్లో సతీశ్ ఇనాని, ప్రధాన్ కుమార్, అశ్విన్భాయ్ కంచన్ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో క్లీన్స్వీప్ చేశారు. బి2/బి3 ఈవెంట్లో కిషన్ కాంస్యం, ఇదే టీమ్ ఈవెంట్లో కిషన్, ఆర్యన్, సోమేంద్రలతో కూడిన బృందం కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్లో వృతి జైన్, హిమాన్షి, సంస్కృతి కాంస్యం నెగ్గారు. టాప్–5 పట్టికలో... ఆతిథ్య చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచారు. రెండో మూడు స్థానాల్లో ఇరాన్ (131), జపాన్ (150) వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా (103) మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణం తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే... భారత్ 29 గెలిచింది. -
ఆసియా క్రీడల పతక విజేతలకు మోదీ ప్రశంస
తదుపరి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మరెన్నో పతకాలు తెస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు మంగళవారం మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారందరినీ ప్రశంసించారు. ‘ప్రభుత్వం క్రీడాకారులకు ఏం కావాలో అది చేస్తుంది. వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఆసియా క్రీడల్లో వందకు పైగా పతకాలు సాధించిన క్రీడాకారులు వచ్చే క్రీడల్లో ఈ రికార్డును అధిగమిస్తారనే నమ్మకముంది. పారిస్ ఒలింపిక్స్లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తున్నాను’అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషుల టెన్నిస్ డబుల్స్లో రజత పతకం గెలిచిన సాకేత్ మైనేని, మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకం నెగ్గిన రుతుజా భోస్లే ప్రధానికి జ్ఞాపికగా రాకెట్ను అందించారు. స్వర్ణ పతకాలు గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు హాకీ స్టిక్ను, క్రికెట్లు జట్లు బ్యాట్ను మోదీకి బహూకరించాయి. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల బృందం 107 పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. తదుపరి ఆసియా క్రీడలు 2026లో జపాన్లో జరుగుతాయి. -
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఏషియన్ గేమ్స్లో బంగారు పథకం సాధించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన వీజే.సురేఖ, పరిణీత్, అదితిగోపీచంద్ స్వామిలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడకు చెందిన సురేఖ సాధించిన విజయంపై రాష్ట్రమంతా గర్వపడుతోందన్న సీఎం.. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ ట్వీట్ చేశారు. ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. చదవండి: గురి తప్పలేదు.. అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం My best wishes and congratulations to @VJSurekha, @Parrneettt and Aditi Gopichand Swami for winning India the gold in the archery final at #AsianGames2023. Your precision and skill have made all of proud. I and all of Andhra Pradesh is particularly proud of our very own… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2023 -
చైనా కవ్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు
ఢిల్లీ: ఆసియా గేమ్స్లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగమని స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్.. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు.. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు భారత 'వుషు' ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్ను రద్దు చేసింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్జౌకు విమానంలో బయలుదేరింది. భారత్ మండిపాటు.. ఈ వ్యవహారంలో చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడం వంటి వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది. అరుణాచల్ మాదే.. ఆసియా గేమ్స్ను నిర్వహించే అత్యున్నత కమిటీ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశించింది. భారత ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి మావో నింగ్ స్పందించారు. అన్ని దేశాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్ను చైనా ప్రభుత్వం గుర్తించలేదు. ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలోనిదేనని ఆయన అన్నారు. అది చైనాలో అంతర్భాగమని తెలిపారు. ఇటీవల చైనా విడుదల చేసిన మ్యాప్ విమర్శలకు దారితీసింది. భారత్లోని అరుణాచల్ని చైనా తమ అంతర్భాగంలోనిదేనని చూపుతూ ఇటీవల మ్యాప్ రిలీజ్ చేసింది. దీనిపై భారత్ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ అప్పట్లో స్పందించారు. చైనా కవ్వింపు చర్యలు సహించరానివని అన్నారు. అరుణాచల్ భారత్లో భాగమని స్పష్టం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, భూభాగాలను ఎప్పుడూ కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..? -
100 మీటర్ల చాంప్ నోవా లైల్స్
బుడాపెస్ట్ (హంగేరి): ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ రిటైరయ్యాక... పురుషుల 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లో మళ్లీ అమెరికన్ అథ్లెట్లు ఆధిపత్యం చాటుకుంటున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో వరుసగా నాలుగోసారి పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్లో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ పసిడి పతకం సాధించాడు. 26 ఏళ్ల నోవా లైల్స్ అందరికంటే వేగంగా 9.83 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి ఈ విభాగంలో విశ్వవిజేతగా అవతరించాడు. లెట్సిలె టెబోగో (బోట్స్వానా; 9.88 సెకన్లు) రజతం... జార్నెల్ హ్యూస్ (బ్రిటన్; 9.88 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఓబ్లిక్ సెవిల్లె (జమైకా) కూడా 9.88 సెకన్లలో రేసును ముగించాడు. అయితే ఫొటో ఫినిష్ ఆధారంగా రజత, కాంస్య పతకాలను ఖరారు చేశారు. 2017 ప్రపంచ చాంపియన్షిప్లో జస్టిన్ గాట్లిన్ (అమెరికా) ధాటికి ఉసేన్ బోల్ట్ కాంస్య పతకంతో సరిపెట్టుకొని అదే ఏడాది ఆటకు వీడ్కోలు పలికాడు. అనంతరం 2019 ప్రపంచ చాంపియన్షిప్లో క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా), 2022 ప్రపంచ చాంపియన్షిప్లో ఫ్రెడ్ కెర్లీ (అమెరికా) 100 మీటర్ల విభాగంలో వరల్డ్ చాంపియన్స్గా నిలిచారు. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ ఫ్రెడ్ కెర్లీ సెమీఫైనల్లోనే నిష్క్రమించాడు. భారత అథ్లెట్లకు నిరాశ ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండోరోజు భారత అథ్లెట్లు నిరాశాజనక ప్రదర్శన కనబరిచారు. పురుషుల హైజంప్లో సర్వేశ్ కుషారే 2.22 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఓవరాల్గా 20వ స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో సంతోష్ కుమార్ తన హీట్స్ను 50.46 సెకన్లలో ముగించి ఓవరాల్గా 36వ ర్యాంక్తో సరిపెట్టుకున్నాడు. -
ఒలింపిక్స్లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన టాప్ 10 క్రీడాకారులు
-
తిరుపతిలో సీఎం కప్ ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సీఎం కప్’ టోర్నీ ఫైనల్స్ను తిరుపతి వేదికగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు 14 క్రీడాంశాల్లోనూ స్టేట్ మినీ ఒలింపిక్స్ మాదిరిగా ఒకే ప్రాంతంలో పోటీలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జిల్లాస్థాయిలో పోటీల్లో గెలుపొందిన జట్ల వివరాలను పంపించాలని డీఎస్ఏలు, చీఫ్ కోచ్లను శాప్ ఆదేశించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 4,200 మందికిపైగా క్రీడాకారులు సీఎం కప్ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మొత్తం టోర్నీలో 963 పతకాలు, 48 ట్రోఫీలను బహూకరించనున్నారు. ఏపీ భవన్లో విద్యుత్ పొదుపు ప్రాజెక్ట్ 2030 నాటికి బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా కేంద్ర విద్యుత్శాఖ నేతృత్వంలోని బీఈఈ న్యూఢిల్లీలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది. మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. గుంటూరు శివారు అమరావతి రోడ్డులో ఆదివారం బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడారు. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్?!
ఢిల్లీ: అథ్లెట్లకు షాక్ ఇచ్చేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ను తొలగించాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లకు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు చర్చలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. వాళ్లపై పోలీస్ ఫిర్యాదుకు డబ్ల్యూఎఫ్ఐ సిద్ధమైంది. అయితే అందుకు ఈ నిరసనలతో సంబంధం లేకపోవడం గమనార్హం!. ఒక ఈవెంట్లో రెజ్లర్లను పాల్గొనకుండా ఆపేందుకు.. నిరసనలో పాల్గొంటున్న రెజ్లర్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్య సీనియర్ ఓపెన్ నేషనల్ ర్యాకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో పాల్గొనాల్సిన రెజ్లర్లకు.. ఆ ఈవెంట్ రద్దు అయ్యిందని నిరసనలో పాల్గొంటున్న కొందరు అథ్లెట్లు చెప్పి మోసం చేశారని, తద్వారా వాళ్లను పోటీల్లో పాల్గొనకుండా చేయాలని ప్రయత్నించారని రెజ్లింగ్ ఫెడరేషన్ దర్యాప్తు ద్వారా నిర్ధారణకు వచ్చింది. అందుకే వాళ్లపై కేసు నమోదు చేయాలని భావిస్తోందట.! రెజ్లర్ల మీటూ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ.. నాలుగు డిమాండ్లతో ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్కు రెజ్లర్లు లేఖ సైతం రాశారు. ఈ క్రమంలో.. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలో భేటీ సాగింది. మరోవైపు ఆరోపణలను ఖండించిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్.. మీడియా ముందుకు వచ్చి అసలు విషయాన్ని వెల్లడిస్తానని చెప్పడం ఉత్కంఠకు తెర తీసింది. అయితే.. మీడియా ముందుకు రావొద్దని క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఫోన్ ద్వారా సూచించినట్లు నేషనల్ మీడియా ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురించాయి. ఇంకోవైపు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లు మరోసారి మంత్రి అనురాగ్ ఠాకూర్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
ఆట మారుతుందా?
బరిలో ఆట కన్నా బాసు హోదాలో సీటు ముఖ్యమని పేరుబడ్డ మన క్రీడాసంస్థల్లో మార్పు వస్తోందంటే అంతకన్నా ఇంకేం కావాలి! ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడోత్సవాల లాంటి అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లను ఎంపిక చేసే ప్రతిష్ఠా త్మక క్రీడాసంఘానికి క్రీడా నిపుణులే సారథ్యం వహిస్తున్నారంటే సంతోషమేగా! ఎప్పుడో 95 ఏళ్ళ క్రితం ఏర్పాటైన పేరున్న క్రీడాసంఘం ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’ (ఐఓఏ)కు తొలి సారిగా ఓ మహిళా క్రీడాకారిణి పగ్గాలు చేపట్టనుండడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలో పలు వివాదాలకు గురైన ఐఓఏకు డిసెంబర్ 10న ఎన్నికలు. నామినేషన్ల తుది గడువు ఆదివారం ముగిసేసరికి, ప్రసిద్ధ మాజీ అథ్లెట్ పీటీ ఉష ఒక్కరే అధ్యక్ష పదవికి బరిలో ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ఐఓఏ కార్యవర్గంలో ఈ పరుగుల రాణితో పాటు ప్రసిద్ధ ఆటగాళ్ళ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రీడాంగణంలో ఇది నూతన ఉషోదయం అనిపిస్తోంది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, రాజకీయ పార్టీలకు ఆలవాలంగా మన దేశంలోని క్రీడాసమాఖ్యలు అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఆ కుళ్ళు కంపుతో, అందరూ ప్రక్షాళనకు ఎదురుచూస్తున్న వేళ ఐఓఏకు తొలిసారిగా ఒక మహిళ, ఒక ఒలింపిక్ ప్లేయర్, ఒక అంతర్జాతీయ పతక విజేత పగ్గాలు చేపట్టడం నిజంగానే చరిత్ర. వాస్తవానికి, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించుకోవా లనీ, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదనీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెప్టెంబర్లోనే ఐఓఏకు తుది హెచ్చరిక చేసింది. డిసెంబర్ లోగా ఎన్నికలు జరపాలని గడువు పెట్టింది. గతంలో పదేళ్ళ క్రితం ఐఓసీ ఇలాగే సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. తాజా హెచ్చరికల పర్యవసానమే ఈ ఎన్నికలు. కొత్తగా కనిపిస్తున్న మార్పులు. ఆసియా క్రీడోత్సవాల్లో నాలుగుసార్లు ఛాంపియన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలైన 58 ఏళ్ళ ఉషకు ఇప్పుడు ఈ కిరీటం దక్కడం ముదావహం. ఈసారి ఐఓఏ కార్యవర్గ (ఈసీ) ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికరమైన అంశాలేమిటంటే – గడచిన ఈసీలో ఉన్నవారెవరూ ఈసారి నామినేషన్ వేయలేదు. అలాగే, ఈసీలో సగం మందికి పైగా క్రీడాకారులున్నారు. మొత్తం 15 మంది సభ్యుల ప్యానెల్లో పీటీ ఉష కాక లండన్ ఒలింపిక్స్లో స్వర్ణపతక విజేత – షూటర్ గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు) సహా మరో అరడజను మంది ఆటగాళ్ళకు చోటు దక్కింది. మల్లయోధుడు యోగేశ్వర్ దత్, విలువిద్యా నిపుణురాలు డోలా బెనర్జీ, అథ్లెట్ల నుంచి బాక్సింగ్ రాణి మేరీ కోమ్, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తాజా ప్యానెల్లో ఉండడం విశేషం. డిసెంబర్ 10న ఎన్నికలతో కార్యవర్గం తుదిరూపు తేలనుంది. స్వయంగా క్రీడాకారులూ, ఆటల్లో నిపుణులూ ఈసారి ఐఓఏ కార్యవర్గానికి అభ్యర్థులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. రేపు ఎన్నికైన తర్వాత వారి ఆటలో నైపుణ్యం, అనుభవం భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనికొస్తాయి. అనేక దశాబ్దాలుగా ఏదో ఒక పదవిలో కూర్చొని సంస్థను ఆడిస్తున్న బడాబాబులకూ, 70 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలకూ ఐఓఏ రాజ్యాంగంలో సవరణల పుణ్యమా అని ఈసారి కార్యవర్గంలో చోటు లేకుండా పోయింది. చివరకు సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అండగా నిలిచిన వర్గానికి సైతం బరిలో నిలిచిన కొత్త ఈసీ ప్యానెల్లో స్థానం దక్కకపోవడం విశేషమే. నిజానికి, ఆటల విషయంలో నిర్ణయాత్మకమైన క్రీడా సంఘాల్లో అథ్లెట్లకు ప్రధానంగా స్థానం కల్పించాలని కోర్టులు చిరకాలంగా చెబుతున్నాయి. జాతీయ క్రీడా నియమావళి, ఐఓసీ నియమా వళి సైతం సంఘాల నిర్వహణలో ఆటగాళ్ళకే పెద్దపీట వేయాలని చెబుతున్నాయి. దేశంలోని క్రీడా సంఘాలకు పెద్ద తలకాయ లాంటి ఐఓసీలో ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈసారి ఐఓసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి ఆయన కొత్త రాజ్యాంగం సిద్ధం చేశారు. ఇక, ఈ సంఘంలోని మొత్తం 77 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్లో దాదాపు 25 శాతం మాజీ అథ్లెట్లే. వారిలోనూ పురుషుల (38) సంఖ్య కన్నా స్త్రీల (39) సంఖ్య ఎక్కువ కావడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని పరుగుల రాణి ఉష, బృందం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో? రానున్న రోజుల్లో ఐఓఏ రోజువారీ నిర్వహణలో వీరందరి మాటా మరింతగా చెల్లుబాటు కానుంది. అయితే, అధికారంతో పాటు అపారమైన బాధ్యతా వీరి మీద ఉంది. అథ్లెట్లకు అండగా నిలుస్తూ, దేశంలో క్రీడాసంస్కృతిని పెంచి పోషించాల్సిందీ వారే. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునకలైన దేశ అత్యున్నత క్రీడాసంఘంలో అది అనుకున్నంత సులభం కాదు. విభిన్న వర్గాలుగా చీలి, వివాదాల్లో చిక్కుకొన్న వారసత్వం ఐఓఏది. అలాగే దేశంలో ఇతర జాతీయ క్రీడా సమాఖ్యలు, పాత ఐఓఏ సభ్యులు, కొత్త రాజ్యాంగంలో ఓటింగ్ హక్కులు కోల్పోయిన రాష్ట్ర శాఖలతో తలనొప్పి సరేసరి. వీటన్నిటినీ దాటుకొని రావాలి. అనేక ఆటలతో కూడిన ప్రధాన క్రీడోత్సవాలకు ఎంట్రీలు పంపే పోస్టాఫీస్లా తయారైన సంఘాన్ని గాడినపెట్టాలి. మరో ఏణ్ణర్ధంలో జరగనున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు భారత ఆటగాళ్ళను సిద్ధం చేయాలి. ఉష అండ్ టీమ్ ముందున్న పెను సవాలు. కేంద్రం, క్రీడాశాఖ అండదండలతో ఈ మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా జీవితంలో లాగానే ఇక్కడా అవరోధాలను అధిగమించి, అద్భుతాలు చేస్తారా? -
జగనన్న స్పోర్ట్స్ క్లబ్లతో క్రీడలకు మహర్దశ
సత్తెనపల్లి: గల్లీ, గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం జగనన్న స్పోర్ట్స్ క్లబ్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ప్రత్యేక యాప్ను రూపొందించింది. దీనిని క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆవిష్కరించారు. ఈ నెల 31వ తేదీ వరకు యాప్లో క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. పల్నాడు జిల్లాలో 28 మండలాలు, 366 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని పాఠశాలల్లో ఇప్పటికే క్రీడాపోటీలు నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తున్నారు. దీంతో ఎంతోమంది మెరికల్లా తయారవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జగనన్న స్పోర్ట్స్ క్లబ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనిలో వెటరన్ క్రీడాకారులనూ భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇదీ ప్రణాళిక జగనన్న స్పోర్ట్స్ క్లబ్ల ఏర్పాటుకు రెండు నెలల క్రితమే ఉత్తర్వులొచ్చాయి. అప్పటి నుంచి పూర్తి మార్గదర్గకాలు రూపొందించేందుకు వివిధ రంగాల్లో నిపుణులైన క్రీడాకారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. తాజాగా దీనిపై ఒక ప్రణాళిక రూపొందించారు. గ్రామ/వార్డు సచివాలయాల నుంచే క్రీడాకారుల ఎంపిక, తర్ఫీదు, పోటీల నిర్వహణ చేపట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని సచివాలయ అడ్మిన్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలు స్పోర్ట్స్ క్లబ్ల నిర్వహణకు గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ పరిధిలో క్రీడాప్రాధికార సంస్థ కమిటీ చైర్మన్గా సర్పంచ్ వ్యవహరిస్తారు. క్రీడలను ప్రోత్సహించే దాతలనూ ఇందులో భాగస్వాములను చేయనున్నారు. రూ.50 వేలు, ఆపైన విరాళంగా అందించే దాతలు, అదే గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు, పీఈటీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో మండల పరిషత్ చైర్మన్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, తహసీల్దార్, ఎంఈవో, మండల ఇంజినీర్, ఎంపీడీవో, ఎస్సై, క్రీడాకారుడు, క్రీడాకారిణి, దాత.. ఇలా 11 మంది సభ్యులుగా ఉంటారు. స్పోర్ట్స్ క్లబ్లో రిజిస్ట్రేషన్ ఇలా ► మొదటగా గూగుల్ ప్లే స్టోర్లో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► డౌన్లోడ్ అయిన తర్వాత పేరు, మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేయాలి. మొబైల్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ► రిజిస్టర్ అయిన తర్వాత గ్రామం, సచివాల యం, పాఠశాల వివరాలు నమోదు చేయాలి. ► ఏ క్రీడపై ఆసక్తి ఉంటే దానిపై టచ్ చేసి రిజిస్టర్ కావాలి. ► అప్పటి నుంచి జగనన్న స్పోర్ట్స్ క్లబ్లలో సభ్యులుగా మారుతారు. ఆ తర్వాత నోటిఫికేషన్ల రూపంలో క్రీడల వివరాలు అందుతాయి. పల్లె మట్టి వాసనల్లో మరుగున పడిన క్రీడా ఆణిముత్యాలు ఇకపై అంతర్జాతీయ వేదికపై మెరిసేందుకు బాటలు పడ్డాయి. మారుమూల వీధుల్లో ఖోఖో అంటూ కూత పెట్టే యువతరం ఇక ఉన్నత స్థాయిలో మోత మోగించనుంది. మెరికల్లాంటి ఆటగాళ్లలో ప్రతిభను వెలికి తీస్తూ కబడ్డీ తొడగొట్టనుంది. సీనియర్ సిటిజన్స్ నుంచి చిన్నారి బుడతల వరకు ప్రతి ఒక్కరినీ ఆటలో అందలమెక్కిస్తూ శారీరక దారుఢ్యం పెంచుతూ క్రీడా రంగానికి ఉజ్వల భవిష్యత్ తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ల ద్వారా క్రీడాకారుల తర్ఫీదు, పోటీల నిర్వహణకు సమగ్ర విధివిధానాలు రూపొందించింది. పోటీల నిర్వహణ ఇలా.. ► పంచాయతీ కార్మదర్శులు, సచివాలయ అడ్మిన్ ప్రతి నెలా స్పోర్ట్స్ క్లబ్ సమావేశం నిర్వహిస్తారు. తొలుత వీఆర్వో, సర్వేయర్ల ద్వారా ఆట స్థలాన్ని గుర్తిస్తారు. క్రీడాకారులను ఇందులో భాగస్వాములను చేస్తారు. ఒక్కో క్రీడాంశానికి ఒక్కో క్లబ్ను ఏర్పాటు చేస్తారు. ► వెటరన్స్ కోసం జగనన్న వాకింగ్ క్లబ్లు రూపొందించారు. మహిళలకు స్కిప్పింగ్, టెన్నికాయిట్, త్రోబాల్ తదితర ఆటలు నిర్వహిస్తారు. ► సామాజిక భవనాలు, పంచాయతీ హాళ్లలో వసతులు గుర్తించి చెస్, క్యారమ్స్, ఉచిత యోగా శిక్షణ ఏర్పాటు చేస్తారు. ► క్రీడా స్థలాలు లేకపోతే వీధుల్లోనే దీనికి అనువైన ప్రదేశాలను గుర్తించి కబడ్డీ, వాలీబాల్, రబ్బర్ బాల్తో క్రికెట్ వంటి అనువైన ఆటలు ఆడిస్తారు. ఎన్ఆర్ఐలు, వ్యాపారులు, ఉద్యోగుల నుంచి క్రీడా సామగ్రి సమకూరుస్తారు. ► మండల క్రీడాప్రాధికార సంస్థ సభ్యులు దేశీయ క్రీడలను ప్రోత్సహించడం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు అందజేస్తారు. టోర్నమెంట్లు, మ్యాచులు, స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించి స్పోర్ట్స్ అథారిటీకి ఆదాయాన్ని పెంచుతారు. ► ప్రతి మూడు నెలలకోసారి మండల, నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. మండల, జిల్లా పరిషత్ల ఆదాయం నుంచి నాలుగు శాతాన్ని క్రీడలకు వెచ్చిస్తారు. మంచి వేదిక క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి స్పోర్ట్స్ క్లబ్ మంచి వేదిక. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. యువత తమకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో యాప్లో నమోదు చేసుకోవాలి. క్రీడలు, వ్యాయామం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ను రూపొందించింది. – ఎ.మహేష్ బాబు చీఫ్ కోచ్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, పల్నాడు -
సాయ్(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్
టీనేజ్ అథ్లెట్తో సాయ్(SAI) మహిళా అధికారి మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చేసింది. విషయంలోకి వెళితే.. షర్మిలా తేజావత్ అనే మహిళ ధార్లోని కుషాభౌ ఠాక్రే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పెషల్ ఏరియా గేమ్స్ సెంటర్లో ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వ్యవహరిస్తోంది. సాయ్ సెంటర్కు వచ్చే టీనేజ్ అథ్లెట్స్ను షర్మిలా తేజావత్ తరచూ తన ఇంటికి తీసుకెళ్లి పర్సనల్ పనులకు వాడుకోవడమే కాకుండా వారితో మసాజ్ చేయించుకోవడం అలవాటుగా చేసుకుంది. తాజాగా ఇద్దరు టీనేజ్ అథ్లెట్లను తన ఇంటికి తీసుకెళ్లిన షర్మిలా తేజావత్ వారితో మసాజ్ చేయించుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వీడియో తేదీ, సమయం, మసాజ్ చేస్తున్న అథ్లెట్స్ ఏ క్రీడకు చెందినవారు అనే దానిపై క్లారిటీ లేదు. కానీ షర్మిలాతో పాటే ఉన్న మరొక వ్యక్తి ఈ తతంగమంతా తన సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సాయ్ ఇంతవరకు స్పందించలేదు. అయితే మసాజ్ వ్యవహారంపై సదరు మహిళా అధికారిణిని ప్రశ్నించగా.. ఆమె తన సమాధానాన్ని దాటవేశారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన క్రీడా శిక్షణా శిబిరంగా పేరున్న సాయ్కు ఇది పెద్ద మచ్చ లాంటిదని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడ్డారు. బాధ్యత గల పదవిలో ఉంటూ మంచి అథ్లెట్స్గా తీర్చిదిద్దాల్సింది పోయి వారితో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏంటని మండిపడ్డారు. కాగా ధార్లోని జెట్పురాలోని కేంద్రానికి దేశం నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున శిక్షణ కోసం వస్తుంటారు. #धार #साई ट्रेनिंग सेंटर स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया का वीडियो वायरल हो रहा है, जिसमें साई सेंटर केंद्र प्रभारी सर्मिला तेजावत खिलाड़ियों से पैर दबवातीं नज़र आ रहीं हैं। खिलाड़ियों का ऐसा शोषण? कृपया संज्ञान लें @Media_SAI @YASMinistry @ianuragthakur #वायरल_वीडियो pic.twitter.com/JxxzJTR080 — 🇮🇳Sandeep Singh संदीप सिंह (@Sandeep_1Singh_) August 28, 2022 చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి... అయినా అద్భుత విజయాలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి. మరొకరి తల్లిదండ్రులు రోజూవారీ కార్మికులు. ఇంకొకరిది కూడా కడు పేదరికం. కానీ ఇలాంటి స్థితినుంచి వచ్చి కూడా వారు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే మన అథ్లెట్లను చూస్తే నాకు గౌరవం, గర్వం కలుగుతాయి. వారి శ్రమను ప్రత్యేకంగా అభినందించాలని అనిపిస్తుంది’ అని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. బ్యాడ్మింటన్ సహా కొన్ని ఇతర క్రీడల్లో కనీస స్థాయినుంచి మొదలు పెట్టి మరింతగా పైకి ఎదుగుతారని... కానీ కనీస సౌకర్యాలు లేని నేపథ్యంనుంచి వచ్చి అథ్లెట్లు సాధించే సాధారణ విజయాలను కూడా చాలా గొప్పగా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గోపీచంద్–మైత్రా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల భారత్కు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లను సన్మానించారు. దాదాపు ఏడేళ్ల క్రితం.. యువ క్రీడాకారులకు అండగా నిలవాలనే సంకల్పంతో ‘మైత్రా ఫౌండేషన్’తో జత కట్టానని, అది మంచి ఫలితాలు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన గోపీచంద్... ప్రభుత్వ సంస్థలు ‘సాయ్’, ‘శాట్స్’ అధికారికంగా ఇచ్చే సౌకర్యాలతో పాటు కీలక సమయాల్లో ఆటగాళ్లకు డైట్, ఫిట్నెస్, ఫిజియో తదితర అంశాల్లో ‘మైత్రా’ సహకారం అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్స్కు అర్హత సాధించిన యెర్రా జ్యోతి, ద్యుతీచంద్లతో పాటు అండర్–20 ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన ఎ.నందిని, కె.రజితలకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఇతర అథ్లెట్లు జ్యోతికశ్రీ, ఎన్.ఎస్. శ్రీనివాస్, ప్రణయ్, అనూష, దిల్ఖుష్ యాదవ్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్లతో పాటు ‘మైత్రా’ గ్రూప్ చైర్మన్ రవి కైలాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: PAK Vs NED: రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు' KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు.. -
కామన్వెల్త్ గేమ్స్కు వెళ్లిన బృందంలో 10 మంది లంక ఆటగాళ్లు అదృశ్యం
కామన్వెల్త్ గేమ్స్ 2022 బర్మింగ్హమ్ వేదికగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గతనెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టు 8న ముగిశాయి. ఈ గేమ్స్కు 72 దేశాలు పాల్గొనగా.. అందులో శ్రీలంక కూడా ఉంది. ఈసారి కామన్వెల్త్ లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను లంక.. 110 మంది (50 మంది పురుషులు, 60 మంది మహిళలు)తో కూడిన అథ్లెట్ల బృంధం బర్మింగ్హామ్కు వెళ్లింది. అయితే గేమ్స్ జరుగుతున్న సమయంలోనే 10 మంది లంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. అథ్లెట్లతో పాటు పలువురు అధికారులు కూడా తప్పిపోయినట్లు సమాచారం. కాగా ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోవడం విశేషం. వీళ్లకు ఆరునెలల పాటు వీసాలున్నాయని తెలుస్తున్నది. అయితే అదృశ్యమైన తొలి ముగ్గురు అథ్లెట్లను బర్మింగ్హామ్ పోలీసులు వెతికి పట్టుకున్నారని, కానీ వాళ్లను ఎక్కడ ఉంచింది మాత్రం వెల్లడించలేదని లంక ప్రతినిధులు తెలిపారు. లంకలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఒక్కపూట తిండి దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో బర్మింగ్హామ్ కు వెళ్లిన లంక అథ్లెట్లు కూడా ఇదే కారణంతో అక్కడ ఆగిపోయి ఉంటారని.. స్వదేశానికి వెళ్లి తిండి తిప్పలు మాని అల్లాడటం కంటే యూకేలోని ఆగిపోయి ఏదో ఒక పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అదృష్యమైన ఆ పది మంది ఆటగాళ్ల జాబితా ఎక్కడుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా కామన్వెల్త్ గేమ్స్లో శ్రీలంక.. ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తంగా 4 పతకాలు సాధించి పతకాల పట్టికలో 31వ స్థానంలో నిలిచింది. -
కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులతో మాట్లాడిన ప్రధాని మోదీ
-
100 మీటర్ల రేసులో అమెరికా అథ్లెట్స్ క్లీన్స్వీప్..
యుజీన్ (అమెరికా): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా అథ్లెట్స్ క్లీన్స్వీప్ చేశారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో మెరిపించారు. ఫ్రెడ్ కెర్లీ 9.86 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి పసిడి పతకం సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. అమెరికాకే చెందిన మార్విన్ బ్రేసీ, ట్రేవన్ బ్రోమెల్ ఇద్దరూ 9.88 సెకన్లలోనే గమ్యానికి చేరగా... ఫొటో ఫినిష్ ద్వారా బ్రేసీకి రజతం, బ్రోమెల్కు కాంస్యం ఖాయమయ్యాయి. దాంతో 1991 తర్వాత ప్రపంచ చాంపియన్షిప్లో పురుషుల 100 మీటర్ల విభాగంలో మళ్లీ క్లీన్స్వీప్ నమోదైంది. 1991లో కార్ల్ లూయిస్, లెరాయ్ బరెల్, డెనిస్ మిచెల్ అమెరికాకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించారు. చదవండి: World Athletics Championships 2022: ఫైనల్లో ఏడో స్థానంతో సరిపెట్టిన శ్రీశంకర్ -
తెలంగాణ అథ్లెట్లకు 8 పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు మెరిశారు. గుజరాత్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ అథ్లెట్లు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో దివ్య బొల్లారెడ్డి 400, 800 మీటర్ల కేటగిరీల్లో రజత పతకాలు గెలిచింది. దివ్య 400 మీటర్ల దూరాన్ని 1ని:14.91 సెకన్లలో... 800 మీటర్ల దూరాన్ని 3ని:02.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల ప్లస్ 35 వయో విభాగంలో అష్లి గోపీ 110 మీటర్ల హర్డిల్స్లో రజతం, ట్రిపుల్ జంప్లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 110 మీటర్ల హర్డిల్స్ రేసును గోపీ 21.02 సెకన్లలో ముగించి రెండో స్థానంలో... ట్రిపుల్ జంప్లో 9.88 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో కృతి కడాకియా 1500 మీటర్ల రేసును 6ని:51.56 సెకన్లలో ముగించి కాంస్యం గెల్చుకుంది. పురుషుల ప్లస్ 60 వయో విభా గం పోల్వాల్ట్లో బండారి భాస్కర్ రావు 1.60 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్యం... హైజంప్లో 1.05 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజతం నెగ్గాడు. పురుషుల ప్లస్ 60 వయో విభాగం హ్యామర్ త్రోలో మనోహర్ రావు (27.58 మీటర్లు) స్వర్ణం గెలిచాడు. -
స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. విమర్శలు
ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్పై.. సోషల్మీడియాలో తాజాగా కొందరు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ అధికారి తన కుక్కతో వాకింగ్ చేసేందుకు వీలుగా స్టేడియం వేళల్ని సవరించినందుకు మండిపడుతున్నారు. ఢిల్లీలో స్టేడియాల వేళల్ని పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. రాత్రి పది గంటలకు వరకు అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల జారీ వెనుక ఉన్న వ్యవహారమే విమర్శలకు దారి తీస్తోంది. ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో ఓ ఐఏఎస్ అధికారి పెంపుడు కుక్కతో నిత్యం వాకింగ్కు వస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన కోసం స్టేడియం నిర్వాహకులు.. అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే సమయం తగ్గించారు. త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తగా.. రాత్రి పది గంటల వరకు స్టేడియాలను తెరిచి ఉంచాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Delhi CM Arvind Kejriwal has directed that all Delhi Govt sports facilities will stay open for sportspersons till 10pm (File pic) pic.twitter.com/a7d0IyodXH — ANI (@ANI) May 26, 2022 ఢిల్లీ రెవెన్యూ సెక్రెటరీ సంజీవ్ ఖీర్వార్ తన పెంపుడు కుక్కతో ఈ స్టేడియంలోనే వాకింగ్ చేస్తున్నారు. ఈయన కోసమే అథ్లెట్లను బయటకు పంపించి వేస్తున్నారంటూ.. ఫొటో ఆధారాలతో సహా విమర్శిస్తున్నారు కొందరు. అయితే స్టేడియం నిర్వాహకుడు అనిల్ చౌదరి మాత్రం విమర్శలను ఖండిస్తున్నారు. స్టేడియం అధికారిక టైమింగ్ రాత్రి ఏడువరకే. ఆ తర్వాత ఎవరినీ ఎవరూ బయటకు వెళ్లిపోమనట్లేదు. స్వచ్చందంగా అథ్లెట్లు వెళ్లిపోతున్నారంటూ చెప్పారు. మరి సంజీవ్ ఈ స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. Delhi Staduim Dog Walk Row ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో .. ఇప్పుడు స్టేడియం వేళల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కేజ్రీవాల్. -
రాష్ట్రమంతా క్రీడా సంబరాలు
సాక్షి, అమరావతి: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేలా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) సన్నాహాలు చేస్తోంది. దసరా నుంచి ఉగాది వరకు క్రీడా సంబరాన్ని అందించనుంది. మహిళల, పురుషుల విభాగంలో 13 క్రీడాంశాల్లో ఈ ఓపెన్ మీట్ నిర్వహిస్తుంది. మొత్తం మూడు నుంచి నాలుగు దశల్లో జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయి. ఫేజ్–1లో భాగంగా అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్ పోటీలకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 20న శ్రీకాకుళం, 21న విశాఖపట్నంలో పోటీలు ప్రారంభం కానున్నాయి. సీఎం కప్లో తొలిసారిగా క్రికెట్ను చేర్చడం విశేషం. 175 నియోజకవర్గాల్లో పోటీలు.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల నుంచి క్రీడాకారులు పోటీపడనున్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్లకు మళ్లీ పోటీలు నిర్వహించి బహుమతుల ప్రదానం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రతిభగల క్రీడాకారులతో జిల్లా జట్టును ఎంపిక చేస్తారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఒక్కో జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. క్రీడాంశాలివే.. అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ క్రికెట్ తదితర క్రీడలున్నాయి. ప్రతిభను వెలికితీసేందుకు.. రాష్ట్రంలో ఎందరో ప్రతిభగల క్రీడాకారులున్నారు. అటువంటి వారిని గుర్తించి, మంచి శిక్షణ అందిస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదుగుతారు. ఈ క్రమంలోనే సీఎం కప్ టోర్నీని నిర్వహిస్తున్నాం. తొలిసారిగా క్రికెట్ను కూడా ప్రవేశపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు కొత్త పాలసీని కూడా తీసుకొస్తోంది. తద్వారా క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుంది. – ఎన్.ప్రభాకర్రెడ్డి, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులను సన్మానించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులతో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఆయన నివాసంలో ప్రధాని మోదీ క్రీడాకారులను సన్మానించారు. కాగా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణంతో సహా ఏడు పతకాలతో భారత అథ్లెట్లు టోక్యో నుంచి తిరిగి వచ్చారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో భారత క్రీడాకారుల అద్భుతమైన ప్రదర్శనను మోదీ ప్రశంసించారు. ఇక ఈ ఒలింపిక్స్లో మీరాబాయి చాను 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా పీవీ సింధు రికార్డులకెక్కింది. ఇక ఆర్మీ నాయక్ సుబేదార్ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్ పాజిబుల్’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. రవి దహియా 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్లో రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. మరోవైపు భారత హకీ జట్టు ఒలింపిక్స్లో పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. మన్ప్రీత్ జట్టును నడిపిస్తే... గోల్కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడ, స్ట్రయికర్ సిమ్రన్జీత్ సింగ్ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. ఇక అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్లో విజేందర్, మేరీకోమ్ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్గా నిలిచింది. దిగ్గజం మేరీకోమ్ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. అంతేకాకుండా ఫేవరెట్గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్ రెజ్లర్ బజరంగ్ పూనియా కాంస్యంతో మురిపించాడు. -
Tokyo Olympics: రూల్స్ సవరణ.. రెచ్చిపోతున్న అథ్లెట్లు
టోక్యో: కరోనా కట్టడితో అథ్లెట్లకు ఊపిరి ఆడని పరిస్థితి. ఒలింపిక్స్ విలేజ్లో ఆహ్లాదంగా గడపలేని పరిస్థితులు, కఠిన నిబంధనలు, ఆల్కహాల్- సెక్స్కి దూరం కావడం వెరసి టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కొంతలో కొంత ఊరట ఇచ్చింది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ. సోషల్ మీడియా కఠిన నిబంధనల్ని ఎత్తేయడంతో అథ్లెట్లంతా ఒక్కసారిగా రెచ్చిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సోషల్ మీడియా రూల్స్ను సవరించింది. దీంతో టిక్టాక్ లాంటి వీడియో జనరేట్ కంటెంట్ యాప్లలో రెచ్చిపోతున్నారు అథ్లెట్లు. ఖాళీ టైం దొరికితే చాలు.. వాళ్లరూమ్లలో షార్ట్ వీడియోలు తీసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి ఈ-పాపులారిటీ దక్కుతుండడం విశేషం. ఐరిష్ జిమ్నాస్ట్ రైస్ మెక్క్లెనాగన్ ‘యాంటీ-సెక్స్’ బెడ్ పుకార్లను బద్ధలు కొట్టిన వీడియోతో మొదలైన సందడిని వందల మంది అథ్లెట్లు కొనసాగిస్తూ వస్తున్నారు. అమెరికన్ రగ్బీ ప్లేయర్ ఇలోనా మహెర్ తన టీంతో కలిసి, వాలీబాల్ ప్లేయర్ ఎరిక్ షోజీ, ఐరిష్ ట్రాక్ స్టార్ లియోన్ రెయిడ్.. ఈ జాబితాలో ముందున్నారు. అథ్లెట్లకు కేటాయించిన రూమ్ల్లో వాళ్ల చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు. “Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB — Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021 I drop about 3 tiktoks a day from here in the village. Follow me for a good laugh. pic.twitter.com/VzxDKhJZ5r — Raven HULK Saunders (@GiveMe1Shot) July 27, 2021 టఫ్ ఐవోసీ రూల్స్ ఐవోసీలోని ఇంతకు ముందు రూల్స్ ప్రకారం.. అథ్లెట్లతో పాటు కోచ్లు, అధికారులు ఎవరైనా కూడా ఫొటోలు మాత్రమే పోస్ట్ చేయాలి. కాంపిటీషన్ వెన్యూ నుంచి కూడా పోస్టులు పెట్టొచ్చు. కానీ, ఆడియో-వీడియో కంటెంట్ మాత్రం పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే నాన్-ఒలిపింక్ స్పాన్సర్స్కు సంబంధించిన పోస్ట్లు కూడా చేయకూడదు. అలా చేస్తే ఫైన్తో పాటు బ్యాన్కు కూడా అవకాశం ఉందని హెచ్చరికలు ఉండేవి. అయితే 2018 వింటర్ ఒలింపిక్స్ టైంలో అథ్లెట్లు.. ఆడియెన్స్తో ఇంటెరాక్ట్ అవుతూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసే అవకాశం కల్పించింది. అంతేకాదు వ్లోగర్స్ వీడియోలు తీసుకోవచ్చని పేర్కొంది. అయితే అదే ఒలింపిక్స్లో ఐస్ డ్యాన్సింగ్ అక్కాచెల్లెలు మయియా-అలెక్స్ షిబుటానీ ఒలింపిక్స్ వ్లోగ్ కక్రియేట్ చేయగా.. గంటలో దానిని యూట్యూబ్ కాపీరైట్స్ పాలసీ ఉల్లంఘనల పేరిట తొలగించేసింది. అప్పటి నుంచి కొన్ని పరిమితులతో వీడియోలకు అవకాశం ఇచ్చింది. ఇక కరోనా టైంలో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉండడంతో అథ్లెట్లు వాళ్ల అనుభవాల్ని సన్నిహితులతో పంచుకోవచ్చని పేర్కొంది. అది కూడా నాన్-కమర్షియల్ అయితేనే. -
టోక్యో ఒలింపిక్స్: వీరి విన్యాసాలు తప్పక చూడాల్సిందే
అంతర్జాతీయ టోర్నీలలో ఎన్ని పతకాలు గెలిచినా రాని గుర్తింపు ఒలింపిక్స్ క్రీడల్లో సాధిస్తే రాత్రికి రాత్రే వస్తుంది. విశ్వ క్రీడల్లో విజయకేతనం ఎగురవేయాలని... అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రతి క్రీడాకారుడు భావిస్తాడు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటికే తమదైన ముద్ర వేసిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఒకటికంటే ఎక్కువ పతకాలు సాధించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మరికొందరు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేరు గడించాలని ప్రయత్నిస్తున్నారు. నేటి నుంచి మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్లో క్రీడాభిమానులు తప్పక చూడాల్సిన కొందరు క్రీడాకారులు ఉన్నారు. వారి గురించి క్లుప్తంగా... –సాక్షి క్రీడా విభాగం మెరుపుతీగ... సిమోన్ బైల్స్ అమెరికా జిమ్నాస్ట్ మెరుపుతీగ సిమోన్ బైల్స్. జిమ్నాస్టిక్స్పై ఆసక్తి ఉన్నవారికి సిమోన్ విన్యాసాలు బాగా తెలుసు. ముఖ్యంగా కరోనా కారణంగా లభించిన వాయిదా సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ఈ ఒలింపిక్స్లో కను రెప్ప వేయకుండా చూసే ఈవెంట్ ఏదైనా ఉంటే అది బైల్స్ విన్యాసమే అవుతుంది. 2016 రియో ఒలింపిక్స్లో అరంగేట్రం చేసిన 24 ఏళ్ల బైల్స్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. టోక్యోలోనూ ఆమె ఐదు స్వర్ణాలపై గురి పెట్టింది. బ్రొమెల్... బోల్ట్ వారసుడవుతాడా! బీజింగ్ (2008) మొదలు రియో (2016) ఒలింపిక్స్ దాకా స్ప్రింట్లో జమైకన్ ఉసేన్ బోల్ట్ హవానే నడిచింది. అతనేమో రిటైరయ్యాడు. మరి ఇప్పుడెవరా పందెం కోడి అంటే... ట్రేవోన్ బ్రోమెల్ పేరు బాగా వినిపిస్తోంది. 25 ఏళ్ల ఈ అమెరికన్ స్ప్రింటర్ వేగంలో మరో చిరుతను, బోల్ట్ను తలపిస్తున్నాడు. ఇటీవల జరిగిన అమెరికా ట్రయల్స్లో అతను 100 మీటర్ల పరుగు పందెంను 9.80 సెకన్లలో పూర్తిచేసి అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. టోక్యోలోనూ ఈ వేగం నమోదైతే మూడు ఒలింపిక్స్ల తర్వాత విజేతగా నిలిచిన అమెరికన్ చిరుతగా నిలుస్తాడు. 2004 ఏథెన్స్లో గ్యాట్లిన్ పసిడి అనంతరం మరో అమెరికన్ గోల్డెన్ చాన్స్ కొట్టలేకపోయారు. లేడీ చిరుత... షెల్లీ జమైకన్ లేడీ చిరుత ఫ్రేజర్. గత రియో ఒలింపిక్స్లో స్ప్రింట్ (100 మీ.)లో కాంస్య పతకం పొందిన ఈ జమైకా అథ్లెట్ తన పరుగుకు ఈ నాలుగేళ్లలో మరింత వేగాన్ని జోడించింది. మహిళల 100 మీటర్ల పరుగులో విజయమైనా, స్వర్ణమైనా తనదేనని చెబుతున్నారంతా. ఆమె పసిడిపై కన్నేసింది. మనం ఆమె పరుగుపై కన్నేద్దాం. వరుసగా నాలుగో ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న షెల్లీ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. బంగారు చేప... కెటీ లెడెక్కీ మహిళల ఒలింపిక్స్ స్విమ్మింగ్లో కేటీ లెడెక్కీకి అద్భుతమైన రికార్డు ఉంది. మూడోసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగిన లెడెక్కీ మరిన్ని స్వర్ణాలు తన మెడలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఆమె ఇప్పటివరకు ఒలింపిక్స్లో ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. మనం కూడా లెడెక్కీ విన్యాసంపై ఓ లుక్కెద్దాం. గోల్డెన్ స్లామ్ దారిలో... ‘గోల్డెన్ స్లామ్’ వేట ఈ ఏడాది ఆస్ట్రేలియాలో మొదలైంది. ఫ్రెంచ్ ఓపెన్ మీదుగా వింబుల్డన్ దాకా సాగింది. ఇప్పుడు టోక్యో దగ్గరకు వచ్చింది. ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా... బలమైన ప్రత్యర్థులు లేని కారణంగా జొకోవిచ్కు ఒలింపిక్స్ స్వర్ణం దూరం కాబోదు. ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచి సెప్టెంబర్లో జరిగే యూఎస్ ఓపెన్లో జొకోవిచ్ విజేతగా నిలిస్తే... పురుషుల టెన్నిస్లో గోల్డెన్స్లామ్ సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టిస్తాడు. సూపర్ ఫెలిక్స్... అమెరికన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ మహిళా అథ్లెట్. షార్ట్ డిస్టెన్స్లో అసమాన ప్రదర్శన కనబరుస్తున్న 35 ఏళ్ల అలీసన్ పోటీని టోక్యోలో తప్పకుండా చూడాల్సిందే. అమెరికాలో నిర్వహించిన ట్రయల్స్లో మెరుపు వేగంతో పోటీల్ని ముగించిన ఫెలిక్స్ తాజా ఒలింపిక్స్లో మేటి రన్నర్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా ఐదో ఒలింపిక్స్లో పోటీపడుతున్న ఫెలిక్స్ ఇప్పటివరకు ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించింది. ఒలింపిక్స్ మహిళల అథ్లెటిక్స్లో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా ఫెలిక్స్ గుర్తింపు పొందింది. ‘హ్యాట్రిక్’పై టెడ్డీ గురి... ఫ్రాన్స్ జూడో ప్లేయర్ టెడ్డీ రినెర్ హ్యాట్రిక్ స్వర్ణం లక్ష్యంగా టోక్యో బరిలోకి దిగుతున్నాడు. లండన్, రియో విశ్వక్రీడల్లో బంగారు పతకాలు సాధించిన 32 ఏళ్ల రినెర్కు ఇది నాలుగో ఒలింపిక్స్. బీజింగ్ (2008) ఒలింపిక్స్లో కాంస్యం గెలిచాడు. ప్లస్ 100 కేజీల కేటగిరీలో పోటీపడే ఈ ఫ్రెంచ్ జూడోకా గత 154 బౌట్లలో ఓటమి ఎరుగని ఆటగాడిగా ఎదిగాడు. -
శృంగారంలో పాల్గొంటే మంచాలు విరుగుతాయా?
Tokyo olympics: జూలై నెల చివరి వారంలో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలకు ప్రపంచ అథ్లెట్లు సంసిద్ధమవుతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ కత్తి మీద సాములా మారిందని చెప్పాలి. ఈ క్రమంలో అథ్లెట్ల మధ్య శృంగార కట్టడికి నిర్వాహకులు వినూత్న ఆలోచనను అమలు చేశారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులు రొమాన్స్ లో పాల్గొనకుండా ఒలింపిక్ గ్రామంలోని వాళ్లు బస చేస్తున్న గదుల్లో విచిత్రమైన బెడ్లను ఏర్పాటు చేశారు. అట్టలతో తయారు చేసిన మంచాలను క్రీడాకారుల గదులో ఉంచారు. దీనివల్ల ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనే వీలుండదని అని వారి యోచన. ఒలింపిక్స్ ముగిశాక వీటిని రీసైక్లింగ్ చేసి కాగితపు ఉత్పత్తులుగా మార్చనున్నారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు. జూలై 24న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల బస కోసం 18,000 పడకలు అవసరం కాగా, పారా ఒలింపిక్స్కు 8,000 పడకలు మాత్రమే అవసరం అయ్యాయి. ప్రస్తుతం ఈ బెడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారి హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇవి గరిష్టంగా 200 కిలోల బరువు వరకు ఆపగలవని, యాంటీ సెక్స్ బెడ్స్ కథనాలను తోసిపుచ్చుతున్నారు ఒలింపిక్ నిర్వాహకులు. Beds to be installed in Tokyo Olympic Village will be made of cardboard, this is aimed at avoiding intimacy among athletes Beds will be able to withstand the weight of a single person to avoid situations beyond sports. I see no problem for distance runners,even 4 of us can do😂 pic.twitter.com/J45wlxgtSo — Paul Chelimo🇺🇸🥈🥉 (@Paulchelimo) July 17, 2021 *looks up ‘sex during the games’ in #Tokyo2020 health and safety handbook https://t.co/m4UaAYMhNz — James Longman (@JamesAALongman) July 19, 2021 “Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB — Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021 -
యూపీ అథ్లెట్లకు సీఎం యోగి బంపర్ ఆఫర్..
వారణాసి: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొనే ఉత్తరప్రదేశ్ అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సహకాలు ప్రకటించారు. వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధిస్తే రూ. 6 కోట్లు, రజతం గెలిస్తే రూ. 4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ . 2 కోట్ల చొప్పున నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. టీమ్ ఈవెంట్లలో స్వర్ణం గెలిచే క్రీడాకారులకు మూడేసి కోట్లు, రజతానికి రెండు, కాంస్యానికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఒలింపిక్స్లో పాల్గొననున్న క్రీడాకారులందరికీ రూ.10లక్షల చొప్పున నగదు ఇస్తామని సీఎం యోగి తెలిపారు. విశ్వక్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్లో యూపీకి చెందిన పది మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరికి షూటర్ సౌరభ్ చౌదరీ నాయకత్వం వహిస్తున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ నెల 17న భారత తొలి బృందం బయల్దేరనుంది. 14నే ఈ బృందాన్ని పంపాలని భారత ఒలింపిక్ సంఘం భావించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వాహకుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో 17వ తేదీన భారత బృందం టోక్యోకు వెళ్లనుంది. ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నాక మూడు రోజులు క్రీడాకారులందరూ క్వారంటైన్లో ఉండాలి. మిగతా క్రీడాకారులు మరో రెండు రోజుల తర్వాత టోక్యోకు వెళ్తారు. మరోవైపు ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్న భారత షూటింగ్ జట్టు 16న టోక్యోకు బయల్దేరనుంది. మొత్తంగా భారత్ నుంచి 120కి పైగా అథ్లెట్లు విశ్వక్రీడలకు వెళ్లనున్నారు. -
బీసీసీఐ రూ.10 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ తుది సన్నాహాల్లో ఉన్న భారత బృందానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఆదివారం అత్యవసరంగా సమావేశమైన బోర్డు ఉన్నతాధికారులు టోక్యో వెళ్లే జట్టుకు తమ వంతు సాయంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వర్చువల్ మీటింగ్లో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు. ‘అవును... టోక్యో బృందానికి సాయం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. రూ. 10 కోట్ల నిధులిచ్చేందుకు బోర్డు అపెక్స్ కౌన్సిల్ అమోదం తెలిపింది. మెగా ఈవెంట్కు అర్హత పొందిన అథ్లెట్ల సన్నాహాలు, కిట్లు, ఇతరత్రా ఖర్చుల కోసం ఈ నిధులు వినియోగించుకోవచ్చు’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. చైనా క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘లీ–నింగ్’ స్పాన్సర్షిప్ను ఐఓఏ ఇటీవలే రద్దు చేసుకుంది. దీంతో క్రీడాశాఖ వినతి మేరకు బీసీసీఐ నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. వచ్చే నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయి. మూడు ఐసీసీ మెగా టోర్నీలకు బీసీసీఐ బిడ్! రాబోయే ప0దేళ్ల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగే మూడు మెగా టోర్నమెంట్ల ఆతిథ్యం కోసం బిడ్లు దాఖలు చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. ఆన్లైన్లో ఆదివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 చాంపియన్స్ ట్రోఫీ... 2028 టి20 వరల్డ్కప్, 2031 వన్డే వరల్డ్కప్ నిర్వహణ కోసం బిడ్ దాఖలు చేస్తుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్జెండర్
జో బైడెన్ బుధవారం ప్రెసిడెంట్ సీట్లో కూర్చోవడంతోనే పదిహేడు సంతకాలు పెట్టారు. వాటిల్లో ఒక సంతకం ట్రాన్స్జెండర్లది. ‘మనషులంతా ఒక్కటే. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్జెండర్. వివక్ష పాటించరాదు’ .. అని సైన్ చేసేశారు. అయితే ఇందుకు అందరూ ఓకే. ఒక్క అథ్లెట్లే.. నాట్ ఓకే. ‘‘ట్రాన్స్ ఉమన్ రన్నర్ని మామూలు ఉమన్ రన్నర్తో పోటీకి దింపితే గెలిచేది ట్రాన్స్ ఉమనే. వాళ్లు బలంగా ఉంటారు. అప్పుడది అథ్లెట్స్ మధ్య పోటీ అవదు. శారీరకంగా బలమైనవాళ్లకు, వారికన్నా బలహీనమైన వాళ్లకు మధ్య పోటీ అవుతుంది’ అని వారి వాదన. బైడన్ ఏమంటారు! తన ఆర్డర్ను వెనక్కు తెప్పించి, ‘అథ్లెట్స్ తక్క’ అని రీ ఆర్డర్ పాస్ చేస్తారా? బైడెన్ దగ్గరకు వాషింగ్టన్ వెళ్లేముందొకసారి ఇండియాలోని గోపాల్పూర్కి వెళదాం. ఆరేళ్లు వెనక్కి. 2014 లోకి. ఏ గోపాల్పూర్ అంటే ఒడిశా జైపూర్ జిల్లాలో ఉన్న గోపాల్పూర్. స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఊరు. ఊహు. తనక్కడ లేదు! పంజాబ్లో ఉందట.. ట్రైనింగ్ సెంటర్లో. గ్లాస్గోవ్ కామన్వెల్త్ గేమ్స్కి ప్రాక్టీస్ చేస్తోంది. అప్పటికి ఆమె వయసు 18. పెద్దయ్యాక ఆడబోతున్న తొలి పెద్ద గేమ్! ఆ ముందు నెలలోనే తైవాన్ వెళ్లి ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఆడొచ్చింది. 200 మీటర్ల పరుగు పందెంలో, 400 మీటర్ల రిలేలో గోల్డ్ మెడల్స్ కొట్టుకొచ్చింది. ‘‘వారెవ్వా అమ్మాయీ..’’ అంది ఇండియా. ఇంకా అంటూనే ఉంది, అంతలోనే ద్యుతీకి ఢిల్లీ నుంచి పిలుపు.. అర్జెంటుగా ఢిల్లీ వచ్చెయ్యమని! పిలిచింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్. ద్యుతీ కాలు నిలవలేదు. ట్రైనింగ్కి బెంగళూరు పంపడానికి ఢిల్లీ రమ్మన్నారనుకుంది. పంజాబ్లో బస్సెక్కి, ఐదు గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకుంది. ‘‘డాక్టర్ని కలువమ్మా.. ’’ అని ఫెడరేషన్ డాక్టర్ దగ్గరకు పంపించారు డైరెక్టర్. ద్యుతీ డౌట్ పడలేదు. ఫిట్నెస్ పరీక్షలు అనుకుంది. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసి, మూడో రోజు బెంగళూరు పంపించారు. అయితే ప్రాక్టీస్ కోసం కాదు. మరికొన్ని పరీక్షల కోసం. ద్యుతీకి క్రోమోజోమ్ ఎనాలిసిస్ టెస్ట్ చేశారు. ఎం.ఆర్.ఐ. తీశారు. గైనకాలజికల్ ఎగ్జామ్స్ చేశారు. తర్వాత హార్మోన్ పరీక్షలు! ద్యుతీ క్లిటారిస్ను కదలించి చూశారు. ఆ ప్రకంపనల్ని నోట్ చేశారు. వెజీనా గోడల్ని పరీక్షించి చూశారు. ప్యూబిక్ హెయిర్ సాంద్రత గుణాన్ని పట్టి పట్టి చూశారు. బ్రెస్ట్ దగ్గరికి వచ్చారు. నొక్కి చూశారు. సైజ్ చుట్టుకొలత తీసుకున్నారు! అవన్నీ కామన్ పరీక్షలేనేమో అనుకుంది ద్యుతీ. రిపోర్ట్స్లో ‘అన్ కామన్’ అని వచ్చింది! ద్యుతీలో స్త్రీ పాళ్లు తక్కువగా పురుషపాళ్లు ఎక్కువగా ఉన్నాయని వచ్చింది. మగాళ్లలో ఉండే టెస్టోస్టెరోన్ హార్మోన్ ఆడవాళ్లలో లీటరు రక్తానికి 1.0–3.3 నానోమోల్స్ మధ్య మాత్రమే ఉండాలి. ద్యుతీలో 10 నానోమోల్స్కి మించి ఉన్నాయి. దానర్థం ఆమె మహిళ కాదు!! మహిళలతో పోటీ పడటానికి లేదు. పైకి మహిళే కనుక మగాళ్లతోనూ ఆమెను పోటీ పడనివ్వడానికి లేదు. అయ్యో.. ద్యుతీ కెరీర్ అంతమైపోయినట్లేనా? ఆమె కెరీర్ సంగతి తర్వాత, ఆమెతో పోటీ పడితే అమ్మాయిల కెరీర్ అంతమైపోయినట్లేనని అథ్లెట్స్ ఫెడరేష¯Œ ఆలోచనలో పడిపోయింది. 150 సెంటీ మీటర్ల ఎత్తు మాత్రమే.. అంటే 4 అడుగుల 9 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ద్యుతీ రన్నింగ్లో అంత శక్తిమంతమైన అడుగు ఎలా వేయగలుగుతోంది అనే సందేహం తీర్చుకునేందుకే ఫెడరేషన్ ఆమెకు టెస్టోస్టెరోన్ టెస్ట్లు చేయించింది. చేయించాక, ఆడవాళ్లతో ద్యుతీ పోటీ పడడం సబబేనా అనే తర్కంలో పడిపోయింది. తర్వాతేమైంది! భారీ అడుగు : భారతీయ స్ప్రింటర్, 100 మీటర్ల పరుగు ఈవెంట్లో ప్రస్తుతం మన నేషనల్ చాంపియన్ ద్యుతీ చంద్ ద్యుతీ చంద్కి ఇప్పుడు 24 ఏళ్లు. ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రెండు బంగారు పతకాలు సాధించాక గ్లాస్గోవ్ కామన్వెల్త్ గేమ్స్లో ఆడలేకపోయినా ఆమె 2016లో, 2017లో, 2018లో ఆడింది. పతకాలు సంపాదించింది. 2019లో ఇటలీ వెళ్లి సమ్మర్ యూనివర్సియాyŠ 100 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ గెలుచుకొచ్చింది. ఇవన్నీ కూడా ‘సోర్ప్›్ట కోర్టు’లో కేస్ వేసి, టెస్టోస్టెరాన్ రూల్స్ అన్యాయం అని వాదించి, కేసు నెగ్గి, ఆడి, సాధించింది. ఆ తర్వాత 2019 లో తొలిసారి తను ఎల్జీబీటీ (ట్రాన్స్జెండర్) సభ్యురాలినని బాహాటంగా ప్రకటించుకుంది. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్కి కూడా వెళుతోంది. అక్కడా ఆడవాళ్లతోనే తను ఆడుతుంది. అయితే ఇది అన్యాయం అనే వాళ్లు అంటూనే ఉన్నారు. ద్యుతీ తనను ట్రాన్స్ ఉమెన్ గా ప్రకటించుకున్నాక కూడా మహిళల కేటగిరీలో ఆమెకు చోటు ఇవ్వడం ఏమిటని వారి వాదన. ఈ వాదనకు బలం ఉన్నా, వాదనగా నిలబడే బలం మాత్రం లేదు. ఐ.ఎ.ఎ.ఎఫ్. (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కౌన్సిల్) 2019 అక్టోబర్ నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ట్రాన్స్జెండర్ నిబంధనల ప్రకారం ట్రాన్స్ ఉమన్ మహిళలు తమ రక్తంలో లీటరుకు 5 నానోమోల్స్కు మించి టెస్టోస్టెరోన్ లేదని (ఈవెంట్లో పాల్గొనడానికి ముందు పన్నెండు నెలల నుంచి) రుజువు చేసి సంతకం పెట్టి ఇస్తే చాలు. ఆటకు అర్హులే. మరి ఒలింపిక్స్ నాటికి ద్యుతీ చంద్ టెస్టోస్టెరోన్ 5 నానోమోల్స్కి మించి ఉంటే? ఆమె ఆడలేకపోవచ్చు. ఇప్పుడు బైడన్ దగ్గరికి వద్దాం. ‘మనుషులంతా ఒక్కటే. ఎవరినీ లైంగిక వివక్షతో చూడకూడదు’ అని బుధవారం ఆయన ఆర్డర్ పాస్ చేసినప్పటి నుంచి అగ్రరాజ్యంలో ట్రాన్స్జెండర్ ల విజయోత్సవాలు జరుగుతున్నాయి. ‘మా మంచి ప్రెసిడెంట్’ అని బైడెన్కు ట్రాన్స్జెండర్ లు పూల గుచ్ఛాలు పంపుతున్నారు. వాళ్ల సంతోషానికి, బైడెన్ సమభావనకు ఎవరూ అడ్డు పడటం లేదు కానీ, ‘‘మహిళల స్పోర్ట్ ఈవెంట్కి ట్రాన్స్ మహిళల్ని అనుమతించకండి. వాళ్లు బలంగా ఉంటారు. వాళ్లతో పోటీ పడితే మేము ఓడిపోతాం’’ అని క్రీడారంగంలోని అమెరికన్ మహిళలు బైడెన్పై ఒత్తిడి తెస్తున్నారు. ‘కరెక్టే’ అని రిపబ్లికన్లు మద్దతు ఇస్తున్నారు. ఏ రంగంలోనైనా తొలి ట్రాన్స్ అవడం నిజంగా గొప్ప సంగతే. ఇండియానే తీసుకుందాం. తొలి ట్రాన్స్జెండర్ న్యాయవాది సత్యశ్రీ షర్మిల. తొలి ట్రాన్స్జెండర్ జడ్జి జోయితా మండల్. తొలి ట్రాన్స్జెండర్ పోలీస్ ఆఫీసర్ ప్రీతికాయషిని. తొలి ట్రాన్స్జెండర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మానవీ బందోపాధ్యాయ్. ఎన్నికల్లో నిలబడిన తొలి ట్రాన్స్జెండర్ ముంతాజ్. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ట్రాన్స్జెండర్ షబ్మమ్ మౌసీ. తొలి ట్రాన్స్జెండర్ సిపాయి షబీ. తొలి ట్రాన్స్జెండర్ మెడికల్ అసిస్టెంట్ జియా దాస్. వీళ్లందరివీ గొప్ప అచీవ్మెంట్స్. కానీ భౌతిక శక్తి అవసరమైన క్రీడా పోటీలలో మహిళల కేటగిరీలోకి ట్రాన్స్ ఉమన్ని అనుమతించి, వారు గెలిచినప్పుడు ‘తొలి ట్రాన్స్ ఉమన్ రన్నర్’ అని అనడం వారి విజయానికి సంపూర్ణతను ఇచ్చినట్లవుతుందా? బహుశా బైడెన్ ఆర్డర్ నుంచి ట్రాన్స్జెండర్ లు తమకు తాముగానే క్రీడారంగాన్ని మినహాయించుకోడానికి త్వరలోనే ముందుకు రావచ్చు. వారి గౌరవం కోసం వాళ్లు. -
మేటి క్రీడాకారులకు ఎన్ఐఎస్ కోర్సులో నేరుగా సీటు
న్యూఢిల్లీ: పాటియాలాలోని జాతీయ క్రీడా సంస్థ (ఎన్ఐఎస్)లో కోచింగ్ డిప్లొమా కోర్సుల్లో శిక్షణ తీసుకునేందుకు మేటి క్రీడాకారులకు నేరుగా అవకాశమిస్తున్నట్లు భారత క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది. ఈ డిప్లొమా కోర్సుల్లో 46 మంది ఉత్తమ అథ్లెట్లకు స్థానం కల్పి స్తారు. ఎన్ఐఎస్ ప్రవేశ విధానంలోనూ మార్పులు చేశారు. ఆన్లైన్ పరీక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. సీట్ల సంఖ్యను 566 నుంచి 725కి పెంచారు. ‘ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్, ఆసియా లేదా కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ్య లేకుండా నేరుగా చేర్చుకుంటారు. కోర్సులో చేరడానికి విద్యార్హతను డిగ్రీ నుంచి మెట్రిక్యులేషన్కే పరిమితం చేశారు. కనీస వయసును 23 నుంచి 21కి తగ్గించడం జరిగింది. -
‘ఈ ఫోటోలకు అరెస్ట్ కాదు.. అవార్డు ఇవ్వాలి’
టెహ్రాన్: అభ్యంతకర ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలతో ఇద్దరు పార్కుర్ అథ్లెట్లను ఇరాన్లో అరెస్టు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వాళ్లు చేసిన నేరమేంటి? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అలిరెజా అద్భుతమైన ఫొటోలకు అవార్డు ఇవ్వాలి కానీ అరెస్ట్ చేయకూడదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన భవనంపై తన స్టంట్ భాగస్వామిని ముద్దు పెట్టుకున్న ఫొటోలను ప్రముఖ పార్కుర్ అథ్లెట్ అలిరెజా జపాలాఘీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం రేగింది. వీరిద్దరినీ టెహ్రాన్ సైబర్ పోలీసులు అరెస్ట్ బీబీసీ వెల్లడించింది. షరియా చట్టం నిబంధనలు ఉల్లఘించి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసినట్టు టెహ్రాన్ పోలీసు చీఫ్ హుస్సేన్ రహీమి ధ్రువీకరించారు. అయితే అలిరెజా జపాలాఘీ గతంలో ఇలాంటి ఫోటోలను బహిర్గతం చేసినా ఇప్పుడే అరెస్ట్ చేయడంపై నెటిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి అదృశ్యం గురించి ప్రశ్నించినందుకే అతడిని అరెస్ట్ చేశారని అంటున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక విభాగంలో పోలీసు అధికారి అయిన తన తండ్రి అదృశ్యం వెనుకున్న మిస్టరీని ఛేదించడంలో పోలీసులు విఫమలయ్యారని అలిరెజా ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు నెటిజనులు గుర్తుచేశారు. (ముద్దు పెట్టుకున్నారు.. అరెస్టు చేశారు) అసలేంటి ఈ ఆట? పార్కుర్ను ఫ్రీరన్నింగ్ అని కూడా పిలుస్తారు. ఫ్రాన్స్లో పుట్టిన ఈ క్రీడ సైనికులకు ఇచ్చే శిక్షణ నుంచి ఆవిర్భవించింది. పరుగెడుతూ, దూకుతూ, పిల్లిమొగ్గలు వేస్తూ, వివిధ రకాల విన్యాసాలతో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగిపోవడమే ఈ ఆటలోని ప్రాధానాంశం. ఆటలో భాగంగా ట్రేసర్లు లేదా ట్రేసర్స్ అని పిలువబడే ప్రాక్టీషనర్లు, సహాయక పరికరాలు లేకుండా సాధ్యమైనంత వేగంగా, సమర్థవంతమైన మార్గంలో సంక్లిష్ట వాతావరణంలో ఒక పాయింట్ నుండి మరొకదానికి చేరుకుంటారు. -
ముద్దు పెట్టుకున్నారు.. అరెస్టు చేశారు
ఎత్తైన భవనంపై బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఓ పార్కుర్ అథ్లెట్ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గత వారం ఇరాన్కు చెందిన పార్కుర్ అథ్లెట్ అలిరేజా జపాలాఘీ, తన స్టంట్ భాగస్వామిని ఇంటి పైన ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫోటోలను తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఇరాన్ సంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధంగా వ్యవహరించిన అతడిని టెహ్రాన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా ) గత వారం తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయని, స్వతహాగా లొంగకపోతే పబ్లిక్గా అరెస్టు చేస్తామని బెదిరించినట్లు జపాలాఘీ ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడుతూ తెలిపారు. కాగా జపాలాఘీని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఫోటోలో మహిళ ముఖం సరిగా తెలియకపోవడంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వీరి నిర్బంధాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పార్కుర్ అథ్లెట్కు మద్దతుగా పలువురు అక్రోబాటిక్ విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. (తొందరెందుకు.. కాస్త ఆగి చూడండి: మిస్బా ) Iranian parkour Alireza Japalaghy posted this picture. He was arrested today. Security agents hunting down the woman. pic.twitter.com/rrNznf7Tv9 — Farnaz Fassihi (@farnazfassihi) May 18, 2020 ఇస్లామిక్ వస్త్రధారణ నియమాల ప్రకారం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళలు తమ ముఖం, చేతులు, కాళ్లను మాత్రమే కనబడేలా దుస్తులు వేసుకోవాలి. అలాగే ఎలాంటి ఆర్భాటాలు లేని రంగులను మాత్రమే ధరించాలి. అయితే ఇలాంటి మంచి పని చేసిన వారికి బహుమతి ఇవ్వాలి కానీ అరెస్టు చేయకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎలాంటి సహాయం లేకుండా వేగంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి జంప్ చేసేవారిని పార్కుర్ అథ్లెట్ అంటారు. పార్కుర్లో రన్నింగ్, క్లైంబింగ్, స్వింగింగ్, జంపింగ్ రోలింగ్ వంటివి ఉంటాయి. (రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు ) -
‘టోక్యో’పై నీలినీడలు
టోక్యో: ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టేయడంతో విశ్వక్రీడలపై అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి. జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బయటికి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ... లోలోపల గుబులు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్– 19 కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇరుగుపొరుగు దేశాలకు వెళ్లాలన్నా ఎన్నో ఆంక్షలున్నాయి. ఇక సుదూర దేశాలకు పయనం దాదాపు గగనమే అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు టోక్యోకు వెళతారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆడేవాళ్లెంత మంది? ధైర్యం చేసి విదేశీయులు వెళ్లడానికి సిద్ధమైనా... జపాన్ వాసుల్లో ఇప్పుడిప్పుడే అసహనం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే... ప్రతిష్టకు పోయి విదేశీయుల రాక వల్ల తమ ప్రాణాలకు ముప్పుతెచ్చుకోవడం ఎందుకని జపనీయులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణాలతో ఈ ‘ఆట’లొద్దు కోవిడ్–19 జపాన్లోనూ జడలు విప్పింది. అధికారిక సమాచారం మేరకు 814 మంది కరోనా బాధితులుండగా.. 24 మంది మృత్యువాత పడ్డారు. ఒలింపిక్స్ నేపథ్యంలో కరోనా కేసుల్ని తక్కువగా చూపిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యూరప్ దేశాల కంటే ముందుగానే జపాన్కు కరోనా వైరస్ వ్యాపించింది. అందువల్ల బాధితులు ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది. టోక్యోకు చెందిన 27 ఏళ్ల ఉద్యోగి కొకి మురా మీడియాతో మాట్లాడుతూ ‘నిజాయితీగా చెబుతున్నా... జపాన్ ఈ కరోనా కల్లోలం నుంచి త్వరగా బయటపడినా సరే, మెగా ఈవెంట్ కోసం విదేశీయుల రాకను ఎంతమాత్రం కోరుకోం. నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఈ ఈవెంట్ను నిర్వహించకపోవడమే మంచిది’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇది అతని ఒక్కడి మాటలే కాదు... కరోనా స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో జపనీయులంతా ఇప్పుడిదే కోరుకుంటున్నారు. ఓ ఆటల వేడుక కోసం తమ ప్రాణాలను రిస్క్లో పెట్టేందుకు ఎవరు సిద్ధంగా లేరు. ఓ అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వెయ్యి మందిలో 70 శాతం మంది (700 మంది జపాన్ వాసులు) ఒలింపిక్స్ నిర్వహణకు వ్యతిరేకంగానే ఉన్నారు. మిగతా వారేమో వాయిదా వేస్తేనే మంచిదని భావిస్తున్నారు. -
రోమాంచిత సంబరం.. తాకెను అంబరం
బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): కొండలపై సైక్లింగ్ పోటీలు దుమ్ము రేపాయి. సాహస విన్యాసాలు సందడి చేశాయి. పారా మోటార్ విహారం ఉత్సాహం నింపింది. తాళ్లతో చేసిన వలపై నిలువుగా పైకి ఎగబాకటం.. తాళ్ల ఆధారంగా ఒకచోట నుంచి మరో చోటకు ప్రయాణించటం.. ఆకాశ వీధిలో తాళ్లు ఆధారంగా ఉంచిన చెక్కలపై నడవటం వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్పై రెండు రోజుల పాటు నిర్వహించే అడ్వెంచర్ ఫెస్టివల్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ చేపట్టిన ఈ ఉత్సవాలు పండుగ వాతావరణంలో సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వంద మందికి పైగా క్రీడాకారులు సైక్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పృధ్వీతేజ్ అడ్వెంచర్ క్రీడలను ప్రారంభించారు. చేకూరి కీర్తి, పృధ్వీతేజ్ వేర్వేరుగా పారా మోటార్లో అరగంట పాటు ఆకాశంలో విహారం చేశారు. రోప్ సైక్లింగ్, బైక్ రైడింగ్, జిప్ సైకిల్, ట్రెక్కింగ్ ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు యాత్రికులు, క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. విన్యాసాలు, క్రీడలను తిలకించి ఆహ్లాదం పొందారు. సాహస క్రీడలపై మక్కువ గల క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు ఈ అడ్వెంచర్ ఫెస్టివల్ వేదికగా నిలిచింది. టూరిజం డీవీఎం సురేష్కుమార్రెడ్డి, జిల్లా అధికారి చంద్రమౌళి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలరించిన వినోద కార్యక్రమాలు అడ్వెంచర్ ఫెస్టివల్లో భాగంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు అలరించాయి. టీవీ యాంకర్లు గీతా భగత్, చైతూ సందడి చేశారు. హాస్యనటులు బుల్లెట్ భాస్కర్, రాజమౌళి హాస్యం పండించారు. పలు చిత్రాల్లోని సినీ నేపథ్య గేయాలు ఆలపించారు. డీజే నృత్యాలతో సభికులను ఉత్సాహపరిచారు. నివేదిక కూచిపూడి, యశ్వని జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాలను సందర్శకులు ఉత్సాహంతో తిలకించారు. -
‘శిఖర’ సమానం
రాంగోపాల్పేట్: కొండ అద్దమందు కొంచమై ఉండదా.. అన్నాడు వేమన. కానీ, వీరి ఆత్మబలమందు శిఖరమే కొంచమైంది! మంచు కొండలు కరిగిపోతున్నా.. ఇంచు కూడా వెనుకడుగు వేయలేదు. ఎత్తువెళ్లే కొద్దీ ఆక్సిజన్ దొరక్క ఊపిరి ఎక్కడ ఆగిపోతుందోనని టెన్షన్ ఉన్నా ఆత్మవిశ్వాసమే శ్వాసగా.. హిమశిఖరం అధిరోహించారు. భాగీరథ–2 పర్వతాన్ని 18,000 అడుగుల మేర ఎక్కి ‘దివ్య’ మైన చరిత్ర సృష్టించారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరని నిరూ పించారు. సాహసంలోనూ వారిది సహవాసమే. పర్వతారోహణను పూర్తిచేసుకుని మంగళవారం తెల్లవారుజామున నగరానికి చేరుకు న్నారు. వారికి గోపాలపురం పోలీసులు ఘనస్వాగతం పలికారు. తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటిన తెలుగుతేజాలైన షేక్ అర్షద్(26), ఆర్యవర్ధన్(17)లపై ప్రత్యేక కథనం... కాలు లేదని కుంగి పోలేదు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇస్మాయిల్, మోసిమ్ల కుమారుడు షేక్ అర్షద్(26). 2004 సంవ త్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు మోకాలి పైవరకు పోయింది. అయినా కుంగిపోకుండా డిగ్రీ చేశాడు. ఇటీవల ఉజ్బెకిస్తాన్లో జరిగిన అంతర్జాతీయ ప్యారా హ్యాండ్ సైక్లింగ్ పోటీల్లో 4వ స్థానంలో నిలిచాడు. సరూర్నగర్కు చెందిన 17ఏళ్ల ఆర్య వర్ధన్ డిగ్రీ చదువుకున్నాడు. నాలుగేళ్ల వయసులో ప్రమాదానికి గురయ్యాడు. ఆటోలో వస్తుండగా కింద పడ్డాడు. కుడికాలు నుజ్జు్జకావడంతో మోకాలి పైవరకు తీసేశారు. తండ్రి లేడు. తల్లి గొంతు క్యాన్సర్తో బాధపడుతోంది. ఆ ఆరుగురిలో ఇద్దరు మనవాళ్లే.. ఆదిత్య మెహతా ఫౌండేషన్ సహకారంతో బీఎస్ఎఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వెంచర్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో అర్షద్, ఆర్యవర్ధన్ నాలుగేళ్లు కలిసే శిక్షణ తీసుకున్నారు. వీరి కోసం ఖరీదైన కృత్రిమ కాలును తయారు చేయించారు. బీఎస్ఎఫ్ శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా మొత్తం ఆరుగురు ప్యారాఅథ్లెట్స్ను పర్వతారోహణకు ఎంపిక చేయగా వారిలో వీరిద్దరు ఉన్నారు. ఈ ఆరుగురు ఆగస్టు 10న ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుంచి పర్వతారోహణ ప్రారంభించారు. వీరిలో నలుగురు అథ్లెట్స్ 21,365 అడుగుల ఎత్తుండే భాగీరథ శిఖరాన్ని అదిరోహించారు. కానీ ఆర్యన్, అర్షద్లకు తీవ్రమైన ప్రతికూల వాతారణ పరిస్థితులు ఎదురుకావడంతో ఆగస్టు 27వ తేదీనాటికి భాగీరథ పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేర అధిరోహించారు. పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేరకు ఎక్కిన తెలుగు దివ్యాంగులుగా చరిత్ర సృష్టించారు. 16కి.మీ. ఒకేరోజు నడిచాం: అర్షద్ గతంలో నేను ఎప్పుడూ 3 కి.మీ.ల కంటే ఎక్కు వగా నడవలేదు. పర్వతారోహణలో ఒకేరోజు 16 కి.మీ. ఏకధాటిగా నడిచా. ప్రొస్తటిక్ లింబ్తో దీన్ని పూర్తి చేయగలిగాను. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చాయి. ఒక మృతదేహం కనిపించినా భయపడలేదు. పైకి వెళ్తుంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించేది. 13కేజీల బరువుతో: ఆర్యవర్ధన్ జీవితంలో ఇలాంటి ప్రదేశాలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హిమపాతాలు, బండరాళ్లు, నదులు, మంచుపగుళ్లు, వడగళ్లు, భారీ వర్షాలు ఎన్నెన్నో అనుభవాలు ఎదుర య్యాయి. 12 నుంచి 13 కిలోల బరువున్న బ్యాగులు భుజానికి తగిలించుకుని ముందుకు సాగాం. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అది రోహించడానికి మానసికంగా సిద్ధమయ్యాను. 2020లో ఎవరెస్ట్ను అధిరోహిస్తాం 2020 సంవత్సరంలో 12 మంది ప్యారా అథ్లెట్స్కు శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేదికు సిద్ధం చేస్తాం. దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరని, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధిస్తారనేది నిరూపిస్తాం. – ఆదిత్య మెహతా, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
భారత యువ అథ్లెట్స్కు ఆరు పతకాలు
హాంకాంగ్: ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. రెండు స్వర్ణాలు, మూడు కాంస్యాలు, ఒక రజతంతో కలిపి మొత్తం ఆరు పతకాలు సాధించారు. బాలికల 100 మీటర్ల హర్డిల్స్లో థబిత ఫిలిప్ మహేశ్వర 13.86 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బాలుర హ్యామర్త్రోలో విపి¯Œ కుమార్ (69.63 మీటర్లు) పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. బాలికల హ్యామర్ త్రోలో హర్షిత షెరావత్ రజతం (61.93 మీటర్లు) దక్కించుకుంది. బాలుర పోల్వాల్ట్లో దీపక్ (4.70 మీటర్లు)... బాలుర ట్రిపుల్ జంప్లో విశాల్ మోర్ (15.09 మీటర్లు)... బాలుర 1500 మీటర్ల రేసులో అజయ్ (3ని:57.25 సెకన్లు) కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. -
టోక్యో ఒలింపిక్స్ వరకు... ‘టాప్’లో సైనా, సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నమెంట్లలో టైటిల్స్ గెలుస్తున్న మేటి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్లకు టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టాప్) పథకాన్ని పొడిగించారు. సింగిల్స్లో వీరిద్దరితో పాటు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్లకూ టోక్యో ఒలింపిక్స్–2020 దాకా ‘టాప్’ చేయూతనిచ్చేందుకు కేంద్ర క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన ‘టాప్’ జాబితాను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) బుధవారం ప్రకటించింది. అయితే మరో తెలుగుతేజం భమిడిపాటి సాయిప్రణీత్, లక్ష్య సేన్లను ఈ జాబితా నుంచి తప్పించింది. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రాలు ‘టాప్’ జాబితాలో ఉన్నారు. కాగా ప్రదర్శన బాగుంటే టాప్లో చేర్చే ‘వాచ్లిస్ట్’ లో జక్కంపూడి మేఘన, పూర్వీషారామ్, మను అత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ‘2024 ఒలింపిక్స్ డెవలప్మెంటల్ గ్రూప్’లో సైక్లింగ్ను చేర్చే అంశాన్ని బుధవారం నాటి సమావేశంలో చర్చించారు. జూనియర్ ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో ఇటీవల భారత్ 10 పతకాలు సాధించింది. దీంతో సైక్లిస్ట్లు అల్బెన్, రొనాల్డో సింగ్, జేమ్స్ సింగ్, రోజిత్ సింగ్లను ఈ డెవలప్మెంటల్ తుది జాబితాలో చేర్చారు. పారాలింపియన్లకు అండదండ... తాజా ‘టాప్’ పథకంలో పారా అథ్లెట్లకు పెద్దపీట వేశారు. పారాలింపిక్స్, పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాలతో దేశానికి కీర్తిప్రతిష్టలు తెస్తుండటంతో ఈసారి ఏకంగా 12 మంది పారా అథ్లెట్లను ఎంపిక చేశారు. పారా ఆసియా క్రీడల స్వర్ణ విజేత శరద్ కుమార్ (హైజంప్), వరుణ్ భటి (హైజంప్), జావెలిన్ త్రోయర్లు సందీప్ చౌదరి, సుమిత్, సుందర్ సింగ్ గుర్జార్, రింకు, అమిత్ సరోహ (క్లబ్ త్రోయర్), వీరేందర్ (షాట్పుట్), జయంతి బహెరా (మహిళల 400 మీ. పరుగు) ‘టాప్’ జాబితాలో ఉన్నారు. -
ఆటల్లోనూ సగం... సమం...
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీలకు ముందు వర్ధమాన అథ్లెట్లు తమ సత్తా చాటేందుకు అవకాశం కల్పిస్తున్న యూత్ ఒలింపిక్స్కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో మూడో యూత్ ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. 2010లో తొలిసారి జరిగిన పోటీలకు సిం గపూర్, 2014లో చైనాలోని నాన్జింగ్ ఆతిథ్యమిచ్చాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు 2018 పోటీలు జరుగుతాయి. మొత్తం 32 క్రీడాంశాల్లో 4000 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఒలింపిక్ చరిత్రలో తొలి సారి ‘లింగ సమానత్వం’ అనే నేపథ్యాన్ని ఈ క్రీడల్లో చేర్చారు. దీని ప్రకారం పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లలో పురుషులు, మహిళల సంఖ్య సరిగ్గా సమానంగా ఉంటుంది. తాజా నిర్ణయంతో కొత్త తరహా ఒలింపిక్ స్ఫూర్తికి శ్రీకారం చుట్టినట్లవుతుం దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. ‘ఇక్కడ మొదలు పెట్టే కొత్త మార్పులు ఒక్క యూత్ గేమ్స్కే పరిమితం కావు. అందరి కోసం ఆటలు అనే విధంగా మొత్తం ఒలింపిక్ ఉద్యమం గొప్పతనం చాటేలా నిర్ణయాలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. బ్యూనస్ ఎయిర్స్ క్రీడలతోనే అనేక కొత్త అంశాలు ఈ పోటీల్లో ప్రవేశ పెడుతున్నారు. బ్రేక్డ్యాన్సింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, రోలర్ స్పోర్ట్స్ అండ్ కరాటే, బీఎం ఎక్స్ ఫ్రీస్టయిల్, కైట్ బోర్డింగ్, బీచ్ హ్యాండ్బాల్, ఫుట్సల్, అక్రోబటిక్ జిమ్నాస్టిక్స్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. 47 మందితో భారత్: భారత్ తరఫున యూత్ ఒలింపిక్స్లో 13 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 47 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. భారత్ మొదటిసారి ఫీల్డ్ హాకీ ఫైవ్స్, స్పోర్ట్ క్లైంబిం గ్లో పాల్గొంటోంది. షూటర్ మను భాకర్ ప్రారంభ వేడుకల్లో పతాకధారి కాగా... బ్యాడ్మింటన్లో సంచలన ఆటగాడు లక్ష్య సేన్తోపాటు తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి కూడా పోటీ పడుతోంది. 2010 యూత్ ఒలింపిక్స్లో భారత్ ఆరు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు గెలిచి 58వ స్థానంలో నిలిచింది. 2014 యూత్ ఒలింపిక్స్లో ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గి రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి, మెహులీ ఘోష్ అద్భుతమైన ఫామ్లో ఉండటంతో భారత్ ఈసారి పసిడి బోణీ చేసే అవకాశాలున్నాయి. బాక్సింగ్లో జ్యోతి గులియా (51 కేజీలు), టేబుల్ టెన్నిస్లో మానవ్ ఠక్కర్, బ్యాడ్మింటన్లో లక్ష్య సేన్, రెజ్లింగ్లో మాన్సి పతకాలు గెలిచే అవకాశముంది. -
వయసెక్కడో.. వెనకుంది!
కెనడాలోని వాంకోవర్ నగరంలో వంద మీటర్ల రన్నింగ్ ట్రాక్ అది. ఒకటిన్నర నిమిషంలో లక్ష్యాన్ని పూర్తి చేశారు మన్ కౌర్. తోటి అథ్లెట్లు అందరూ చప్పట్లతో ఆమెను అభినందించారు. విశేషం ఏంటంటే.. ఆమెతో పోటీ పడిన వాళ్లు డెబ్బై, ఎనభైలలో ఉన్నారు. మన్ కౌర్ ఒక్కరే నూరేళ్లు దాటినావిడ! అదీ ఆ ప్రత్యర్థుల ఆనందం. వందేళ్లు దాటిన పెద్దావిడ తమతో పోటీ పడటమే పెద్ద విజయం అనుకుంటే, తమ కంటే ముందే లక్ష్యాన్ని చేరడం వారిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ఇక మన్ కౌర్ను అభినందిస్తూ చప్పట్లు కొట్టిన వాళ్లలో మన్ కౌర్ తనయుడు గురుదేవ్ సింగ్ కూడా ఉన్నాడు. అప్పటికి అతడి వయసు 78 ఏళ్లు. వాంకోవర్లో 2016లో జరిగిన ‘అమెరికాస్ మాస్టర్స్ గేమ్స్’లో వంద మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు మన్ కౌర్. ఇప్పుడు ఆమె వయసు 102 ఏళ్లు. పరుగొక్కటే కాదు కౌర్ ప్రతిభ మన్ కౌర్కి అది తొలి విజయం కాదు. అంతకు ముందు.. రెండు వందల మీటర్ల పరుగు, షాట్ పుట్, జావెలిన్ త్రో, స్కైవాక్లలో కూడా పతకాలను సొంతం చేసుకున్న చరిత్ర ఆమెది. ‘ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్’, ‘ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్’ మొదలైన 20 పతకాలను అందుకున్నారు. మనదేశంతో పాటు న్యూజిలాండ్, అమెరికా, కెనడా, తైవాన్లలో జరిగిన అథ్లెటిక్స్లో పాల్గొన్నారు. గత ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆమె పేరు నమోదైంది. ఈ ఏడాది కూడా ‘వైశాఖి 5కె రన్’లో పాల్గొని, అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. తల్లి అసలు స్వీట్లే తినరు వయసు పెరిగే కొద్దీ.. ముఖ్యంగా మహిళలు, యాభై దాటినప్పటి నుంచి మరింత చురుగ్గా, ఆడుతూ పాడుతూ ఉండడానికి ప్రయత్నించాలని అంటారు మన్ కౌర్. రోజూ నడక, పరుగెత్తడంతోపాటు ఆహారం తీసుకోవడంలో క్రమశిక్షణ పాటించాలంటారు. కౌర్ దినచర్య కూడా చాలా క్రమశిక్షణతో ఉంటుంది. రోజూ సాయంత్రం తప్పనిసరిగా కొంత దూరం రన్నింగ్ చేస్తారు. తల్లీకొడుకులు రోజూ ఉదయాన్నే సోయా పాల మిల్క్షేక్ తాగుతారు. పగలు మొలకెత్తిన గోధుమల పిండితో చేసిన చపాతీలు ఆరు, గింజలు, పెరుగు, తాజా పండ్లు, పండ్ల రసాలు, గోధుమ గడ్డి రసం, రాత్రికి మళ్లీ సోయా పాలు తీసుకుంటారు. కొడుకు గురు దేవ్ ఎప్పుడైనా స్వీట్లు, నూనెలో వేయించిన ఆహారం తింటాడేమో కానీ మన్ కౌర్ వాటి జోలికి వెళ్లరు. అమెరికా పౌరసత్వం ఉన్న మన్ కౌర్, గురుదేవ్ సింగ్లు ఏడాదిలో కొన్ని నెలలు సొంతూరు చండీగఢ్లో ఉండిపోతుంటారు. తొమ్మిదేళ్లుగా తల్లీకొడుకులిద్దరూ ఎక్కడ పోటీలు జరిగినా తప్పకుండా హాజరవుతుంటారు. కలిసి పరుగెత్తుతుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్లో స్పెయిన్లో జరిగే స్ప్రింట్ రన్లో కూడా ఇద్దరూ పాల్గొనబోతున్నారు. నడవలేని వయసులో క్రీడల్లోకి! మన్ కౌర్ క్రీడా జీవితం ఆమెకి 93వ ఏట మొదలైంది! కొడుకు గురుదేవ్ ఒక రోజు ఆమెతో ‘‘అమ్మా! నీకు వయసు రీత్యా వచ్చే మోకాళ్ల నొప్పులు, గుండె సమస్యల్లేవు. ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవు. నాతోపాటు రన్నింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు కదా’ అన్నాడు. అలా కొడుకుతోపాటు ట్రాక్ మీద అడుగుపెట్టారు మన్ కౌర్. తొలి ప్రయత్నంగా నాలుగు వందల మీటర్ల లక్ష్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇక ఆమె వెనుదిరిగి చూడనేలేదు. -
మళ్లీ సిరంజీల కలకలం
గోల్డ్కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో డోపింగ్ నిరోధానికి ఉద్దేశించిన సిరంజీ రహిత (నో నీడిల్స్) నిబంధన ఉల్లంఘించినందుకు భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రాకేశ్ బాబు (ట్రిపుల్ జంపర్), ఇర్ఫాన్ (రేస్ వాకర్) శుక్రవారం బహిష్కరణకు గురయ్యారు. ఇర్ఫాన్ పడక గదిలో, రాకేశ్ బ్యాగ్లో సిరంజీలు బయటపడటంతో వారు తక్షణం క్రీడా గ్రామం వదిలి వెళ్లాలని కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) అధ్యక్షుడు లూయీస్ మార్టిన్ ఆదేశించారు. కాగా, ఇర్ఫాన్ తన విభాగమైన 20 కి.మీ. నడకలో 13వ స్థానంలో నిలిచి ఇప్పటికే పతకానికి దూరమయ్యాడు. రాకేశ్ శుక్రవారం పోటీలో పాల్గొనాల్సి ఉన్నా మోకాలి గాయంతో ముందే వైదొలిగాడు. మరోవైపు క్రీడల ప్రారంభానికి ముందు భారత బృందం బస చేసిన హోటల్ సమీపాన సిరంజీలు బయటపడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజా ఘటనపై భారత చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా, జనరల్ టీమ్ మేనేజర్ నామ్దేవ్ షిర్గోంకర్, అథ్లెటిక్స్ టీమ్ మేనేజర్ రవీందర్ చౌధరిలను సీజీఎఫ్ కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. క్రీడలు ముగిశాక ఈ ఘటనపై విచారణ చేపట్టి అథ్లెట్లను శిక్షిస్తామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) పేర్కొంది. ఈ నిర్ణయాన్ని పూర్తిగా అంగీకరించలేమని, ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత అప్పీల్కు వెళ్తామని షిర్గోంకర్ మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) మాజీ కార్యదర్శి బీకే సిన్హా ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘాన్ని నియమిస్తున్నట్లు ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపారు. వికాస్కు డోప్ పరీక్ష... ఈ క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ అనూహ్యంగా డోప్ పరీక్ష ఎదుర్కొన్నాడు. పోటీలు ముగిశాక బుధవారం తిరుగు పయనమైన అతడికి చివరి నిమిషంలో ఈ పరిస్థితి ఎదురైంది. ఇర్ఫాన్, రాకేశ్లతో పాటు మరో ఆటగాడిని పరీక్షించాలని కామన్వెల్త్ మెడికల్ కమిషన్ కోరడంతో వికాస్ను పంపినట్లు షిర్గోంకర్ తెలిపారు. అయితే... ఠాకూర్ ఎలాంటి పొరపాటు చేయనట్లు తేలిందన్నారు. -
ఇద్దరు భారత అథ్లెట్ల బహిష్కరణ
గోల్డ్కోస్ట్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న ‘కామన్వెల్త్ గేమ్స్-2018’ లో ముందునుంచి పకడ్బందీగా అమలవుతున్న ‘నో నీడిల్ పాలసీ’ (సిరంజీల వాడకం నిషేదం)ని ఉల్లంఘించారనే కారణంగా ఇద్దరు భారత అథ్లెట్లు బహిష్కరణకు గురయ్యారు. ఏవీ రాకేష్ బాబు, ఇర్ఫాన్ కొలొత్తమ్ థోడిల పైన కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) నిషేదం విధించింది. ఈ ఇద్దరూ క్రీడా గ్రామం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా భారత బృందానికి నేతృత్వం వహిస్తున్న విక్రం సిసోడియా, జట్టు మేనేజర్ నామ్దేవ్ శిర్గావంకర్, అథ్లెటిక్స్ మేనేజర్ రవీందర్ చౌదరీలపై కూడా సీజీఎఫ్ మండిపడింది. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని సీజీఎఫ్ ప్రెసిడెంట్ లూయిస్ మార్టిన్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా గ్రామంలో సిరంజీలు వాడొద్దనే నింబధనల్ని బహిష్కరణకు గురైన భారత అథ్లెట్లు ఉల్లంఘించారని సీజీఎఫ్ తెలిపింది. దీనిని తాము యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేదని, అయితే నీడిల్ ఉపయోగించకూడదన్న గేమ్స్ నిబంధనలను మాత్రం వీరు ఉల్లంఘించారని సీజీఎఫ్ తెలిపింది. ఒకవేళ డయాబెటిస్లాంటి వాటికోసం నీడిల్స్ ఉపయోగించాలనుకుంటే.. ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించింది. భారత ఆటగాళ్ల గదుల వద్ద వాడి పడేసిన సిరంజీలు బయటపడినపుడు తొలుత పెద్దగా పట్టించుకోని సీజీఎఫ్ కోర్టు.. ఈ విషయంపై పునర్విచారణచేపట్టి చర్యలు తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ నుంచి బహిష్కరణకు గురైన రాకేష్ బాబు ట్రిపుల్ జంప్లో, ఇర్ఫాన్ రేస్ వాక్లో పాల్గొనాల్సి ఉంది. -
ట్రాంపొలీనింగ్
చుట్టూ స్టీల్ ఫ్రేమ్, మధ్యలో ఫ్యాబ్రిక్ సెటప్ బిగించబడి ఉండే ఆట పరికరాన్ని ట్రాంపొలీన్ అంటారు. ట్రాంపొలీన్లో ఫ్యాబ్రిక్కు సాగే గుణం ఉండదు. దానికింద స్ప్రింగుల అమరికే ట్రాంపొలీన్కు ఆ గుణాన్ని తెచ్చిపెడుతుంది. ట్రాంపొలీన్ మీదకు ఎక్కి, ఎగురుతూ, గంతులేస్తూ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ఈ ఆటను ట్రాంపొలీనింగ్ అని, ట్రాంపొలీన్ జంప్ అని పిలుస్తారు. 1935లో లారీ గ్రిజ్వోల్డ్, జార్జ్ నిస్సెన్ ట్రాంపొలీన్ను కనిపెట్టారు. ఈరోజుకి ట్రాంపొలిన్ జంప్ దాదాపు అన్ని దేశాలకూ పరిచయమైంది. ట్రాంపొలీన్ అనే పేరు కూడా నిస్సెన్ పెట్టినదే. స్పానిష్ పదం నుంచి ఆయన ఈ పేరును కనిపెట్టాడు. మొదట్లో సరదాగా పిల్లలు ఆడుకునే ఈ ఆట కొన్ని దశాబ్దాల కాలంలో సీరియస్ గేమ్గా అవతరించింది. జిమ్నాస్టిక్స్ చేసే అథ్లెట్స్ ట్రాంపొలీనింగ్లో ప్రయోగాలు చేస్తూ ఆడతారు. 2000వ సంవత్సరంలో ఇది ఒలింపిక్స్లోకి కూడా ఎక్కింది. ఇప్పుడు ట్రాంపొలీనింగ్ ఒలింపిక్ గేమ్. డైవింగ్, స్కేటింగ్ చేసేవాళ్లు ట్రాంపొలీనింగ్ను తమ ఫిజికల్ ఫిట్నెస్ కోసం బాగా ఆడుతూంటారు. అంతరిక్ష్యంలో వ్యోమగాములు అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి, భూమ్మీద ఉన్నప్పటి నుంచే ట్రాంపొలీనింగ్లో శిక్షణ పొందుతుంటారు. -
‘కామన్వెల్త్’లో పాల్గొనే భారత అథ్లెట్లకు బీమా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత అథ్లెట్లకు రూ. 50 లక్షల చొప్పున జీవిత బీమా చేశారు. ఎడిల్వీజ్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ బీమా సదుపాయాన్ని కల్పించినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. సోమవారం ఐఓఏ భారత జట్టుకు స్పాన్సర్షిప్ చేస్తున్న సంస్థల వివరాలు వెల్లడించింది. ఎడిల్వీజ్ బీమా, ఆర్థిక సేవల కంపెనీ కామన్వెల్త్ గేమ్స్తో పాటు, ఆసియా గేమ్స్, టోక్యో ఒలింపిక్స్ (2020)లకూ భారత జట్టు ప్రధాన స్పాన్సర్గా కొనసాగుతోంది. గతంలో రియో ఒలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్లకు ఎడిల్వీజ్ సంస్థ రూ. కోటి బీమా చేసింది. ప్రముఖ వస్త్ర ఉత్పత్తుల సంస్థ రేమండ్స్ దుస్తులను స్పాన్సర్ చేయనుంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు స్పాన్సర్షిప్ సేవలందించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు రేమండ్స్ చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా తెలిపారు. కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి క్రీడాకారులకు చేయూతనివ్వాలని కోరారు. -
ఉత్తర కొరియా అథ్లెట్లకు కిమ్ బంపర్ ఆఫర్
-
బాహుబలులను పంపుతున్నాం: రష్యా
మాస్కో: ఒలింపిక్స్లో పతకాలు గెలవటంలో పోటీపడే దేశాలలో రష్యా ఒకటి. అయితే దక్షిణ కొరియాలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్లో రష్యా పాల్గొంటుందా లేదా అనేది సగటు క్రీడాభిమానులకు కలిగిన సందేహం. గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. శీతాకాల ఒలింపిక్స్లో రష్యా పాల్గొనటంపై ఎందుకింత చర్చ అనుకుంటున్నారా.. రియో ఒలింపిక్స్లో కొంత మంది ఆటగాళ్లు డోపింగ్లో పట్టుబడంటంతో రష్యా అపఖ్యాతి మూటగట్టుకుంది. దీంతో శీతాకాల ఒలింపిక్స్లో పాల్గొంటుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఒలింపిక్స్లో పాల్గొంటున్నామని రష్యా ప్రకటించింది. రష్యా ప్రకటనతో ఒలింపిక్ అభిమానుల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఎందుకంటే ఒలింపిక్లో రష్యా అథ్లెట్స్ ప్రదర్శన అలాంటిది. అథ్లెట్స్ సంఖ్య తగ్గినా పతకాలు తెచ్చే 169మంది బాహుబలులను పంపుతున్నామని రష్యా ప్రకటించింది. ఈ సంఖ్య గతంలో జరిగిన ఒలింపిక్స్ పోటీలకు పంపిన అథ్లెట్ల కంటే తక్కువే ఉంది. రియో ఒలింపిక్స్కి 232 మందిని, వాంకోవర్ ఒలింపిక్స్కి 177 మందిని పంపింది. రష్యా అథ్లెట్లను శీతాకాల ఒలింపిక్స్కి పంపకపోతే ఆ దేశ జెండా, జాతీయ గీతం ప్రదర్శనలో ఉండబోదని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ముందే హెచ్చరించింది. ఒలింపిక్స్ ప్యానెల్ నిర్వహించే డోపింగ్ పరీక్షలోనూ నెగ్గాలని, లేకపోతే ఆదేశం నిర్వహించిన పరీక్షలపై అనుమానాలు కలిగే అవకాశం ఉంటుందని ఐఓసీ తెలిపింది. -
స్టేడియంలో భార్య ఉందని...ఐపీఎస్ అధికారి..
సాక్షి, బెంగళూరు : పేరుకు పబ్లిక్ సర్వెంట్, కానీ చేసేందంతా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడమే. భార్య స్టేడియం లోపల ప్రాక్టీస్ చేస్తుండడంతో లోపల ఎవరూ ఉండరాదంటూ జాతీయ స్థాయి అథ్లెట్స్ ను బలవంతంగా బయటకు పంపించారంటూ ఒక ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కంఠీరవ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి జాతీయ అథ్లెట్స్ స్టేడియంకు చేరుకున్నారు. అదే సమయంలో కంఠీరవ స్టేడియం డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అనుపమ్ అగర్వాల్ భార్య స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండడంతో మిగతావారిని సిబ్బందితో కలసి స్టేడియం నుంచి బయటకు పంపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత్యంతరం లేని క్రీడాకారులు స్టేడియంకు సమీపంలోనున్న కబ్బన్పార్క్లో ప్రాక్టీస్ చేశారు. అంతేకాకుండా ఘటనపై క్రీడాకారులతో పాటు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు స్వీకరించరాదంటూ పోలీస్ స్టేషన్లకు సూచించినట్లు కూడా తెలిసింది. దీంతో ఘటనపై బాధితులు సంపిగె రామనహళ్లి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయబోగా స్వీకరించడానికి పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. అది అగర్వాల్ సొత్తేం కాదు : మంత్రి మధ్వరాజ్ ఈ ఘటనపై యువజన క్రీడాశాఖా మంత్రి ప్రమోద్ మధ్వరాజ్ కలబురిగిలో మీడియాతో మాట్లాడుతూ.. స్టేడియం ప్రభుత్వం సొత్తు కాదని, అధికారి అనుపమ్ అగర్వాల్ సొత్తు అంతకంటే కాదని ఘాటుగా అన్నారు. స్టేడియం కేవలం ప్రజల సొత్తని, ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. -
అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు
సాక్షి, న్యూఢిల్లీ : అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టోక్యో ఒలంపిక్స్, ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే క్రీడాకారులకు నెలకు 50 వేల రూపాయలను నెలసరి ఖర్చుల కింద చెల్లిస్తున్నట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శుక్రవారం ప్రకటించారు. అభినవ్ బింద్రా నేతృత్వం వహిస్తున్న ఒలంపిక్ టాస్క్ఫోర్స్ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులను సైతం ఆమోదించినట్లు ఆయన చెప్పారు. టార్గెట్ ఒలంపిక్స్ స్కీమ్ కింద 152 మంది క్రీడాకారులను ఎలైట్ ప్యానెల్లో చేర్చినట్లు రాథోడ్ చెప్పారు. ఎలైట్ప్యానల్కు ఎంపికైన 152 మంది క్రీడాకారులకు ఈ అవకాశం వర్తిస్తుందని అన్నారు. ఈ నెలసరి ఖర్చుల మొత్తాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్లో కూడా పేర్కొన్నారు. MYAS @IndiaSports announces Rs 50k/month pocket allowance for 152 elite athletes preparing for Tokyo/CWG/Asian Games. Athletes first,always! — Rajyavardhan Rathore (@Ra_THORe) 15 September 2017 The allowance applies wef 1 Sep 2017 & is purely for pocket expenses of elite athletes.Committed to providing all resources to our champions — Rajyavardhan Rathore (@Ra_THORe) 15 September 2017 -
అంతకంటే నీచం లేదు: బోల్ట్
లండన్:డోపింగ్ పాల్పడే అథ్లెట్లపై జమైకా స్ర్పింటర్ ఉసేన్ బోల్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. డోపింగ్ కు పాల్పడటమంటే ఆ క్రీడను నాశనం చేయడమనే విషయాన్ని వారు తెలుసుకోవాలని హితబోధ చేశాడు. డోపింగ్ కు పాల్పడటం కంటే నీచమైనది ఏదీ లేదని, దాన్ని ఆపితేనే గేమ్ ను బతుకుతుందన్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో భాగంగా రెండు విభాగాల్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన బోల్డ్.. డోపింగ్ అనేది క్రీడకు ఎంతమాత్రం మంచికాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నాడు. 'డోపింగ్ ను ఆపాలి. అప్పుడే క్రీడలకు సాయం చేసిన వారమవుతాం. డోపింగ్ కు పాల్పడటం కంటే నీచమైనది ఏదీ లేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ డోపింగ్ పాల్పడితే మాత్రం మన చేతులతోనే ఆయా క్రీడల్ని నాశనం చేసుకున్నట్లవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలని అథ్లెట్లకు సూచిస్తున్నా. మోసం చేయాలనే ప్రయత్నిస్తే ఏదొక రోజు మనం దొరక్కతప్పదు'అని బోల్డ్ హెచ్చరించాడు. శుక్రవారం నుంచి ఆరంభం కానున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో బోల్ట్ 100 మీటర్లు,4x100 మీటర్ల రేసులో పాల్గొనున్నాడు. ఈ చాంపియన్ షిప్ తరువాత బోల్ట్ తన కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడు. -
భారత జట్టులో రాష్ట్ర అథ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అథ్లెట్లు సుధాకర్, ప్రేమ్ ఆసియా అథ్లెటిక్ చాంపియన్షిప్లో పాల్గొనే జాతీయ జట్టుకి ఎంపికయ్యారు. భువనేశ్వర్లో జూలై 6 నుంచి 9 వరకు జరిగే ఈ చాంపియన్షిప్లో సుధాకర్ 4్ఠ400 మీ. విభాగంలో, ప్రేమ్ 110 మీ. హర్డిల్స్ విభాగంలో పోటీపడుతున్నారు. సుధాకర్ ఖమ్మం స్పోర్ట్స్ స్కూల్లో చదువుతుండగా.. ప్రేమ్ హైదరాబాద్లో ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ ఈ చాంపియన్షిప్లో భారత జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నారు. వీరు జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా తెలంగాణ క్రీడాశాఖ మంత్రి టి.పద్మారావు, స్పోర్ట్స్ సెక్రటరీ వెంకటేశం, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ‘శాట్స్’ ఎండీ దినకర్ బాబు ఆటగాళ్లను, కోచ్ను అభినందించారు. వారు తమ ప్రతిభతో రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తున్నారని.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం సుధాకర్, ప్రేమ్లతో పాటు కోచ్ రమేశ్కు లక్ష రూపాయల నజరానా ప్రకటించింది. ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి వీరిని అభినందిస్తూ.. ఈ చాంపియన్షిప్లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
అథ్లెటిక్స్కు కేరాఫ్ పాలమూరు
రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణిస్తున్న జిల్లా క్రీడాకారులు ఆరుసార్లు క్రాస్కంట్రీ ఓవరాల్ చాంపియన్షిప్ అథ్లెటిక్ ట్రైనింగ్తో ఉద్యోగవకాశాలు సరైన క్రీడావసతులు లేకున్నా జిల్లా అథ్లెట్లు పట్టుదల, క్రమశిక్షణతో సౌత్జోన్, రాష్ట్ర అథ్లెటిక్స్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు పతకాలపంట పండిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ టోర్నీ జరిగినా జిల్లా అథ్లెట్లదే హవా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా జిల్లా అథ్లెట్లు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో విశేషంగా రాణించారు. సబ్జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పతకాలు తీసుకొచ్చి సత్తాచాటుతున్నారు. పతకాలు తెస్తున్న క్రీడాకారుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఉండడం విశేషం. అథ్లెటిక్స్ శిక్షణతో కొంతమంది యువకులు ఆర్మీ ఉద్యోగాలతో పాటు బీపీఈడీ చేస్తున్నారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లాలోని క్రీడాకారులు సైతం ఇక్కడే శిక్షణ తీసుకుంటున్నారు. అందుకే జిల్లా అథ్లెటిక్స్కు కేరాఫ్గా మారుతోంది. – మహబూబ్నగర్ క్రీడలు క్రాస్కంట్రీలో డబుల్ హ్యాట్రిక్.. రాష్ట్రస్థాయి క్రాస్కంట్రీ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా అథ్లెట్లు వరుసగా ఆరుసార్లు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించి, డబుల్హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించారు. 2010లో తిరుపతి, 2011లో శ్రీకాకుళం, 2012లో మహబూబ్నగర్, 2013లో కరీంనగర్, 2014లో హైదరాబాద్ గచ్చీబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి క్రాస్కంట్రీ పోటీల్లో చాంపియన్గా అవతరించారు. ఈ పోటీల్లో అండర్–16, అండర్–18, అండర్–20 బాలుర విభాగాల్లో, అండర్–18, అండర్–20 విభాగాల్లో బాలికలు టీమ్ చాంపియన్షిప్లు సాధించారు. గతేడాది ఖమ్మంలో జరిగిన క్రాస్కంట్రీ పోటీల్లో కూడా మరోసారి ఓవరాల్ చాంపియన్షిప్ను పొందారు. అండర్–16 (బాలురు), అండర్–18 (బాలికలు), అండర్–20 (బాలురు, బాలికలు)విభాగాల్లో టీమ్ చాంపియన్షిప్లు సొంతం చేసుకుంది. అథ్లెటిక్స్ మీట్లో పతకాలు.. రెండేళ్లలో జిల్లా అథ్లెట్లు మెరుగైన ప్రతిభ కనబరిచారు. గతేడాది జూనియర్ మీట్లో రెండు బంగారు, మూడు రజతం, నాలుగు కాంస్య పతకాలు పొందారు. వరంగల్లో జరిగిన పోటీల్లో 10 బంగారు, 11 రజతం, 9 కాంస్య, ఈ ఏడాది మే నెలలో ఖమ్మంలో జరిగిన యూత్ పోటీల్లో 8 బంగారు, 1 రజతం, 3 కాంస్య పతకాలు సాధించారు. రెండేళ్లలో ఆర్మీలో ఉద్యోగాలు పొందినవారు.. రెండేళ్ల కాలంలో పలువురు అథ్లెట్లు ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించారు. అశోక్, సురేశ్(కూచూర్), శేఖర్, అనిల్, రజాక్, నితీష్, శ్రీకాంత్, భగవాన్, రాజశేఖర్, ఖాసీం, మల్లేష్ (మహబూబ్నగర్), కాంతారావు (గాజులపేట), హర్యా (ఖిల్లాఘనపురం) ఆర్మీలో చేరారు. ఇటీవల జిల్లా స్టేడియంలో నిర్వహించిన పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో 70మందికి 60మంది అథ్లెట్లు ఉత్తీర్ణత సాధించారు. ప్రతి ఏడాది పది మంది అథ్లెట్లు బీపీఈడీ కోర్సు చేస్తున్నారు. అథ్లెటిక్స్తోనే ఎంపీఈడీలో సీటు అథ్లెటిక్స్ లాంగ్జంప్లో రాష్ట్ర. జాతీయస్థాయిల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. 30రాష్ట్రస్థాయి, 15 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. 2013 మధురైలో జరిగిన నేషనల్ మీట్లో రజతం, 2014 చెన్నై మీట్లో కాంస్య పతకాలు గెలిచాను. గతేడాది మంగళూరు ఆలిండియా యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్నా. డిగ్రీలో నిజాం కళాశాలలో అథ్లెటిక్స్లో సాధించిన పతకాలతోనే సీటు లభించింది. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో ఎంపీఈడీ చేస్తున్నాను. – ధర్మేందర్, కొత్తపేట ఆర్మీలో ఉద్యోగం.. సంతోషం చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. సీనియర్ క్రీడాకారుల ప్రోత్సాహంతో అథ్లెటిక్స్ ఎంచుకున్న. 2012 ఆర్మీలో ఉద్యోగం సంపాదించా. నా జీవితానికి అథ్లెటిక్స్ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఆర్మీ సివిల్ సర్వీసెస్కు అథ్లెటిక్స్ క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. – అశోక్, కూచూర్ దాతలు సహకారం అవసరం జిల్లాలో నైపుణ్యం గల అథ్లెట్లు ఉన్నారు, దాతలు ప్రోత్సహిస్తే వారు భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధిస్తారు. క్రాస్కంటీ పోటీలకు ప్రతిసారి జిల్లా అథ్లెట్లకు ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నాం. క్రీడలకు ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయాలి. జిల్లా అథ్లెట్లను జాతీయ, అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – రాజేంద్రప్రసాద్, జిల్లా అథ్లెటిక్ సంఘం ప్రధాన కార్యదర్శి ఏషియన్స్ గేమ్స్లో ఆడడమే లక్ష్యం 15జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నాను. గతేడాది కేరళ రాష్ట్రం త్రివేండం జరిగిన నేషనల్ గేమ్స్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాను. 2012లో హైదరాబాద్లో జరిగిన ఒలింపిక్ ట్రయల్ మీట్లో 4 ్ఠ400మీ. రిలేలో కాంస్య పతకాన్ని సాధించాడు. 2009 నుంచి 2014 హైదరాబాద్లో శాయ్ శిక్షణ తీసుకున్న. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఫెడరేషన్కప్లో ఆడాను. భవిష్యత్లో ఏషియన్గేమ్స్లో ఆడడమే తన లక్ష్యమంటున్నాడు రవికుమార్. – రవికుమార్, దామరగిద్ద స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమే లక్ష్యం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సా«ధించడమే తన లక్ష్యం. హైదరాబాద్లో నేటినుంచి జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో పాల్గొంటున్నాను. ఇందులో కచ్చితంగా బంగారు పతకం సాధిస్తా. ఐదేళ్ల నుంచి జిల్లా స్టేడియంలో అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంటున్నా. 3 జాతీయ, 8 రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాల్గొన్నాను. – భవ్యా, మహబూబ్నగర్ -
పారా అథ్లెట్లకు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: రియో పారాలింపిక్స్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లు గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. పతకాలు సాధించిన నలుగురు ఆటగాళ్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘పారాలింపిక్స్లో దేశం గర్వించే విధంగా చేసిన అథ్లెట్లను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే ప్రతీ అథ్లెట్తో ఆయన ఫొటో దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 19 మందితో కూడిన బృందం రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం సాధించిన విషయం తెలిసిందే -
ఈ 'స్ఫూర్తి' సరిపోదా ...మనం గెలవడానికి
భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఎందుకిచ్చాడు...? అనుకుంటూ నిద్రలేచే వాళ్లు కోకొల్లలు. అసలు నాకు అదృష్టమే లేదు... ఏ చిన్న వైఫల్యం ఎదురైనా బాధపడేవాళ్లు కొందరు. మా నాన్న నాకు ఇంకొంచెం ఇచ్చి వుంటేనా...! నేనంటే ఏంటో చూపించేవాడిని...! ఇలా తృప్తిపడేవాళ్లు మరికొందరు. అమ్మ నచ్చిన టిఫిన్ చేసి పెట్టలేదని ఎగిరేవాడొకడు... నాన్న స్పోర్ట్స బైక్ కొనివ్వలేదని అలిగేవాడు ఇంకొకడు... ఉద్యోగం రావడం లేదని వ్యవస్థనే ద్వేషించేవాడు వేరొకడు... టీవీ రిమోట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకునేవాడొకడు... వీళ్లంతా ఎవరు..? మనం... అవును మనమే. మనలోనే చాలామంది నిత్యం అసంతృప్తితో రగిలిపోతూ... బద్దకంగా రోజులు గడుపుతూ... విధిని తిట్టుకుంటూ... నిస్సారంగా ‘బతికేస్తున్నాం’. ఇలాంటి ‘మనం’ అందరం వీళ్లని చూసి స్ఫూర్తి పొందుదాం. ఏదో ఒక లోపంతోనో, విధి వైపరీత్యం వల్లో వైకల్యం పొందిన వీళ్లంతా ప్రపంచానికి స్ఫూర్తిని ఇస్తున్నారు. రియోలో పారాలింపిక్స్ వేదికగా తమ అద్భుత విన్యాసాలతో, పోరాటపటిమతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నారు. రెండు చేతులూ లేకపోయినా నోటితో బ్యాట్ పట్టుకుని టేబుల్ టెన్నిస్ ఆడే యోధుడు ఒకరు... రెండు కాళ్లూ లేకపోయినా బ్లేడ్లతోనే రాకెట్ వేగంతో పరిగెత్తే అథ్లెట్ మరొకరు... తనకంటే మూడింతలు పొడవున్న ‘ఈటె’ను అల్లంత దూరం విసిరే వీరుడు ఇంకొకరు... ఒక్కరా... ఇద్దరా... 4,350 మంది అథ్లెట్లు రియో వేదికగా ‘గెలుస్తున్నారు’. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దుగా ఎదగొచ్చని నిరూపిస్తున్నారు. ప్రపంచాన్ని గెలిచేందుకు కావలసిన ‘స్ఫూర్తి’ని ఇస్తున్నారు. వాళ్లకు సలామ్ చేసి ఊరుకుందామా..! వాళ్ల స్ఫూర్తితో మనం కూడా గెలుద్దామా..! -
జీవితమే ఒక ఆట
క్రీడారంగంలో రాణించడమే వారి లక్ష్యం. అదే వారి స్వప్నం. అహర్నిశలు శ్రమించి క్రీడా మెళకువలు నేర్చుకొని.. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా జిల్లా క్రీడాకారులకు గుర్తింపు దక్కడం లేదు. పతకాల పంట పండించినా.. ప్రశంసా పత్రాలు కైవసం చేసుకున్నా వారికి కించిత్తు ప్రోత్సాహం కూడా సర్కారు వైపు నుంచి లభించడం లేదు. దీంతో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు స్వయం ఉపాధి బాటలో పయనిస్తున్నారు. ఇంకొంతమంది వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారి క్రీడా ప్రస్థానంపై ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు స్వయం ఉపాధి బాటలో కొందరు, కూలీ పనులకు ఇంకొందరు.. నేడు జాతీయ క్రీడా దినోత్సవం పాన్షాప్ నడుపుకుంటూ.. మహబూబాబాద్ : మానుకోటకు చెందిన ఆ క్రీడాకారుడి పేరు అక్తర్ పాషా. ఖోఖో మైదానంలో చిరుతలా రయ్మని దూసుకుపోయే వేగం ఆయనకు సొంతం. అనన్య సామాన్యమైన క్రీడా నైపుణ్యాలున్నా సర్కారు చేదోడు మాత్రం అందలేదు. దీంతో పాన్షాప్ నడుపుతూ స్వయం ఉపాధిని పొందుతున్నారాయన. జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో 12 సార్లు పాల్గొని ప్రతిభ కనబరిచారాయన. 1989 సంవత్సరంలో జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. 1993లో మధ్యప్రదేశ్లో జరిగిన 38వ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1996లో తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో, అదే ఏడాది అక్కడే జరిగిన సీనియర్ సౌత్జోన్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్ని కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారాయన. 1995, 1996, 1997 సంవత్సరాల్లో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొన్నారు. నడక పోటీలు, లాంగ్జంప్లోనూ.. కడపలో జరిగిన 5 కిలోమీటర్ల నడక పోటీల్లో తృతీయ బహుమతిని సాధించారు అక్తర్పాషా. వరంగల్లో నిర్వహించిన 200 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతిని సాధించారు. వరంగల్లో నిర్వహించిన లాంగ్జంప్ పోటీల్లో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. డిగ్రీ (బీఏ) పూర్తి చేసిన ఆయనకు అనంతర కాలంలో క్రీడారంగంలోని ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు లభించలేదు. దీంతో తొర్రూరు బస్టాండ్లో పాన్షాప్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఆయన కుమారుడు అఫ్రోజ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమార్తె సమ్రీన్ 9వతరగతి చదువుతోంది. తనకు మెుండిచెయ్యి చూపిన క్రీడలపై తన పిల్లలు దృష్టిసారించకుండా ఆయన చూస్తున్నారు. చదువులపై ఎక్కువ శ్రద్ధపెట్టాలని తమ పిల్లలకు ఆయన సూచిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా.. కేసముద్రం : ‘క్రీడలు వద్దు.. చదువులే ముద్దు’ అని తల్లిదండ్రులు, తోటివారు స్వర్ణలతకు చెప్పారు. ఆమె ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న సమయమది. ఎవరు ఎన్ని చెప్పినా.. ఆమె తనకు ఇష్టమైన క్రీడ తైక్వాండోపై ఆసక్తిని మాత్రం తగ్గించుకోలేదు. అందులో క్రీడా నైపుణ్యాలను పెంచుకుంటూ జాతీయస్థాయిలో పోటీల్లో ప్రతిభ కనబరిచేలా ఎదిగింది. అనంతర కాలంలో ఆమె ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు సైతం తమ ఆలోచనా ధోరణిని మార్చుకున్నారు. అప్పు చేసి మరీ డబ్బులు తెచ్చి తన కుమార్తె క్రీడా పోటీలకు వెళ్లేందుకు డబ్బులు ఇచ్చేవారు. స్వర్ణలతలోని క్రీడా స్ఫూర్తి ఓ వైపు.. కన్నబిడ్డకు చేదోడునిచ్చేందుకు అప్పులు చేసేందుకు సిద్ధమైన తల్లిదండ్రులు రాజబోయిన వెంకన్న, అరుణల ప్రోత్సాహం మరోవైపు. ఇవన్నీ వెరసి రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో స్వర్ణలత ఓ మెరుపై మెరిసింది. ఆమెలోని ప్రతిభను గుర్తించి కేసముద్రం విలేజ్లోని శ్రీవివేకవర్ధిని స్కూల్ కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ స్వర్ణలతను ప్రోత్సాహించారు. తన పాఠశాలలో 9,10 తరగతులను చదివించారు. ఇదే సమయంలో కేసముద్రం స్టేషన్లో తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిక్షణా శిబిరం, ప్రతి ఆదివారం నిర్వహించే శిబిరాలకు ఆమె హాజరయ్యేది. ఈ శిక్షణతో పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం ఆమె వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటూనే, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తండ్రికి ఇటీవలæనడుము నొప్పితో ఆపరేషన్ జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతను స్వర్ణలత పంచుకుంటోంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం కేసముద్రం స్టేషన్ పరిధిలోని జెడ్పీఎస్ఎస్లో నిర్వహించే క్రీడా శిబిరానికి హాజరై విద్యార్థులకు తైక్వాండోపై అవగాహన కల్పిస్తోంది. ప్రైవేట్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా.. డోర్నకల్ : డోర్నకల్కు చెందిన మండలోజు సుధాకర్ దశాబ్ద కాలంగా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో విశేషంగా రాణిం చాడు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో గార్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అతి తక్కువ వేతనంతో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేస్తున్నారు. డోర్నకల్లో వ్యాయామశాల నిర్వహిస్తూ ఉత్సాహవంతులైన యు వతీ యువకులకు వెయిట్ లిఫ్టిం గ్లో శిక్షణ ఇస్తున్నారు. కూలీ పనులే దిక్కాయె.. నర్సింహులపేట : 12 సార్లు జాతీయ స్థాయి, 50 సార్లు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు మండలంలోని కొమ్ములవంచకు చెందిన తాళ్ల శ్రీలత. ఆయా టోర్నమెంట్లలో ప్రతిభ కనబర్చి పలు మెడల్స్, ప్రశంసా పత్రాలను ఆమె కైవసం చేసుకున్నారు. అయినా సర్కారు చేదోడు మాత్రం అందలేదు. హైదరాబాద్ నగరంలోని దోమలగూడలో ఉన్న ఓ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయ కోర్సు(బీపీడీ) పూర్తి చేశారు శ్రీలత. ఆ పట్టా ఆధారంగా ఆమెకు నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా కొంతకాలం పనిచేశారు. అయితే అతి తక్కువ వేతనం లభిస్తుండటంతో ఆ పనికి వెళ్లడం లేదు. ప్రస్తుతం కూలీ పనులకు వెళ్తూ ఉపాధి పొందుతోంది శ్రీలత. తమ కుమార్తెకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఆమె తల్లిదండ్రులు యాకయ్య, లక్ష్మి కోరుతున్నారు. కబడ్డీ రంగన్నకు కరువైన ప్రోత్సాహం కురవి : అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినా ఆ క్రీడాకారుడికి ప్రభుత్వ ప్రోత్సాహం మాత్రం అందనే లేదు. మైదానంలోకి దిగగానే పాయింట్ల పట్టిక పరుగులు తీయించే క్రీడా నైపుణ్యం ఉన్నా.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. సర్కారు పట్టించుకోనితనం ఓ వైపు.. చిమ్మచీకటిలా చుట్టుముట్టిన పేదరికం మరోవైపు ఆవరించినా చెక్కుచెదరని ఆత్మసై్థర్యంతో వ్యవసాయ పనులు చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు జెర్రిపోతుల రంగన్నగౌడ్. ఆయన కురవి మండలంలోని చింతపల్లివాసి. పాఠశాల స్థాయి నుంచే క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచారాయన. ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడవడంతో అనంతర కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దూసుకుపోయారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయ క్రీడా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఈక్రమంలో ఎన్నో బహుమతులను కైవసం చేసుకున్నారు. సీనియర్ క్రీడాకారుడు అజీజ్ఖాన్ శిష్యరికంలో రంగన్న కబడ్డీలో రాటుదేలారు. ఆ క్రీడలో ఆల్రౌండర్గా పేరు గడించారు. తాను ఎంతో ఇష్టపడిన క్రీడా రంగంలో అవకాశాలు దరిచేరకున్నా.. సొంతూరు మాత్రం రంగన్నకు రాజకీయ రంగంలో ఓ అవకాశాన్ని కల్పించింది. దీంతో చింతపల్లికి సర్పంచ్గా ఐదేళ్లపాటు అంకితభావంతో సేవలు అందించారు. జీవిత పయనంలో అందరికీ ఆదర్శంగా ఉండేలా ఓ గిరిజన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కొబ్బరి బోండాలు అమ్ముతూ.. మడికొండ : నాడు కుంగ్ఫూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన నల్ల రామకృష్ణ, నేడు కుటుంబ పోషణ కోసం కొబ్బరిబోండాలు అమ్ముతున్నారు. స్వయం ఉపాధిని నమ్ముకొని స్ఫూర్తిదాయకంగా ముందుకుసాగుతున్నారు. 1986లో కుంగ్ఫూలో మెళకువలు నేర్చుకున్న ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటారు. 1987లో హైదరాబాద్ హెచ్సీఎల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్ఫూ పోటీల్లో రెండో స్థానంలో నిలిచాడు. 1988లో వైజాగ్లోని గాజువాకలో జరిగిన కుంగ్ఫూ పోటీలో మొదటిస్థానంలో నిలిచారు. 1990లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బ్రౌన్బెల్ట్ విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. 1996లో బ్లాక్ బెల్ట్లో మూడో డిగ్రీని పూర్తి చేశారు రామకృష్ణ. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం దక్కకపోవడంతో ఉన్నత స్థాయి పోటీల్లో ఆయన పాల్గొనలేకపోయారు. బాధ్యత మరిచిన క్రీడా సంఘాలు వరంగల్ స్పోర్ట్స్ : దశాబ్దాల క్రితమే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఘనుడాయన. భారత జాతీయ క్రీడ హాకీ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన క్రీడాకెరటం ఆయన. అంతర్జాతీయ క్రీడా వేదికల్లో మన దేశానికి ఎన్నెన్నో పతకాలు, అపురూప విజయాలను సాధించిపెట్టిన ధ్యాన్చంద్ను భారత జాతి మరిచిపోలేదు. నేడు(సోమవారం) ఆయన జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్రీడా సంఘాలలో విబేధాలు ఏర్పాడ్డాయి. ఎక్కువ సంఖ్యలో క్రీడాసంఘాలు రెండుగా చీలిపోయి కొనసాగుతున్నాయి. ఒలింపిక్ సంఘంలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దీంతో అసలు సంఘం మాదేనంటే మాదే అంటూ ఆయా వర్గాలు ప్రకటించుకుంటున్నాయి. అంతే కానీ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని తమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడంపై వారు దృష్టిసారించడం లేదు. పాఠశాలల వార్షికోత్సవాలు, పండుగలకు సైతం ఆటల పోటీలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాంటిది ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా కనీసం రెండు రోజులైనా జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తే బాగుండు అనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. ధ్యాన్చంద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ప్రపంచ స్థాయిలో భారత్ పేరు ప్రఖ్యాతులను నిలబెట్టిన క్రీడా దిగ్గజం ధ్యాన్చంద్ విగ్రహాన్ని హన్మకొండలోని జేఎన్ఎస్లో ఏర్పాటు చేయాలి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సీనియర్ క్రీడాకారులను సన్మానించాలి. ఇందుకోసం జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కృషిచేయాలి. ఈవిషయంలో కలెక్టర్ చొరవ చూపాలి. – రాజనాల శ్రీహరి, శాప్ మాజీ డైరెక్టర్ నేడు జేఎన్ఎస్లో క్రీడాపోటీలు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు(సోమవారం) హన్మకొండలోని జేఎన్ఎస్లో హాకీ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నాం. ఉదయం క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాలతో ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందరూ హాజరుకావాలి. – ఇందిర, డీఎస్డీఓ క్రీడాకారులను సన్మానించాలి గతంలో స్పోర్ట్స్ డే సందర్భంగా ఆర్డీడీ సారయ్య హయాంలో జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన జిల్లా క్రీడాకారులను సన్మానించేవాళ్లం. అంతేకాకుండా సన్మాన వేదిక నుంచే క్రీడాకారులకు స్పోర్ట్స్ స్కాలర్షిప్ను ఇచ్చేవారు. ఈ ఆనవాయితీ తర్వాత కాలంలో కొనసాగకపోవడం బాధాకరం. – మంచిక అభినయ్ వినయ్కుమార్, సాఫ్ట్బాల్ జాతీయ క్రీడాకారుడు -
పతకాలు తేలేదుగా... గనుల్లో పనికెళ్లండి!
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరి యా నియంత కిమ్ జాంగ్ వున్ గురించి ప్రపంచానికి తెలిసిందే. తాజాగా ఆయన బాధితుల జాబితాలో ఆ దేశ అథ్లెట్లు చేరారు. ఒలింపిక్స్ కు వెళ్లే ముందు ఐదు స్వర్ణాలతో సహా 17 పతకాలు తేవాలని ఆజ్ఞాపించారు. కానీ ఆ దేశ అథ్లెట్లు రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు మాత్రమే తెచ్చారు. దీనికి తోడు దాయాది దేశం దక్షిణ కొరియా చేతిలో కొన్ని ఈవెంట్లలో ఓడిపోయారు. దీంతో కిమ్కు కోపమొచ్చింది. పతకాలు తేని అథ్లెట్లంతా వెళ్లి బొగ్గు గనుల్లో పని చేయాలని ఆదేశించారు. -
క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఎమ్మెల్యే అరూరి రమేష్ నవోదయ క్లస్టర్ బాల్గేమ్స్ ప్రారంభం మామునూరు : రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తోందని, క్రీడాభివృద్ధికి బడ్జెట్లో రూ.120కోట్లు కేటాయించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. హన్మకొండ మండలం మామునూరు నవోదయ విద్యాల యం క్రీడామైదానంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో జరిగే అండర్–14, 17, 19 బాలబాలికల క్లస్టర్ బాల్గేమ్స్ పోటీలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరై క్రీడా పతాకా న్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర స్థాయి నవోదయ క్లస్టర్ గేమ్స్ ఫుట్బాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, షటిల్, బాడ్మిం టన్, వాలీబాల్ క్రీడాపోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ఎదిగి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. నవోదయ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు వెలకితీయాలని సూచించారు. ఇచ్చిన హామీ మేరకు నవోదయ విద్యాలయంలో విద్యార్థు లు శీతాకాలంలో వేడినీటితో స్నానం చేసేం దుకు సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం తొమ్మిది జిల్లాల నవోదయ విద్యాలయాల నుంచి చేరుకున్న క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. అంతకుముందు మెుక్కలు నాటారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు కేదారిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించారు. నవోదయ యాజమాన్యం, విద్యార్థులు ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు ఆయన చిత్రపటం, మోమెంటోను అందజేసి సన్మానించా రు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు జలగం రంజి త్, పోశాల సదానందం, ఇళ్ల నాగేశ్వర్రావు, ఊకంటి వనంరెడ్డి, మాచర్ల కోమారస్వామి, బి.జయశంకర్, శ్రీనివాస్రెడ్డి, కుసుమ సతీష్, మేకల సూరయ్య, ఇనుగోల జోగిరెడ్డి, జిల్లా నవోదయ బాలబాలికలు, కోచ్లు, బెటాలియన్ డీఎస్పీ రవికుమార్, రంగరాజు ప్రకాశ్, ఫార్మసిస్ట్ జలగం రమేష్ పాల్గొన్నారు. -
‘డైవ్’ కొట్టింది... గోల్డ్ పట్టింది
మహిళల 400 మీటర్ల ఫైనల్... రేసు హోరాహోరీగా సాగుతోంది... ఇద్దరు అథ్లెట్లు పోటాపోటీగా పరిగెడుతున్నారు. ఎవరైనా గెలవొచ్చు. ఎవరు గెలిచినా అరక్షణం కూడా తేడా ఉండదు... చూస్తున్న వాళ్లంతా ఉత్కంఠతో సీట్లలోంచి లేచారు. ఫినిషింగ్ లైన్కు ఇద్దరూ దగ్గరకొచ్చారు. అప్పుడు జరిగింది... ఎవరూ ఊహించని ఆ సంఘటన. బహమస్ క్రీడాకారిణి షానీ మిల్లర్ ఒక్కసారిగా ముందుకు డైవ్ చేసింది. స్వర్ణం ఎగరేసుకుపోయింది. రియో డి జనీరో: ఒలింపిక్స్ వేదికగా అథ్లెటిక్స్లో అసాధారణ దృశ్యం కనిపించింది. విజయం కోసం ఎలాగైనా, ఏమైనా చేస్తాను అన్నవిధంగా బహమస్ అథ్లెట్ షానీ మిల్లర్ వ్యవహరించింది. లక్ష్యానికి రెండు అడుగుల దూరం ఉందనగా... ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె ముందుకు డైవ్ చేసి లక్ష్యాన్ని దాటింది. 49.44 సెకన్లలో 400 మీటర్ల రేసును ముగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అలీసన్ ఫెలిక్స్ (అమెరికా-49.51 సెకన్లు) రజతం... షెరిస్కా జాక్సన్ (జమైకా-49.85 సెకన్లు) కాంస్యం సాధించారు. ‘రేసు చివరికొచ్చేసరికి నాకేమైందో తెలి యదు. నేనైతే స్వర్ణ పతకం గురించే ఆలోచిస్తూ బరిలోకి దిగాను. తేరుకొని చూసేలోగా ట్రాక్పై పడి ఉన్నాను’ అని 22 ఏళ్ల షానీ మిల్లర్ వ్యాఖ్యానించింది. మామూలుగా స్కూల్ పిల్లల రేసుల్లో ఇలాంటివి కనిపిస్తాయేమోగానీ... ఒలింపిక్స్ వేదికపై గతంలో ఎవరూ ఇలా చేసిన దాఖలా లేదు. మిల్లర్ శైలి కరెక్ట్ కాదనే విమర్శలు వచ్చి నా... నిబంధనలకు ఇది విరుద్ధమేమీ కాదు. స్వర్ణంతో ముగించిన బైల్స్ అమెరికా మహిళా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ నాలుగో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఫైనల్లో బైల్స్ 15.966 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే బ్యాలెన్సింగ్ బీమ్లో మాత్రం బైల్స్కు నిరాశ ఎదురైంది. విన్యాసం చేస్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయిన బైల్స్ రెండు చేతులతో బీమ్ను పట్టుకుంది. తుదకు ఈ అమెరికా స్టార్ జిమ్నాస్ట్ (14,733 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. స్యానీ వెవెర్స్ (నెదర్లాండ్స్-15.466 పాయింట్లు) స్వర్ణం, లారెన్ హెర్నాండెజ్ (అమెరికా-15.333 పాయింట్లు) రజతం దక్కించుకున్నారు. టీమ్, ఆల్రౌండ్, వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగాల్లో బైల్స్కు పసిడి పతకాలు లభించాయి. రెజ్లర్ లోపెజ్ ‘హ్యాట్రిక్’... పురుషుల గ్రీకో రోమన్ రెజ్లింగ్లో క్యూబా సింహబలుడు మిజైన్ లోపెజ్ మునెజ్ దిగ్గజాల సరసన చేరాడు. సూపర్ హెవీవెయిట్ (130 కేజీలు) విభాగంలో వరుసగా మూడు ఒలింపిక్స్లలో స్వర్ణాలు నెగ్గిన రెండో రెజ్లర్గా గుర్తింపు పొందాడు. ఇంతకుముందు అలెగ్జాండర్ కరెలిన్ (రష్యా) మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఫైనల్లో లోపెజ్ మునెజ్ 6-0తో రిజా కయాల్ప్ (టర్కీ)పై విజయం సాధించాడు. తొలి 15 సెకన్లలో కయాల్ప్ను ఎత్తి కిందకు పడేయడంతో లోపెజ్కు ఒకేసారి నాలుగు పాయింట్లు లభించాయి. ఆ తర్వాత కూడా లోపెజ్ తన ప్రత్యర్థికి ఏమాత్రం తేరుకునే అవకాశం ఇవ్వలేదు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్లోనూ లోపెజ్కే స్వర్ణాలు లభించాయి. ఓవరాల్గా ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో అత్యధికంగా మూడు స్వర్ణాలు చొప్పున నెగ్గిన రెజ్లర్లు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. -
ధైర్యం కోల్పోవద్దు: మోదీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు మద్దతుగా నిలవాలంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన విజ్ఞప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రియోకు వెళ్లిన అథ్లెట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని మోదీ హితవు పలికారు. జీవితంలో గెలుపు-ఓటములు అనేవి సహజమని, దానిపై ఆలోచించకుండా మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించాలని మోదీ పేర్కొన్నారు. 'రియోలో భారత అథ్లెట్లకు ఒకటే విన్నవిస్తున్నా. ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలితం గురించి ఆలోచించకుండా ప్రదర్శన ఇవ్వండి. మన అథ్లెట్ల ఇప్పటివరకూ పతకం తేలేకపోయినా, వారి ప్రదర్శన గర్వించే విధంగా ఉంది. ఫలితం కోసం ఆలోచించి అదనపు భారాన్ని వేసుకోవద్దు. ఓర్పు, అంకితభావం, పట్టుదల అనేది మాత్రమే ఇక్కడ ప్రధానం. అప్పుడే మనల్ని నిరూపించుకునే ఆస్కారం ఉంది' అని మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మద్దతు తెలిపారు. -
క్రీడాకారులకు ప్రోత్సాహం
సదాశివపేట: క్రీడాకారులకు తాను చేయూతనిస్తానని ఎమ్మెల్యే చింతా ప్రబాకర్ పేర్కొన్నారు.ఇటీవల నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ ఆసోసియేషన్్ క్రీడా పోటీల్లో రెండొందల మీటర్ల రన్నింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన సదాశివపేట పాతకేరికి చెందిన అంజుమ్ని శనివారం ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంజుమ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతునే నేపాల్లో జరిగిన 200 మీటర్ల పరుగుపందెంలో గోల్డ్మెడల్ సాధించడం గర్వంగా ఉందన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తాన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, కౌన్సిలర్ చింతా గోపాల్, మండల కోఆప్షన్ మెంబర్్ సలావుద్దిన్, పట్టణ టీఆర్్ఎస్ ప్రధాన కార్యదర్శి చిన్న, నాయకులు పట్నం సుభాశ్, షేజ్జీ, నల్ల శంకర్, అంజనేయులు, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. -
పతకాలే కాదు... హృదయాలూ గెలవండి!
ప్రధాని మోదీ ఆకాంక్ష రియో అథ్లెట్లకు పీఎం ‘బెస్టాఫ్ లక్’ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో భారత ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో పతకాలు సాధించడంతో పాటు ఇతర దేశాల అథ్లెట్ల మనసులు కూడా గెలుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కేవలం మైదానంలోనే కాకుండా ప్రతీ చోటా భారత ఆటగాళ్లను ప్రపంచం చూస్తుందని, తమ ప్రవర్తనతో వారు ఆకట్టుకోవాలని ఆయన అన్నారు. ‘భారత అథ్లెట్లు ఎక్కడికి వెళ్లినా వారిపై అందరి దృష్టి ఉంటుంది. పతకాలతో పాటు పక్కవారి మనసులు కూడా మనవాళ్లు గెలుస్తారని, భారత జాతి వారసత్వ సంపద గురించి ప్రపంచానికి చాటుతారని నాకు నమ్మకముంది. మీ వెంట 125 కోట్ల మంది ఉన్నారు. దేశం 70వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయంలో రియోలో కూడా మన జెండా గర్వంగా ఎగరాలి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చేందుకు ‘రన్ ఫర్ రియో’ పేరుతో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రియోలో భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారని... 2020 టోక్యో ఒలింపిక్స్లో ఈ సంఖ్య కనీసం 200కు చేరేలా ప్రభుత్వం అన్ని విధాలా మద్దతిస్తుందని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం రూ. 125 కోట్ల భారీ మొత్తం కేటాయించిందని, క్రీడల్లో పాల్గొనే సమయంలో తొలిసారి ఆటగాళ్లకు కూడా అధికారులతో సమానంగా రోజూవారీ అలవెన్స్లు అందిస్తున్నట్లు మోదీ గుర్తు చేశారు. గత ఒలింపిక్స్లలో భారత ప్రదర్శన, ఈసారి పాల్గొంటున్న ఆటగాళ్ల వివరాలతో కూడిన ప్రత్యేక బ్రోచర్ను ఈ సందర్భంగా విడుదల చేసిన చేసిన ప్రధాని... ఆటగాళ్లకు దేశం తరఫున అభినందనలు పంపడంలో ‘పోస్ట్మాన్’ తరహా బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. -
ఒలింపిక్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలి
మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత కొత్తగూడెం అర్బన్ : ఒలింపిక్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని శిక్షణ పొందాలని మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత సూచించారు. ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ మోడల్ స్కూల్ సౌజన్యంతో జిల్లా సబ్ జూనియర్, జూనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు స్థానిక ప్రకాశం స్టేడియంలో శుక్రవారం జరిగాయి. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పులి గీత ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా నలుమూలాల నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులున్నారని, రానున్న కాలంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు కొత్తగూడెంలో నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహిధర్ మాట్లాడుతూ జిల్లా మీట్లో ప్రతిభ ఆధారంగా ఆగస్టు నెలలో హైదరాబాద్, మహబూబ్నగర్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. ఈ చాంపియన్షిప్కు జిల్లా నలుమూలల నుంచి 1,700 మంది పాల్గొన్నారని, 80 అంశాల్లో క్రీడా పోటీలను నిర్వహించామని చెప్పారు. కాగా, షాట్పుట్లో మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్న వారు ప్రతాప్, అఖిలేష్, రాజారెడ్డి, బాలికల విభాగంలో లేఖన, అర్చిత, విజ్ఞేశ్వరి ఉన్నారు. 600 మీటర్ల రన్నింగ్లో సూర్య, వినోద్, సుమంత్, బాలికల విభాగంలో మిథిలా, కృపావతి, పూజిత గెలుపొందారు. 100 మీటర్ల రన్నింగ్ పోటీలో సాయివంశీ, చరణ్, సాయిలు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జివికె.మనోహర్, గౌతమ్ మోడల్ స్కూల్ చైర్మన్ దోసపాటి కార్తీక్, స్కూల్ డీన్ ప్రవీణ్కుమార్, ప్రిన్సిపాల్ గుండేటి లక్ష్మీనారాయణ, ఏఓ నాగరత్నం, ఇన్చార్జ్ శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ ది మీట్ శివకుమార్, కన్వీనర్ తరుణ్, పవర్ లిఫ్టింగ్ కార్యదర్శి మల్లేష్, జిల్లా హాకీ కార్యదర్శి ఇమామ్, జిల్లా అథ్లెటిక్స్ జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, టెక్నికల్ అఫిషియల్స్ పాల్గొన్నారు. -
మన ఘనతపై మచ్చ
ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ నుంచి ఏకంగా 120 మంది క్రీడాకారులు రియో ఒలింపిక్స్కు వెళుతున్నారని సంబరపడ్డాం. దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడం, ప్రభుత్వం కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుండటంతో రియోకు భారీ బృందం వెళుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, సుమారు 10 పతకాలు మనోళ్లు తెస్తారని అంచనా. ఇప్పటికే ఆర్చరీ క్రీడాకారులు బ్రెజిల్ చేరిపోయి సాధన మొదలెట్టారు. మిగిలిన క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు అమెరికా, యూరోప్లలో రకరకాల ప్రదేశాలలో ప్రాక్టీస్ చేస్తూ రియోకు సన్నద్ధమవుతున్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో డోపింగ్ కలకలం వెలుగులోకి రావడం పెద్ద షాక్. సాక్షి క్రీడావిభాగం: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్లో దొరికినా అతడిపై ఎంతో కొంత సానుభూతి కనిపించింది. రెజ్లింగ్ సమాఖ్య కూడా నర్సింగ్ గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని మద్దతుగా నిలబడింది. నర్సింగ్ అంశంపై చర్చ వాడిగా సాగుతున్న సమయంలోనే మరో అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ డోపింగ్లో దొరికిపోవడం మన ప్రతిష్టను దిగజార్చింది. గతంలో అడపాదడపా భారత అథ్లెట్లు డోపింగ్లో పట్టుబడ్డా... ఈసారి ఒలింపిక్స్కు ముందు భారీ అంచనాలతో ఉన్న అథ్లెట్లు దొరికిపోవడం దేశానికి చెడ్డపేరు తెస్తోంది. భారత్లో క్రీడాకారులు డోపీలుగా దొరకడం ఇది తొలిసారేం కాదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సమయంలోనూ భారత్లో డోపింగ్ కలకలం రేగింది. అప్పుడు ఇద్దరు వెయిట్లిఫ్టర్లు పట్టుబడ్డారు. దీంతో ఒక రకంగా వెయిట్లిఫ్టింగ్కు ఆదరణ బాగా తగ్గిపోయింది. 2000లో డిస్కస్ త్రోయర్ సీమా అంటిల్, 2001లో కుంజరాణి, 2010లో సనామచా చాను కూడా డోపింగ్లో దొరికారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల ఆదరణ పెరిగింది. గత రెండు ఒలింపిక్స్లలో పతకాల సంఖ్య పెరగడంతో దేశంలో క్రీడాసంస్కృతి పెరిగింది. రియోకు వెళ్లే అథ్లెట్లకు ప్రభుత్వం భారీగా డబ్బు ఇచ్చింది. ‘టాప్’ స్కీమ్ పేరిట అందరికీ ఆర్థిక సహాయం అందజేసింది. దీంతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు వ్యక్తులు కూడా సహకారం అందించారు. ఈ నేపథ్యంలో అథ్లెట్లు పతకాలు తెస్తారని ఆశలూ పెరిగాయి. అయితే ఆటల ప్రారంభానికి ముందే ఇద్దరు అథ్లెట్లు దొరకడంతో అందరిలోనూ సంశయం మొదలైంది. క్లీన్చిట్ ఎలా ఇచ్చారు? జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) భారత అథ్లెంట్లందరికీ వారం రోజుల క్రితం ‘క్లీన్చిట్’ ఇచ్చింది. రియోకు వెళుతున్న వారందరికీ పరీక్షలు నిర్వహించామని, అందరూ క్లీన్ అని ప్రకటించింది. కానీ వారం తిరిగే సరికే ఇద్దరు అథ్లెట్ల పేర్లను అదే ‘నాడా’ బయటపెట్టింది. నిజానికి ఇప్పుడు బయటపడ్డ ఫలితాలు గత నెలలో తీసుకున్న శాంపిల్స్వి. మరి ఆ ఫలితాలను చూడకుండానే ముందుగా ఎందుకు ప్రకటన చేశారనేది ప్రశ్నార్థకం. అటు రెజ్లర్ నర్సింగ్ యాదవ్, ఇటు షాట్పుటర్ ఇందర్జీత్ ఇద్దరూ తాము అమాయకులమే అని, తమపై కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. ఒక అథ్లెట్ బ్లడ్, యూరిన్ శాంపిల్ ఇచ్చిన సమయంలో అథ్లెట్ సమక్షంలోనే దానిని లాక్ చేస్తారు. ఆ తర్వాత మిషన్ల సహాయంతో మాత్రమే వాటిని తెరుస్తారు. కాబట్టి అథ్లెట్ శాంపిల్ను మార్చారనే ఆరోపణల్లో నిజం లేదనుకోవాలి. ఇక నర్సింగ్ యాదవ్ చేసిన ఆరోపణలు భిన్నంగా ఉన్నాయి. అతడితో పాటు అతడి రూమ్మేట్ కూడా డోపింగ్లో దొరికాడు. ఈ ఇద్దరూ తినే ఆహారంలో ఏదో కలిపారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీళ్లిద్దరూ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) శిక్షణా కేంద్రంలోనే శిక్షణ తీసుకుంటున్నారు. హరియాణాలోని సోనేపట్లో ఉన్న ఈ కేంద్రంలోనే రెజ్లర్లందరికీ శిక్షణ ఇస్తున్నారు. తనపై కుట్ర జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని నర్సింగ్ కోరుతున్నాడు. గతంలో నర్సింగ్కు మంచి రికార్డు ఉంది. ఎప్పుడూ ఏ స్థాయిలోనూ డోపింగ్కు పాల్పడిన ఆనవాళ్లు లేవు. ఇంతకాలం ఇంత క్లీన్గా ఉన్న వ్యక్తి ఒలింపిక్స్ సమయంలో డోపింగ్ చేయకపోవచ్చు. నిజానికి గత నెలలో అతనికి మూడుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో రెండుసార్లు క్లీన్చిట్ వచ్చింది. మూడో సందర్భంలో బ్లడ్ శాంపిల్లో ఎలాంటి సమస్యా లేదు. కేవలం యూరిన్ శాంపిల్లో మాత్రమే తేడా ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నర్సింగ్కు రెజ్లింగ్ సమాఖ్య నుంచే కాకుండా అన్ని వైపుల నుంచీ మద్దతు లభించింది. కానీ ఇందర్జీత్ విషయంలో పరిస్థితి అలా లేదు. భారత అథ్లెట్లందరికీ నిర్వహించే జాతీయ క్యాంప్లో ఇందర్జీత్ శిక్షణ తీసుకోలేదు. తన వ్యక్తిగత కోచ్తో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అలాగే ప్రతి నెలా క్రీడాకారులు తాము ఎక్కడ ఉండేదీ ‘నాడా’కు తెలపాలి. కానీ గత నెల ఇందర్జీత్ జూన్లో ఓ పరీక్షకు హాజరు కాలేదు. రెండో పరీక్షకు హాజరై దొరికిపోయాడు. అయితే ఇంకా తన ‘బి’ శాంపిల్ పరీక్ష ఫలితం రాలేదు. ఒకవేళ ఆ పరీక్షలో కూడా అతను పాజిటివ్గా తేలితే ఇక రియోకు వెళ్లడం సాధ్యం కాదు. అంతేకాకుండా రెండు నుంచి నాలుగేళ్లు నిషేధం కూడా పడుతుంది. తమ కెరీర్లో ఒకసారైనా ఒలింపిక్స్లో పాల్గొనాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. దీనిని సాకారం చేసుకోవడం కోసం ఏళ్ల పాటు కష్టపడతారు. కుటుంబాలను, వ్యక్తిగత సంతోషాలను వదిలేస్తారు. కాబట్టి కావాలని డోపింగ్కు పాల్పడే క్రీడాకారుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. కానీ కొంతమంది మరీ అత్యాశకు వెళతారు. ఏదో ఒకటి చేసి పతకం గెలవాలనే ఉద్దేశంతో, పరీక్షలకు దొరక్కుండా రకరకాల మార్గాల ద్వారా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ రోజు రోజూకూ మెరుగుపడుతున్నందున ఇలాంటివి దాగవు. తప్పు చేసిన అథ్లెట్ ఏదో ఒక రోజు దొరకాల్సిందే. ఏమైనా రియోకు ముందు ఈ పరిణామాలు ఎంతమాత్రం మంచివి కాదు. ఈ ఇద్దరితోనే ఇది ఆగిపోవాలని కోరుకుందాం. ఇందర్జిత్ తీసుకున్న ఆండ్రోస్టెరాన్, ఎథియోక్లొనోలోన్ రెండూ నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. జీవనిర్మాణ క్రియల్లో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కండరాల పెరుగుదల, శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి ఈ ఉత్ప్రేరకాలు బాగా దోహదపడతాయి. బరువైన వస్తువులు మోసే వాళ్లు లేదా శక్తిని బాగా ఉపయోగించే అథ్లెట్లు వీటిని తీసుకుంటారు. దీనివల్ల శరీరంలోని శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. షాట్పుట్, హామర్ త్రో అథ్లెట్లు ఈ డ్రగ్స్ను నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. కొన్నిసార్లు ఒకే డ్రగ్ను లేదా రెండింటిని కలిపి తీసుకుంటారు. -
ఇంకా సిద్ధం కాలేదు!
* అసంపూర్తిగా ఒలింపిక్ విలేజ్ * వారంలో సిద్ధం చేస్తామన్న నిర్వాహకులు రియో డి జనీరో: మురుగు నీటితో నిండిపోయిన టాయిలెట్లు, లీకేజ్ పైపులు, ప్రమాదభరితంగా మారిన వైరింగ్, మెట్లపై అడుగుల మందం పేరుకుపోయిన మట్టి, ఇంకా పూర్తికానీ లైటింగ్ వ్యవస్థ, దుమ్ముపట్టిన రూమ్లు, ఫ్లోరింగ్, నీటితో తడిసిపోయిన గోడలు... ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం... ఒలింపిక్స్ విలేజ్ ప్రస్తుత పరిస్థితి ఇది. గేమ్స్కు 10 రోజుల సమయం కూడా లేదు. కానీ అక్కడ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. గేమ్స్ కోసం రియో చేరుకుంటున్న చాలా దేశాల అథ్లెట్లు... విలేజ్ పరిస్థితి చూసి అక్కడికి వెళ్లేందుకు జంకుతున్నారు. సోమవారం ఆస్ట్రేలియా అథ్లెట్లు అపార్ట్మెంట్లో వసతులు చూసి వెనుదిరిగిపోయారు. దీంతో ఆఘామేఘాల మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన నిర్వాహకులు వారం రోజుల్లో ఒలింపిక్ విలేజ్ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు 630 మంది పని చేస్తున్నారని కమిటీ అధికార ప్రతినిధి మారియో ఆండ్రెడా తెలిపారు. గురువారానికి విలేజ్ను అందుబాటులో తెస్తామన్నారు. రోయింగ్, సెయిలింగ్ జరిగే ప్రాంతాల్లో అధిక జనాభా కారణంగా జికా వైరస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న నిర్వాహకులు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల కోసం అపార్ట్మెంట్లలో ఓపెన్ చేసిన నల్లాలను ఆపి వేయకపోవడంతో రూమ్లన్నీ నీటితో నిండిపోయి విపరీతమైన దుర్గంధం, గ్యాస్ వాసన వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ జరుగుతోంది. మొత్తానికి తొలిసారి గేమ్స్కు ఆతిథ్యమిస్తున్న ఆనందం దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్కు లేకుండా పోతోంది. అనుభవరాహిత్యం, ప్రణాళిక లోపంతో ఒకేసారి పలు రకాల సమస్యలు చుట్టుముట్టుతుండటం తలకు మించిన భారంగా మారింది. -
టార్గెట్...10
ఆశల పల్లకిలో భారత బృందం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ నుంచి ఏకంగా 121 మంది అథ్లెట్లు ఒలింపిక్స్కు వెళుతున్నారు. మరి ఇందులో ఎంతమంది పతకాలు తెస్తారు..? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్లో ఆ క్షణంలో ఒత్తిడిని జయించిన వాళ్లనే పతకాలు వరిస్తాయి. నాలుగేళ్ల క్రితం లండన్లో భారత క్రీడాకారులు ఆరు పతకాలు గెలిచారు. ఈసారి రియో ఒలింపిక్స్లో 10 పతకాలు గెలవడం భారత్ లక్ష్యం. గత నాలుగేళ్లలో వివిధ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో మన ప్రదర్శన చూస్తే పది పతకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ పది మంది ఎవరు..? స్వాతంత్య్రం వచ్చాక భారత్ 17 సార్లు ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగింది. ఈ 17 పర్యాయాల్లో కేవలం మూడుసార్లు మాత్రమే ఒకే ఒలింపిక్స్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు వచ్చాయి. తొలిసారి 1952 హెల్సింకి ఒలింపిక్స్లో భారత్కు రెండు పతకాలు లభించాయి. భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణం సాధించగా... పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్లో ఖాషాబా జాదవ్ కాంస్య పతకాన్ని గెలుపొందారు. ఆ తర్వాత 13 ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారులు ఒక పతకంతో తొమ్మిదిసార్లు, ఎలాంటి పతకమే లేకుండా నాలుగుసార్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో భారత ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించి ఒకేసారి మూడు పతకాలు గెలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్లో గత రికార్డును బద్దలు కొడుతూ ఏకంగా ఆరు పతకాలతో భారత క్రీడాకారులు మెరిశారు. లండన్ ఒలింపిక్స్లో భారత్ నుంచి అత్యధికంగా 83 మంది బరిలోకి దిగగా... ఈసారి రియో ఒలింపిక్స్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 121 మంది పతకాల వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ‘రియో’లో పతకాలతో భారత పతాకాన్ని రెపరెపలాడించే ఆశాకిరణాలెవరో పరిశీలిద్దాం..! - సాక్షి క్రీడావిభాగం సైనా మళ్లీ సాధించాలి గత ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈసారి కూడా పతకం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒలింపిక్స్కు ముందు చివరి మెగా టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను గెలవడంతో సైనా ఆత్మవిశ్వాసంతో ఉంది. తొలిసారిగా ఒలింపిక్స్కు అర్హత సాధించిన సింధు కూడా తనదైన రోజున ఎవరినైనా ఓడించగలదు. ఈ ఇద్దరిలో ఒక్కరైనా పతకం తెస్తారనే ఆశ ఉంది. అయితే ఈసారి పోటీ కూడా బాగా తీవ్రంగా ఉంది. లీ జురుయ్, యిహాన్ వాంగ్ (చైనా)లతోపాటు కరోలినా మారిన్ (స్పెయిన్) రేసులో ఉన్నారు. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్కు కాస్త అదృష్టం కూడా తోడైతే పతకం ఆశించొచ్చు. బాణం రాణించాలి ప్రపంచ నంబర్వన్ హోదాలో లండన్ ఒలింపిక్స్లో బరిలోకి దిగి పతకంపై ఆశలు రెకేత్తించిన ఆర్చర్ దీపిక కుమారి తీవ్రంగా నిరాశపరిచింది. అయితే గత వైఫల్యాల అనుభవంతో ఈసారి రియోలో ఈ జార్ఖండ్ ఆర్చర్ మరింత మెరుగైన ప్రదర్శన చేస్తే పతకం వచ్చే అవకాశముంది. ఇటీవల కాలంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల ఆర్చరీ జట్టు నిలకడగా రాణిస్తోంది. అదే ప్రదర్శనను రియోలోనూ పునరావృతం చేస్తే ఆర్చరీలో మనకు కనీసం ఒక పతకం వస్తుందనే నమ్మకముంది. ‘పంచ్’ పవర్ రెజ్లింగ్, షూటింగ్ తర్వాత వ్యక్తిగత క్రీడాంశంలో వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకం అందించడంలో భారత బాక్సర్లు సఫలమయ్యారు. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ కాంస్య పతకాలు నెగ్గారు. లండన్తో (8 మంది) పోలిస్తే ఈసారి కేవలం ముగ్గురు (శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ క్రిషన్ యాదవ్) మాత్రమే భారత్ నుంచి అర్హత పొందారు. ఈ ముగ్గురికీ ఇవి రెండో ఒలింపిక్స్. గతంలో ప్రపంచ చాంపియన్షిప్లో, ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్షిప్లో, యూత్ ఒలింపిక్స్లో పతకాలు నెగ్గిన వికాస్ క్రిషన్ (75 కేజీలు) ... ఆరేళ్ల క్రితం యూత్ ఒలింపిక్స్లో రజతం, గతేడాది ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన శివ థాపా (56 కేజీలు)ల నుంచి పతకాలు ఆశించవచ్చు. ‘గురి’ కుదురుతుంది అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు తెచ్చే భారత షూటర్లు ఒలింపిక్స్లోనూ ఆపద్భాంధవులుగా వ్యవహరిస్తున్నారు. గత మూడు ఒలింపిక్స్లో నాలుగు పతకాలు నెగ్గిన షూటర్లు ఈసారి తమ గురికి మరింత పదును పెట్టి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్ కానున్న అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్లపై భారీ అంచనాలే ఉన్నాయి. కొంతకాలంగా అద్భుతమైన ఫామ్లో ఉన్న పిస్టల్ షూటర్స్ జీతూ రాయ్... హీనా సిద్ధూ.. ఎయిర్ రైఫిల్లో అపూర్వీ చండీలా, ట్రాప్లో అనుభవజ్ఞుడైన మానవ్జిత్ సంధూ పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈసారి షూటింగ్ నుంచి కనీసం మూడు పతకాలు ఆశించవచ్చు. పట్టు సడలించకూడదు బీజింగ్ ఒలింపిక్స్లో సుశీల్ కుమార్ కాంస్యం నెగ్గిన తర్వాత భారత్లో రెజ్లింగ్ రూపురేఖలే మారిపోయాయి. ఈ ప్రాచీన క్రీడకు ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. అందరి అంచనాలను నిజం చేస్తూ లండన్ ఒలింపిక్స్లో సుశీల్ కుమార్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించారు. దాంతో రియోలోనూ అందరి దృష్టి భారత రెజ్లర్లపై పడింది. అనుభవజ్ఞుడైన యోగేశ్వర్ దత్ (65 కేజీలు) తనస్థాయికి తగ్గట్టు ప్రదర్శన కనబరిస్తే కచ్చితంగా ఈసారీ మరో పతకంతో తిరిగొస్తాడు. ట్రయల్స్ నిర్వహించాలని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అభ్యర్థించినా... అతని మాటను లెక్క చేయకుండా ఒలింపిక్ బెర్త్ దక్కించుకున్న నర్సింగ్ యాదవ్నే (74 కేజీలు) రియోకు పంపిస్తుండటంతో అతను కూడా పతకం తెచ్చి అందరికీ సమాధానం చెప్పాలనే పట్టుదలతో ఉన్నాడు. ‘రెప్చేజ్’ నిబంధన కారణంగా పతకం నెగ్గేందుకు రెండు అవకాశాలు ఉండటం రెజ్లర్లకు అనుకూలించే అంశం. మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ (48 కేజీలు), బబితా కుమారి (53 కేజీలు) సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సమన్వయం కుదిరితే... భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సానియా మీర్జాల వద్ద కావాల్సినంత అనుభవం, ప్రతిభ ఉన్నా... మ్యాచ్ల సమయంలో సరైన సమన్వయం లేకుండా ఆడితే మాత్రం ఈసారీ టెన్నిస్లో పతకాన్ని ఆశించలేము. పురుషుల డబుల్స్లో పేస్తో పట్టుబట్టి మరీ బోపన్నను ఆడిస్తుండటంతో ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం. మిక్స్డ్ డబుల్స్లో 16 జోడీలు మాత్రమే ఉండటంతో రోహన్ బోపన్న-సానియా మీర్జా జంటకు అనుకూలమైన ‘డ్రా’ ఎదురై... మూడు విజయాలు దక్కితే పతకం ఖాయం. ఆ ఒక్క విన్యాసంతో... ఐదు దశాబ్దాల తర్వాత దీపా కర్మాకర్ రూపంలో భారత జిమ్నాస్ట్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఆమె ప్రధాన ఈవెంట్ అయిన వాల్టింగ్ హార్స్లో ‘ప్రోడునోవా’ విన్యాసం అత్యంత క్లిష్టతరమైనది. ఈ విన్యాసాన్ని పరిపూర్ణంగా చేసేవారు అరుదు. 22 ఏళ్ల ఈ త్రిపుర జిమ్నాస్ట్ రియోలో గనుక ‘ప్రోడునోవా’ విన్యాసాన్ని పర్ఫెక్ట్గా చేస్తే కనీసం కాంస్యం నెగ్గే అవకాశముంది. అద్భుతం జరిగితే... ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో రజతం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ఒక్కసారిగా ఒలింపిక్స్పై ఆశలు పెంచింది. గ్రూప్ ‘బి’లో జర్మనీ, నెదర్లాండ్స్, అర్జెంటీనా, కెనడా, ఐర్లాండ్ జట్లతో ఉన్న భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవచ్చు. క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే మాత్రం భారత్ పతకం రేసులో నిలిచినట్టే. అథ్లెటిక్స్లో 36 మంది బరిలో దిగుతున్నా... పతకం వస్తే అది అద్వితీయ ఫలితమేనని అనుకోవాలి. గోల్ఫ్, జూడో, రోయింగ్, వెయిట్లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్లలో పతకాలు ఆశించలేం. -
చలో రియో
కిత్నే ఆద్మీ థే..? 121 సర్కార్..! ఎవరు వాళ్లు... లిస్ట్ ఇచ్చాం సర్కార్... ఇంత మంది ఎలా పెరిగారు..? కింద స్టోరీ ఉంది సర్కార్... చరిత్రలో తొలిసారి భారత్ నుంచి 121 మంది అథ్లెట్ల భారీ బృందం ఒలింపిక్స్కు వెళుతోంది. భారత్ నుంచి రియోకు అర్హత సాధించిన అథ్లెట్లు... గత ఒలింపిక్స్తో పోలిస్తే భారీగా పెరిగారు. ఎనిమిదేళ్ల క్రితం బీజింగ్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారుల సంఖ్య 56. నాలుగేళ్ల క్రితం లండన్లో ఈ సంఖ్య 83కు పెరిగింది. ఈ సారి రియోలో మన సంఖ్య సెంచరీ దాటింది. అనూహ్యంగానో, అదృష్టవశాత్తో అవకాశం దక్కించుకున్నవారు వీరిలో ఎవరూ లేరు. గత రెండేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి తమ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్కు వీరంతా అర్హత సాధించారు. ఆ ఆటతీరే ఇప్పుడు భారత్ మరిన్ని పతకాలు సాధిస్తుందనే ఆశలు పెంచుతోంది. ‘గతంలో మన అథ్లెట్లు ఒలింపిక్స్నుంచి జ్ఞాపికలు తెచ్చుకోవడంతోనే సంబరపడేవారు. కానీ ఈతరం ఆటగాళ్లలో దూకుడు పెరిగింది. వారు సరదా కోసం కాకుండా పతకమే లక్ష్యంగా ఒలింపిక్స్కు సన్నద్ధమవుతున్నారు’... భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన ఈ వ్యాఖ్య ఇటీవలి పరిణామాలు, మారిన మన ఆలోచనా తీరుకు నిదర్శనం. ఈ సారి ఒలింపిక్స్లో ఆటగాళ్ల సంఖ్య పెరగడం మన క్రీడారంగంలో వచ్చిన మార్పుకు సంకేతం. మహిళా హాకీ పునరాగమనం... 2012 ఒలింపిక్స్తో పోలిస్తే అదనంగా 38 మంది అథ్లెట్లు ఈ సారి ప్రపంచ క్రీడా సంబరానికి అర్హత సాధించారు. ఇందులో 16 మంది సభ్యుల మహిళా హాకీ జట్టు కూడా ఉంది. నిలకడైన ప్రదర్శనతో జట్టు 36 ఏళ్ల తర్వాత మరో సారి అవకాశం దక్కించుకుంది. రియోలో మొత్తం 121 మంది భారత అథ్లెట్లు 15 క్రీడల్లో కలిపి మొత్తం 72 ఈవెంట్లలో పోటీ పడనున్నారు. తొలి సారి షూటింగ్లో 12 మంది, బ్యాడ్మింటన్లో ఏడుగురు అర్హత సాధించడం విశేషం. అథ్లెటిక్స్లో ఏకంగా 23 మంది పెరిగారు. లండన్కంటే మరో ముగ్గురు రెజ్లర్లు అదనంగా క్వాలిఫై అయ్యారు. అండగా నిలిచిన ప్రభుత్వం లండన్ ఒలింపిక్స్ అనంతరం కేంద్ర ప్రభుత్వం తదుపరి క్రీడల లక్ష్యంతో కొత్త ప్రణాళికలను రూపొందించడం ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడింది. వాస్తవానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) దీర్ఘ కాలిక ప్రణాళికలో భాగంగా 2020 టోక్యో క్రీడలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే రియోలో మన సంఖ్య పెరిగింది. ముఖ్యంగా టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం మాత్రం చాలా మందికి ఉపయోగ పడింది. గతంలో నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఆటగాళ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేది. అయితే ఇది సుదీర్ఘ ప్రక్రియ కావడంతో పాటు ముందుగా సొంత డబ్బు ఖర్చు చేసి తర్వాత ప్రభుత్వంనుంచి తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల అథ్లెట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే కొత్తగా తీర్చిదిద్దిన టాప్ పథకం ఆటగాళ్లను ఆదుకుంది. ప్రత్యేక కమిటీ ఎంపిక చేసిన 75 మంది అథ్లెట్లు ఒలింపిక్స్కు సిద్ధమయ్యేందుకు రూ. 25 లక్షలనుంచి రూ. కోటి వరకు ప్రభుత్వం అందజేసింది. దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. రియోకు అర్హత సాధించినవారిలో కొందరు మినహా దాదాపు అంతా దీనిని బాగా ఉపయోగించుకున్నారు. సుశీల్, నర్సింగ్ వ్యక్తిగత వివాదం మినహా అన్ని క్రీడల్లో ఆయా సమాఖ్యలకు తమ ఈవెంట్ సన్నాహకాలపై మొదటినుంచి మంచి స్పష్టత ఉంది. అందు వల్ల అర్హత కోసం పాల్గొనాల్సిన టోర్నీలు, ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ప్రొఫెషనల్ పద్ధతిలో ప్రభుత్వం కూడా జాతీయ క్రీడా సమాఖ్యలతో కలిసి మంచి సమన్వయంతో పని చేసింది. వెన్నంటి నిలుస్తూ... ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయమే కాకుండా గత కొన్నేళ్లుగా కొన్ని ఇతర సంస్థలు అండగా నిలవడం కూడా ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను చేకూర్చింది. క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు వచ్చిన ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ), లక్ష్య, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ అథ్లెట్లు ఇతర అంశాల గురించి ఆలోచించకుండా తమ ఆటపైనే దృష్టి పెట్టేలా చేయడంలో సఫలమయ్యాయి. ఓజీక్యూ అండగా నిలిచిన ఆటగాళ్లలో సైనా నెహ్వాల్, సింధు, శివ థాపా, దీపికా కుమారి, గగన్ నారంగ్, జీతూరాయ్, యోగేశ్వర్ దత్ కొందరు. లక్ష్య సంస్థ ఈ సారి బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి సుమీత్ రెడ్డి- మను అత్రిలకు అండగా నిలుస్తోంది. జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ అందించిన సహకారం వల్లే ప్రపంచ చాంపియన్షిప్లో పతకం సాధించి నర్సింగ్ యాదవ్ రియోలో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ సహకారం అంతా ఒలింపిక్స్లో మన సంఖ్య పెరిగేందుకు దోహదపడింది. కార్పొరేట్ కాంబినేషన్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ఒలింపిక్ సంఘం ఈ సారి కార్పొరేట్లతో జత కట్టి పెద్ద ఎత్తున జట్టుకు స్పాన్సర్షిప్లు రాబట్టడంలో సఫలమైంది. ఇందు కోసం ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రధాన స్పాన్సర్లు అమూల్, జియో మొబైల్ భారత బృందంతో జత కట్టాయి. ఎడిల్వీజ్, టాటా సాల్ట్, హెర్బలైఫ్ తదితర సంస్థలు ఇందులో భాగమయ్యాయి. మొత్తం 10 సంస్థలు అండగా నిలిచేందుకు ముందుకు రావడం విశేషం. ఎన్నో ఏళ్లుగా భారత జట్టు కిట్ స్పాన్సర్గా శివ్ నరేశ్ వ్యవహరిస్తోంది. ఈ సారి చైనాకు చెందిన లీ నింగ్ భారత ఆటగాళ్లకు కిట్లు అందజేసింది. అథ్లెటిక్స్ (37) ధరమ్బీర్ సింగ్ (పురుషుల 200 మీటర్లు), మొహమ్మద్ అనస్ (400 మీటర్లు, 4ఁ400 మీటర్ల రిలే), జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు), అయ్యసామి ధరుణ్, మోహన్ కుమార్, సుమిత్ కుమార్, మొహమ్మద్ కున్హి, అరోకియా రాజీవ్ (4ఁ400 మీటర్ల రిలే), తొనకల్ గోపీ, ఖెటా రామ్, నితేందర్ సింగ్ రావత్ (మారథాన్) బల్జీందర్ సింగ్, గుర్మీత్ సింగ్, ఇర్ఫాన్ థోడి (20 కిలోమీటర్ల నడక), సందీప్ సింగ్, మనీశ్ సింగ్ (50 కిలోమీటర్ల నడక), అంకిత్ శర్మ (లాంగ్జంప్), రంజిత్ మహేశ్వరీ (ట్రిపుల్ జంప్), ఇందర్జీత్ సింగ్ (షాట్పుట్) వికాస్ గౌడ (డిస్కస్ త్రో) ద్యుతీ చంద్ (మహిళల 100 మీటర్లు) శ్రాబణి నందా (200 మీటర్లు) నిర్మలా షెరాన్ (400 మీటర్లు, 4ఁ400 మీటర్ల రిలే) టింటూ లూకా (800 మీటర్లు) లలితా బాబర్ (3000 మీటర్ల స్టీపుల్చేజ్) సుధా సింగ్ (3000 మీటర్ల స్టీపుల్చేజ్, మారథాన్) అశ్విని అకుంజి, దేబశ్రీ మజుందార్, జిష్నా మాథ్యూస్, ఎం.ఆర్.పూవమ్మ, అనిల్డా థామస్ (4ఁ400 మీటర్ల రిలే) ఓపీ జైషా, కవితా రౌత్ (మారథాన్) ఖుష్బీర్ కౌర్, సప్నా పూనియా (20 కిలోమీటర్ల నడక) మన్ప్రీత్ కౌర్ (షాట్పుట్) సీమా అంటిల్ (డిస్కస్ త్రో). బ్యాడ్మింటన్ (7) సైనా నెహ్వాల్, పీవీ సింధు (మహిళల సింగిల్స్), కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్), సుమిత్ రెడ్డి, మనూ అత్రి (పురుషుల డబుల్స్), గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్). టెన్నిస్ (4) లియాండర్ పేస్, రోహన్ బోపన్న (పురుషుల డబుల్స్/మిక్స్డ్ డబుల్స్), సానియా మీర్జా, ప్రార్థన తొంబ్రే (మహిళల డబుల్స్/మిక్స్డ్ డబుల్స్). ఆర్చరీ (4) అతాను దాస్ (పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం), దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి మాఝీ (మహిళల రికర్వ్ టీమ్, వ్యక్తిగత విభాగం). టేబుల్ టెన్నిస్ (4) ఆచంట శరత్ కమల్, సౌమ్యజిత్ ఘోష్ (పురుషుల సింగిల్స్), మనికా బాత్రా, మౌమా దాస్ (మహిళల సింగిల్స్). బాక్సింగ్ (3) శివ థాపా (బాంటమ్ వెయిట్-56 కేజీలు), మనోజ్ కుమార్ (లైట్ వెల్టర్ వెయిట్-64 కేజీలు), వికాస్ క్రిషన్ యాదవ్ (మిడిల్ వెయిట్-75 కేజీలు). గోల్ఫ్ (3) అనిర్బన్ లాహిరి, శివ్ చౌరాసియా (పురుషుల విభాగం), అదితి అశోక్ (మహిళల విభాగం). వెయిట్లిఫ్టింగ్ (2) సతీశ్ శివలింగం (పురుషుల 77 కేజీలు), మీరాబాయి చాను (మహిళల 48 కేజీలు). రెజ్లింగ్ (8) సందీప్ తోమర్ (పురుషుల ఫ్రీస్టయిల్-57 కేజీలు), యోగేశ్వర్ దత్ (65 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), రవీందర్ ఖత్రీ (పురుషుల గ్రీకో రోమన్-85 కేజీలు), హర్దీప్ సింగ్ (98 కేజీలు), వినేశ్ ఫోగట్ (మహిళల ఫ్రీస్టయిల్ 48 కేజీలు), బబితా కుమారి (53 కేజీలు), సాక్షి మలిక్ (58 కేజీలు). రోయింగ్ (1) దత్తూ బబన్ భోకనాల్ (పురుషుల సింగిల్ స్కల్స్). షూటింగ్ (12) అభినవ్ బింద్రా (పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్) కైనన్ చెనాయ్, మానవ్జిత్ సింగ్ సంధూ (ట్రాప్) మేరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్) ప్రకాశ్ నంజప్ప (50 మీటర్ల పిస్టల్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), జీతూ రాయ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్), చెయిన్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), గుర్ప్రీత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), అపూర్వీ చండేలా, అయోనికా పాల్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), హీనా సిద్ధూ (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్). హాకీ (32) పురుషుల జట్టు: సురేందర్ కుమార్, డానిష్ ముజ్తబా, రఘునాథ్, ఆకాశ్దీప్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, కొతాజిత్ సింగ్, మన్ప్రీత్ సింగ్, రమణ్దీప్ సింగ్, రూపిందర్పాల్ సింగ్, సర్దార్ సింగ్, శ్రీజేష్, ఎస్వీ సునీల్, నికిన్ తిమ్మయ్య, ఎస్కే ఉతప్ప, దేవిందర్ వాల్మీకి. మహిళల జట్టు: సవితా పూనియా, దీప్గ్రేస్ ఎక్కా, దీపికా ఠాకూర్, నమితా టొప్పో, సునీతా లాక్రా, సుశీలా చాను, లిలిమా మింజ్, రేణుకా యాదవ్, నిక్కీ ప్రధాన్, మోనికా మలిక్, నవ్జ్యోత్ కౌర్, అనురాధ దేవి, పూనమ్ రాణి, వందన కటారియా, ప్రీతి దూబే, రాణి రాంపాల్. స్విమ్మింగ్ (2) సజన్ ప్రకాశ్ (పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లయ్), శివాని కటారియా (మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్). జిమ్నాస్టిక్స్ (1) దీపా కర్మాకర్ (మహిళల విభాగం). జూడో (1) అవతార్ సింగ్ (పురుషుల 90 కేజీలు). సైనాకు ఐదో సీడ్ న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్గా బరిలోకి దిగబోతోంది. మరో స్టార్ షట్లర్ పీవీ సింధుకు తొమ్మిదో సీడ్ లభించింది. స్పెయిన్కు చెందిన కరోలినా మరిన్ టాప్ సీడ్. ఇక పురుషుల విభాగంలో శ్రీకాంత్కు తొమ్మిదో సీడ్ లభించింది. లీ చోంగ్ వీ టాప్ సీడ్. -
'ఒలింపిక్స్లో రష్యా వద్దు'
మాస్కో:ఇప్పటికే రష్యా అథ్లెట్ల సమాఖ్యపై నిషేధం కొనసాగుతుండగా తాజాగా మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. అసలు రష్యా అథ్లెట్లను రియో ఒలింపిక్స్కు అనుమతించకూడదనే వాదన బలంగా వినిపిస్తోంది. దాదాపు 10 జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రియోకు రష్యా దూరమయ్యే అవకాశం కనబడుతోంది. ప్రధానంగా యూఎస్, జర్మనీ, స్పెయిన్, జపాన్, స్విట్జర్లాండ్, కెనడా డోపింగ్ ఏజెన్సీలు రష్యాపై రియో నిషేధం విధించాలని కోరుతున్నాయి. ఆయా దేశాలు తమ డిమాండ్ను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) దృష్టికి తీసుకువెళ్లిన విషయం బయటకు పొక్కడంతో రష్యా అథ్లెట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతకుముందు రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం విధించడంతో పాటు ఆ దేశ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (ఆర్యూఎస్ఏడీఏ)పై కూడా వేటు పడిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా ఈ ఏజెన్సీ పనిచేయకపోవడంతో సస్పెండ్ చేయాలని వాడా ఫౌండేషన్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. కాగా, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ తమ అథ్లెటిక్స్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ రష్యా ఒలింపిక్ కమిటీ స్విట్జర్లాండ్లోని క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై మరో రెండు రెండు రోజుల్లో విచారణ జరుగనున్న తరుణంలో రష్యా అథ్లెట్లపై ఒలింపిక్స్ నిషేధం విధించాలనే డిమాండ్ తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
‘రియో’కు మరో ముగ్గురు అర్హత
బెంగళూరు: రియో ఒలింపిక్స్కు భారత్ నుంచి మరో ముగ్గురు అథ్లెట్స్ అర్హత సాధించారు. సోమవారం జరిగిన ఇండియన్ గ్రాండ్ప్రి మీట్లో రంజిత్ మహేశ్వరీ (ట్రిపుల్ జంప్), ధరమ్బీర్ సింగ్ (200 మీటర్లు), జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు) రియో అర్హత ప్రమాణాలను అందుకున్నారు. హరియాణాకు చెందిన 27 ఏళ్ల ధరమ్బీర్ 200 మీటర్ల రేసును 20.45 సెకన్లలో ముగించి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా 36 ఏళ్ల తర్వాత 200 మీటర్ల విభాగంలో ఒలింపిక్స్లో బరిలోకి దిగనున్న భారత అథ్లెట్గా గుర్తింపు పొందాడు. రంజిత్ మహేశ్వరీ 17.30 మీటర్ల దూరం దూకి... 16.85 మీటర్లతో ఉన్న రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని అధిగమించాడు. జిన్సన్ జాన్సన్ 800 మీటర్ల రేసును ఒక నిమిషం 45.98 సెకన్లలో పూర్తి చేసి రియో అర్హత ప్రమాణాన్ని (ఒక నిమిషం 46.00 సెకన్లు) అందుకొని ఒలింపిక్ బెర్త్ దక్కించుకున్నాడు. -
రియో అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన భారత అథ్లెట్లలో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని మానేక్షా కేంద్రం వద్ద రియో ఒలింపిక్ బృందంలోని అథ్లెట్లతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రియో ఒలింపిక్స్లో రాణించాలని ఆకాంక్షించారు. కాగా బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరిగే రియో క్రీడలకు 13 క్రీడాంశాల నుంచి 100కుపైగా భారత అథ్లెట్లు బెర్త్ దక్కించుకున్న సంగతి విదితమే. మరోవైపు ప్రధానితో కరచరణం చేస్తూ అథ్లెట్లు సెల్ఫీలు తీసుకున్నారు. -
అథ్లెట్స్కు ‘రియో’ పరీక్ష
హైదరాబాద్: సరిగ్గా నాలుగేళ్ల క్రితం నగరం జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు వేదికైంది. నాడు జరిగిన పోటీల్లో సత్తా చాటిన హైజంపర్ సహానా కుమారి లండన్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఇప్పుడు మరో సారి ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ ఇక్కడే జరగనుంది. రేపటి (మంగళవారం) నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయి. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు టోర్నీ వివరాలు వెల్లడించారు. జూలై 2 వరకు ఈ ఈవెంట్ను నిర్వహిస్తారు. రియో ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు భారత అథ్లెట్లకు ఇది చివరి అవకాశం. ఇక్కడ నిర్ధారిత టైమింగ్ నమోదు చేస్తే భారత్ నుంచి మరింత మంది అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఒలింపిక్స్కు క్వాలిఫై అవుతారు. 25 రాష్ట్రాల నుంచి పురుషుల విభాగంలో 645, మహిళల విభాగంలో 237 మంది అథ్లెట్లు ఇందులో పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు భారత్ నుంచి 21 మంది అథ్లెట్లు రియోకు అర్హత సాధించారు. -
కుస్తీమే సవాల్
వారు భీకరంగా తలపడతారు కానీ యుద్ధంలో కాదు.. జబ్బలు చరుస్తారు, తొడలు కొడతారు కానీ కయ్యానికి కాలు దువ్వడానికి కాదు.. ఒకరికొకరు తలపడుతూ మట్టికరిపించేందుకు విశ్వప్రయత్నం చేస్తారు కానీ పోట్లాటకు కాదు.. ఇవన్నీ కుస్తీపట్టులో భాగమే. అక్కడి యువకులకు కుస్తీపట్లు వెన్నతో పెట్టిన విద్య.. ప్రత్యర్థి ఎలాంటివాడైనా ఓ ‘పట్టు’పట్టి వదిలిపెడతారు.. కుస్తీపై ఆ గ్రామస్తులకున్న అమితాసక్తే ఏకంగా పోటీలు నిర్వహించే స్థాయి వరకు తీసుకెళ్లింది.. గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.. ప్రస్తుతం ఆ పల్లె కండలవీరులకు నిలయంగా మారింది. ఈ గుర్తింపు వెనుక వారు చేస్తున్న కసరత్తు ఎంతో ఉంది. ‘కుస్తీమే సవాల్’ అంటున్న ఆ క్రీడాకారులపై ఈ ఆదివారం ప్రత్యేకం.. -బషీరాబాద్ ఒకరిని చూసి ఒక రు ఆ గ్రామంలో కుస్తీపై ఇష్టం పెంచుకున్నారు. త మ ప్రతిభతో గ్రామానికి, జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చారు. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామస్తులకు కుస్తీఅంటే ఎంతో మక్కువ. ఏటా శివరాత్రి వచ్చిందంటే వారికి నిజంగా పెద్ద పండుగే. కుస్తీపోటీలతో గ్రామంలో ఉండే సందడి అంతా ఇంతాకాదు. అలా ఆసక్తి పెంచుకుని.. జీవన్గి గ్రామం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో 60 శాతం అక్కడి సంప్రదాయాలనే పాటిస్తుంటారు. బంధువులు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కావడంతో తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ ప్రాంతంలో ఉన్న హర్కూడ్ చెన్న బసవేశ్వర దేవాలయ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఉత్సవాలకు వీక్షించేందుకు జీవన్గి గ్రామస్తులు సైతం వెళ్తుంటారు. ఉత్సవాల సందర్భంగా ఇక్కడ కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. అలా ఆ పోటీలను చూసిన గ్రామస్తులకు కుస్తీపై ఆసక్తి ఏర్పడింది. అక్కడి పోటీల్లో గ్రామానికి చెందిన యువకులు తలపడుతూ వచ్చారు. పోటీలకు కర్ణాటక నుంచి.. గతంలో జీవన్గి గ్రామం నుంచి పోటీలకు కర్ణాటకు వెళ్లేవారు. ప్రస్తుతం కర్ణాటక నుంచే ఇక్కడ జరిగే పోటీలకు పెద్ద ఎత్తున వస్తున్నారు. క్రీడాకారులతోపాటు పోటీలను వీక్షించేందుకు అక్కడి నుంచి భారీగా తరలివస్తుంటారు. ఆరేళ్లుగా చించోళితాలుకా కరకుముకులి గ్రామానికి చెందిన అర్జున్ కుస్తీ పోటీల్లో గెలిచి సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం జీవన్గి గ్రామస్తులను చూసి చుట్టుపక్కల గ్రామాల యువకులు సైతం కుస్తీపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇలా అంకురార్పణ.. జీవన్గి గ్రామంలో కాగ్నా నది మధ్యలో వెలసిన మహదేవ లింగేశ్వర ఆలయానికి జాతరను సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. హర్కూడ్లో జరిగే పోటీలను చూసిన గ్రామస్తులకు తమ ఊళ్లోనూ పోటీలను నిర్వహించాలన్న ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారంతా వెంటనే ఇందుకు అంగీకరించారు. 1986లో పోటీలు నిర్వహించాలని నిర్ణయించినా అందుకు పరిస్థితులు అనుకూలించలేదు. రెండేళ్లు అలా వాయిదా పడుతూ వచ్చింది. 1988లో ముహూర్తం కుదిరింది. అలయ కమిటీ సభ్యులు పోటీలను ప్రారంభించారు. మొదటిసారి పదిమంది కుస్తీవీరులు పోటీల్లో తలపడ్డారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతూ ప్రస్తుతానికి 150 నుంచి 200 మంది వరకు పాలుపంచుకుంటున్నారు. 29 ఏళ్లుగా పోటీలను నిర్విగ్నంగా సాగిస్తూ వస్తున్నారు. పోటీల్లో గెలుపొందిన వీరుడిని ఘనంగా సన్మానించడంతోపాటు నగదు బహుమతిగానీ, వెండి కడియాన్ని గానీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. కఠోరసాధన.. ఆహార నియమాలు.. కాగ్నానది ఒడ్డున ఉన్న ఇసుక దిబ్బల్లో గ్రామానికి చెందిన కుస్తీవీరులు నిత్యం కఠోర సాధన చేస్తుంటారు. కొత్తగా కుస్తీపట్లు నేర్చుకునేవారు సైతం ఇక్కడే మొదలుపెడతారు. నానబెట్టి మొలకెత్తిన శనగలు, జొన్నసంకటి, జొన్నరొట్టెలు, రాగిసంకటి, బెల్లం, పాలు, పండ్లు,గుడ్లు, మాంసం ఆహారంగా తీసుకుంటారు. పోటీలకు నెల రోజుల ముందుగా సాధన ముమ్మరం చేస్తారు. నిబంధనలివే.. ♦ సమఉజ్జీ ఉంటేనే పోటీలో పాల్గొనాలి. ♦ పోటీల్లో మూడు సార్లు ఓడిపోతే తిరిగి పోటీ చేసేందుకు వీలుండదు. ♦ పోటీల్లో ఐదుసార్లు గెలుపొందిన వ్యక్తికి ఆఖరిపోరులో అవకాశం ఉంటుంది ♦ నిబంధనలు పాటించని వారిని పోటీల నుంచి తప్పిస్తారు. ♦ ప్రత్యర్థిని వెల్లకిలా ఇసుకతాకేలా పడేస్తే గెలుపొందినట్టు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. మా తాతలు 30 ఏళ్ల క్రితం కుస్తీపోటీలను ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి పోటీలను చూస్తూ పెరి గాను. ప్రస్తుతం ఆలయ ఉత్సవాల్లో పాలుపంచుకుంటున్నాను. కుస్తీ పోటీలతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. - పట్లోళ్ల వీరారెడ్డి, పీఏసీఎస్ డెరైక్టర్ పోటీల్లో ఐదుసార్లు గెలిచాను.. కుస్తీపోటీల్లో 15 ఏళ్లుగా తలపడుతూ వస్తున్నాను. ఇప్పటికి ఐదుసార్లు విజేతగా నిలిచాను. బహుమతి సంగతి అటుంచితే గెలుపుతో నాకు మంచి పేరు వచ్చింది. ఆనందంగా ఉంది. మూడేళ్లుగా పోటీల్లో పాల్గొనడం లేదు. - సోంశెట్టి వీరేశం, జీవన్గి సంతోషంగా ఉంది.. 30 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన తోట రాములు, కుర్వ రాములు కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు కర్ణాటక వెళ్లేవారు. మన గ్రామంలో కూడా పోటీలను ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పడంతో మొదలుపెట్టాం. మొదట్లో పదిమంది పాల్గొన్నారు. ప్రస్తుతం 200 వరకు సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది. - వడ్ల లాలప్ప, గ్రామస్తుడు గర్వంగా ఉంది.. కుస్తీ పోటీలను చూసేందుకు కర్ణాటక వెళ్లేవాళ్లం. కుస్తీవీరులు కర్ణాటకలో ఎక్కువగా ఉండేవారు. ప్రస్తుతం జీవన్గిలో సైతం కుస్తీవీరులు తయారవుతుండడం, గ్రామానికి పేరు తేవడం గర్వంగా ఉంది. - ఊరడి అనంతప్ప, గ్రామస్తుడు -
మోకాళ్ళ నొప్పులకు త్రీడీ ప్రింటింగ్..!
మోకాళ్ళ నొప్పులతోపాటు, దెబ్బతిన్న చెవి, ముక్కు వంటి వాటికి త్రీడీ ప్రింటెడ్ ఇంప్లాంట్స్ తో సులభంగా చికిత్స చేయొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. క్రీడాకారులు, వృద్ధులు, గాయాలవల్ల ఇబ్బందిపడే అనేక మందితో పాటు ఆర్థరైటిస్ ఉన్నవారు కార్టిలేజ్ (మృదులాస్థి) కోల్పోయి తీవ్రమైన నొప్పులతో బాధపడుతుంటారు. ఇటువంటి వారికోసం ఓ సరికొత్త ప్రయోగాన్ని అందుబాటులోకి తెచ్చింది అమెరికా శాండియాగోలోని అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీసీ). 251వ జాతీయ సమావేశాల సందర్భంలో ఈ ప్రయోగాన్ని పరిశోధకులు పరిచయం చేశారు. త్రీ డైమెన్షనల్ బయో ప్రింటింగ్ అనేది సాంకేతిక కణజాల పునరుత్పత్తికి తోడ్పడుతుందని, ఇది వైద్య చరిత్రలో విప్లవాన్ని సృష్టిస్తుందని స్వీడన్ వాలెన్ బర్గ్ వుడ్ సైన్స్ సెంటర్ కు చెందిన పరిశోధక బృందంలోని పాల్ గాటెన్ హోమ్ చెప్తున్నారు. గాయాలు, కేన్సర్ వంటి వాటివల్ల నష్టపోయిన కార్టిలేజ్ (మృదులాష్టి) ను సృష్టించేందుకు తమ బృదం ప్లాస్టిక్ సర్జన్స్ తో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తోందన్నారు. ప్రస్తుతం సర్జెన్లు ముక్కు, చెవి వంటి శరీరంలోని ఇతర భాగాలను బాగు చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోందని, ఏదో ఓరోజు త్రీడీ ప్రింటింగ్ ద్వారా రోగి కణాల నుంచి తయారు చేసే బయో ఇంక్ తో అటువంటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని గాటెన్ హోమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా తయారు చేసే బయో ఇంక్ తో గాటెన్ హోమ్ బృదం ప్రయోగశాల ద్వారా మృదులాస్థిని ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు జరుపుతోంది. ప్రయోగశాల్లో తయారైన ప్రింటెడ్ టిష్యూ శాంపిల్స్ ను పరిశోధకులు ఎలుకలకు అమర్చి చూశారు. కణాలు పనిచేయడంతోపాటు మృదులాస్థి ఉత్పత్తి అయినట్లుగా కొనుగొన్నారు. అయితే కణజాల సంఖ్యను పెంచేందుకు ఇక్కడ మరో అడ్డంకి ఎదురైంది. దీంతో ఎముక మజ్జు నుంచి తీసిన మూల కణాలతో కాండ్రోసైట్స్ ను కలిపి 60 రోజులపాటు వివో టెస్టింగ్ లో ఉంచారు. ఈ ప్రాధమిక పరిశోధనలు కాండ్రోసైట్ ను మృదులాస్థిని పెంచేందుకు ప్రోత్సహించినట్లు కనుగొన్నారు. ఇక మానవులపై ప్రయోగించేందుకు ముందుగా కొన్ని ప్రీ క్లినికల్ పరీక్షలు చేయాల్సి ఉన్నట్లుగా గాటెన్ హోమ్ తెలిపారు. -
ఆట.. అడ్డదారి!
సాక్షి, కడప/ కడప స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందేందుకు కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. రాజకీయంగా కొందరు, పైరవీలు చేస్తూ మరికొందరు సీటు కోసం చక్రం తిప్పుతున్నారు. ఏకంగా కేంద్ర మంత్రుల నుంచి ఫోన్లు వస్తుంటే ఒత్తిడి భరించలేక ఓ అధికారి నాలుగు రోజుల పాటు సెల్ఫోన్ ఆఫ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎలాగోలా సీటు దక్కించుకుంటే ఇంటర్ వరకు అన్ని ఖర్చులు పాఠశాల యాజమాన్యమే భరించడంతో పాటు క్రీడల్లో మంచి భవిష్యత్ ఉంటుందని పలువురు భావిస్తుండటం వల్లే డిమాండ్ ఏర్పడింది. సెలక్షన్స్పై ఉత్కంఠ క్రీడా పాఠశాలకు ఎంపికైతే క్రీడల్లో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పడినట్లే. కడప నగరంలో ఉన్న వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో నాలుగవ తరగతిలో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 40 సీట్లు (బాలురు20, బాలికలు20) ఉంటాయి. తొలుత మండల, ఆపై జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వారిలోంచి అర్హులైన వారిని ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప నగరంలోని వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో ఎంపిక చేస్తారు. ఈ ఎంపికకు ఒక్కో జిల్లా నుంచి బాలికల విభాగంలో ఎనిమిది, బాలుర విభాగంలో ఎనిమిది.. మొత్తం 16 మంది హాజరు కానున్నారు. ఈ లెక్కన 13 జిల్లాల నుంచి 208 మంది బాలబాలికలు ఫైనల్ సెలక్షన్స్కు హాజరు కానున్నారు. వీరిలో ప్రతిభ కనపరిచిన 40 మంది బాలబాలికలను ఎంపిక చేస్తారు. పోటీ ఎక్కువగా ఉండటంతో పలువురు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఓ కేంద్ర మంత్రి నుంచి కూడా ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. ఎంపికలకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు గతేడాది సెలక్షన్స్లో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ ఏడాది అత్యున్నత స్థాయి కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, మెంబర్ కన్వీనర్గా క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి రుద్రమూర్తి యాదవ్, మెంబర్లుగా శాప్ ఎండీ రేఖారాణి, జిల్లా కలెక్టర్ కే.వి.రమణ, ఓఎస్డీ నాగరాజు, శాప్ డెరైక్టర్లు హనుమంతరావు, సత్తి గీత, రవీంద్రబాబు, డి.జయచంద్ర వ్యవహరిస్తారు. క్రీడా పాఠశాల కోచ్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కోచ్లను ఈ ఎంపిక ప్రక్రియకు నియమించారు. నిష్పక్షపాతంగా ఎంపికలు నిర్వహిస్తాం మాకు ఏ రాజకీయ నాయకుడు, ప్రజా ప్రతినిధి నుంచి ఎటువంటి ఒత్తిడి రాలేదు. క్రీడా పాఠశాల ఎంపికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం. శాప్ చైర్మన్, సభ్యులు, ఎండీ, జిల్లా కలెక్టర్ తదితరులతో కూడిన అత్యున్నత కమిటీ ఈ ఎంపికలను పర్యవేక్షిస్తుంది. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు వదంతులు, దళారులను నమ్మవద్దు. ఈ నెల 27న రాయలసీమ జిల్లాల క్రీడాకారులకు, 28న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, 29న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల క్రీడాకారులకు ఫైనల్ సెలక్షన్స్ పోటీలు నిర్వహిస్తున్నాం. - రుద్రమూర్తి యాదవ్, క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి, కడప -
ముంబై మారథాన్కు భారీస్పందన
జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు సాక్షి, ముంబై: నగరంలో ఆదివారం ఉదయం జరిగిన స్టాండర్డ్ చాటర్డ్ మారథాన్లో ఇథోపియా దేశానికి చెందిన అథ్లెట్లు విజయకేతనం ఎగురవేశారు. ఏకంగా ఐదు పతకాలు పురుష, మహిళ అథ్లెట్లు దక్కించుకున్నారు. ఈసారి ముంబై మారథాన్లో ఎవరు గెలుస్తారనే దానిపై ప్రారంభం నుంచి ఉత్కంఠ నెలకొంది. ఇథోపియా, కేనియా దేశాల మధ్య గట్టి పోటీ కనిపించింది. ఈ మారథాన్ను అజాద్మైదాన్వద్ద ఏర్పాటుచేసిన వేదికపై రాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్రావు జెండా చూపించి ప్రారంభించారు. ఫుల్ మారథాన్లో పురుష విభాగంలో కాంస్య (బ్రాంజ్) పతకం మినహా మిగతా ఐదు పతకాలు (పురుష విభాగంలో రెండు, మహిళా విభాగంలో మూడు) ఇథోపియా అథ్లెట్లు దక్కించుకున్నారు. మొత్తం 42 కి.మీ. దూరాన్ని (పురుష విభాగంలో) ఇథోపియాకు చెందిన తేజ్ఫాయే అబేరా 2.9.46 సెకన్లలో పూర్తిచేసి బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. అలాగే డెరేజ్ డెబెలెన్ 2.10.31 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచారు. కేనియాకు చెందిన బ్ల్యూక్ కిబెట్ 2.10.57 సెక్లన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఫుల్ మారథాన్లో 42 కి.మీ. దూరాన్ని (మహిళ విభాగం) డిన్కేష్ మెకాష్ 2.30 నిమిషాల్లో పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచి 41వేల డాలర్ల బహుమతిని చేజిక్కించుకున్నారు. గత ఏడాది నిర్వహించిన మారథాన్లో కూడా ఆమె ఇలాగే మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నిలిచిన కుమేషీ సిచాలాకు 2.30.56 సెకన్ల సమయం పట్టగా మూడో స్థానంలో నిలిచిన మార్టీ మెగారాకు 2.31.45 సెకన్ల సమయం పట్టింది. దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబైపై ఇప్పటికే ఉగ్రవాదుల దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో మారథాన్లో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. క్విక్ రెస్పాన్స్ టీం, బాంబు నిర్వీర్యృబందం, రాష్ట్ర భద్రత దళాలను నియమించారు. డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి మార్గదర్శనంలో మారథాన్ వెళ్లే రహదారి వెంబడి అడుగడుగున పోలీసులను మోహరించారు. ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)కు కూతవేటు దూరంలో ఉన్న ఆజాద్మైదాన్ నుంచి ఆదివారం ఉదయం ముంబై మారథాన్ ప్రారంభమైంది. బాంద్రా నుంచి తిరిగి (42 కి.మీ.) ఆజాద్మైదాన్కు చేరుకుంది. ఇందులో ఫుల్, ఆఫ్ మారథాన్ ఉండగా సుమారు నాలుగు వేలకుపైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అథ్లెట్లు సుమారు 150 వరకు ఉండగా 290 మంది వికలాంగులు ఉన్నారు. మిగతా వారిలో ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, పలువురు సినీ నటీ, నటులు, బుల్లి తెర నటులు, సీనియర్ సిటిజన్లు, ముంబై పోలీసు శాఖకు చెందిన సిబ్బంది ఉన్నారు. -
జాతీయస్థాయి తైక్వాండోకు పోరుమామిళ్ల విద్యార్థులు
పోరుమామిళ్ల: ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు పోరుమామిళ్లకు చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు తైక్వాండో అసోషియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ నాయబ్స్రూల్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 3, 4 తేదీల్లో తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో జూనియర్స్ పోటీల్లో పోరుమామిళ్లకు చెందిన శ్రీవిద్య 44 కేజీల బాలికల విభాగంలో బంగారు పతకం, 42 కేజీల విభాగంలో వీరవందన రజత పతకం, 55 కేజీల బాలుర విభాగంలో అబ్దుల్కలామ్ రజత పతకం సాధించారని వివరించారు. వీరు ఈనెల 28 నుంచి 31 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారన్నారు. కడప జిల్లా టీమ్ కోచ్గా బాలు, రెఫరీలుగా మహబూబ్బాషా, నరసింహప్రసాద్ వ్యవహరించారన్నారు.