Beedi workers
-
బీడీ బతుకులు మారలే...
మహిళల ఆర్థిక పరిపుష్టి, స్వావలంబనకు ఆసరాగా నిలుస్తున్న బీడీ పరిశ్రమ మసకబారిపోతున్న క్రమంలో తమ బాగుకు పనిచేసే వారి కోసం ఆ కార్మికులు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించేంతటి శక్తి ఉన్న తమను ఏ రాజకీయ పార్టీలు ఆదరిస్తాయా.. అని బీడీ కార్మికులు లెక్కలు వేసుకుంటున్నారు. బీడీ కార్మికులకు ఇప్పటి వరకు అందుతున్న జీవనభృతిని నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు హామీలిస్తున్నాయి. అయితే, కార్మికుల కనీస వేతనం, పింఛన్ పెంపుతో పాటు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం, సంక్షేమం, వైద్య సౌకర్యాల అమలు హామీలు దిశగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కంపెనీలను కట్టడి చేసేదెవ్వరు? కార్మికులకు వేతనాల పెంపు అంశంలో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రధాన కంపెనీలపై స్థానిక సర్కారు అజమాయిషీ అంతంతమాత్రమే కావడంతో న్యాయం జరగడం లేదు. 2010 నవంబర్లో వేతనాల పెంపు కోరుతూ కార్మికులు బంద్ పాటించారు. సుమారు 32 రోజులపాటు సమ్మె సాగిన క్రమంలో అప్పటి సర్కార్ కార్మికుల కనీస వేతనం రూ.130గా నిర్ణయిస్తూ 2011 డిసెంబర్లో జీఓ 41 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీఓ అమలుకు యాజమాన్యాలు ఒప్పుకోలేదు. దాంతో కార్మిక సంఘాలు మరోసారి చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం జీఓ 81 జారీ అయ్యింది. ప్రస్తుతం వేయి బీడీలకు రూ.231 మాత్రమే ఇస్తున్నారు. వాస్తవానికి జీఓ 41 అమలైతే ప్రస్తుత పరిస్థితుల్లో వేయి బీడీలకు కనీసంగా రూ.600 వస్తాయనికార్మికులు చెబుతున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వస్థాయిలో సైతం ఒత్తిడి తెచ్చి కంపెనీల యాజమాన్యాలను ఒప్పించేలా ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. తగ్గుతున్న అమ్మకాలు.. పనిదినాలపై ప్రభావం తెలంగాణలో సుమారు 4,74,438 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఈ మధ్యకాలంలో మార్కెట్లలోకి వచ్చి చేరుతున్న మినీ సిగరెట్లతో బీడీల అమ్మకాలు పడిపోతున్నాయి. ఫలితంగా కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా నెలకు పది నుంచి పదిహేను రోజులు మాత్రమే కార్మికులకు ఆకు, తంబాకు ఇస్తూ మిగిలిన రోజుల్లో కంపెనీలు బంద్ చేస్తున్నాయి. కార్మిక చట్టాల ప్రకారం కనీసం ఏడాదికి 312 పనిదినాలు కల్పించాల్సి ఉండగా, యాజమాన్యాలు మాత్రం 100 నుంచి 120 రోజులు మాత్రమే పనిదినాలు కల్పిస్తున్నాయి. వాస్తవానికి సిగరెట్లపై నిబంధనల మేరకు ప్రచారం కల్పిస్తుండగా, బీడీలపై కనీసంగా ప్రచారం లేకపోవడంతోనే అమ్మకాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా తమ పనిదినాలూ తగ్గుతున్నాయని కార్మికులు వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించే దిశగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ దృష్టి సారించలేదన్న అసంతృప్తి కార్మికుల్లో నెలకొంది. ప్రధాన సమస్యలు.. ♦ పని దినాల కుదింపు.. ఫలితంగా వేతనం చాలడం లేదు జీఓ 41(కనీసవేతన చట్టం) అమలు కాలేదు. ♦ ఈఎస్ఐ వైద్య సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు. ♦ సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కరువు. పట్టించుకోని కార్మికశాఖ. ♦ 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ ప్రత్యామ్నాయఉపాధి.. కానీ ఇంతవరకు చూపలేదు. ♦ బీడీ కట్టపై పుర్రెగుర్తు తొలగింపు అమలుకాలేదు. ♦ జిల్లాకో ఈఎస్ఐ ఆస్పత్రి ఉండాలని కార్మికుల దీర్ఘకాల డిమాండ్ ఆసరా పింఛన్ రావడం లేదు నేను ఏడేళ్లుగా బీడీలు చేస్తున్నా. పీఎఫ్ కూడా ఉంది. కానీ ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ రావడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామని అంటున్నారే తప్ప.. మంజూరు చేయడం లేదు. – బోండ్ల స్రవంతి, రాచర్లబొప్పాపూర్ -ముజఫర్ -
బీడీ కార్మికులకు న్యాయం చేయండి
ఖలీల్వాడి: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయాలని, కురుకురే ప్యాకెట్లు కొనాలని బీడీ కార్మికులపై ఒత్తిడి చేస్తున్న దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఏవో ప్రశాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కురుకురే ప్యాకెట్లు కొంటేనే కార్మికులకు ఆకు, తంబాకు వేస్తామని దేశాయ్ బీడీ యజమాన్యం కార్మికులను బెదిరిస్తున్నారని, 1000 బీడీలకు రూ.9చొప్పున తీసుకుంటున్నారని ఆరోపించారు. యజమాన్యంపై చర్యలు తీ సుకోకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హె చ్చరించారు. నాయకులు లక్ష్మి, సుజాత, ధనలక్ష్మి, విమలమ్మ, పద్మ, వసంత తదితరులున్నారు. -
ఆదుకున్న ‘భృతి’
కోరుట్ల: అసలే అరకొర పనులతో అవస్థలు పడుతున్న బీడీ కార్మికుల ఉపాధికి కరోనా గండికొట్టింది. బీడీలు చేసి కుటుంబాలను పోషించుకోవడం తప్ప ఇతర పనులు చేసుకోలేని కార్మికులకు జీవనభృతి ఆసరాగా నిలిచింది. మినీ సిగరేట్లతో బీడీ కార్మికుల ఉపాధి ఇప్పటికే ప్రశార్థకంగా మారగా..కరోనా లాక్డౌన్ మరింత సమస్యల్లోకి నెట్టింది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో బీడీ కార్మికుల ఉపాధి అవకాశాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. రెండురోజులకోసారి.. గతేడాది సుమారు 9 నెలలపాటు సాగిన కరోనా లాక్డౌన్ ఫలితంగా పూర్తి స్థాయిలో బీడీ కంపెనీలు బంద్ కాగా చాలా మంది కార్మికులు వర్ధి బీడీలు చేసి కంపెనీలు ఇచ్చినంత కూలి తెచ్చుకొని కాలం గడిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం మొదట నైట్ కర్ఫ్యూ ప్రక టించింది. మేలో పాజిటివ్ కేసులు మరింత పెరగడంతో 12వ తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సమయంలో రెండురోజులకోసారి బీడీ కంపెనీలు కార్మికులకు పనులు కల్పించాయి. నెలకు పదిరోజులకు మించి బీడీ కార్మికులకు పని దొరకలేదు. మే 12 తర్వాత సంపూర్ణ లాక్డౌన్తో కంపెనీలు బంద్ చేయడంతో కార్మికులకు పూర్తిగా ఉపాధి కరువై నానాతిప్పలుపడ్డారు. మూడునెలలపాటు.. లాక్డౌన్లో సుమారు 3 నెలలపాటు అరకొర పనులు ఉండడంతో ఇబ్బందులుపడ్డ బీడీ కార్మికులను సర్కార్ అందిస్తున్న జీవన భృతి ఆదుకుంది. జిల్లాలో సుమారు 1.20 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా 84 వేల మందికి పింఛన్ కింద ప్రతీ నెల రూ.2వేల జీవనభృతి అందుతోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీడీ తయారీ కుంటుపడిన కాలంలో కార్మికులు పింఛన్ డబ్బుతో కాలం వెల్లదీశారు. పింఛన్ రాకుంటే తమ పరిస్థితి మరింత అధ్వానంగా మారేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినా బీడీ కంపెనీలు పూర్తిస్థాయిలో పనులు కల్పించడం లేదు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీనెల 26 రోజులపాటు పనులు కల్పించాల్సి ఉంటుంది. బీడీ పింఛనే దిక్కయింది కరోనాతో బీడీ కంపెనీలు రెండునెలలపాటు బంద్ పాటించాయి. రోజు 800 నుంచి వెయ్యి బీడీలు చేసి నెలకు రూ.4 వేల దాకా సంపాదించుకునే మేము రెండునెలలు పనులు లేక తిప్పలు పడ్డాం. అంతో ఇంతో బీడీ పింఛన్ రూ.2వేలు రావడం మాకు ఆసరా అయింది. – పొలాస లక్ష్మి, కోరుట్ల పూర్తి పనులు కల్పించాలి కరోనా లాక్డౌన్ ఎత్తివేసి వారంరోజులు గడుస్తుంది. ఇప్పటికీ బీడీ కంపెనీలు రోజు విడిచి రోజు ఆకు తంబాకు ఇస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తేసినట్లే కానీ కంపెనీలు మాత్రం పూర్తిగా పనివ్వడం లేదు. నెలరోజుల్లో కనీసం 20 రోజులైనా పని ఇస్తే బీడీల తయారీపై ఆధారపడిన మాకు కొంత మేలు జరుగుతుంది. – గోనె సరోజ, బీడీ వర్కర్, కోరుట్ల -
రెట్టింపైన ఆసరా
దుబ్బాకటౌన్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది బీడీ పరిశ్రమ. జిల్లాలో 34,464 మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. బీడీ పరిశ్రమ రోజురోజు నిరాదరణకు గురవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వారికి ఆసరా పింఛన్ ద్వారా వెయ్యి రూపాయలు అందిస్తున్నారు. కాగా ఈ నెల నుంచి ఆసరా పింఛన్ రూ.2,016కు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఈ పరిశ్రమపై ఆధారపడి 10 లక్షలకు పైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. 1960 ప్రాంతంలో వెళ్లూనుకున్న బీడీపరిశ్రమ అనతి కాలంలోనే లక్షలాది మందికి జీవనోపాది కల్పిస్తూ తెలంగాణలో అతిముఖ్యమైన రంగంగా నిలిచిపోయింది. రాష్ట్రంలో ప్రధానంగా సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు బీడీ పరిశ్రమకు పుట్టినిల్లు. కొన్నేళ్లుగా పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల కేన్సర్ సోకుతుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరగడంతో కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధించింది. బీడీకట్టలపై పుర్రె గుర్తులు, 85 శాతానికి పైగా డేంజర్ బొమ్మలు ముద్రించాలని బీడీ యాజమాన్యాలకు ఆంక్షల విధించారు. అలాగే బీడీలు తాగవద్దని పెద్దఎత్తున ప్రచారం చేయడంతో బీడీ పరిశ్రమ క్రమంగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొన్నేళ్లుగా బీడీలు తాగేవారు తగ్గడంతో చాలా కంపెనీలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో లక్షలాది మంది ఆధారపడ్డ బీడీ పరిశ్రమ నెలకు 10 రోజులు కూడా పని కల్పించని దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆగమ్యగోచరంగా మారిన బీడీ కార్మికుల కష్టాలను చూసిన తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు వర్తింప చేసి గత నాలుగేళ్లుగా నెలకు వెయ్యి రూపాయలు అందిస్తుంది. జిల్లాలో 34,464 మంది బీడీ కార్మికులకు ఫించన్లు సిద్దిపేట జిల్లాలో సుమారుగా 50 వేలకు పైగా బీడీకార్మికులుండగా వీరిలో పీఎఫ్ ఉన్న కార్మికులను గుర్తించి గత నాలుగేళ్లుగా ఆసరా పింఛన్లు అందిస్తోంది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 34,464 మంది బీడీ కార్మికులకు ఆసరా పింఛన్ నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందిస్తున్నారు. బీడీ పరిశ్రమలో బీడీలు చుట్టేవారు, బీడీ కట్టల ప్యాకింగ్, గంపచాట్, బట్టివాలా తదితర రకాల కార్మికులకు ఆసరా పింఛన్లు ఇంకా 10 వేల వరకు కొత్తగా పింఛన్లు పొందిన వారు, నాన్ పీఎఫ్ కార్మికులు పింఛన్లు ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందిస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లుపొందుతున్నవారు 1,66,145మంది జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లు పొందుతున్న వారు 1,66,145 మంది ఉన్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్దారులు 57,665 మంది, వితంతువులు 50,878, దివ్యాంగులు 14,946 మంది, గీతా కార్మికులు 2,253 మంది, బీడీ కార్మికులు 34,461 మంది, చేనేత కార్మికులు 2,702, ఒంటరి మహిళలు 3,240 మంది లబ్ధిదారులు ఉన్నారు. జూన్ నుంచి ఆసరా ఫించన్లు రెట్టింపు.. జూన్ నెల నుంచి ఆసరా పింఛన్లు రెట్టింపు అవుతుండటంతో బీడీకార్మికుల కుటుంబాలు సం తోషం వ్యక్తం చేస్తున్నాయి. జూన్ నుంచి రెట్టింపు చేస్తూ జూలైలో వారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా బీడీలు చేస్తున్నా.. నేను 30 ఏండ్లకు పైబడి బీడీలు చేస్తున్నా. మాకు వ్యవసాయ పోలం ఉన్నా కాలం సరిగా కాక పంటలు పండడం లేదు. దీంతో బీడీలు చేసుకుంటా బతుకుతున్నాం. ఆసరా పింఛన్ రెట్టింపు చేయడం చాలా సంతోషంగా ఉంది. బీడీకార్మికులు చాలా ఆనందంగా ఉన్నారు. – అనితారెడ్డి, బీడీ కార్మికురాలు ప్రభుత్వం అండగా ఉంటుంది బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. బీడీ కార్మికుల కష్టాలు స్వయంగా చూసిన వారు కావడంతో ఆసరా పింఛన్లలో అవకాశం కల్పించారు. ఇప్పుడు పింఛన్లు రెట్టింపు చేస్తుండటంతో బీడీకార్మికుల కుటుంబాలకు ఆర్థింకంగా చాలా భరోసా కల్గుతోంది. బీడీ కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటుంది. – సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే దుబ్బాక. రెట్టింపుతో చాలా మేలు తెలంగాణలో 10 లక్షలకు పైగా కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతుండ్రు. బీడీ పరిశ్రమ ప్రస్తుతం సంక్షభంలో కూరుకపోవడంతో నెలకు 10 రోజులు కూడా చేతినిండా పని కల్పించని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తుండడం సంతోషకరం. ఇప్పుడు ఆసరా రెట్టింపైతే బీడీ కార్మికులకు చాలా మేలు చేకూరుతుంది. ఇంకా రాష్ట్రంలో పింఛన్లు రాని కార్మికులకు ఆసరా వర్తింపచేసి ఆదుకోవాలి – తుమ్మ శంకర్, తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాలా సంతోషంగా ఉంది ఆసరా పింఛన్లు వెయ్యిరూపాయల నుంచి రూ. 2016కు పెంచడం చాలా సంతోషంగా ఉంది. ఖార్ఖానాలు ఇప్పుడు 10 రోజులు కూడా పని కల్పించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. 2,016 పెంచడంతో మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. – జరీనా, బీడీ కార్మికురాలు దుబ్బాక -
పదునెక్కుతున్న ప్రచారాస్త్రాలు
ఎన్నికల వేళ ఏం చేయాలో అభ్యర్థులకు బాగా తెలుసు. అందుకే ఏ ప్రాంతంలో ఏ సమస్యలున్నాయో చిత్రిక పడుతున్నారు. ప్రధాన సమస్యలు గుర్తించి...తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పుకుంటున్నారు. ఇదే కోవలో ముందస్తు ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన సమస్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినవిధంగా ‘మేం అది చేశాం..ఇది చేశాం’ అంటూ అధికార పక్షం చెబుతుండగా..నెరవేర్చని హామీలను గుర్తించి వాటిపై ఏం చేశారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కరీంగనర్ జిల్లాలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన పలు అంశాలు అధికార, విపక్షాలకు ఇప్పుడు ప్రచారాస్త్రాలు అవుతున్నాయి. మేనిఫెస్టోలో అంశాల అమలు అధికార పార్టీకి అనుకూలంగా మారనుండగా.. అమలు కాని, అసంపూర్తి పథకాలపై విపక్షాలు విమర్శలు గుప్పించనున్నాయి. ప్రధానంగా బీడీ కార్మికుల సమస్యలు, ముత్యంపేట చక్కెర కర్మాగారం, పసుపు బోర్డు ఏర్పాటు, ప్రవాస పాలసీ, కరీంనగర్లో మెడికల్ కాలేజ్, లెదర్పార్కు, పరిశ్రమలు, నిరుద్యోగ సమస్య, డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాలు భూమి, రైతుబంధు, బీమా, ఆసరా, కాళేశ్వరం, మిడ్మానేరు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం తదితర అంశాలు ఇరు పార్టీలకు ప్రచారాస్త్రాలు కానున్నాయి. - ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్షా 50 వేల మందికి పైగా బీడీ కార్మికులు ఉన్నారు. - వీరి కోసం సిరిసిల్లలో ఈఎస్ఐ ఆస్పత్రి కట్టిస్తామని చెప్పినా జరగలేదు. గృహనిర్మాణ పథకం కూడా అమలు కాలేదు. - చాలా చోట్ల బీడీలను బ్యాన్ చేయడంతో ఉపాధి కోల్పోతున్న కార్మికులకు ప్రత్యామ్నాయం దొరకడం లేదు. ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. - 1,29,681 మంది బీడీ కార్మికులకు మాత్రం నెలనెలా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. - ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి ప్రాంతంలోని నిజాం దక్కన్ షుగర్స్ ప్రై .లిమిటెడ్ చెరుకు ఫ్యాక్టరీ ఈ ఎన్నికల్లోను ప్రధానాంశం కానుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రధానాంశంగా చేర్చింది. చెరకు రైతులకు పెద్ద మొత్తంలో (రూ.12 కోట్ల మేరకు) బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. - అయితే ముత్యంపేట ప్యాక్టరీ మూసివేయడంతో రైతులు ఇతర పంటల వైపు వెళ్లారు. ప్రభుత్వం ప్రయత్నం ఇంకా కొనసాగుతుండగా... ఇదే అంశాన్ని కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. - కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో పసుపు పంట దాదాపు 35 వేల ఎకరాల వరకు సాగవుతుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసింది. సాధ్యం కాలేదు. దీన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకు వస్తోంది. - జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలు గల్ఫ్ వలసలకు కేరాఫ్గా చెప్పొచ్చు. వందలాది గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరి చొప్పున సుమారు 40 వేల మంది సౌదీ అరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమన్, కువైట్, ఖతర్లో ఉంటున్నారు. - వీరిలో మంచి హోదాలో ఉన్న వారు నాలుగు వేలకు మించి ఉండరు. మిగిలిన వారందరూ కార్మికులుగా పనిచేస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు. - గల్ఫ్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవాస పాలసీని అమలు చేస్తామని చెప్పింది. కొంత ప్రగతి సాధించింది. అయితే అధికారికంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేదనే అంశాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ‘బీడీ కార్మికుల ఆస్పత్రి’ కూడా ప్రచారాస్త్రమే.. - ఏడు పూర్వ జిల్లాల్లో 16.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు ఆశలు పెట్టుకున్నారు. - మంథని, పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీరు అందడం లేదు. ప్రతియేటా ఈ నియోజకవర్గాల ప్రజలు ఆందోళన చేయడం పరిపాటిగా మారింది. దీంతో ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంకు శంకుస్థాపన చేయగా, కాళేశ్వరం ప్రాజెక్టుతో ‘పునరుజ్జీవం’ ముడిపడి ఉంది. - సిరిసిల్లలో బీడీ కార్మికుల ఆస్పత్రి, నేతన్నలకు అమల్లోకి రాని వర్కర్ టూ ఓనర్ పథకం, మహిళల ఉపాధికి అపెరల్ పార్క్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, వేములవాడ రాజన్న ఆలయ అభివద్ధికి ఏటా వంద కోట్లు.. ఇలాంటి హామీలు, పథకాలన్నీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రచారాస్త్రాలవుతాయి. - కరీంనగర్ కేంద్రంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల కలగానే మిగిలింది. పర్యాటక అభివృద్ధి నేపథ్యంలో మానేరు రివర్ఫ్రంట్, బృందావన్ గార్డెన్, తీగెల వంతెన పనులు సాగుతున్నాయి. కరీంనగర్ ఐటీ టవర్ నిర్మాణం సాగుతున్నా, ఉద్యోగావకాశాలపై చర్చ జరగనుంది. - పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ కోటాల కింద 14,500 ఇండ్లు మంజూరైనట్లు ప్రకటించినా పూర్తిస్థాయిలో నిర్మించలేదు. - కోల్బెల్టు (రామగుండం) ప్రాంతంలో సింగరేణి అధికారులకు ఇస్తున్న విధంగా సింగరేణి కార్మికులకు సొంతింటి కోసం 3 గుంటల స్థలం కేటాయింపు, కేసీఆర్ హామీ ఇచ్చిన మారుపేర్లను వెంటనే మార్చే ప్రక్రియ, సింగరేణిలో కూడా మెడికల్ కళాశాల ఏర్పాటు, రామగుండంలోని రాముని గుండాలు, శ్రీపాద ప్రాజెక్టు పర్యాటక కేంద్రాలు, బసంత్నగర్లో ఎయిర్పోర్టు ఏర్పాటు తదితర అంశాలు ఎన్నికల తెరపైకి రానున్నాయి. - సుమారు 5.89 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.612 కోట్ల మేరకు ప్రభుత్వం పంపిణీ చేసింది. రైతుబీమా కింద మొదటి విడతలో 3.19 లక్షల మంది అర్హులైన రైతులకు బీమా బాండ్లను అందజేశారు. ప్రతినెలా 5,44,215 మందికి పింఛన్లు మంజూరవుతున్నాయి. వాటిలో 1,92,563 మంది వృద్ధులు, 1,31,226 మంది వితంతవులు, 67,804 మంది వికలాంగులు, 9074 మంది చేనేత కార్మికులు, 11,615 మంది గీత కార్మికులు, 1,29,681 మంది బీడీ కార్మికులున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.59.09 కోట్లు చెల్లిస్తోంది. ప్రధానాంశాలివే... - బీడీ కార్మికుల సంక్షేమం - పసుపు బోర్డు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ - గల్ఫ్ వలస బాధితులు - కాళేశ్వరం, మధ్య మానేరు ‘పునరుజ్జీవం’, ఎస్సారెస్పీ - డబుల్ బెడ్రూం, రైతుబంధు,బీమా, ఆసరా సంక్షేమ పథకాలు - మెడికల్ కళాశాల, అపెరల్ పార్క్, వర్కర్ టు ఓనర్ పథకం - సింగరేణి కార్మికులకు సొంతింటి స్థలం - కె.శ్రీకాంత్రావు, నెట్వర్క్ ఇన్చార్జి -
పొగచూరిన బతుకులు!
నంద్యాలటౌన్: బీడీ కార్మికుల బతుకులు రోజురోజుకు దీన స్థితికి చేరుకుంటున్నాయి. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కుటుంబమంతా కష్టపడి బీడీలు చుట్టినా తగినంత కూలి రావడం లేదు. దీంతో కటుంబపోషణ, పిల్లల చదువులు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం, సంక్షేమ పథకాలు అందకపోడవడంతో ఆర్థిక ఇబ్బందులతో తమతమవుతున్నారు. పట్టణంలో బీడీలు తయారు చేసే మూడు కుటీర పరిశ్రమలు ఉన్నాయి. బీడీ తయారీకి కావాల్సిన ఆకు, పొగాకు, లేబుళ్లను, బస్తాల రూపంలో కార్మికులకు అందజేస్తారు. ఈ ముడిసరుకులను తీసుకొని కార్మికులు తమ ఇళ్ల వద్దనే బీడీలు తయారు చేస్తారు. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్, శ్రీనివాససెంటర్, ఖలీల్థియేటర్, ముల్లాన్పేట, వీసీకాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 500 మంది బీడీలు చుట్టుతూ జీవనం సాగిస్తున్నారు. కష్టానికి దక్కని ప్రతిఫలం... ఏజెన్సీలు కార్మికులకు వెయ్యి బీడీలు తయారు చేస్తే రూ.100 నుంచి రూ.150 వరకు కూలీ చెల్లిస్తున్నారు. దీంతో ఓ కుటుంబం మొత్తం రోజంతా కష్టపడినా రోజుకు వెయ్యి బీడీల కన్నా ఎక్కువ చుట్టలేమని కార్మికులు చెబుతున్నారు. దీంతో చాలీచాలని కూలిలతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నా మని వాపోతున్నారు. పిల్లల చదువులు కూడా భారంగా మారడంతో మధ్యలోనే ఆపివేసి పనులకు పంపాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని పాలకులు బీడీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు ఆరోగ్య పథకాలు, రుణాల మంజూ రు, పక్కా గృహాలు, తదితర పథకాలతో ఆదుకునే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. కూలీ గిట్టుబాటు కావడం లేదు కుటుంబ పోషణ కోసం బీడీలు చుడుతున్నా. ఈ పని తప్ప వేరే పని తెలియదు. రోజుకు 500 నుంచి 700 వరకు బీడీలు చుడుతాను. రోజుకు రూ.100 కూడా గిట్టడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారుతుంది. – నూర్జహాన్, నంద్యాల ప్రభుత్వం ఆదుకోవాలి బీడీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ప్రభుత్వం ఎలాంటి రుణాలు, సంక్షేమ పథకాలు అందజేయడం లేదు. ఇతర వృత్తుల కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. – ఫాతిమాబీ, కార్మికురాలు, నంద్యాల -
బీడీపై జీఎస్టీ వద్దు
లక్షల కుటుంబాలను రోడ్డున పడేయొద్దు ⇒ సిరిసిల్లలో కదం తొక్కిన బీడీకార్మికులు ⇒ పట్టణంలో నిరసన ర్యాలీ ⇒ కలెక్టరేట్ ముందు ధర్నా సిరిసిల్లటౌన్: బీడీ పరిశ్రమపై జీఎస్టీ వద్దని కార్మికులు నినదించారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్న బీడీ పరిశ్రమపై జీఎస్టీ వద్దని, తమ పొట్టకొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత భూమేశ్వర్ మాట్లాడుతూ.. ఇప్పటికే పుర్రెగుర్తుతో డీలాపడిన బీడీ పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారుతోందని, ఏకంగా పరిశ్రమే ఖాయిలా పడేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని అన్నారు. దీంతో లక్షలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. పుర్రె గుర్తుతో ఇప్పటికే కార్మికులకు పనిదినాలు తగ్గాయన్నారు. జీఎస్టీతో నెలకు పదిరోజులు కూడా పనిదినాలు దొరికే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ.. సామాన్యుడు బీడీలు కూడా తాగలేని పరిస్థితి దాపురించిందన్నారు. కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించకుండా బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించవద్దని డిమాండ్ చేశారు. అనంతరం బీడి కార్మికుల కష్టనష్టాలను వివరిస్తూ..కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆకుల రాములు, జిందం ప్రసాద్, మణెమ్మ, రాధ, బాలక్కతో పాటు కార్మిక సంఘాల నాయకులు, బీడి కార్మికులు పాల్గొన్నారు. -
ఒంటరి మహిళలు లక్షన్నర లోపే!
- ఆర్థిక భృతికోసం ముగిసిన దరఖాస్తు గడువు - 50 వేలకు చేరువైన బీడీ కార్మికుల దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి దరఖాస్తు గడువు ఆదివారంతో ముగిసింది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 8 నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఆదివారం వరకు 1,41,769 మంది ఒంటరి మహిళలు దరఖాస్తులు సమర్పించగా, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు 49 వేలమంది బీడీ కార్మికులు కూడా ఆర్థిక భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రతినెలా రూ.వెయ్యి ఆర్థిక భృతిని అందజేస్తామని గత శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆర్థిక భృతి మొత్తాన్ని (రూ.రెండు వేలను) జూన్ 2న లబ్ధిదారు లకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇదిలా ఉంటే.. ఒంటరి మహిళలుగా అర్హత ఉన్నవారు తమకు అభయహస్తం పింఛన్ బదులు ఆర్థ్ధిక భృతిని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 96 వేలమంది అభయహస్తం పెన్షనర్లు ఉండగా, వీరిలో సుమారు 10వేలమంది దాకా ఒంటరి మహిళలున్నట్లు సమాచారం. రాష్ట్రం లో ఒంటరి మహిళల ఆర్థిక భృతికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు అందవ చ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా 1,41,769 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. సర్కారు నిర్ణయం మేరకే! ప్రస్తుతం అభయహస్తం పథకం కింద నెలకు రూ.500 చొప్పున పింఛన్ పొందుతున్న వారిలో ఒంటరి మహిళలుగా ఆర్ధిక భృతి (రూ.1,000)ని పొందేందుకు అర్హత ఉన్న వారు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. అభయహస్తం బదులు ఆర్థిక భృతిని ఇచ్చే అంశంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు జూన్ 2న ఆర్థిక భృతిని అందజేస్తాం. – పౌసమి బసు, సెర్ప్ సీఈవో -
చేనేత పరిస్థితిపై సర్వే
ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల వివరాలను గ్రామాలవారీగా సేకరించి, చేతిమగ్గాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఆదేశించారు. దీనిపై 14 అంశాలతో ప్రొఫార్మా పంపామని, మార్చి 5లోగా నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ చేయించనున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంలో 2015–16కు సంబంధించి నియో జకవర్గానికి 1,000 ఇళ్లను మంజూరు చేసినందున వాటికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను సిద్ధం చేసి 25 ఫిబ్రవరిలోగా సమర్పించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరా ఆవాస్ యోజన కింద చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తామన్నారు. గృహ నిర్మాణ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. బీడీ కార్మికుల వివరాలు పంపాలి బీడీ కార్మికులకు గతంలో కేంద్రం ద్వారా మంజూ రు చేసిన వివరాలు, డబుల్ బెడ్ రూమ్ గృహాలకు సంబంధించిన వివరాలను ఈ నెల 25లోగా సమర్పించాలని సీఎస్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న గొర్రెల యూనిట్లకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివరాలు, డిమాండ్ సర్వే ఈ నెల 27 లోగా సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. సాదా బైనామాల రెగ్యులరైజేషన్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల దరఖాస్తుల వెరిఫికేషన్ను వేగవంతం చేసి లబ్ధిదారులకు డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. పరిహారం చెల్లింపులో పెండింగ్ వద్దు అత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు పెండింగ్లో లేకుండా చూడడంతోపాటు అవసరమైన నిధుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. మిషన్ భగీరథ ట్రంక్ వర్క్స్తోపాటు ఇంట్రా విలేజ్ పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామా ల్లో హరిత రక్షణ కమిటీల ద్వారా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. -
నామమాత్రపు పెంపు
- రూ.4 వేతనం పెంపు - యాజమాన్యాలతో ముగిసిన కార్మిక సంఘాల చర్చలు - బీడీ కార్మికుల్లో నిరాశ కోరుట్ల: బీడీ కంపెనీల యాజమాన్యాలు ఎట్ట కేలకు చేయి విదిల్చాయి. నామమాత్రపు వేతన పెంపుతో బీడీ కార్మికులు సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం బీడీ యాజ మాన్యాలు కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందం 2016 మే నెలతో ముగి సింది. మళ్లీ వేతన పెంపు కోసం కార్మిక సంఘాలుజాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీడీ కంపెనీలకు నోటీసులిచ్చి ఉద్య మించాయి. మంగళవారం హైదరాబాద్లో యాజమాన్యాలు చర్చలు జరిపాయి. వేతన పెంపు రూ.4 మాత్రమే వేతన పెంపు కోసం బీడీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, బీఎంఎస్) ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు బీడీ కార్మికుల మూల వేతనం రూ.101లో సగం మేర వేతనం రూ.50 వరకు పెంచాలని డిమాండ్ చేయగా బీడీ కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు. యాజమాన్యాలు ససేమిరా అనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వేయి బీడీలకు రూ.4 వేతనం పెంపునకు కార్మిక సంఘాల యాక్షన్ కమిటీ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. సమాన పనికి సమాన వేతనం లెక్కన ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలకు అదనంగా రూ.1,100 చెల్లించేలా ఒప్పందం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని జగి త్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో సుమారు 5.50 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. కొత్తగా మంగళవారం బీడీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కంపెనీలతో చేసుకున్న వేతన ఒప్పందం బీడీ కార్మికుల్లో నిరాశను నింపింది. ఒప్పందం అసంతృప్తిని మిగిల్చిందని తెలగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింత భూమేశ్వర్ అన్నారు. -
బట్వాడా రాక.. బతుకు బండి సాగక..
• మూడు నెలలుగా బీడీ కార్మికులకు వేతనాల్లేవు • పెద్ద నోట్ల రద్దుతో చితుకుతున్న బతుకులు • పూట గడవడమే కష్టమవుతోందంటున్న కార్మికులు.. బీడీలు చుడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలి పేరు తాటికొండ పుష్పవ్వ. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపింది. భర్తతో కలసి కోటగల్లిలో నివాసముంటున్న ఈ వృద్ధురాలు రోజుకు పావుషేరు (250) బీడీలు చేస్తుంది. ప్రతినెలా సుమారు రూ.రెండు వేల బట్వాడా వస్తుంది. కానీ, మూడు నెలలుగా చెల్లింపులు నిలిచిపోవడంతో తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. వచ్చే రెండు వేలను బ్యాంకులో వేస్తే ప్రతినెలా రెండు మూడు రోజులు బీడీలు చేయడం మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేస్తోంది. సాక్షి, నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దు బీడీ కార్మికుల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని చుట్టిన బీడీల కష్టం చేతికందక పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా మూడు నెలలుగా బీడీ కార్మికులకు బట్వాడా (వేతనం) నిలిచిపోవడంతో బీడీ కార్మిక కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. వేతనాలు అందక బతుకు బండిని నడిపేదెలా అని వారు వాపోతున్నారు. తక్షణం తమకు వేతనాలు అందకపోతే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీడీ పరిశ్రమపై ప్రభావం.. నిజామాబాద్ కేంద్రంగా బీడీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉండగా, ఒక్క నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోనే సుమారు రెండు లక్షల మంది బీడీ కార్మికులున్నారు. అలాగే.. జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల బీడీ కార్మికులున్నారు. పెద్ద, చిన్న కంపెనీలు కలిపి అత్యధికంగా నిజామాబాద్లో 82 బీడీ కంపెనీలుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 400 వరకు ఉంటాయి. అయితే, ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేస్తూ నవంబర్ 8వ తేదీన తీసుకున్న నిర్ణయం బీడీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా కార్మికులకు వేతనాలు నిలిచిపోయాయి. అక్టోబర్ నుంచి వారికి వేతనాలు అందలేదు. ఆయా కంపెనీల యాజమాన్యాలు ప్రతినెలా 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కార్మికులకు బట్వాడా ఇస్తుంటాయి. ఒక్కో కంపెనీ నెలలో ఒక్కో వారంలో వేతనాలు ఇస్తుంది. అయితే అక్టోబర్ మాసం నుంచి వేతనాలు నిలిచిపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘కష్టం’ ఖాతాల్లోకి.. ఇకపై బీడీ కార్మికులు ప్రతినెలా చెల్లించే బట్వాడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. అయితే చాలా మంది కార్మికులకు బ్యాంకు ఖాతాలు లేవు. ఖాతాల వివరాలు ఇచ్చిన కార్మికులకు కూడా ఇప్పటికీ వేతనాలు జమ కాలేదని కార్మికులు వాపోతున్నారు. బ్యాంకు ఖాతాలో జమ చేస్తే వాటిని డ్రా చేసుకునేందుకు ప్రతినెలా రెండు, మూడు రోజులు పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అంటున్నారు. ఎప్పటిలాగే నగదు రూపంలోనే బట్వాడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భారీ ధర్నా.. తమకు ప్రతినెలా ఇచ్చే బట్వాడా బ్యాంకులో కాకుండా, నగదు రూపంలో చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సుమారు పది వేల మంది బీడీ కార్మికులు నిజామాబాద్ నగరంలో భారీ ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీడీ కార్మికులు కలెక్టరేట్ను దిగ్బంధించారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది నిజామాబాద్లోని ఆర్ఎన్ చాండక్ బీడీ కార్ఖానా. సుమారు వంద మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు వెయ్యి బీడీలు చుడితే నెలకు రూ.మూడు నుంచి రూ.నాలుగు వేల వేతనం వస్తుంది. ప్రతినెలా 7వ తేదీలోగా వేతనాలు ఇస్తారు. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని వీరికి యాజమాన్యం అక్టోబర్ నుంచి బట్వాడా నిలిపివేసింది. బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నా.. ఇప్పటికీ తమకు అందలేదని కార్మికులు వాపోతున్నారు. -
బీడీ కార్మికుల గోడు వినేదెవరు?
చేతినిండా పనిలేక తిప్పలు అందని ఆసరా పథకం ఆస్పత్రి లేక ఇబ్బందులు భైంసా : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది బీడీకార్మికులు పనిచేస్తున్నారు. అందులో నిర్మల్ జిల్లాలోనే లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా చేతినిండా పనిలేక బీడీ కార్మికులు అలమటిస్తున్నారు. పెద్ద సంఖ్యలోనే ఉన్న కార్మికులకు స్థానికంగా ఆసుపత్రి కూడా లేదు. కార్మిక ఆసుపత్రి లేక రోగాలభారినపడుతున్న వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సివస్తుంది. తెలంగాణ ఏర్పడకముందే బీడీ కార్మికుల ఇబ్బందులు తెలిసిన ఈ ప్రభుత్వం కార్మికులందరికి జీవనభృతి చెల్లిస్తుంది. ప్రతినెల రూ. 1000 జీవనభృతిని ఆసర పథకం కింద అందిస్తున్నా కొంత మంది కార్మికులకే ఇది వర్తిస్తుంది. పూర్తిస్థాయిలో ఉన్న బీడీకార్మికులకు ఆసర పథకం కింద ప్రతినెల రూ. 1000 జీవనభృతి అందిస్తే వీరి కుటుంబాలు గడుస్తాయి. ప్రధాన ఉపాధి జిల్లాలో వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమయే ప్రధాన ఆధారం. ఈ పరిశ్రమపై జిల్లాలో లక్ష మందికిపైగా కార్మికులు ఉపాది పొందుతున్నారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా బీడీకార్మికులు ఉన్నారు. శివాజీ, షేర్షాప్, దేశాయి, రాజ్కమల్, చార్బాయ్, మారుతి ఇలా చెబుతుపోతే అన్ని బీడీ కంపెనీలు సగం రోజులే పని ఇస్తున్నాయి. నెరవేరని డిమాండ్లు బీడీ కార్మికుల కోసం ప్రభుత్వం జీఓ నం. 41 విడుదలచేసిన ఇప్పటికీ డిమాండ్లు నెరవేరలేదు. యాజమాన్యం ఒత్తిడితో ప్రభుత్వం మరో జీఓను విడుదలచేసింది. దీంతో కార్మికులు తరచు పోరాటాలుచేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బీడీ అమ్మకాలపై నిషేదాలు విదిస్తుంది. పుర్రెగుర్తు సైజును ప్రతియేటా పెంచుతూ వస్తుంది. ఈ గుర్తును తగ్గించాలని యాజమాన్యం సమ్మెకు దిగిన కార్మికులే నష్టపోతున్నారు. ఇటు ప్రభుత్వానికి అటు యాజమన్యానికి కార్మికుల ఇబ్బందులు పట్టడంలేదు. దీంతో చేసేదేమిలేక ఎవరికి చెప్పుకోలేక సగంరోజులే పనిచేసి కార్మికులంతాపస్తులుంటున్నారు. -
చిన్న పరిశ్రమలపై చిన్నచూపు తగదు
జీడిమెట్ల: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పరిశ్రమలకు రెడ్కార్పెట్ వేస్తూ చిన్న చిన్న పరిశ్రమలపై వివక్ష చూపుతోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం షాపూర్నగర్లోని ప్రెస్క్లబ్లో ఐఎఫ్టీయూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 727ను వెంటనే రద్దు చేసి జీవో నెంబర్ 41ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో బీడీ కార్మికులకు నెలకు రూ.1000 జీవనభృతి ఇవ్వాలని కోరారు. కార్మికుల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. చిన్న పరిశ్రమలను పోత్సహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు జేఏసీ పోరాడుతుందనిన్నారు. కార్యక్రమంలో నాయకులు అచ్యుతరావు, శేణు, రాజ్యలక్ష్మి, జీవన్, పద్మ, శోభారాణి, వజ్రమణి, శోభ, నాగమణి, పుష్ప, భారతి, ప్రమీల, అంజమ్మ, జన్నిబాయి తదితరులు పాల్గొన్నారు. -
'బీడీ కార్మికుల పొట్టకొట్టే జీఓ రద్దు చేయాలి'
హైదరాబాద్: బీడీ కార్మికుల పొట్టకొట్టే జీఓ నెం 727(e) ను రద్దు చేయాలంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మహిళలు, బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని జగద్గిరిగుట్టలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటీవల బీడీ కట్టలపై ఉండే పుర్రె బొమ్మను 40 శాతం నుంచి 80 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని నిరసిస్తూ..వెంటనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. -
బీడీ కార్మికులకు కేంద్ర నిధులతో ఇళ్లు
♦ కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి ♦ పెన్షన్, పీఎఫ్ సెటిల్మెంట్లకు ‘శ్రమ్ సువిధ’ పోర్టల్ ♦ కింగ్ఫిషర్ ఉద్యోగుల హక్కుల కోసం స్క్వాడ్ సాక్షి, హైదరాబాద్: బీడీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర నిధులతో పక్కా గృహాలు కట్టిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని నిజామాబాద్, వరంగల్, సిద్దిపేటలను గుర్తించామని, రాష్ట్రం ప్రభుత్వం స్థలం ఇస్తే మోడల్ హౌస్లు నిర్మిస్తామన్నారు. అలాగే ఏపీలో ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని భవిష్య నిధి కార్యాలయంలో తెలంగాణ, ఏపీలకు చెందిన ఈపీఎఫ్ అధికారులతో దత్తాత్రేయ సమీక్ష నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు పెన్షన్, క్లెయిమ్లు, సెటిల్మెంట్లను పారదర్శకంగా నిర్వహించేం దుకు ‘శ్రమ్ సువిధ’ వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కార్మిక సేవలను సులభతరం చేస్తున్నామన్నారు. తెలంగాణలో 29,269 పరిశ్రమలలో 36.91 లక్షల మందికి, ఏపీలో 22,706 పరిశ్రమల్లో 13.29 లక్షల మందికి భవిష్య నిధి సభ్యత్వం ఉందన్నారు. యాజ మాన్యాలతో సంబంధం లేకుండా వీరికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ద్వారా పీఎఫ్ సొమ్ము నేరుగా పొందేలా కృషి చేస్తున్నామన్నారు. కార్మికుల కనీస వేతనాన్ని పెంచాలని భావిస్తున్నామని, ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టామన్నారు. బ్యాంకులకు రూ. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ‘కింగ్ఫిషర్’ యజమాని విజయ్మాల్యా విదేశాలకు పారిపోవడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ఒక స్క్వాడ్ను ఏర్పాటు చేశామన్నారు. తమ శాఖ తరఫున వేసిన కమిటీ నివేదిక ఆధారంగా ‘కింగ్ఫిషర్’ నుంచి ఏ మేరకు నిధులు రావాల్సి ఉందో.. వాటన్నింటినీ రాబట్టి ఉద్యోగులకు అందిస్తామన్నారు. పార్లమెంటులో ఆధార్ బిల్లుకు ఆమోదం వల్ల కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. కానీ కాంగ్రెస్, వామపక్షాలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తూ కీలక బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, గుంటూరు రీజనల్ అధికారులు ఎం.ఎస్.కె.వి.వి. సత్యనారాయణ, కె.నారాయణ, పి.వీరభద్రస్వామి పాల్గొన్నారు. -
‘సంక్షేమానికి’ ఆధార్ తప్పనిసరి చేయొద్దు
లోక్సభలో బిల్లుపై చర్చలో మేకపాటి రాజమోహన్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పంపిణీకి ఆధార్ కార్డును తప్పనిసరి చేయరాదని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం లోక్సభలో ఆధార్ బిల్లు-2016పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది కూలీలు.. ముఖ్యంగా బీడీ కార్మికులు, గని కార్మికుల సహజమైన వృత్తికారణంగా వారి బయోమెట్రిక్ గుర్తులను సేకరించడం సాధ్యపడదని తెలిపారు. ఈ పరిస్థితులను గమనించి ఆధార్ను తప్పనిసరి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులను పంపితే మళ్లీ ఆధార్ కార్డు రావడం లేదన్నారు. దీంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సులువుగా ఆధార్ కార్డు పొందడం, మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. -
‘పుర్రె’ పోటు
♦ బీడీ కార్మికుల ‘ఉపాధి’పై దెబ్బ ♦ పది రోజులు ఆందోళన చేసినా స్పష్టత ఇవ్వని సర్కారు ♦ 2.50 లక్షల బీడీ కార్మికుల్లో అభద్రత ♦ మళ్లీ ఏప్రిల్ నుంచి పోరుకు సన్నద్ధం ♦ చిత్రంలో కనిపిస్తున్న వాళ్లు మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్కు చెందిన కంఠం సాయమ్మ. ఈమె వయసు 70 సంవత్సరాలు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో తనపై ఆధారపడి ఉన్న కూతురు రూప, కొడుకు భరత్ల కోసం రోజు బీడీలు చుడుతుంది. సాయమ్మ కూతురు, కొడుకుల మానసిక స్థితి బాగులేక పోవడంతో అన్ని తానై కుటుంబాన్ని ఆ వృద్ధురాలు నెట్టుకొస్తుంది. సాయమ్మ చిన్న తనం నుంచి బీడీలు చుడుతోంది. రోజుకు వేయి బీడీలు చుడితే నెలకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు లభిస్థారుు. ఈమెకు బీడీలు తప్ప మరో పని తెలియదు. మొన్నటి వరకు బీడీ పరిశ్రమలు బంద్ కావడంతో చాలా అవస్థలు పడ్డామని తెలిపింది. పుర్రె గుర్తును తొలగించాలని వేడుకుంటోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పల్లె జీవనంలో వివిధ వృత్తులు, ఉపాధి ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న మహిళలకు ‘పుర్రె’ గుర్తు ప్రతిబంధకం అవుతోంది. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న ఉత్తర్వులపై ప్రభుత్వాలు ఏటూ తేల్చక పరిశ్రమను నమ్ముకున్న వారిని అభద్రతలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు బీడీ తయారీ కంపెనీలు.. మరోవైపు కార్మిక సంఘాలు తరచూ ఆందోళనలకు దిగుతుండటంతో బీడీ పరిశ్రమను నమ్ముకున్న కార్మికుల ‘ఉపాధి’కి భరోసా లేకుండా పోతుంది. ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘ది తెలంగాణ బీడీ మాన్యుప్యాక్చరర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమల బంద్కు పిలుపునివ్వడం.. బీడీలు చుట్టి ఉపాధి పొందే మహిళలకు పిడుగు పాటులా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ బీడీ పరిశ్రమలను బంద్ పెట్టడంతో జిల్లాలో బీడీలు చుడుటూ జీవించే 2.50 లక్షల మంది ఉపాధిపై దెబ్బ పడింది. ఈ బీడీ పరిశ్రమపై మహిళలతోపాటు బట్టివాలా, ప్యాకింగ్ కార్మికులు, వార్మెన్లు, గంపావాలా, గుమాస్తాలు, అకౌంటెంట్ల కుటుంబాల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అసలు కారణం 85 శాతమే.. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉప సంహరణ ప్రధాన డిమాండ్గా బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తాజాగా తెరపైకి తెచ్చింది. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 297 ద్వారా బీడీ కట్టలపై 41 శాతం పుర్రె, ఎముకల గుర్తులను ముద్రించాలని ప్రకటించింది. ఈ ఉత్తర్వులపై బీడీ కార్మికులు, సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ఫలి తం లేదు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్క్య్లర్ జీవో 727(ఈ) ద్వారా 85 శాతం డేంజర్ గుర్తును ఏప్రిల్ నుంచి ముద్రించాలని కోరడంతో మళ్లీ బడీ కంపెనీలు ఆందోళనకు దిగాయి. బీడీ కట్టలపై 85 శాతం పుర్రెగుర్తు ముద్రించాలని జారీ చేసిన జీఎస్ఆర్ 727(ఈ)ను నిరసిస్తూ బీడీ కంపెనీల మూసివేతకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 80 లక్షల మంది బీడీలు చుట్టే బీడీ కార్మికులు ఉం టే.. ఆ పరిశ్రమలో ఇతర పనులు చేసే వారు 1.30 కోట్ల మంది కార్మికులు ఉన్నారనేది అంచనా. కాగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 8 లక్షల మంది బీడీ కార్మికులు, లక్ష మంది వరక తునికాకు సేకరించే కార్మికులు బీడీ పరిశ్రమలో పనిచేస్తూ జీవితాలు వెళ్లదీస్తున్నారు. మళ్లీ ఏప్రిల్ నుంచి ఆందోళనకు బీడీ కార్మికులు సిద్ధం అవుతున్నారు. -
ఉపాధిపై పుర్రె పోటు
ఆదుకోని చట్టాలు.. ఆకలి తీర్చని పని. పొద్దంతా కష్టం.. రోగాలతో సతమతం.. ఇదీ క్లుప్తంగా బీడీ కార్మికుల జీవితం. విరామం లేకుండా కష్టిస్తున్నా జీవితమంతా దుర్భరమే. పండగలు, పబ్బాలకు దూరమై.. కుటుంబ పోషణలో లీనమై.. అవసరానికి ఆదుకోని సంపాదనతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొందరు పీఎఫ్ లేక శాపగ్రస్తులు కాగా.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరి ‘పుర్రె’లు పగిలిపోయేలా ఉన్నాయి. * శ్రమ దోపిడీకి గురవుతున్న బీడీ కార్మికులు * ఆదుకోని యాజమాన్యాలు.. ఆసరా ఇవ్వని వేతనాలు * కేంద్ర ప్రభుత్వ ‘పుర్రె’ నిర్ణయంపై నిరసన జ్వాలలు * నష్టపోతున్నామని.. ఇబ్బందులు పెట్టొద్దని వేడుకోలు మిరుదొడ్డి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది కార్మికులు బీడీ రంగాన్నే నమ్ముకున్నారు. వీరిలో అధిక శాతం మహిళలు కావడం గమనార్హం. జిల్లాలో సుమారు 82 వేల మంది పనిచేస్తున్నారు. అందులో 60 వేల మందికి ఫీఎఫ్ నంబర్లు ఉండగా.. 22 వేల మంది నాన్ పీఎఫ్ నంబర్లు కలిగి ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, నంగునూరు, గజ్వేల్, రామాయంపేట, మెదక్, నర్సాపూర్, తూప్రాన్, అందోల్, జోగిపేట, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఒక కార్మికుడికి వెయ్యి బీడీలు చుట్టినందుకు రూ.152 చెల్లించాలి. ఇందులో పీఎఫ్ కటింగ్ పోను రూ.139 ఇస్తున్నారు. టేకే దారులు అందులోనూ రూ.3 నుంచి రూ.5 వరకు తగ్గించి అందజేస్తున్నారు. పీఎఫ్ కార్డులు లేవన్న సాకుతో వారి శ్రమను దోచేస్తున్నారు. నెలకు కనీసం 26 రోజుల పని దినాలను కల్పించాలన్న నిబంధన ఉన్నా 15 రోజులు కూడా వర్క కల్పించడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సరిపడని ఆకు, తంబాకు బీడీ యాజమాన్యం ప్రతి వెయ్యి బీడీల తయారీకి 650 గ్రాముల ఆకు, దానికి సరిపడా తంబాకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే, ఆకు తూకంలో తాము మోసపోతున్నామని కార్మికులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆకు అందిస్తుండటంతో అదనంగా కిలోకు రూ.100 నుంచి లేక రూ.120లు చెల్లించి ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నామన్నారు. వైద్య సేవలు నిల్ మహిళా బీడీ కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు బీడీలు చుడుతూనే ఉంటారు. దీంతో వారికి శ్వాస సంబంధిత వ్యాధులు, మెడ.. వెన్ను నొప్పులు వెంటాడుతున్నాయి. వీరికి డెస్పెన్సరీలతో పాటు మొబైల్ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాల్సి ఉన్నప్పటికీ అవేమీ అమలులో లేవు. దీంతో అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తెర మీదకి ‘పుర్రె’ గుర్తు ఇప్పటికే అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్న బీడీ కార్మికుల జీవితాలను కేంద్ర ప్రభుత్వం సైతం ఇబ్బందుల్లోకి నెట్టింది. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించాలన్న నిర్ణయంతో కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల తమ బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనోపాధికి చిచ్చుపెట్టే పుర్రె గుర్తును తొలగించాల్సిందేనని పలు బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తొలగింపుపై తీర్మానం బీడీ కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉన్న పుర్రె గుర్తును కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మిరుదొడ్డి మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బలపరిచారు. తెలంగాణలో ఎక్కువ శాతం బీడీ రంగాన్ని నమ్ముకున్నారని.. బీడీ కట్టలపై పుర్రెగుర్తును ముద్రించాలన్న యోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. - దుబ్బాక ఎమ్మెల్యే ఉద్యమాలు చేస్తాం బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తున్నాం. కార్మికుల ఉపాధిపై దెబ్బ కొట్టడం సరికాదు. సంక్షోభంలో ఉన్న బీడీ కార్మిక రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం ఎంత వరకు సమంజసం. పుర్రె గుర్తును తొలగించే వరకు బీడీ కార్మికులతో ఐక్య ఉద్యమాలు చేస్తాం. - గొడ్డుబర్ల భాస్కర్, తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పరేషాన్ చేస్తున్నరు ఆకు తూకంలో తేడాలు వస్తున్నయ్. నాణ్యత లేని ఆకే ఎక్కువగా ఉంటుంది. వెయ్యి బీడీలు చేయాలంటే గగనంగా మారుతోంది. అదనంగా ప్రైవేటుగా రూ.120 తో ఆకు కొంటున్నం. గివ్వన్ని సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే పుర్రె గుర్తు పెడ్తమని మమ్మల్ని పరేషాన్ చేస్తున్నరు. - బోయిని కనకవ్వ, బీడీ కార్మికురాలు పట్టించుకునేటోళ్లు లేరు బీడీలు చుట్టేటప్పుడు తంబాకుతో రోగాల పాలైతున్నం. మెడ నొప్పులు, వెన్ను నొప్పులతో మస్తు ఇబ్బందులు పడుతుంటం. రోగాల పాలై మంచాన పడ్డా ఎవరూ పట్టించుకోరు. చేసేది లేక వ్రైవేటు దవాఖానల చూపెట్టుకుంటున్నం. - అక్కమ్మ బాలమణి, బీడీ కార్మికురాలు పుర్రెగుర్తు తొలగించాలి పొగ తాగితే కాన్సర్ వస్తదనే సాకుతో బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెడతారా? మద్యం మీద లేని ఆంక్షలు బీడీలపైనే ఎందుకు? మద్యంతో సంసారాలు గుల్ల అవుతున్నాయి. జీవనోపాధి కలిగించే బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెట్టుడు సరికాదు. మా పొట్టలు కొట్టొద్దు, పుర్రెగుర్తు తొలగించాలి. - వనం పద్మ, బీడీ కార్మికురాలు నిర్వీర్యం చేయడానికే... బీడీ రంగాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్రం పుర్రె గుర్తును తెరమీదికి తెచ్చింది. దీని వల్ల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రభుత్వం వెంటనే పుర్రెగుర్తు ముద్రించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇందుకోసం మండల సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. - పంజాల కవిత, ఎంపీపీ మిరుదొడ్డి -
బీడీకార్మికుల ర్యాలీ
ఆదిలాబాద్: బీడీ కట్టలపై పుర్రె గుర్తు తొలగించాలంటూ ఆదిలాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ముథోల్ మండల పరిషత్ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ తీశారు. తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని, పుర్రె గుర్తును తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ దత్తుకు వినతిపత్రం అందజేశారు. -
ఆదిలాబాద్లో బీడీ కార్మికుల ఆందోళన
ఆదిలాబాద్: బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించాలనే డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న దాదాపు 100 మంది కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని, పుర్రె గుర్తును చిన్నదిగా ముద్రించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, అధికారులకు వినతిప్రతం అందజేశారు. -
సిరికొండలో బీడీ కార్మికుల ర్యాలీ
నిజామాబాద్ : బీడీ కట్టలపై గొంతు క్యాన్సర్ గుర్తు పరిమాణాన్నితగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ సిరికొండ మండల కేంద్రంలో మంగళవారం ఆందోళనకు దిగింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని నినదిస్తూ బీడీ కార్మికులు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిప్యూటి తహశీల్దార్ విక్రమ్కు వినతి పత్రం అందజేశారు. -
బీడీ పరిశ్రమకు ‘పుర్రె’ భయం
సిరిసిల్ల/గంభీరావుపేట: బీడీ పరిశ్రమ మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తోంది. బీడీ కట్టలపై పుర్రె, డేంజర్ గుర్తులు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలోని బీడీ పరిశ్రమ మూతబడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా పది జిల్లాల్లో బీడీ పరిశ్రమను సోమవారం నుంచి మూసివేయాలని బీడీ కంపెనీలు నిర్ణయించాయి. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 297 ద్వారా బీడీ కట్టలపై 40 శాతం పుర్రె, ఎముకల గుర్తును ముద్రించాలని ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బీడీ కార్మికులు ఆందోళన చేశారు. అప్పటినుంచి ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. కార్మికుల ఆందోళనలు పట్టించుకోకుండా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్క్యులర్ జీవో 727(ఈ) ద్వారా 85 శాతం డేంజర్ గుర్తును ఏప్రిల్ నుంచి ముద్రించాలని కోరడంతో బీడీ కంపెనీలు సంక్షోభంలో పడ్డాయి. మినీ సిగరెట్ల ప్రభావంతో బీడీ పరిశ్రమ అంతంత మాత్రంగానే నడుస్తుండగా, కొత్తగా పుర్రె, ఎముకల గుర్తులతో పరిశ్రమ మూతబడే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. పరిశ్రమ మూత.. ఉపాధికి కోత ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా బీడీ కట్టలపై పుర్రె గుర్తు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బీడీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. రాష్ట్రంలో 400 బీడీ కంపెనీలుండగా ఎనిమిది లక్షల మంది కార్మికులు ఉన్నారు. పుర్రెగుర్తు ముద్రణపై ప్రభుత్వం పునరాలోచించాలని యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే వినతిపత్రం సమర్పించినా స్పందన లేకపోవడంతో కంపెనీలు మూసివేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బీడీ ఉత్పత్తిని నిలిపివేసేందుకు బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ టొబాకో మర్చంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లోని ఎనిమిది లక్షల మంది కార్మికులకు ప్రత్యక్షంగా బతుకుదెరువు కరువు కానుంది. కరీంనగర్ జిల్లాలో రెండులక్షల మం ది కార్మికులు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఆదిలాబాద్లో లక్ష, వరంగల్లో 80 వేలు, మెదక్లో మరో 60 వేలు, నల్గొండ, మహబాబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మరో లక్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వెయ్యి బీడీలకు సగటున రూ.153 ఇస్తున్నారు. నిత్యం 50 కోట్ల బీడీలు ఉత్పత్తి అవుతున్నాయి. కంపెనీల మూసివేతతో బీడీ తయారీదారులతోపాటు బట్టీవాలా, ప్యాకింగ్ కార్మికులు, వాచ్మెన్లు, గంపావాలా, గుమస్తాలు, అకౌంటెంట్లు వంటి ఉద్యోగులకు ఉపాధి దూరం కానుంది. -
బీడీ కార్మికులకు ‘పుర్రె’ భయం
జగిత్యాల రూరల్: బీడీ కార్మికులకు మళ్లీ ‘పుర్రె’ భయం పట్టుకుంది. బీడీ కట్టల ప్యాకింగ్పై 85 శాతం మేరకు పుర్రె గుర్తును ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో జీవో 729 విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి బీడీకట్టలపై ఈ మేరకు పుర్రె గుర్తు ఉండాల్సిందేనని కేంద్ర ఆరోగ్యశాఖ బీడీ కంపెనీలకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు గత యూపీఏ ప్రభుత్వం 25 శాతం పుర్రెగుర్తు ముద్రిం చాలని ఆదేశించగా... ప్రస్తుత ప్రభుత్వం ‘పుర్రె’ సైజును 85 శాతానికి పెంచింది. దీంతో రానున్న రోజుల్లో బీడీల వినియోగం తగ్గి, ఆ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు ఆరు లక్షల మంది బీడీకార్మికులున్నారు. కరీంనగర్ జిల్లాలో 50 కంపెనీల్లో సుమారు రెండు లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తుండగా, నిజామాబాద్ జిల్లాలో వంద కంపెనీల్లో 2.80 లక్షల మంది, ఆదిలాబాద్ జిల్లాలో పది కంపెనీల్లో 40 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరితోపాటు బీడీ కంపెనీల్లో ప్యాకర్స్, టేకర్స్, బట్టీవాలాలు పనిచేస్తుంటారు. వీరిలో మహిళలే అధికం. బీడీకట్టలపై పుర్రెగుర్తు ముద్రించడం తో వ్యాపారం తగ్గి.. బీడీ కంపెనీలు మూతపడే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్షేమం మరిచిన సర్కారు: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో మహిళలు అధికంగా బీడీ పరిశ్రమపై ఆధారపడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్నారు. చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు వేతనాలు పెంచకపోగా.. ఇప్పుడు పుర్రె గుర్తును తెరపైకి తేవడంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో బీడీ కార్మికురాలు వెయ్యి బీడీలు చుడితే వారి నుంచి సుంకం పేరుతో రూ.16 వసూలు చేస్తోంది. దేశంలో ఉన్న బీడీ కార్మికులకు గత ఇరవై ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తప్ప కొత్తగా పథకాలు తీసుకురాకపోవడంతో తమ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో అర్థమవుతోందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధిన పడతాం.. నేను బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. బీడీల కంపెనీలు మూతపడితే వీధిన పడతాం. - గొడుగు అంజవ్వ, బీడీ కార్మికురాలు,హన్మాజీపేట, జగిత్యాల మండలం ‘పుర్రె’ను తీసేయాలి వ్యవసాయ పనులు లేక బీడీలపైనే ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నాం. పుర్రెగుర్తును తీసేసి బీడీ పరిశ్రమలు మూతపడకుండా చూడాలి. - బోధనపు లక్ష్మి, బీడీ కార్మికురాలు, పొరండ్ల, జగిత్యాల మండలం -
కేసీఆర్ బోళాశంకరుడు
మీ తప్పు వల్లే పింఛన్లు రాలేదు.. బీడీ కార్మికులతో ఎంపీ కవిత కరీంనగర్: సీఎం కేసీఆర్ బోళాశంకరుడిలా అడిగిన వారికల్లా వరాలు ఇస్తాడని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని చల్గల్లో సోమవారం ‘మన ఊరు-మన ఎంపీ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు బీడీ కార్మికులు తమకు పింఛన్ రావడం లేదని ఎంపీకి విన్నవించగా ‘సమగ్ర సర్వే చేసినప్పుడు బీడీల చాటను దాచిపెట్టి ‘మేం బీడీలు చుట్టడం లేదు’ అని చెప్పుకున్నారు. కొందరేమో తెలివిగా బీడీ కార్మికులు కాకపోయినా ‘మేం బీడీలు చుడుతున్నాం’ అని రాయించుకున్నరు. దీంతో సర్వేలో ఉన్న వాళ్లకే పింఛన్లు వస్తున్నాయి.’ అని స్పష్టం చేశారు. సౌదీలో తన కుమారుడు చనిపోతే ఇప్పటి వరకు శవాన్ని కూడా తీసుకురాలేదని ఓ మహిళ విలపిస్తుండగా ‘సౌదీలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు శవాన్ని పంపించడం లేదు. ఆ దేశంతో భారత్కు ఎలాంటి ఒప్పందాలూ లేవు. ఈ విషయంపై పలుమార్లు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో మాట్లాడుతూనే ఉన్నాం.’ అని చెప్పారు. -
సవరిస్తే సహించేది లేదు
వినాయక్నగర్: కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించడానికి పూనుకుంటే సహించేది లేదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అధ్యక్షతన సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల అనుంబంధ బీడీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను చైతన్య పర్చడానికి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. -
జీవన భృతి కోసం నిరసన
ఆదిలాబాద్ : బీడీ కార్మికులుకు అందించే జీవన భృతిలో జాప్యం ప్రదిర్శిస్తున్నారని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని బాధితులు నిర్బంధించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కుమారి గ్రామంలో దాదాపు 100 మంది మహిళలు తమకు జీవనభృతి కల్పించాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. (నేరేడుగొండ) -
భ్రాంతియేనా!
⇒ జీవనభృతి కోసం సాగుతున్న పోరాటం ⇒ మిన్నంటుతున్న బీడీ కార్మికుల నిరసనలు ⇒ కార్యాలయూల ముట్టడి: అధికారుల నిలదీత ⇒ సర్కారు నుంచి కొత్త మార్గదర్శకాలు విడుదల ⇒ రహస్యంగా ఉంచిన డీఆర్డీఏ అధికారులు ప్రగతినగర్ : జీవనభృతి మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడంతో బీడీకార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనబాట పడుతున్నారు. అర్హత ఉన్నవారికి కూడా భృతిని అందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పీఎఫ్ ఉన్నవారికే అని, మరోసారి వర్ధీ బీడీ కార్మికులకు కూడా భృతి అని చేస్తున్న అస్పష్ట ప్రకటనలు త మను గందరగోళానికి గురి చేస్తున్నాయని వాపోతున్నారు. విధిలేక నిరసనలు,ధర్నాలు చేస్తున్నారు. అధికారులను అడ్డుకుంటున్నారు. సోమవారం వందల సంఖ్యలో బీడీ కార్మికులు ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించారు. బుధ, గురువారాలలో పోరాటానికి దిగా రు. ధర్పల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించా రు. సిరికొండ మండలంలో పింఛన్ పంపిణీ చేస్తున్న అధికారులను అడ్డుకొని నిలదీశారు. దీంతో అధికారు లు పింఛన్ పంపిణీ నిలిపివేశారు. మాక్లూర్ పోస్టాఫీ స్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒకమాట, గెలిచాక మరోమాట చెబుతూ తమ కడుపులు కొడుతోందని దు య్యబడుతున్నారు. ఇంటిలో అత్తకు వస్తే అవ్వకు రా దని, అవ్వకు వస్తే అయ్యకు పింఛను రాదంటూ పలు నిబంధన విధించి ఇప్పుడు భృతిని బ్రాంతిగా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాగైతే తెలంగాణ ఉద్యమంలా బీడీ కార్మికుల మరో ఉద్యమం మొదలవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అవగాహన కరువు ఇదిలా ఉండగా, ప్రభుత్వం జీవనభృతి పంపిణీ కో సం కొత్త మార్గాదర్శకాలను రూపొందించింది. బయటకు పొక్కితే నిరసనలు తప్పవని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 3,86,544 మందికి పింఛన్ అందిస్తున్నారు. ఇందు లో వృద్ధాప్య 1,22,304, వితంతు 1,11,615, వికలాంగులు 34,352, చేనేత 916, గీత 1,678, బీడి కార్మికులు 1,14,208, ఎయిడ్స్వ్యాధిగ్రస్తులు 1,435, అభయహస్తం 9,013 పింఛన్లు ఉన్నాయి. బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందిస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. అయితే, సమగ్ర కుటుంబ సర్వేలో కొందరు తాము బీడీ కార్మికులమని చెప్పినప్పటికీ పీఎఫ్ ఫార్మాట్లో నమోదు చేయించలేదు. అనంతరం పీఎఫ్ నంబరు కలిగిన కార్మికులు తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయూలలో, ప్రజావాణిలో, మున్సిపాలిటీలలో, డీఆర్డీఓ కార్యాలయంలో, కా ర్ఖానాల యాజమాన్యాలకు దరఖాస్తులు అందించా రు. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే విషయంలో సరియైన అవగాహన కల్పించలేదు. దీంతో అసలు దరఖాస్తు ఎలా అందించాలో తెలియక చాలా మంది వివిధ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టారు. చివరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు సమగ్ర సర్వే డాటాతో క్రోఢీకరించి పింఛన్లు మంజూరు చేశారు. అయితే, ఇప్పడు కొత్త చిక్కు వచ్చి పడింది. గుర్తింపు పొందిన కార్ఖానాలలో పని చేస్తూ, పీఎఫ్ నంబరు కలిగి, పీఎఫ్ కట్ అవుతున్నవారికి మాత్రమే భృతి అందించాలని నూతన మార్గదర్శకాలు సెర్ప్ కార్యాలయం నుంచి జారీ అరుునట్టు సమాచారం. ఇంతే కాకుండా కార్మికుల సీనియూరిటీ, ఈపీఎప్తోపాటు రిజిస్ట్రేషన్ను కూడ పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం వర్ధీ బీడీ కార్మికులతొ కలుపుకుంటే 2,70,633 మంది ఉన్నారు.అందులో 1,14,208 మ ందికి భృతిని అందిస్తున్నారు. పీఎఫ్ ఉన్నవారు మరో 25 వేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. -
మీ ఇంట్లో ముగ్గురు మంత్రులు.. మా ఇంట్లో రెండు పింఛన్లు వద్దా ?
హైదరాబాద్: " సీఎం కేసీఆర్ ఇంట్లో ముగ్గురు మంత్రులు ఉండవచ్చు కానీ మా ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తే తప్పవుతుందా .." అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాలు.. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా ఏడో మహాసభలు గురువారం సిరికొండ మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సభలో ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగం ప్రారంభించగానే బీడీ కార్మికులు లేచి తమకు జీవనభృతి రావడం లేదంటూ వాపోయారు. ఒక్కొక్కరు మాట్లాడాలని సూచించగా.. గడ్కోల్ గ్రామానికి చెందిన ఓ బీడీ కార్మికురాలు మాట్లాడుతూ.. "కేసీఆర్ ఇంట్లో ముగ్గురికి పదవులు ఉండగా లేనిది.. తమకు ఒక ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇస్తే ఏంపోతుంది" అని ప్రశ్నించింది. -
'అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు'
సిరికొండ (నిజామాబాద్ జిల్లా): పంటలు సాగు చేసుకోవడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ప్రైవేటు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా ఏడో మహాసభలు గురువారం సిరికొండ మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. వ్యవసాయంలో రైతులు నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో కుదేలవుతున్నారని వాపోయారు. పంటల సాగుకు అయ్యే ఖర్చుతోపాటు అదనంగా 50 శాతం కలిపి పంటలకు మద్దతు ధర ప్రకటించాల్సి ఉండగా ప్రభుత్వాలు అలా చేయడం లేదన్నారు. ‘మిషన్ కాకతీయ’ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి, చెరువుల్లో జరుగుతున్న పనులను రైతులు పర్యవేక్షించాలని సూచించారు. జీవనభృతి కోసం బీడీ కార్మికులు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నారని, అన్నదాతలు మాత్రం తమ పంటలకు మద్దతు ధర కావాలని, సకాలంలో విత్తనాలు అందచేయాలని ఎక్కడా ఉద్యమాలు చేపట్టడం లేదన్నారు. రైతులు కూడా మహిళల లాగానే సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొని హక్కుల సాధన కొరకు ఉద్యమించాలన్నారు. -
జీవనభృతి కోసం రోడ్డెక్కిన బీడీ కార్మికులు
- అందరికీ ‘భృతి చెల్లించాలంటూ చేగుంట-మెదక్ రహదారిపై రాస్తారోకో ఎంపీపీ కార్యాలయం ముట్టడిచిన్నశంకరంపేట: బీడీ కార్మికులందరికీ జీవనభృతిని చెల్లించాలంటూ వివిధ గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సోమవారం రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఉదయం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీడీకార్మికులు చిన్నశంకరంపేట బస్స్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. వందలాది మంది బీడీ కార్మికులు రోడ్డుపై బైఠాయించడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు బీడీ కార్మికులు మాట్లాడుతూ ఎన్నికల ముందు బీడీ కార్మికులందరికి జీవనభృతిని అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కొందరికే భృతి మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు. గంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం కార్మికులు ర్యాలీగా బయలుదేరి ఎంపీపీ కార్యాలయం ముట్టడించారు. అందరికీ జీవనభృతి అందించాలని కోరుతూ ఈఓపీఆర్డీ కోటిలింగానికి వినతి పత్రం అం దజేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్ కార్యాలయానికి వచ్చి తహశీల్దార్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పోతరాజ్ రమణ, డీసీసీ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీమన్రెడ్డి, జాలసాయిబాబా,కృష్ణాగౌడ్,కిష్టయ్య,మండల నాయకులు సత్యనారాయణగౌడ్,శివకుమార్, యాదగిరి, భరత్, గొండస్వామి,రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అత్తాకోడళ్లకు లొల్లి పెట్టిన కేసీఆర్
⇒ లొల్లి ఉంటేనే సీఎంకు సంబరం ⇒ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ భిక్కనూరు : ప్రజలు అనునిత్యం లొల్లితో జీవిస్తేనే కేసీఆర్ కు సంబరం అని శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్అలీ షబ్బీర్ అన్నారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత జిల్లాకు మొదటి సారి వచ్చిన సందర్భంగా గురువారం బస్వాపూర్, భిక్కనూరులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతీ బీడి కార్మికురాలికి పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఒక ఇంటికి ఒకే ఫించన్ అంటూ అత్తా కోడళ్లకు కొత్త పంచాయితీ పెట్టాడన్నారు. కోడళ్లు తమకు పెన్షన్ రాకపోవడానికి అత్తే కారణమంటూ ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఉసురు కేసీఆర్కు తగులుతుందన్నారు. బంగారు తెలంగాణ అంటూ తన కుటుంబాలను బంగారు మయంగా చేసుకుంటూ ప్రజలను కార్యాలయాల చుట్లూ, జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిప్పుతున్నాడన్నారు. సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ ఏర్పడిన విషయం ప్రతీ ఒక్కరికి తెలుసన్నారు. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ దెబ్బతింటుందని తెలిసి కూడా సోనియూ ఇచ్చిన మాటలకు కట్టుబడ్డారని అన్నారు. ఈ సందర్భంగా బస్వాపూర్లో ఎల్లమ్మ వేషధారణలో ఉన్న కళాకారిణి షబ్బీర్అలీని ఆశీర్వదించి అందరిని ఆకట్టుకుంది. ఒకే ఇంటిలో నలుగురికి పదవులు: మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తెలంగాణ నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని సీఎం తన ఇంటిలో మాత్రం నలుగురికి పదవులు కట్టబెట్టుకున్నాడని మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నా అధికారులు సర్వే చేపట్టకపోవడం శోచనీయం అన్నారు. పింఛన్లు, బియ్యం వత్తలేవు పింఛన్లు, బియ్యం వస్తలేవు. మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటలేరు.. అంటూ భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాళ్లు పోచమ్మ, రాజవ్వ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ ఎదుట తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ పింఛన్లు, బియ్యం ఇస్తున్నామని చెప్పడం తప్ప ఆచరణలో విఫలమైందని ఆరోపించారు. -
జీవనభృతికి మళ్లీ మెలిక
మారిన నిబంధనలు.. పీఎఫ్ తప్పనిసరి.. యాభై ఏళ్ల లోపు వారికే.. కోరుట్ల: బీడీ కార్మికుల జీవన భృతికి సర్కారు మరో మెలిక పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికురాలిగా నమోదు కాని కారణంగా భృతిని పొందలేకపోయిన వారి కోసం మరోసారి సర్వేకు సిద్ధమవుతున్న తరుణంలోనే నిబంధనలు మార్చింది. గతంలో బీడీ కార్మిక భృతికి ఎంపిక నిబంధనలను మారుస్తూ కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బీడీ కార్మికులకు తప్పని సరిగా పీఎఫ్ ఉండడంతో పాటు, యాభై ఏళ్లలోపు వయస్సు ఉండాలని నిర్దేశించింది. తాజా దరఖాస్తులు 1.20 లక్షలు సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మొదటి విడత బీడీ కార్మిక భృతి కోసం అర్హులను ఎంపిక చేశారు. అయితే, పీఎఫ్ ఉండి.. అన్ని అర్హతలున్నా, సమగ్ర సర్వేలో నమోదు కాని కారణంగా తమకు బీడీ కార్మిక భృతి అందలేదని ఆందోళన వ్యక్తమైంది. దీంతో బీడీ కార్మికులు భృతి కోసం మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో బీడీ కార్మిక భృతి కోసం కరీంనగర్ జిల్లాలో 44 వేలు, ఆదిలాబాద్లో 8 వేలు, మెదక్లో 13 వేలు, నిజామాబాద్లో 48 వేలు, వరంగల్లో 6 వేల మంది దరఖాస్తులు వచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇలా దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించిన సర్వే.. ఎంపిక కోసం ఈనెల 7న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో ఎంఎస్ 38 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పీఎఫ్తో పాటు యాభై ఏళ్లలోపు వారైతేనే గతంలో బీడీ కార్మికుల పీఎఫ్తో సంబంధం లేకుండా.. బీడీ కార్మికురాలిగా నమోదై.. సర్వేలో బీడీలు చుడుతున్నట్లు తేలిన వారికి భృతి మంజూరు చేశారు. ఈసారి మాత్రం బీడీ కార్మిక భృతి కోసం పీఎఫ్ తప్పనిసరి చేశారు. 28 ఫిబ్రవరి 2014లోపు బీడీ కార్మికురాలు పీఎఫ్ నమోదు చేసుకుని ఉండాలి. దీంతో పాటు యాభై ఏళ్ల లోపు వయసున్న వారికే బీడీ కార్మిక భృతి మంజూరు చేయనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మొదటి విడతలో పీఎఫ్ లేని వారికి బీడీ కార్మిక భృతి ఇవ్వడంతో చాలా మంది పీఎఫ్ లేని బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా బీడీ కార్మిక భృతి మంజూరు చేశారు. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో తమకు రెండో విడత సర్వేలోనూ బీడీ కార్మిక భృతి అందని ద్రాక్షే అవుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. -
మరో 1.2 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్
రాష్ట్రవ్యాప్తంగా మరో 1,20,419 మంది బీడీ కార్మికులకు ఏప్రిల్ నుంచి పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 2.56 లక్షల మంది బీడీ కార్మికులకు రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం పింఛన్ ఇస్తుండగా, తాజాగా ఎంపికైన వారితో కలిపి ఈ సంఖ్య 3.77 లక్షలకు చేరింది. తాజా ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ జిల్లా నుంచి 48 వేలు, కరీంనగర్ జిల్లా నుంచి 44,882, మెదక్ జిల్లా నుంచి 13వేలు, అదిలాబాద్ జిల్లా నుంచి 8,700, వరంగల్ నుంచి 6,237 మంది బీడీ కార్మికులకు కొత్తగా పింఛన్ మంజూరు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. -
తెలంగాణ బీడీ కార్మికులకు నెలకు రూ.1000 భృతి
హైదరాబాద్: తెలంగాణలోని బీడి కార్మికులకి శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,20,419మంది బీడీ కార్మికులకు నెలకు రూ.1000 చొప్పున భృతి అందనుంది. వారికి ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయల భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీడీ కార్మికులకు భృతి అందించే ఫైలు పై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. -
అందని ఆసరా
పోస్టల్ సమ్మె ఎఫెక్ట్ పండుటాకుల ఎదురుచూపు బీడీ కార్మికుల పింఛన్కు ‘కోడ్’ అడ్డంకి.. హన్మకొండ అర్బన్ : జిల్లాలో ‘ఆసరా’ డబ్బుల పంపిణీ జాప్యం అవుతోంది. ప్రతీనెలా ఒకటో తేదీన డబ్బుల పంపిణీ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈనెల ఇప్పటివరకు పంపిణీ కాలేదు. ప్రతీనెలా జాప్యం అవడం అనేది షరామామూలుగా మారింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రతీనెలా మొదటివారంలో పింఛన్ డబ్బుల కోసం కేంద్రాల వద్దకు వచ్చి నిరీక్షించి వెను తిరుగుతున్నారు. ఈ సారి ఆలస్యానికి పోస్టల్ సమ్మె కారణమైంది. ప్రస్తుతం పోస్టల్ ఉద్యోగులు సమ్మెలో ఉండటంవల్ల వారి ఖాతాల్లోకి డబ్బులు జమకాలేదు. జిల్లాలో ప్రస్తుతం 25 మండలాల్లో పింఛన్లు పోస్టాఫీస్ ద్వారా ఖాతాలో డబ్బులు జమ అవుతున్నారుు. సమ్మె కారణంగా ఇంకా డబ్బులు జమకాలేదు. బీడీ కార్మికులకు ‘కోడ్’ అడ్డంకి.. జిల్లాలో ప్రభుత్వం మార్చి నుంచి నూతనంగా మంజూరు ఇచ్చిన బీడీ కార్మికుల పింఛన్ల విషయంలో స్పష్టత రాలేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త పింఛన్లు మంజూరు నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో స్పష్టత కోసం జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి వస్తే ఆ లస్యంగానైనా డబ్బులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం కొత్త పింఛన్ల మంజూరుకి సానుకూలం గా ఉండక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే రెండు నెలల పింఛన్ కలిపి ఏప్రిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఒకటి లేదా రెండు రోజుల్లో స్పష్టత రావచ్చు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 20 వేల మంది వరకు బీడీ కార్మికులు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. అయితే వీరిలో ఆసరా పెన్షన్ కుటంబాలు తీసేస్తే 8 వేల మంది వరకు పెన్షన్కు అర్హత ఉన్న బీడీ కార్మికులు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. వీరికి ఒక్కోక్కరికి రూ.1000 చొప్పున పింఛన్ ఇవ్వాల్సి ఉంది. 3.86 లక్షల మంది బీడీ కార్మికులు కాకుండా ఇప్పటివరకు 3.86 లక్షల పింఛన్దారులున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.41.35 కోట్లు విడుదల చేస్తోంది. పింఛన్దారుల్లో వృ ద్ధాప్య 1,71, 756, వికలాంగ 48,932, వితంతు 1,49,618, చేనేత కార్మికుల పింఛన్లు 5,343, గీత కార్మికులు 10,494 ఉన్నారు. పింఛన్ రాక అవస్థలు మహబూబాబాద్ : నా పేరు జంగ వరమ్మ. మాది మహబూబాబాద్లోని కంకరబోడ్ కాలనీ. ఈరోజు వరకు కూడా సర్కారోళ్లు పింఛన్ ఇవ్వలేదు. పింఛనే ఆధారం. డబ్బులు వస్తేనే బీపీ, షుగర్ గోలీలు కొనుక్కోవాలి. అధికారులు ఏమి చెప్పడం లేదు. రోజు పింఛన్ ఇచ్చే సెంటర్కు వెళ్లి తిరిగివస్తున్నాం. సమాధానం చెప్పే వారుకూడా లేరు. ఆటో ఛార్జీలు వృథా అవుతున్నా యి. పింఛన్దారుల బాధను అర్థం చేసుకుని త్వరగా ఇచ్చేట్టుగా చూడాలి. డబ్బులు తొందరగా ఇవ్వాలె.. పోచమ్మమైదాన్ : నాపేరు లక్ష్మి. మాది వరంగల్ పట్టణంలోని కాశిబుగ్గ. నెలకు పది రోజులే పని దొరుకుతది. వచ్చే డబ్బులు కూడా మా రోగాలకే సరిపోతారుు. మా బాధలు అర్థం చేసుకుని కేసీఆర్ భృతి కింద నెలకు రూ.1000 ఇస్తామంటే సంతోషించాం. కానీ, ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు. మండల, కార్పొరేషన్ కార్యాలయూల చుట్టూ తిరుగుతున్నాము. తొందరగా డబ్బులు ఇప్పించేట్టు చూడాలి. పోస్టల్ సమ్మె వల్ల ఆలస్యం ప్రస్తుతం పోస్టల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున వారికి డబ్బులు ప్రభుత్వం నుంచి సకాలంలో అందలేదు. ప్రస్తుతం జిల్లాలో 25 మండలాల్ల్లో పింఛన్లు పోస్టాఫీస్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేశాం. మిగతావి పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇస్తున్నాం. ఒకటి, రెండు రోజుల్లో అందరికీ డబ్బులు అందుతాయి. పంపిణీ ప్రారంభమవుతుంది. కొడ్ వల్ల బీడీ కార్మికుల పింఛన్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. - వెంకటేశ్వర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ -
బీడీ కార్మికులకు పింఛన్లపై ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న బీడీ కార్మికులందరికీ ‘ఆసరా’ పింఛన్ల ద్వారా ఆర్థికసాయం అందించే విషయమై ప్రభుత్వం బుధ వారం ఉత్తర్వులు జారీచేసింది. బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయిస్తూ గత నెల 16న ప్రభుత్వం మెమో జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ మెమోకు అనుగుణంగా తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. -
బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందిస్తాం
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేగుంట: అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవనభృతి పింఛన్లు అందించేందుకు కృషి చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన చేగుంటలో జీవనభృతి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన ఉపాధిమార్గం కేవలం బీడీల తయారీ మాత్రమేనన్నారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలనే ఉద్దేశంతో బీడీలు చుట్టే మహిళలకు జీవన భృతి అందిస్తోందన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించారని కొనియాడారు. ఎంతోమంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జీవనభృతి జాబితాలో లేని బీడీ కార్మికులు తమకు కూడా జీవనభృతి అందించేలా చూడాని సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అందరికీ జీవనభృతి కింద పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీడీ కార్మికుల వద్దనున్న ఆధారాలను పరిశీలించి పింఛన్లు మంజూరయ్యేలా చూడాలని ఆయన ఎంపీడీఓ వెంక టేశ్వర్రెడ్డికి సూచించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలి నగర పంచాయతీ నుంచి గ్రామపంచాయతీగా మారినందున గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆదేశించారు. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లిరమ, సొసైటీ చైర్మన్లు వెంగళరావు, నారాయణరెడ్డి, నాయకులు ముదాం శ్రీను, అంజాగౌడ్, మాసుల శ్రీనివాసు, మంచుకట్ల శ్రీను, సోమ సత్యనారాయణ, లక్ష్మణ్, నర్సింలు, హరిశంకర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
బీడీకార్మికులూ.. ఆందోళన వద్దు
సిరిసిల్ల : జీవనభృతి రాని బీడీ కార్మికులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈ నెలలో దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి అర్హత ఉంటే వచ్చే నెలలోనే మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. బుధవారం సాయంత్రం అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో కలిసి సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో బీడీ కార్మికుల జీవనభృతి పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది కార్మికులకు ప్రతినెలా రూ.వెరుు్య చొప్పున జీవనభృతి అందిస్తున్నామన్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో తప్పులు జరిగి ఉంటే అధికారులు సవరిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పంఛన్ల పంపిణీ నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. అర్హత కలిగిన వారికి పింఛన్లు ఇవ్వడం భారమేమీ కాదన్నారు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే పింఛన్ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీడీ కార్మికుల కష్టాలు సీఎంకు తెలుసు డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీడీ కార్మికుల కష్టాలు తెలిసిన వాడిగా వారిని ఆదుకునేందుకు జీవనభృతి అందిస్తున్నారని అన్నారు. బీడీ కార్మికులు ఆకు, తంబాకు విషం మింగుతూ అరోగ్యం పాడవుతుందని తెలిసినా కుటుంబం కోసం త్యాగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి ‘సిరిసిల్ల అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. నేను పుట్టింటి ఇక్కడే కాబట్టి నాకు తెలుసు. మంత్రి కేటీఆర్ సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు’ అని పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. కేటీఆర్ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రిగా రెండు కీలక పదవుల్లో సవ్యసాచిలా పని చేస్తున్నారని పేర్కొన్నారు. సిరిసిల్లను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెడతారని, సమర్థవంతమైన పాలన అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో సెస్ పర్సన్ ఇన్ఛార్జి దోర్నాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, జెడ్పీటీసీ సభ్యులు తోట ఆగయ్య, మల్లుగారి పద్మ, జె.శరత్రావు, ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, ఆర్డీవో భిక్షానాయక్, డీఎస్పీ దామెర నర్సయ్య, తహశీల్దార్ మన్నె ప్రభాకర్, టౌన్ సీఐ జి.విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ బి.సుమన్రావు, ఎంపీడీవో మదన్మోహన్, ఈవోపీఆర్డీ రవీందర్, కౌన్సిలర్లు యెల్లె లక్ష్మీనారాయణ, గుండ్లపల్లి పూర్ణచందర్, రాపెల్లి లక్ష్మీనారాయణ, జి.హన్మంతునాయక్, ఉప్పుల విఠల్రెడ్డి, పత్తిపాక పద్మ, దార్నం అరుణ, గుండ్లపల్లి రామానుజం, కుల్ల నిర్మల, మంచె శ్రీనివాస్, బత్తుల వనజ, బింగి రాంబాబు, రిక్కమల్ల సంపత్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
మార్చి1 నుంచి బీడీ కార్మికులకు పింఛన్
-
బీడీ కార్మికుల ఎంపికలో అయోమయం
తాజా మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం మోర్తాడ్/నిజామాబాద్: బీడీ కార్మికులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల భృతిని చెల్లించేందుకు ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం రెవెన్యూ అధికారులు సోమవారం నుంచి గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నారు. మొదట్లో జారీ చేసిన మార్గదర్శకాలకు, తాజా ఉత్తర్వులకు తేడా చాలా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక వారికి తలకు మించిన భారంగా మారింది. అయితే, తాజా మార్గదర్శకాల బీడీ కార్మికుల ప్రభుత్వం ఇవ్వదల్చుకున్న జీవన భృతి పథకాన్ని ఆసరా పథకం కిందనే అమలు చేయాలని భావిస్తోంది. బీడీ కార్మిక కుటుం బాల్లో ఇప్పటికే కొందరికి వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం ‘ఆసరా’ కింద ఇప్పటికే పింఛన్ పొందుతున్నందున వీరికి ‘భృతి’ లభించదు. ప్రభుత్వ ఆంక్షల కారణంగా అర్హత ఉన్న కార్మికులకు సైతం భృతి లభించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవీ నిబంధనలు.. గతంలో బీడీలు చుట్టి మానివేసినవారు కేంద్రం అందిస్తున్న పీఎఫ్ను పొందుతూ ఉంటే, వారి కుటుం బంలోని ఇతర బీడీ కార్మికులకు జీవనభృతి వర్తిం చదు. ‘ఆసరా’ కింద లబ్ధి పొందుతున్నవారు ఉన్న కుటుంబంలోని కార్మికులకు వర్తించదు. ‘ఆసరా’ కింద ఫించన్ పొందేవారి కుటుంబంలో ఒకరికి మాత్రమే బీడీ భృతిని అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఎవరికీ బీడీ భృతిని వర్తింప చేయమని తాజా మార్గదర్శకాలలో ఉంది. అంతేకాక బీడీలు చుట్టి మానివేసి బీడీ పింఛన్ను పొందుతున్నవారు ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలోని ఇతర సభ్యులకు బీడీ భృతి వర్తించదు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వచ్చే నెల ఒకటి నుంచి బీడీ కార్మికులకు భృతిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఇదీ పరిస్థితి... ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రిజిస్టర్డ్ బీడీ కార్మికులు దాదాపు 6.50 లక్షల మంది ఉన్నారు. పేరున్న బీడీ కంపెనీలే తమ కార్మికులను పీఎఫ్లో చేర్చు తున్నారుు. మిగతావారికి భృతి అందుతుందా లేదా అనేది తెలియడం లేదు. భృతి పొందాలంటే సమగ్ర కుటుంబ సర్వేలో కచ్చితంగా బీడీ కార్మికురాలుగా నమోదై ఉండాలి.వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలనే నిబంధనలు చేర్చారు. ఈ లెక్కన చూస్తే వేలాది మంది అనర్హులుగా మారే అవకాశముంది. -
మార్చి ఒకటిన జిల్లాకు సీఎం కేసీఆర్!
- బీడీ కార్మికుల భృతి ప్రారంభం ఇక్కడి నుంచే - కామారెడ్డిలో శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి - తిమ్మాపూర్ వెంకన్న కొండకు వెళ్లే అవకాశం - సీఎం పర్యటన ఏర్పాట్లలో అధికారులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మార్చి ఒకటిన జిల్లాలో పర్యటించనున్నారు. బీడీ కార్మికులకు నెలకు రూ.వెయి రూపాయల భృతిని వచ్చే నెల నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం బీడీ కార్మికుల సమస్యలు, భృతిపై శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం నిజామాబాద్, మెద క్, కరీంనగర్ జిల్లాలలో స్వయంగా తానే ఈ పథకాన్ని ప్రా రంభించనున్నట్లు ప్రకటించారు. బీడీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కొత్త పథకాన్ని కామారెడ్డి నుంచి ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాలోపర్యటించనున్నట్లు సమాచారం. అలాగే బీర్కూరు మండలం తిమ్మాపూర్లో నిర్మి స్తున్న వెంకన్న కొండను కూడ ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. ఇటీవల బీర్కూరు మండలంలో జరిగిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కూడ సీఎం కేసీఆర్ మార్చి ఒకటిన జిల్లాకు రానున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 21న జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అపుడు అధికారులు కూడా కామారెడ్డిలో మకాం వేసి ఏర్పాట్లను పరిశీలించారు. వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయ, విద్య, వైద్య ఆరోగ్య,గృహనిర్మాణ, వ్యవసాయ తదితర శాఖలకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేశారు. చివరి నిముషంలో సీఎం పర్యటనను రద్దయినట్లు సీఎంఓ సమాచారం వచ్కిచంది. తిరిగి ఇపుడు సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు మళ్లీ ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎం కోసం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
అర్హులెందరున్నా.. ఒక్కరికే పింఛన్!
బీడీ కార్మికుల‘ఆసరా’కు మార్గదర్శకాలు సిద్ధం రాష్ట్రంలో 4 లక్షలమంది బీడీ కార్మికులున్నట్లు గుర్తింపు రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఒక కుటుం బంలో బీడీ కార్మికులు ఎంతమంది ఉన్నప్పటికీ ఆ కుటుంబంలో ఒక్కరికే పింఛన్ను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సామాజిక భద్రతా పింఛన్ల పథకం ‘ఆసరా’ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులకు కూడా వర్తింప చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే రూపొం దించిన సర్కారు రెండ్రోజుల్లో ఉత్తర్వులను కూడా జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4,74,438 మంది బీడీ కార్మికులున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వీరిలో 46,578మంది ఇప్పటికే ‘ఆసరా’ పింఛన్ పొందుతున్నారని, ఎటువంటి పింఛన్ పొందని వారు 4,27,860 మంది ఉన్నారని సమాచారం. మార్గదర్శకాలు ఇలా..! తాజా మార్గ్గదర్శకాల మేరకు ఒక కుటుంబంలో బీడీ కార్మికులు ఎంతమంది ఉన్నప్పటికీ ఒక్కరికే పింఛన్ అందించాలని నిర్ణయించారు. సదరు కార్మికుడు/కార్మికురాలికి ఇప్పటికే ఏదేని పింఛన్ (వృద్ధాప్య, వితంతు, వికలాంగ..తదితర) అందుతున్నట్లైతే అతను/ఆమెకు కొత్తగా మరో పింఛన్ ఇవ్వరు. అయితే.. బీడీ కార్మిక కుటుంబంలో కార్మికులు కానివారు ఆసరా పింఛన్ (వృద్ధాప్య, వితంతు, వికలాంగ..తదితర) పొందుతున్నప్పటికీ బీడీ కార్మికుడు/కార్మికురాలికి కొత్తగా పింఛన్ను మంజూరు చేస్తారు. 18ఏళ్లు నిండిన బీడీ కార్మికులు పింఛన్ పొందేందుకు అర్హులు. వారి కుటుంబ వార్షికాదాయం రూ.రెండు లక్షలకు మించకూడదు. కార్మికుడు / కార్మికురాలు బీడీల తయారీకి అవసరమైన ముడిసరకును లెసైన్స్డ్ కాంట్రాక్టరు వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న వారై ఉండాలి. -
ఫిబ్రవరిలో ‘వాటర్గ్రిడ్’కు సీఎం శంకుస్థాపన
మార్చి నుంచి బీడీ కార్మికులకు పింఛన్: కేటీఆర్ సూర్యాపేట: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ వద్ద వాటర్గ్రిడ్ పనులకు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ చౌటుప్పల్ వద్ద జరుగుతున్న వాటర్గ్రిడ్ పనులు వారం రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. గత పాలకులు వదిలేసిన పాపాలను ఒక్కొక్కటిగా కడుగుతున్నామని చెప్పారు. బీడీ కార్మికులతోపాటు ఒంటరి స్త్రీలకు కూడా పింఛన్ పథకాన్ని అమలుచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఖమ్మం, వైరాలో విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాకోర్టులో ఓడినవారు హైకోర్టుకు వెళ్లి కేసీఆర్ పాలన సక్రమంగా లేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పింఛన్ల కోసం కొండరెడ్ల కనిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. -
బీడీ కార్మికులకు భరోసా
నెలకు రూ.1,000 పింఛన్ వచ్చే నెల నుంచి ‘ఆసరా’ అమలు మార్చి ఒకటో తారీఖున పంపిణీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి వంతున జీవన భృతి ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో లేకున్నా.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శనివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ కార్మిక శాఖ అధికారులు, సంబంధిత మంత్రులతో బీడీ కార్మికుల సమస్యలపై సమీక్ష జరిపారు. అనంతరం మంత్రులు నాయిని, హరీశ్రావు విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి నుంచి జీవనభృతి అమలు చేస్తామని, మార్చి 1న పంపిణీ చేస్తామని చెప్పారు. బీడీ కార్మికులకు సంబంధించిన వివరాల సేకరణకు, ఎవరెవరికి జీవనభృతి ఇవ్వాలని అధ్యయనానికి పూనం మాలకొండయ్య అధ్వర్యంలో కమిటీని నియమించినట్లు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పర్యటించి ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. 18ఏళ్లలోపు పిల్లలపై అధ్యయనం ఈ పరిశ్రమలో వేలాది మంది బాల కార్మికులు ఉన్నారని.. ఇదే ఆధారంగా బతుకుతున్నారని.. వీరికి ‘ఆసరా’ ఎలా అందించాలి..? మరేదైనా ప్రత్యామ్నాయముందా..? అనేది ఈ కమిటీ చర్చించి అధ్యయనం చేస్తుందని చెప్పారు. 18 ఏళ్లలోపు పిల్లలను ఏ విధంగా ఆదుకోవాలి.. వారి కుటుంబాలకు ఎలాంటి సాయం అందించాలి..? అనేది కమిటీ సిఫారసు చేస్తుందన్నారు. అధికారుల కమిటీతో పాటు కార్మిక శాఖ, ప్రావిడెంట్ ఫండ్ విభాగం, ప్రభుత్వం కలిసికట్టుగా ఈ నెలంతా కసరత్తు చేసి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తుందని చెప్పారు. సంబంధిత మార్గదర్శకాలన్నీ పూనం మాలకొండయ్య కమిటీ ఖరారు చేస్తుందని తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షలాది బీడీ కార్మికుల కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. ఇది పేద ప్రజల ప్రభుత్వమని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం ఈ కార్మికులకు జీవన భృతి ఇస్తామని ప్రకటించారని.. అందులో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని.. ఈలోగా కొందరు జీవన భృతి ఇవ్వటం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఆందోళనలు చేస్తున్నారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్మికుల కష్టాలన్నీ సీఎంకి తెలుసునని.. గతంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన సిద్ధిపేట నియోజకవర్గంలో చాలా మంది బీడి కార్మికులున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. -
రోడ్డెక్కిన బీడీ కార్మికులు
సదాశివనగర్(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని బీడీ కార్మికులు జీవన భృతికోసం గురువారం మధ్యాహ్నం ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రగతి శీల బీడీకార్మికుల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. దాదాపు 300 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తమకు జీవన భృతి రూ.1000 ఇవ్వాలని, పనిదినాలు 26 రోజులకు పెంచాలని కోరారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీకార్మికుల వర్కర్స్ యూనియన్ ఏరియా కార్యదర్శి యాదయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బీడీ కార్మికులకు మేలు చేయండి
దేశ వ్యాప్తంగా బీడీ కార్మికులు దయనీయస్థితిలో అనాగరికంగా బతుకుతున్నారు. దశాబ్దాలుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నెన్ని ప్రభు త్వాలు మారినా, మారుతూ వస్తున్నా బీడీ కార్మికుల బతుకులు మారడంలేదు. విద్య, భృతి, వసతి, ఆహార సరఫరా కార్డులు, వారి పిల్లలకు చదువులు, ఉపకార వేతనాల మంజూరీ ఆరోగ్యభద్రత కార్డులు మొదలైనవి ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తుని కాకు సేకరణ విషయంలోనూ, వంద బీడీ కట్టల ధర చెల్లింపులోను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బీడీ కార్మికుల కూలి రేట్లను పెంపు చేయడం చాలా అవసరం. మహిళా బీడీ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా నిరక్షరాస్యులైన వారి కోసం ప్రత్యేక పాఠశా లలు ఏర్పర్చడం, వారు చదువుకోవడానికి ప్రోత్సహించడం వంటి చర్యలను తప్పక చేపట్టాల్సి ఉంది. ముప్పై ఏళ్ల వయస్సుకు పైబడిన మహిళా బీడీ కార్మికుల కోసం నెలవారీ భృతిని రెండు వేల రూపాయల దాకా పెంచడం వంటివి చేయాల్సి ఉంది. బీడీ కార్మికులలో పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అనే తేడా లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి మేలు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు అందరికీ, కొంత ప్రీమియం తీసుకొని బీమాను వర్తింపజేస్తే ఎంతో బాగుంటుందని కేంద్ర బీడీ కార్మికశాఖ అధికారులను, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. - కూర్మాచలం వెంకటేశ్వర్లు ఎం.ఎం.తోట, కరీంనగర్ -
పొగచూరిన బతుకుల పోరుబాట
‘మునీం, సేట్ల దోపిడీతో కార్మికుల్లో అసంతృప్తి పేరుకుపోయిన పరిస్థితి. ఆగ్రహం నివురువుగప్పిన నిప్పులా రాజుకుంటుంది. ఈ అసంతృప్తి...ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. లక్ష్మి అనే పాత్రధారి బయటకు వస్తుంది. బీడీ కార్మికులందరినీ సమీకరించి బతుకు పోరు రాజేస్తుంది.’ 1980లో తెలంగాణ రచయిత బీఎస్ రాములు రాసిన ‘బతుకు పోరు’ పుస్తకం కథా వస్తువు ఇది. ప్రస్తుతం మెతుకు సీమ పల్లెల్లో ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమవుతోంది. హక్కుల సాధన కోసం బీడీ కార్మికులు రోడ్డు మీదకొస్తున్నారు. సిద్దిపేటలో రాజుకున్న బీడీ కార్మిక పోరాటం... దుబ్బాక...రామాయంపేట.. గజ్వేలు పల్లెలకు అంటుకొంది. ధర్నాలు, రాస్తారోకోలతో కార్మికులు కదం తొక్కుతున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘బీడీలు చుట్టటంలో కష్టం మాది... కష్టార్జితమేమో కంపెనోళ్లది. నెలకు 10 రోజులు కూడా పని ఇవ్వడంలేదు. నెలకు రూ.1000 జీవన భృతి ఇవ్వండి’ అనే డిమాండ్తో బీడీ కార్మికులు పోరుబాట పట్టారు. ప్రభుత్వానికి సగటున రూ.100 కోట్ల సెస్సు, కంపెనీ యాజమాన్యాలకు రూ. 200 కోట్లు ఆర్జించి పెడుతున్న బీడీ కార్మికుల కష్టాల మాత్రం ఎవరికీ పట్టడం లేదు. పని దినాలను కుదించి ... వర్ధీ బీడీలు తెచ్చి జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు బీడీ కార్మికులుగా పని చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది వరకు కార్మికులున్నారు. దాదాపు 14 గంటల పాటు నిరంతరాయంగా బీడీలు చుడుతున్నారు. ఇన్ని గంటలు కష్టపడితే సగటున 800 వందల బీడీలు చుడుతున్నారు. 1000 బీడీలకు కంపెనీలు కేవలం రూ.100 నుంచి రూ.120 వరకు కట్టిస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 14 గంటలకు పైన కష్టపడితే రూ80 నుంచి 90 వరకు కూలీ పడుతోంది. ఆ పని నెలలో 10 రోజులు మాత్రమే కల్పిస్తున్నారు. ఇంకో పని చేయడం తెలియని బీడీ కార్మికులు మిగిలిన రోజుల్లో పని లేక, తిండికెళ్ల్లక ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో కంపెనీల యాజమాన్యాలు అనధికారికంగా(వర్ధీ) కార్మికులతో బీడీలు చుట్టించి అతి తక్కువ కూలీ రేట్లు కట్టిస్తున్నారు. వర్ధీతో ఒక్కొక్క కార్మికుడు రోజుకు రూ.30, రూ.40 నష్టపోతున్నాడు. ప్రభుత్వానికి కూడా రూ.కోట్లలో సెస్సు ఎగ్గొడుతున్నారు. 30 ఏళ్లకే స్పాండలైటిస్... అరకొర ఆదాయం కార్మికులకు మూడు పూటల కడుపు నింపలేకపోతోంది. ఇక పౌష్టికాహారం అంటే ఏమిటో కూడా తెలియదు. ప్రతి మనిషికి కనీసం 2,800 కాలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని వైద్యులు చెప్తుండగా, ఆర్థిక సమస్యల కారణంగా వీళ్లు కేవలం 1,700 కాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోగలుగుతున్నారని ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఫలితంగా ప్రతి మహిళ రక్త హీనతతో బాధపడుతోంది. ఒకే పనిని ఏకాగ్రతతో 14 గంటల పాటు చేయడం వల్ల బీడీ కార్మికుల్లో 30 ఏళ్లకే మెడ నరాల నొప్పి (స్పాండలైసిస్)తో బాధపడుతున్నారు. పొగాకు కేన్సర్ కారకమని శాస్త్రీయంగానే నిర్ధారణ అయింది. బీడీ కార్మికులు ఏళ్ల తరబడి పోగాకుతోనే గడుపుతారు కాబట్టి కేన్సర్, టీబీ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు తేలింది. కార్మికులు సంపాదించిన దాంట్లో సగం డబ్బు ఆస్పత్రుల ఖర్చులకే పోతున్నాయి. కార్మికులు రోగాల బారిన పడ్డప్పుడు అండగా నిలబడాల్సిన కంపెనీలు మొఖం చాటేస్తున్నాయి. చట్టాలకు తూట్లు.... కార్మికులకు కనీస వేతనం కింద 1,000 బీడీలు చుడితే రూ.158 కట్టివ్వాలని, వారానికి ఒక రోజు సెలవు, ఇతర అలవెన్సులు కలుపుకొని వెయ్యి బీడీలు చుడితే రూ.170 వరకు గిట్టుబాటు అయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట జీఓ 41 విడుదల చేసింది. ఆ త ర్వాత కంపెనీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి వెంటనే ఆ జీఓను పెండింగ్లో పెట్టారు. దీన్ని అమల్లోకి తేవాలని కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా, పాలకులు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 41 అమల్లోకి తేవడంతో పాటు, రూ.1000 భృతి కలిపిస్తే బీడీ కార్మికుల బతుకుల్లో వెలుగులు పూస్తాయని సిద్దిపేట చెందిన బీడీ కార్మికులు చెబుతున్నారు. 1965 కార్మిక వేతన చట్టం, 1966 బీడీ కార్మిక చట్టం ప్రకారం వారానికి ఒక రోజు సెలవుతో కూడిన వేతనం ఇవ్వాలి. ఆరోగ్యకరమైన వాతావరణంలో పసి పిల్లలకు ఊయల కట్టించాలి. ప్రసవించిన మహిళలకు 180 రోజులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా వీటిని అమలు చేసినట్లు కనిపించలేదు. -
కదంతొక్కిన బీడీ కార్మికులు
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీడీ కార్మికులు కదంతొక్కారు. మామడ, జన్నారంలో ర్యాలీలు చేపట్టి నిరసనలు చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగారు. మామడలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రూ.వెయ్యి జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిర్మల్(మామడ)/జన్నారం : సమస్యల పరిష్కారం కోసం బీడీ కార్మికులు కదంతొక్కారు. శనివారం మామడ, జన్నారం మండల కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. మామడలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో ర్యాలీగా బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు తరలివెళ్లారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రూ.వెయ్యి జీవనభృతి చెల్లించాలని అన్నారు. సమస్యలు పరిష్కారానికి నోచుకోక రాష్ట్రంలోని ఏడు లక్షల మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పనిదినాలు పెంచాలని అన్నారు. అనతరం ఆర్ఐ చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడివర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, ప్రధాన కార్యదర్శి రాజన్న, నాయకులు రాంలక్ష్మణ్, గంగన్న, గపూర్, సుమేష్, నంది రామయ్య పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు రూ. వెయ్యి భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ జన్నారంలో శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూతన్కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విడుదల చేయకపోవడం విడ్డూరమని అన్నారు. కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతన చట్టం జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ సంపతి శ్రీనివాస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రాజన్న, మండల కార్యదర్శి కే.లింగన్న, సీఐటీయూ నాయకులు కూకటికారు బుచ్చన్న, పిల్లి అంజయ్య, అలగొండ శాంత, సిందెం స్వరూ ప, సుమారు వెయ్యి మంది బీడీ కార్మికులు పాల్గొన్నారు. -
బీడీ కార్మికులకు రూ.వెయ్యి చెల్లించాలి
మిరుదొడ్డి: బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నెలకు రూ. 1,000ల జీవన భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు బీడీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం మిరుదొడ్డిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల స్వామి మాట్లాడుతూ బీడీ కార్మికుల కోసం రూ. వెయ్యి జీవన భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందన్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రూ. 1,000 జీవన భృతి చెల్లిస్తామని ప్రకటించడంతో కార్మికుల్లో ఆశలు రేకెత్తాయన్నారు. అయితే బడ్జెట్లో మాత్రం జీవనభృతికి నిధులు కేటాయించక పోవడంతో కార్మికుల ఆశలు సన్నగిల్లే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కార్మికుల ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవన భృతి చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో బీడీ కార్మికులు 32 రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న 41జీఓను వెంటనే అమలు చేయాలని కోరారు. బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించేలా యాజమాన్యాలు చొరవ చూపాలన్నారు. కార్మికుల పిల్లలకు గత మూడు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు అందడం లేదన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు తహశీల్దార్ వసంత లక్ష్మికి వినతి పత్రం అందించారు. బీడీ కార్మికుల అందోళనకు డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు ముత్యాల భూపాల్ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక డివిజన్ కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్, మండల కార్యదర్శి భిక్షపతి, బీడీ వర్కర్స్ మండల కార్యదర్శి తోకల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రమేష్, రాజు, నర్సింలు, సాధిక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సారూ..వింటారా మా గోడు
ప్రగతినగర్ : బీడీ కార్మికుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రగతిబీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర సర్వేను ఒక్క రోజులో చేపట్టిన కేసీఆర్కు ఏడు లక్షల మంది బీడీ కార్మికుల లెక్క కష్టంగా మారిందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తలుచుకుంటే నాలుగు గంటల్లో బీడీ కార్మికుల జీవన భృతి లెక్క తేలిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో బీడీ కార్మికులకు నెలకు జీవన భృతి కింద నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ప్రగతిబీడీ వర్కర్స్యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాలను వేలాది మంది బీడీ కార్మికులు ముట్టడించారు. అంతకు ముందు స్థానిక రాజీవ్గాంధీ ఆడిటోరియం నుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుస్తు బందోబస్తులో భాగంగా పోలీసులు తహశీల్ కార్యాలయం గేటును మూసి ఉంచారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ట మాట్లాడుతూ.. తాము కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలేదన్నారు. తెలంగాణలో సుమారు ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి టీఆర్ఎస్కు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ సర్కార్ బీడీ కార్మికుల గురించి పట్టించుకోవడమే మానేసిందన్నారు. కనీసం వారి గురించి మాట్లాడడం కూడా లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. బీడీ కార్మికులకు యాజమాన్యాలు నెలకు పది లేదా పన్నెండు రోజులు మాత్రమే పని కల్పిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీంతో బీడీ కార్మికులకు నెలకు కనీసం వెయ్యి రూపాయలు కూడా దాటడం లేదన్నారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం జరిగిన కేబినేట్లో కూడా భృతిపై ఆమోదం కూడా జరిగిందన్నారు. బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని మరచిపోవడం బాధాకరమన్నారు. జిల్లా ఆడబిడ్డ ఎంపీ కవిత కూడా ఈ విషయంలో బీడీ కార్మికులకు హామీ ఇచ్చారని, ఆమె కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్.దాసు, వెంకటి,సాయాగౌడ్,రాజేశ్వర్,కిషణ్,లింగం,సత్తెక్క,పీడీఎస్యూ,పీవైఎల్ నాయకులు సుధాకర్, మారుతి రాజు,గంగాధర్,సుజిత్,ప్రశాంత్తోపాటు జిల్లాలోని అన్ని మండలాల బీడీ కార్మికులు పాల్గొన్నారు. -
సీఎం సారూ.. మాట తప్పారు..
బాల్కొండ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు జీవన భృతిగా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట తప్పడం న్యాయమా.. సీఎం సారూ అంటూ తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలో బీడీ కార్మికులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుంచి తహశీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఆరు నెలలు గడిచినా దాని ఊసెత్తకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు చేతినిండా పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా బీడీ కార్మికులను ఆదుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. వంద రోజుల పాలన ముగిసిన రోజు కూడా 43 రంగాల కార్మికులను ఆదుకుంటామని, అందులో బీడీ కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు. జూలై 7వ తేదీన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీడీ కార్మికుల ఓట్లతో గెలుపొందామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి గురించి ఊసే ఎత్తడం లేదన్నారు.అన్ని పార్టీ నాయకుల మాదిరిగానే కేసీఆర్ బీడీ కార్మికులను మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తే బీడీ కార్మికులకు కూడా ఏమైనా ఇస్తారని ఆశతో ఎదురుచూస్తే, నిరాశే మిగిలిందన్నారు. లక్ష కోట్ల బడ్జెట్లో చిల్లి గవ్వ కూడా బీడీ కార్మికుల కోసం కేటాయించలేదన్నారు. నెలకు 70 కోట్ల నిధులు అవసరమయ్యే బీడీ కార్మికుల గురించి పట్టించుకోని సీఎం హైదరాబాద్ను స్మార్ట్ సిటీగా మార్చడానికి వేల కోట్లు ఖర్చు చేస్తాననడం సిగ్గు చేటన్నారు. వెంటనే బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవన భృతిని అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ను బీడీ కార్మికులు ఏడు అడుగుల లోతులో పాతి పెడతారని హెచ్చరించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ వేణుగౌడ్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ర్ట కార్యదర్శి ప్రభాకర్, నాయకులు దేవారాం, గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
జీవన భృతి కోసం ఆందోళన
నందిపేట : తమకు రూ.వెయ్యి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో బీడీ కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నందిగుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఐఎఫ్టీయూ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి జీవనభృతి అందజేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా, 25 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. వీరందరూ కేసీఆర్ మాటలు నమ్మి ఓట్లేశారని అన్నారు. కానీ అధికారంలోకి రాగానే కేసీఆర్ బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మరిచిపోయారని విమర్శించారు. బడ్జెట్లో బీడీ కార్మికుల భృతి అంశాన్ని ప్రస్తావించక పోవడం శోచనీయమన్నారు. బడ్జెట్లో అనవసరమైన పనులకు వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం, రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులకు రూ.840 కోట్లు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించిందని విమర్శించారు. కార్మికులతో ఎప్పుడో అవసరం తీరిపోయిందనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వెంటనే బడ్జెట్ సవరణ చేసి బీడీ కార్మికుల భృతికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సర్కారు మెడలు వంచి, ఆందోళనలు చేసి భత్యాన్ని సాధించుకుంటామన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తహశీల్దార్ బావయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, కె.గంగాదర్, జిల్లా ఉపాధ్యక్షులు బాగులు, రాజేశ్వర్, మల్లేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లు బాంచెన్!
పాత పింఛన్ లేక, కొత్తగా పింఛన్ అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం ఆధార్, ఎస్కేఎస్, ఆన్లైన్ తదితర కారణాలతో అనేకమందిలో గందరగోళం నెలకొంది. పింఛన్ రాదేమోననే బెంగతో డిచ్పల్లి మండలం సుద్దుపల్లి గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (68) మృతి చెందింది. 30 రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాలలో ఇలా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రోజుకోచోట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు రోడ్డెక్కుతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలో లోకేష్ అనే వికలాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ అవస్థలు ఎన్నాళ్లో తెలియడం లేదు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిబంధనలు మారడం, నూతనంగా ఆసరా పథకం తెరపైకి రావడంతో పింఛన్దారులలో అయోమయం ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా రూ.1000 పిం ఛన్ అమలు కోసం చేపట్టిన సర్వే, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ప్రక్రియలు గందరగోళంగా మారాయి. దరఖాస్తు చే సుకున్నవారిలో అర్హులు చాలా మంది పింఛన్లు రాక అవస్థ పడుతున్నారు. గ తంలో పింఛన్ పొంది, కొత్త జాబితాలో పేర్లు లేనివారు విలపిస్తున్నారు. తామె లా బతికేదంటూ రోడ్డెక్కుతున్నారు. జి ల్లాలో గత నెల ఎనిమిదిన పింఛన్ల పం పిణీ ప్రారంభమైనా 61 మందికే అందజేశారు. ఆర్భాటంగా మొదలుపెట్టిన ఆసరా పథకం లబ్ధిదారులకు న్యాయం చేకూర్చలేకపోయింది. అధికారులు దర ఖాస్తుదారుల పరిశీలనలో అయోమయానికి గురవుతున్నారు. అర్హులను గుర్తించడంలో తప్పులు దొర్లుతున్నాయి. సాంకేతిక కారణాల తో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అర్హులను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. మోర్తాడ్, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి ప్రాంతాలలో పరిశీలన నత్తనడకన సాగుతుంది. అక్టోబర్ 30లోగా దరఖా స్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని భావించారు. ఆచరణలో ఇది సాధ్యం కాలేదు. దీంతో ఈ తేదీని నవంబరు ఆరు వరకు పొడిగించారు. ఎనిమిద వ తేదీ నుంచి పింఛన్లు అందించాలని నిర్ణయించారు. అది కూడా సాధ్యం కాలేదు. ఇపుడు ఆ గడువును ఈనెల 15 వరకు పొడిగించారు. మండల, పట్టణ, నగర స్థాయిలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా గందరగోళం మాత్రం తొలగడం లేదు. నగర పరిధిలోనూ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పింఛన్ల పరిశీలన నేటికీ వరకు కొనసాగుతోంది. ఇక్కడ పింఛన్ల కోసం 35 వేల దరఖాస్తులు, ఆహార భద్రత కార్డుల కోసం 86 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన నేటి వరకు ముగియలేదు. కేవలం 60 శాతం పరిశీలన మాత్రమే జరిగింది. దీంతో పింఛన్ల పంపిణీ జరుగలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 3,67,101 మంది పింఛన్దారులు ధరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అ నంతరం అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్లో కంప్యూటరీకరించా ల్సి ఉంది. వీటి కోసం కంప్యూటర్ కౌంటర్లు ఏర్పాటు చేసినా దరఖాస్తులు ఇంకా పూర్తిగా రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచి పోయిం ది. వృద్ధాప్య పింఛన్లలో వయసు నిర్ధార ణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో చాలా మంది అర్జీలు వయసు తక్కువ అంటూ తిరస్కారానికి గురయ్యాయి. వితంతు పింఛన్ల విషయంలో భర్త మరణ ధ్రువీక రణ పత్రం కావాలంటూ, ఆసుపత్రికి రావాలంటూ కొంతమందికి కత్తెర పెట్టారు. ఇక వికలాంగులకు సదరం ఐడి నంబర్ ఉంటేనే పింఛన్ ఇస్తామంటూ గొళ్లెం తగిలేశారు. సదరం శిబిరానికి హజరైన ఇంకా 30 శాతం మందికి ధ్రువీకరణ పత్రాలు అందాల్సి ఉంది. ఆగని ఆందోళనలు గత కొన్ని రోజులుగా జిల్లాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం పింఛన్ల కోసం గాంధారిలో వృద్ధులు ధర్నా, రాస్తారోకో చే పట్టారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందలో వృద్ధులు, వికలాం గు లు, వితంతువులు ఆందోళన నిర్వహించారు. సోమవారం దోమకొండ మండలం బీబీపేటకు చెందిన వికలాంగుడు లోకేశ్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. ఇంతకు ముందు ధర్పల్లి మం డ లంలో రెండుసార్లు ఎల్లారెడ్డిపల్లి, అంసాన్పల్లి గ్రామాలకు చెందిన పం డుటాకులు రాస్తారోకో నిర్వహించారు. జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామ పంచాయతీని గత నెలలో ముట్టడించారు. ఆర్మూర్లో అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎ దుట ధర్నా నిర్వహించారు. కల్లెడ, ఢీకంపల్లి గ్రామాలకు చెందిన పింఛన్దారులు మాక్లూర్ మండల కార్యాలయానికి తాళం వేసి నిజామాబాద్-నందిపేట రోడ్డుపై బైఠాయించారు. ఇదే మండలం అడవిమామి డిపల్లి లో నిరసన వ్యక్తం చేశారు. కోటగిరి మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఎల్లారెడ్డికి చెందిన పింఛన్దారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రలో రాస్తారోకో చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో నిరసనలు కొనసాగాయి. -
‘జీవన భృతి’పై ఆందోళన
ఆర్మూర్ తహశీల్ ఎదుట బీడీ కార్మికుల ధర్నా ఎన్నికల ముందు హామీని సీఎం కేసీఆర్ నెలబెట్టుకోవాలి ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శివనమాల కృష్ణ డిమాండ్ ఆర్మూర్ టౌన్: బీడీ కార్మికులకు నెలకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి వెంటనే అమలు చేసి సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన చేపట్టారు. జంబీ హనుమాన్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించగా వేలాది మంది బీడీ కార్మికులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార సభల్లో తనకు తానుగా బీడీ కార్మికుల బతుకు దుర్భరంగా ఉందని తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం లో ఏడు లక్షల మంది బీడీ కార్మికులుంటే 25 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. వీరందరి ఓట్లను పొందేందుకు కేసీఆర్ హామీ ఇవ్వగా, కా ర్మికుల కుటుంబాలు నమ్మి ఓట్లు వేశాయని అన్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సైతం బీడీ కార్మికుల జీవన భృతి చర్చకు వచ్చిందని అన్నారు. కానీ బడ్జెట్లో మాత్రం బీడీ కార్మికుల జీవన భృతి అంశానికి నిధులు కేటాయించలేదని, దీంతో కార్మికుల ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోనైనా బీడీ కార్మికులకు జీవన భృతి అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖ రికి నిదర్శనమని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశా ల్లో ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అన్ని పక్షాల నాయకులను కలిసి కోరామని చెప్పారు. కా గా ఈ అంశాన్ని ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేసిందని విమర్శించారు. ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేసిందని అన్నారు. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు, బహుళ అంతస్తుల భవనాలు, మెట్రో లైన్ పొడగింపునకు రూ. వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్ బీడీ కార్మికులకు రూ. 840 కోట్లు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. వెంట నే బడ్జెట్ సవరణ చేసి బీడీ కార్మికుల భృతికి నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు, పెన్షన్దారులకు జీవన భృతి ఎప్పటి నుంచి ఇచ్చేది స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అ నంతరం ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎం ముత్తెన్న, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు బి దేవరాం, ఐఎఫ్టీయూ డివిజన్ నాయకుడు సూర్య శివాజీ ప్రసంగించారు. అనంతరం అరుణోదయ కళా బృందం ప్రదర్శనతో అంబేద్కర్ చౌరస్తా వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. తదనంతరం తహశీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ మేరకు తహశీల్దార్ డి శ్రీధర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు ఎన్ దా సు, సత్తెక్క, సార సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీడీ కార్మికులకు వెయ్యి జీవనభృతి చెల్లించాలి
రేపు ఇందిరా పార్కు ఎదుట కార్మికుల ధర్నా హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బీడీ కార్మికులకు నెలకు రూ.1000 జీవనభృతి చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. టీఆర్ఎస్ కార్మిక విభాగం లక్షలాది కరపత్రాలు పంచి ఈ వాగ్ధానాన్ని ప్రచారం చేసిందని ఈ యూనియన్ గౌరవాధ్యక్షుడు డి.వి.కృష్ణ ఆదివారం గుర్తు చే శారు. ఈ సమస్యపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు మంగళవారం ఇందిరా పార్కు ఎదుట ధర్నా చేయనున్నామని చెప్పారు. -
కదంతొక్కిన బీడీ కార్మికులు
►బీడీ కంపెనీ బ్రాంచి కార్యాలయం ముట్టడి ►సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన దిలావర్పూర్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దిలావర్పూర్, కుంటాల, సారంగాపూర్, మామడ, లోకేశ్వరం, నిర్మల్ మండలాలకు చెందిన దాదాపు 2వేల మంది బీడీ కార్మికులు దిలావర్పూర్ మండలంలోని రాంపూర్లో శివాజీ బీడీ కంపెనీ బ్రాంచి కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజన్న మాట్లాడుతూ, శివాజీ బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు మాత్రమే చెల్లిస్తూ పీఎఫ్ ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ డివిజన్లోని 6 వేలకు పైగా ఉన్న కార్మికులకు నేటికీ పీఎఫ్ సౌకర్యం కలుగజేయకపోవడం శోచనీయమని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీడీ కార్మికులకు రూ.1000 భృతి కూడా పీఎఫ్ లేని కారణంగా దక్కని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు వైద్యం, వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందడం లేదని పేర్కొన్నారు. కార్మికులందరికీ పీఎఫ్ చెల్లుబాటయ్యేలా చూసి, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా అధికారులు, ప్రభుత్వం స్థానిక బీడీ కంపెనీపై ఒత్తిడి తేవాలని కోరారు. అనంతరం బ్రాంచి మేనేజరుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా నాయకులు సుమేగ్, పీవోడబ్ల్యూ కార్యదర్శి కె.లక్ష్మి, నాయకులు హరిత, దేవక్క, అమ్మాయి, ఆయా మండలాల బీడీ కార్మికులు పాల్గొన్నారు. -
‘వేయి’ కళ్లతో..
ఆదిలాబాద్ : బీడీ కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటిన తరుణంలో చాలీ చాలని వేతనంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బీడీలు చుడితే రూ.100 గిట్టడం లేదు. బతుకుమాటేమో గానీ తంబాకు ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. టీబీ, క్యాన్సర్ తదితర వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక బీడీ కార్మికులు రోజు 1000 బీడీలు చుడితే వచ్చేది రూ.143. అందులో పీఎఫ్ కటింగ్ పోనూ రూ.130 చేతికి అందుతాయి. పనిచేసిన రోజుకే కూలీ. లేనిపక్షంలో పస్తులుండాల్సిందే. దీంతో రోజు 1000 బీడీలు చుట్టేందుకు మహిళలు పడే శ్రమ అంతాఇంతా కాదు. కొంతమంది 500 బీడీలు, లేనిపక్షంలో అంతకంటే తక్కువే చుట్టి ఎంతో కొంత సంపాదిస్తున్నారు. చేయూత అంతంతే.. జిల్లాలో 69,221 మంది బీడీ కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్, భైంసా, బోథ్, ఖానాపూర్, ఆదిలాబాద్ తదితర నియోజకవర్గాల్లో అత్యధికంగా బీడీ కార్మికులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 14 కంపెనీలు బీడీలు కొనుగోలు చేస్తున్నాయి. 1,321 మంది కమీషన్ ఏజెంట్ల ద్వారా బీడీ కార్మికులు ఆయా కంపెనీలకు తాము చుట్టిన బీడీలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పరంగా చేయూత కూడా అంతంతే. కార్మిక శాఖలో బీడీ కార్మికులు పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వ పరంగా చేయూత ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా కేవలం 3 వేల మంది కార్మికులకు మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నట్లు కార్మిక శాఖ అధికారులు వెళ్లడిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి శ్రమ ఓర్చి పనిచేస్తున్నా ప్రభుత్వం తమను గుర్తించడం లేదన్న ఆవేదన మహిళ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. ఉండేందుకు ఇల్లు లేదని, పిల్లలను చదివిద్దామన్నా స్కాలర్షిప్లు వంటివి అందడం లేదని, అనారోగ్యం పాలైతే మెడిక్లేయిమ్ వంటి సదుపాయాలు కూడా లేవని వారిలో నిరాశ కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈఎస్ఐ ఆస్పత్రుల ద్వారా వారికి వైద్య చికిత్సలు అందాల్సి ఉన్నప్పటికి సరైన అవగాహన లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్లో ఈ ఆస్పత్రి ఉంది. పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లను అందజేయాలి. అయితే కార్మికుల పీఎఫ్లో జమ అయిన డబ్బుల ఆధారంగా ఈ చెల్లింపులు జరుపుతారు. ఆ లెక్కన వారికి దక్కేది అరకొరే. దానిపై కూడా కార్మికులకు అవగాహన లేదు. వీటి పరంగా నూతన ప్రభుత్వం దృష్టి పెట్టి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ భృతిపై ఆశ.. ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ బతుకులు వెళ్లదీస్తున్న తమకు రూ.1000 గౌరవ భృతి కల్పిస్తామన్న టీఆర్ఎస్ సర్కారు ప్రకటన కొంత ఆశ గొలుపుతోంది. జిల్లాలో 69,221 మంది కార్మికులు ఉండగా, గౌరవ భృతి అమలు చేసిన పక్షంలో ప్రభుత్వంపై సుమారు ప్రతినెల రూ.7 కోట్ల భారం పడుతుంది. అయితే ఇప్పటివరకు గౌరవ భృతికి సంబంధించి ప్రభుత్వ శాఖలకు విధివిధానాలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ప్రస్తుతం బీడీలు చుడుతున్న కార్మికులకే ఈ భృతి అందజేస్తారా, లేనిపక్షంలో బీడీలు చుడుతూ పదవీ విరమణ పొందిన కార్మికులకు ఇస్తారా అనే విషయంలోనూ సంశయనం వారిలో వ్యక్తమవుతోంది. -
ఆశల్లేవ్.. అలసిపోయాం
* ఎవరొచ్చినా మాకు ఒరగపెట్టిందేమీ లేదు * బతకు మారడం లేదు.. భవిష్యత్తుపై నమ్మకమూ లేదు * రాజకీయ నాయకులు, పార్టీల పట్ల నిరాసక్తత * నేత, బీడీ కార్మికుల మనోగతం.. * గల్ఫ్ బాధితులదీ అదే పరిస్థితి సిరిసిల్ల, ఆంధ్రానగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి బి. నారాయణరెడ్డి : ‘మా జీవితాలు మారవు.. మారుతాయన్న ఆశా లేదు. ఎవరొచ్చినా ఉద్దరించిందే మీ లేదు. ప్రతిసారి మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికే ఆలసిపోయాం. భవిష్యత్తు పట్ల ఆశ కూడా లేదు. ఎవరు గెలిస్తే....మాకెంటి? ఎవరు ఓడిపోతే మాకెంటి ? అందుకే ఎన్నికలంటే ఆసక్తి లేదు...ఓట్లంటే ఆనందం లేదు’ ఇదీ.. నేత, బీడీ కార్మికుల అభిప్రాయం. ఎన్నో సంవత్సరాల నుంచి బతకలేక, చావలేక.. చాలీచాలని జీతభత్యాలతో నిత్యం చస్తూ బతుకుతున్న వారి మనోగతం ఇది. రాష్ట్రంలోని బీడీ, నేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. పైగా ఈ రెండు వర్గాలకు ఒక అనుబంధం ఉంది. మగవారు నేత కార్మికులుగా పనిచేస్తుండగా, ఆడ వారు బీడీ కార్మికులుగా జీవితాలను గడుపుతున్నారు. ఇద్దరూ రోజుకు 12 గంటల పాటు శ్రమిస్తున్నా ఇద్దరి పిల్లలకు తృప్తిగా అన్నం పెట్టి బడికి పంపించలేని పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల హడావుడి ఈ వర్గాల ప్రజలపై ఏ మాత్రం కనిపించడంలేదు. ఈ ఎన్నికల ద్వారా తమ జీవితాల్లో జరిగే మార్పులపై వారేమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల పట్ల వీరి మనోగతాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ‘సాక్షి’ పలు ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టనష్టాలను పరిశీలించింది. అయితే ఈ ఎన్నికల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదనే నిరాశనిసృహల్లో ఈ కార్మికులు ఉన్నారు. ఏళ్లతరబడి తమ జీవితాలను మార్చాలని కోరుతున్నా...ఏ నాయకుడూ ఆదుకోలేదనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి కొంత వరకు తమ కష్టాలను గట్టెక్కించాలని ప్రయత్నించినా మిగిలిన వారు పట్టించుకోలేదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పనిగట్టుకుని వచ్చి పలకరించిన వారు ఆ తర్వాత మరిచిపోతుండడంతో ఎన్నికలంటే ఏ మాత్రం ఆసక్తి ఉండడం లేదని చెబుతున్నారు. రాష్ర్టవ్యాప్తంగా 8 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఇందులో ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. అలాగే 70 వేల మరమగ్గాల కార్మికులు ఉన్నారు. ఇందులో ఒక్క కరీంనగర్ సిరిసిల్లలోనే 35వేల కుటుంబాలు ఉన్నాయి. కరెంట్ షాక్ విద్యుత్ చార్జీలు పెరగడంతో చేనేతరంగం మరింత సంక్షోభంలోకి వెళ్లింది. యూనిట్కు ఒక్క రూపాయి ఉండే చార్జీ కాస్త ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ పోను ప్రస్తుతం రెండు రూపాయలకు పెరిగింది. ఫలితంగా ఎనిమిది మరమగ్గాలు నడపాలంటే సుమారు నాలుగు వేల రూపాయలు విద్యుత్ చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. నెలంతా కష్టపడ్డా నాలుగు వేల రూపాయలు జీతం కూడా యజమానికి గిట్టుబాటు కావడం లేదు. నేత కార్మికుల పరిస్థితి మరీ దారుణం నేత కార్మికులు రోజులకు 12 గంటలు పనిచేయాలి. ఆలా చేస్తే రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు గిట్టుబాటు అవుతుంది. అది కూడా ఒక వారం పగలు పనిచేస్తే మరో వారం రాత్రి పూట పనిచేయాల్సి ఉంటుంది. పనిచేసే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనుకున్న మేర వస్త్రం తయారుకాదు. దీంతో కూలి కూడా తగ్గిపోతుంది. రోజుకు 8 గంటల పనితో పాటు, మీటరకు ఇప్పుడిచ్చే రూ. 1.40లను 2 రూపాయలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రోజంతా కష్టపడ్డా రూ.వంద గగనమే రోజుకు 12 గంటలు కష్టపడ్డా వంద రూపాయలు కూడా రావడం లేదని బీడీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకంలో కనీస వేతనం 130 రూపాయలు ఇస్తుండగా రోజంతా పనిచేసినా తమకు రూ.వంద కూడా రావడం లేదని చెబుతున్నారు. బీడీ కార్మికులు వెయ్యి బీడీలు చుడితే 115 రూపాయలు నుంచి 124 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒక్కొక్కరు రోజుకు 600-800 బీడీలు మాత్రమే చుడుతున్నారు. రూ. ఆరు వేలతో బతికేదెలా మగ్గం 30 ఏళ్ల నుంచి నేస్తున్నా. ఇప్పటికీ నా జీతం రూ.ఆరువేలే. ఈ జీతంతో భార్యా, పిల్లల్ని ఎలా బతికిం చాలి ? ఇప్పటికే జీవితంలో చాలా అలసటకు గురయ్యా. ఓపిక నశిం చింది. ఇంకా ఎన్ని రోజులు పనిచేస్తానో తెలియదు. వరుసగా12 గంట లు పనిచేయాలంటే అలసిపోతున్నా. రాత్రిళ్లు పనిచేయలేకపోతున్నా. - విశ్వనాథం, సిరిసిల్ల ఏ అవకాశం లేక మగ్గం నేస్తున్నా ఏపనీ దొరకడంలేదు. అందుకే మగ్గం పని చేస్తున్నా. మా నాన్న ఇదే పనిచేశాడు. ఇప్పుడు నా వంతు. దీనికంటే పార పనికి వెళ్లినా ఎక్కువ జీతం వస్తుంది. డిగ్రీ చేశాను. అయినా ఉద్యోగం లేదు. దాంతో పదేళ్ల నుంచి చాలీచాలని జీతాలకే మగ్గం పనిచేస్తున్నా. - భూమేష్ ఎనిమిది మగ్గాలు ఉన్నా... అప్పులు చేసి ఎనిమిది మగ్గాలను నడిపిస్తున్నా. అయినా జీతం కూడా మిగలడంలేదు. కరెంట్ చార్జీలు పెరగడం, ఆర్డర్లు సరిగ్గా లేకపోవడంతో కష్టాలు తప్పడంలేదు. - వెంకటేశం, మరమగ్గాల యజమాని బీడీలు చుడితేనే కాలేజీ ఫీజు నాన్న లేడు. అమ్మ నేత కార్మికురాలు. మూడువేల జీతం వస్తోంది. దాంతో నేను బీడీలు చుడుతున్నాను. బీడీల ద్వారా వచ్చే డబ్బులతోనే కాలేజీ ఫీజులు కడుతున్నా. మాకీ కష్టాలు ఇంకెన్నాళ్లో అర్థం కావడం లే దు. - స్వప్న, ఇంటర్విద్యార్థిని బీడీలు చుట్టి ఆస్తమా తెచ్చుకున్నా చిన్నప్పటి నుంచి బీడీలు చుట్టిచుట్టీ ఆస్తమా రోగానికి గురయ్యా. వేలుఖర్చు పెట్టి చికిత్స చేయించున్నా. అయినా పూర్తిగాతగ్గలేదు. పొగాకు వల్ల ఇలాంటి రోగాలు వస్తాయి. అయినా బీడీలు చుట్టే పనితప్పడం లేదు. - విజయలక్ష్మి బీడీలే ఆధారం నేత కార్మికుడిగా ఉన్న నా భర్త ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఏం పనీచేయలేని పరిస్థితి. నేను బీడీ చుడితేనే ఇంటికి ఆధారం. రోజు 12గంటలకు కష్టపడ్డా తిండికి సరిపోవడం లేదు. బతుకంటే భయం వేస్తోంది. - వి.లత -
నేడు బీడీ కార్మికుల సమ్మె
ఖలీల్వాడీ, న్యూస్లైన్ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీ డీ కార్మికులు మంగళవారం సమ్మె చే యనున్నారు. ఏపీ బీడీ, సిగార్ వర్క ర్స్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన మేరకు జిల్లాలోని రెం డున్నర లక్షల మంది కార్మికులు ఆం దోళనలో పాల్గొననున్నారు. కార్మికులు సంవత్సరాల తరబడి చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం కనీస వేతనాలను పెంచుతూ 2011లో జీ ఓ నం. 41 విడుదల చేసింది. ఈ జీ ఓ ప్రకారం కార్మికులకు వెయి బీడీలకు రూ.200లు చెల్లించాలి. అయితే, ఈ జీఓను అమలు చేయడంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ హించాయి. కార్మికుల సమస్యలను తీర్చడంలో శీత కన్ను వేశాయి. బీడీ కంపెనీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర సర్కారు జీఓ నం.41 నిలుపుదల చేస్తూ మరో జీఓ నం. 81 తీసుకు వచ్చింది. దీంతో తమ కడుపు కొట్టినట్లయ్యిందని బీడీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అదునుగా జిల్లాలో గుర్తింపు పొందిన బీడీ కంపెనీలు వర్దీ (అనుమతి లేని) బీడీలను తయారు చేయించడం మొదలు పెట్టాయి. దీని ద్వారా ప్రతి వెయ్యి బీడీలకు కార్మికులు రూ. 30 నుంచి రూ. 40 నష్టపోతున్నారు. కంపెనీలు ప్రభుత్వానికి పన్ను కూడా ఎగ్గొడుతున్నాయి. వేతనాలు తక్కువైనప్పటికీ బీడీలు చేసిన కార్మికులకు హీరాలాల్ (హెచ్పీ) కంపెనీ నాలుగు నెలలుగా బట్వాడాలు ఇవ్వడం లేదు. దీంతో కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. బీడీ కార్మికులపై యా జమాన్యల శ్రమ దోపిడీ రోజురోజుకు ఎక్కువ అవుతూనే ఉంది. కార్మికులకు చేతినిండా పని కల్పించటంలో, గుర్తింపు కార్డులను, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయటంలో యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కాగా సమ్మెను విజయవంతం చేయాలని విలేకరుల సమావేశంలో ఏపీ బీడీ, సిగార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు రాములు కోరారు. ఉద్యమాలు చేసినా ఫలితం లేదు బీడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో సమ్మెకు దిగుతున్నాం. - నూర్జహాన్, ఏపీ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు వెయ్యి బీడీలకు రూ.200 ఇవ్వాలి వెయ్యి బీడీలకు రూ.200 ఇవ్వాలి. మాకు కనీసం పీఎఫ్, ఈఎస్ఐ కుడా లేదు. బీడీ కంపెనీలు కనీసం గుర్తింపు కార్డులను ఇవ్వడం లేదు. కంపెనీలో సమస్యలు పరిష్కరించాలి. - జయమ్మ, బీడీ కార్మికురాలు -
19న దేశవ్యాప్త సమ్మె
షోలాపూర్, న్యూస్లైన్: దేశ వ్యాప్తంగా నవంబర్ 19న బీడీ కార్మికులు సమ్మెను నిర్వహిస్తున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నర్సయ్య ఆడం పేర్కొన్నారు. స్థానిక కుంబారి ప్రాంతంలో బుధవారం జరిగిన గోదుతాయి మహిళ బీడీ కామ్గార్ గృహ నిర్మాణ సంస్థ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీడీ పరిశ్రమ అపాయకరమైనదని పేర్కొంటూ వీటి ఉత్పత్తులపై నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందన్నారు. అందువల్లనే నవంబర్ 19వ తేదీన దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా కార్మికులు బతుకు బండిని లాగడం కష్టతరమవుతోందన్నారు. కార్మికులు ఉపాధి పొందుతున్న పరిశ్రమలను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా కార్మికులు రోడ్డుపైకి రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా బీడీ కార్మికుల గృహనిర్మాణానికి లక్షన్నర రూపాయలను గ్రాంటు రూపంలో అందించాలని, బీడీల ఉత్పత్తులపై వ్యాట్ను వెంటనే రద్దు చేయాలని, ప్రతి నెలా పింఛన్ కింద రూ.3,000 అందజేయాలనే డిమాండ్లతో ఈ సమ్మెకు దిగుతున్నామన్నారు. ఆ తర్వాత కార్మిక నాయకులు సునంద బల్ల, ఫాతిమా బేగ్, సిద్ధప్ప కలుశెట్టి, కురువయ్య తదితరులు కూడా ప్రసంగించారు. -
మండే గుండెలు