Black Fungus
-
Hyderabad: బ్లాక్ ఫంగస్తో కంటి చూపుకోల్పోయిన వ్యక్తి ఆత్మహత్య
రాజేంద్రనగర్ (హైదరాబాద్): కరోనా, బ్లాక్ ఫంగస్తో మంచానికే పరిమితమై మనోవేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ ప్రేమావతిపేట ప్రాంతానికి చెందిన నవీన్కుమార్(35) యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగి. ఆయనకు 2017లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి రెండు సంవత్సరాల కుమారె సంతానం. 2020 సంవత్సరం మే నెలలో ఆయన కోవిడ్ బారినపడ్డాడు. జూన్ నెలలో బ్లాక్ ఫంగస్ గురయ్యాడు. దీంతో చికిత్స పొందుతూ కంటి చూపు కొల్పొయాడు. కోలుకున్న అనంతరం ఇంటి వద్దే ఉంటున్నాడు. మంచానికే పరిమితమైన నవీన్కుమార్ తరచుగా మనోవేదనకు గురయ్యేవాడు. ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నోట్లో నుంచి నురుగులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియాకు, అక్కడి నుంచి ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: నగరంలో ఇద్దరు మహిళల అదృశ్యం.. ఫోన్స్ స్విచ్ఛాఫ్) -
కోవిడ్ను మించి కంగారు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కంటే జనాన్ని బ్లాక్ ఫంగస్సే ఎక్కువగా భయపెట్టింది. సోకింది అతికొద్దిమందికే అయినా బాధిత కుటుంబ సభ్యులకు వణుకు పుట్టించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొదటి, సెకండ్ వేవ్ కలిపి 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో బ్లాక్ ఫంగస్ కేసులను అంచనా వేస్తే కేవలం 0.24 శాతం మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కేసులను బట్టి చూస్తే.. ప్రతి 10 వేల మందిలో ఇద్దరికే ఇది సోకింది. కానీ వెయ్యి మందికి చేసిన వ్యయం ఈ ఇద్దరికే అయినట్టు అంచనా వేశారు. ఖరీదైన మందులు, వైద్యుల సమూహంతో చికిత్స, దీర్ఘకాలం మందులు వాడాల్సి రావడం దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికీ 337 మందికి కొనసాగుతున్న చికిత్స ఈ బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) జబ్బుకు ఇప్పటికీ 337 మందికి చికిత్స కొనసాగుతూనే ఉంది. బ్లాక్ ఫంగస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టినా దీర్ఘకాలిక చికిత్స చేయాల్సి ఉన్నందున చికిత్సను కొనసాగించాల్సి వస్తోంది. రోగులు పూర్తిగా కోలుకునే వరకూ నెలల తరబడి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికోసం యాంఫొటెరిసిన్ బి, పొసకొనజోల్ ఇంజక్షన్లతో పాటు పొసకొనజోల్ మాత్రలూ తరచూ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ 337 మందిలో అత్యధికంగా 132 మంది గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు 804 చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. ఇది సోకిన బాధితుల్లో అత్యల్పంగా ఒకే ఒక్కరు విజయనగరం జిల్లాలో మృతిచెందారు. ఈ జిల్లాలో ఇప్పటివరకూ నమోదైంది కూడా 26 కేసులే. కోవిడ్తో పాటు బ్లాక్ ఫంగస్నూ ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. బ్లాక్ఫంగస్ మందుల కోసమే ప్రభుత్వం రూ.110 కోట్లు వ్యయం చేసింది. -
బ్లాక్ ఫంగస్ మందుల పేరుతో బురిడీ
సాక్షి, సిటీబ్యూరో: బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందుల కొరతను ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆ ఔషధాలను విక్రయిస్తామంటూ ఆన్లైన్ కేంద్రంగా నగరవాసులకు టోకరా వేశారు. ఈ తరహా నేరానికి సంబంధించిన నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న విశాఖపట్నం యువకుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది జూన్లో బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. దీంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు ఎంపోటెరిసిసిన్–బీ సంబంధిత ఇంజెక్షన్లు తమ వద్ద లేవని, బయట కొనుగోలు చేసుకోవాలని సూచించారు. దీంతో బాధిత కుటుంబం ఇంజెక్షన్లు కావాలంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అది చూసి వారిని సంప్రదించిన సైబర్ నేరగాడు ఇంజెక్షన్ల సరఫరాకు అడ్వాన్స్ ఇవ్వాలంటూ రూ.40 వేలు కాజేశాడు. ఔషధం పంపని అతగాడు ఇంకా కొంత మొత్తం కోరుతుండటంతో అనుమానించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. అలా లభించిన ఆధారాలను బట్టి నిందితుడిని విశాఖపట్నానికి చెందిన హేమంత్గా గుర్తించారు. నగరం నుంచి వెళ్లిన ఓ ప్రత్యేక బృందం బుధవారం అతడిని అరెస్టు చేసి నగరానికి తరలించింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమారుడైన హేమంత్ డిగ్రీ పూర్తి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. -
హీరో, హీరోయిన్లాంటి భార్యాభర్తలు పోలీసులకు వీడియో పంపి
బెంగళూరు: కరోనా సోకిన అనంతరం బ్లాక్ ఫంగస్ సోకి ఇబ్బందులు ఎదుర్కొంటారనే వార్తలు రావడంతో భయాందోళన చెందిన ఓ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రాణాపాయం ఉందనే వార్తలు టీవీలు, పత్రికల్లో వచ్చిన వాటిని చూసి భయపడిన ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ అంత్యక్రియల కోసం రూ.లక్ష నగదు దాచి ఉంచిన విషయాన్ని చెప్పి మరీ వారు తమ ప్రాణాలను తీసుకున్నారు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. రమేశ్ (40), గుణ సువర్ణ (35) భార్యాభర్తలు. వీరిద్దరూ మంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురవడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా సోకిన వారికి బ్లాక్ ఫంగస్ సోకుతుందని వార్తలు వచ్చాయి. ఆ ఫంగస్ ప్రభావం మధుమేహం ఉన్న వారికి తీవ్ర ప్రభావం ఉంటుందని వచ్చిన వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే గుణ సువర్ణకు మధుమేహం ఉంది. తమకు కూడా బ్లాక్ ఫంగస్ సోకితే చికిత్సకు భారీ మొత్తం ఖర్చయితే తాము భరించలేమని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు వీరు వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలను వివరించారు. ఆ వీడియోను మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్కు పంపించారు. పంపించిన వెంటనే ఇది చూసిన కమిషనర్ వారిని ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వారు ఎక్కడుంటారో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. స్థానిక మీడియాలో కూడా ఇది వివరించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. చివరకు వారి ఆచూకీ కనుగొనేలోపు ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉన్నారు. చనిపోయిన తర్వాత తమ అంత్యక్రియల కోసం రూ.లక్ష నగదు దాచిన విషయం పోలీసులకు వీడియోలో చెప్పారు. అంతేకాదు తమ దహన సంస్కారాలు సంప్రదాయం ప్రకారం చేయించాలని, దీనికి పోలీస్ కమిషనర్ శశికుమార్, శరణ్ పంప్వెల్, సత్యజిత్ సురత్కల్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇంట్లోని వస్తువులు పేదలకు పంచాలని ఆ దంపతులు వీడియోలో చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే వీరికి పిల్లలు లేరు. సంతాన లేమితో కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. ముగ్ధుడైన భర్త చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు -
బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.22 లక్షలు తీసుకున్నారు!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరితే, ఇంజక్షన్ల కొరత ఉందంటూ ఓ డ్యూటీ వైద్యురాలు తమ వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిందని ఓ వ్యక్తి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము చెల్లింపులన్నీ డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదుకు జత చేయడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పొట్టెం విజయలక్ష్మి శరన్ ఈ ఏడాది మే 28న బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆ వార్డులో డ్యూటీ డాక్టర్గా ఉన్న (కోవిడ్ నియామకం) తోట వాణి సుప్రియ లయోఫిలైజుడ్ యాంఫోటెరిసిన్ బి అనే యాంటి ఫంగల్ ఇంజెక్షన్స్ కొరత ఉందని, డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని, ముడుపులు చెల్లిస్తే కానీ ఇంజెక్షన్లు సమకూర్చలేమని చెప్పినట్లు విజయలక్ష్మి భర్త రఘుకులేశ శరన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విడతల వారీగా తాము రూ.22 లక్షలు డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఉచితంగా యాంటీ ఫంగల్ మందులను ఇస్తుంటే, ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం దారుణమని, తమని మోసం చేసిన డ్యూటీ డాక్టర్పై చర్యలు తీసుకుని, ఆమె వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ సీరియస్.. బ్లాక్ ఫంగస్ రోగి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆస్పత్రి అధికారులను తమ కార్యాలయానికి పిలిపించుకుని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఇతర వివరాలను సేకరించారు. కాగా ఈ విషయమై బాధితులు వారం కిందటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి ఫిర్యాదు చేసినా, దానిని ఆస్పత్రి అధికారులకు పంపకుండా వారి వద్దే ఉంచుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఘటన వెలుగులోకి రావడంతో హడావుడిగా తమకు వచ్చిన ఫిర్యాదును ఆస్పత్రి అధికారులకు పంపారు. విచారణ జరుగుతోంది రోగి నుంచి రూ.22 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై జేసీ నేతృత్వంలో విచారణ జరుపుతున్నాం. తమకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు మొత్తం జేసీకి ఇచ్చాము. రోగి ప్రభుత్వాస్పత్రి నుంచి వెళ్లిన తర్వాత ఇంటి వద్ద కూడా ఈ వైద్యురాలు చికిత్స చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలు విచారణలో తేలుతాయి. – డాక్టర్ ఎం జగన్మోహనరావు, సూపరింటెండెంట్ -
కోవిడ్ నుంచి కోలుకున్నా..మళ్లీ ఇదేం బాధరా భగవంతుడా
సాక్షి, సిటీబ్యూరో: కరోనా నుంచి కోలుకున్నామనే ఆనందం బాధితుల్లో ఎంతో కాలం నిలవడం లేదు. మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ వారిని (మ్యూకర్ మైకోసిస్) బ్లాక్ ఫంగస్ రూపంలో మరో వైరస్ మళ్లీ వెంటాడుతోంది. మే రెండో వారంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని ఇందుకు నోడల్ సెంటర్గా ఎంపిక చేసింది. పడకల సామర్థ్యానికి మించి కేసులు రావడంతో గాంధీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక బ్లాక్ ఫంగస్ విభాగాలు ఏర్పాటు చేసింది. 86 శాతం మంది టీకా తీసుకోని వారే ►ఈఎన్టీ వైద్యులు ఆస్పత్రిలో అడ్మిటైన 300 మంది బ్లాక్ ఫంగస్ బాధితులపై ఇటీవల ఓ సర్వే చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ►వైరస్ బారిన పడిన బాధితుల్లో 86 శాతం మంది టీకా తీసుకోని వారే కావడం గమనార్హం. కేవలం ఆరు శాతం మంది మాత్రమే ఫస్ట్ డోసు పూర్తి చేసుకున్నట్లు వెల్లడైంది. ►అంతేకాదు ఎంపిక చేసిన బాధితుల్లో 280 మంది మధుమేహ బాధితులే. వీరిలో 51 శాతం మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత డయాబెటిక్, డినోవాలు వెలుగు చూడగా, 43 శాతం మందికి కరోనాకు ముందే మధు మేహం ఉన్నట్లు గుర్తించారు. ►కరోనా చికిత్సల్లో వైద్యులు రెమ్డెసివిర్, ఇతర స్టెరాయిడ్స్ను ఎక్కువగా వినియోగించడమే ఇందుకు కారణమని తెలిసింది. ప్రస్తుతం మరో 200 మంది బాధితులు గాంధీలో ప్రస్తుతం 150 కోవిడ్ పాజిటివ్/బ్లాక్ ఫంగస్ కేసులు ఉండగా, ఈఎన్టీలో 50 మంది వరకు చికిత్స పొందు™తున్నారు. వీరిలో కొంత మంది దవడ సర్జరీల కోసం ఎదురు చూస్తుండగా, మరికొంత మంది ముక్కు, కన్ను సర్జరీల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సెంటర్లలో రోజుకు పది నుంచి పదిహేను సర్జరీలు జరుగుతున్నాయి. ►బ్లాక్ ఫంగస్ కారణంగా కన్ను, ముక్కు, దవడ భాగాలను కోల్పోయిన బాధితులు వాటి స్థానంలో కృత్రిమ అవయవాలను అమర్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. ►పేదలకు ఈ ప్లాస్టిక్ సర్జరీలు భారంగా మారాయి. ఆర్థికస్తోమత ఉన్న వారు యుక్త వయస్కులు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు చేయించుకుంటున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. 150 మందికి దెబ్బతిన్న కంటిచూపు ► ఈఎన్టీ, గాంధీ, సరోజినీదేవి ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 2,676 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ► వీరిలో 1896 మందికి వైద్యులు సర్జరీలు చేశారు. వీరిలో 150 మందికి కంటి సంబంధిత సర్జరీలు చేయగా...దాదాపు అందరూ చూపును కోల్పోయినట్లే. ► 650 మందికి దవడ, దంతాలను, 350 మందికి ముక్కు, మరో 746 మందికి ఇతర భాగాల తొలగింపు శస్త్రచికిత్సలు చేశారు. గాంధీ, ఈఎన్టీ ఆస్పత్రుల్లో నమోదైన కేసులు మొత్తం బ్లాక్ ఫంగస్ కేసులు : 2676 వీరిలో ఎంత మందికి సర్జరీలు చేశారు : 1896 కంటి సర్జరీలు : 150 పన్ను తొలగింపు సర్జరీలు : 650 ముక్కు తొలగింపు సర్జరీలు : 350 ఇతర భాగాల తొలగింపు : 746 -
కోవిడ్తో క్షయకు అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల ఒక వ్యక్తి క్షయవ్యాధికి గురయ్యే అవకాశం ఉందని, బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ అని, అయితే ప్రస్తుతం వైరల్ వ్యాధి కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి తగిన ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కోవిడ్ సంబంధిత ఆంక్షల కారణంగా క్షయవ్యాధి కేసుల సంఖ్య 2020లో సుమారు 25%తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల కోవిడ్ బారిన పడిన రోగులలో టీబీ కేసులు అకస్మాత్తుగా పెరిగాయంటూ కొన్ని వార్తా నివేదికలు వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతిరోజూ డజనుకు పైగా ఇలాంటి కేసులకు చికిత్స అందిస్తున్న వైద్యులలో ఇది ఆందోళన రేకెత్తించిందని తెలిపింది. ‘కోవిడ్ పేషెంట్లకు క్షయ రోగ నిర్ధారణ పరీక్షలు, అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు కోవిడ్ పరీక్షలు సిఫారసు చేసినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమణతో ఒక వ్యక్తి క్రియాశీల టీబీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది ‘ఇది బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ‘అని పేర్కొంది. కోవిడ్ కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని తెలిపింది. టీబీ కేసులు, కోవిడ్ కేసులు రెండింటినీ కనుగొనే ప్రయత్నాలు చేపట్టాలని రాష్ట్రాలను కోరింది. ‘కోవిడ్ సంబంధిత ఆంక్షల ప్రభావం కారణంగా, 2020లో టీబీ కేస్ నోటిఫికేషన్లు 25 శాతం తగ్గాయి. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఓపీడీ సెట్టింగుల ద్వారా, కేస్ నిర్ధారణ క్యాంపెయిన్ ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని వివరించింది. -
Gandhi Hospital: 19 నుంచి నాన్కోవిడ్ సేవలు
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి కోవిడ్, నాన్కోవిడ్ సేవలు అందించాలని ఆస్పత్రి అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి గాంధీలో కేవలం కోవిడ్ బాధితులకు మాత్రమే వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న క్రమంలో నాన్కోవిడ్ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం గాంధీలో 215 కరోనా, 179 మంది బ్లాక్ఫంగస్ బాధితులు వైద్యసేవలు పొందుతున్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్న 44 మందిని సోమవారం డిశ్చార్జీ చేసినట్లు నోడల్ అధికారి ప్రభాకర్రెడ్డి తెలిపారు. నాన్కోవిడ్ సేవలను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. ఆర్థో ఐసీయూ, సెకండ్ ఫ్లోర్తో పాటు లైబ్రరీ భవనంలో కోవిడ్, బ్లాక్ఫంగస్ వార్డులు ఏర్పాటు చేస్తామని, గతంలో మాదిరిగా క్యాజువాలిటీ, ఓపీ, ఐపీ భవనాల్లో నాన్కోవిడ్ సేవలు కొనసాగుతాయని వివరించారు. థర్డ్వేవ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తీవ్రత ఏమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
కరోనా, బ్లాక్ ఫంగస్: 85 రోజులు మృత్యువుతో పోరాడి
ముంబై: కరోనా మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎందరినో బలి తీసుకుంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది వేర్వేరు ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ బారిన పడి మృతి చెందారు. కానీ, ముంబైకి చెందిన ఒక వ్యక్తి గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా మృత్యుంజయుడే అంటారు. ఎందుకంటే సదరు వ్యక్తి కరోనాతో మాత్రమే కాక, బ్లాక్ ఫంగస్, అవయవాల విఫలం వంటి పలు తీవ్ర సమస్యలతో పోరాడాడు. ఒకానొక సమయంలో వైద్యులు, కుటుంబ సభ్యులు కూడా సదరు వ్యక్తి మీద ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఆశ్చర్యంగా అతడు ఈ సమస్యలన్నింటి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. ముంబైకి చెందిన 54 ఏళ్ల భరత్ పంచల్ అనే వ్యక్తి మార్చి మూడో వారంలో కోవిడ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 8న జ్వరం రావడంతో హిరానందాని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ భరత్కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. సిటీ స్కాన్లో భరత్కు కరోనా మోతాదు 21 నుంచి 25 మధ్యలో ఉన్నట్లు తేలింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్ఫెక్షన్ ఎక్కువయి.. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. వైద్యులు వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంచారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే భరత్ శరీరంలోని ఇతర అవయవాలలో కూడా సమస్యలు మొదలయ్యాయి. అతని ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. మూత్రపిండాలు దెబ్బతినడం, కాలేయం పనిచేయకపోవడం, సెప్సిస్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, ఊపిరితిత్తుల చీలిక వంటి చాలా లక్షణాలతో పాటు కోవిడ్ రోగులలో కనిపించే బ్లాక్ ఫంగస్ బారిన కూడా పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ పరిస్థితుల మధ్య భరత్.. 70 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నాడు. కోవిడ్ రోగికి వచ్చే ప్రతి సమస్య.. భరత్కు వచ్చినట్లు హిరానందాని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గత 15 నెలల్లో తమ ఆస్సత్రిలో ఏ పేషంట్ ఎక్కువ కాలం ఇలా ఉండలేదని వారన్నారు. భరత్ను రక్షించేందుకు వైద్యశాస్త్రంలోని ప్రతి అవకాశాన్ని వైద్యులు ప్రయత్నించారు. రెమిడెసివర్, ప్లాస్మా థెరపితో పాటు మరికొన్ని చికిత్సలను కూడా చేశారు. కానీ, వీటి వల్ల భరత్ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా.. భరత్ ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం కావడం ప్రారంభం కావడంతో.. అతని కుటుంబం ఆశలు వదులుకుంది. అయితే తనను రక్షించుకోవడం కోసం తన కుటుంబం పడుతున్న ఆరాటం చూసిన భరత్.. ఎలాగైనా బతకాలని దృఢసంకల్పంతో బాధను భరించాడు. ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం ప్రారంభమైన 15 రోజుల తర్వాత చికిత్సకు స్పందించి.. అన్ని సమస్యలను అధిగమించాడు. దాంతో 85 రోజుల చికిత్స తర్వాత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. చనిపోతాడనుకున్న భరత్.. తిరిగి ఇంటికి రావడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా పేషెంట్లకు బోన్ డెత్ ముప్పు?
ముంబై: కరోనా నుంచి కోలుకున్న రోగులకు బోన్ డెత్ రూపంలో కొత్త ప్రమాదం తలెత్తడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాస్కులార్ నెక్రోసిస్(ఏవీఎన్)లేదా బోన్ టిష్యూ డెత్గా పిలిచే ఈ వ్యాధిని ఇప్పటివరకు ముగ్గురు కరోనా వచ్చి తగ్గినవారిలో కనుగొన్నట్లు హిందూజా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా రోగులకు బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ఎదురై అందరినీ ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే! తాజాగా కరోనా అనంతరం ఏవీఎన్ ముప్పు పెరగవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్రోగులకు వాడే స్టిరాయిడ్లే ఈ ఏవీఎన్ వచ్చేందుకు ప్రాథమికంగా కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫీమర్ ఎముక వద్ద మొదలైన నొప్పితో ముగ్గురు ఆస్పత్రికి వచ్చారని, కోవిడ్ వచ్చిన తగ్గిన రెండు నెలలకు వీరిలో ఈ సమస్య బయటపడిందని డా. సంజయ్ అగర్వాల్ చెప్పారు. కోవిడ్ ట్రీట్మెంట్లో దీర్ఘకాలం పాటు కార్టికోస్టిరాయిడ్లు వాడడంతో ఏవీఎన్ కేసులు పెరుగుతున్నాయని బీఎంజే కేస్ స్టడీస్లో ప్రచురితమైన ఆర్టికల్లో సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం కోవిడ్తో పోరాటం చేసినవారిలో ఈ బోన్డెత్ లక్షణాలు గమనించామని మరికొందరు డాక్టర్లు సైతం చెబుతున్నారు. వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇలాంటి కేసులు పెరగవచ్చని, స్టిరాయిడ్ల వాడకమైన 5–6 నెలలకు ఈ వ్యాధి బయటపడుతుంటుందని డా. రాహుల్ పండిట్ చెప్పారు. సెకండ్ వేవ్ ఏప్రిల్లో గరిష్ఠాలకు చేరిందని, అప్పుడు వైద్యం చేయించుకున్నవారిలో బోన్డెత్ లక్షణాలు బయటపడేందుకు కొంత సమయం పట్టవచ్చని అంచనా వేశారు. అయితే సంజయ్ అభిప్రాయం ప్రకారం త్వరలోనే ఏవీఎన్ కేసులు పెరుగుతాయి. సాధారణంగా ఏవీఎన్ లక్షణాలు బయటపడేందుకు చాలా నెలలు పడుతుందని, కానీ ఇప్పుడు ట్రెండ్లో స్వల్పకాలంలోనే ఈ లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ వ్యాధి సోకినవాళ్లను తొలినాళ్లలో గుర్తిస్తే మంచి వైద్యం అందించవచ్చన్నారు. తొలిదశలో ఎలాంటి ఆపరేషన్లు అవసరం ఉండదన్నారు. కోవిడ్ వచ్చి తగ్గినవాళ్లు తొడలు, హిప్ జాయింట్ వద్ద నొప్పి కొనసాగుతుంటే ఎంఆర్ఐ స్కానింగ్కు వెళ్లాలని, అనంతరం ఏవీఎన్ వ్యాధి సోకిందేమో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తొలిదశలో బిస్ఫాస్ఫోనేట్ థెరపీ ద్వారా దీన్ని తగ్గించవచ్చన్నారు. -
TS: బ్లాక్ ఫంగస్తో ఎక్సైజ్ ఎస్ఐ మృతి
సాక్షి,ఖమ్మం: స్థానిక ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఎస్సైగా పనిచేస్తున్న ఎం.చిరంజీవి (55) బ్లాక్ ఫంగస్తో ఆదివారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. నేలకొండపల్లి ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చిరంజీవికి నెల రోజుల కిందట కరోనా సోకింది. చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స కోసం తరలించారు. అక్కడ కరోనా నెగటివ్ వచ్చాక బ్లాక్ ఫంగస్ సోకింది. అదే హస్పిటల్లో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్న సందర్భంలో మళ్లీ అనారోగ్యం బారిన పడి ఆదివారం మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నేలకొండపల్లి ఎక్సైజ్ సీఐ విజేందర్, ట్రైనింగ్ ఎస్సైలు శంకర్, సందీప్, నేలకొండపల్లి, కొత్తకొత్తూరు సర్పంచ్లు రాయపూడి నవీన్, వల్లాల రాధాకృష్ణ, రాచమంద్రాపురం సొసైటీ చైర్మన్ గూడవల్లి రాంబ్రహ్మం, దగ్గుల అంజిరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు -
30 మంది కంటిచూపు మింగేసిన బ్లాక్ఫంగస్
కోయంబత్తూరు: బ్లాక్ ఫంగస్ కారణంగా అనారోగ్యంపాలైన 264 మంది పేషెంట్లలో 30 మందికి ఒక్క కన్ను చూపు పూర్తిగా పోయిందని స్థానిక ప్రభుత్వాస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా సోకి తగ్గిన అనంతరం కొంతమందికి బ్లాక్ ఫంగస్గా పిలిచే మ్యూకోర్మైకోసిస్ సోకుతున్న సంగతి తెలిసిందే! ఇలా సోకి ఆస్పత్రిలో చేరినవారందరికీ ఎండోస్కోపీ చేశామని, 110మందికి చూపు తెప్పించే శస్త్ర చికిత్స చేశామని డా. నిర్మల చెప్పారు. అయితే 30 మంది పేషెంట్లలో ఈ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపడంతో ఒక కన్ను చూపు పూర్తిగా పోయిందన్నారు. అయితే బ్లాక్ ఫంగస్ సోకిన తొలినాళ్లలో వచ్చినవారందరికీ నయమైందని చెప్పారు. -
కాకినాడ జీజీహెచ్లో 100కు చేరిన బ్లాక్ ఫంగస్ సర్జరీలు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో బ్లాక్ ఫంగస్తో శస్త్ర చికిత్స చేయించుకున్న వారి సంఖ్య వందకు చేరింది. నెల రోజులుగా కాకినాడ జీజీహెచ్లో బ్లాక్ ఫంగస్ రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 280 మంది ఆస్పత్రిలో చేరగా, వీరిలో రికార్డు స్థాయిలో వంద మందికి వేగంగా ఆపరేషన్లు చేయడం విశేషం. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో.. అప్పారావు వైద్య బృందం నిరంతరాయంగా శస్త్ర చికిత్సలు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 మంది బ్లాక్ ఫంగస్ రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. -
ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో ఏకంగా 13.74 లక్షల మంది పేదలు, సామాన్యులకు ఉచిత వైద్య చికిత్సలు అందాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే 31వ తేదీ వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత వైద్య చికిత్సలు అందడం ఇదే తొలిసారి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,400.18 కోట్లు వ్యయం చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పూర్తిగా నీరు కార్చేసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఈ పథకం కింద చికిత్స చేయడానికి ఆస్పత్రులు నిరాకరించేవి. ఏటా కనీసం రూ.500 కోట్లు కూడా కేటాయించలేదు. చంద్రబాబు సర్కారు నీరు కార్చిన ఆరోగ్య శ్రీ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊపిరి పోశారు. తెల్ల రేషన్ కార్డుతో ఆరోగ్య శ్రీ కార్డు లింక్ను ఉప సంహరించడమే కాకుండా, పేదలతో పాటు వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు గల సామాన్య ప్రజలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేశారు. తద్వారా రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. చికిత్స వ్యయం రూ.1000 దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తరచూ సమీక్షలతో ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించే ఏర్పాటు చేశారు. లక్షన్నర మంది కోవిడ్ రోగులకు ఉచిత చికిత్స గత ఏడాది కోవిడ్–19ను కూడా వైఎస్సార్ ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ను కూడా చేర్చారు. ప్రభుత్వ నిర్ణయం పేదలు, సామాన్యులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే ఆఖరు వరకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద 1.55 లక్షల మందికి పైగా కోవిడ్ రోగులకు ఉచిత వైద్య చికిత్సలు అందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.435.87 కోట్లు వ్యయం చేసింది. ఈ పథకాన్ని గతంలో వెయ్యి చికిత్సలకే పరిమితం చేస్తే, సీఎం జగన్ 2,434 వ్యాధులు, ఆపరేషన్లకు పెంచారు. అంతే కాకుండా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా వీలు కల్పించారు. తద్వారా రాష్ట్రంలో పేదలు, సామాన్యులను వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సంజీవనిలా ఆదుకుంటోంది. -
రూ.7444 ఇంజెక్షన్ @రూ.35 వేలు!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే ఔషధాలను అనధికారికంగా సేకరించి, నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్ షాపు నిర్వాహకులు ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్్కఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన కె.క్రాంతి కుమార్ వీవీ నగర్లో మెడిక్స్ ఫార్మసీ పేరుతో, వివేకానంద నగర్కు చెందిన ఎన్.వెంకట దినేష్ స్థానికంగా శంకరి పార్మసీ పేరుతో మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆల్విన్ కాలనీకి చెందిన బాలాజీ మెడిసిన్ వరల్డ్ యజమాని శ్రీనివాస్తో కలిసి వారు బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే ఎంపోటెరిసరిన్–బి సంబంధిత ఇంజెక్షన్లను సేకరించారు. కొందరు రోగుల వద్ద మిగిలిన వాటిని దళారుల ద్వారా ఖరీదు చేయడంతో పాటు నకిలీ పత్రాలతో రోగుల బంధువుల మాదిరిగా సమీకరించిన వారి నుంచి వీరు కొనుగోలు చేసేవారు. అనంతరం రూ.7444 ఖరీదైన ఫంగ్లిప్ ఇంజెక్షన్ను రూ.35 వేలకు, రూ.8500 ఎంఆర్పీ కలిగిన పోసాకొంజోలీ ఇంజెక్షన్ను రూ.50 వేల చొప్పున విక్రయించేందుకు పథకం వేశారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబీకులు, బంధువుల్ని టార్గెట్గా చేసుకుని ఈ దందాకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల జావేద్ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షపీ వలపన్నారు. సోమవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి 35 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రామ్గోపాల్పేట్ పోలీసులకు అప్పగించారు. టాస్్కఫోర్స్ పోలీసులు కోవిడ్, బ్లాక్ ఫంగస్ మందుల అక్రమ దందాపై నిఘా పెంచారని సీపీ తెలిపారు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి 56 కేసులు నమోదు చేసి 136 మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి 450 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. -
చిన్నారుల్లో బ్లాక్ ఫంగస్.. కళ్లు తొలగించిన వైద్యులు
ముంబై: కరోనా కన్నా అధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంతవరకు పెద్దల్లో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి తాజాగా చిన్నారుల్లోను వెలుగు చూసింది. బ్లాక్ ఫంగస్ బారిన పడి ముగ్గురు చిన్నారుల కళ్లు తొలగించాల్సి వచ్చింది. వీరిలో4,6,14 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఫంగస్ బారిన పడిన ముగ్గురిలో ఇద్దరికి ఒక ఆస్పత్రిలో, మరోకరి వేరేక ఆస్పత్రిలో సర్జరీ చేసి ఒక కన్ను తొలగించారు. ఆ వివరాలు.. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక డయాబెటిస్ సమస్య ఉంది. ఈ క్రమంలో ఆమెకు కంట్లో ఏదో ఇబ్బందిగా అనిపించి ఆస్పత్రికి వెళ్లింది. అనూహ్యంగా హాస్సిటల్కు వెళ్లిన 48 గంటల్లోనే బాలిక కన్ను పూర్తిగా నల్లగా మారింది. ఫంగస్ ముక్కు వరకు సోకింది. బాలిక అదృష్టం కొద్ది మెదడుకు చేరలేదు. బాలిక పరిస్థితి విషమిస్తుండటంతో వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. దాదాపు ఆరు వారాల పాటు వైద్యం చేసినప్పటికి.. ఫలితం లేకపోయింది. చివరకు బాలిక కంటిని తొలగించాల్సి వచ్చింది. ఇక పైన చెప్పుకున్న మరో చిన్నారులిద్దరికు డయాబెటిక్ సమస్య లేదు. కానీ కోవిడ్ బారినపడ్డారు. ఆ తర్వాత వీరిలో బ్లాక్ ఫంగస్ వెలుగు చూసింది. చిన్నారులిద్దరిని ముంబైలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్ ఈఎన్టీ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత చిన్నారులిద్దరికి ఆపరేషన్ చేసి కన్ను తొలగించారు. సర్జరీ చేసి కన్ను తొలగించకపోతే బాధితుల జీవితం ప్రమాదంలో పడేదన్నారు వైద్యులు. ఇక 16 ఏళ్ల బాధితురాలు నెల రోజుల క్రితం వరకు ఆరోగ్యంగానే ఉంది. కోవిడ్ బారిన పడి కోలుకుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె డయాబెటిస్ బారిన పడింది. ఆమె పేగుల్లో రక్తస్రావం కాసాగింది. యాంజియోగ్రఫీ చేసి ఆమె కడుపు దగ్గర రక్తనాళాలకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించామని తెలిపారు వైద్యులు. ‘‘4,6 ఏళ్ల చిన్నారులిద్దరిలో అప్పటికే ఫంగస్ కంటిలోకి చేరి.. వారిని తీవ్రంగా బాధించింది. ఇక వీరిలో ఒకరు గతేడాది డిసెంబర్లో మా వద్దకు రాగా.. రెండవ కేసు సెకండ్వేవ్ సమయంలో వచ్చింది’’ అని ఆసుపత్రిలో ఓక్యులోప్లాస్టీ, ఓక్యులర్ ఆంకాలజీ అండ్ ఓక్యులర్ ప్రొస్థెటిక్ డాక్టర్ ప్రితేష్ శెట్టి తెలిపారు. చదవండి: బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే -
బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి, 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్లో ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఈ ముఠా.. ఒక్కో ఇంజెక్షన్ను రూ.35 వేల నుంచి రూ.50 వేల చొప్పున అమ్ముతున్నారు. మొదటి గ్యాంగ్లో ఐదుగురిని, రెండో గ్యాంగ్లో నలుగురిని అరెస్ట్ చేశామని.. మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. బ్లాక్మార్కెట్లో ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. చదవండి: ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్ ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం.. -
Black Fungus: బెంగళూరులో ప్రమాద ఘంటికలు
బనశంకరి/కర్ణాటక: రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ బ్లాక్ ఫంగస్ రోగులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం నాటికి రాష్ట్రంలో 2,600 మందికి బ్లాక్ ఫంగస్ సోకగా, వీరిలో 127 మంది కోలుకున్నారు. 197 మంది మృత్యవాత పడ్డారు. మృతుల సంఖ్య ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ బాధితులకు బెడ్లు, ఔషధాల కొరత వేధిస్తోంది. యాంఫోటెరిసిన్–బి టీకాలు పెద్దగా అందుబాటులో లేవు. బెంగళూరులో ప్రమాదఘంటికలు బెంగళూరులో ఇప్పటివరకు 900 మంది బ్లాక్ ఫంగస్ బారినపడగా, 70 మంది మృతిచెందారు. కలబురిగిలో 146, బాగల్కోటే 97, బళ్లారి 88, బెళగావి 147, ధారవాడ 202, మైసూరు 93, రాయచూరు 81, విజయపుర 99, చిత్రదుర్గ 99 మంది ఫంగస్లో చికిత్స పొందుతున్నారు. మిగతా జిల్లో 10– 20 మంది వరకూ బాధితులున్నారు. యాంఫోటెరిసిన్ కొరత రాష్ట్రంలో 9,700 వయల్స్ యాంఫోటెరిసిన్ టీకాల స్టాకు మాత్రమే ఉంది. రోగుల సంఖ్య ప్రకారమైతే నిత్యం 12 వేల వయల్స్ కావాలి. ఒకటీ అరా సూదులతో సరిపెడుతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో చికిత్స అందించాలంటే కనీసం లక్ష వయల్స్ కావాలని బ్లాక్ ఫంగస్ నిపుణుల కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. చదవండి: బీపీఎల్ కుటుంబాలకు సాయం: సీఎం -
జానకినందన్ జయించాడు
కాకినాడ క్రైం: బ్లాక్ఫంగస్ను జయించిన పిన్న వయస్కుడిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 17 నెలల బాలుడు ఘనత సాధించాడు. కాకినాడ జీజీహెచ్ నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య ప్రవీణ్చంద్, సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. బాలుడు జానకినందన్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బ్లాక్ ఫంగస్ బాధితుడని అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. కాకినాడ జీజీహెచ్ వైద్యులు బాలుడికి పునర్జన్మ ప్రసాదించారని కొని యాడారు. ఇదే చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కనీసం రూ.70 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. కోవిడ్ పీడియాట్రిక్స్ నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 20 రోజుల క్రితం బాలుడు అత్యంత ప్రమాదకర స్థితిలో జీజీహెచ్లో చేరాడన్నారు. చంటిపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎంఎస్ రాజు, ఈఎన్టి హెచ్వోడి డాక్టర్ కృష్ణకిషోర్ పర్యవేక్షణలో సూపరిం టెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య సేవలందించామన్నారు. జూన్ 3న సైనస్ ద్వారా డాక్టర్ కృష్ణకిషోర్, డాక్టర్ సుధీర్ పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి, ఫంగస్ను తొలగించామన్నారు. శస్త్రచికిత్స తరువాత తిరిగి పీడియాట్రిక్ ఐసీయూలో ఉంచి డాక్టర్ ఎంఎస్ రాజు ఆధ్వర్యం లో వైద్య సేవలు కొనసాగాయని వెంకటేశ్వర్లు చెప్పారు. 12 రోజుల పూర్తి పర్యవేక్షణ అనంతరం మంగళవారం డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. బాలుడిని ప్రతి 10 రోజులకు ఒకసారి పరీక్షిస్తామని, కొన్ని నెలలపాటు ఈ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. డాక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ.. అత్యుత్తమ వైద్య సేవలు, నిష్ణాతులైన వైద్య బృందాలు కాకినాడ జీజీహెచ్లో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని కోరారు. బాలుడి తల్లిదండ్రులు పద్మ, కిరణ్ మాట్లాడుతూ.. ఆసుపత్రి వైద్యులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవుళ్లంటూ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ అనితతో పాటు ఆర్ఎంఓ డాక్టర్ దీప్తి వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
బ్లాక్ ఫంగస్ మందులపై జీఎస్టీ ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్ వ్యాధితో కష్టాలుపడుతున్న బాధితులకు కేంద్రప్రభుత్వం కాస్త ఉపశమనం కల్గించే కబురుతెచ్చింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఔషధాలపై జీఎస్టీ(వస్తుసేవల పన్ను)ను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశంలో కోవిడ్ విధానాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 28న ఏర్పాటైన మంత్రుల బృందమొకటి జూన్ ఏడున ఇచ్చిన నివేదికపై కౌన్సిల్ చర్చించింది. తాజాగా తగ్గిన జీఎస్టీ రేట్లు ఈ సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. కోవిడ్ వ్యాక్సిన్లపై వసూలుచేస్తున్న పన్నును తగ్గించాలన్న డిమాండ్లను కౌన్సిల్ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వ్యాక్సిన్లపై ప్రస్తుతమున్న 5% పన్ను అలాగే కొనసాగనుంది. ప్రభుత్వమే పౌరులందరికీ ఉచితంగా టీకా అందిస్తున్నందున 5% పన్ను అనేది సాధారణ పౌరుడికి ఏమాత్రం భారం కాబోదని నిర్మలా అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను కౌన్సిల్ భేటీ తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు ఆంఫోటెరిసిన్–బీపై సున్నా జీఎస్టీ బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్–బి ఔషధంతో పాటు, టోసిలిజుమాబ్పై జీఎస్టీ పన్ను రేటును ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. గతంలో ఈ రెండు ఔషధాలపై 5% జీఎస్టీ ఉండేంది. అంబులెన్స్ సేవలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. కోవిడ్ పరికరాలపై ఇక 5 శాతమే కోవిడ్ సంబంధ ఔషధాలు, పరికరాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. హెపారిన్, రెమ్డెసివిర్ వంటి యాంటీ కోగ్యులెంట్ల జీఎస్టీ 12 % నుంచి 5 శాతానికి తగ్గింది. పరికరాలు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు/ జనరేటర్లు (వ్యక్తిగత దిగుమతులతో సహా), వెంటిలేటర్లు, వెంటిలేటర్ మాస్క్లు/హెల్మెట్లు, హై ఫ్లో నాసల్ కాన్యులా(హెచ్ఎఫ్ఎన్సీ) పరికరాల జీఎస్టీని 12% నుంచి ఐదు శాతానికి తగ్గించారు. కోవిడ్ టెస్టింగ్ కిట్స్, డి–డైమర్, ఐఎల్–6, ఫెర్రిటిన్, ఎల్డీహెచ్ వంటి స్పెసిఫైడ్ ఇన్ఫ్ల్లమేటరీ డయాగ్నోస్టిక్ కిట్లపై పన్నును 12% నుంచి 5%కి తగ్గించారు. హ్యాండ్ శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, బీఐపీఏపీ మెషీన్, టెస్టింగ్ కిట్, టెంపరేచర్ చెక్ చేసే పరికరాలుసహా 18 వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించారు. -
లక్ష కోట్ల సూక్ష్మ జీవులు...హాని చేసేవి ఎన్నో తెలుసా?
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం! దీంతో పోలిస్తే... 1,400 అనే అంకె ఎంత? సముద్రంలో నీటిబొట్టంత! కచ్చితంగా మాట్లాడాలంటే.. ఒక శాతంలో వెయ్యో వంతు తీసుకుని.. దాన్ని ఇంకో వెయ్యి వంతులు తగ్గిస్తే వచ్చేంత!! ఈ అంకెలేమిటి? ఆ పోలికలేమిటి? ఇప్పుడెందుకీ ప్రస్తావన? అంటున్నారా? ఈ భూమ్మీది అన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య లక్ష కోట్లైతే... మనిషికి తెలిసిన... మనకు హాని చేయగలవని స్పష్టమైన వాటి సంఖ్య 1,400!!! అబ్బో మనకు తెలియని విషయం అంతుందా? అని నోరెళ్లబెడుతున్నారా? వివరాలు తెలిసిన కొద్దీ మీ ఆశ్చర్యం అంతకంతకూ పెరిగిపోవడం గ్యారెంటీ! కోవిడ్–19 గురించి తెలిసింది మొదలు.. వైరస్పై, ఫంగస్లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వీటి దగ్గరి చుట్టాలు.. అదేనండి బ్యాక్టీరియా, ప్రొటోజోవా, హెల్మింత్స్ వంటి వాటితో ప్రమాదమేమిటన్నది మనకు తెలిసిన విషయమే. కోవిడ్–19 రోజుకో రూపు దాలుస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో కొంతమంది... ‘‘శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఒక చిన్న వైరస్ ఇంత ప్రమాదం సృష్టిస్తోందా? ఇదంతా కుట్ర, తమ లాభాల కోసం కార్పొరేట్ వైద్యశాలలు ఈ సమస్యను సృష్టిస్తున్నాయి’’ ఇలా పలురకాల వ్యాఖ్యానాలు చేయడమూ మనం వినే ఉంటాం. కానీ.. నిజానికి అటు శాస్త్రవేత్తలు, ఇటు వైద్యులు కూడా.. కనిపించని, ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన కూడా లేని పలు శత్రువులతో గుడ్డిగా పోరాడుతున్నారు! తెలిసినవి అతిస్వల్పం... మనిషిని జబ్బున పడేసేవి.. ప్రాణహాని కలిగించే సూక్ష్మజీవుల్లో మనిషి అర్థం చేసుకున్నవి కేవలం 1,400 మాత్రమే. కానీ ప్రకృతిలో ఉన్నవి లక్ష కోట్లు! ఎలా ఉంటాయో? ఎలా బతుకుతాయో? ఎలా పనిచేస్తాయో? విరుగుళ్లేమిటో? ప్రమాదం ఉందా? లేదా? అన్న అనేకానేక సందేహాలున్న సూక్ష్మజీవులు కోటానుకోట్లు మిగిలే ఉన్నాయి. వీటన్నింటి ఆనుపానులు గుర్తించడం సాధ్యమేనా? తెలుసుకుంటే బాగానే ఉంటుంది కానీ.. అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ.. శాస్త్రవేత్తలు నిత్యం చేస్తున్న పని ఇదే!! కోవిడ్–19 కారక వైరస్ సంగతి చూద్దాం... కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లతోనే... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రొటోజోవా వంటి సూక్ష్మజీవులపై పరిశోధనలు అత్యంత కట్టుదిట్టమైన బయో కంటెయిన్మెంట్ ల్యాబ్లలోనే జరుగుతాయి. బయట ఉన్నవి ఏ రకంగానూ లోపలికి చేరకుండా.. లోపలివి అంతే భద్రంగా అక్కడే ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు ఈ ల్యాబ్లలో. కోవిడ్–19 విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశంలోని పది ప్రముఖ పరిశోధన సంస్థలు జన్యుమార్పులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మానవ కణాల్లోపల వైరస్ ఎలా పనిచేస్తోందో గమనిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ స్పందనలను అర్థం చేసుకునేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎలా భిన్నమో కూడా తెలుసుకుంటున్నారు. శత్రువు గుట్టుమట్టులను అర్థం చేసుకునే ఈ పరిశోధనలు ఒకవైపు.. వాటిని ఆయుధాలుగా మలుచుకుని వైరస్ను మట్టుబెట్టే విధానాలు ఇంకోవైపు అన్నమాట! అన్నింటా ప్రమాదమే...? సూక్ష్మజీవులపై పరిశోధనలు అన్ని రకాలుగా ప్రమాదంతో కూడుకున్నవే. కానీ.. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు సురక్షిత పరిశోధనల కోసం కొన్ని పద్ధతులను అభివృద్ధి చేశారు. చేస్తున్నారు. ప్రతి పరిశోధనకు ముందుగానే.. లక్ష్యం ఏమిటి. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు పరిశోధనలు చేస్తున్నారు అన్న వివరాలను స్వతంత్రంగా వ్యవహరించే కమిటీలు సమీక్షిస్తాయి. ఆయా సంస్థల్లోని, లేదా ప్రభుత్వ సంస్థలకు చెందిన నిపుణులు.. కమిటీ ఆమోదించిన పద్ధతుల అమలుపై నిఘా ఉంచుతారు. ప్రమాదకరమైన సూక్ష్మజీవులతో పనిచేసే వారు బయోసేఫ్టీ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. సూక్ష్మజీవులపై పరిశోధనలు జరిగే ప్రాంతమైన బయోసేఫ్టీ కేబినెట్లలోకి ప్రత్యేకమైన ఫిల్టర్ల సాయంతో శుద్ధి చేసిన గాలిని మాత్రమే పంపుతారు. అంతేకాకుండా.. పీపీఈ కిట్ల వంటి రక్షణ ఏర్పాట్లు సరేసరి. కొన్నిసార్లు.. శాస్త్రవేత్తలు తాము పీల్చేగాలిని కూడా శుద్ధి చేసుకోవాలి. పరిశోధనల కోసం సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసినప్పుడూ రిస్క్ ఉంటుంది. ప్రమాదవశాత్తూ లేదా ఉద్దేశపూర్వకంగా ఈ నిర్వీర్య సూక్ష్మజీవులు బాహ్య ప్రపంచంలోకి చేరవచ్చు. ఈ అంశాన్నీ లెక్కలోకి తీసుకుని పరిశోధనశాలల్లో కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. నాలుగు రకాల బయోసేఫ్టీ పద్ధతులు.. దేశంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న కోవాగ్జిన్ టీకాను బయోసేఫ్టీ లెవెల్–3 పరిశోధనశాలలో తయారు చేశారు. అంటే... శ్వాస ద్వారా వ్యాపించి అనారోగ్యం, మరణాలకు కారణమయ్యే సూక్ష్మజీవులపై పరిశోధనలకు అనువుగా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. రక్షణ కోసం వాడే సూట్లను ఒక్కసారి మాత్రమే వాడే వీలుంటుంది వీటిల్లో. అంతేకాదు.. ఇందులో పనిచేసే వారి ఆరోగ్యంపై నిత్యం నిఘా ఉంటుంది. గదుల నేలపై, గోడలపై ఎలాంటి అతుకులూ లేకుండా, కార్పెట్ల వంటివాటిని అస్సలు వాడకుండా చూస్తారు. కిటికీల్లాంటివి ఏవీ ఉండవు. అన్నివైపుల నుంచి దిగ్బంధం చేస్తారు. పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే గాలిని లోపలికి వదులుతారు. ఈ స్థాయి కంటే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండే బయోసేఫ్టీ లెవెల్ –4 పరిశోధన సంస్థలు ప్రపంచంలో యాభై మాత్రమే ఉన్నాయి. విస్మరిస్తే.. ఏమవుతుంది? వందేళ్లలో మనిషి సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్న జ్ఞానం పెరుగుతున్న కొద్దీ సార్స్–కోవ్–2 వంటి కొత్త శత్రువులను ఎదుర్కోవడం సులువు అవుతుంది. సార్స్–కోవ్–2 మాదిరిగా భవిష్యత్తులో కొత్త సూక్ష్మజీవులతో మనిషికి ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహమే లేదు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవులు సరికొత్త వాహనం ద్వారా కొత్త ప్రాంతాలను చేరుతుంటాయి. అత్యంత ప్రమాదకారులైన హాంటా, డెంగ్యూ, జికా, నిఫా వైరస్లు కాకుండా పలు ఇతర వైరస్లను పరిశోధనశాలల్లో పరీక్షిస్తున్నారు. కొత్త వ్యాధుల్లో సుమారు 70 శాతం జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నవే. కోవిడ్ కూడా దీనికి భిన్నమేమీ కాదు. అందుకే భవిష్యత్తులో ఏ రకమైన సూక్ష్మజీవులు దాడి చేసే అవకాశం ఉందో తెలుసుకునేందుకు నిత్య పరిశోధనలు అత్యవసరం. కానీ.. కోటానుకోట్ల సూక్ష్మజీవులు... కొత్త కొత్త వ్యూహాలతో అవి దాడి చేసే తీరును అర్థం చేసుకోవడం సులువైన పనైతేకాదు. -
బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే
దేశవ్యాప్తంగా బ్లాక్ఫంగస్ ఇంజక్షన్లకు కొరత ఏర్పడటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ బాధితుల చికిత్స కోసం వినియోగించే యాంఫోటెరిసిన్ బి, పొసకొనజోల్ ఇంజక్షన్ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, ఒక్కో పేషెంటుకు ఎక్కువ ఇంజక్షన్లు వాడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 శాతం మంది పేషెంట్లకు కూడా యాంఫోటెరిసిన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయాలపై కృషి జరుగుతోంది. ఈ క్రమంలో ఆయుర్వేద మందులకు ప్రాధాన్యం పెరుగుతోంది. గతంలో ఎన్నో రకాల ఫంగస్లను నియంత్రించిన చరిత్ర ఆయుర్వేద ఔషధాలకు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆయుర్వేద మందులు వాడితే బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. సాక్షి, అమరావతి: కేంద్ర ఆయుష్ శాఖ మూడు రకాల ఆయుర్వేద మందులను బ్లాక్ఫంగస్ నిరోధక ఔషధాలుగా ప్రకటించింది. శంషమన వటి 500 మిల్లీగ్రాములు, నిషామలకి వటి 500 మిల్లీ గ్రాములు, సుదర్శన ఘణవటి 500 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్రలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాడితే మ్యూకార్ మైకోసిస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి ప్రత్యామ్నాయమని ఆయుష్ శాఖ పేర్కొంది. దీంతోపాటు ఆయుష్ – 64 అనే మందునూ వాడుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. నిపుణుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అల్లోపతి మందులు వాడుకుంటూనే ఆయుర్వేద మందులూ తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారంలో ఇవి తీసుకోవాలి.. ఆహారంలో ప్రధానంగా ఔషధ గుణాలున్నవి ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండాలి. తులసి, దాలి్చన చెక్క, నల్లమిరియాలు కూడా మంచివి. నల్లద్రాక్ష, వేరుశనగ పప్పు, పిస్తా, మల్బరీస్, స్ట్రాబెర్రీ లాంటివి రోగ నిరోధక శక్తి పెరిగేలా దోహదం చేస్తాయి. జామకాయ, బత్తాయి, కమలా, నిమ్మ, కాప్సికం లాంటి వాటితోపాటు, మునగాకుతో వండిన కూరలతో మంచి ఉపయోగం ఉంటుంది. చికిత్స, నివారణ.. రెండిటికీ ‘‘ఆయుర్వేద మందులకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే చాలా రకాల వ్యాధులు వచి్చన తర్వాత వాటిని తగ్గించేందుకు, రాకుండా కాపాడేందుకూ ఉపయోగపడతాయి. ఈ ఔషధాలను వైద్యుడి పర్యవేక్షణలోనే తీసుకోవాలి. బ్లాక్ఫంగస్ ప్రధానంగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడే వస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఆయుర్వేద మందుల్లో ఉన్నాయి. క్రమం తప్పకుండా సూచించిన మేరకు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. శతాబ్దాల క్రితమే చరక సంహితలో ఈ వ్యాధులకు సంబంధించి సూచనలు చేశారు’’ –డా.కె.విజయభాస్కర్రెడ్డి, ప్రొఫెసర్, శల్య విభాగం, ఎస్వీ ఆయుర్వేద కాలేజీ, తిరుపతి నియంత్రించే నేత్ర బిందువులు.. ‘‘నిషామలకి, మహాలక్ష్మీ విలాస రస్ మందులతో పాటు ఎలనీర్ కుజాంబు అనే నేత్ర బిందువులు వేసుకుంటే బ్లాక్ ఫంగస్ నియంత్రణకు బాగా ఉపయోగపడతాయి. కబాసురా కుడినీర్ అనే మందు ఉదయం పూట, ఆయుష్ క్వాత అనే మందు రాత్రిపూట తీసుకుంటే ఫంగస్ నియంత్రణకు ఎంతో ఉపకరిస్తాయి. క్రమం తప్పని వ్యాయామం శరీర పటుత్వాన్ని పెంచుతుంది’’ –డా.కేదార్నాథ్, ఆయుర్వేద వైద్యుడు బ్లాక్ ఫంగస్ చికిత్స, నివారణకు ఆయుర్వేద ఔషధాలు ఇలా ► పంచ వల్కల కషాయంతో వ్యాధి సోకిన ప్రాంతాన్ని శుభ్రపరచి ఆరిన తర్వాత మహాతిక్త ఘృతం పూయాలి. ► పథ్యాది కాడ మూడు పూటలా 15 ఎంఎల్ మోతా దు మించకుండా వాడాలి ► నింబామృతాది ఏరండ తైలం 10 ఎంఎల్ పడుకునే ముందు 3 రోజుల పాటు వాడాలి ► సంశమనవటి/గిలోయి ఘణవటి మూడు పూటలా వాడాలి ► గంధక రసాయనం 500 ఎంజీ మోతాదుతో మూడు పూటలా వాడాలి ► నిషామలకి 500ఎంజీ ఉదయం, సాయంత్రం వాడాలి ► సుదర్శన ఘణవటి 500 ఎంజీ మూడు పూటలా వాడాలి ► బృహత్వాత చింతామణి ఉదయం, సాయంత్రం వాడాలి ► క్రమేవృద్ధి లక్ష్మీ విలాస రస్ ఉదయం, సాయంత్రం వాడాలి. చదవండి: రాష్ట్రంలో 1,551 బ్లాక్ఫంగస్ కేసులు -
ఏపీలో యాక్టీవ్ కేసులు లక్షలోపుకు చేరాయి: అనిల్ కుమార్
సాక్షి,అమరావతి: ఆందధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గాయి.. యాక్టీవ్ కేసుల సంఖ్య లక్ష లోపునకు చేరింది. ప్రస్తుతం ఏపీలో 96,100 యాక్టీవ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేట్ 8.09 శాతంగా ఉంది అని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో 202 ఆస్పత్రులకు కరోనా చికిత్స నుంచి డీ-నోటిఫై చేశాం. గతంలో కరోనా ఆస్పత్రుల సంఖ్య 625గా ఉంటే.. ఇప్పుడవి 423కి తగ్గాయి. విదేశాల్లో చదివే విద్యార్ధులకు, ఐదేళ్ల లోపు తల్లులకు సుమారుగా 1.29 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేశాం. 45 ఏళ్ల పైబడిన వారిలో 53 శాతం వ్యాక్సినేషన్ వేశాం’’ అని అనిల్ కుమార్ తెలిపారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 1307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటి వల్ల ఇప్పటి వరకు 138 మంది చనిపోయారు. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చూపితే కేంద్రం ఇచ్చే యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్లు తగ్గుతాయి. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చూపితే నష్టమే.. ఆ పని ప్రభుత్వం చేయదు. కేంద్రం నుంచి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ రెండు రోజుల్లో పూర్తి చేసేస్తున్నాం. పది లక్షల కరోనా డోసులు ఇస్తోంటే ప్రత్యేక కార్యాచరణ అవసరం’’ అన్నారు అనిల్ కుమార్ సింఘాల్. చదవండి: టెస్టులు, వ్యాక్సిన్లో ఏపీ సరికొత్త రికార్డు -
బ్లాక్ ఫంగస్తో ఇప్పటివరకు 114 మంది మృతి
-
పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రాల వారీగా బ్లాక్ఫంగస్ కేసులెన్ని.. ఇంజక్షన్లను ఎలా సమకూర్చుకుంటున్నారు.. రాష్ట్రాలకు వాటిని ఎలా కేటాయిస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్ల నిల్వలు తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే కోవిడ్ థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నపిల్లల్లో వచ్చే మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్)ను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజ యలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా విషయంలో హైకోర్టులో పలు ప్ర జాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యాలను కొద్ది వారాలుగా విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. బ్లాక్ఫంగస్ ఇంజక్షన్ల విషయంలో ధర్మాసనం గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ మెమోను కోర్టు ముందుంచింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఏపీకి గతంలో కేటాయించిన 13,830 ఇంజక్షన్లు కాక, ఈ నెల 5న మరో 7,770 వయల్స్ కేటాయించా మన్నారు. మే నెలాఖరుకు కేంద్రం వద్ద బ్లాక్ఫంగస్ ఇంజక్షన్లు 4.38 లక్షలున్నాయని, వాటిలో 2.02 లక్షలు దేశీయంగా ఉత్పత్తి చేసినవి, 2,33,971 ఇంజక్షన్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని వివరించారు. రాష్ట్రాలకు సరఫరా చేయగా ప్రస్తుతం కేంద్రం వద్ద 80 వేల ఇంజక్షన్లు ఉన్నాయని తెలిపారు. కేంద్రం కేటాయింపులు ఏ మాత్రం సరిపోవు ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో గత నెలాఖరు నాటికి 1,400 ఉన్న బ్లాక్ఫంగస్ కేసులు ప్రస్తుతం 1,770కి పెరి గాయని తెలిపారు. బాధితుల చికిత్సకు కేంద్రం కేటాయించిన 7,770 వయల్స్ ఎంతమాత్రం సరిపోవన్నారు. కేటాయింపులను పెంచకపోతే రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. అనంతరం ధర్మాసనం కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి సన్నద్ధ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సుమన్ స్పందిస్తూ.. థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ టాస్క్ఫోర్స్ ముఖ్యమంత్రికి ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందితోసహా దాదాపు 38 వేల మంది అదనపు సిబ్బందిని నియమించామని, ఈ విషయంలో ఇప్పటికే కోర్టు ముందు మెమో కూడా దాఖలు చేశామని సుమన్ చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ డాక్టర్లు, నర్సుల నియామకాలు చేపట్టాలని, పారామెడికల్ సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకో వాలని ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ మెమో దాఖలు చేయాలంది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తిచేసి పీజీ ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి సేవల్ని కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలని పేర్కొంది. -
చంద్రగిరిలో ఆనందయ్య మందు తయారీ
చంద్రగిరి: కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపటా్ననికి చెందిన ఆనందయ్య మందును చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తయారు చేస్తున్నారు. ఈ సంప్రదాయ మందును చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని తలపెట్టిన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఇందుకు చొరవ తీసుకున్నారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్యుల సహకారం తీసుకున్నారు. ఈ మందు తయారీని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్ (పి) మందు మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 1.6 లక్షల కుటుంబాల్లో 5.20 లక్షలమంది ప్రజలకు ఈ మందును ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, మారేడు, బుడ్డ బుడవ ఆకులు, కొండపల్లేరు కాయలు, తెల్లజిల్లేడు పూలు తీసుకొచ్చారని తెలిపారు. మరో 11 రకాల ముడి సరుకులను సమకూర్చామన్నారు. రెండు రోజుల్లో నియోజకవర్గంలోని 142 పంచాయతీలు, దాదాపు 1,600 గ్రామాల్లో ఈ మందును పంపిణీ చేస్తామని చెప్పారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ఉపయుక్తమైన సంప్రదాయ మందు తయారీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మందు తయారీలో ఆనందయ్య కుమారుడితోపాటు శిష్యులు చంద్రకుమార్, సురేష్, వంశీకృష్ణ పాల్గొంటున్నారు. -
రాష్ట్రంలో 1,551 బ్లాక్ఫంగస్ కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు బ్లాక్ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) కేసులు 1,551 నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే 91 బ్లాక్ఫంగస్ కేసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ జబ్బుతో 98 మంది మృతిచెందారు. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 374 మ్యుకర్ మైకోసిస్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 22 కేసులున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నా కేవలం 32 బ్లాక్ఫంగస్ కేసులే నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 12 కేసులొచ్చాయి. బ్లాక్ఫంగస్తో మృతిచెందిన వారు అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 15 మంది ఉండగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఒక్కరు ఉన్నారు. -
ఆరోగ్య సిబ్బంది వైద్య ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే..
సాక్షి, అమరావతి: కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న డా.ఎన్.భాస్కరరావు వైద్యానికి అయ్యే వ్యయం మొత్తాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసినట్టు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు. ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ భాస్కరరావు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారని, ఆయన వైద్యానికి రూ.కోటి నుంచి కోటిన్నర వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని సింఘాల్ ప్రస్తావించారు. ఆయన శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి రూ.70 వేలు పీజీ వైద్య విద్య పూర్తయి సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారికి పెంచిన స్టైఫండ్ను 2021 జనవరి ఒకటో తేదీ నుంచి ఇద్దామనుకున్నామని, కానీ సీఎం వైఎస్ జగన్.. 2020 సెపె్టంబర్ నుంచే అమలు చేయాలని చెప్పినట్టు అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు సెపె్టంబర్ నుంచే రూ.70 వేలు ఇస్తున్నామన్నారు. పీజీ పూర్తయినా పరీక్షలు జాప్యమై సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారికీ రూ.70 వేలు ఇస్తున్నామని, జూలైలో పరీక్షలు జరుగుతాయని, ఆ సమయంలోనూ వారికి స్టైఫండ్ చెల్లిస్తున్నట్టు చెప్పారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులిస్తామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి నెలలో వ్యాక్సినేషన్ పూర్తి ఇప్పటివరకూ టీకా తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లను మినహాయిస్తే.. 45 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మందికి సింగిల్ డోసు పూర్తయిందని సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో 1,06,47,444 డోసుల టీకాలు వేయగా, రెండు డోసులు తీసుకున్న వారు 25,67,162, సింగిల్ డోసు తీసుకున్న వారు 55,13,120 మంది ఉన్నారన్నారు. 45 ఏళ్లు దాటిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు మొత్తానికి కలిపి 53.8 శాతం ఒక డోస్ పూర్తయిందని చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారికి నెల రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,460 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒక వేళ థర్డ్ వేవ్ వచ్చినా ముందస్తు అంచనాలు సిద్ధం చేశామన్నారు. టీకా వేసుకోని వారికే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. నెల్లూరు ఆస్పత్రి సూపరింటెండెంట్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని వివరించారు. -
బ్లాక్ మార్కెట్లోకి ఆంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లు
-
తగినన్ని ఇంజక్షన్లు కేటాయించండి
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా ఉన్న చోట.. అందుకు అనుగుణంగా యాంఫోటెరిసిన్ ఇంజక్షన్లు కూడా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో నమోదైన 1,400 బ్లాక్ ఫంగస్ కేసులను దృష్టిలో పెట్టుకుని.. ఇంజక్షన్లు కూడా తగినన్ని కేటాయించాలని సూచించింది. ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాలకు చేసిన యాంఫోటెరిసిన్ ఇంజక్షన్ల కేటాయింపు వివరాలను కూడా తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గత కొన్ని వారాలుగా విచారణ జరుపుతూ వస్తున్న ధర్మాసనం.. శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల లభ్యత, కేటాయింపుల వివరాలను కేంద్ర ప్రభుత్వం మెమో రూపంలో ధర్మాసనం ముందుంచింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసే కేటాయింపుల గురించి మెమోలో ప్రస్తావించలేదన్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు 21 రోజుల కోర్సు ఇవ్వాల్సి ఉంటుందని.. తగినన్ని యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మందులు వాడాల్సి వస్తోందని వివరించారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ స్పందిస్తూ.. 9.5 లక్షల ఇంజక్షన్ల దిగుమతి కోసం అమెరికాకు ఆర్డర్లు ఇచ్చినట్లు చెప్పారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో.. కొరత ఏర్పడిందన్నారు. అనంతరం విచారణను ధర్మాసనం 7వ తేదీకి వాయిదా వేసింది. -
బ్లాక్ ఫంగస్తో 56 మంది మృతి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో మ్యూకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధితో ఇప్పటి వరకు 56 మంది మరణించాని బీఎంసీ ఆరోగ్య విభాగం వెల్లడించింది. మృతుల్లో అధిక శాతం ఇతర ప్రాంతాలకు చెందినవారేనని, బీఎంసీ పరిధిలో బ్లాక్ ఫంగస్తో 14 మందే చనిపోయారని అధికారులు తెలిపారు. బీఎంసీ ఆస్పత్రుల్లో మే 31వ తేదీ వరకు 449 మంది బ్లాక్ ఫంగస్ రోగులు ఉన్నారని, వీరిలో 70 శాతం గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, కశ్మీర్ తదితర రాష్ట్రాలతో పాటు ఔరంగాబాద్, నాసిక్, ధులే, జల్గావ్ తదితర జిల్లాలకు చెందినవారు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. -
అరకొర ఇంజక్షన్లతో చికిత్స ఎలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులకు తగినట్లుగా కేంద్ర ప్రభుత్వం యాంఫోటెరిసిన్ బి ఇంజక్షన్లను సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,400 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా కేంద్రం కేటాయించిన ఇంజక్షన్లు 13,830 మాత్రమేనని, ఇవి రోగులకు ఏ మాత్రం సరిపోవని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇంజక్షన్లు కొనుగోలు చేసేందుకు ఫార్మా కంపెనీ మైలాన్కు ఆర్డర్ ఇచ్చినా కేంద్రం సరఫరాను నియంత్రించడం వల్ల తగినన్ని ఇంజక్షన్లు పొందలేకపోతున్నట్లు న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. హైకోర్టు దీనిపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. 1,400 కేసులున్నప్పుడు కేవలం 13,830 ఇంజక్షన్లు కేటాయిస్తే రోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. కేటాయింపులు పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేస్తూ ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులు జాగ్రత్త.. కోవిడ్ థర్డ్వేవ్ వల్ల చిన్న పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారన్న వార్తలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. బెడ్లు, ఆక్సిజన్ కంటే ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, దీన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తగినంత మంది చిన్న పిల్లల డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 500 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రి మాదిరిగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటుపై పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మీ, జస్టిస్ దొనడి రమేశ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. బిల్లులపై నోడల్ అధికారి సంతకం తప్పనిసరి.. హైకోర్టు ధర్మాసనం సూచనలను పరిగణలోకి తీసుకుంటూ కరోనా చికిత్సకు సంబంధించిన బిల్లులపై ఆయా ఆసుపత్రులు నోడల్ అధికారుల సంతకం తప్పనిసరిగా తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ నివేదించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 ఆసుపత్రులను నోటిఫై చేశామని, ఒక్కో రోగికి రోజుకు నాలుగు ఇంజక్షన్ల చొప్పున 15 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. చిన్నారులకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు పీడియాట్రిక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది... దీనిపై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ను వివరణ కోరడంతో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ప్రతి రోగికి ప్రాథమికంగా అవసరం ఉండదని, కొరత తీవ్రంగా ఉన్నందున కేసుల తీవ్రతను బట్టి కేటాయిస్తున్నామని చెప్పారు. దేశంలో వీటి తయారీ చాలా తక్కువని, ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. అయితే ఇవన్నీ తమకు అవసరం లేదని, దాదాపు 13 వేల ఇంజక్షన్లతో 1,400 మందికి ఎలా చికిత్స అందిగలరని ప్రశ్నిస్తూ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. -
Coronavirus: కొడుకా.. వెళ్లిపోయావా..!
హిమాయత్నగర్: ‘కొడుకా మేం బతికుండగానే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావా? మేమేం పాపం చేశాం బిడ్డా’ అంటూ కొడుకు మరణాన్ని తట్టుకోలేక రోదించిన ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరి వల్లా కాలేదు. 21రోజుల పాటు కోవిడ్తో పోరాడి మంగళవారం ఉదయం మృతి చెందిన కొడుకు మృతదేహాన్ని అంబులెన్స్లో తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామానికి చెందిన నరకూడి ఇబ్రాము, ఆండాలు కుమారుడు ప్రభాకర్ (32) కోవిడ్తో కింగ్కోఠి జిల్లా ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిద్దామంటే వారు రూ.10వేలు అడిగారు. రెండు గంటలపాటు ఎదురుచూసి అంత డబ్బు భరించే స్థోమతలేక ఆటో ట్రాలీలోనే కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లారు. కోఠి ఈఎన్టీలో బ్లాక్ ఫంగస్తో ఒకరి మృతి సుల్తాన్బజార్: కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో మొదటిసారి బ్లాక్ఫంగస్ పేషెంట్ మృతి చెందాడు. మహబూబాబాద్, బోదతండాకు చెందిన బోడా శ్రీను(50) గత నెల 30న బ్లాక్ ఫంగస్ సోకడంతో ఈఎన్టీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి డయాబెటిక్తో పాటు హైపర్టెన్షన్, అస్తమా ఉన్నాయి. కరోనా వచ్చి తగ్గిన తర్వాత శ్రీనుకు కన్నులో బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీంతో కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో తొలి బ్లాక్ఫంగస్ మృతికేసు నమోదైంది. ఇదిలా ఉండగా వైద్యులు సకాలంలో శస్త్రచికిత్స చేయలేదని..ఆపరేషన్ చేస్తామని చేయలేదని బంధువులు వాపోయారు. షుగర్ ఎక్కువగా ఉండడంతో పాటు హైపర్టెన్షన్ సమస్య వల్ల ఆపరేషన్ వాయిదా వేశామని, బాధితుడు గుండెపోటుతో మాత్రమే మృతిచెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. చదవండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు ధరలు ఎందుకు నిర్ణయించలేదు? -
బ్లాక్ ఫంగస్కు హైదరాబాద్ సెలాన్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పెషాలిటీ బయోఫార్మాస్యూటికల్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సెలాన్ ల్యాబొరేటరీస్ బ్లాక్ ఫంగస్కు (మ్యుకోర్మైకోసిస్) ప్రత్యామ్నాయ ఔషధాన్ని తయారు చేసింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే లిపోసోమాల్ యాంఫోటెరిసిన్-బి ఔషధానికి కొరత ఉన్న నేపథ్యంలో.. ఎమల్షన్ ఆధారిత యాంఫోటెరిసిన్-బి ఫార్ములేషన్ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 10,000 వయల్స్ తయారు చేయగల సామర్థ్యం ఉందని సంస్థ వెల్లడించింది. వీటితో నెలకు 6,000 మంది రోగులకు ఉపశమనం కలుగుతుందని వివరించింది. మూడు వారాల్లోనే కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి బృందం దీనికి రూపకల్పన చేసిందని సెలాన్ ల్యాబ్స్ ఎండీ ఎం.నగేశ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. 2013 నుంచి లిపోసోమాల్ యాంఫోటెరిసిన్–బి తయారు చేస్తున్నామని, అయితే ఈ ఔషధం తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థం లిపాయిడ్స్ లభించకపోవడంతో డిమాండ్ను చేరుకోలేకపోయామని కంపెనీ తెలిపింది. లిపాయిడ్స్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సెలాన్ను లండన్కు చెందిన కెలిక్స్ బయో ప్రమోట్ చేస్తోంది. చదవండి: డిజిటల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కాస్త ఊరట -
కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
-
Black Fungus: పన్ను నొప్పి ఉందని వెళితే..
సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో వేవ్ మొదలైనప్పటి నుంచి బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా సోకినవారిలో చాలా మంది హోం ఐసోలేషన్లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. ఇందులో కొందరు ఇష్టమొచ్చినట్టుగా స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తుండటంతో.. కరోనా నియంత్రణలోకి వచ్చినా బ్లాక్ ఫంగస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బాధితులు ఏదో పంటి సమస్య అనుకుని డెంటిస్టుల దగ్గరికి వెళితే.. ఫంగస్ ఉన్నట్టు బయటపడుతోంది. కరోనా సోకి తగ్గినవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, దంతాలకు సంబంధించి ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మ్యూకోర్మైకోసిస్ లక్షణాలు కనిపిస్తే.. త్రీడైమన్షనల్ సీటీ స్కాన్ ద్వారా సమస్య తీవ్రతను కచ్చితంగా అంచనా వేయొచ్చని, తగిన చికిత్స తీసుకోవచ్చని చెప్తున్నారు. ఈ తరహా కేసులకు సంబంధించిన లక్షణాలు, సమస్యలు, చికిత్స తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యనిపుణులు ప్రసాద్ మేక, ప్రత్యూష, సూర్యదేవర నిశాంత్ పలు సూచనలు చేశారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ‘మాక్సిల్లా’ఎముకపై ముందుగా ప్రభావం ముక్కుకు నోటికి మధ్యలో (అంగిటిపై) ఉన్న ‘మాక్సిల్లా’ ఎముకపై ఫంగస్ ముందుగా ప్రభావం చూపుతుంది. దీని వెనుకవైపు చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) విభాగం పరిధిలోకి వచ్చే వ్యవస్థలు ఉంటాయి. కిందివైపు దంత సంబంధిత వ్యవస్థలు ఉంటాయి. ఫంగస్ చాలా వరకు ముక్కు నుంచే ప్రవేశిస్తుంది. కరోనా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రాంతం కూడా అక్కడే ఉండడంతో సమస్య తీవ్రత పెరుగుతుంది. సైనస్ సంబంధిత సమస్యలు, నొప్పి అధికంగా ఉండడం వల్ల ఈఎన్టీ వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అదే నోటిలో దుర్వాసన, పళ్లు కదలడం, చిగుళ్ల వాపు, చీము రావడం వంటి సమస్యలు వస్తే వెంటనే డెంటిస్ట్లను సంప్రదించాలి. ఇలాంటి సమస్యలు లేదా లక్షణాలతో వచ్చిన పేషెంట్లను పరీక్షించినప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ సమస్యను గుర్తించాక తీవ్రతను బట్టి ఏ భాగంలో ఎలాంటి చికిత్స చేపట్టాలనేది నిర్ణయిస్తారు. మాక్సిల్లా లేదా ప్యాలెట్లలో ఇన్పెక్షన్ పెరిగితే పన్ను లేదా పంటి చుట్టూ ఎముకను కట్ చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్సను ఈఎన్టీ, డెంటల్ సర్జన్లు చేస్తారు. మాక్సిల్లా ఆపరేషన్ అంటే డెంటల్, ప్లాస్టిక్ సర్జరీలు చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ సూర్యదేవర నిషాంత్, డెంటల్ స్పెషలిస్ట్ ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.. ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ, న్యూరాలజీ అంశాలకు సంబంధించిన సమస్య బ్లాక్ ఫంగస్. ఇది ముక్కులోంచి ప్రవేశించి పైదవడ, సైనస్, కళ్లు, మెదడుపై ప్రభావం చూపుతుంది. ఉన్నట్టుండి దంతాలు వదులుకావడం, అక్కడక్కడా తెల్లపొక్కులు ఏర్పడటం, చిగుళ్లకు రంధ్రాల మాదిరిగా ఏర్పడి చీము కారడం, అంగిటి నల్లబడటం, పన్ను తీసేసినప్పుడు గాయం ఆలస్యంగా మానడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి టెస్టులు చేయించుకోవాలి. ఎలాంటి లక్షణాలు లేకున్నా పైదవడ నొప్పి, వాపు వస్తే.. ఫంగస్ వ్యాపించిన మేర కణజాలాన్ని తొలగించాలి, యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఇవ్వాలి. ఒకవేళ పైదవడ పూర్తిగా తొలగించాల్సి వస్తే.. అప్చురేటర్ ద్వారా వివిధ స్థాయిల్లో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుగుడ్డు తొలగించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ కన్నును డెంటిస్ట్లే అమర్చాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ప్రమాదం బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. 3, 4 రోజుల్లోనే ఈ ఫంగస్ మెదడుకు చేరుకుని, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ కారణంగా షుగర్ పేషెంట్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారికి, కేన్సర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతుంది. కోవిడ్ వచ్చి తగ్గినవారు.. ఫంగస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ముఖంపై నొప్పి, నల్లబారడం, ముక్కులోంచి రక్తం, కన్ను వాపు, హైఫీవర్, తరచుగా తలనొప్పి వంటివి ఏమైనా ఉన్నాయా అన్నది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. బెటాడిన్ మౌత్వాష్తో తడిపిన దూది లేదా వస్త్రంతో నోటిని శుభ్రం చేసుకోవాలి. –ప్రసాద్ మేక, ప్రత్యూష మేక, డెంటిస్ట్లు, కిమ్స్ ఆస్పత్రి చదవండి: కరోనా మూడో వేవ్ వస్తుందా?.. వస్తే.. ఎలా గుర్తించాలి? -
45 ఏళ్లు దాటిన వారే లక్ష్యం..
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ కేసులు 45 ఏళ్లు దాటిన వారిలోనే అధికంగా నమోదవుతున్నాయి. మధుమేహం ఉండి కరోనా వచ్చిన వారిపై ఈ ఫంగస్ ఎక్కువగా దాడి చేస్తున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,179 మందికి బ్లాక్ ఫంగస్ సోకినట్టు గుర్తించారు. వీరిలో 1,139 మంది కోవిడ్ వచ్చి పోయిన వారే ఉన్నారు. కోవిడ్ రాకున్నా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనూ 40 మందికి ఇది సోకినట్టు వెల్లడైంది. 18 ఏళ్లు దాటిన వారిలోనూ 415 కేసులుండగా, 18 ఏళ్ల లోపు వారిలో 3 కేసులున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారు 14 మంది ఉన్నారు. కోవిడ్ సోకిన వారిలోనే ఎక్కువగా కేసులొచ్చాయి. అయితే వీరిలో ఎక్కువ మంది మధుమేహ బాధితులే. 1,179 కేసుల్లో 743 మంది షుగర్ బాధితులు కోవిడ్ సోకిన తర్వాత బ్లాక్ఫంగస్కు గురయ్యారు. మిగతా వారిలో 251 మంది వ్యాధి నిరోధక శక్తి లేక దీని బారినపడ్డారు. క్యాన్సర్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, కిడ్నీ జబ్బులు వంటి వాటితో బాధపడుతున్న వారిలో 130 మందికి ఈ జబ్బు సోకింది. అలాగే బ్లాక్ఫంగస్ ముందుగా ముక్కుకు చేరి ఆ తర్వాత కన్ను, మెదడుకు సోకిన వారే ఉన్నారు. వీటినే రినో సెరబ్రల్ అంటారు. 618 మంది రినో సెరబ్రల్ (ముక్కు, కన్ను సంబంధించిన ఫంగస్)తో చికిత్స పొందుతున్నారు. పల్మనరీ అంటే ఊపిరితిత్తుల ఫంగస్తో 117 మంది, క్యుటానస్ అంటే చర్మసంబంధిత ఫంగస్తో 146 మంది చికిత్స పొందుతున్నారు. సాధారణ అవయవాలకు అంటే డెసిమినేటెడ్ పరిధిలో ముగ్గురు, అన్కామన్ ప్రెజెంటేషన్(అసాధారణంగా) వచ్చినవి 295 కేసులున్నాయి. వచ్చే 7 రోజుల్లో 55 వేల ఇంజక్షన్లు అవసరం బ్లాక్ఫంగస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇంజక్షన్ల వినియోగం పెరిగింది. తాజా అంచనాల ప్రకారం జూన్ మొదటి వారంలో 55 వేలకు పైగా ఇంజక్షన్లు, జూన్ రెండో వారంలో 79 వేలకు పైగా ఇంజక్షన్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,795 ఇంజక్షన్లు మాత్రమే ఉన్నాయి. బీడీఆర్ ఫార్మాస్యుటికల్, ఎల్వీకేఏ ల్యాబ్స్, గుఫిక్ బయోసైన్సెస్, మైలాన్ ల్యాబొరేటరీస్కు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చారు. ఒక్కో పేషెంటుకు రోజుకు 6 ఇంజక్షన్లు అవసరమని వైద్యులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడం వల్ల కేసులు పెరుగుతున్నాయ్ కోవిడ్ వల్ల రక్తం గడ్డకడుతోంది. ముక్కు లోపల రక్తనాళాలు గడ్డకడితే టిష్యూల వద్దకు ఫంగస్ వచ్చినట్టు తాజాగా గుర్తించారు. రక్తం ఎక్కడైతే సరఫరా కాకుండా గడ్డలు వస్తున్నాయో అక్కడే ఫంగస్ చేరుకుంటోంది. కోవిడ్కు స్వతహాగానే రక్తాన్ని గడ్డకట్టించే గుణం ఉంది. –డా.పల్లంరెడ్డి నివేదిత అసిస్టెంట్ ప్రొఫెసర్, కర్నూలు ప్రాంతీయ కంటి ఆస్పత్రి -
ఈ నెల 10 వరకు కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను జూన్ 10 వరకు కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాక్సినేషన్కు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగ వీసాలపై విదేశాలకు వెళ్లే వారికి కూడా టీకాలు ఇచ్చి ధృవీకరణ పత్రాలు అందేలా చూడాలన్నారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ లేకున్నా బ్లాక్ ఫంగస్..! బ్లాక్ఫంగస్ బాధితులకు అందుతున్న వైద్యంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు 1,179 నమోదు కాగా 1,068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయిందని అధికారులు తెలిపారు. 14 మంది మరణించినట్లు వెల్లడించారు. కోవిడ్ సోకకున్నా బ్లాక్ ఫంగస్ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో 1,139 మంది కోవిడ్ సోకినవారు కాగా 40 మందికి కరోనా లేకున్నా బ్లాక్ ఫంగస్ వచ్చిందని తెలిపారు. డయాబెటిస్ ఉన్నవారికి అధికంగా వస్తోందని, కేంద్రం కేటాయింపులు ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయని వివరించారు. మాత్రలను అవసరమైన మేర సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంజక్షన్ల కోసం కూడా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ ట్యాంకులుండాలి... కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా, నిల్వలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఆక్సిజన్ వినియోగం 490 టన్నులకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. మే 29వ తేదీన 654 టన్నులను సేకరించామని, స్థానికంగా 230 టన్నుల ఉత్పత్తి అయినట్లు తెలిపారు. ఆక్సిజన్ సేకరణ, నిల్వలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ చేసే ట్యాంకులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. సరైన పథకాల్లో మదుపు చేయాలి.. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిన్నారుల పేరిట సరైన పథకాల్లో డబ్బు మదుపు చేయడం ద్వారా ఆర్థిక భద్రతతోపాటు ప్రతి నెలా కనీస అవసరాల కోసం మెరుగైన వడ్డీతో డబ్బులు అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను ఇప్పటివరకూ గుర్తించామని, వీరిలో 43 మందికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేశామని అధికారులు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రతి పది లక్షల జనాభాకు పట్టణాల్లో 2632 కేసులు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 1859 కేసులు ఉన్నట్లు తెలిపారు. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్నారు. మే 16న పాజిటివిట్ రేటు 25.56 శాతం ఉండగా 30వతేదీ నాటికి 15.91 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ఒకదశలో రెండు లక్షలకుపైగా ఉన్న యాక్టివ్ కేసులు 1.6 లక్షలకు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడిందని, మే 7వతేదీన 84.32 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం దాదాపు 90 శాతానికి చేరుకున్నట్లు వివరించారు. ఇక 104 కాల్సెంటర్కు మే 3వతేదీన 19,175 కాల్స్ రాగా 29వ తేదీన కేవలం 3,803 కాల్స్ మాత్రమే వచ్చాయని, కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందనేందుకు ఇది సంకేతమని పేర్కొన్నారు. – సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లిఖార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆయుష్ కమిషనర్ వి.రాములు తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్ ఫంగస్ సోకిందేమోననే భయంతో..
అహ్మదాబాద్: కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడు బ్లాక్ ఫంగస్ సోకిందనే భయంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అహ్మదాబాద్లో వెలుగుచూసింది. అతను తన భార్యతో కలిసి అహ్మదాబాద్ పాల్ధి ప్రాంతంలోని అమన్ అపార్టుమెంటులో నివసిస్తున్నాడు. మే 27న అతని పుట్టినరోజు కాగా.. అదే రోజు తన శరీరంపై తెల్ల మచ్చలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ను గుర్తించి ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి అనుకొని విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బ్లాక్ ఫంగస్ వల్లే తన శరీరంపై మచ్చలు వచ్చాయనే భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా నాలుగు నెలల ముందు కరోనా సోకగా ఒక నెలలో మహమ్మారి బారి నుంచి పటేల్ కోలుకున్నాడు. అయితే అతను మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నందున బ్లాక్ ఫంగస్ దాడి నుంచి తాను తప్పించుకోలేనని భయపడినట్టు స్ధానిక ఎస్ఐ జేఎం సోలంకి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. చదవండి: పెళ్లి జరిగి 4 రోజులు.. భర్త ముందే మాజీ ప్రియుడు.. -
14 మెడికల్ కాలేజీలు.. దేశంలోనే ప్రథమం: సింఘాల్
సాక్షి, విజయవాడ: ఒకే సారి 14 మెడికల్ కాలేజీలకు శంఖుస్థాపన చేయడం దేశంలో ఇదే ప్రథమం అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూని జూన్ 10 వరకు పొడిగించాం. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపులు యధావిధిగా ఉంటాయి’’ అన్నారు. ‘‘రాష్ట్రంలో కోవిడ్ కేసులు బాగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 83, 461 శాంపిల్స్ పరీక్షించాం. 7,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 98 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐసీయూ బెడ్స్- 1,461, ఆక్సిజన్ బెడ్స్ 6,323 అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లో 15,106 వేలమంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల్లో రెమిడెసివర్ ఇంజక్షన్లు 1,75,000 డోసులు జిల్లాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఆక్సిజన్ 591 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించాం. గతంతో పోలిస్తే ఆక్సిజన్ వినియోగం కూడా బాగా తగ్గింది. 104 కాల్ సెంటర్ కి వచ్చే కాల్స్ సంఖ్య తగ్గింది’’ అన్నారు. ‘‘రాష్డ్రంలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ కేసులు1179 నమోదవ్వగా.. ఇందులో 14 మంది ఇప్పటివరకు మృతి చెందారు. 97 మంది ట్రీట్ మెంట్ పొంది కోలుకున్నారు. ఇక బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 1139 మందికి కోవిడ్ వచ్చిన వారు ఉన్నారు. మరో 40 మందికి కరోనా రాకుండానే బ్లాక్ ఫంగస్ వచ్చింది. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉపయోగించిన వారు 370 అయితే ఆక్సిజన్ ఉపయోగించని వారు- 809 కాగా.. 687 మంది స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే, 492 మంది స్డెరాయిడ్స్ ఉపయోగించలేదు. ఇక బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 743 మంది డయాబెటిస్ పేషేంట్స్ ఉన్నారు. బ్లాక్ ఫంగస్కి అవసరమైన మందులు కేంద్రం కేటాయిస్తోంది’’ అని తెలిపారు. ‘‘ప్రైవేట్ ఆసుపత్రులలో 14,924 మంది కోవిడ్ బాధితులుంటే ...ఇందులో 8,902 మంది ఆరోగ్యశ్రీ లో చికిత్స పొందుతున్నారు. అన్ని ఆసుపత్రులలో 78 శాతం ఆరోగ్యశ్రీలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 88 శాతం, విజయనగరంలో 81 శాతం ఆరోగ్యశ్రీలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే కేసులు తగ్గుతున్నాయి’’ అని సింఘాల్ తెలిపారు. ఇక్కడ చదవండి: 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చదవండి: చిన్న పిల్లల్లో కోవిడ్ చికిత్స విధానానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ -
Black Fungus: 6 తప్పుడు కేసులను గుర్తించిన వైద్యులు
గాంధీ ఆస్పత్రి: ఎల్బీనగర్కు చెందిన ఓ యువకుడు నెల క్రితం కరోనా బారిన పడ్డాడు. కొద్దిరోజుల క్రితం పైదవడ దంతాల నొప్పితో పాటు కదులుతున్నట్లు అనిపించడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. స్కానింగ్లు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి బ్లాక్ఫంగస్ అని చెప్పడంతో సదరు యువకుడు తీవ్రభయాందోళనకు గురై వెంటనే అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. రెండు రోజలు వైద్యం అందించి బ్లాక్ఫంగస్ మందులు తెచ్చుకోవాలని సూచించారు. సదరు మందులు ప్రైవేటులో అందుబాటులో లేక యువకుడు రిఫరల్పై గాంధీ ఆస్పత్రి బ్లాక్ఫంగస్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. పలు రకాల స్కానింగ్లు, వైద్య పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు బ్లాక్ ఫంగస్ కాదని, సాధారణ పిప్పిపన్ను అని నిర్ధారించి, డెంటల్ వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించి డిశ్చార్జి చేశారు. ► పాతబస్తీకి చెందిన మహిళకు కరోరా పాజిటివ్, మూడు రోజుల క్రితం పక్షవాతం రావడంతో స్థాని క ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బ్లాక్ఫంగస్ లక్షణా లు ఉన్నాయని చెప్పడంతో భయాందోళనకు గురైంది. తెలిసిన వారి సలహా మేరకు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ కాగా, పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్తోపాటు పెరాలసిస్ వచ్చిందని, బ్లాక్ఫంగస్ ఆనవాళ్లు లేవని చెప్పి, కరోనాకు ట్రీట్మెంట్ ఇచ్చి స్వస్థత చేకూరిన తర్వాత డిశ్చార్జి చేశారు. ► బ్లాక్ఫంగస్ను బూచిగా చూపిస్తూ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను అడ్డంగా దోచు కుంటున్నాయి. పిప్పిపన్ను, పక్షవాతం వంటి రుగ్మతలను బ్లాక్ఫంగస్ ఖాతాలో వేయడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ► ఓల్డ్సిటీకి చెందిన మరోవ్యక్తికి కరోనా, బ్లాక్ఫంగస్ లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. స్వల్ప అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా, బ్లాక్ఫంగస్ సోకిందని చెప్పారు. సదరు వ్యక్తి గాంధీఆస్పత్రిలో చేరగా, నిర్ధారణ పరీక్షల్లో కరోనా, బ్లాక్ఫంగస్ లేవని తేలింది. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి బ్లాక్ఫంగస్ వార్డులో రిఫరల్పై చేరిన ఆరుగురు బాధితులకు ఫంగల్ లక్షణాలు మచ్చుకైనా లేవని గుర్తించారు. ఆయా విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించి బాధితులను డిశ్చార్జి చేశారు. ఆరుగురు బాధితులను గుర్తించి డిశ్చార్జి చేశాం ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రిఫరల్పై గాంధీఆస్పత్రి బ్లాక్ఫంగస్ వార్డులో చేరిన ఆరుగురికి ఫంగల్ లక్షణాలు లేవు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డిశ్చార్జీ చేశాము. వీరిలో ముగ్గురు దంత సంబంధ సమస్యలతో... మరో ముగ్గురు పెరాలసిస్ (ఫిట్స్)తో బాధపడుతున్నారు. స్కానింగ్ చేసిన తర్వాత బ్లాక్ఫంగస్ సోకినట్లు భావించిన అవయవ భాగాల నుంచి శాంపిల్స్ సేకరించి ఫంగల్ కల్చర్ టెస్ట్కు మైక్రోబయోలజీ ల్యాబ్కు పంపిస్తాము. బయాప్సీ నివేదిక ఆధారంగా బ్లాక్ఫంగస్గా నిర్ధారిస్తాము. ప్రజలు భయాందోళనకు గురికావద్దు. గాంధీ, ఈఎన్టీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్లాక్ఫంగస్ నివారణకు వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ చదవండి: చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..! -
కొరతలతో రోగుల కలత
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న ఊరట లేకుండా బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్లు పంజా విసరటం మొదలైంది. కరోనా వైరస్ కేసులతో పోలిస్తే ఇవి తక్కువైనా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి జాడ కనబడటం ఆందోళన కలిగించే అంశం. ఇంతవరకూ 12,000కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇవింకా పెరిగే అవకాశం కూడా వుందని నిపుణులు చెబుతున్న మాటలు దడ పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక రోగికి ఎండోస్కోపీ చేసినప్పుడు అతనిలో ఈ మూడు రకాల ఫంగస్లూ వున్నట్టు తేలింది. చివరకు ఆయన మరణించాడు. నిపుణులంటున్నట్టు ఈ ఫంగస్లు అంటువ్యాధులు కావచ్చు...కాకపోవచ్చు. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కానీ వీటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మహమ్మారిగా గుర్తించారు. కరోనా అరికట్టడానికి రోగులపై మోతాదుకు మించి వాడిన స్టెరాయిడ్లవల్ల ఈ ఫంగస్లు పుట్టుకొస్తు న్నట్టు గుర్తించారు. ఫంగస్ల నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తదితరాలపై ఇప్పటికే వైద్యులకు అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఇది ఎక్కువున్నట్టు తెలుసు కున్నారు. కానీ విషాదమేమంటే చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో వుండటం లేదు. ఈ నెల 19నాడే ఢిల్లీ హైకోర్టు ఈ పరిస్థితిని గుర్తించి ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయో గాలించి, ఆ మందులు తక్షణం అందుబాటులో వుండేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే వాటిని ఉత్పత్తి చేసే సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని, ప్రపంచ మార్కెట్లో కూడా కేంద్రం కొనుగోలు చేయడానికి సిద్ధంగా వున్నదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం వారణాసిలోని ఆరోగ్య సిబ్బందినుద్దేశించి జరిపిన ఆన్లైన్ సమావేశంలో ఫంగస్ ఇన్ఫెక్షన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఏం ప్రయోజనం? పది రోజలు గడుస్తున్నా ఢిల్లీలో ఈ వ్యాధిగ్రస్తులకు ఎక్కడా మందులు దొరకటం లేదు. అక్కడే కాదు...మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి వుంది. వ్యాపారులు డబ్బు చేసుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నా పట్టించుకునేవారు కరువ య్యారు. ఈ విషయంలో కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మొదలుకొని విపక్షా లన్నీ కోరాయి. కానీ ఫలితం లేదని, పది రోజుల తర్వాత కూడా పరిస్థితి యధాతథంగా వున్న దని ప్రధాన నగరాల్లోని ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనిస్తే అర్థమవు తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నట్టు వెనువెంటనే ప్రకటిం చింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా వెనకబడే వున్నాయి. కరోనా అయినా, దాని పర్యవసానంగా వస్తున్న ఫంగస్ వ్యాధులైనా ఎలా వ్యాపించాయి.. కారకులెవరు అనే ప్రశ్నలు ఇంకా తేలవలసివుంది. కనీసం మందుల లభ్యత విషయంలోనైనా కేంద్రం అప్రమత్తంగా లేకపోవటం...న్యాయస్థానాలు ఆదేశించినా ఫలితం లేకపోవటం దిగ్భ్రాంతికరం. మొన్నటి వరకూ ఆక్సిజన్ కొరతతో సతమతమైన రోగులు ఇప్పుడు ఈ ఫంగస్ నివారణకు మందులు దొరక్క అల్లాడుతున్నారు. ఢిల్లీలో ఒక ప్రభుత్వాసుపత్రికి రోజుకు 3,000 ఇంజక్షన్లు కావాల్సివుండగా కేవలం 350 మాత్రమే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వున్నదో గ్రహించవచ్చు. ఢిల్లీ ఆసుపత్రులకు వారానికి 30,000 అవసరమైతే 3,850 మాత్రమే వస్తున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీనగర్ వంటిచోట్ల ఈ ఫంగస్లకు సరైన చికిత్స అందించేవారు లేకపోవటంతో అక్కడివారు ఎంత దూరమైనా లక్ష్యపెట్టక మహా రాష్ట్ర, గుజరాత్ వంటిచోట్లకు రావాల్సివస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా దేశ పౌరులు ఇలాంటి దుస్థితిలో వుండటం మనకు అప్రదిష్ట తెస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకు లేకుండాపోతోంది. పంటి నొప్పితో మొదలై సైనస్గా మారి, ఆ తర్వాత నోటికి, కనుబొమలకు వ్యాపించి, చివరకు కళ్లనూ, మెదడునూ కూడా దెబ్బతీసి ప్రాణాలు హరిస్తున్న ఈ ఫంగస్లకు చెందిన మందులు అందుబాటులో వుంచాలని గుర్తించకపోవటం విచారకరం. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా వెల్లడవుతున్న ప్రతి ఒక్క కేసుకూ, బయటపడని 23 కేసులుండొచ్చని నీతి ఆయోగ్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ఫెక్షన్లు వున్నా పరీక్షల్లో బయటపడని స్థితి. ఒకపక్క కరోనా వైరస్ జనం ప్రాణాలతో ఆటలాడుతుంటే... వ్యాక్సిన్ల కొరత, మందుల కొరత జనంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఫంగస్లకు ఇస్తున్న ఇంజెక్షన్లు కూడా మోతాదు మించితే ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మొదలుకొని రాష్ట్రాల్లో ఆ శాఖను చూసేవారి వరకూ అందరూ చురుగ్గా స్పందించాలి. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా చూడాలి. తగినంతమంది నిపుణుల్ని అందుబాటులో వుండేలా చూసుకోవాలి. అదే సమయంలో ఇంజెక్షన్ల వాడకం హేతుబద్ధంగా వుండేట్టు తగిన మార్గదర్శకాలు రూపొందించాలి. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి నిర్దిష్టమైన ప్రోటోకాల్ కొరవడటం వల్లే ఈ ప్రమాదకర మైన ఫంగస్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వీటి విషయంలో కూడా నిర్లక్ష్యంగా వుంటే మరేం జరుగుతుందో అనూహ్యం. అందుకే మందులు అందుబాటులో వుండేలా చూడటంతోపాటు రోగులకు ఉచిత చికిత్స అందేందుకు ప్రభుత్వాలన్నీ తగిన చర్యలు తీసుకోవాలి. -
బ్లాక్ఫంగస్ దానివల్ల రాదు.. ఇది అసలు విషయం!
ఆదివారం వచ్చింది. ముక్క నోట్లోకి పోనిద్దాం అని ఆశతో చాలామంది పొద్దున్నే సంచులతో బయలుదేరుతారు. ఇంతలో ‘కోళ్లకు బ్లాక్ ఫంగస్.. తస్మాత్ జాగ్రత్త!’ అని ఎక్కడో వాట్సాప్లోనో, ఎవరో చెప్పడంతోనే ఆలోచనల్లో పడతారు. కానీ, చికెన్తో ఆ భయం అక్కర్లేదని డాక్టర్లు, సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు. ఇంతకీ వాట్సాప్లో వైరల్ అవుతున్న ఆ వార్త వెనుక అసలు విషయం ఏంటో చూద్దాం. న్యూఢిల్లీ: కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో కోళ్ల కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తోందని, కాబట్టి, కొన్ని రోజుల పాటు చికెన్కి దూరంగా ఉండడమే మంచిదని వాట్సాప్ల్లో ఈమధ్య వైరల్ అవుతోంది. దీనికి తోడు ఓ ప్రముఖ న్యూస్ వెబ్సైట్ పేరు మీద అది పబ్లిష్ కావడం, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయని కథనాలు వైరల్ అవుతుండడంతో చాలామంది నమ్మేస్తున్నారు. అయితే వాతావరణంలో అంతటా ఉండే బ్లాక్ ఫంగస్.. కోళ్లకి కూడా వస్తుందని, కానీ, ఆ కోళ్ల ద్వారా, చికెన్ ద్వారా మనుషులకు బ్లాక్ఫంగస్ వ్యాపిస్తుందన్న వాదనలో అర్థం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ చెప్తున్నారు. అసలు బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని ఆమె స్ఫస్టత ఇచ్చారు. కాబట్టి చికెన్కి భయపడాల్సిన అవసరం లేదని ఆమె అంటున్నారు. వీటికితోడు నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్ఫంగస్ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. ఫ్రిజ్లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్లు సర్కులేట్ అవుతున్నాయి. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వల్ల వస్తుంది. కట్ చేసేటప్పుడు దానిని కడిగి తినడం మంచిది. ఇక ఈ కరోనా టైంలో వైరస్ నుంచి వ్యాక్సిస్ దాకా.. వేరియెంట్ల నుంచి ట్రీట్మెంట్ దాకా అన్నింటి గురించి వాట్సాప్లో పుకార్లు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు చెప్తున్నారు. కోళ్లకు సోకినా.. అయితే ఒకవేళ ఏదైనా జంతువుకి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకితే వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ కుళ్లిన వాసనతో కోళ్లకు ఫంగస్ సోకినట్లు గుర్తించవచ్చని ఐసీఎఆర్ సైంటిస్ట్ డాక్టర్ ఎంఆర్ రెడ్డి చెప్తున్నారు. ఆ వాసన వచ్చిన మాంసాన్ని తినలేరు కదా. అయితే ఇప్పటివరకు జంతువులకు బ్లాక్ఫంగస్ సోకిన కేసులు నిర్ధారణ కాలేదని, దానిపై ఎలాంటి అధ్యయనాలు జరగలేదని ఎంఆర్రెడ్డి చెప్తున్నారు. అయితే కోళ్లను, బాతులను ముద్దు చేయడం ద్వారా సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ సోకుతుందని, ఇది సాధారణమైన ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని అన్నారు. అంటువ్యాధి కాదు బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని ఎయిమ్స్ డైరెక్టర్, పల్మనాలజిస్ట్ అయిన రణ్దీప్ గులేరియా ఇది వరకే స్పష్టం చేశారు. మ్యూకర్ అనే ఫంగస్ కారణంగా ఈ మ్యుకర్మైకోసెస్ వస్తుందని చెబుతూనే.. అపోహలపై క్లారిటీ ఇచ్చారాయన. ఇక యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇది చాలా ప్రాణాంతకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. ఈ వైరస్ కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉండటం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, షుగర్ పేషెంట్లకు ఫంగస్ల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. A clear and important thread on Mucor: What they are, how they cause infections, how to treat the infection, how to lower chances of infection, prevent infection, by controlling diabetes, steroid use. Finally, reduce possibilities of getting COVID: Masks, distance, ventilation! https://t.co/wVgEYaaBl7 — Principal Scientific Adviser, Govt. of India (@PrinSciAdvGoI) May 26, 2021 -
50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే 57 ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 50 పడకలు దాటితే ఆక్సిజన్ ప్లాంటు కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ రాయితీలు ఇస్తుందని, భవిష్యత్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 16 చోట్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి భూమిలో రాయితీ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. దీనికోసం భూములు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో 808 బ్లాక్ఫంగస్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 808 బ్లాక్ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. బ్లాక్ఫంగస్ చికిత్సకు సంబంధించిన యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు కేంద్రం ఇస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, దీనికి మరో మార్గం లేదన్నారు. ఇంజక్షన్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం 7,726 ఇంజక్షన్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,475 యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు జిల్లాలకు పంపించామని, పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రోజువారీ ఆక్సిజన్ వినియోగం తగ్గిందని, ఒక దశలో 620 టన్నుల వినియోగం జరిగిందని, ఇప్పుడు 510 టన్నులు వినియోగం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 66 విజిలెన్స్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 43 ఆస్పత్రులపై పెనాల్టీలు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ వంటి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అన్ని జిల్లాలో తగ్గిన ప్రభావం కనిపిస్తోందన్నారు. రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ ‘రాష్ట్రంలో గతంలో ఒకేరోజు 6.28 లక్షల మందికి టీకా వేశాం. ఇప్పుడు రెండ్రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాం. రాష్ట్రానికి టీకా వేసే సామర్థ్యం ఎక్కువగా ఉంది కాబట్టి కేటాయింపులు కూడా ఎక్కువగా చేయాలని కేంద్రాన్ని కోరాం’ అని సింఘాల్ తెలిపారు. నేటితో అంటే మే 30వ తేదీతో ఉన్న స్టాకు అయిపోతుందన్నారు. ఆ తర్వాత కేంద్రం వ్యాక్సిన్ పంపించే వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయడానికి లేదని, ఈ నేపథ్యంలో కాస్త కేటాయింపులు పెంచి త్వరగా వ్యాక్సిన్ పూర్తయ్యేలా చేయాలని లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 94,74,745 డోసుల టీకాలు పంపిణీ చేశామని, వీరిలో రెండు డోసులు తీసుకున్న వారు 24.12 లక్షల మంది ఉండగా, మొదటి డోసు తీసుకున్న వారు 46.48 లక్షల మంది ఉన్నారన్నారు. వ్యాక్సిన్లు ఎక్కడైనా దుర్వినియోగం జరిగాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఈ మందుతో అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్..!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్కు చెక్ పెట్టే మందును ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బ్లాక్ ఫంగస్ మాత్రమే కాకుండా దాదాపు అన్ని రకాల ఫంగల్ (శిలీంధ్రం) ఇన్ఫెక్షన్ల చికిత్సలోనూ దీన్ని వాడొచ్చని, ఏదైనా ఫార్మా కంపెనీ ముందుకొస్తే ఈ మందు తయారీ సాంకేతికతను అందించేందుకు తాము సిద్ధమని ఐఐటీ హైదరాబాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బ్లాక్ ఫంగస్కు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్–బి అనే ఇంజెక్షన్తో చికిత్స కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మందు ఖరీదైనది మాత్రమే కాకుండా.. పలు దుష్ప్రభావాలూ ఉన్నాయి. గతంలో ఇదే మందును కాలా అజార్ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్న ఆంఫోటెరిసిన్–బిపై రెండేళ్ల నుంచే ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్, డాక్టర్ చంద్రశేఖర్ శర్మ, పీహెచ్డీ స్కాలర్లు మృణాళిని గాయ్ధనే, అనిందిత లాహాలు పరిశోధనలు చేస్తున్నారు. నానో టెక్నాలజీ సాయంతో... ఈ మందును నానోస్థాయి పోగులతో కలిపి ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేయొచ్చని వీరంతా గుర్తించారు. ట్యాబ్లెట్ల రూపంలో ఆంఫోటెరిసిన్–బి తయారు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అతితక్కువ మోతాదుల్లో ప్రభావవంతంగా మందు అందించవచ్చని, ఇంజెక్షన్ ద్వారా అందించేటప్పుడు మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుండగా ట్యాబ్లెట్ల ద్వారా ఈ దుష్ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్ తెలిపారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు ఆంఫోటెరిసిన్– బి శరీరంలో చిన్నచిన్న గడ్డలు కట్టే అవకాశాలు ఉంటాయని, వీటిని శరీరం నుంచి తొలగించేందుకు మూత్రపిండాలు ఎక్కువ భారం మోయాల్సి వచ్చేదని ఆయన వివరించారు. జిలాటిన్ పదార్థంతో కలిపి తాము ఈ మందును తయారు చేశామని చెప్పారు. పెద్ద ఎత్తున ఉత్పత్తి అవసరం.. బ్లాక్ఫంగస్తో పాటు ఇతర శిలీంధ్ర సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ మాత్రలను పెద్ద ఎత్తున తయారు చేయడం అవసరమని అన్నారు. ఇంజెక్షన్ల మాదిరిగా ఈ ట్యాబ్లెట్లూ ఖరీదుగా మారకుండా ఉండేందుకు తాము ఈ టెక్నాలజీపై పేటెంట్ హక్కులేవీ పొందలేదని, కేవలం 60 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్తో ఆంఫోటెరిసిన్–బి మందు నెమ్మదిగా.. స్థిరంగా 8 గంటల పాటు శరీరానికి అందించవచ్చన్నారు. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.200 వరకూ ఉండొచ్చని చెప్పారు. ఏదైనా ఫార్మా కంపెనీ ట్యాబ్లెట్ల తయారీకి పూనుకుంటే వాటి క్లినికల్ ట్రయల్స్కు మార్గం సుగమం అవుతుందని అన్నారు. -
కోవిడ్ పాజిటివ్.. 3 ఫంగస్లతో వ్యక్తి మృతి
లక్నో: కరోనా నుంచి కోలుకున్న ప్రజలను ఫంగస్ బయపెడుతుంది. ఇప్పటికే దేశంలో బ్లాక్, వైట్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తిలో మాత్రం మొత్తం మూడు ఫంగస్లు కనిపించిన సంగతి తెలిసిందే. సదరు వ్యక్తి నేడు మరణించాడు. సంజయ్ నగర్ ప్రాంతానికి చేందిన లాయర్ కున్వర్ సింగ్కు కరోనా పాజిటివ్గా తేలడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమలో ఈ నెల 24 కున్వర్ సింగ్కు ఎండోస్కోపి చేయగా బ్లాక్, వైట్ ఫంగస్లతో పాటు ఎల్లో ఫంగస్ను కూడా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం టాక్సేమియా(రక్తం విషపూరితంగా మారడం)తో బాధపడుతూ కున్వర్ సింగ్ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇదే ఆస్పత్రిలో ముదాద్నగర్ ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్(59) వ్యక్తికి కూడా తాజాగా ఎల్లో ఫంగస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. రాజేశ్ కుమార్ మెదడు సమీపంలో ఫంగస్ని గుర్తించామని.. ఇప్పటికే దవడను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. రాజేష్ కుమార్కు కూడా టాక్సేమియా సోకింది కానీ.. తీవ్రత తక్కువగా ఉండటంతో అతడికి యాంటీ ఫంగల్ మెడికేషన్ అందిస్తున్నామని.. కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. చదవండి: బ్లాక్ ఫంగస్ భయం: మగ్గానికి ఉరేసుకున్న బాధితుడు -
రాష్ట్రంలో కరోనా పీక్ స్టేజ్కు వెళ్లి తగ్గింది: అనిల్ కుమార్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కరోనా కర్వ్ 25.56 శాతం మేర పీక్ స్టేజీకి వెళ్లి.. ప్రస్తుతం 17 శాతానికి తగ్గింది.. యాక్టీవ్ కేసులు 2.11 లక్షలకు వెళ్లి.. ప్రస్తుతం 1.74 లక్షలకు దిగాయి అని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గాయి.. మేం చేస్తోన్న వారపు సమీక్షలో కూడా తగ్గుదల కన్పిస్తోంది అన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లను కేంద్రమే కేటాయిస్తోంది. కేంద్రం నుంచి 7,725 యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్లు వచ్చాయి. పొసాకొనోజోల్ ఇంజక్షన్లు 1,250 వచ్చాయి.. మరో 50 వేల ఇంజక్షన్లు ఆర్డర్ ఇచ్చాం. పొసాకొనోజోల్ టాబ్లెట్స్ వచ్చిన మేరకు జిల్లాలకు కేటాయిస్తున్నాం’’ అన్నారు. ‘‘గత ఐదు రోజులుగా ఆక్సిజన్ వినియోగం గణనీయంగా తగ్గింది. గతంలో పీక్ స్టేజీలో 640 టన్నుల ఆక్సిజన్ వినియోగించాం. ప్రస్తుతం ఆక్సిజన్ వినియోగం 510 టన్నులకు తగ్గింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాల్సిందే. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సబ్సిడీ ఇస్తాం.. విద్యుత్ రాయితీలు అందిస్తాం’’ అని అనిల్ కుమార్ తెలిపారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 66 ఆస్పత్రులపై విజిలెన్స్ విభాగం నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో ఇప్పటికే చాలా ఆస్పత్రులకు పెనాల్టీ విధించాం. అలాగే వైద్యారోగ్య శాఖలో నమోదైన కేసులు వేరేగా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స తీసుకుని చనిపోయినా సరే అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాం. వ్యాక్సినేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి’’ అని అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. చదవండి: జిల్లాలకు 3 వేల బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు -
బ్లాక్ ఫంగస్ భయం: మగ్గానికి ఉరేసుకున్న బాధితుడు
దొడ్డబళ్లాపురం: బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు బయట పడటంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డబళ్లాపురంలోని విద్యానగర్లో నివసిస్తున్న రవీంద్ర (58) మరమగ్గం కార్మికుడు. ఈయన కరోనాకు గురై బాగేపల్లిలోని కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స తీసుకున్నాడు. రోగ లక్షణాలు ఎక్కువ కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించగా బ్లాక్ఫంగస్ ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని బెంగళూరు విక్టోరియాకు తరలించారు. అక్కడ వైద్య సిబ్బందితో గొడవపడి తిరిగివచ్చిన రవీంద్ర గురువారం రాత్రి మగ్గం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేయడానికి నగరసభ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. మగ్గానికి వేలాడుతున్న రవీంద్ర -
తండ్రికి బ్లాక్ఫంగస్.. కుమారుడికి టోకరా!
హిమాయత్నగర్: బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న తన తండ్రి మెడిసిన్ కోసం ఓ కుమారుడు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. సమీప బంధువు ఇచ్చిన సమచారం మేరకు ఓ వ్యక్తిని ఫోన్ ద్వారా సంప్రదించగా.. ఆ వ్యక్తి కుమారుడి వద్ద నుంచి రూ. లక్షకుపైగా దోచుకుని ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో.. మినిష్టర్ లైన్ టీవీకాలనీకి చెందిన ధనుంజయ్ అనే బాధితుడు సైబర్క్రైం పోలీసులను శుక్రవారం ఆశ్రయించారు. బాధితుడు ధనుంజయ్ సమాచారం మేరకు... తన తండ్రి సమీర్కుమార్ అవస్తీకి బ్లాక్ఫంగస్ సోకింది. మినిష్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ‘పొసకొనజోల్’ అనే మెడిసిన్ కావాలని వైద్యులు సూచించడంతో.. సమీప బంధువును ఆశ్రయించాడు. ఆయన తనకు తెలిసిన మెడికల్ రెప్రజెంటేటివ్ నాగరాజు అనే యువకుడిని ఫోన్ ద్వారా సంప్రదించాడు. ఈ మెడిసిన్ ఖర్చు రూ. 1.50 లక్షలు అవుతుందని చెప్పడంతో.. గూగూల్పే, ఐఎంపీఎస్ ద్వారా నాగరాజు అనే వ్యక్తికి ధనుంజయ్ గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయం రూ. 1.29 లక్షలు పంపించాడు. ఆ డబ్బులు అందినప్పటి నుంచి నాగరాజు ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. దీంతో బాధితుడు సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించి నాగరాజుపై ఫిర్యాదు చేశారు. చదవండి: వ్యభిచార నిర్వాహకులపై పీడీ యాక్ట్ -
విశాఖలో బ్లాక్ ఫంగస్ కలకలం
విశాఖపట్నం: జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 94 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. బ్లాక్ ఫంగస్ బారీన పడిన బాధితులకు విశాఖ కేజీహెచ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద బెడ్స్ ఏర్పాటు చేసి వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా ట్రీట్మెంట్ కోసం ఆరోగ్య శ్రీ కింద 50శాతం బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరైనా ఉల్లఘింస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సూర్యనారాయణ హెచ్చరించారు. -
బ్లాక్-వైట్-ఎల్లో... ఈ ఫంగస్లతో ప్రమాదమేంటి?
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని మహమ్మారిగా ప్రకటించారు. మరోవైపు కొత్తగా వైట్, ఎల్లో ఫంగస్ కేసులూ నమోదవుతున్నాయి. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారిలో.. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి కోమార్బిడిటీస్ ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గి.. ఫంగస్లు దాడి చేస్తున్నాయి. మరి ఈ ఫంగస్లు ఏమిటి? ఎలా సోకుతాయి? వాటితో లక్షణాలు, ప్రమాదాలు ఏమిటనే వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఒకరి నుంచి మరొకరికి సోకవు బ్లాక్, వైట్, ఎల్లో... ఫంగస్ ఏదైనా సరే నిజానికి మన చుట్టూ ఉండే పరిసరాలు, వాతావరణంలోనే ఉంటాయి. వాటిని మన శరీరం తరచూ ఎదుర్కొంటూనే ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో అవి మనను ఏమీ చేయలేవు. శరీరం బలహీనమై, రోగ నిరోధక శక్తి తగ్గిపోయినవారిపై మాత్రమే ప్రభావం చూపుతాయి. వైరస్, బ్యాక్టీరియాల తరహాలో ఒకరి నుంచి మరొకరికి సోకుతాయన్న ఆందోళన అవసరం లేదు. ముందే గుర్తిస్తే చికిత్స సులువు ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ముందుగా గుర్తించగలిగితే సులువుగానే చికిత్స చేయవచ్చని వైద్య నిపు ణులు చెప్తున్నారు. ఒక స్థాయి వరకు సాధారణ మందులతోనే బయటపడొచ్చని పేర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయికి చేరి శరీర భాగాలు దెబ్బతినడం మొదలైతే.. ప్రభావవంతమైన యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుందని, శస్త్రచికిత్సలు చేసి ఫంగస్ సోకిన కణజాలా న్ని తొలగించాల్సి వస్తుందని వివరిస్తున్నారు. చదవండి: వైట్ ఫంగస్: పేగులకు రంధ్రాలు బ్లాక్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ అసలు పేరు మ్యూకోర్ మైకోసిస్. సాధారణంగా మన పరిసరాల్లోనే ఉండే ఈ ఫంగస్.. శరీరం బలహీనమై, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. ఏవైనా వ్యాధులకు గురై స్టెరాయిడ్లు, యాంటీ బయాటిక్స్, యాంటీ వైరల్ మందులు అధికంగా వాడినప్పు డు, శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు, మధుమేహం, షుగర్ పెరిగిపోయినప్పుడు ఈ ఫంగస్ దాడిచేసే అవకాశాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. 12 వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడినట్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లక్షణాలు ఇవీ.. తీవ్రమైన తలనొప్పి, ముక్కు బిగుసుకుపోవడం, ముక్కు నుంచి ఆకుపచ్చ రంగులో స్రావం, ముక్కులోంచి రక్తం కారడం, గొంతు నొప్పి, పంటి నొప్పి, పళ్లు వదులుకావడం, కళ్ల చుట్టూ, ముఖం ఉబ్బడం, చర్మం రంగుమార డం వంటివి బ్లాక్ ఫంగస్ సాధారణ లక్ష ణా లు. ముక్కు లోపలిభాగంలో, కొండనాలుక ఉండే చోట నల్ల రంగు మచ్చలు కనిపిస్తాయి. ► ఈ ఫంగస్ ఊపిరితిత్తులకు వ్యాపిస్తే.. జ్వరం, ఛాతీలో నొప్పి, నోట్లోంచి రక్తం పడటం వంటివి ఏర్పడతాయి. ► బ్లాక్ ఫంగస్ జీర్ణ వ్యవస్థకూ సోకే ప్రమా దం ఉంది. అదే జరిగితే కడుపునొప్పి, పొ ట్ట ఉబ్బడం వంటి లక్షణాలు ఉంటాయి. ► ఈ ఫంగస్ సోకినవారిలో కొందరికి కళ్లు, ముక్కు లోపలి భాగంలో కండరాలను తొలగించాల్సి వస్తుంది. చదవండి: బ్లాక్ ఫంగస్: నెల రోజుల్లో జిల్లాలో 23 కేసులు ఎవరికి ప్రమాదకరం? బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న వారి లో 90 శాతానికిపైగా మధుమేహం ఉన్నవారు/ స్టెరాయిడ్లు అధికమో తాదులో వాడినవారేనని ఎయిమ్స్ డైరెక్టర్ ఇటీవలే తెలిపారు. ► అవయవ మార్పిడి చేయించుకున్నవారు, కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న వారు, ఐసీయూలో దీర్ఘకాలం చికిత్స పొందుతున్న వారికి సోకే అవకాశం ఉంది. ► వెరికొనజోల్ థెరపీ (ఊపిరితిత్తులకు సోకే ఓ రకం ఫంగస్ వ్యాధికి చికిత్స) తీసుకుంటున్న వారికి బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వైట్ ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా మరింత ప్రమాదకరమైనది ఎల్లో ఫంగస్. దీనిని మ్యూకోర్సెప్టిక్గా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లోని ఘజి యాబాద్లో తొలి ఎల్లో ఫంగస్ కేసును గుర్తిం చారు. బ్లాక్, వైట్ ఫంగస్ల లక్షణాలు ఎక్కువగా బయటికి కనిపిస్తే.. ఎల్లో ఫంగస్ లోలోపలే వ్యాపిస్తూ ఉంటుంది. బయటికి పెద్దగా లక్షణాలు కనబడకపోవడంతో దానిని గుర్తించేసరికే ప్రాణాంతకంగా మారు తుందని ఘజియాబాద్ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ త్యాగి తెలిపారు. సాధారణంగా ఎల్లో ఫంగస్ ఎక్కువగా సరీసృపాల (పాములు, బల్లులు, ఇతర పాకే జంతువుల)కు సోకుతుందని.. మనుషు ల్లో దాని ప్రభావంపై అధ్యయనం చేయాల్సి ఉందని ఐసీఎంఆర్లో అంటువ్యాధుల విభాగం చీఫ్ సమీరన్ పండా చెప్పారు. లక్షణాలు ఇవీ.. బద్ధకం, ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం వంటివి సాధారణంగా ఎల్లో ఫంగస్ లక్షణా లు. ఈ వ్యాధి ముదిరితే.. గాయాలు తగ్గకపోవడం, చిన్న గాయాలైనా సరే చీము పట్టడం, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడం వంటివి కనిపిస్తాయి. చివరికి అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. ఎల్లో ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా మరింత ప్రమాదకరమైనది ఎల్లో ఫంగస్. దీనిని మ్యూకోర్సెప్టిక్గా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లోని ఘజి యాబాద్లో తొలి ఎల్లో ఫంగస్ కేసును గుర్తిం చారు. బ్లాక్, వైట్ ఫంగస్ల లక్షణాలు ఎక్కువగా బయటికి కనిపిస్తే.. ఎల్లో ఫంగస్ లోలోపలే వ్యాపిస్తూ ఉంటుంది. బయటికి పెద్దగా లక్షణాలు కనబడకపోవడంతో దానిని గుర్తించేసరికే ప్రాణాంతకంగా మారు తుందని ఘజియాబాద్ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ త్యాగి తెలిపారు. సాధారణంగా ఎల్లో ఫంగస్ ఎక్కువగా సరీసృపాల (పాములు, బల్లులు, ఇతర పాకే జంతువుల)కు సోకుతుందని.. మనుషు ల్లో దాని ప్రభావంపై అధ్యయనం చేయాల్సి ఉందని ఐసీఎంఆర్లో అంటువ్యాధుల విభాగం చీఫ్ సమీరన్ పండా చెప్పారు. లక్షణాలు ఇవీ.. బద్ధకం, ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం వంటివి సాధారణంగా ఎల్లో ఫంగస్ లక్షణా లు. ఈ వ్యాధి ముదిరితే.. గాయాలు తగ్గకపోవడం, చిన్న గాయాలైనా సరే చీము పట్టడం, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడం వంటివి కనిపిస్తాయి. చివరికి అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. ఎవరికి ప్రమాదకరం? ఎల్లో ఫంగస్ ప్రత్యేకంగా ఎవరికి సోకుతుందన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదని వైద్యులు చెప్తున్నారు. రోగ నిరోధకశక్తి తగ్గినవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, కేన్సర్ చికిత్స పొందుతున్నవారు, ఇతర కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లపై ఈ ఫంగస్ ప్రభావం చూపుతుందంటున్నారు. ఎవరికి ప్రమాదకరం? ఎల్లో ఫంగస్ ప్రత్యేకంగా ఎవరికి సోకుతుందన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదని వైద్యులు చెప్తున్నారు. రోగ నిరోధకశక్తి తగ్గినవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, కేన్సర్ చికిత్స పొందుతున్నవారు, ఇతర కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లపై ఈ ఫంగస్ ప్రభావం చూపుతుందంటున్నారు. చికిత్స దాదాపు ఒకేలా.. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్.. ఇలా ఏదైనా దాదాపుగా చికిత్స ఒకే రకంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. చాలా రకాల ఫంగస్లను నిర్మూలించగల ‘ఆంఫొటెరిసిన్ బి’ని చికిత్సలో వాడతారు. కాస్త తక్కువ సామర్థ్యం ఉండే ఇతర యాంటీ ఫంగల్ మందులనూ వినియోగిస్తారు. ఫంగస్ ఎక్కువుంటే శస్త్రచికిత్సలు చేసి.. ఫంగస్ సోకిన కణజాలాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, మధుమేహం నియంత్రణలో లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు ఈ మూడు కూడా ఫంగస్ వ్యాధులకు ఉమ్మడి కారణాలు. ► కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్లు వాడితే ఇమ్యూనిటీ శక్తి దెబ్బతింటుంది. అవసరమైన మేరకే ఉపయోగించాలి. ► మధుమేహం ఉంటే మరింత జాగ్రత్త అవసరం. షుగర్ స్థాయిని తరచూ చెక్ చేసుకుంటూ, మందులు వాడుతూ ఉండాలి. ► పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు పెట్టినప్పుడు వాటిల్లోని హ్యుమిడిఫయర్లు, పైపులను తరచూ శుభ్రం చేయాలి. లేకుంటే ఫంగస్ పెరిగి.. నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ► ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కలప, కాగితం, అట్టడబ్బాలపై ఫంగస్ పెరుగుతుంది. అలాంటివి లేకుండా చూడాలి. ►ఇంట్లో నిల్వ ఆహార పదార్థాలపై ఫంగస్ పెరుగుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు బయటపడేయాలి. ► గదుల్లో తేమ (హ్యుమిడిటీ) తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హ్యుమిడిటీ పెరి గితే ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది. -
కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితుల్లో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డవారి చికిత్స కోసం వినియోగిస్తున్న ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, తామే కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరోనాకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా గురువారం బ్లాక్ ఫంగస్ గురించి ధర్మాసనం ప్రత్యేకంగా ఆరా తీసింది. చికిత్సకు వాడుతున్న మందులు ఏమిటి? కేంద్రం చేస్తున్న కేటాయింపులు ఎంత? తదితర వివరాలను అడిగింది. దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి మందులను ఇవ్వడం లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ మందులను కొనుగోలు చేస్తోందని, ఇప్పటికే ఆర్డర్లు కూడా ఇచ్చామని తెలిపారు. రోజూవారీ పద్ధతిలో మైలాన్ నుంచి ఇంజక్షన్లు వస్తున్నాన్నారు. ఇప్పటి వరకు 3,872 ఇంజక్షన్లు వచ్చాయని వివరించారు. అయితే రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు తక్కువగానే ఉన్నాయని, ప్రస్తుత అవసరాలకు అందుబాటులో ఉన్న ఇంజక్షన్లు సరిపోతాయన్నారు. బ్లాక్ ఫంగస్ మందులు, ఇంజక్షన్ల కేటాయింపుల విషయంలో వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. సచివాలయాల్లో అన్ని వివరాలు.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కోవిడ్ రోగులు, సంబంధీకులు ఆయా ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీల వివరాలను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే తెలుసుకోవచ్చని వివరించింది. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా బెడ్ల ఖాళీల వివరాలతో పాటు కోవిడ్ ఆసుపత్రులు, రోగుల వివరాలు, కోవిడ్ పరీక్షా ఫలితాలు కూడా తెలుసుకోవచ్చని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వివరించారు. సంబంధిత వైద్యాధికారి, ఏఎన్ఏం, సమీపంలోని కోవిడ్ కేర్ కేంద్రం వివరాలు కూడా తెలుసుకునే సౌలభ్యం ఉందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ అయినట్లు వివరించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీల వివరాలను నోడల్ అధికారి ప్రతీ 30 నిమిషాలకొకసారి డ్యాష్ బోర్డులో పొందుపరుస్తుంటారని తెలిపారు. డ్యాష్ బోర్డులో నోడల్ అధికారులు, ఆసుపత్రుల శాశ్వత ఫోన్ నంబర్లను కూడా పొందుపరిచామని, ఫిర్యాదు చేయాలనుకుంటే అందులో నంబర్లు కూడా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ కేర్ కేంద్రాలను 131కి పెంచామన్నారు. కోవిడ్ రోగుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బిల్లులపై ప్రతీ ఆసుపత్రిలో ఉండే ప్రభుత్వ నోడల్ అధికారి, హెల్ప్ డెస్క్ మేనేజర్ సంతకం ఉండేలా చూడాలని, దీంతో అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయవచ్చనిహైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి విచారణ సమయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని సుమన్ చెప్పారు. బెడ్ల ఖాళీల వివరాలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయటాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లతానన్నారు. పూర్తి వివరాలివ్వాలని ఆదేశం రాష్ట్రానికి రోజుకు ఆక్సిజన్ సరఫరాను 590 మెట్రిక్ టన్నులుగా కేంద్రం నిర్ణయించిందని, దీన్ని పెంచాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేదని సుమన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తాము చేసిన సూచనలకు సంబంధించిన వివరాలతో పాటు కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ వివరాలు, టీకాలు , బ్లాక్ ఫంగస్ మందుల పంపిణీ తదితర అంశాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేశ్, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు సంబంధించి హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై హైకోర్టు ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కరోనా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ మెమో రూపంలో ధర్మాసనం ముందుంచారు. జాతీయ టాస్క్ఫోర్స్ పర్యవేక్షిస్తోంది.. ప్రస్తుతం రాష్ట్రానికి రోజూ సగటున 680 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందన్నారు. ప్రస్తుత అవసరాలకు ఇది సరిపోతుందని తెలిపారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో కొందరు ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం తగిన రీతిలో స్పందించడం లేదని నివేదించారు. దీనిపై కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హరినాథ్ స్పందిస్తూ ఆక్సిజన్ కేటాయింపులతో కేంద్రానికి సంబంధం లేదని, జాతీయ టాస్క్ఫోర్స్ చూసుకుంటోందని, మరింత ఆక్సిజన్ కావాలంటే జాతీయ టాస్క్ఫోర్స్ను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, జాతీయ టాస్క్ఫోర్స్ను అడిగేందుకు ఏమైనా ఇబ్బంది ఉందా? అని సుమన్ను అడిగింది. ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటికే టాస్క్ఫోర్స్కు పలు లేఖలు రాశామని, వాటిని కోర్టు ముందుంచుతానని చెప్పారు. వ్యాక్సినేషన్ వివరాలు ఇవ్వండి.. చివరగా వ్యాక్సినేషన్ అంశం చర్చకు రాగా 45 సంవత్సరాలు, ఆపైబడిన వారికి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తోందని సుమన్ చెప్పారు. అయితే టీకాల విషయంలో కేంద్రం నియంత్రణ విధిస్తోందన్నారు. వ్యాక్సిన్ల కొరత వల్ల 18 ఏళ్లకు పైబడిన వారికి ఇవ్వలేకపోతున్నామన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలు నిమిత్తం కంపెనీలకు డబ్బులు కూడా చెల్లించేశామని తెలిపారు. 13 లక్షల వయల్స్ కోవిషీల్డ్, 3 లక్షల కోవాగ్జిన్ వయల్స్ కొనుగోలుకు డబ్బులు చెల్లించామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. సరిపడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు.. రాష్ట్రంలో రెమిడిసివిర్ ఇంజక్షన్లకు కొరత లేదని సుమన్ తెలిపారు. ప్రభుత్వం వద్ద గురువారం నాటికి 72,718 ఇంజక్షన్లు ఉన్నాయని చెప్పారు. రోజూ వారీ పద్ధ్దతిలో ఇంజక్షన్లు అందుతున్నాయన్నారు. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోతాయన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వి.అశోక్రామ్ స్పందిస్తూ, రెమిడిసివిర్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. కేసులు తక్కువ ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తూ, కేసులు ఎక్కువగా ఉన్న ఏపీకి తక్కువ ఇస్తోందన్నారు. ఈ సమయంలో ఏఎస్జీ హరినాథ్ జోక్యం చేసుకుంటూ.. కేసుల సంఖ్యను బట్టి కాదని, తీవ్రతను బట్టి కేటాయింపు ఉంటుందన్నారు. రేట్ల సంగతేంటని ధర్మాసనం ప్రశ్నించగా, ప్రభుత్వం తక్కువ రేట్లకు ఇస్తోందని సుమన్ తెలిపారు. అధిక రేట్లకు విక్రయించే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చదవండి: యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే ఆనందయ్య మందు: కీలక దశకు ప్రయోగాలు -
వైట్ ఫంగస్: పేగులకు రంధ్రాలు
న్యూఢిల్లీ: కరోనా కంటే ఎక్కువగా ఫంగస్ కేసులు జనాలను తీవ్రంగా భయపెడుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించే లోపలే ఫంగస్ వ్యాప్తి ప్రాణాలకు మీదకు తెస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బ్లాక్, వైట్, యెల్లో అంటూ వేర్వేరు ఫంగస్లను గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైట్ ఫంగస్ బారిన పడిన వ్యక్తిలో అరుదైన లక్షణాలు కనిపించాయి. ఫంగస్ వల్ల బాధితురాలి చిన్న పేగులు, పెద్ద పేగుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు. ఈ తరహా కేసు ప్రపంచంలో ఇదే మొదటిదన్నారు. ఆ వివరాలు..ఈ నెల 13న 49 ఏళ్ల మహిళ ఒకరు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరింది. ఇక బాధితురాలు క్యాన్సర్తో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరడానికి వారం రోజుల ముందే ఆమెకు కీమో థెరపీ చేయించారు. ఆ తర్వాత ఆమె కడుపునొప్పితో బాధపడుతుండటంతో గంగా రామ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్లు ఆమెకి సీటీ స్కాన్ చేయగా పేగులకు రంధ్రాలు పడినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సర్ గంగా రామ్ ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ ప్యాంక్రియాటికోబిలియరీ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ (ప్రొఫెసర్) అమిత్ అరోరా మాట్లాడుతూ.. ‘‘నాలుగు గంటల పాటు సాగిన శస్త్రచికిత్స ద్వారా, మహిళ ఆహార పైపు, చిన్న పేగు, పెద్ద పేగులలోని రంధ్రాలు మూసివేశాము. బాధితురాలి శరీరం లోపల ద్రవం లీకేజీని ఆపడానికి ఈ శస్త్రచికిత్స సహాయపడుతుంది’’ అని తెలిపారు. డాక్టర్ అరోరా మాట్లాడుతూ స్టెరాయిడ్ వాడకం వల్ల ఇటీవల పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల్లో కొన్ని చోట్ల పేగులకు రంధ్రాలు పడిన కేసులు కొన్ని వెలుగు చూశాయి. అయితే వైట్ ఫంగస్ కేసులో.. పేగుల్లో రంధ్రాలు ఏర్పడిన కేసు ప్రపంచంలో ఇది మొదటిది అన్నారు. చదవండి: 4 గంటలు శ్రమించి.. బ్లాక్ ఫంగస్ తొలగించి.. -
బ్లాక్ ఫంగస్: నెల రోజుల్లో జిల్లాలో 23 కేసులు
సాక్షి, నిజామాబాద్ : ఓ వైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 23 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆరుగురు మృత్యువాత పడ్డారు. జిల్లాలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖను కలవరానికి గురిచేస్తోంది. కోవిడ్ తరువాత కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ నివారణ చర్యలకు దిగింది. ఈ ఫంగస్పై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధిగ్రస్తులను గుర్తించడం, చికిత్సకు తరలించే చర్యలు చేపడుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో నెల రోజుల్లోనే 23 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గాంధీ నగర్లో, సిరికొండ ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాళ్లరామడుగు, చీమన్పల్లి, పెద్దవాల్గోట్ గ్రామాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అలాగే చంద్రశేఖర్కాలనీ ఆరోగ్య కేంద్రం పరిధిలో, ముదక్పల్లి, అర్సపల్లి, మెండోరా, సాలూర, మోస్రా, ఎడపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒక్కొక్కటి చొప్పున బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. కిషన్నగర్లో ఒకటి, మెండోరా ఆరోగ్య కేంద్రం పరిధిలో నాగాంపేటలో ఒక కేసు నమోదైంది. అత్యధికంగా దేగాం ఆరోగ్య కేంద్రం పరిధిలో ఐదు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. చేపూర్, అంకాపూర్, మగ్గిడి, ఆలూరులో రెండు కేసుల నమోదయ్యాయి. ఇందులో చీమన్పల్లి, పెద్దవాల్గోట్, గన్నారంతండా, సాహబ్పేట, నవీపేట, బోధన్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కరోనా తగ్గిన 15 నుంచి 20 రోజుల్లో.. బ్లాక్ ఫంగస్ కేసులు నిజామాబాద్ డివిజన్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. కరోనా వచ్చి తగ్గిన తరువాత 15 నుంచి 20 రోజుల్లోపు ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇంటింటి ఆరోగ్య సర్వే చేపడుతున్న సమయంలో కొందరు కోవిడ్ వచ్చిన తరువాత ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైద్య సిబ్బందికి తెలియజేస్తున్నారు. వెంటనే పరీక్షిస్తున్న వైద్యులు బ్లాక్ ఫంగస్ లక్షణాలుంటే తక్షణమే హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇలా జిల్లా కేంద్రంలో 18 కేసులను హైదరాబాద్కు రిఫర్ చేశారు. ఇంటింటి సర్వేలో వెలుగులోకి రావడం వారి వివరాలను నమోదు చేసుకోవడం, మందులను అందిస్తున్నారు. ఇటీవల కాలంలో కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఒకవైపు సర్వే సమయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తుండడంతో పాటు ఫంగస్ లక్షణాలు ఉన్న వారిని చికిత్సకు తరలిస్తున్నారు. జిల్లాలో కొద్దిరోజుల్లోనే 23 కేసులు నమోదవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వైద్య సిబ్బంది కూడా కోవిడ్ వచ్చి తగ్గిన వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకొని ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. దీనివల్ల ముందస్తుగానే రోగులను గుర్తించి చికిత్స అందిస్తే మేలని వైద్యాధికారులు తెలపడంతో కొన్ని రోజులుగా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు. తగ్గుతున్న కోవిడ్ కేసులు లాక్డౌన్ ప్రభావంతో జిల్లాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పాజిటివ్ రేటు పడిపోయింది. 2000 వరకు ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య 100 వరకు నమోదవుతోంది. ఈనెల 18న 210 పాజిటివ్ కేసులు, 19న 163, 20న 175, 21న 143, 22న 142, 23న 67, 24న 120, 25న 116, 26న 119 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ కొనసాగుతుండడంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు కూడా టెస్టుల కోసం ఎక్కువ మంది రావడం లేదు. దీంతో జిల్లాలో పాజిటివ్ రేటు 6.8కు చేరింది. ప్రత్యేక వార్డు ఏర్పాటు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో జీజీ హెచ్లో చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఐదో అంతస్తులో 50 పడకలతో బ్లాక్ఫంగస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పా టు చేశారు. అలాగే, వైద్యులను కూడా కేటాయించారు. బ్లాక్ ఫంగస్ కేసులు వస్తే ఇక్కడే చికిత్స అందిస్తారు. పరిస్థితి సీరియస్గా ఉంటే గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. వార్డు ఏర్పాట్లను సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ బుధవారం పరిశీలించారు. చదవండి: 4 గంటలు శ్రమించి.. బ్లాక్ ఫంగస్ తొలగించి.. -
4 గంటలు శ్రమించి.. బ్లాక్ ఫంగస్ తొలగించి..
గాంధీ ఆస్పత్రి: బ్లాక్ ఫంగస్ సోకి మృత్యువుతో పోరాడుతున్న బాధితుడి ప్రాణాలు నిలి పారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. అందరూ అతడిపై ఆశలు వదిలేసుకున్నా.. డాక్టర్లు మాత్రం ఈ కేసును చాలెంజ్గా తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలోని ఐదు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు సుదీర్ఘ శస్త్రచికిత్స జరిపి విజయం సాధించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, బ్లాక్ ఫంగస్ సర్జరీ కమిటీ చైర్మన్ శోభన్బాబు ఆదేశాల మేరకు ఆర్ఎంవో–1 నరేందర్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (45) కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్తో బాధపడుతూ ఈనెల 19న ‘గాంధీ’లో చేరాడు. ఎడమ దవడ వాయ డంతో పాటు ఎడమ కన్ను పూర్తిగా కనిపించట్లేదు. కుడికన్ను కొంచెం కనిపిస్తోంది. ముఖం లోని పలు భాగాలకు ఫంగస్ వేగంగా విస్తరిస్తోందని గుర్తించారు. ఈఎన్టీ, ఆప్తాల్మాలజీ, పాస్లిక్ సర్జరీ, అనస్థీషియా, న్యూరోసర్జరీ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించా లని నిర్ణయించారు. ఈనెల 25న సుమారు 4 గంటల పాటు శ్రమించి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ఎడమ కన్నుతో పాటు, ముఖ భాగంలోని మాగ్జి లా ఎముకను తెరిచి ఫంగస్ను తొలగించారు. ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను కొంతమేర తొలగించి, శుభ్రపరిచారు. ప్రస్తు్తతం రోగి కోలుకుంటున్నాడు. బ్లాక్ఫంగస్ నియంత్రణకు పొసకొనజోల్ మందు ఇచ్చామని, ఇది అద్భుతంగా పనిచేసిందని వైద్యులు చెప్పారు. రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ద్వా రా ఆయా భాగాలను పునరుద్ధరిస్తామన్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో ప్లాస్టిక్ సర్జరీ, ఆప్తా ల్మాలజీ హెచ్ఓడీలు సుబోధ్కుమార్, రవిశేఖర్, పలు విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు. చదవండి: ఈ–పాస్ ఇలా తీసుకోండి -
కోవిడ్ బాధితులకు కొండంత అండ
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం, చివరకు బ్లాక్ ఫంగస్ను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్స అందించడం ద్వారా పేద రోగులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాలనే నిబంధనతో వేలాది మందికి ఉచితంగా కరోనా చికిత్స అందుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. సుమారు 55 శాతం ప్రైవేట్ ఎం ప్యానల్డ్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నట్టు అంచనా వేశారు. ఇది 65 శాతానికి పెంచాలని భావిస్తున్నారు. 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు చికిత్స అందుతోంది. ఇందులో 2,288 ఐసీయూ పడకలు, 12,250 ఆక్సిజన్ పడకలు, 11,544 సాధారణ పడకల్లో సేవలు అందుతున్నాయి. ఈ కేసులన్నిటికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఇవి కాకుండా 200 తాత్కాలిక ఎం ప్యానల్డ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ సేవలు అందిస్తున్నారు. చికిత్సకు నిరాకరిస్తే కఠిన చర్యలు.. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ బాధితులకు పడకలు కేటాయించని ఆస్పత్రులు, చికిత్స అందించని ఆస్పత్రులపై అధికారులు తనిఖీలు నిర్వహించి ఇప్పటివరకూ 54 కేసులు నమోదు చేశారు. 11 ఆస్పత్రులను మూసి వేశారు. రూ.3.72 కోట్లు జరిమానా విధించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంత పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి అయినా సరే ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మానవత్వంతో వ్యవహరించాలి ‘కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఈ సమయంలో వ్యాపార దృక్పథంతో ఆస్పత్రులను నిర్వహించడం సమంజసం కాదు. తమ వంతు సాయంగా ప్రజలకు వైద్యం అందించేలా కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మానవత్వంతో ఆలోచించాలి. సామాన్యులు, పేదలకు భరోసా కల్పించాలి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించిన ప్రతి ఆస్పత్రికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది’ –డాక్టర్ ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ -
డిమాండ్ కొండంత.. ఉత్పత్తి గోరంత..
సాక్షి, అమరావతి: కరోనాను జయించి బయటపడిన వారిలో కొందరిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. మధుమేహవ్యాధి నియంత్రణ లేని, అతిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో 11,717 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. చికిత్సలో ఒక్కొక్కరికి 100 చొప్పున యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు అవసరం. అంటే.. ఇప్పుడు వ్యాధిబారిన పడినవారికే 11.71 లక్షల ఇంజక్షన్లు కావాలి. ప్రస్తుతం దేశంలో 5 సంస్థలు నెలకు 1,63,747 ఇంజక్షన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. మరో 5 సంస్థలకు వాటిని ఉత్పత్తి చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ 10 సంస్థలు జూన్ నాటికి నెలకు 2,55,114 వయల్స్ మాత్రమే ఉత్పత్తి చేయగలవు. విదేశాల నుంచి తొమ్మిది లక్షల ఇంజక్షన్లను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో జూన్కు 3.15 లక్షల వయల్స్ వస్తాయని చెబుతోంది. ఈ లెక్కన జూన్ నాటికి నెలకు 5.70 లక్షల వయల్స్ మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ వ్యాధి బారినపడిన వారి చికిత్సకే ఇవి చాలవని స్పష్టమవుతోంది. నానాటికీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో.. ఆ వ్యాధి చికిత్సలో వాడే కీలకమైన యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా మారుతుందని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా దోపిడీదారులు.. ఈ ఇంజెక్షన్లను దారిమళ్లించి బ్లాక్ మార్కెట్లో 6 నుంచి 10 రెట్లు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 18 రాష్ట్రాల్లో 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో గుజరాత్లో అత్యధికంగా 2,859 కేసులు నమోదవగా.. కర్ణాటకలో 2,770 కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వ్యాధికి చికిత్సలో ప్రధానంగా యాంపోటెరిసిన్–బి ఇంజక్షన్లు ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగికి రోజుకు 3, 4 డోసుల చొప్పున కొన్ని వారాలపాటు ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ ఫంగస్ వ్యాధుల చికిత్సలోను రెండు దశాబ్దాలుగా ఈ ఇంజక్షన్ను ఉపయోగిస్తున్నారు. దేశంలో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్, బీడీఆర్ ఫార్మాస్యూటికల్స్, సన్ ఫార్మా, సిప్లా, లైఫ్ కేర్ ఇన్నొవేషన్స్ సంస్థలు మాత్రమే ఈ ఇంజక్షన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. గతంలో వీటి తయారీలో ఏడాదికి 100 నుంచి 150 కిలోల లిపిడ్లు (ముడిపదార్థం) వరకు అవసరమయ్యేవి. ఈ ఫంగస్ కేసులు కనిష్ఠస్థాయిలో నమోదవడం వల్ల ఆ ఇంజెక్షన్లకు కొరత ఉండేది కాదు. కానీ.. 2 నెలలుగా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ ఇంజక్షన్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉత్పత్తి పెంచారు. ప్రస్తుత డిమాండ్ మేరకు ఇంజక్షన్ల ఉత్పత్తికి ఏడాదికి 1,000 కిలోల లిపిడ్లు అవసరం. కానీ.. ప్రపంచంలో లిపిడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వాటిని దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. వైద్యనిపుణుల్లోను ఆందోళన బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కేంద్రం 9 లక్షల యాంపోటెరిసిన్–బి ఇంజక్షన్లను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 50 వేల వయల్స్ను దిగుమతి చేసుకుని.. మే 21 నుంచి 24 మధ్యన 43 వేల వయల్స్ను రాష్ట్రాలకు అందజేసింది. ఓ వైపు దిగుమతి చేసుకుంటూనే ఉత్పత్తి సామర్థ్యం పెంచడం ద్వారా డిమాండ్ మేరకు ఇంజక్షన్లను అందుబాటులోకి ఉంచడానికి చర్యలు చేపట్టామని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో నాట్కో ఫార్మాస్యూటికల్స్, ఆలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, గుపిక్ బయోసైన్సెస్, ఎమెక్యూర్ ఫార్మాస్యూటికల్స్, లిక్య సంస్థలకు ఆ ఇంజక్షన్ల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. ఈ 10 సంస్థల ద్వారా దేశీయంగా జూన్ నాటికి 2,55,114 వయల్స్ అందుబాటులోకి వస్తాయి. జూన్లో మిలాన్ ల్యాబ్స్ ద్వారా 3.15 లక్షల వయల్స్ దిగుమతి చేసుకుంటామని కేంద్రం చెబుతోంది. వీటితో కలిపి జూన్ నాటికి 5,70,114 ఇంజక్షన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. కానీ.. ఈ ఇంజక్షన్లు ఇప్పటికే బ్లాక్ ఫంగస్ బారిన పడినవారికే సరిపోవని.. ఇకపై నమోదయ్యే కేసుల మాటేమిటని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో బ్లాక్ ఫంగస్ వ్యాధిని గుర్తించి.. యాంపోటెరిసిన్–బి ఇంజక్షన్లను వేయకపోతే మరణాల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం
-
ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేకమంది బాధితుల్లో బ్లాక్ ఫంగస్ మహమ్మారి బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేలల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. అయితే చాలామంది కరోనా నుంచి కోలుకున్న తర్వాతే బ్లాక్ ఫంగస్ బారిన పడడానికి కారణం స్టెరాయిడ్ల వినియోగం, ఇతర అనారోగ్య సమస్యలని నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. మే 23న 200లకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మే 24, 25న 100 కంటే తక్కువ కేసులు నమోదవగా..తాజాగా బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారి సంఖ్య 600కు చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక అంటువ్యాధుల నివారణ చట్టం ప్రకారం సుమారు 10 రాష్ట్రాలు బ్లాక్ఫంగస్ను(మ్యూకోమైకోసిస్)ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించాయి. ప్రస్తుతానికి బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం యాంఫోటెరిసిన్-బి అనే యాంటీ ఫంగల్ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. (చదవండి: సెకండ్ వేవ్: మళ్లీ 2 లక్షలు దాటిన కరోనా కేసులు) (చదవండి: ‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్కు కారణం’) -
‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్కు కారణం’
సాక్షి, అమరావతి: వైద్యుల పర్యవేక్షణ లేకుండా మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్కు కారణమని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ కేఎస్ జవహర్రెడ్డి పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఎక్కువగా బ్లాక్ ఫంగస్ వస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బ్లడ్ షుగర్ ఎక్కువ ఉండి స్టెరాయిడ్స్ అధికంగా వాడిన వారికి బ్లాక్ ఫంగస్ వస్తోందని వైద్యులు చెబుతున్నారన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బ్లాక్ ఫంగస్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు, 2 ఈఎన్టీ ఆస్పత్రులను నోటిఫై చేశామని, ఇప్పటికే బ్లాక్ ఫంగస్ను ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామని జవహర్రెడ్డి తెలిపారు. బ్లాక్ ఫంగస్ వైద్యం మందుల కోసం కేంద్రాన్ని సంప్రదించామని, ఇప్పటికే కేంద్రం బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్లో ఉపయోగించే లైపోజోమల్ ఆంఫోటెరిసిన్- బి ఇంజక్షన్లను రెండు వేలు పంపిందని తెలిపారు. ఈ ఇంజక్షన్స్ కొనుగోలుకు కంపెనీలతో నేరుగా మాట్లాడుతున్నామని, 75 వేల లైపోజోమల్ ఆంఫోటెరిసిన్- బి ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 20 వేల ఇంజక్షన్ల ఆర్డర్ వీటిలొ మూడు వేల ఇంజక్షన్లు వచ్చాయని, రెండ్రోజుల్లో మరో రెండు వేల డోసులు వస్తాయని ఆశిస్తుస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే దీనికి ముడిపదార్ధాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో అవసరమైన మరో మందు పుష్కలోజోనల్ కోసం కంపెనీలతో మాట్లాడుతున్నామన్నారు. ఇవి ట్యాబ్లెట్స్, ఇంజక్షన్ల రూపంలో ఉంటాయని, లక్ష ట్యాబ్లెట్స్, 20 వేల ఇంజక్షన్లను ఆర్డర్ చేశామని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేర్వేరుగా క్వారంటైన్ కేంద్రాలు అదే విధంగా కోవిడ్ కట్టడికి స్వచ్చంద సంస్థలు సహకరించాలని జవహర్రెడ్డి కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులతో సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేర్చడంలో స్వచ్చంద సంస్థలు వారధిగా ఉండాలని, కోవిడ్ కుటుంబాలకు మానసిక, సామాజిక మద్దతు అందించాలన్నారు. ఐసోలేషన్, వ్యాక్సినేషన్, టెస్టింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఎన్జీవోలు స్వీకరించాలని తెలిపారు. సంచార వాహనాల ద్వారా చిన్నారులు, వృద్ధులకు వారి ఇళ్ల వద్దే కోవిడ్ టెస్టింగ్ సేవలు అందించాలని పేర్కొన్నారు. అనాథ బాల, బాలికలకు వేర్వేరుగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జవహర్రెడ్డి తెలిపారు. చదవండి: ఆనందయ్య మందు: కృష్ణపట్నంలో టీడీపీ హడావుడి -
మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకం వల్లే బ్లాక్ ఫంగస్కు కారణం: జవహర్రెడ్డి
-
Coroanvirus: బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరత నిజమేనా?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా లైపోజోమల్ యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్ల కొరత ఉంది. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది వైద్యులు వాటినే రాస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో లేని ఈ మందులు రాసి రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఏమాత్రం సరికాదు’ అని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి చెప్పారు. మంగళవారం ‘సాక్షి’ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్లాక్ ఫంగస్ రోగుల నిష్పత్తికి అనుగుణంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎన్ని నమోదయ్యాయి? హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో 230 మంది రోగులు చికిత్స పొందుతుండగా, గాంధీ ఆస్పత్రి కోవిడ్ సెంటర్లో మరో 110 మంది ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 300 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. రోగులకు పడకలు దొరకట్లేదు కదా? నిజమే. బ్లాక్ ఫంగస్ గురించి ఊహించలేదు. అకస్మాత్తుగా కేసులు వెలుగు చూశాయి. ఆ వెంటనే వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రంగా ప్రక టించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో పడకలన్నీ రోగుల తో నిండిపోయాయి. ఈఎన్టీ, గాంధీ ఆస్పత్రు లపై భారం తగ్గించేందుకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లోనూ బ్లాక్ ఫంగస్ చికిత్సల కోసం 1,500 పడకలు కేటాయించాలని నిర్ణయించాం. వచ్చిన ప్రతి రోగిని చేర్చుకుని పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. బ్లాక్ ఫంగస్ కోసం ఏ ఆస్పత్రిలో ఎన్ని పడకలు ఏర్పాటు చేస్తున్నారు? ఈఎన్టీ ఆస్పత్రిలో ఇప్పటికే 250 పడకలు ఏర్పాటు చేశాం. వీటిని 300కు పెంచుతున్నాం. గాంధీలో 350, సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 200, టిమ్స్లో 50, కింగ్కోఠిలో 30, కొండాపూర్లో 50 పడకలచొప్పున కేటాయించాలని ఇప్పటికే ఆయా ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లా ఆస్పత్రులు, ఇతర టీచింగ్ ఆస్పత్రుల్లోనూ పడకలు సమకూర్చుతున్నాం. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరత నిజమేనా? బ్లాక్ ఫంగస్ చికిత్సలో లైపోజోమల్ యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు వాడుతుంటారు. అయితే ఇప్పటివరకు ఈ తరహా కేసులు పెద్దగా నమోదు కాకపోవడంతో ఫార్మా కంపెనీలు ఆ మేరకు ఉత్పత్తి చేయలేదు. ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ ఇంజెక్షన్ల కొరత ఉంది. కేంద్రం ఇప్పటివరకు 23,680 ఇంజెక్షన్లను ఆయా రాష్ట్రాలకు పంపగా.. వీటిలో తెలంగాణకు 890 వయల్స్ మాత్రమే కేటాయించింది. కేటాయించిన దానిలోనూ సగమే సరఫరా కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాంఫోటెరిసిన్–బికి ప్రత్యామ్నాయ మందులు ఉన్నాయా? యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయం గా పొసకొనజోల్, ఫ్లూకోనజోల్ ఇంజెక్షన్లు ఉన్నా యి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిన వారికి ఈ మందులు వాడుతున్నాం. ప్రైవేటు ఆçస్పత్రుల్లోని వైద్యులకు కూడా ఇదే సూచిస్తున్నాం. కానీ కొంత మంది వైద్యులు మార్కెట్లోదొరకని వాటిని రాసి రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది సరికాదు. -
జిల్లాలకు 3 వేల బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇప్పటి వరకు బ్లాక్ఫంగస్ నియంత్రణకు వాడే యాంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లు 3 వేలు పంపిణీ చేశామని, ఎప్పటికప్పుడు కేసుల పరిశీలన చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఇంజక్షన్ల లభ్యతను బట్టి రాష్ట్రానికి తెప్పిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై నాలుగు రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. ఇప్పటికే ఈ మందు నమూనాలు హైదరాబాద్ ల్యాబొరేటరీతో పాటు సెంట్రల్ ఆయుర్వేదిక్ ల్యాబొరేటరీకి వెళ్లాయని, ఫలితాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయని, వచ్చిన వెంటనే నిర్ణయం వెలువరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రెమ్డెసివిర్ ఇంజక్షన్ల డిమాండ్ బాగా తగ్గిందని, గడిచిన 24 గంటల్లో 5,640 ఇంజక్షన్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 22 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 41 వేలకు పైగా ఉన్నాయన్నారు. బుధవారం నాటికి ప్రభుత్వాస్పత్రుల్లో 75 వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయన్నారు. గత 24 గంటల్లో 767 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి తీసుకొచ్చామని, 650 మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతోందన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆక్సిజన్ నిల్వ చేస్తున్నామన్నారు. బ్లాక్ ఫంగస్తో మృతిచెందినట్టు తమకు సమాచారం లేదన్నారు. నేడు, రేపు కోవాగ్జిన్ సెకండ్ డోసు పంపిణీ చేస్తున్నామన్నారు. 78 వేల కోవాగ్జిన్ డోసులు రావాల్సి ఉందన్నారు. 45 ఏళ్లు దాటి, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగులకు కోవిషీల్డ్ మొదటి డోస్ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్టాకును జూన్ 15 వరకు మొదటి డోసుగా వేస్తామని, తర్వాత కేంద్రం నుంచి వచ్చే స్టాకును బట్టి రెండో డోస్ వేస్తామన్నారు. -
Gandhi Hospital: గాంధీలో ‘ఫంగస్’ సర్జరీలు
సాక్షి, నెట్వర్క్/ హైదరాబాద్: సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు బ్లాక్ ఫంగస్ బాధితులకు చేపట్టిన శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 123 మంది బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో రోజూ 10 బ్లాక్ఫంగస్ సర్జరీలు చేసేందుకు మౌలిక వసతులు సమకూరినట్లు సర్జరీ కమిటీ చైర్మన్, ఈఎన్టీ హెచ్ఓడీ ప్రొఫెసర్ శోభన్బాబు పేర్కొన్నారు. బ్లాక్ఫంగస్ అంటువ్యాధి కాదని, స్టెరాయిడ్స్ ఎక్కువ వినియోగించినవారికి, మధుమేహ బాధితులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. బాధితులందరికీ సర్జరీలు అవసరం లేదని మందులతో నయం కాకుంటే సర్జరీ చేస్తామని వివరించారు. శస్త్రచికిత్సలు చేసిన ఐదుగురిలో ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను తొలగించామని, ఫంగస్ వ్యాప్తి నిలిచిపోయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ఆయా కృత్రిమ భాగాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులు రాష్ట్రంలో రోజురోజుకూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బ్లాక్ ఫంగస్ నోడల్ ఆస్పత్రి అయిన హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి సోమవారం ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలతో దాదాపు 358 మంది వచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు 31 మందినే చేర్చుకున్నారు. మిగతా వారికి ఆస్పత్రి ఆవరణే దిక్కయింది. ఈ ఆస్పత్రిలో 230 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఇప్పటికే 218 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. పదుల సంఖ్యలో మాత్రమే డిశ్చార్జి అవుతుండటం.. కేసులు మాత్రం వందల సంఖ్యల్లో వస్తుండటం ఈఎన్టీ వైద్యులకు తలనొప్పిగా మారింది. ప్రతి జిల్లాలో ఒక బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అయిలాపూర్ రోడ్డులో ఉండే 45 ఏళ్ల మహిళకు బ్లాక్ఫంగస్ నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడి, తగ్గాక కళ్లు ఎర్రబడి, వాపు రావడంతో స్థానిక వైద్యులను సంప్రదించగా, హైదరాబాద్కు రిఫర్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, బ్లాక్ ఫంగస్ అని తేలగా, చికిత్స అందిస్తున్నారు. కాగా, నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన బోడ వెంకటేశ్వర్లుకు కరోనా సోకి కోలుకున్న తర్వాత తీవ్ర జ్వరం వచి్చంది. దీంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, బ్లాక్ఫంగస్ సోకినట్లు నిర్ధారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి.. బ్లాక్ ఫంగస్ సోకడంతో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గణేశ్నగర్కు చెందిన వసంత్కుమార్ (42) మృతి చెందాడు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. నిర్మల్ జిల్లా భైంసాలోని రాహుల్నగర్లో నివాసముంటున్న గజ్జన్బాయి (63) బ్లాక్ ఫంగస్తో మృతి చెందింది. నిజామాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోగా, నయం కాదని చెప్పడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లగా, సోమవారం మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన తూలగుంట్ల సులోచన (57) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో బాధపడుతూ సోమవారం మృతి చెందింది. -
యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్: ‘దొరికిన’వన్నీ డీఎంహెచ్ఓలకే!
సాక్షి, సిటీబ్యూరో: అసరమైన స్థాయిలో ఉత్పత్తి జరగట్లేదు... కేంద్రం ఇస్తున్న కోటా చాలట్లేదు... రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది... ఫలితంగా అనేక రకాలైన యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్కు భారీ డిమాండ్ వచ్చింది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి అనేక మంది “బ్లాక్ దందాలు’ చేస్తున్నారు. వీరిపై నిఘా వేసి ఉంచుతున్న పోలీసులు పలువురిని అరెస్టు చేసి భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిని డీఎంహెచ్ఓల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉండటంతోపాటు ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్తో కూడిన ఇంజెక్షన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. ఓపక్క ఇవి అవసరమైన వారిలో దాదాపు 90 శాతం మంది బ్లాక్లో పది నుంచి వంద రెట్లు ఎక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. ఈ ఔషధాలను బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లు మాత్రం వివిధ మార్గాల్లో తేలిగ్గా సమీకరించుకుంటున్నారు. ఇలాంటి దందా చేసే వారిపై ఇటు హైదరాబాద్ టాస్క్ఫోర్స్, అటు సైబరాబాద్, రాచకొండకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్వోటీ) నిఘా వేసి ఉంచుతున్నాయి. ఓ వైపు పక్కా సమాచారం, మరో వైపు డెకాయ్ ఆపరేషన్లు ద్వారా ఈ దందాలు చేసే వాళ్లను పట్టుకుంటున్నారు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఓ మహిళ సహా మొత్తం 86 మందిని పోలీసులు పట్టుకున్నారు. కీలక నిర్ణయం వీరి నుంచి 274 వరకు యాంటీ వైరల్, ఫంగల్ ఔషధాలతో కూడిన ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా నేరానికి సంబంధించి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు వారి నుంచి సొత్తు లేదా వస్తువులు స్వాధీనం చేసుకుంటారు. నిబంధన ప్రకారం వీటిని సీజ్ చేసినట్లు పంచనామా రాసి రిమాండ్ రిపోర్టుతో సహా కోర్టుకు అప్పగిస్తారు. అయితే ఈ యాంటీ వైరల్, ఫంగల్ ఇంజెక్షన్ల విషయంలో మాత్రం పోలీసు విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ శాఖ నుంచి అనుమతి తీసుకున్న అధికారులు ఇలా స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరేలా కృషి చేస్తున్నారు. బ్లాక్ దందా చేస్తూ చిక్కిన నిందితులతో పాటు ఇంజెక్షన్లను టాస్క్ఫోర్స్, ఎస్వోటీలు స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నారు. అప్పటి ఆ ఇంజెక్షన్లు పాడు కాకుండా ఫ్రిజ్లలో ఉంచి కాపాడుతున్నారు. పోలీసుస్టేషన్లో ఈ సీజ్ చేసి ఇంజెక్షన్లను ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఆ తర్వాత సదరు యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్ను స్థానికి డీఎంహెచ్ఓలకు అందించి రసీదు తీసుకుంటున్నారు. ఈ రసీదు, ఫొటోలు, వీడియోలు న్యాయమూర్తులకు అందిస్తున్నారు. ఆపై వీటిని జత చేస్తూ కోర్టుల్లో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. డీఎంహెచ్ఓలు ఈ ఇంజెక్షన్లను కోటా ప్రకారం ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు చేరుస్తున్నారు. దీనికి ముందు ఆ ఇంజెక్షన్ స్థితిగతులు, ఏ దశలో అయినా పాడైందా? తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు నల్లబజారులోకి తరలకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో పట్టుబడిన వాటిలో కనీసం ఒక్కటి కూడా వృథా కాకుండా జాగ్రత్త పడుతున్నామని ఓ అధికారి తెలిపారు. స్వీధీనం చేసుకున్న వెంటనే వాటిని ఫ్రిజ్లలో అవసరమైన ఉష్టోగ్రతలో భద్రపరుస్తున్నామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లను డీఎంహెచ్ఓలకు అందించే వరకు భద్రపరచడానికి టాస్క్ఫోర్స్ పోలీసులు ఫ్రిజ్లను సమకూర్చుకున్నారు. వీటి బ్లాక్ మార్కెట్ దందాను కనిపెట్టడానికి సోషల్ మీడియా పైనా పోలీసులు నిఘా ఉంచారు. అలాంటి విక్రేతలపై సమాచారం ఉంటే తమకు తెలపాలని కోరుతున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు మందుల్లేవ్... సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ మహమ్మారిని జయించి బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగుల ప్రాణాలతో పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు చెలగాటమాడుతున్నాయి. పైసలకు కక్కుర్తిపడి అడ్మిట్ చేసుకుని, సర్జరీలు చేస్తున్నాయి. ఆ తర్వాత చికిత్సకు అవ సరమైన లైపోజోమల్ ఆంపోటెరిసిన్–బీ ఇంజక్షన్లు లేవని చెప్పి బయటికి పంపుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో వారంతా చివరకు కోఠి ఈఎన్టీ, గాంధీ ఆçసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. నిజానికి చేర్చుకుని చికిత్సలు చేసిన ఆస్పత్రులే ఆయా రోగులకు అవసరమైన మందులను కూడా సమకూర్చాల్సి ఉంది. కేవలం సర్జరీలు చేసి, ఆ తర్వాత మీ చావు మీరు చావండంటూ పట్టించుకోకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వీరంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 700 మందికిపైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. నిత్యం 50 మందికిపైగా... ఈఎన్టీ అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 250 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు వస్తున్నారు. వీరిలో 50–60 మందికి ఇన్పేషెంట్లుగా అడ్మిషన్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 240 మంది ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మందికి సర్జరీ చేశారు. మరో 50 నుంచి 60 మంది వరకు అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో 102 మంది కోవిడ్ పాజిటివ్ బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. -
Harsh Vardhan: దేశంలో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణ, కొత్తగా భయాందోళనలకు కారణమైన బ్లాక్ ఫంగస్ తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం మంత్రుల బృందం (జీఓఎం) 27వ సమావేశం నిర్వహించారు. దేశంలో బ్లాక్ల్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) వ్యాప్తిపై ఈ భేటీలో చర్చ జరిగింది. దేశంలో ఇప్పటివరకు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 5,424 బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంత్రుల బృందానికి నివేదించారు. మొత్తం 5,424 కేసులలో 4,556 మంది రోగులకు కోవిడ్–19 ఉందని ఆయన పేర్కొన్నారు. వీరిలో గుజరాత్లో 2,165, మహారాష్ట్రలో 1,188, ఉత్తరప్రదేశ్లో 663, మధ్యప్రదేశ్లో 519, హరియాణాలో 339, ఆంధ్రప్రదేశ్లో 248 కేసులు నమోదయ్యాయి. ఈ రోగులలో మొత్తం 55% మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించామన్నారు. గత వారం బ్లాక్ ఫంగస్ను ఎపిడమిక్ యాక్ట్ కింద నోటిఫై చేసి నమోదైన కేసుల వివరాలు తెలియచేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. దీంతో బ్లాక్ ఫంగస్ను అనేక రాష్ట్రాల్లో అంటువ్యాధిగా ప్రకటించారు. (చదవండి: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదు) -
Black Fungus: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనాతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బ్లాక్ ఫంగస్ సంక్రమణపై ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి ఏమాత్రం కాదని, కరోనా మాదిరిగా ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి సంక్రమించదని ఆయన పేర్కొన్నారు. కరోనా బారిన పడ్డ డయాబెటిస్ రోగికి మ్యూకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గులేరియా సోమవారం తెలిపారు. దేశంలో మ్యూకోర్మైకోసిస్ కేసులు వేగంగా పెరుగుతున్నందున, ఈ వ్యాధిని విస్మరించలేమని అన్నారు. ఈ సంక్రమణకు చికిత్సను ప్రారంభంలోనే మొదలుపెడితే ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తి దగ్గర కూర్చోవడం వల్ల ఇతరులకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాపించదని ఆయన స్పష్టం చేశారు. డయాబెటిస్ లేని వారిపై తక్కువ ప్రభావం మధుమేహం లేని, కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్ తీసుకోని రోగుల్లో మ్యూకోర్మైకోసిస్ ప్రభావం చాలా తక్కువగా ఉందని డాక్టర్ గులేరియా తెలిపారు. బ్లాక్ ఫంగస్ ఆక్సిజన్ ద్వారా వ్యాపించదని, ఫంగస్ ఉన్నవారిలో 92–95% మందికి డయాబెటిస్ లేదా స్టెరాయిడ్ వాడకం ఉందని ఆయన తెలిపారు. బ్లాక్ ఫంగస్ సంక్రమణకు ఆక్సిజన్ కారణమనేది ఒక పెద్ద అంశం కాదని, పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. కోవిడ్ పాజిటివ్గా ఉన్నప్పుడు దుందుడుకు వైఖరితో ఆపరేషన్ చేయడం కారణంగా రోగి మరణించే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. బ్లాక్ ఫంగస్ ఉన్న కరోనా రోగులకు నెగెటివ్ వస్తే వారిని వేరే వార్డుకు మార్చాల్సి ఉంటుందన్నారు. వారికి వైద్య సాయం కొనసాగాలి కరోనా నుంచి కోలుకొనే వారితో పాటు కోలుకున్న వారికి సైతం కొన్ని వారాల పాటు వైద్య సహాయం అవసరమని డాక్టర్ గులేరియా అన్నారు. 4–12 వారాల పాటు కరోనా లక్షణాలు కనిపిస్తే, దీనిని ఆన్గోయింగ్ సింప్టమాటిక్ కోవిడ్ లేదా పోస్ట్–అక్యూట్ కోవిడ్ సిండ్రోమ్ అని అంటారని తెలిపారు. 12 వారాల కంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే, దీనిని పోస్ట్–కోవిడ్ సిండ్రోమ్ లేదా నాన్–కోవిడ్ అంటారని డాక్టర్ గులేరియా వివరించారు. కోలుకున్న వారిలో ఊపిరితిత్తుల పనితీరు, సామర్థ్యం సాధారణంగానే ఉన్నప్పటికీ శ్వాసలో ఇబ్బంది, దగ్గు, ఛాతీనొప్పి, పల్స్ రేటులో పెరుగుదల వంటి లక్షణాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ లక్షణాలు పోస్ట్ కోవిడ్ సమయంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన కారణంగా ఉంటాయని ఆయన వివరించారు. కోలుకున్న వారిలో కనిపించే మరో సాధారణ లక్షణం క్రొనిక్ ఫెటీగ్ సిండ్రోమ్. ఇందులో కీళ్ల నొప్పులు, అలసటతో శరీరం నొప్పి, తలనొప్పి ఉంటుందని గులేరియా పేర్కొన్నారు. అందుకే ఈ వైరల్ వ్యాధి నుంచి కోలుకున్నవారికి పునరావాసం కల్పించేందుకు మల్టీ–డిసిప్లినరీ పోస్ట్–కోవిడ్ క్లినిక్ల అవసరం ఎంతో ఉందని ఆయన సూచించారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు రంగుల పేర్లు వద్దు ఫంగల్ ఇన్ఫెక్షన్లను రంగుల పేర్లతో కాకుండా, మెడికల్ పరిభాషలోని పేర్లతోనే గుర్తించడం మంచిదని గులేరియా వ్యాఖ్యానించారు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ ఈ ఇన్ఫెక్షన్లను గుర్తించడంతో గందరగోళానికి అవకాశముందన్నారు. శరీరంలో ఆ ఫంగస్ పెరిగే ప్రదేశంపై ఫంగస్ రంగు అనేది ఆధారపడి ఉంటుందన్నారు. బ్లాక్ ఫంగస్గా పిలిచే మ్యుకర్మైకోసిస్ వైట్ కలర్ ఫంగల్ కాలనీల్లో బ్లాక్ డాట్స్తో ఉంటుందన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మ్యుకర్మైకోసిస్, క్యాండిడా, ఆస్పర్జిల్లస్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయని గులేరియా తెలిపారు. థర్డ్ వేవ్లో చిన్నారులకు ముప్పు సూచనల్లేవ్ దేశంలో మరికొన్ని నెలల్లో కోవిడ్–19 థర్డ్వేవ్లో చిన్నపిల్లలే వైరస్ బారినపడతారన్న వాదనల్లో వాస్తవం లేదని గులేరియా చెప్పారు. కరోనా థర్డ్వేవ్లో చిన్నారులు తీవ్రం గా ప్రభావితం అవుతారని, ఎక్కువ మం దికి వైరస్ సోకుతుందని చెప్పడానికి ఎలాంటి సూచనలు, ఆధారా ల్లేవని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటా యని చెప్పారు. ఒకవేళ వారు వైరస్ బారిన పడినప్పటికీ స్వల్ప లక్షణాలే కనిపిస్తాయని, చికిత్సతో వారు ఆరోగ్యవంతులవుతారని వివరించారు. . -
252 బ్లాక్ఫంగస్ కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 252 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించారు. వీటిలో ఇప్పటికే 184 కేసులకు చికిత్స ప్రారంభించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 60 కేసులు నమోదైనట్టు వెల్లడైంది. అనంతపురంలో 10, చిత్తూరులో 20, కడపలో 18, తూర్పుగోదావరిలో 15, కృష్ణాలో 40, కర్నూలులో 4, నెల్లూరులో 9, ప్రకాశంలో 32, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 33, పశ్చిమగోదావరిలో 4 కేసులు నమోదయ్యాయి. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే ఇప్పటివరకూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాలేదు. బ్లాక్ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) చికిత్సకు అవసరమయ్యే యాంపొటెరిసిన్–బి ఇంజక్షన్లను రోగులకు ఇప్పటివరకు 309 ఉపయోగించగా, మరో 575 అందుబాటులో ఉన్నాయి. పొసకొనజోల్ ఇంజక్షన్లు 443, పొసకొనజోల్ మాత్రలు 14,270 అందుబాటులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. -
ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఆ రెండింటి కన్నా డేంజర్
లక్నో: కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ రూపంలో మరో ప్రమాదం భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఫంగస్ బారిన పడిన వారు ప్రారంభంలోనే దాన్ని గుర్తించకపోతే.. ప్రాణాలే పోతున్నాయి. ఈ రెండు ఫంగస్లు జనాలను భయభ్రాంతలకు గురి చేస్తుండగా.. తాజాగా యెల్లో ఫంగస్ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తుంది. బ్లాక్, వైట్ ఫంగస్లకన్నా ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తొలిసారి ఈ యెల్లో ఫంగస్ కేసును గుర్తించారు వైద్యులు. ప్రస్తుతం బాధితుడికి నగరంలోని ప్రసిద్ధ ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యెల్లో ఫంగస్ లక్షణాలు.. బద్ధకం, ఆకలి తక్కువగా ఉండటం.. లేదా అసలు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం యెల్లో ఫంగస్లో ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఫంగస్ తీవ్రమైతే చీము కారడం, శరీరం మీద ఉన్న గాయాలు, లోపలి గాయాలు నెమ్మదిగా మానడం, పోషకాహార లోపం, అవయవాలు వైఫల్యం చెందడం, చివరికి నెక్రోసిస్ కారణంగా కళ్ళు పోవడం జరుగుతుంది అంటున్నారు వైద్యులు. యెల్లో ఫంగస్ ఒక ప్రాణాంతక వ్యాధి.. ఎందుకంటే ఇది అంతర్గతంగా మొదలవుతుంది. అందువల్ల పైన చెప్పిన ఏదైనా లక్షణాలను గమనించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు. యెల్లో ఫంగస్ వ్యాప్తికి కారణాలు.. యెల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రధానంగా అపరిశుభ్ర వాతావరణం వల్ల వ్యాప్తిస్తుంది. కనుక ఇంటిని.. చుట్టుపక్కల పరిసరాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నివారించడానికి మిగిలిపోయిన ఆహారాలు, మల పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. ఇంటిలోని తేమ కూడా బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి. సరైన తేమ స్థాయి 30% నుంచి 40% వరకు ఉంటుంది. కనుక ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు. చదవండి: బ్లాక్ ఫంగస్కు ఆయుర్వేద మందు -
Black Fungus: రోగికి అడ్మిషన్ నిరాకరించిన ఈఎన్టీ ఆస్పత్రి
సుల్తాన్బజార్: వరంగల్లో కరోనా నుంచి కోలుకున్న ఓ రోగి ‘బ్లాక్ ఫంగస్’బారిన పడింది. దీంతో హైదరాబాద్ లోని ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే రోగికి కళ్లు పోయి, ముక్కు నుంచి రక్తస్రావం అవుతోంది. ఈ దశలో చికిత్స చేయకుండా ఆర్టీపీసీఆర్ రిపోర్టు లేదన్న కారణంగా ఆస్పత్రిలో అడ్మిషన్ నిరాకరించారు. వరంగల్కు చెందిన మల్లమ్మ(65)కు గత 20 రోజుల క్రితం కోవిడ్ సోకగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమెకు బ్లాక్ ఫంగస్ సోకడంతో వైద్యులు హైదరాబాద్లోని ఈఎన్టీ ఆసుపత్రికి పంపించారు. సీటీస్కాన్, ఎంఆర్ఐ తదితర రిపోర్ట్లతో ఆమె మనవడు శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ లేదని వైద్యులు అడ్మిషన్ నిరాకరించారు. తన అవ్వకు కోవిడ్ తగ్గిందని ఆమె మనవడు చెప్పినా ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు ఒప్పుకోలేదు. దీంతో మల్లమ్మ కటిక నేలపైనే 19 గంటల పాటు ఆసుపత్రి క్యాజువాలిటీ ముందు వైద్యం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అవ్వ పరిస్థితి విషమంగా మారిందని.. దయచేసి చేర్చుకోండంటూ ఆమె మనవడు ఎంత బతిమాలినా వినలేదు. చివరకు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న బ్లాక్ ఫంగస్ రోగులకు ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఇబ్బందిగా మారింది. కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఉదయం వేళలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నా సకాలంలో రిపోర్ట్లు రావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: Black Fungus: మందులు తక్కువ.. బాధితులెక్కువ..! -
బ్లాక్ ఫంగస్కు ఆయుర్వేద మందు
పొన్నూరు: కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు తీవ్ర ముప్పుగా పరిణమించిన బ్లాక్ ఫంగస్ను ఆయుర్వేద చికిత్సతో పూర్తిగా నివారించవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు ఎం.శ్రీనివాస్నాయక్ (ఎమ్మెస్సీ, ఎండీ) ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలని చెప్పారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వెంటనే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి రెండు చికిత్స పద్ధతుల్లో మందులు వాడుకుంటే దీని నుంచి బయటపడొచ్చని తెలిపారు. మొదటి చికిత్స విధానం.. 1. గంధక రసాయనం మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలి. 2. ఖదిరాదివతి మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు.. 3. పంచతిక్త గుగ్గులువృతము 10 గ్రాములు గోరు వెచ్చని పాలతో రెండు సార్లు భోజనానికి ముందు.. 4. మృత్యుంజయ రసం రెండు మాత్రల చొప్పున రోజుకు మూడు సార్లు.. 5. ఒక గ్రాము శుభ్ర భస్మాన్ని గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి. రెండో విధానం.. 1. ఆరోగ్యవర్ధనీవతి రెండు మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలి. 2. విషతుందుకవతి రెండు మాత్రలు రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత.. 3. హరిద్రఖండం 100 గ్రాముల్లో 10 గ్రాముల మల్లసింధూరం కలిపి తేనెతో 3 గ్రాముల చొప్పున రెండు సార్లు తీసుకోవాలి. 4. టంకణభస్మం ఒక గ్రాము గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి. -
భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే బ్లాక్ ఫంగస్ కేసులంటేనే జనం భయపడిపోతున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో బ్లాక్ ఫంగస్పై వస్తున్న వార్తలు, వ్యాధి సోకిన వారి ఫొటోలు చూసి తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ మధుమేహ బాధితుడు బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన చెందుతుండటంతో చక్కెర స్థాయిలు తీవ్రంగా పెరుగుతున్నాయని.. అతనికి చికిత్స చేస్తున్న డాక్టర్ చెప్పారు. కరోనా చికిత్స పొందుతున్న వందలాది మంది మధుమేహ బాధితులు అతి తక్కువగా నమోదయ్యే బ్లాక్ ఫంగస్ జబ్బుకు వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా బాగా పేరున్న ఫార్మసీ ఔట్లెట్ల నుంచి చిన్న మెడికల్ షాపు వరకూ కొత్త దందా మొదలెట్టాయి. ఏడెనిమిది రకాల మందులు ఒక కవర్లో పెట్టి జనానికి పప్పు బెల్లాల్లా అమ్ముతున్నాయి. ఒక్కో కిట్కు రూ.700 నుంచి రూ.800 వరకూ వసూలు చేస్తున్నాయి. వాటిలో స్టెరాయిడ్స్ ఉండటం వల్ల స్వల్ప లక్షణాలున్న వారు కూడా మోతాదుకు మించి వాడుతుండటంతో వారికి తెలియకుండానే వారిలో షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయి. కొంతమంది అమాయకులు కరోనా రాకుండా ఉండేందుకని ఈ మందులు మింగుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. నిపుణుల సూచన లేకుండా ఇలాంటివి వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా అరుదుగా వచ్చే వ్యాధి కరోనా రాకుండానే చాలామంది ఇళ్లకు మందులు తెచ్చుకుని వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదం. కొంతమంది వైద్యులు కూడా ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇవి ప్రాణాధార మందులు కావచ్చుగానీ.. ఆ తర్వాత ప్రమాదాన్ని కొనితెస్తున్నాయి. మధుమేహం ఉన్నవారికి అత్యంత జాగ్రత్తగా స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంది. బ్లాక్ ఫంగస్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు. లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది చాలా అరుదుగా వచ్చేవ్యాధి. భయపడాల్సిన అవసరం లేదు. – డా.బి.చంద్రశేఖర్రెడ్డి, న్యూరోఫిజీషియన్ -
వైట్ ఫంగస్ లక్షణాలివే.. గుర్తిస్తే చికిత్స సాధ్యమే
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్వేవ్ తరుణంలో ఇటీవల కొత్తగా వినిపిస్తున్న పేరు వైట్ ఫంగస్. కొద్దిరోజులుగా బ్లాక్ ఫంగస్ చేస్తున్న విలయాలు చూస్తున్న మనల్ని ఇప్పుడు వైట్ ఫంగస్ హడలెత్తిస్తోంది. అయితే, వైట్ ఫంగస్ వ్యాధిని సమయానికి గుర్తిస్తే పూర్తి స్థాయిలో చికిత్స చేయొచ్చని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ ప్రవీణ్ దావే అన్నారు. చికిత్స అందిస్తే రోగి ప్రాణానికి, కంటికి, చూపునకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులు చాలా అరుదని, భయపడాల్సిన అవసరం లేదని వివరించారు. ఆయన వెల్లడించిన వివరాలివీ... వైట్ ఫంగస్ అంటే... వైట్ ఫంగస్ శాస్త్రీయ నామం కాండిడా అల్బికాన్సీ. ఇది సహజంగానే శరీరంలో, బయటా ఉంటుంది. అతిగా పెరిగిన సందర్భంలోనే అనారోగ్యానికి దారి తీస్తుంది. పరీక్షల్లో తెల్లగా కనిపిస్తున్నందునే దీన్ని ‘వైట్ ఫంగస్’అంటారు. ఇది కంటి గుడ్డులోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగలదు. బ్లాక్ ఫంగస్ ప్రధానంగా కంటి చుట్టూ వుండే కణజాలాన్ని, ముక్కులోని సైనస్ను ప్రభావితం చేస్తుంది, వైట్ ఫంగస్ కంటి లోపలి కణజాలాన్ని ముఖ్యంగా విట్రస్ జల్, రెటీనాపై ప్రభావం చూపుతుంది. సరైన చికిత్స అందకపోతే కంటి చూపును హరిస్తుంది. శరీరం మొత్తానికి సంక్రమిస్తే మాత్రం వైట్ ఫంగస్ ప్రాణాంతకం. బలహీనంగా మారిన రోగుల్లో మాత్రమే ఇది జరుగుతుంది. ఇవీ వైట్ ఫంగస్ లక్షణాలు.. : కరోనా నుంచి కోలుకున్న ఒకటి నుంచి 3 నెలల్లో దృష్టి లోపం ఏర్పడుతుంది. కంటిలో నొప్పితోపాటు కన్ను ఎర్ర బడుతుంది. కో–మార్బిడిటిస్ (రెండు లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే) నియంత్రణలో లేని మధుమేహం, దీర్ఘకాలం స్టెరాయిడ్లు వాడటం వంటి వాటితో ఈ వ్యాధి మరింత ప్రమాదానికి కారణమవుతుంది. తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వారిలో లేదా రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉన్న రోగులకు వైట్ ఫంగస్ వల్ల ఎక్కువ ప్రమాదం. కోవిడ్ బాధితుడు లేదా దాని నుంచి కోలుకున్న తర్వాత మొదటిసారిగా జ్వరం వచ్చిన 6 నుంచి 8 వారాల్లోపు ఈ వ్యాధి దాడి చేయొచ్చు. ఆ కాలం లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలా చికిత్స చేయొచ్చు... ఇంట్రాకోక్యురీ సర్జరీ, కంటి లోపల యాంటీఫంగల్ ఇంజెక్షన్లు ఇవ్వడం లేదా నోటి ద్వారా యాంటీఫంగల్ ఏజెంట్లను అందించడం చేయొచ్చు. తరచుగా శస్త్ర చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఈ చికిత్సకు నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుంది. తొలుత రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలి. రోగ నిరోధక శక్తిని పెంచడం చాలా ముఖ్యం. -
బ్లాక్ ఫంగస్: కన్ను తొలగించిన వైద్యులు, సాయం కోసం ఎదురుచూపు
సాక్షి, కాళేశ్వరం: బ్లాక్ ఫంగస్ ఓ రైతు కుటుంబాన్ని కకావికలం చేసింది. చికిత్స కోసం రూ.15 లక్షలు ఖర్చు చేయగా.. ప్రస్తుతం మందుల కోసం రోజుకు రూ.60 వేలు అవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబం.. ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి చెందిన రైతు వావిలాల సమ్మయ్య (42) గత నెలలో కరోనా రక్కసితో పోరాడి కోలుకున్నాడు. ఇంతలోనే పక్షవాతం రావడంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సాధారణ స్థితికి చేరుకున్నాడు. గోరుచుట్టపై రోకలి బండలా.. వారం తర్వాత దురద మొదలై కుడి కన్ను ఎర్రగా మారింది. హన్మకొండ, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. బ్లాక్ ఫంగస్గా నిర్ధారించారు. ‘‘కంటికి ఇన్ఫెక్షన్ అయింది.. కుడి కన్నుపూర్తిగా తొలగించాలి.. లేదంటే ప్రాణానికి ప్రమాదం’అని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు తమకున్న మూడెకాల పొలాన్ని తనఖా పెట్టి రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చు చేశారు. శస్త్ర చికిత్స చేసి వైద్యులు కుడి కన్నును తొలగించారు. మూడు రోజుల క్రితం బాధితుడిని డిశ్చార్జి చేశారు. పది రోజుల వరకు మందులు వాడాలని సూచించారు. అయితే.. రోజుకు రూ.60 వేల వరకు మందులకు ఖర్చు అవుతోందని, కూలి పనులు చేసుకునే తమకు అంతటి శక్తి లేదని ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని సమ్మయ్య భార్య పద్మ, పిల్లలు వేడుకుంటున్నారు. సాయం చేయదలచిన వారు 8008240915లో సందప్రదించాలని కోరారు. చదవండి: (టాయిలెట్ ద్వారా కరోనా వ్యాపిస్తుందా?) (బ్లాక్ఫంగస్ చికిత్సకు తీవ్ర కొరత.. మందులు తక్కువ.. బాధితులెక్కువ..!) -
Black Fungus: మందులు తక్కువ.. బాధితులెక్కువ..!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ఫంగస్ బాధితులకు చికిత్స జటిలమవుతోంది. రోజురోజుకు రాష్ట్రంలో ఈ ఫంగస్ బాధితులు పెరిగిపోతుండగా.. వారికి సరైన వైద్యం ఇచ్చేందుకు సరిపడా మందుల్లేక కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికే బ్లాక్ఫంగస్ బాధితుల సంఖ్య దాదాపు 600 దాటింది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని ప్రత్యేకంగా బ్లాక్ఫంగస్ చికిత్స కోసం కేటాయించారు. దీనికితోడు గాంధీ ఆస్పత్రిలో కూడా బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. బ్లాక్ఫంగస్ చికిత్సలో కీలకమైన లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బి. కానీ ఈ మందు నిల్వలకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఉంది. దీంతో ఈ మందులను కేంద్రమే రాష్ట్రాలకు కేటాయిస్తూ వస్తోంది. రాష్ట్రానికి 890 వయల్స్ కేటాయింపు.. బ్లాక్ ఫంగస్ కేసులు అత్యధికంగా గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈనెల 20 నాటికి 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించారు. 23,680 లైపోజోమల్ ఆంఫోటెరిసిన్–బి మందులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాధాన్యత క్రమంలో కేంద్రం కేటాయించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 890 వయల్స్ కేటాయించగా.. అందులో సగం స్టాకు మాత్రమే రాష్ట్రానికి చేరుకుంది. ఆంఫోటెరిసిన్– బి మందుకు ప్రత్యామ్నాయమైన పొసకొనజోల్, ఫ్లూకొనజోల్ మందులను వినియోగించే వీలున్నప్పటికీ.. వీటికి సైతం కొరత ఏర్పడటంతో వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు ఈ మందుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఓ కమిటీని నియమించింది. సంబంధిత రోగి బంధువులు ఎవరైనా చికిత్స పొందుతున్న ఆస్పత్రి డాక్టర్ నుంచి ఈ ఇంజెక్షన్ కావాలంటూ లిఖిత పూర్వక చీటీతో పాటు, రోగి పూర్తి వివరాలతో ent& mcrm@telangana. gov.inకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులన్నింటినీ కమిటీ పరిశీలించి.. ఎవరికి అవసరం ఉందో ప్రిస్కిప్షన్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ కమిటీ సంతృప్తి చెందితే.. వారికి ఆ ఇంజెక్షన్ మంజూరు చేస్తూ మెయిల్ పంపిస్తారు. ఈ ఇంజెక్షన్లు ఏ డిస్ట్రిబ్యూటర్ వద్ద లభిస్తాయో మెయిల్ లో పేర్కొంటారు. అక్కడికి వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ మందులను ప్రభుత్వమే నియంత్రించడం వల్ల బయట ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఆస్పత్రులకు వచ్చిన తర్వాత కూడా ఈ మందులను కొందరు బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
ఒకే వ్యక్తికి రెండు ఫంగస్లు..షాక్లో వైద్యులు
భోపాల్: గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో ప్రత్యేకంగా భారత్ను అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ ఇంకా వదలక ముందే.. బ్లాక్ ఫంగస్ అంటూ మరో మహమ్మారి గురించి చెప్పి శాస్త్రవేత్తలు బాంబు పెల్చారు. అలా చెప్పిన కొన్నిరోజల్లోనే ఒకే వ్యక్తికి బ్లాక్తో పాటు వైట్ ఫంగస్ ఉన్న కేసు ఒకటి వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ఈ అరుదైన ఘటన తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. రెండు ఫంగస్లు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాజాగా ఒకే వ్యక్తికి రెండు ఫంగస్లు సోకడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఒక వ్యక్తిలో ఒక ఫంగస్ని గుర్తించిన వైద్యులు ఆశ్చర్యంగా ఒకే వ్యక్తిలో రెండు రకాల ఫంగస్ను గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ తోపాటు వైట్ ఫంగస్ ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. దేశంలో ఈ తరహా కేసు ఇదే మొదటి సారి కావడం గమనార్హం.దీంతో వైద్యులు షాక్కు గురవుతున్నారు. అయితే.. ఆ తర్వాత భోపాల్లో కూడా ఇలాంటి కేసు ఒకటి నమోదైందని తెలుస్తోంది. ఈ ఫంగస్ అడ్డకట్టకు ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారిలో స్టెరాయిడ్స్ వాడిన వారిని గుర్తించే పనిలో ఉన్నాయి. బ్లాక్ ఆండ్ వైట్ ఫంగస్ లు ముప్పు ఎక్కువగా కరోనా నుంచి కోలుకునే క్రమంలో అధికంగా స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో వెలుగు చూస్తున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అధికంగా స్టెరాయిడ్స్ వినియోగం వల్ల ఇమ్యూనిటీ పవర్ దెబ్బ తింటోందని దాంతోనే ఈ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. చదవండి: కరోనా బాధితులకు గ్యాంగ్రీన్ ముప్పు! -
Black Fungus: బ్లాక్ఫంగస్కు ‘ఆయుర్వేదం’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాధి నుంచి బయటపడేందుకు స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో బ్లాక్ఫంగస్ (మ్యూకార్ మైకోసిస్) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలున్న వారికి మూడు రకాల ఆయుర్వేద ఔషధాలతో సత్ఫలితాలు వస్తాయని ఆయుష్ డిపార్ట్మెంట్ సూచిస్తోంది. వీటిని భోజనం తర్వాత వేసుకోవాలని వివరించింది. ► బ్లాక్ఫంగస్ లక్షణాలున్న వారు గోరు వెచ్చని నీటిని తాగాలి. ► వేడిగా ఉన్నప్పుడు భోజనం చేయాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ► దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, జామ, ఖర్జూర పండ్లను తీసుకోవాలి. ► ఇంటా, బయటా మాస్కు తప్పకుండా ధరించాలి. ► ఇంటి గదుల్లో గాలి ఆడేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ► రోజుకు 2 సార్లు ఆవిరి పట్టాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి. వీటికి దూరంగా ఉండాలి.. ► చల్లని పదార్థాలు, శీతల పానీయాలు, ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు. ► బేకరీ ఫుడ్కు దూరంగా ఉండాలి. ► చల్లని గాలిలో (ఏసీ, ఎయిర్ కూలర్ వాడొద్దు) తిరగొద్దు. పెరుగు తినొద్దు. చదవండి: Black Fungus: బ్లాక్ ఫంగస్ పంజా.. ఒక్క రోజే 302 మంది.. -
Black Fungus: బ్లాక్ ఫంగస్ పంజా.. ఒక్క రోజే 302 మంది..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బ్లాక్ఫంగస్ పంజా విసురుతోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. హైదరాబాద్ కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి ఒక్కరోజే 252, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 50 మంది బాధితులు రావడం చూస్తుంటే.. ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉందో ఇట్టే తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారికి బ్లాక్ఫంగస్ సోకుతోంది. వైరస్ తగ్గాలని అధికశాతం స్టెరాయిడ్స్ ఇస్తుండటంతో ఈ ఫంగస్ దాడి చేస్తుందని చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన జంగం వెంకట్రెడ్డి (50) ఇరవై రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందాక.. తర్వాత హోం ఐసోలేషన్లో ఉంటూ మందులు వాడుతున్నాడు. మూడు రోజుల క్రితం ఎడమ కన్నుకు ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వెంకట్రెడ్డి శనివారం ఉదయం మరణించాడు. అలాగే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన తూలగుంట్ల సులోచన (57) కంటికి దురద, వాపు రావడం, కంటిచూపు మందగించడంతో 17న పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా.. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాల్యాతండాకు చెందిన గుగులోత్ చిరంజీవి (36)కి కంటి కింద వాపు వచ్చింది. కుటుంబసభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్గా అనుమానించి హైదరాబాద్ ఈఎన్టీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అధికశాతం బాధితులంతా ఇటీవల కరోనా నుంచి కోలుకున్నవారు కావడం గమనార్హం. -
Corona Virus: జూన్ 15 నాటికి..కంట్రోల్లోకి!
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ అంటే.. మొదటగా టెస్టుల్లో పాజిటి విటీ రేట్ తగ్గుతుంది. ఆ తర్వాత ఆసుపత్రుల్లో సీరియస్ కేసుల అడ్మిషన్లు తగ్గుతాయి. చివరిగా మరణాలు కూడా తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం తెలంగాణలో మొదటి రెండు దశలు వచ్చేసినట్టే..’అని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యం లోనే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కొంత నియంత్రణలోకి వచ్చినట్టు కనిపిస్తోందని, కేసులు తగ్గుముఖం పట్టడాన్ని బట్టి ఇది స్పష్టమవుతోందని అం టున్న నాగేశ్వర్రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్య్వూలోని ముఖ్యాంశాలు.. కేంద్రం తోడ్పాటు అవసరం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జూన్లోనూ అం తగా టీకాల ఉత్పత్తి జరిగి అవి ఎక్కువగా అందు బాటులోకి వచ్చే అవకాశాలు లేవు. అంటే జూలై లోనే అదనపు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కనీసం 3,4 నెలల్లో అందరికీ టీకాలు వేసేయాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతున్న దాని ప్రకారం ఈ ఏడాది చివరికల్లా దేశంలో అందరికీ టీకాలు దొరికే అవకాశాలున్నా యి. వ్యాక్సిన్ను బయటి నుంచి దిగుమతి చేసుకోవడంతో పాటు మన వ్యాక్సిన్ తయారీదారులకు కూడా ఆర్థి కంగా, ఇతరత్రా సహాయాల విషయంలో కేంద్రం చేదోడు వాదోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. రాబోయే 4–8 వారాల్లో చాలా ఎక్కు వగా టీకాలు ఉత్పత్తి చేసు కోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం కూడా నడుం బిగించాలి.. గత రెండు దశల్లో ఎదురైన అనుభవాలను దృష్టి్టలో పెట్టుకుని వైరస్ వ్యాప్తి చేయకుండా ప్రజలే జాగ్రత్తలు గట్టిగా పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయడంలో భాగస్వాములు కావాలి. మహమ్మారి తీవ్రత సమయంలో ఎంతో ముఖ్యమైన వ్యాక్సినేషన్ తగిన స్థాయిలో జరగక పోవడం దురదృష్ట్ట కరం. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టి టీకాలు గణనీయంగా పెంచాలి. వ్యాక్సిన్లు వేయడంలో వేగం పెంచడం ద్వారానే కరోనాను నియంత్రణలోకి తీసుకురాగలుగుతాం. అన్ని జాగ్రత్తలు = టీకా ప్రస్తుత సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వైరస్ నుంచి కావాల్సిన రక్షణకు అనుగుణంగా రెండు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచు హ్యాండ్ శానిటై జేషన్, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. ఇవన్నీ పాటిం చడం వ్యాక్సిన్ వేసుకోవడంతో సమానమన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. లేకపోతే మళ్లీ త్వరలోనే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. టీకాలపై ఇప్పటికీ స్పష్టత లేదు వ్యాక్సిన్లు వేసే విషయంలో ఇప్పటికీ కొంత గందరగోళం, అయోమయం కొనసాగుతోంది. దీనిని కేంద్ర పభుత్వం చేపడుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారా? లేక ప్రైవేట్ ఆసుపత్రులు, సంస్థలకు అవకాశం ఇస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. ముందు ప్రై వేట్ వాళ్లను చేయమన్నారు. మళ్లీ ఆపేశారు. అత్యంత ముఖ్యమైన, ఏకైక ప్రత్యామ్నాయమైన టీకాల విషయంలో ఏం చేయాలో, వ్యాక్సినేషన్పై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై స్పష్టత లేకపోవడం విచారకరం. ఇప్పటికైనా వ్యాక్సిన్ల ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టాలి. వ్యాక్సినేషన్ను గణనీయంగా పెంచాలి. అసలు ప్రజలకు ఎలా ఇవ్వాలి అన్నదానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. కొన్నిరోజులు టీకాలు వేసి మళ్లీ ఆపేయడం, కోవిన్ సాఫ్ట్వేర్లో సమస్యలతో అందరిలో అయోమయం నెలకొంటోంది. కోవిన్ పోర్టల్ అంత ‘యూజర్ ఫ్రెండ్లీ’గా లేదు. దానిని సరళతరం చేయాలి. మొదటిదశలో సైడ్ ఎఫెక్ట్స్, ఇతర భయాలతో టీకా వేసుకునేందుకు తటపటాయించారు. గతంలోని పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు తమకు టీకా వేయాలని అడుగుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదొక సానుకూలాంశం. టీకా వేశాకా వస్తున్నది 5, 6 శాతానికే.. టీకా తీసుకున్నాక కూడా కోవిడ్ వస్తుందనడం కరెక్ట్ కాదు. రెండుడోసుల వ్యాక్సిన్ ఇచ్చాక ఒకవేళ కరోనా వచ్చినా స్వల్పంగానే వస్తుంది. మేము చాలా ఆసుపత్రుల్లో అధ్యయనం చేశాక తెలిసిందేమంటే టీకాలు తీసుకున్న వారిలో కేవలం ఐదారు శాతం మందికే వైరస్ సోకుతున్నట్లు స్పష్టమైంది. రెండు డోసుల తర్వాత కూడా సీరియస్ అవుతున్న కొద్దిమందిలో ఇతర జబ్బులు, తీసుకునే మందులు ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. అందువల్ల వ్యాయామం, షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బ్లాక్ ఫంగస్తో బహుపరాక్ రెండోదశలో కోలుకున్న రోగులకు బ్లాక్ఫంగస్ లేదా మ్యుకార్మైకోసిస్కు గురికావడం ఆందోళనతో కూడుకున్నదే. ఇది మొదటి దశలో కనబడకపోగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కలిపి 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మనదగ్గరా 500 నుంచి 1,000 దాకా వచ్చి ఉంటాయి. సంఖ్యాపరంగా ఇవి ఎక్కువ కాకపోయినా ‘ప్రమాదకరమైన జబ్బు’కాబట్టి అందరూ దానిని గుర్తిస్తున్నారు. అనవసర స్టెరాయిడ్స్ వినియోగం, మధుమేహం నియంత్రణలో లేకపోవడం, ఆక్సిజన్ సరిగ్గా పెట్టక కల్తీ అయితే, ఆసుపత్రుల్లో సరఫరా చేసే పైపులు సరిగా లేకపోతే, హోం ఆక్సిజన్ పెట్టుకున్నప్పుడు సరిగా తీసుకోకపోతే ఇదొచ్చే అవకాశాలుంటాయి. ముఖంలో ఒకవైపు నొప్పి, పిన్ను పెట్టి గుచ్చినట్టు బాధ, ముక్కు దిబ్బడ, చెవి వినికిడి తగ్గిపోవడం, కళ్లు ఎర్రగా మారడం వంటివి తొలుత వచ్చే లక్షణాలుగా గుర్తించాలి. ఇది సెకండ్ స్టేజ్లో సైనస్ సమస్య మాదిరిగా వస్తుంది. ముఖం ఒకవైపు ఎర్రగా మారిపోతుంది. కళ్లు కొద్దిగా ఉబ్బుతాయి. ఈ దశల్లోనే లక్షణాలను గుర్తించి వచ్చిన పేషెంట్లకు తగిన చికిత్స అందించవచ్చు. మూడో స్టేజ్లో ఇది కంటిలోపలికి వెళ్లిపోయి, కళ్లు ఉబ్బిపోయి కంటిని తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక నాలుగో స్టేజ్లో మెదడుకు వ్యాపిస్తుంది. అప్పుడు శస్త్రచికిత్స చేయడం రిస్క్తో కూడుకున్నది. యువత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే.. యువత మాస్క్లు పెట్టుకోకుండా, పార్టీలు అంటూ స్వేచ్చగా తిరగడం వల్ల సెకండ్వేవ్లో వీరంతా కరోనా బారిన ఎక్కువగా పడ్డారు. ఈ వయసు వారికి ఇంకా వ్యాక్సిన్లు వేయకపోవడం కూడా తీవ్రతకు కారణం. మరోవైపు కొత్త వేరియెంట్ బి.1.167 యువజనులు, పిల్లలపై ఎక్కువగా దాడి చేసినట్లు కన్పిస్తోంది. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 95 పైనే ఉంటోంది. ఆక్సిజన్ అవసరమున్న వారిని ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ ఇస్తే రికవరీ రేటు ఎక్కువగానే ఉంటోంది. అయితే చాలామంది ఆక్సిజన్ స్థాయిలు 70 దాకా తగ్గిపోయాక వస్తున్నారు. అలాంటప్పుడు సమస్యలొస్తున్నాయి. బి.1.167 అధిక ప్రభావం ఎందుకంటే.. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకినపుడు దాని విభజన జరుగుతుంది. ఈ విధంగా ఏ వైరస్లోనైనా మ్యుటేషన్ జరుగుతుంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఈ వైరస్ వేరియెంట్కు తన మ్యుటేషన్ను కరెక్ట్ చేసుకునే కెపాసిటీ లేదు. ర్యాండమ్గా వచ్చినపుడు ఏ మ్యుటేషన్ వల్లనైతే వైరస్ ఎక్కువగా జీవించి ఉంటుందో దాని మ్యుటేషన్లు ఎక్కువ అవుతున్నాయి. మన దగ్గర వచ్చిన ఈ వేరియెంట్లో 2,3 మ్యుటేషన్లు వచ్చేశాయి. ముఖ్యంగా స్సైక్ప్రోటీన్లో మ్యుటేషన్ ఎక్కువ రావడంతో మన శరీరాలకు అది సులభంగా అతుక్కుపోతోంది. అందువల్ల అంతకు ముందుతో పోల్చితే ఈ మ్యుటేషన్ వ్యాప్తి సులభంగా మారింది. సెకండ్ వేవ్ అందర్నీ చుట్టేస్తోంది రెండో దశలో గతానికి భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయి. కొంచెం వయసు తక్కువ ఉన్నవారికి దగ్గు, జలుబు వంటి శ్వాససంబంధిత లక్షణాలు కాకుండా ఒళ్లు నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటివి ఎక్కువగా వస్తున్నాయి. అలాగే రుచి, వాసనలు కోల్పోతున్న వారూ ఎక్కువగానే ఉంటున్నారు. కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ వైరస్ త్వరగా వ్యాపించేస్తోంది. ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉంటోంది. అందుకే కేసులు పెరుగుతున్నాయి. ఇవన్నీ మొదటిదశతో పోల్చితే అదనంగా వచ్చినవే. షుగర్, ఊబకాయం ఎక్కువున్న వారిలో ఈ కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. ఆక్సిజన్పెట్టాల్సిన అవసరం కూడా గతంలో కంటే పెరుగుతోంది. ఏరోశాల్స్ ద్వారా వైరస్ వ్యాప్తి.. ప్రస్తుతం వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఏరోశాల్స్ (గాలి) ద్వారా వ్యాపిస్తోంది. వైరస్ పార్టికల్ 5 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటే ఎవరైనా తుమ్మినా, దగ్గినా, గట్టిగా మాట్లాడినా ఈ ఏరోశాల్స్ ద్వారా ఆరు అడుగుల దూరంలో ఉన్న వారికి కూడా కరోనా రావొచ్చు. ఇంట్లో అన్ని తలుపులు మూసేసి.. గాలి, వెలుతురు సరిగా లేకపోతే ఈ వైరస్ ఒకరి నుంచి వెలువడ్డాక గాలిలో కనీసం అరగంట దాకా అలానే ఉండిపోతుంది. అందువల్ల ఆ గదిలోని ఇతర సభ్యులకు ఇది వ్యాపించే ప్రమాదముంది. అనుమానముంటే అందరూ మాస్క్ పెట్టుకోవాలి ఒకచోట ఎక్కువ మంది గుమిగూడేందుకు అవకాశమున్న ఫంక్షన్లు వంటి వాటిల్లో వైరస్ ఉన్న ఎవరో ఒకరి ద్వారా అక్కడున్న వారికి సోకే అవకాశాలు ఎక్కువ. గట్టిగా మాట్లాడినప్పుడో, భోజనం చేసేటప్పుడో ఇది ఇతరులకు వ్యాపించవచ్చు. అందువల్ల ఎవరికైనా ఉందనే అనుమానముంటే ఇళ్లలో కూడా అందరూ మాస్క్లు పెట్టుకోవాలి. కిటికీలు తెరిచిపెట్టాలి. ఏసీ వేసుకోవడం కన్నా ఫ్యాన్లు ఉపయోగించాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూడాలి. వ్యాక్సిన్ ఒక్కటే మందు... ఇప్పటివరకు కరోనా సోకని వారు ఇకముందు కూడా సోకకుండా ఉండాలంటే కచ్చితంగా టీకా వేయించుకోవడం ఒక్కటే పరిష్కారం. కచ్చితంగా మాస్క్లు వాడుతూ వ్యాక్సిన్లు కూడా తీసుకుంటే ఇది వచ్చే అవకాశాలే ఉండవు. ఒకవేళ వచ్చినా సులభంగా తగ్గిపోతుంది. తీవ్రస్థాయికి చేరదు. ఇప్పుడు యూఎస్లో చూస్తే అందరూ సాధారణ స్థితికి వెళ్లిపోతున్నారు. అక్కడ తగ్గిపోయినందువల్ల మాస్క్లు కూడా వాడొద్దంటున్నారు. ఇజ్రాయెల్లో అలాగే తగ్గిపోయింది. యూకేలో కూడా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో చర్యలు భేష్ రాష్ట్రంలో ఆక్సిజన్, ఇతర మందుల కొరత అంత ఎక్కువగా కాకుండా మంచి చర్యలే తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే వీటికి సంబంధించి ఇక్కడ బాగానే ఉంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తీసుకున్న చర్యలు బాగున్నాయి. బెస్ట్ ప్రోటోకాల్స్పై ఏఐజీ బుక్ ప్రపంచంలో అనుసరిస్తున్న బెస్ట్ ప్రోటోకాల్స్ పరిశీలించి, వాటిలోంచి కోవిడ్, పోస్ట్ కోవిడ్లో పాటించాల్సిన మెరుగైన ప్రోటోకాల్స్పై ఏఐజీ ఆధ్వర్యంలో వారంలో ఒక పుస్తకం తీసుకొస్తున్నాం. దేశంలోని డాక్టర్లందరికీ దీనిని పంపించి కోవిడ్ వస్తే మొదటి వారంలో ఏంచేయాలి, స్వల్పంగా, ఒక మోస్తరుగా, తీవ్రంగా ఉంటే ఏంచేయాలి. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలి, ఎవరికి వెంటిలేషన్ ఇవ్వాలి, ఎవరికి ముఖ్యమైన స్టెరాయిడ్స్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలో సవివరంగా అందులో తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మాస్క్లు కచ్చితంగా వాడుతూ టీకాలు వేయించు కుంటే 3 నెలల్లోనే వైరస్ పూర్తిగా కనుమరుగు అవుతుంది. మనదగ్గరా 500 నుంచి 1,000 దాకా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. సంఖ్యా పరంగా ఇవి ఎక్కువ కాకపోయినా ప్రమాదకర జబ్బుగా గుర్తిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 95కు పైనే ఉం టోంది. ఆక్సిజన్ స్థాయిలు 70 దాకా తగ్గాక రావడం వల్లే సమస్యలు. టీకాలు తగిన సంఖ్యలో అందుబాటులోకి వచ్చాక, కనీసం 3, 4 నెలల్లో వీలైనంతగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇస్తే మంచిది. కొత్త వేరియంట్ ప్రభావం పిల్లలు, యువతపై ఎక్కువగా ఉన్నట్టుంది. ముఖ్యమైన విషయం ఏమి టంటే కరోనా సోకినాక సరైన సమయంలో డాక్టర్ను సంప్రదిస్తే పూర్తిగా నయం చేయొచ్చని తేలింది. -
బయటపడ్డ అరుదైన బ్లాక్ ఫంగస్ కేసులు
న్యూఢిల్లీ : ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంటే.. మరో వైపు బ్లాక్ ఫంగస్(మ్యూకోర్ మైకోసిస్) కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇది తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో అరుదైన బ్లాక్ ఫంగస్ కేసులు రెండు బయటపడ్డాయి. శనివారం కరోనా వ్యాధిగ్రస్తుల చిన్న ప్రేగులో బ్లాక్ ఫంగస్ను గుర్తించారు వైద్యులు. కరోనా బారిన పడిన ఓ 56 ఏళ్ల వ్యక్తి గత కొద్దిరోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల క్రితం అతడి కడుపులో నొప్పి ప్రారంభమైంది. దీంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్గా భావించిన అతడు సంబంధిత మందులు వాడి ఊరుకున్నాడు. సరైన వైద్యం తీసుకోకుండా మూడు రోజుల పాటు నొప్పిని నిర్లక్ష్యం చేశాడు. నొప్పి తగ్గకపోవటంతో సర్ గంగారామ్ హాస్పిటల్కు వచ్చాడు. దీంతో అతడికి సిటీ స్కాన్ చేయగా చిన్న ప్రేగులో రంధ్రాలు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా కరోనా ముదిరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. 68 ఏళ్ల మరో పేషంట్ చిన్న ప్రేగులోనూ అలాంటి రంధ్రాలను గుర్తించారు వైద్యులు. వాటిపై పరీక్షలు నిర్వహించగా ఇద్దరి చిన్న ప్రేగులకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, ఇద్దరికీ కరోనాతో పాటు డయాబెటీస్ ఉంది. ఇద్దరిలోనూ ఒకే లక్షణాలు కనిపించాయి. చదవండి : తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. రామ్దేవ్పై చర్యలు తీసుకోండి!